private company
-
నాగ్పూర్ హైవే ‘ప్రైవేటు పరం’
సాక్షి, హైదరాబాద్: నిధుల సమీకరణే లక్ష్యంగా భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) తెలంగాణలోని ఓ జాతీయ రహదారిని ప్రైవేటుపరం చేసింది. రోడ్డు మీద ఉన్న టోల్ బూత్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయటం ద్వారా నిర్ధారిత కాలానికి టోల్ వసూలు అంచనా మేరకు లెక్కగట్టి మొత్తాన్ని ఒకేసారి వసూలు చేసుకునేందుకు ప్రారంభించిన టీఓటీ (టోలింగ్, ఆపరేషన్, మెయింటెనెన్స్ అండ్ ట్రాన్స్ఫర్) విధానంలో ఓ జాతీయ రహదారిని ప్రైవేటుకు అప్పగించింది. టెండర్ పద్ధతిలో ఆ రోడ్డు బాధ్యతను పొందిన సంస్థ గురువారం అర్ధరాత్రి నుంచి దానిపై టోల్ వసూలు ప్రారంభించింది. 20 ఏళ్ల కాలానికి...: హైదరాబాద్–నాగ్పూర్ (ఎన్హెచ్ 44) జాతీయ రహదారి ఎన్హెచ్ఏఐ నిర్వహణలో ఉంది. 251 కి.మీ. నిడివి గల ఈ రోడ్డును తాజాగా టీఓటీ పద్ధతిలో ప్రైవేటు సంస్థకు అప్పగించింది. గత సెపె్టంబరులో టెండరు పిలవగా, నార్త్ తెలంగాణ ఎక్స్ప్రెస్వే లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. ఆ సంస్థ వచ్చే 20 ఏళ్లపాటు ఆ రోడ్డు నిర్వహణను పర్యవేక్షిస్తుంది. ఈ రోడ్డుపై ఆరు టోల్ ప్లాజాలుండగా, ఒకటి ఇప్పటికే ప్రైవేటు ఆ«దీనంలో ఉంది. మిగతా ఐదు టోల్బూత్లను ఎన్హెచ్ఏఐ ఇప్పుడు టీఓటీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించింది. వచ్చే 20 ఏళ్ల కాలానికి సంబంధించి ఒకేసారి టీఓటీ మొత్తంగా ఆ సంస్థ రూ.6,661 కోట్లను ఎన్హెచ్ఏఐకి ఈనెల 12న జమచేసింది. ఇక టోల్ వసూలు బాధ్యత ప్రైవేటు సంస్థ చేపడుతుంది. ఈ 20 ఏళ్లపాటు రోడ్డు నిర్వహణ బాధ్యత ఆ సంస్థదే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇదే తరహాలో ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్)ను ప్రైవేటు సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ నిర్ణయం పెద్ద వివాదాస్పదమైంది.ప్రైవేటు సంస్థ చెల్లించిన మొత్తం కంటే టోల్ ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుందని వైరి పక్షాలు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. కాగా, ప్రైవేటు సంస్థలు కేంద్రం నిర్ధారించిన మేరకే టోల్ వసూలు చేయాల్సి ఉంటుందని, సొంతంగా టోల్ ధరలను సవరించుకునే అధికారం వాటికి ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. కానీ, చాలా సంస్థలు, ఆశించిన స్థాయిలో వాహన సంచారం లేనందున తమకు నష్టం వస్తోందనే సాకుతో టోల్ పెంచుకునేందుకు ప్రతిపాదిస్తుండటం గమనార్హం. -
‘డీట్’తో మరిన్ని ప్రైవేటు కొలువులు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు సంస్థల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగుల దరికి చేర్చేందుకు 2019లో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత జాబ్ పోర్టల్/ యాప్ ‘డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ’ (డీట్)ను తెలంగాణ ప్రభుత్వం తాజాగా విస్తృతపరి చింది. ఇప్పటివరకు కార్మిక, ఉపాధి కల్పన విభాగంతో ‘డీట్’ కలిసి పనిచేస్తుండగా ఇకపై పరిశ్రమలు, వాణిజ్య శాఖతోనూ అనుసంధానం కానుంది. గతంలో కార్మిక శాఖ కింద రిజిస్టర్ అయిన ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగ ఖాళీల సమాచారం మాత్రమే కనిపించే పరిస్థితి ఉండగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో పరిశ్రమలు, వాణిజ్య శాఖ కింద రిజిస్టర్ అయిన ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగ ఖాళీల సమాచారం కూడా నిరుద్యోగులకు అందుబాటులోకి రానుంది. ఈ యాప్ సేవలు పూర్తిగా ఉచితమని పరిశ్రమలు, వాణిజ్య శాఖ తెలిపింది. ఇటీవలే ‘డీట్’ కొత్త లోగోను ప్రభుత్వం ఆవిష్కరించడం తెలిసిందే.నైపుణ్యాభివృద్ధి, శిక్షణ సమాచారం కూడా.. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సమాచారంతోపాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కూడా ‘డీట్’లో లభిస్తుంది. ఉద్యోగ ఖాళీలు, ఇంటర్వ్యూ తేదీలు, ఇతర సమాచారం దీనిద్వారా లభి స్తుంది. ఉద్యోగాలు అందించే సంస్థ ప్రతినిధితో నేరుగా మాట్లాడటం, ఇంటర్వ్యూలో పాల్గొనడం, ఆ తర్వాత ఎంపిక ప్రక్రియ, చేరిక, నియామకపత్రం అందజేత తదితర పూర్తి ప్రక్రియంతా ఈ యాప్ ద్వారా జరుగుతుంది.రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా.. ⇒ నిరుద్యోగులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి డీట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి.⇒ పేరు, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ, తదితర వివరాలు సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.⇒ యాప్లోకి లాగిన్ అయ్యాక ఉద్యోగాలను అన్వేషిస్తూ విద్యార్థతలకు తగిన ఉద్యోగాలను తెలుసుకోవచ్చు. -
ప్రియురాలిని హత్య చేసి.. రాత్రంతా మృతదేహంతోనే గడిపి..
బనశంకరి: అపార్టుమెంట్లో అసోం యువతి హత్యకు గురైంది. ఈ ఘటన బెంగళూరు ఇందిరానగర పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. యువతి మాయ గోగాయ్ (26) హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ అదే ప్రాంతంలో నివసిస్తోంది. ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం మాయ, ప్రియుడు ఆరవ్ అర్ని ఇందిరానగరలో ఓ సర్వీసు అపార్టుమెంటులో ఫ్లాటు బుక్ చేసుకుని వెళ్లినట్లు సీసీ కెమెరాలో నమోదైంది. 24న ఆదివారం మాయ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. హత్య తర్వాత హంతకుడు సిగరెట్ తాగుతూ సోమవారమంతా మృతదేహంతోనే కాలం గడిపాడు. మంగళవారం ఉదయం క్యాబ్బుక్ చేసుకుని ఉడాయించాడు. తరువాత అపార్టుమెంటు సిబ్బంది శవాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ముక్కలు చేసి తరలించాలని ప్లాన్ చేసి ఉంటాడని, చివరకు ఆ ప్రయత్నం విరమించుకున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. యువతిని ఆరవ్ ఆర్నీ ఊపిరాడకుండా చేసి చాకుతో పొడిచి హత్యచేశాడు. చేతులను కూడా కసితీరా పొడిచాడు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆరవ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
‘ప్రైవేటు’తో సింగరేణి కుదేలు
సాక్షి, హైదరాబాద్: భూగర్భ గనులు, ఖనిజాల చట్టం (ఎంఎండీఏ)లోని సెక్షన్ 17ఏ(2) కింద సింగరేణి బొగ్గు గనుల సంస్థకు బొగ్గు గనులను రిజర్వేషన్ పద్ధతిలో కేటాయించేందుకు అవకాశం ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వేలంలో ప్రైవేటు కంపెనీలకు గనులను కేటాయించడం సింగరేణిని కుదేలు చేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని 2015లో కేంద్రం సవరించడంతో సింగరేణి ప్రాంతంలోని బొగ్గు నిల్వలపై అంతకుముందున్న లీజు హక్కులు, అధికారాలను సంస్థ కోల్పోయిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 67 బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో ప్రారంభించగా.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి ఆయనతో మాట్లాడారు. ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోండి... సింగరేణి ప్రాంతంలోని గనులను సంస్థకే కేటాయించేలా ప్రధాని మోదీతో మాట్లాడి ఒప్పించాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో చొరవ చూపి ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుంటే సీఎం రేవంత్రెడ్డి, తాను, ఇతర పారీ్టల నేతలతో కలిసి అఖిలపక్షంగా ఆయన్ను కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. గత సర్కారు వేలంలో పాల్గొననివ్వలేదుచట్టంలోని సెక్షన్ 17ఏ(2) కింద తమకు అతిముఖ్యమైన సత్తుపల్లి–3, శ్రావణపల్లి, పీకే ఓసీ డీప్సైడ్, కోయగూడెం బ్లాక్–3 బొగ్గు బ్లాకులను కేటాయించాలని గతంలో సింగరేణి కోరగా వాటిని కూడా కేంద్రం వేలం వేయాలని నిర్ణయించడం బాధాకరమని భట్టి అన్నారు. ప్రభుత్వ సంస్థకు ప్రభుత్వాలు సహకరించకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. వేలంలో పాల్గొనైనా ఈ గనులను దక్కించుకోవాల్సిన అవసరముండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచితంగా సింగరేణి వేలంలో పాల్గొనకుండా చేసిందని విమర్శించారు.దీంతో సత్తుపల్లి–3 బ్లాక్ అవంతిక మైనింగ్ పరమైందని.. కోయగూడెం బ్లాక్–3 ఆరో మైనింగ్ అనే సంస్థ చేతుల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు. సింగరేణి ప్రాంతంలోని ఇతర బ్లాకులను వేలంలో కేటాయించాలని కేంద్ర బొగ్గు శాఖ నిర్ణయించడం దురదృష్టకరమన్నారు. సత్తుపల్లి–3, కోయగూడెం–3 బ్లాకుల్లో ఇంకా ప్రైవేటు కంపెనీలు తవ్వకాలు ప్రారంభించలేదని, చట్టప్రకారం ఆ కేటాయింపులను రద్దు చేసి వాటిని తిరిగి సింగరేణికి కేటాయించాలని భట్టి కోరారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో వాటా కింద 0.5 శాతాన్ని అదనంగా ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సింగరేణిని కాపాడేందుకు అవసరమైతే చట్టంలో సవరణలు చేపట్టాలని కోరారు. మిగిలిన గనులను సింగరేణికే ఇవ్వాలి.. సింగరేణి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం గోదావరి–ప్రాణహిత లోయ ప్రాంతంలో సింగరేణికి 600 చ.కి.మీ.ల విస్తీర్ణంలో 44 మైనింగ్ లీజులు ఉన్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. వాటిలో 388 చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఉన్న 3,008 మిలియన్ టన్నుల బొగ్గును వెలిసితీసే అవకాశం ఇవ్వగా సింగరేణి 1,585 మిలియన్ టన్నుల బొగ్గునే వెలికితీసిందన్నారు. ఇంకా 1,422 మిలియన్ టన్నుల బొగ్గు తీయడానికి అవకాశం ఉందన్నారు. మిగిలిన 1,400 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్న గనులను చట్టప్రకారం రిజర్వేషన్ కోటాలో సింగరేణికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వినతిపత్రాన్ని కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి భట్టి అందజేశారు. సింగరేణి మూతబడే ప్రమాదంసింగరేణికి ప్రస్తుతం 39 గనులు, 42 వేల మంది కార్మికులు ఉన్నారని భట్టి చెప్పారు. రానున్న ఐదేళ్లలో 8 భూగర్భ గనులు, 3 ఓపెన్కాస్ట్ గను లు, ఆ తర్వాత 5 ఏళ్లలో మరో 5 భూ గర్భ గనులు, 6 ఓపెన్కాస్ట్ గనులు మూతపడతాయ ని ఆందోళన వ్యక్తం చేశారు. 2037–38 నాటికి మరో 5 గనులు మూతబడతాయన్నారు. మరో 15 ఏళ్లలో 8 గనులు, 8 వేల మంది కార్మికుల స్థాయికి సంస్థ పడిపోయి చివరకు మూతబడే ప్రమాదాన్ని ఎదుర్కొంటుందన్నా రు. తెలంగాణ ప్రాంత మంత్రులుగా, నాయకులుగా ఈ పరిణామాలను ఊహించలేమన్నారు. -
‘గ్రాంట్’ ముసుగు..‘కైండ్’ మిస్టరీ!
సాక్షి, అమరావతి: యువత శిక్షణ కోసం భారీగా ఆర్థిక సహాయం అందిస్తామని అప్పటిదాకా నమ్మబలికిన ప్రైవేట్ కంపెనీ ప్లేటు ఫిరాయించింది! భారీ లాభాన్ని వేసుకుని మరీ ప్రాజెక్టును దక్కించుకుని ప్రజాదనాన్ని కాజేసింది. రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో తవ్వేకొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత జీవోలు, ఒప్పందాల్లో ఉన్న ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్ (ఆర్థిక సహకారం) అనే పదం స్థానంలో తరువాత ‘గ్రాంట్ ఇన్ కైండ్ (వస్తు సహకారం) చేరింది. చివరకు ‘గ్రాంట్ ఇన్ కైండ్’ సైతం అదృశ్యమైంది. ఈ మాయాజాలంతో చివరకు టెండర్ల ప్రక్రియ అనేదే లేకుండా పోయింది. తద్వారా డిజైన్టెక్కు ఏకపక్షంగా కట్టబెట్టేసి రూ.371 కోట్లు చెల్లించేశారు. అందులో రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బాబు గూటికి చేరవేశారు. 34.88 శాతం లాభంతో.. ఏపీ ఎస్ఎస్డీసీ ప్రాజెక్టు ముసుగులో నిధులను కొల్లగొట్టాలని ముందుగానే నిర్ణయించుకున్న మాజీ సీఎం చంద్రబాబు ఆరు క్లస్టర్లుగా అంచనా వ్యయం నివేదికను రూపొందించాలని ఆదేశించారు. వివిధ అంశాలను ప్రాతిపదికగా చేసుకుని అధికారులు ఏడు నివేదికలు రూపొందించారు. వాటిల్లో ప్రాజెక్టు కనిష్ట వ్యయం రూ.214 కోట్లు కాగా గరిష్ట వ్యయం రూ.282 కోట్లుగా మాత్రమే ఉంది. బినామీ సంస్థ డిజైన్ టెక్ లాభం 34.88 శాతాన్ని కూడా కలిపి ఒక్కో క్లస్టర్కు రూ.55 కోట్లు చొప్పున మొత్తం ఆరు క్లస్టర్లకు రూ.330 కోట్లు అవుతుందని నివేదిక రూపొందించారు. అందులో 90 శాతం సీమెన్స్–డిజైన్ టెక్ భరిస్తాయని, మిగతా 10 శాతం నిధులను ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అసలు ఈ ప్రాజెక్టు గురించే సీమెన్స్ కంపెనీకి తెలియదు. ఆ కంపెనీ 90 శాతం నిధులను సమకూర్చదని చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. 34.88 శాతం అంటే భారీ లాభమే. మరి లాభం ప్రస్తావన ఉన్న ప్రాజెక్టుకు ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ ఎలా వస్తుందనే ప్రాథమిక అంశాన్ని కూడా చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదు. ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఆ కంపెనీ పేరును వాడుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం రూ.330 కోట్లు వ్యయం అవుతుంది అని రూపొందించిన నివేదిక.. కానీ ప్రాజెక్ట్ వ్యయాన్ని ఏకంగా రూ.3,300 కోట్లకు పెంచేసి ప్రజాధనం కొల్లగొట్టారు అంచనాలు పెంచి వాటా నిధులు స్వాహా ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచేస్తే అందులో ప్రభుత్వం వాటా 10 శాతం కింద వెచ్చించాల్సిన నిధులు కూడా ఆ మేరకు పెరుగుతాయి. తద్వారా ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా మళ్లించేలా చంద్రబాబు పథకం వేశారు. అందుకే ఆరు క్లస్టర్లకు కలిపి రూ.330 కోట్లుగా ఉన్న ప్రాజెక్ట్ను ఏకంగా రూ.3,300 కోట్లకు అమాంతం అంచనాలు పెంచేసి ఖరారు చేశారు. సిమెన్స్ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా చెల్లించేశారు. చంద్రబాబు ఆదేశాలతోనే నిధులు చెల్లించినట్లు ఆర్థిక శాఖ అధికారులు వాంగ్మూలం కూడా ఇచ్చారు. అందులో షెల్ కంపెనీల ద్వారా రూ.241 కోట్లు చంద్రబాబు గూటికి చేరాయి. అదే విషయం సీఐడీ దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడైంది. ఎయిడ్ లేదు.. కైండ్ అంత కంటే లేదు ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం నిధులను సీమెన్స్ కంపెనీ ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’గా సమకూరుస్తుందని టీడీపీ సర్కారు జీవోలో పేర్కొంది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ గురించి సీమెన్స్ కంపెనీకి ఏమాత్రం తెలియదు. ఢిల్లీలో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్ ద్వారా చంద్రబాబు ముఠా గూడుపుఠాణి నడిపించింది. జీవో జారీ చేసిన తరువాత డిజైన్ టెక్ కంపెనీని రంగంలోకి తెచ్చారు. సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్గా సమకూరుస్తాయంటూ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు. అసలు కథ ఇక్కడే మొదలైంది.సీమెన్స్ కంపెనీకి తెలియకుండా సుమన్ బోస్ నడిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో (నేరుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు లేఖలు రాశారు) గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పదం ఎక్కడా లేదు. ఆ స్థానంలో ‘గ్రాంట్ ఇన్ కైండ్’ అని పేర్కొన్నారు. పోనీ ఆ విధంగానైనా సాఫ్ట్వేర్, ఇతర మౌలిక సదుపాయాలు ఉచితంగా అందించారా? అంటే అదీ లేదు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్థిక సహకారంగానీ వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. చంద్రబాబు వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను డిజైన్టెక్కు చేరవేశారు. అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ లేదు! గ్రాంట్ ఇన్ కైండ్ అంత కంటే లేదు! చివరికి చంద్రబాబు దోపిడీ మాత్రమే మిగిలిందని స్పష్టమైంది. టెండర్లు లేకుండా కట్టబెట్టడానికే... సుమన్ బోస్ నాటి సీఎం చంద్రబాబుతో సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ అనే పదాన్ని ఎక్కడా వాడలేదు. చంద్రబాబు మాత్రం సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు 90 శాతం నిధులను ఆర్థిక సహాయంగా సమకూరుస్తాయని ఎందుకు చెబుతూ వచ్చారన్నది కీలకంగా మారింది. ఎందుకంటే...? గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ఉంటే టెండర్లు పిలవాల్సిన అవసరం లేదు. ఓ ప్రాజెక్టులో ప్రైవేటు కంపెనీలు లాభం తీసుకుంటే నిబంధనల ప్రకారం టెండర్లు పిలవాలి. టెండర్లు పిలిస్తే అర్హత ఉన్న ఎన్నో కంపెనీలు పోటీ పడతాయి. ప్రాజెక్ట్ను యధాతథంగా అమలు చేయాల్సి ఉంటుంది. అందుకే టెండర్ల ప్రక్రియ లేకుండా ఏకపక్షంగా నామినేషన్ విధానంలో డిజైన్టెక్కు ఈ ప్రాజెక్టు కట్టబెట్టడానికే చంద్రబాబు ఈ పథకం వేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే ముసుగులో డిజైన్ టెక్కు కట్టబెట్టేశారు. తరువాత నిబంధనలకు విరుద్ధంగా ఆ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేశారు. కమీషన్లు పోనూ అందులో రూ.241 కోట్లను హైదరాబాద్లోని తన బంగ్లాకు తరలించారు. -
కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం.. ప్రైవేటుకు ఓఆర్ఆర్!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికి మణిహారమైన 158 కి.మీ. నెహ్రూ ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్)ను రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు 30 ఏళ్లపాటు లీజుకు అప్పగించింది. టోల్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (టీఓటీ) ప్రాతిపదికన ఓఆర్ఆర్ నిర్వహణ లీజు కోసం హెచ్ఎండీఏ బిడ్లను ఆహ్వానించగా 11 అంతర్జాతీయ స్థాయి నిర్మాణ సంస్థలు పోటీపడ్డాయి. చివరకు నాలుగు సంస్థలు అర్హత సాధించగా జాతీయ రహదారుల నిర్వహణలో అతిపెద్ద సంస్థగా పేరొందిన ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 7,380 కోట్లకు ఈ లీజును పొందింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్బీ సంస్థకు లెటర్ ఆఫ్ అవార్డ్ను (ఎల్ఓఏ)ను అందజేసింది. దేశంలోని అతిపెద్ద టీఓటీ ప్రాజెక్టుల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. ఈ బిడ్ను పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్ తెలిపారు. ఏటేటా ఔటర్పై పెరుగుతున్న వాహనాల రద్దీ, టోల్ ద్వారా వస్తున్న ఆదాయం, ఓఆర్ఆర్ నిర్వహణ, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎన్పీవీ (నెట్ ప్రజెంట్ వాల్యూ) పద్ధతిలో లీజు మొత్తాన్ని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో టోల్ పెంపు వంటి అంశాలతోపాటు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) గతంలో ఇచి్చన లీజులను కూడా ప్రామాణికంగా తీసుకున్నట్లు చెప్పారు. నిర్వహణ ఇక ప్రైవేట్ సంస్థదే.. ఇప్పటివరకు ఔటర్ రింగ్రోడ్డు నిర్వహణ హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఓఆర్ఆర్పై టోల్ వసూలుతోపాటు రోడ్లకు మరమ్మతులు, లైట్లు, పచ్చదనం, తదితర పనులన్నింటినీ హెచ్జీసీఎల్ పర్యవేక్షిస్తోంది. తాజా ఒప్పందం వల్ల ఆ బాధ్యతలన్నింటినీ ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించనుంది. టోల్ ద్వారా వచ్చే ఆదాయం ఆ సంస్థకే లభించనుంది. ప్రస్తుతం ఔటర్పై నిత్యం సుమారు 1.3 లక్షల నుంచి 1.5 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. టోల్ వసూలు ద్వారా ఏటా సుమారు రూ. 452 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది. ఏటా టోల్ రుసుమును కొంత మేరకు పెంచడం ద్వారా ఆదాయం కూడా పెరుగుతుంది. ఈగిల్ ఇన్ఫ్రా సంస్థ ఇప్పటివరకు టోల్ వసూలు చేస్తుండగా ఇకపై ఐఆర్బీ సంస్థ పరిధిలోకి వెళ్లనుంది. రహదారుల నిర్వహణలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇప్పటివరకు దేశంలో టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (టీఓటీ) పద్ధతి అత్యుత్తమ విధానంగా పేరొందింది. ఎన్హెచ్ఏఐ 2016 నుంచి ఈ పద్ధతిని అవలంబిస్తోంది. మొత్తం 1,600 కి.మీ.కిపైగా మార్గాన్ని ఈ పద్ధతిలో 15 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లీజుకు ఇచి్చంది. ఔటర్ లీజు విషయంలోనూ ఇదే పద్ధతిని అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. పెట్టుబడులకు ఊతం: సీఎం కేసీఆర్ ఈ లీజు ఒప్పందంపట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది చాలా చక్కటి ఒప్పందమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులకు ఇది ఊతమిస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంపొందించడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాల పెంపునకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, వ్యాపార సంస్థలకు అనుకూలమైన విధానాలను అమలు చేయడం వల్లే అభివృద్ధిలో రాష్ట్రం పరుగులు తీస్తోందన్నారు. ఇదీ ఔటర్ స్వరూపం.. హైదరాబాద్ నగరం చుట్టూ 8 వరుసల్లో ఉన్న 158 కి.మీ. నిడివిగల ఔటర్ రింగురోడ్డు నిర్మాణం ఉమ్మడి ఏపీలో 2006లో మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని 2018లో పూర్తి చేసింది. ఔటర్కు 44 చోట్ల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఉన్నాయి. 22 చోట్ల ఇంటర్ఛేంజ్లను ఏర్పాటు చేశారు. ఔటర్ మీదుగా రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా చేరుకోవచ్చు. నెహ్రూ ఓఆర్ఆర్ నిడివి: 158 కిమీ. వరుసలు: 8 నిత్యం రాకపోకలు సాగించే వాహనాలు: 1.3 నుంచి 1.5 లక్షలు ఏటా టోల్ వసూలు: రూ. 452 కోట్లు (సుమారుగా). ఇది కూడా చదవండి: ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ఖరారు.. పాతరోడ్లను కలుపుతూ.. -
UPI Fraud: దెబ్బకు రూ. 35 లక్షలు గోవింద: ఎక్కడంటే?
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. మోసాలు కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. యుపిఐ వినియోగంలోకి వచ్చిన తరువాత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే కొంతమంది కేటుగాళ్లు ఈ UPIలో కూడా భారీ ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. నివేదికల ప్రకారం, ఇటీవల గురుగ్రామ్కు చెందిన పారావియమ్ టెక్నాలజీస్ ఇలాంటి యుపిఐ మోసానికి గురైనట్లు తెలిసింది. సైబర్ నేరగాళ్లు కంపెనీ పేమెంట్ గేట్వే సిస్టమ్ను తారుమారు చేసి ఏకంగా రూ. 35 లక్షలు దోచేశారు. కంపెనీ ఉపయోగించుకుంటున్న క్యాష్ఫ్రీ పేమెంట్ గేట్వేని తారుమారు చేసి డబ్బు దోచుకున్నట్లు సంస్థ ఆపరేషన్స్ హెడ్ అంకిత్ రావత్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. నిజానికి 2022-23 ఆర్థిక సంవత్సరంలో సైబర్ నేరగాళ్లు 95,000 యుపిఐ మోసాలకు పాల్పడినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కావున తప్పకుండా యుపిఐ వినియోగదారులు జాగ్రత్త వహించాలి. లేకుంటే భారీ మొత్తంలో డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. యుపిఐ మోసాల నుంచి తప్పించుకోవడం ఎలా? మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఓటిపి, పిన్ వంటి సమాచారాలను ఎప్పుడు, ఎవరితోనూ పంచుకోకూడదు. అమౌంట్ తీసుకోవడానికి మీరు పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మాత్రమే పిన్ అవసరం. డబ్బు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయడానికి ముందు వారి వివరాలను తప్పకుండా కన్ఫర్మ్ చేసుకోవాలి. యుపిఐ ఉపయోగిస్తున్నప్పుడు పబ్లిక్ నెట్వర్క్లను ఉపయోగించడం మానుకోవాలి. -
స్టాండింగ్ కమిటీకి ‘విద్యుత్’ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ పంపిణీ రంగంలో ప్రైవేట్ కంపెనీల ప్రవేశానికి వీలు కల్పించే వివాదాస్పద విద్యుత్ సవరణ బిల్లు–2022ను విస్తృత సంప్రదింపుల కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సిఫార్సు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాలను ఉల్లంఘిస్తూ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తున్నారని కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయానికొచ్చింది. రైతు వ్యతిరేక బిల్లు అన్న విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చుతూనే బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపుతున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్కుమార్ సింగ్ లోక్సభలో ప్రకటించారు. సోమవారం ముందుగా లోక్సభలో విపక్ష పార్టీల తీవ్ర వ్యతిరేకత మధ్య ఈ బిల్లును సింగ్ ప్రవేశపెట్టారు. దీనిని విపక్షాలు వ్యతిరేకించాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుధ్ధం: అధిర్ రంజన్ కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ఈ బిల్లును తీవ్రంగా తప్పుపట్టారు. ‘ఈ బిల్లు సమాఖ్య వ్యవస్థ సూత్రాలను ఉల్లంఘిస్తోంది. బిల్లుతో కేంద్ర పెత్తనం పెరిగి రాష్ట్రాల అధికారాలకు కత్తెర పడుతోంది. తెలంగాణ, పుదుచ్చేరి, ఛత్తీస్గఢ్, పంజాబ్తో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగినప్పుడు ఈ బిల్లును ఉపసంహరించుకుంటామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం)కు కేంద్రప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడేమో మాట తప్పి బిల్లును ప్రవేశపెట్టారు’ అని అ«ధిర్ రంజన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పుదోవ పట్టిస్తున్నారు: మంత్రి సింగ్ ‘రైతులకు ఉచిత విద్యుత్ ఇకపైనా కొనసాగుతుంది. ఈ బిల్లు రైతు సంక్షేమ, ప్రజాహిత బిల్లు. బిల్లుపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి’ అని విద్యుత్ మంత్రి సింగ్ అన్నారు. మంత్రి మాట్లాడుతుండగా ప్రతిపక్షాలు ఓటింగ్కు డిమాండ్ చేశాయి. అయితే స్పీకర్ ఓం బిర్లా సభ్యులంతా తమ స్థానాల్లో కూర్చుంటే ఓటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. దీంతో పలువురు సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వెంటనే బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ కోరగా, స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. మూజువాణి ఓటుతో బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపేందుకు కేంద్ర మంత్రి అనుమతి కోరగా, స్పీకర్ అనుమతి ఇచ్చారు. దీనికి సభ్యులంతా ఆమోదం తెలిపారు. విద్యుత్రంగ ఉద్యోగుల నిరసన బాట విద్యుత్రంగ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సోమవారం లక్షలాది మంది విద్యుత్ రంగ ఉద్యోగులు, ఇంజనీర్లు సోమవారం నిరసన గళం వినిపించారు. దేశంలోని అన్ని విద్యుదుత్పాదక సంస్థల ఉద్యోగులు, ఇంజనీర్లుసహా మొత్తం దాదాపు 27 లక్షల మంది సోమవారం విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారని అఖిల భారత విద్యుత్ ఇంజనీర్ల సమాఖ్య(ఏఐపీఈఎఫ్) ప్రకటించింది. విద్యుత్ వినియోగదారులకు ఇచ్చే రాయితీలకు చరమగీతం పాడే, రైతులు, అణగారిన వర్గాల ప్రయోజనాలకు తీవ్ర విఘాతంగా మారిన బిల్లులోని అంశాలను వెంటనే తొలగించాలని ఏఐపీఈఎఫ్ అధ్యక్షుడు శైలేంద్ర దూబే డిమాండ్చేశారు. ‘బిల్లులోని నిబంధనల ప్రకారం ఒకే ప్రాంతంలో ఎక్కువ విద్యుత్ పంపిణీ సంస్థలకు అనుమతి ఇస్తారు. ప్రభుత్వ నెట్వర్క్ను వాడుకుంటూ కొత్త ప్రైవేట్ సంస్థ లాభాలు తెచ్చే వాణిజ్య వినియోగదారులు, పరిశ్రమలకే విద్యుత్ అందించే ప్రమాదముంది. మొండి బకాయిలుగా మారే ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ ఇవ్వాలా వద్దా అనేది వారి ఇష్టం. ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు మాత్రం అందరికీ సరఫరా చేయాల్సిందే. దీంతో ప్రభుత్వ విద్యుత్ సంస్థలు నష్టాలపాలవుతాయి’ అని దూబే అన్నారు. -
కుమార్ వర్మ మరో దందా!... కాంట్రాక్టర్నూ వదల్లేదు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రవాస భారతీయుడి నుంచి రూ.7 కోట్లు, మణికొండ వాసి నుంచి రూ.1.08 కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపర్ సర్ఫేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకుడు కుమార్ శ్రీనివాస్ పెనుమత్స వర్మ అలియాస్ కుమార్ వర్మ మరో దందా వెలుగులోకి వచ్చింది. యూసుఫ్గూడ ప్రాంతానికి చెందిన ఓ కాంట్రాక్టర్ను రూ.కోటి మేర మోసం చేసినట్లు జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. యూసుఫ్గూడ ప్రాంతానికి చెందిన సదరు క్లాస్–1 కాంట్రాక్టర్ 2015 తర్వాత కాంట్రాక్టులకు దూరంగా ఉంటున్నారు. ఆయనకు ఓ స్నేహితుడి ద్వారా కుమార్ వర్మ పరిచయమయ్యాడు. తాను పెయింటింగ్ కాంట్రాక్టులు చేస్తుంటానని, ఆ పని పూర్తి చేయడానికి అవసరమైన మనుషులను సరఫరా చేయాల్సిందిగా కుమార్ వర్మ కోరడంతో బాధితుడు అంగీకరించాడు. తొలి నెల రోజులు చేసే పనులన్నీ ట్రైనింగ్ కిందికి వస్తామని, ఆపై డబ్బు చెల్లిస్తానంటూ కుమార్ వర్మ చెప్పగా ఈయన అంగీకరించారు. ఎలాంటి వర్క్ ఆర్డర్లు ఇవ్వకుండా, ఒప్పందపత్రాలు లేకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు చెన్నైలోనూ పలు పనులు చేయించారు. ప్రతి నెలా దాదాపు రూ.6 లక్షల చొప్పున రూ.20 లక్షల వరకు బాధితుడు మనుషులకు చెల్లించాడు. ఈ కాలంలో కేవలం కొంత మాత్రమే బిల్లుల రూపంలో కుమార్ వర్మ చెల్లించాడు. ఇదిలా ఉండగా... 2020లో లాక్డౌన్ అమలులోకి రావడంతో పనులు ఆగిపోయాయి. మళ్లీ ప్రారంభమైన తర్వాత తాను పూర్తిగా నష్టపోయానంటూ చెప్పిన కుమార్ వర్మ అప్పటి వరకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేనన్నాడు. ఆపై చేసే పనులకు మాత్రం ప్రతి నెలా చెల్లిస్తానంటూ బాధితుడితో మరికొన్ని పనులు చేయించాడు. మొత్తం రూ.కోటికి పైగా పనులు చేయించిన తర్వాత కూడా కేవలం రూ.17 లక్షలే చెల్లించాడు. మిగిలింది ప్రవాస భారతీయుడు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇస్తానన్నాడు. కొన్నాళ్లకు బాధితుడు ఆరా తీయగా ప్రవాస భారతీయుడి నుంచి రూ.7 కోట్లు స్వాహా చేశాడని, వివిధ పనులకు సంబంధించిన మొత్తం నగదు రూపంలో తీసుకున్నట్లు తెలిసింది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ అధికారులు దర్యాప్తు చేస్తున్న ప్రవాస భారతీయుడి కేసులో కుమార్ వర్మ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతడిని అధికారులు అరెస్టు చేశారు. ఇదే కేసులో వర్మతో పాటు అనూష రాజ్, నాగేంద్ర మహేష్ జనార్దన, కర్ణ మహేంద్ర రాజ్, అకౌంటెంట్ ప్రసన్న కుమార్ సైతం నిందితులుగా ఉన్నారు. వీరి పాత్రపై ఈఓడబ్ల్యూ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని రోజులుగా వీరు అందుబాటులో లేరని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: కొంపముంచిన ప్రకటన! 20 రోజులు.. రూ.11.26 లక్షలు) -
కుమార్ వర్మ కుమ్మేశాడు! పెట్టుబడి పేరుతో కోట్లు కొట్టేశాడు
సాక్షి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి నగరానికి వలసవచ్చి, సూపర్ సర్ఫేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్న కుమార్ శ్రీనివాస్ పెనుమత్స వర్మ అలియాస్ కుమార్ వర్మ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రవాస భారతీయుడిని రూ.7 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఇతగాడిని మూడు రోజుల క్రితం సైబరాబాద్ ఈఓడబ్ల్యూ అధికారులు అరెస్టు చేసిన విషయం విదితమే. తనకు సన్నిహితుడైన మణికొండ వాసిని కూడా ఇతగాడు వదిలిపెట్టలేదు. కంపెనీలో షేర్లు ఇస్తానంటూ పెట్టుబడుల పేరుతో రూ.కోటి వరకు తీసుకుని మోసం చేశాడు. ఈ మేరకు నార్సింగి ఠాణాలో కేసు నమోదై ఉంది. ఈ కేసులో కుమార్ వర్మను పీటీ వారెంట్పై అరెస్టు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మణికొండ ప్రాంతానికి చెందిన వ్యాపారి కుటుంబం, కుమార్ వర్మ కుటుంబం కొన్నేళ్లుగా సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ పరిచయంతో పాటు వ్యాపార వివరాలు తెలిసిన బాధితులు తొలుత కుమార్ వర్మకు భారీ మొత్తం అప్పుగా ఇచ్చారు. ఆ తర్వాత వీరి నుంచి మరికొంత మొత్తం తీసుకుంటూ అత్యంత లాభాల్లో ఉన్న తన కంపెనీలో షేర్లు ఇస్తానంటూ అంగీకరించాడు. వాస్తవానికి ఎలాంటి లాభాల్లో లేని కంపెనీ విలువను రూ.15 కోట్లుగా చూపిస్తూ పత్రాలు చూపించారు. వీటి ఆధారంగా మరికొంత మొత్తం తీసుకున్న కుమార్ వర్మ త్వరలోనే షేర్లు బదిలీ చేస్తానన్నాడు. అలా చేయకుండా మోసం చేసిన నిందితుడు బాధితుడిని బోర్డు నుంచి తొలగిస్తున్నట్లు మెయిల్ పంపాడు. ప్రవాస భారతీయుడిని సైతం ఇదే పంథాలో మోసం చేసిన విషయం విదితమే. బాధితుడు మొత్తం లెక్కలు వేయగా అతడికి రూ.1.08 కోట్లు రావాల్సి ఉన్నట్లు తేలింది. డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు కుమార్ బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితుడు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: నాడే చిక్కిన నాగమణి!) -
భారీగా పామాయిల్ సాగు
న్యూఢిల్లీ: దేశీ రైతులు పండించిన నూనెగింజలను కొనుగోలు చేస్తూ వారికి మద్దతుగా నిలవాలని ప్రైవేటు కంపెనీలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అదే సమయంలో వంట నూనెల దిగుమతులు తగ్గించుకోవాలని సూచించారు. ఇది ఇరు వర్గాలకు ప్రయోజనకరమన్నారు. భారత్ వచ్చే 3–4 ఏళ్లలో వంట నూనెల ఉత్పత్తిని 50 శాతం పెంచుకునే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్’ కార్యక్రమం కింద పెద్ద ఎత్తున పామాయిల్ సాగుకు పుష్కలంగా అవకాశాలున్నట్టు పేర్కొన్నారు. ‘వ్యవసాయ రంగంపై బడ్జెట్ 2022 సానుకూల ప్రభావం’ అనే అంశంపై ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ‘‘వీటికి (కాయధాన్యాలు, నూనె గింజలకు) దేశంలో భారీ డిమాండ్ ఉంది కార్పొరేట్ ప్రపంచం ముందుకు రావాలి. మీకు భరోసానిచ్చే మార్కెట్ ఉంది. దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు? ఎంత పరిమాణంలో కాయధాన్యాలు, నూనె గింజలను కొనుగోలు చేస్తారో రైతులకు ముందే చెప్పండి’’అని మోదీ అన్నారు. పంట నష్టానికి రక్షణగా వ్యవసాయ బీమా యంత్రాంగం ఉన్నట్టు చెప్పారు. మనమంతా కలసి పనిచేయడం ద్వారా మన దేశ అవసరాలకు కావాల్సిన ఆహార ఉత్పత్తులను స్థానికంగానే పండించేలా చూడాల్సి ఉందన్నారు. దేశ వంట నూనెల అవసరాల్లో 60–65 శాతాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితిని ప్రధాని గుర్తు చేశారు. వంట నూనెల దిగుమతి బిల్లు 2020–21 సీజన్లో రూ.1.17 లక్షల కోట్లుగా ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. చిరుధాన్యాల సంవత్సరం 2023 అధిక పోషక విలువలు కలిగిన భారతీయ మిల్లెట్స్ (చిరు ధాన్యాలు)కు బ్రాండింగ్, ప్రచారానికి సహకారం అందించాలని కార్పొరేట్ సంస్థలను ప్రధాని కోరారు. 2023 సంవత్సరాన్ని మిల్లెట్స్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించారు. నానో ఫెర్టిలైజర్ విభాగంలో కంపెనీలకు అపార అవకాశాలున్నట్టు గుర్తు చేశారు. దీనితోపాటు ఆహారశుద్ధి, ఇథనాల్ తయారీ సాగు ముఖచిత్రాన్ని మార్చేవిగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా భూసార పరీక్షా కేంద్రాల నెట్వర్క్ ఏర్పాటుకు స్టార్టప్లు, ఇన్వెస్టర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భూముల సారాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. 2022–23 బడ్జెట్ భారత్ వ్యవసాయ రంగాన్ని ఆధునికంగా, స్మార్ట్గా మార్చడంపై దృష్టి సారించినట్టు ప్రధాని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో సాగు, వాణిజ్య అంశాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా మార్చేస్తుందన్నారు. అగ్రి స్టార్టప్లను ప్రోత్సహించినప్పుడే సాగులో డ్రోట్ టెక్నాలజీ మరింత అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. గత మూడు నాలుగేళ్లలో 700 వ్యవసాయాధారిత స్టార్టప్లు ప్రారంభమైనట్టు చెప్పారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం ‘‘రైతుల ఆదాయం పెంచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, రైతులకు ఆధునిక సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం. రైతులకు అద్దెపై వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను అందించే వ్యవస్థను కార్పొరేట్లు ఏర్పాటు చేయాలి. సహజ, సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేయడంపై అవగాహన పెంచేందుకు యూనివర్సిటీలు, శాస్త్రవేత్తలు కృషి చేయాలి’’ అని ప్రధాని కోరారు. గడిచిన ఆరేళ్లలో వ్యవసాయానికి బడ్జెట్ ఎన్నో రెట్లు పెంచామని, వ్యవసాయ రుణాలు ఏడేళ్లలో రెండున్నర రెట్లు పెరిగినట్టు ప్రదాని గుర్తు చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం చిన్న రైతులకు మద్దతుగా నిలుస్తోందంటూ.. 11 కోట్ల మంది రైతులకు రూ.1.75 లక్షల కోట్ల రుణాలను ఈ పథకం కింద అందించినట్టు ప్రకటించారు. చమురులో 20 శాతం ఇథనాల్ను కలిపే లక్ష్యం దిశగా పనిచేస్తున్నట్టు, ఇప్పటికే ఇది 8 శాతానికి చేరినట్టు గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్ 2022: వ్యవసాయ రంగంపై సానుకూల ప్రభావం అన్న అంశంపై జరిగిన వెబినార్లో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ -
ఉద్యోగంలోకి తీసుకోలేదని ఆత్మహత్యాయత్నం
సాక్షి, శంకరపట్నం(కరీంనగర్): ఓ యువకుడు తనను ఉద్యోగంలోకి తీసుకోలేదని మనస్తాపానికి గురై, ఆత్మహత్యాయత్నం చేశాడు. కేశవపట్నం ఎస్సై ప్రశాంత్రావు తెలిపిన వివరాల ప్రకారం.. శంకరపట్నం మండలంలోని అర్కండ్ల గ్రామానికి చెందిన యేమునూరి నవీన్ బీటెక్ వరకు చదువుకొని, హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బీటెక్లో ఒక సబ్జెక్ట్ ఫెయిలవడంతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఇంటికి వచ్చాడు. తిరిగి బుధవారం కంపెనీకి వెళ్లగా యాజమాన్యం అతన్ని ఉద్యోగంలోకి తీసుకోలేదు. దీంతో నవీన్ కేశవపట్నం వచ్చాడు. తండ్రికి ఫోన్ చేసి, తాను విషపు గుళికలు మింగినట్లు చెప్పాడు. కంగారు పడిన ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో ఎస్సై ప్రశాంత్రావు సూచన మేరకు బ్లూకోల్డ్స్ సిబ్బంది భాస్కర్రెడ్డి, రవిలు నవీన్ను పోలీస్ వాహనంలో హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. చదవండి: గాంధీ ఆస్పత్రికి కోవిడ్ బాధితుల క్యూ -
వదంతులు సృష్టించిన వ్యక్తిపై గూండా యాక్ట్
సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): సోషల్ మీడియాలో వదంతులు సృష్టించిన నామ్తమిళర్ పార్టీ నేత, ప్రముఖ యూటూబ్ చానల్ నిర్వాహకుడు సాటైమురుగన్పై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ మేరకు అతడిపై గుండా చట్టాన్ని ప్రయోగిస్తూ కలెక్టర్ ఆల్బీజాన్వర్గీష్ సోమ వారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీపెరంబదూరులోని ఓ ప్రైవేటు కంపెనీ నిర్వాహకులు 2 వేల మంది యువతులను తిరువళ్లూరులో ఉంచి షిప్ట్ పద్ధతిలో పనిచేయిస్తున్నారు. మూడు వారాల క్రితం కార్మికులకు పెట్టిన భోజనం కలుషితం కావడంతో వందలాది మంది అస్వస్థతకు గురై ప్రైవేటు వైద్యశాలలో చేరా రు. ఈ సమయంలో సీమాన్ పార్టీ నేత, యూటూబ్ చానల్ నిర్వాహకుడు సాటై మురుగన్ వదంతులు సృష్టించాడు. ఈ నేపథ్యంలో సాటైమురుగన్పై గూండా చట్టా న్ని ప్రయోగించాలని కలెక్టర్ ఆదేశించారు. -
లిఫ్ట్ బటన్స్ గురించి తెలిపేలా లిఫ్ట్ టూర్! ..
పక్కనే మెట్లు ఉన్నా.. లిఫ్ట్ను ఉపయోగించే వారే ఎక్కువ. మరి, ఒక్కసారైనా.. లిఫ్ట్లోని బటన్స్ను పరిశీలించారా? వాటి పేర్లు, ఉపయోగాలను తెలుసుకునే ప్రయత్నం చేశారా? తెలుసుకోవడానికి ఏముంది? మహా అయితే, డోర్ క్లోజ్, డోర్ ఓపెన్, అలారమ్, అంతస్తులను సూచించే నంబర్ బటన్స్.. అంతే కదా! అని అనుకుంటే పొరపాటు. ప్రపంచంలోని అన్ని రకాల లిఫ్ట్ బటన్స్ గురించి తెలిపేలా జపాన్లోని ఓ పరిశ్రమ లిఫ్ట్ టూర్ నిర్వహిస్తోంది. ఇందుకోసం 1,048 బటన్స్తో కూడిన ఓ పెద్ద లిఫ్ట్ బటన్ డిస్ప్లే వాల్ ఏర్పాటు చేసింది. వాల్పై కనిపించే బటన్ నొక్కి, దాని పేరు, ఉపయోగం తెలుసుకోవచ్చు. ఎక్కువమంది ‘నెవర్ ప్రెస్’ బటన్ నొక్కారు. ఈ బటన్ లిఫ్ట్ను మధ్యలోనే ఆగిపోయేలా చేస్తుంది. తిరిగి పనిచేయాలంటే.. లాక్ ఓపెన్ చేసి, రీస్టార్ట్ చేయాల్సిందే. అయితే, అన్నింటిలోనూ ఈ బటన్ ఉండదు. భద్రత కోసం కొంతమంది వీఐపీలు వారి ఇళ్లల్లో వీటిని ఏర్పాటు చేయించుకుంటారట. ఇందుకోసం అధికారులకు సరైన కారణం, పత్రాలు కూడా సమర్పించాలి. ఇలా ఎంతోమంది లిఫ్ట్ బటన్స్పై సరైన అవగాహన లేక.. ప్రమాదాలకు గురవుతున్నారు. వీటిని అరికట్టడానికి ఈ టూర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. బాగుంది కదూ! మీరు కూడా ఈ టూర్కు వెళ్లాలనుకుంటే.. కాస్త వేచి చూడాల్సిందే. ఎందుకంటే, వచ్చే ఏడాది జూన్ వరకు ఈ టూర్ టికెట్స్ అన్నింటినీ జపాన్లోని వివిధ స్కూల్ యాజమాన్యాలు బుక్ చేసుకున్నాయి. చదవండి: ఇక చంద్రుడి మీద డుగ్గు డుగ్గు.. ‘నాసా’ కొత్త తరహా బుల్లెట్టు -
మూడేళ్లలో 30% మార్కెట్ గోవిందా!
ముంబై: కరోనా మహమ్మారి చూపిన ప్రభావంతో మోటారు బీమా వ్యాపారం గతేడాది కుదేలై తిరిగి కోలుకుంటుండగా.. మరోవైపు ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీలు మాత్రం పోటీనివ్వలేకపోతున్నాయి. క్రమక్రమంగా మార్కెట్ వాటాను ప్రైవేటు సంస్థలకు కోల్పోతున్నాయి. మోటారు బీమా మార్కెట్లో ఏడాది క్రితం ప్రభుత్వ సాధారణ బీమా సంస్థలకు 36.6 శాతం వాటా ఉంటే, ఈ ఏడాది ఆగస్ట్ నాటికి 32.6 శాతానికి తగ్గిపోయింది. ఇదే కాలంలో ప్రైవేటు రంగ సాధారణ బీమా కంపెనీలు తమ వాటాను 63.4 శాతం నుంచి 67.4 శాతానికి పెంచుకున్నాయి. కానీ, 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు 13.9 శాతం (30 శాతం క్షీణత) మార్కెట్ వాటాను మూడేళ్ల కాలంలో కోల్పోయినట్టు తెలుస్తోంది. 2018 మార్చి నాటికి మొత్తమ మోటార్ బీమా విభాగంలో ప్రభుత్వరంగ సంస్థలకు 46.5శాతం వాటా ఉంటే, ప్రైవేటు సంస్థల చేతుల్లో 53.5 శాతం వాటా ఉండేది. 2019 మార్చి నాటికి ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థల వాటా 40.7 శాతానికి తగ్గిపోయి, ప్రైవేటు బీమా కంపెనీల వాటా 59.3 శాతానికి పెరిగింది. 2020 మార్చి నాటికి ప్రభుత్వరంగ బీమా సంస్థల వాటా 34.2 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి ఈ వాటా 32.6 శాతానికి దిగిపోవడం గమనార్హం. విడిగా చూస్తే.. మోటార్ ఓడీ (ఓన్ డ్యామేజ్/వాహనదారుకు వాటిల్లేనష్టం) విభాగంలో 2018 మార్చి నాటికి ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు 37.5 శాతం వాటా, ప్రైవేటు బీమా సంస్థలు 62.5 శాతం వాటా చొప్పున కలిగి ఉన్నాయి. కానీ, 2021కు వచ్చే సరికి ప్రభుత్వరంగ కంపెనీల వాటా 25.5 శాతానికి పరిమితమైతే.. ప్రైవేటు కంపెనీల వాటా 74.5 శాతానికి పుంజుకున్నది. థర్డ్ పార్టీ (వాహనదారు కాకుండా ఎదుటి వారికి కలిగే నష్టం) మోటారు బీమాలో ప్రభుత్వరంగ సంస్థలకు 2018 మార్చి నాటికి 52.7 శాతం ఉంటే, అది తాజాగా 39.7 శాతానికి తగ్గిపోయింది. ఇదే కాలంలో ప్రైవేటు బీమా కంపెనీల వాటా 46.3 శాతం నుంచి 60.3 శాతానికి పుంజుకున్నది. శాఖలను క్రమబద్ధీకరించుకోండి ► ఖర్చులు తగ్గించుకోండి ► పీఎస్యూ సాధారణ బీమా కంపెనీలకు సూచనలు ఆర్థిక పనితీరు మెరుగుపడేందుకు వీలుగా ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీలకు కేంద్ర ఆర్థిక శాఖ పలు సూచనలు చేసింది. శాఖలను క్రమబదీ్ధకరించుకోవాలని, అనవసర వ్యయాలను నియంత్రించుకోవాలని కోరింది. ప్రభుత్వరంగంలో నాలుగు సాధారణ బీమా కంపెనీలు పనిచేస్తుండగా.. వీటిల్లో న్యూ ఇండియా అష్యూరెన్స్ ఒక్కటే లాభాలతో నడుస్తోంది. నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ నష్టాలతో కొనసాగుతున్నాయి. వీటి ప్రైవేటీకరణకు ఉద్దేశించిన బిల్లు ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొందడం గమనార్హం. తక్కువ వ్యయాలతో కూడిన డిజిటల్ మాధ్యమంలో వ్యాపారాన్ని విస్తరించుకోవడంపై దృష్టి పెట్టాలని కూడా బీమా కంపెనీలను కోరినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాకపోతే దీనిపై ఉద్యోగుల సంఘం భిన్నంగా స్పందించింది. ‘‘ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు ఎన్నో ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నాయి. శాఖల క్రమబద్ధీకరణ అన్నది పేదలకు భారంగా మారకూడదు. ఎందుకంటే చిన్నపాటి క్లెయిమ్ కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావచ్చు. ఉదాహరణకు క్యాటిల్ ఇన్సూరెన్స్ లేదా ఫసల్ బీమా’’ అని జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఆల్ ఇండియా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కే గోవిందన్ అన్నారు. ప్రతీ జిల్లాకు ఒక శాఖ కచి్చతంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. తమ డిమాండ్లను యాజమాన్యాలకు తెలియజేసినట్టు చెప్పారు. 2021–22 బడ్జెట్లో ఒక సాధారణ బీమా కంపెనీ ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఆర్థిక మంత్రి ప్రస్తావించడం తెలిసిందే. -
నాలుగు నెలల్లో రెట్టింపు నగదు.. లగ్జరీ కారు.. కట్ చేస్తే..
సాక్షి, టీ.నగర్(తమిళనాడు): డిపాజిటర్లకు నాలుగు నెలల్లో రెట్టింపు నగదు ఇస్తామని ఆశచూపి పలువురి వద్ద రూ.60 కోట్ల వరకు మోసగించిన ప్రైవేటు సంస్థపై పోలీసులకు ఫిర్యాదు అందింది. మదురై కాలవాసల్ బెతేల్ నగర్లో ఒక ప్రైవేటు ట్రేడింగ్ సంస్థ పని చేస్తోంది. దాన్ని దిండుక్కల్కు చెందిన ఆనంది, మనోజ్కుమార్, మదురైకి చెందిన ఫారూక్ నిర్వహిస్తున్నారు. ఇందులో నగదు పెట్టుబడులు పెడితే 120 రోజుల్లో రెట్టింపు అవుతుందని, అంతేకాకుండా లగ్జరీ కారు ఇస్తామని సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చారు. దీన్ని నమ్మి వేలాదిమంది ఈ సంస్థలో రూ.2,500 నుంచి రూ.లక్షలు వరకు పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. మొదట్లో కొంతమందికి రెట్టింపు నగదు ఇచ్చారు. తర్వాత ఇవ్వలేదు. అనుమానించిన డిపాజిటర్లు నిర్వాహకులను ఫోన్లో సంప్రదించగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో 48 మంది బుధవారం మదురై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వేలాదిమంది నుంచి రూ.60 కోట్ల మేరకు మోసగించినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి నగదు ఇప్పించాలని కోరారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చదవండి: వివాహేతర సంబంధం: చేతులు, కాళ్లు కట్టేసి.. -
సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన టీఎస్ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న టీఎస్ఆర్టీసీ రోజురోజుకూ పెరుగుతున్న డీజిల్ ధరల వల్ల ఎదురవుతున్న నష్టాల నుంచి బయటపడేందుకు సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎలక్ట్రిక్ వాహన విధానం కింద బస్సులను ఎలక్ట్రిక్ మోడ్లోకి ప్రయోగాత్మకంగా పరిశీలించి చూడాలని నిర్ణయించింది. ఇందుకోసం డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ఓ ప్రైవేటు సంస్థకు ఒక సిటీ బస్సును కేటాయించింది. ఆ సంస్థ సిటీ బస్సు డీజిల్ ఇంజన్ను ఎలక్ట్రిక్ ఇంజన్గా మార్చి మూడు నెలలపాటు దాని పనితీరును పరిశీలించనుంది. ఈ మూడు నెలల కాలంలో ఎలక్ట్రిక్ బస్సు నిర్వహణ వ్యయాన్ని డీజిల్ బస్సు నిర్వహణ వ్యయంతో పోల్చి చూపనుంది. అది అనుకూలంగా ఉంటే మిగతా బస్సులను కూడా అలా మార్చాల్సి ఉంటుంది. అప్పుడు టెండర్లు పిలిచి తక్కువ వ్యయంతో ప్రాజెక్టు నివేదిక ఇచ్చే సంస్థకు కన్వర్షన్ బాధ్యత అప్పగించాలన్నది ఆర్టీసీ ఆలోచన. ఈ ప్రయోగం సత్ఫలితాలిస్తే ఒక్క హైదరాబాద్ సిటీ రీజియన్ పరిధిలో డీజిల్ రూపంలో అవుతున్న రూ. 460 కోట్ల వార్షిక భారం తొలగిపోనుంది. అదే మొత్తం సంస్థకు వర్తిస్తే ఏకంగా రూ. 1,926 కోట్ల వ్యయం తప్పుతుంది. ఖర్చు ఆ సంస్థనే భరించేలా.. ప్రస్తుతం డీజిల్ ఇంజన్ల బస్సులను ఎలక్ట్రిక్ ఇంజన్లుగా మార్పిడి (కన్వర్షన్) చేసే ఖర్చు కూడా భారీగా ఉంది. ఆ భారాన్ని సైతం భరించే స్థితిలో ఆర్టీసీ లేదు. అందుకోసం ఆర్టీసీ మరో ప్రయోగం చేయాలన్న యోచనలో ఉంది. హైదరాబాద్లో 3 వేల బస్సులు తిరుగుతున్నాయి. వాటి రోజువారీ డీజిల్ ఖర్చు రూ. 1.30 కోట్లు. ప్రస్తుత డీజిల్ ధర ప్రకారం సాలీనా రూ. 460 కోట్లను దాటుతుంది. ఇక్కడ ఆర్టీసీకి డీజిల్ ద్వారా కిలోమీటర్కు రూ. 18 వరకు ఖర్చవుతోంది. అదే బ్యాటరీ బస్సుతో ఆ ఖర్చు రూ. 6 వరకే (ఎయిర్పోర్టుకు నడుపుతున్న బస్సుల ఖర్చు మేరకు) అవుతుంది. అంటే కిలోమీటర్కు దాదాపు రూ. 12 వరకు మిగులుతుంది. దీంతో కన్వర్షన్ భారాన్ని ఆ సంస్థనే తీసుకునేలా ఒప్పందం చేసుకోవాలని భావిస్తోంది. ఆ ఖర్చు భరించినందుకు.. ఈ మిగులుబాటు మొత్తాన్ని ఆ సంస్థ తీసుకుంటుంది. ఇలా దాదాపు ఐదేళ్లపాటు ఆ సంస్థ ఈ మిగులు మొత్తాన్ని తీసుకుంటుంది. ఆ తర్వాత బస్సులన్నీ ఆర్టీసీ సొంతమవుతాయి. కన్వర్షన్ భారాన్ని భరించకుండానే ఎలక్ట్రిక్ బస్సులు చేతికందినట్టు అవుతాయన్నది ఆర్టీసీ ఆలోచన. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా ఓ బస్సును ఆ సంస్థకు ఇచ్చినా.... టెండర్లు పిలిచే నాటికి మరింత యోచించి నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. -
కాంట్రాక్టుల కోసం రూ.కోటి లంచం
న్యూఢిల్లీ: కాంట్రాక్టులు కట్టబెట్టే విషయంలో ప్రైవేట్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించి, కోటి రూపాయలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వేస్కు చెందిన చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(కన్స్ట్రక్షన్) మహేందర్ సింగ్ చౌహాన్ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అరెస్టు చేసింది. ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్(ఐఆర్ఎస్ఈ) 1985 బ్యాచ్కు చెందిన చౌహాన్ను అస్సాం రాజధాని గువాహటిలో అదుపులోకి తీసుకున్నారు. అలాగే లంచం చేరవేసిన ఏబీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగి భూపేంద్ర రావత్, మరో వ్యక్తి ఇంద్రాసింగ్ను అరెస్టు చేశారు. దీంతో సంబంధం ఉన్న రైల్వే అధికారులు హేమ్చంద్ బోరా, లక్ష్మీకాంత్ వర్మ, ఏబీసీఐ సంస్థ డైరెక్టర్ పవన్ బైద్పై కేసు నమోదు చేశారు. ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వేస్ పరిధిలో పలు ప్రాజెక్టులు కట్టబెట్టేందుకు చౌహాన్ ఏబీసీఐ సంస్థకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. ఆయన ఆ సంస్థ నుంచి లంచం కింద రూ. కోటి వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 60 లక్షలను సీబీఐ రికవరీ చేసినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ, ఉత్తరాఖండ్, త్రిపుర, పశ్చిమబెంగాల్, అస్సాంలో పలుచోట్ల దాడులు చేసి, రూ.54 లక్షలు స్వాధీనం చేసుకుంది. -
2023లో మొదటి దశ ప్రైవేట్ రైళ్లు
న్యూఢిల్లీ: దేశంలో ప్రైవేట్ రైళ్ల ఆగమనంలో భాగంలో మొదటి దశలో 12 రైళ్లను 2022–23లో ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ప్రణాళిక రూపొందించింది. 2023–24లో మరో 45 రైళ్లు, 2026–27 నాటికి 151 ప్రైవేట్ రైళ్లు పట్టాలపై పరుగులు తీయనున్నాయి. దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో 151 ఆధునిక ప్యాసింజర్ రైళ్లు నడపడానికి రైల్వే శాఖ ఇటీవలే ప్రైవేట్ కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. వచ్చే ఏడాది మార్చిలో టెండర్లను ఖరారు చేయనున్నారు. 2023 మార్చి నుంచి ప్రైవేట్ రైళ్ల కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. 151 ప్రైవేట్ రైళ్ల ద్వారా రైల్వే శాఖకు ఏడాదికి రూ.3,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. -
నకిలీ ఐడీ.. మెయిల్ హ్యాక్!
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ సంస్థ అధికారిక ఈ–మెయిల్ ఐడీలో ఒక్క అక్షరం మార్చి మరో ఐడీని సృష్టించిన సైబర్ నేరగాళ్ళు అకౌంట్ టేకోవర్ ఫ్రాడ్కు ప్రయత్నించారు. అయితే ఆఖరి నిమిషంలో సదరు సంస్థ అప్రమత్తం కావడంతో ఎలాంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదు. తమ సంస్థ ఈ–మెయల్ను కొందరు దుండగులు హ్యాక్ చేశారంటూ ఆ సంస్థ గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన సదరు సంస్థ ఎలక్ట్రానిక్ వస్తువుల రంగంలో ఉంది. తమ ఉత్పత్తుల్ని దేశవిదేశాల్లోని అనేక కంపెనీలకు విక్రయిస్తూ ఉంటుంది. ఈ క్రయవిక్రయాలకు సంబంధించి ఆయా కంపెనీలకు ఈ సంస్థకు మధ్య ఈ–మెయిల్స్ రూపంలో ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతుంటాయి. ఆ కంపెనీలకు ఈ–మెయిల్ రూపంలో ఇన్వాయిస్లను పంపే బంజారాహిల్స్ సంస్థ ఆ మేరకు తమకు రావాల్సిన డబ్బును బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకుంటుంది. బాధిత సంస్థకు చెందిన అధికారిక ఈ–మెయిల్ను హ్యాక్ చేసిన నేరగాళ్ళు అందులో ఉన్న ఉత్తరప్రత్యుత్తరాలను పరిశీలించారు. వీటి ఆధారంగా బంజారాహిల్స్ సంస్థ ఏఏ కంపెనీతో వ్యాపారం చేస్తోందో గుర్తించారు. ఆయా కంపెనీలకు చెందిన అధికారిక ఈ–మెయిల్ ఐడీలను మెయిల్ కాంటాక్టŠస్ నుంచి సంగ్రహించారు. వీటిని క్యాష్ చేసుకోవడానికి రంగంలోకి దిగిన సైబర్ నేరగాళ్ళు సిటీ సంస్థ అధికారిక మెయిల్ ఐడీని పొందినదే మరోటి సృష్టించాడు. ఇందులో కేవలం ఓ అక్షరాన్ని మార్చి సాధారణంగా గుర్తుపట్టలేని విధంగా రూపొందించాడు. బంజారాహిల్స్ సంస్థ మెయిల్లో ఉన్న కాంటాక్ట్ లిస్టుల్లో ఎంపిక చేసిన వాటిని సైబర్ నేరగాళ్ళు మెయిల్ పంపారు. ఏఏ కంపెనీల నుంచి అయితే ఈ సంస్థకు డబ్బు రావాల్సి ఉందో వాటినే టార్గెట్గా చేసుకున్నారు. అనివార్య కారణాల నేపథ్యంలో బ్యాంకు ఖాతా మార్చామని, ఈసారి నుంచి ఇందులోనే నగదు జమ చేయాలని సూచిస్తూ వాటికి ఈ–మెయిల్ పంపారు. మార్చిన ఖాతా అంటూ తమకు చెందిన అకౌంట్ వివరాలు పొందుపరిచారు. దీనిపై అనుమానం వచ్చిన కొన్ని కంపెనీలు బంజారాహిల్స్ సంస్థను సంప్రదించాయి. ఇలా జరిగిన విషయం తెలుసుకున్న బాధిత సంస్థ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హ్యాకింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
ప్రభుత్వం సంస్థను కాదని...
-
‘ప్రైవేట్’ కోసం ప్రజలకు టోపీ
రూ. 5,615 కోట్లు భరిస్తే దాదాపు 32,900 కోట్ల రూపాయల విలువైన భారీ కేంద్ర ప్రాజెక్టు మన రాష్ట్రానికొచ్చేది. భారీగా ఉద్యోగాలొచ్చేవి. అయితే ఈ మొత్తం భరించలేమంటూ చంద్రబాబు తేల్చిచెప్పారు. అదేసమయంలో ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఆయన.. దానికి ఏకంగా రూ. 12,578 కోట్ల అదనపు రాయితీలను ప్రకటించేశారు. రూ.5,615 కోట్లు కట్టే స్థోమత లేదని చెప్పుకున్న ఆయన ప్రైవేటు సంస్థకు రెట్టింపు రాయితీలను ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధమైన చర్యలతో రాష్ట్రం నుంచి మరో భారీ కేంద్ర ప్రాజెక్టు జారిపోయింది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కాకినాడలో రూ.32,900 కోట్లతో భారీ క్రాకర్, పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయడానికి కేంద్రం ముందుకు వచ్చినా ముఖ్యమంత్రి ప్రైవేటు సంస్థకే మొగ్గు చూపారు. కోల్కతాకు చెందిన హల్దియా పెట్రోకెమికల్స్ సంస్థతో వేగంగా ఒప్పందం కుదుర్చుకోవడమే కాకుండా గత నెలలో కాకినాడలో ఆగమేఘాల మీద శంఖుస్థాపన కూడా చేసేశారు. అంతేకాదు పారిశ్రామిక పాలసీ ప్రకారం లభించే రాయితీలు కాకుండా అదనంగా రూ. 12,578 కోట్ల రాయితీలను ఇస్తూ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ (ఎస్ఐపీబీ) నిర్ణయం తీసుకుంది. హల్దియాకు వివిధ రూపాల్లో ఇస్తున్న భారీ రాయితీలను చూసి అధికారులకే కళ్లుతిరుగుతున్నాయి. ప్రభుత్వం సంస్థను కాదని... రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు హెచ్పీసీఎల్–గెయిల్ కలిసి క్రాకర్, పెట్రో కెమికల్ యూనిట్ పెట్టడానికి 2017లో జరిగిన సీఐఐ పెట్టుబడుల సదస్సులో ఒ్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం కాకినాడ సెజ్లో 2,000 ఎకరాల్లో 1.55 ఎంఎంటీపీఏ సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. ఈ ప్రాజెక్టు లాభదాకతపై ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ స్టడీలో రూ. 5,615 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అవసరమవుతుందని, ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని, మిగతా అన్ని యూనిట్లలో ఇదే విధానం అనుసరిస్తున్నారని ఆ కేంద్ర సంస్థలు పేర్కొన్నాయి. లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రూ. 5,615 కోట్లు వీజీఎఫ్ కింద ఇచ్చే పరిస్థితిలేదని, ఈ మొత్తాన్ని కూడా కేంద్రమే భరించాలంటూ ముఖ్యమంత్రి పట్టుపడుతూ వచ్చారు. చివరకు ఎన్నికల సమయంలో తామే సొంతంగా ఏర్పాటు చేస్తామంటూ హల్దియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. భారీ రాయితీలు.. కేంద్ర సంస్థకు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ప్రైవేటు సంస్థకు రూ. 12,578 కోట్ల ప్రయోజనాలను ఏ విధంగా కల్పిస్తుందంటూ పలువురు పారిశ్రామిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా 2015–20 పాలసీ ప్రకారం లభించే ఇతర రాయితీలు కూడా ఆ ప్రైవేటు సంస్థకు లభిస్తాయని పేర్కొంటున్నారు. ఇదే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చి ఉంటే రెట్టింపు సామర్థ్యంతో యూనిట్ను ఏర్పాటు చేసేవని, తద్వారా రాష్ట్ర యువతకు ఉద్యోగాలతో పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా ఆదాయం వచ్చేదని పలువురు ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా చేయకుండా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒక ప్రైవేటు సంస్థకు.. అది కూడా ఎన్నికల ముందు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు. హల్దియా సంస్థ ఈ ప్రాజెక్టుకు ఆమోదం కోసం ఎస్ఐపీబీ డిసెంబర్ 28, డిసెంబర్ 29న వరుసగా రెండుసార్లు సమావేశం కావడం, జనవరి 3న జీవో చేయడం ఆ మరుసటి రోజే కాకినాడలో ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారంటే దీని వెనుక ఉన్న శక్తుల గురించి అర్థం చేసుకోవచ్చంటున్నారు. -
మరిన్ని ఆరోగ్య సేవలు ప్రైవేటుపరం
సాక్షి, అమరావతి: నాలుగున్నరేళ్లుగా రూ.వేల కోట్ల విలువైన ఆరోగ్య సేవలను ప్రైవేటు పరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్నికల వేళ మిగిలిన వాటిని కూడా ప్రైవేటుకు అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియ ముగించాలంటూ కిందిస్థాయి సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. లేదంటే మీపై చర్యలు తప్పవంటూ ఆరోగ్య శాఖ సలహాదారు, ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. వందలాది కోట్ల రూపాయల విలువైన పనులు ఎవరికివ్వాలో ముందే నిర్ణయించి పేరుకు టెండర్లు నిర్వహిస్తున్నారని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఉచిత టెలీ ఆఫ్తల్మాలజీ(కంటి పరీక్షలు) సేవలు ఓ కార్పొరేట్ ఆస్పత్రికి దక్కేలా ప్రభుత్వ పెద్దలు ముందే నిర్ణయం తీసుకున్నారు. సుమారు రూ.100 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు సదరు కార్పొరేట్ ఆస్పత్రికి దక్కేలా నిబంధనలు రూపొందించడమే ఇందుకు ఉదాహరణ అని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ఎనిమిది జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) కింద కేన్సర్ ఆస్పత్రులు ఏర్పాటు చేసేందుకు టెండర్ పిలుస్తున్నారు. ఒక్కో జిల్లాలో రూ.70 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాల్సిన ఈ ఆస్పత్రులను కూడా ఓ కార్పొరేట్ కంపెనీకి కట్టబెడుతున్నారు. ఆ కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులే టెండర్ డాక్యుమెంట్లు తయారుచేసి ప్రభుత్వానికి ఇచ్చారంటే.. ఇక టెండర్ల ప్రక్రియ ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. రూ.550 కోట్లయ్యే ఈ ప్రాజెక్టు వారికి అప్పజెప్పడంతో పాటు ప్రభుత్వాస్పత్రులకు వచ్చే పేషెంట్లను కూడా అక్కడికే తీసుకెళ్లేలా నిబంధనలు రూపొందించడం గమనార్హం. టీబీ రోగులకు మందులు అందజేయడాన్ని కూడా ప్రైవేటుకు అప్పజెప్పి భారీగా లబ్ధి చేకూర్చేందుకు యత్నిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోగా అందినకాడికి దండుకునేందుకు ఇలా చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్య శాఖ సలహాదారు నేతృత్వంలో.. వైద్య విద్యా శాఖ, మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థల్లోనే ఎక్కువ టెండర్లున్నాయి. ఈ రెండు విభాగాలకు ఎన్ఎండీ ఫరూక్ మంత్రిగా ఉన్నారు. కానీ ఆయనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ పెద్దలే.. ఈ వ్యవహారాలన్నీ నడిపిస్తుండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. వైద్య ఆరోగ్య శాఖకు సలహాదారుగా వ్యవహరిస్తున్న ఓ ప్రైవేటు కన్సల్టెంట్.. తనకు కావాల్సిన కంపెనీలకు టెండర్లు దక్కేలా డాక్యుమెంట్లు రూపొందించి పనులు చక్కబెడుతున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినా.. ఆయన ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఓ అధికారి సాక్షికి తెలిపారు. ఉన్నతాధికారులు, సలహాదారు నేరుగా ముఖ్యమంత్రితోనే మాట్లాడి ఇదంతా చేస్తున్నట్టు వివరించారు. పైగా ఇటీవల కాలంలో చాలామంది అధికారులు ఈ శాఖలో పనిచేయలేమంటూ బలవంతంగా బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. దీంతో అన్ని విభాగాలకు ఒకరే ఇన్చార్జిగా ఉండటంతో.. వీరి పని మరింత సులువైంది. -
టార్గెట్ పూర్తి చేయలేదని వింత శిక్ష
సాక్షి, న్యూఢిల్లీ : సాధారణంగా ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు టార్గెట్ తప్పనిసరి. అయితే ఇచ్చిన సమయానికి టార్గెట్ పూర్తవ్వకపోతే ఇచ్చే జీతంలో కోత విధించడం లేదా ఎక్కువ టైం పని చేయించుకోవడం చేస్తారు. ఇంకా కంపెనీ రూల్స్ కొంచెం కఠినంగా ఉంటే జాబ్ నుంచి తీసివేస్తారు. కానీ మీరు ఇప్పుడు చదవబోయే ఈ వార్త వీటన్నింటికి భిన్నం. ఎప్పుడూ ఇలాంటి ఫనిష్మెంట్లేనా అనుకుందేమో కానీ చరిత్రలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని శిక్ష విధించింది ఓ చైనా కంపెనీ. ఇయర్ ఎండింగ్ టార్గెట్ పూర్తి చేయలేదని తమ కంపెనీ సిబ్బందిని నడి రోడ్డుపై మోకాళ్లపై నడిపించారు. ట్రాఫిక్ మద్యలో సిబ్బంది అంతా మోకళ్లపై కూర్చోని చిన్న పిల్లాల్లా పాకుతూ వెళ్లారు. వారందరిని చూసి పాదచారులు ఆశ్చర్యానికి గురయ్యారు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్ అయింది. కాగా కంపెనీ చర్యను కొంత మంది తప్పుపట్టగా, కొంతమంది ఉద్యోగులను విమర్శిస్తున్నారు. ఉద్యోగులను హింసింస్తున్నారని, వారిని అవమానించేలా కంపెనీ వ్యవహరిస్తుందని కొంత మంది మండిపడుతుండగా, డబ్బు కోసం ఇంతలా దిగజారాలా అని ఉద్యోగులను మరికొంత మంది విమర్శిస్తున్నారు. కాగా వీడియో వైరల్తో యాజమాన్యంపై విమర్శలు రావడంతో కంపెనీని తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. అయితే ఇలా శిక్షించడం చైనా కంపెనీలకు మొదటి సారేంకాదు. గత ఏడాదిలో కూడా ఓ కంపెనీ ఇలాంటి పనిష్మేంటే ఇచ్చింది. టార్గెట్ పూర్తి చేయలేదని తమ సిబ్బందిని వరుసగా నిలబెట్టి అమ్మాయిలలో చెంపదెబ్బలు కొట్టించారు. కాగా ఇలాంటి అవమానకర ఘటనలు చైనా కంపెనీలలో తరచూ జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం గమనార్హం. -
చెత్త కుంభకోణం
కర్నూలు నగరంలో చెత్త తరలించడానికి 12 ట్రాక్టర్లు, 2 టిప్పర్లు 4 కాంపాక్టర్లు ( భారీ స్థాయిలో చెత్త తరలించే వాహనాలు) ఉన్నాయి. ఇవి చాలదన్నట్లు అధికారులు ప్రైవేట్ చెత్త ట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక్కో ట్రిప్పుకు రూ.780 ప్రకారం ఏడాదికి కోటి రూపాయలకు పైగా కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. కర్నూలు (టౌన్): కర్నూలులో 5.50 లక్షల జనాభా ఉంది. ఇక్కడ 51 వార్డులను పారిశుద్ధ్య పరంగా 13 డివిజన్లుగా విభజించారు. ప్రతి రోజు 170 మెట్రిక్ టన్నుల చెత్త తరలించాల్సి ఉంది. వీటిని తరలించేందుకు నగరపాలక సంస్థకు సంబంధించిన ట్రాక్టర్లు ఉన్నా వినియోగించడం లేదు. ప్రైవేట్ ట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎందుకంటే.. చెత్తను తరలించేందుకు ట్రిప్పుల విధానం అమలవుతోంది. ప్రభుత్వ ట్రాక్టర్లను ప్రతి రోజూ రెండు ట్రిప్పులు తిప్పుతున్నారు. వీటికి ఎలాంటి ఖర్చు ఉండదు. అయితే ప్రైవేట్ ట్రాక్టర్లకు ప్రతి రోజు ఐదు ట్రిప్పులు కేటాయించారు. ఒక్కో ట్రిప్పుకు రూ. 780ప్రకారం ఐదు ట్రిప్పులకు రూ. 3,900 నగరపాలక సంస్థ చెల్లిస్తుంది. ప్రతి రోజూ 13 ప్రైవేట్ ట్రాక్టర్లకు రూ. 49,400 చెల్లిస్తున్నారు. నెలకు. రూ. 14,80,000 ప్రకారం ఏడాదికి రూ.1,77,84,000 చెల్లిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రైవేట్ ట్రాక్టర్లకు నిధులు చెల్లిస్తున్నా...కర్నూలులో పారిశుద్ధ్యం మెరుగుపడడం లేదు. ఇదిలా ఉండగా.. ప్రతి రోజూ రెండు ట్రిప్పులు తిప్పుతున్న ప్రభుత్వ ట్రాక్టర్లకు డీజీల్ ఖర్చు ఏటా రూ.1,20,00,000 అవుతున్న విషయం విదితమే. ప్రైవేట్ ట్రాక్టర్ల నుంచి మున్సిపల్ అధికారులు ట్రిప్పుకు ఇంత అని కమీషన్ తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డంపింగ్ యార్డు వద్దా ఇదే పరిస్థితి.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు 25కు పైగా ట్రాక్టర్ల ద్వారా వస్తున్న చెత్తను పాతబస్తీ జమ్మిచెట్టు వద్ద (ట్రాన్సిట్ పాయింట్)కు తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి చెత్తను గార్గేయపురానికి తరలించాలి. ఇక్కడ కూడా ప్రభుత్వ ట్రాక్టర్లు ఉన్నాయి. టిప్పర్లు ఉన్నాయి. కాంపాక్టర్లు ఉన్నాయి. అయినా... వీటన్నింటినీ పక్కన పెట్టారు. ఇక్కడి నుంచి చెత్తను తరలించేందుకు రెండు ప్రైవేట్ టిప్పర్లకు అప్పగించారు. ఒక్కో ట్రిప్పుకు రూ. 2 వేల ప్రకారం చెల్లిస్తున్నారు. -
ప్రింటింగ్ ప్రెస్కు ఆర్టీసీ బైబై
సాక్షి, హైదరాబాద్: అది 50 ఏళ్ల చరిత్ర గల ఆర్టీసీ అనుబంధ సంస్థ.. ప్రస్తుతం నలుగురే దాన్ని మోస్తున్నారు.. మరో 4 నెలల్లో వారూ పదవీవిరమణ చేయనున్నారు.. వారి రిటైర్మెంట్తో పాటు ఆ సంస్థ కూడా శాశ్వతంగా సెలవు తీసుకోబోతోంది.. అలుపెరగకుండా సేవలందించిన ఆ సంస్థే ఆర్టీసీ ముద్రణాలయం.. ఉత్పత్తి పూర్తిగా నిలిపేసి చిన్నాచితకా పనులకే పరిమితమైన ప్రింటింగ్ ప్రెస్ను మూసేందుకు రంగం సిద్ధమైంది. యాభై ఏళ్లుగా రవాణా సంస్థతో కలసి సాగుతున్న ఆ ప్రెస్తో శాశ్వతంగా బంధాన్ని తెంచుకునేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. దాన్ని మోయలేని భారంగా భావి స్తున్న ఆర్టీసీ వదిలించుకుంటోంది. మున్ముందు అవసరమైన ముద్రణ పనులకు ప్రైవేటుపై ఆధారపడేందుకు ఆసక్తి చూపుతోంది. అందులో పని చేసే ఉద్యోగుల జీత భత్యాలు, సంస్థ నిర్వహణ ఖర్చులను సమస్యగా భావిస్తుండటంతో ప్రభుత్వమూ ఆ విషయంలో జోక్యం చేసుకోనంటోంది. 50 ఏళ్ల క్రితం.. రోడ్డు రవాణా సంస్థకు అనుబంధంగా 50 ఏళ్ల క్రితం ముద్రణాలయం ఏర్పడింది. ఆర్టీసీకి అవసరమైన టికెట్లు, పుస్తకాలు, ఎస్ఆర్ జాబితాలు సహా సంస్థ అవసరాలకు సంబంధించిన అన్ని ప్రతులను ముద్రించేందుకు ప్రెస్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్భవన్ ఉన్న ప్రాంతంలో ఈ యూనిట్ ఉండేది. అప్పట్లో బస్బాడీ యూనిట్ కూడా ఇక్కడే ఉండేది. 1985లో ప్రస్తుతం ఉన్న చోట్లకు వాటిని తరలించారు. బస్బాడీ యూనిట్ ను మియాపూర్లో ఏర్పాటు చేయటంతో అక్కడే ప్రింటింగ్ ప్రెస్ నెలకొల్పారు. దానికి 200 మంది కార్మికులను కేటాయించారు. కంప్యూటరీకరణ పెరగడంతో పుస్తకాల ముద్రణ ఆపి సిబ్బంది సంఖ్యను 130కి పరిమితం చేశారు. కొంతకాలంగా ఆర్టీసీ టిమ్స్లో వినియోగించే టికెట్ రోల్స్పై ఆర్టీసీ లోగో ముద్రించే పనే అందులో నిర్వహిస్తున్నారు. పనిలేదన్న కారణంతో సిబ్బందిని ఇతర విభాగా లకు తరలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న నలుగురు పదవీ విరమణ పొందేవరకు ప్రెస్ను కొనసాగించి తర్వాత మూసేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక ఆర్టీసీకి ముద్రణ అవసరం ఉంటే ప్రైవేటు కంపెనీల్లో చేయించాల్సిందే. మూతబడుతున్న యూనిట్లు.. తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రి సహా జిల్లాల్లోని డిస్పెన్సరీలకు సంబంధించిన ఫార్మసీలను ఇప్పటికే ఆర్టీసీ ప్రైవేటుకు అప్పగించింది. దీని వెనక ఓ రాజకీయ నేత హస్తం ఉందన్న ఆరోపణలు కార్మికుల్లో గుప్పుమంటున్నాయి. తన బంధువుల సంస్థకు ఫార్మసీ బాధ్యతలు అప్పగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలొస్తున్నాయి. కార్మికులకు మెరుగైన సేవలందించేందుకు ఫార్మసీ ని ప్రైవేటీకరించినట్లు అధికారులు చెబుతున్నారు. వరంగల్లో ఉన్న ఆర్టీసీ టైర్ రీ ట్రేడింగ్ యూనిట్నూ ఇప్పటికే మూసేశారు. అరిగిపోయిన టైర్లు మరికొంత కాలం మన్నేలా రబ్బర్ను ఏర్పాటు చేసి వాటిని తిరిగి సిద్ధం చేయటం ఈ యూనిట్ విధి. ఇలాంటి మూడు సంస్థలో ఓ దాన్ని మూసేశారు. మూసే జాబితాలో ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ చేరింది. -
ఉద్యోగి గ్రాట్యుటీ చెల్లిస్తారు ఇలా..
నిడమర్రు: అటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఇటు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు గ్రాట్యుటీ అందుకుంటారు. దీన్ని ఎలా లెక్కించి ఇస్తారు.. అలాగే గ్రాట్యుటీపై చెల్లించాల్సిన పన్నుపై కూడా అవగాహన ఉండాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గ్రాట్యుటీపై పన్ను మినహాయింపు పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతూ కేంద్ర క్యాబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. పార్లమెంటులో ఆమోదం పొందాక ఇది అమల్లోకి వస్తుంది. ఒకే సంస్థలో ఎన్నో ఏళ్లుగా పనిచేసేవారికి ఈ నిర్ణయం పెద్ద ఊరటను కలిగించనుంది. ఉద్యోగంలో చేరే సంస్థ హామీ ఇచ్చిన విధంగా మొత్తం జీతం చేతికందదు. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీలాంటి కోతలుంటాయి. ఈ నేపథ్యంలో గ్రాట్యుటీని ఎలా లెక్కిస్తారు. ఎప్పుడు ఇస్తారు, పన్ను లెక్కింపు ఎలా అన్న విషయాలను తెలుసుకుందాం. గ్రాట్యుటీ అంటే.. ఒక సంస్థలో 10 కంటే ఎక్కువ మంది పనిచేసేటట్టయితే ఆ సంస్థ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ చట్టం–1972 ప్రకారం ఉద్యోగులకు కొంత సొమ్ము నగదు రూపంలో ఇచ్చే ప్రయోజనాన్నే గ్రాట్యుటీ అంటారు. ఐదేళ్ల పాటు పనిచేసి ఉండాలి గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం ప్రకారం ఐదేళ్లపాటు ఒకే సంస్థలో ఉద్యోగం చేసి ఉండాలి. పనిచేసిన ప్రతి సంవత్సరానికి 15 రోజుల వేతనానికి సమానమైన సొమ్మును ఇవ్వాలి. వేతనం అంటే ఇక్కడ బేసిక్ శాలరీ, డీఏ కలుపుకోవాలి. పూర్తి సంవత్సరంగా లెక్కింపు గడచిన సంవత్సరం ఉద్యోగి 6 నెలల కంటే ఎక్కువగా పనిచేస్తే.. గ్రాట్యుటీ చెల్లింపుల కోసం పూర్తి సంవత్సరం పనిచేసినట్టుగా లెక్కిస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఏడేళ్ల 6 నెలలు పనిచేశాడనుకుందాం. ఆ వ్యక్తికి 8 ఏళ్లకు సమానమైన గ్రాట్యుటీని చెల్లిస్తారు. 15 రోజుల వేతనం గ్రాట్యుటీ చెల్లింపులను లెక్కించేందుకు, ఒక నెలలో పనిదినాలను 26 రోజులుగా చూస్తారు. కాబట్టి 15 రోజులకు సమానమైన వేతనాన్ని.. నెల వేతనం (ఇంటూ) 15/26గా లెక్కిస్తారు. ఇలా వచ్చిన సంఖ్యను ఎన్నేళ్ల సర్వీసు ఉంటే అన్నేళ్లకు లెక్కవేసి గ్రాట్యుటీని చెల్లిస్తారు. పదవీ విరమణ చేసేటప్పుడూ ఇదే లెక్కను అనుసరించి గ్రాట్యుటీ ప్రభుత్వ/సంస్థ చెల్లింపు చేస్తుంది. సర్వీసులో ఉండగా గతించినట్టయితే.. ఒకవేళ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే.. ఐదేళ్ల కనీస పరిమితి వర్తించదు. గ్రాట్యుటీ ప్రయోజనాన్ని నామినీ లేదా చట్టబద్ధ వారసులకు అందజేస్తారు. ఉద్యోగి చివర పనిచేసిన రోజు మొదలుకుని 30 రోజుల్లోపు గ్రాట్యుటీ చెల్లింపులన్నీ జరిగిపోవాలని చట్టం చెబుతోంది. అలా చేయని పక్షంలో అదనంగా వడ్డీ చెల్లించాలని చట్టంలోని నిబంధనలు చెబుతున్నాయి. సంస్థలు ఎలా చెల్లిస్తాయి..? సంస్థలు గ్రాట్యుటీని తమ సొంత నిధుల నుంచి లేదా సామూహిక గ్రాట్యుటీ పథకం ద్వారా చెల్లిస్తుంటాయి. గ్రాట్యుటీ కోసం కేటాయించిన నిధులను ఏదైనా బీమా సంస్థ వద్ద ఉంచుతారు. బీమా సంస్థలు గ్రాట్యుటీ నిధిని పెట్టుబడిగా పెట్టి వాటిపై రాబడులు వచ్చేలా చూసుకుంటాయి. మార్కెట్ రిస్క్ తగ్గించుకునేందుకు సాధారణంగా ఈ నిధులను డెట్ లేదా స్థిర ఆదాయాన్నిచ్చే పథకాల్లోనే పెట్టుబడి పెడతారు. గ్రాట్యుటీపై పన్ను వర్తింపు.. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. గ్రాట్యుటీని ‘ఇన్కమ్ ఫారం శాలరీ’ విభాగంలోకి చేర్చారు. ఇన్కం ట్యాక్స్ యాక్ట్, 1961 ప్రకారం సెక్షన్ 10(10) కింద గ్రాట్యుటీ ద్వారా అందే సొమ్ముపై పన్ను ప్రయోజనాలు ఉంటాయి. ఈ సందర్భాల్లో పూర్తి మినహాయింపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, స్థానిక ప్రభుత్వ పరిపాలనలోని ఉద్యోగులకు గ్రాట్యుటీపై పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. ఆదే విధంగా గ్రాట్యుటీ సొమ్మును పదవీ విరమణ తర్వాత అందుకున్నా లేదా సర్వీసులో ఉండగా ఉద్యోగి మరణించినట్టయితే పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం రూ.10 లక్షల దాకా అందుకునే గ్రాట్యుటీ సొమ్ముపై పన్ను మినహాయింపు ఉంది. ఇతర ఆదాయ వనరుల విభాగంలోకి.. ఉద్యోగి మరణించినప్పుడు నామినీకి లేదా చట్టబద్ధ వారసులకు అందించే గ్రాట్యుటీపై పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే నామినీగా ఆ ప్రయోజనాన్ని అందుకునేవారు మాత్రం ఆదాయపు పన్ను చట్టం ఇతర ఆదాయ వనరుల విభాగం కిందకి వస్తుంది. -
ఇస్తారా.. ముంచేస్తారా?!
‘సారు నీ కాళ్లు మొక్కుతా.. పైసాపైసా పోగుచేసుకుని మీ మీద నమ్మకంతో జమచేసిన. రెండెళ్లయింది ఇస్తామని.. ఇంకా ఇస్తలేరు. చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకుంటలేరు. మా బాధను అర్థం చేసుకోండి.. మా డబ్బులు మాకు ఇయ్యుండ్రి’.. అంటూ జిల్లా కేంద్రంలోని వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో నిత్యం బాధితుల మొరలు వినిపిస్తున్నాయి. సాక్షి, కామారెడ్డి టౌన్/కామారెడ్డి: వందలాది మంది బాధితులు తాము జమ చేసుకున్న డబ్బుల కోసం కంపెనీ కార్యాలయానికి బారులు తీరుతున్నారు. ఖాతాదారులకు డబ్బులు చెల్లించాల్సిన సమయం ఏడాది దాటి నా, ఖాతాదారులు కాళ్లవేళ్లా పడినా డబ్బులు ఇవ్వడం లేరు. కంపెనీ పేరు తో మరో చోట పెట్టుబడులు పెట్టామని, డబ్బులు వచ్చాకే ఇస్తామని తేల్చి చెబుతున్నారు. దీంతో తమ డబ్బులు ఇస్తారా.. ముంచేస్తారా.. అన్న సందేహంలో ఖాతాదారులు అందోళనకు గురవుతున్నారు. బారులు తీరుతున్న బాధితులు చిట్టీల పేరుతో వందలాది మంది ఖాతాదారుల నుంచి ఐదేళ్లలో రూ.కోట్ల డబ్బులు కట్టించుకున్న వెల్ఫేర్ కంపెనీ చెల్లింపుల్లో పాల్పడుతున్న మోసాలు ఇటీవలే వెలుగులోకి వచ్చాయి. దీంతో బాధితులు తమ డబ్బుల కోసం బారు లు తీరడం పెరిగింది. సిబ్బంది మా త్రం తమ దగ్గర డబ్బులు లేవంటున్నా రు. ‘అవసరమైతే తాళం వేసి బయట పంచాయితీ పెట్టుకుందాం.. అప్పుడు మీ డబ్బులు పూర్తిగా రావు మీ ఇష్టం’.. అనే రీతిలో సమాధానాలిస్తున్నారు. మేం ఇచ్చిన్నప్పుడే తీసుకుంటేనే డబ్బులు వస్తాయి. లేకుంటే ఏం చేసుకుంటారో చేసుకోండని సమాధానం ఇస్తున్నారని ఖాతాధారులు వాపోతున్నారు. రాసిచ్చిన తేదీల్లోనే రావాలని దబాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మకం పేరిట నట్టేట ముంచుతున్నారని ఆగ్రహిస్తున్నారు. పేదలనే టార్గెట్ చేశారు కూలీలు, బీడీ కార్మికులు, చిరుద్యోగులనే కంపెనీ టార్గెట్గా చేసుకుంది. భారీ మొత్తంలో కమీషన్లు ఇచ్చి 50కిపైగా ఏజెంట్లను నియమించుకుంది. ఒక్కో ఏజెంట్ ద్వారా 40కి పైగానే కస్టమర్లను రాబట్టారు. మా కంపెనీలో ప్రతి నెల చొప్పున మూడేళ్లు డబ్బులు పోగుచేసి మరో రెండేళ్లు ఆగితే కస్టమర్లకు రెండింతలు ఇస్తామని ఆశ చూపించారు. ఒక్కో కస్టమర్ నుంచి నెలకు కనీసం రూ.300 నుంచి గరిష్టంగా రూ.10 వేల వరకు కట్టించుకున్నారు. ఇలా రూ.2.50 కోట్లకు పైగానే వసూలు చేసినట్లు సమాచారం. ఈ డబ్బుతో కామారెడ్డితో పాటు ఇతర ప్రాంతాల్లో వెంచర్లు, ఇతర వ్యాపా రాల్లో పెట్టుబడులు పెట్టారు. సుమారు 500 మందికిపైగా ఖాతాదారులు కంపెనీకి బాధితులుగా ఉన్నట్లు తెలిసింది. దీంట్లో ఎక్కువగా నిరుపేదలే ఉన్నారు. కంపెనీ కార్యాలయానికి బాధితులు వస్తుండడంతో వెల్ఫేర్ మోసాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయమై కామారెడ్డి బ్రాంచ్ ఏరియా మేనేజర్ లక్ష్మీనారాయణను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఇక్కడి ఇబ్బందులను, ఖాతాదారుల కష్టాలను కంపెనీ ఎండీకి తెలిపామని, పైనుంచి డబ్బులు వస్తేనే చెల్లిస్తామని, మా చేతుల్లో ఏమి లేదని సమాధానమిచ్చారు. చెప్పులరిగేలా తిరుగుతున్నా.. మా ఊరి ఏజెంట్ నమ్మించి మూడేళ్లు డబ్బులు కట్టించుకున్నాడు. ఐదేళ్ల తర్వాత ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇయ్యలే. ఆర్నెళ్లుగా చెప్పులరిగేలా తిరుగుతున్నా. కాళ్లు మొక్కుతా అన్నా కనికరిస్తలేరు. మాలాంటి పేదోళ్లను మోసం చేస్తున్నారు. మా డబ్బులు మాకు వెంటనే ఇయ్యాలే. – బాలవ్వ, రామారెడ్డి మండలం -
ఎయిర్పోర్టుకు హెలికాప్టర్లో
♦ నగరం నుంచి 15 నిమిషాల్లో గమ్యానికి ♦ 2 నెలల్లో ‘హెలికాప్టర్ ట్యాక్సీ’ అందుబాటులోకి ♦ ఒక ప్రైవేటు సంస్థ పథకం ఐటీ నగరి బెంగళూరులో ఇప్పటివరకు ఎయిర్పోర్ట్కు వెళ్లాలంటే గంటలకొద్దీ ట్రాఫిక్ జాంలలో గడపాల్సిందే. సిటీ నుంచి చెన్నైకి విమానంలో వెళ్లడానికి పట్టే టైం కంటే బెంగళూరు నుంచి విమానాశ్రయానికి చేరుకునే సమయమే ఎక్కువ. దీంతో గంటలకొద్దీ విలువైన సమయం వృథా అవుతోంది. కొంచెం డబ్బు ఖర్చు పెడితే దీనికి మంచి పరిష్కారమే దొరకనుంది. ఇప్పుడు నగరవాసుల కోసం సరికొత్తగా ‘హెలిట్యాక్సీ’ సేవలు అందుబాటులోకి రానున్నాయి. నగరంలోని ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తప్పించుకుంటూ నగరం నుంచి పావుగంటలోనే దేవనహళ్లిలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. సాక్షి, బెంగళూరు: బెంగళూరులో హెలిట్యాక్సీ సేవలను ఒక ప్రైవేటు ఏవియేషన్ సంస్థ అందుబాటులోకి తీసుకురానుంది. హెలిట్యాక్సీ సేవలకు విమానయాన శాఖ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో హెలిట్యాక్సీ సేవల కోసం నగరంలోని వైట్ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీల్లో హెలిప్యాడ్లు నిర్మించేందుకు గాను హెచ్ఏఎల్ అనుమతులను జారీ చేసింది. ఇక ఈ ప్రాంతాల్లో హెలిప్యాడ్లు నిర్మించేందుకు అనువైన ప్రాంతాలను ఏవియేషన్ సంస్థ ఎంపిక చేస్తోంది. డిమాండ్ను బట్టి నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా హెలిప్యాడ్లు నిర్మించనున్నారు. టికెట్.. రూ.2,500– రూ.3,000 నగరంలో ఏ ప్రాంతం నుంచైనా 15 నిమిషాల్లోనే కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ఒక టికెట్ ధరను రూ.2,500 – రూ.3,000 మధ్య నిర్ణయించారు. హెలికాప్టర్లను ‘బెల్’ సంస్థ నుంచి అద్దెకు తీసుకోనున్నారు. 412–ఐఐ1మోడల్ హెలికాప్టర్లో 13 మంది, 407 మోడల్లో ఐదుగురు ప్రయాణించేందుకు అవకాశం ఉంది. నగరంలో ప్రస్తుతం 90 వరకు ఆకాశ హరŠామ్యలపై హెలిప్యాడ్లు ఉన్నప్పటికీ వీటిలో ఏ ఒకటో, రెండో మాత్రమే అధికారికంగా అనుమతులు పొందాయి. కాగా, నగరంలో హెలిట్యాక్సీ సేవలు అందుబాటులోకి వస్తే మిగిలిన కట్టడాల యజమానులు సైతం తమ హెలిప్యాడ్లకు అనుమతులు పొందే అవకాశం ఉంది. ఆ సంస్థ ఎండీ కె.ఎన్.జి.నాయర్ మాట్లాడుతూ.....‘మరో రెండు నెలల్లో హెలిట్యాక్సీల ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటిస్తాం. మొదటి విడతలో ఎలక్ట్రానిక్ సిటీ, వైట్ఫీల్డ్ ప్రాంతాల్లో హెలిప్యాడ్లు నిర్మించనున్నాం.’ అని తెలిపారు. -
సాధారణ బీమా ప్రీమియం వసూళ్లలో 33% వృద్ధి
న్యూఢిల్లీ: జీవిత బీమాయేతర ప్రీమియం వసూళ్లు మంచి జోరుమీదున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సాధారణ బీమా కంపెనీల ప్రీమియం వసూళ్లు 33 శాతం అధికంగా రూ. 10,287 కోట్లు వసూలు అయింది. గతేడాది ఇదే నెలలో వసూలైన స్థూల ప్రీమియం రూ.7,710 కోట్లే. ఐఆర్డీఏ గణాంకాల ప్రకారం... ఫిబ్రవరి నెలలో ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల ప్రీమియం ఆదాయం రూ.5,289 కోట్లుగా ఉండగా, ప్రైవేటు కంపెనీల ప్రీమియం వసూళ్లు రూ.4,998 కోట్లు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ప్రభుత్వ కంపెనీల ప్రీమియంలో వృద్ధి 35 శాతం, ప్రైవేటు కంపెనీల వసూళ్లలో 32 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు అన్ని జీవిత బీమాయేతర కంపెనీల ప్రీమియం వసూళ్లు 31.7 శాతం వృద్ధితో రూ.1,13,942 కోట్లుగా ఉన్నాయి. ఇది అంతకుముందు ఇదే కాలంలో రూ.86,526 కోట్లుగా ఉంది. 11 నెలల కాలంలో ప్రభుత్వరంగ కంపెనీల ప్రీమియం ఆదాయం 30 శాతం వృద్ధితో రూ.61,096 కోట్లుగా ఉండగా, ప్రైవేటు కంపెనీల ప్రీమియం వసూళ్లు 34.1 శాతం వృద్ధితో రూ.39,401 కోట్లుగా ఉన్నాయి. -
క్యూ2లో ప్రైవేటు కంపెనీలకు లాభాల పంట
16 శాతం వృద్ధి: ఆర్బీఐ ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జూలై–సెప్టెంబర్)లో లిస్టెడ్ ప్రైవేటు కంపెనీల లాభాలు 16 శాతం మేర వృద్ధి చెందాయని ఆర్బీఐ తెలిపింది. అంతకుముందు త్రైమాసికంలో ఇది 11.2 శాతమేనని పేర్కొంది. తయారీ రంగంలోని కంపెనీలు అధిక నికర లాభాల ఆర్జనలో ముందున్నాయి. వడ్డీ వ్యయాల్లో ఎటువంటి మార్పు లేకపోవడం లాభాల పెరుగుదలకు దోహదం చేసింది. వరుసగా ఏడు త్రైమాసికాల క్షీణత తర్వాత ముడి సరుకుల వ్యయాలు రెండో త్రైమాసికంలో పెరిగినప్పటికీ, ఉద్యోగుల వ్యయాలు పెరిగినా కానీ లాభాలు వృద్ధి చెందడం విశేషం. తయారీ రంగ కంపెనీల విక్రయాలు సైతం రెండో త్రైమాసికంలో 3.7 శాతం వృద్ధి చెందాయి. ఇక సేవల రంగం (నాన్ ఐటీ)లోని కంపెనీల లాభాలు ఈ కాలంలో తగ్గిపోయాయి. ప్రభుత్వేతర నాన్ ఫైనాన్షియల్ కంపెనీల లాభాల వృద్ధి 1.9 శాతంగానే ఉంది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరల తగ్గుదలకు బ్రేక్ పడడంతో ముడి సరుకు వ్యయాలు పెరిగాయని, లాభాలు తగ్గిపోవడానికి ఇదే కారణమని ఆర్బీఐ తెలిపింది. స్టాక్ ఎక్సేంజ్లలో లిస్ట్ అయిన 2,702 ప్రభుత్వేతర, నాన్ ఫైనాన్షియల్ రంగంలోని కంపెనీల సమాచారాన్ని సంక్షిప్తం చేసి ఆర్బీఐ ఈ వివరాలు వెల్లడించింది. -
ప్రభుత్వ ఆధీనంలోకి రియో ఒలింపిక్ పార్క్
రియో డి జనీరో: ఈ ఏడాది ఒలింపిక్స్ను అంగరంగ వైభవంగా నిర్వహించిన రియో నగరంలోని ఒలింపిక్ పార్క్ ఇప్పుడు బ్రెజిల్ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లింది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన ఈ పార్క్ ఆలనాపాలనా చూసేందుకు సమర్థవంతమైన ప్రైవేటు సంస్థ ముందుకు రాకపోవడంతో రియో మేయర్ ఎడ్యుర్యో పేస్ ప్రభుత్వానికి అప్పగించారు. ఇప్పుడు దీని నిర్వహణ బాధ్యతలు బ్రెజిల్ ఫెడరల్ క్రీడాశాఖ చూడనుంది. ప్రతిష్టాత్మక క్రీడలు ముగిశాక నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు బిడ్డింగ్ నిర్వహించగా పేరున్న ఏ సంస్థ కూడా ఈ కాంట్రాక్టు చేజిక్కించుకునేందుకు రాలేదు. -
హెచ్సీఏలో భారీ కుంభకోణం!
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు రూ.120 కోట్ల కుంభకోణం జరిగినట్లు డిలైట్ సంస్థ దర్యాప్తులో వెల్లడి కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్సీఏ అధ్యక్షుడు అర్షద్ అయుబ్, సెక్రటరీ జాన్ మనోజ్ పై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. గత శుక్రవారం కూడా హెచ్సీఏ సభ్యులపై ఉప్పల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. గత నెల 20వ తేదీన నిర్వహించిన హెచ్సీఏ సర్వసభ్య సమావేశంలో రోజూవారీ బాధ్యతల నిర్వహణకై అడ్హక్ కమిటీ చైర్మన్గా ప్రకాష్చంద్ జైన్ (56)ను నియమించారు. ఈ నెల 5వ తేదీన, 16వ మరోసారి విధుల నిమిత్తం స్టేడియంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడ వుండే సెక్యూరిటీ లోనికి వెళ్లకుండా తనను అడ్డుకున్నారని, కుట్ర జరుగుతుందంటూ ప్రకాష్చంద్ ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కుంభకోణం జరిగినట్లు ప్రైవేట్ సంస్థ దర్యాప్తులో వెల్లడికావడం పలు అనుమానాలకు దారితీసింది. -
క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో భారీ కుంభకోణం
-
తక్కువ ధరకే ‘సింగరేణి’ విద్యుత్!
- యూనిట్ ధర రూ.4.10గా ప్రతిపాదించిన యాజమాన్యం - రూ.3.26కు ఖరారు చేసిన ఈఆర్సీ - ప్రైవేటు విద్యుత్తో పోల్చితే చాలా తక్కువ - వినియోగదారులు, డిస్కంలకు లబ్ధి సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ప్రైవేటు కంపెనీల విద్యుత్తో పోల్చితే సింగరేణి విద్యుత్ చాలా తక్కువ ధరకే లభించనుంది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) ఇటీవల సింగరేణి విద్యుత్ తాత్కాలిక ధరను అత్యంత తక్కువగా యూనిట్కు రూ.3.26గా ఖరారు చేసింది. వచ్చే ఏడాది మార్చి వరకు, లేదా ఈఆర్సీ తుది ధరను ఖరారు చేసే వరకు ఈ తాత్కాలిక ధరతోనే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సింగరేణి విద్యుత్ను కొనుగోలు చేయనున్నాయి. తాత్కాలిక ధర తక్కువగా ఉండటంతో సమీప భవిష్యత్తులో ఈఆర్సీ ఖరారు చేయనున్న తుది ధర సైతం స్వల్ప హెచ్చుతగ్గులతో తక్కువగానే ఉండనుంది. ఈ మేరకు సింగరేణి నుంచి డిస్కంలు కొనుగోలు చేసే విద్యుత్ ధర తక్కువగా ఉంటే వినియోగదారులపై డిస్కంలు విధించే చార్జీలు కూడా తక్కువగా ఉండనున్నాయి. ఏపీకి చెందిన థర్మల్ పవర్టెక్ అనే ప్రైవేటు కంపెనీ నుంచి రూ.4.15 లకు యూనిట్ చొప్పున విద్యుత్ కొనుగోలు చేసేందుకు కొన్ని నెలల కింద ప్రభుత్వం దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ప్రైవేటు విద్యుత్లో థర్మల్ పవర్టెక్ ధరే తక్కువ. అయితే ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి నుంచి లభించే విద్యుత్ ధరతో పోల్చితే మాత్రం చాలా ఎక్కువ. ధర తగ్గించిన ఈఆర్సీ ఆదిలాబాద్ జిల్లా జైపూర్లో 1,200 (25600) మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి బొగ్గు గనుల సంస్థ నిర్మించిన సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఎస్టీపీపీ) నుంచి ఇటీవల విద్యుదుత్పత్తి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ విద్యుత్ ధరలను ఖరారు చేయాలని సింగరేణి యాజమాన్యం ఇటీవల ఈఆర్సీని అభ్యర్థించింది. రూ.7,622 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు నుంచి ఏటా 7,460 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరగనుందని సింగరేణి నివేదించింది. ప్లాంట్ పెట్టుబడి వ్యయం ఆధారంగా యూనిట్ విద్యుదుత్పత్తికి రూ.2.41ల స్థిర వ్యయం కానుందని ప్రతిపాదించింది. స్థిర, చర వ్యయం కలిపి యూనిట్ ధర రూ.4.10గా ఖరారు చేయాలని కోరింది. అయితే యూనిట్ ధర రూ.4 లోపే ఉండాలని ఈఆర్సీకి ట్రాన్స్కో విజ్ఞప్తి చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 600 మెగావాట్ల తొలి యూనిట్ గత అక్టోబర్ 25న, మరో 600 మెగావాట్ల రెండో యూనిట్ కొన్ని రోజుల కిందట వాణిజ్య ఉత్పత్తి (సీఓడీ) ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈఆర్సీ తక్షణమే విద్యుత్ ధరను ఖరారు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో సింగరేణి విద్యుత్కు సంబంధించిన తాత్కాలిక టారీఫ్ను ఖరారు చేసింది. మెగావాట్కు రూ.5.19 కోట్లు చొప్పున నిర్మాణ వ్యయం జరిగిందని పరిగణనలోకి తీసుకుని.. విద్యుత్ స్థిర వ్యయం రూ.1.55, చర వ్యయం రూ.1.71గా నిర్ణయించింది. స్థిర, చర వ్యయం కలిపి యూనిట్ విద్యుత్ను తాత్కాలిక ధర రూ.3.26తో విక్రయించాలని ఆదేశించింది. 31 మార్చి 2017 వరకు ఈ ధర అమల్లో ఉండనుంది. అప్పటిలోగా ఆ తర్వాత 25 ఏళ్ల కాలానికి సంబంధించిన తుది ధరను ఈఆర్సీ ఖరారు చేయనుంది. తుది ధర యూనిట్కు రూ.3.50 నుంచి రూ.4 లోపు ఉండే అవకాశాలున్నాయి. -
'మెడాల్'కు మేత!
పరీక్షల పేరుతో ప్రైవేట్ సంస్థకు రోజుకు రూ.50 లక్షలు చెల్లింపు ఏడాదికి రూ.180 కోట్లు.. మూడేళ్లకు రూ.540 కోట్లు • ఈ సొమ్ముతో అన్ని ఆస్పత్రుల్లో యంత్రాలు • సమకూర్చుకోవచ్చంటున్న అధికారులు • నిధులు గాలికి... ప్రైవేట్పైనే పాలకుల మోజు • రక్త పరీక్షల కోసం మెడాల్ మాయోపాయాలు • ఆ సంస్థ పరీక్షల ఫలితాలన్నీ తప్పుల తడకలే • ఫ్రాంజైజీలను అమ్ముకుంటున్న ప్రైవేట్ సంస్థ • అవసరం లేకపోయినా పరీక్షలు రాస్తున్న వైద్యులు కాలు బెణికిందని ఆస్పత్రికి వెళ్తే మెదడుకు ఎమ్మారై స్కానింగ్ చేయించుకోమని వైద్యుడు చీటీ రాస్తే ఎలా ఉంటుంది?.. వాంతులతో బాధపడే వారిని వెన్నుపూస ఎక్స్రే తీయించుకోమని చెబితే ఏమనిపిస్తుంది?.. జబ్బొకటైతే ఔషధం వేరేదిస్తే రోగం నయమౌతుందా?.. సర్కారీ ఆసుపత్రుల్లో రక్త పరీక్షల నిర్వహణ కాంట్రాక్టును దక్కించుకున్న ఓ సంస్థ తీరు అచ్చం అలాగే ఉంది. సాక్షి, హైదరాబాద్/పార్వతీపురం/గుడివాడ టౌన్ : ఇటీవల తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన జి.శ్రీనివాసరావు గ్యాస్ట్రిక్ సమస్యతో ప్రభుత్వ ఆస్పత్రికెళ్లగా లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్తోపాటు అవసరం లేని మరికొన్ని పరీక్షలు రాశారు. మరోచోట కుక్క కరిచి ఆసుపత్రిలో చేరినా ఎనిమిది రకాల పరీక్షలు రాశారు. ఇంతేకాదు.. సాధారణ వైరల్ జ్వరాలకూ 10 రకాల టెస్టులు చేయించుకురావాలని పురమాయిస్తున్నారు. ఇవన్నీ దేనికోసం అనుకుంటున్నారు?.. ఒక్క ‘మెడాల్’కు మేత పెట్టేందుకే! రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త పరీక్షల నిర్వహణ కాంట్రాక్టును దక్కించుకున్న మెడాల్ సంస్థకు దోచిపెట్టేందుకు ఇలా అడ్డగోలు రక్త పరీక్షలన్నీ రాస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో రక్త పరీక్షలు నిర్వహించడం కోసం ఓ ప్రైవేట్ సంస్థకు రాష్ట్ర సర్కారు చెల్లిస్తున్న సొమ్ము ఎంతో తెలిస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. రక్త పరీక్షల కోసం మెడాల్ అనే సంస్థతో మూడేళ్లపాటు ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం రోజుకు అక్షరాలా రూ.50 లక్షలు చెల్లిస్తోంది. అంటే ఏడాదికి రూ.180 కోట్లు... మూడేళ్లకు రూ.540 కోట్లు. ప్రభుత్వాసుపత్రిలో ఈసీజీ యంత్రం పాడైతే మరమ్మతుల కోసం కనీసం రూ.2 వేలు కూడా విదల్చని ప్రభుత్వం ఇలా ప్రైవేట్ సంస్థకు భారీగా నిధులు ఇస్తుండటంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు రూ.50 లక్షల దండుకుంటున్న మెడాల్ సంస్థ కనీసం పరీక్షలనైనా సక్రమంగా చేస్తోందా? అంటే అదీ లేదు. ఆ సంస్థ నిర్వహస్తున్న పరీక్షల ఫలితాలు తప్పుల తడకలేనని తేలుతోంది. కొందరు మంత్రుల బంధువులు, మాజీ నేతలు, ఎంపీలు ఇందులో భాగస్వాములు మారి ప్రభుత్వ ధనాన్ని దోచుకుతింటున్నట్టు వైద్య ఆరోగ్య వర్గాలే చెబుతున్నాయి. అసలు మెడాల్ చేస్తున్న వ్యాపారం దారుణమని రోజువారీ నివేదికలు అందుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. పట్టణాల్లో రక్త పరీక్షల నిర్వహణను కొన్ని ప్రైవేట్ డయాగ్నోస్టిక్ కేంద్రాలకు ఫ్రాంచైజీల లెక్కన మెడాల్ అమ్మేసుకుంది. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లు స్థానిక నేతల కనుసన్నల్లో ఉండడంతో వారు మెడాల్పై ఈగ వాలనివ్వడం లేదు. రూ.100 కోట్లకు మించి అవసరం లేదు రాష్ట్రంలో 32 ఏరియా ఆస్పత్రులు, 1,075 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8 జిల్లా ఆస్పత్రులు ఉన్నాయి. ఆ ఆసుపత్రులన్నింటిలో రక్త పరీక్షల యంత్రాల ఏర్పాటు, నిర్వహణకు రూ.100 కోట్లకు మించి అవసరం లేదని నిపుణుల పరిశీలనలో తేలింది. ఆటో అనలైజర్, సెల్కౌంటర్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్ ఇలాంటి పరికరాలన్నింటికీ కలిపి రూ.30 లక్షలు వెచ్చిస్తే చాలు. ఈ పరికరాలు ఏరియా, జిల్లా ఆస్పత్రులకు మాత్రమే అవసరం. పీహెచ్సీ స్థాయిలో అయితే రూ.5 లక్షలు వెచ్చిస్తే ప్రాథమిక పరీక్షలకు నిర్వహించవచ్చు. ఇది ఒకసారి పెట్టుబడి మాత్రమే. ప్రధాన పరీక్షలన్నీ ఈ పరికరాలతోనే చేయచ్చు. ఇక నెలవారీ సిబ్బంది వేతనాలు, పరీక్షలకు కావల్సిన కిట్లు, రసాయనాలు, ఇతర ఖర్చులు అన్నీ కలిపి నెలకు రూ.1.50 లక్షలు మాత్రమే అవుతుంది. కానీ, ప్రభుత్వం మాత్రం ప్రైవేట్ సంస్థకు ఏటా రూ.180 కోట్లు అప్పనంగా చెల్లిస్తుండడం గమనార్హం. సొంతంగా రక్త పరీక్షలు నిర్వహిస్తే ఖర్చు భారీగా తగ్గి, నిధులు ఆదా అయ్యే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ప్రజల సొమ్మును ప్రైవేట్ సంస్థకు దోచిపెట్టడంపైనే పాలకులు శ్రద్ధ చూపుతున్నారు. రోజుకు 21 వేల మందికి పరీక్షలు రక్త పరీక్షల నిర్వహణ కోసం ఆరు నెలల క్రితం టెండర్లు పిలిస్తే మెడాల్ సంస్థ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆ సంస్థకు కాంట్రాక్ట్ దక్కేలా చేశారని అప్పట్లో విమర్శలు వినిపించాయి. ఒప్పందం ప్రకారం ఒక్కో రక్త నమూనాకు ప్రభుత్వం రూ.245 చొప్పున చెల్లించాలి. రోజుకు 12 వేల మంది రక్త నమూనాలు ఇప్పిస్తామని ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు మెడాల్ సంస్థ రాష్ట్రంలో రోజుకు 21 వేల మందికి రక్త పరీక్షలు నిర్వహిస్తోంది. అంటే ఒక్కో పరీక్షకు రూ.245 చొప్పున ప్రభుత్వం రోజుకు రూ.50.45 లక్షలు చెల్లిస్తోంది. కేవలం రక్త పరీక్షలకే రోజుకు అర కోటి చెల్లిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ సంస్థకు ఏడాదిపాటు చెల్లించే సొమ్ముతో రాష్ట్రంలోని 1,075 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్తపరీక్షల కోసం అత్యుత్తమ యంత్రాలను కొనుగోలు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. మూడు పువ్వులు.. ఆరు కాయలు మెడాల్ వ్యాపారం ఆరు మాసాల్లోనే మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లింది. రక్త పరీక్షల కేసులు అమాంతం పెరిగిపోయాయి. వ్యాపారం రూ.కోట్లలోకి చేరింది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు కలెక్టర్లు కూడా మెడాల్కు ఇబ్బడిముబ్బడిగా రక్త పరీక్షల కేసులు రాయాలని వైద్యులకు ఆదేశాలిచ్చిన సందర్భాలూ ఉన్నాయి. 2016 జనవరి నుంచి మెడాల్ చేసిన రక్త పరీక్షలను చూస్తే వీరి వ్యాపారం ఏస్థాయిలో పెరిగిందో తెలిసిపోతుంది. నెల మెడాల్ చేసిన టెస్టులు --------------------------- జనవరి 940 ఫిబ్రవరి 81,755 మార్చి 1.77 లక్షలు ఏప్రిల్ 2.03 లక్షలు మే 2.62 లక్షలు జూన్ 2.80 లక్షలు ఫ్రాంచైజీల లెక్కన అమ్మకం ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం మెడాల్ సంస్థ సొంతంగా ల్యాబ్లను ఏర్పాటు చేసుకోవాలి. కానీ, స్థానిక డయాగ్నోస్టిక్ సెంటర్లతో మాట్లాడుకొని గుడ్విల్ కింద రూ.లక్షలు వసూలు చేసుకుని ఫ్రాంచైజీల లెక్కన అమ్ముకున్నారు. ఇలా ప్రతి జిల్లాలో ప్రైవేట్ ల్యాబ్లతో మాట్లాడుకొని నయాపైసా పెట్టుబడి పెట్టకుండా మెడాల్ సంస్థ దాదాపు రూ.25 కోట్లు వసూలు చేసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆ ఫ్రాంచైజీలు మెడాల్కు చెల్లించిన సొమ్మును రాబట్టుకునేందుకు డాక్టర్లకు విదేశీ పర్యటనల ఆఫర్లు ఇస్తూ ఎక్కువ సంఖ్యలో బ్లడ్ టెస్టులను రాయించుకుంటున్నాయి. మెడాల్కు మేలు చేసేందుకు అవసరం లేకపోయినా వైద్యులు రక్త పరీక్షలు రాస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. వరదాయపాలెంలో మాయ చిత్తూరు జిల్లా వరదాయపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు నాలుగైదుకు మించి రక్త పరీక్షలు జరగవు. గత రెండు నెలల్లో 90 టెస్టులు జరిగినట్టు పీహెచ్సీలోని రిజిస్టర్ నమోదైంది. కానీ, 250 టెస్టులకు పైగా జరిగినట్టు కోర్ డ్యాష్బోర్డులో చూపిస్తున్నారు. అంటే ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది ప్రమేయం లేకుండా మెడాల్ సంస్థే ఇష్టారాజ్యంగా టెస్టులు చేసుకుంటున్నట్టు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. ఇదేమి కౌంట్.. మెడాల్ తప్పుడు నివేదికలతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది మెడాల్ సంస్థ. విజయనగరం జిల్లా కొమరాడ మండలానికి చెందిన సీపీఎం నాయకుడు కొల్లి సాంబమూర్తికి సోమవారం పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో మెడాల్ సంస్థ రక్త పరీక్షలు నిర్వహించింది. ఆ సంస్థ రిపోర్టులో ప్లేట్లెట్ కౌంట్ 65,000గా ఉంది. అంత తక్కువగా కౌంట్ రావడంపై అనుమానం వచ్చి ఆయన ఆ రిపోర్టు వచ్చిన రెండు గంటల్లోనే పట్టణంలోని ప్రైవేట్ ల్యాబ్లో పరీక్ష చేయించుకున్నారు. ఆ ల్యాబ్ రిపోర్టులో కౌంట్ 2,38,000గా ఉంది. బుధవారం ఏరియా ఆసుపత్రిలోని మెడాల్ సిబ్బందిని నిలదీయగా.. తమకేమీ తెలియదని, రక్తం తీసి పంపించేంతవరకే తమ పని అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. 4 గంటల తర్వాతే రక్త పరీక్షలు వాస్తవానికి రక్త నమూనాలను సేకరించిన 2 గంటల్లోగానే ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహించాలి. కానీ, ఉదయం 11 గంటలకు సేకరించి, సాయంత్రం 4 గంటలకు కూడా పరీక్షలు చేయడం లేదు. సాయంత్రం 4 గంటల వరకూ రక్తపరీక్షలు జరిగినట్టు చూపించడం లేదు. ఆ తర్వాత ఒక్కసారిగా వేలల్లో పరీక్షలు జరిగినట్టు కోర్డ్యాష్ బోర్డులో చూపిస్తున్నారు. అంటే నాలుగైదు గంటల తర్వాత పరీక్షలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈలోగా రక్తం గడ్డకడుతోంది. దీంతో తప్పుడు రిపోర్టులు వస్తున్నట్టు వైద్యులు అనుమానిస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థ నిర్వీర్యం ‘‘రక్త పరీక్షల నిర్వహణను ప్రైవేట్ సంస్థకు ఇవ్వడం వల్ల భవిష్యత్లో ప్రభుత్వ వ్యవస్థ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. ప్రధానమైన హిమోగ్లోబిన్, బ్లడ్ షుగర్ పరీక్షలు మెడాల్ ప్యాకేజీలో లేవు. అయినా ఇంత డబ్బు ఎందుకు ఖర్చవుతుంది? ప్రస్తుతం రోజుకు రూ.50 లక్షలు వెచ్చిస్తున్నారు. రేపు రూ.కోటి అవుతుందని ప్రైవేట్ సంస్థ చెబితే, ప్రభుత్వం చేతులెత్తేస్తే బాధ్యత ఎవరిది? రక్త పరీక్షలను ప్రైవేట్కు కట్టబెట్టకుండా ఆ డబ్బుతో ప్రభుత్వమే నిర్వహించాలి’’ - డా.గేయానంద్, ఎమ్మెల్సీ -
మా డబ్బుతో నీ బోర్డులు పెడతావా?
నీకెంత ధైర్యం? మేము డబ్బులిస్తుంటే నీ కంపెనీ పనిచేస్తోందా, నువ్వు డబ్బులిస్తోంటే మేము పనిచేస్తున్నామా? ఏడాదికి రూ.120 కోట్లు ఇస్తున్నాం. మా ఆస్పత్రుల్లో నువ్వు బోర్డులు పెడతావా అంటూ సదరు శాఖకు చెందిన మంత్రి మొన్నామధ్య చీరాల పర్యటనలో తీవ్రంగా మండిపడ్డారట. ఎన్ని కోట్లు ఖర్చు చేసి పథకాలు పెట్టినా ప్రభుత్వానికి పేరు రావట్లేదని ఆయన ఆవేదన చెందారట. ప్రభుత్వాసుపత్రుల్లో ఎక్కడైనా ప్రైవేటు సంస్థల బోర్డులు చూశారా అంటూ ఆస్పత్రి సిబ్బందిని గద్దించారు. వెంటనే ప్రైవేటు సంస్థ సీఈఓకు ఫోన్ కలిపి నీ ఇష్టమొచ్చినట్టు చేస్తే కుదరదు. నీమీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. నీకెంత ధైర్యం లేకపోతే మా ఆస్పత్రిలో నీ బోర్డు పెట్టి కూర్చుంటావా అంటూ చిందులేశారుట. అంతేకాదు తాను చెప్పినవేవీ అమలు కావడం లేదని, ఉన్నతాధికారుల నుంచీ, కిందిస్థాయి సిబ్బంది వరకూ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. అనంతరం మంత్రి కోపం మామూలే కదా...ఒక్క రోజు ఆస్పత్రిలో నిద్ర చేస్తే ఆ కోపం మాయమవుతుందిలే అంటూ ఆస్పత్రి సిబ్బంది గుసగుసలాడుకున్నారుట. -
అలా చేయడం తప్పా?!
జీవన గమనం నేనో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిని. నాకు ఎవరైనా రూల్స్ పాటించకపోతే నచ్చదు. ఆఫీసులో కొలీగ్స్ నుంచి రోడ్డు మీద ఆటోవాడి వరకూ ఎవరు నియమాలు తప్పినా సహించ లేను. అలా చేయడం తప్పు కదా అని నిలదీసి అడిగేస్తాను. అది ఎవరికీ నచ్చదు. నీకు అవసరమా అంటారు. తనే పెద్ద సిన్సియర్ అయినట్టు అని కొందరు ఎగతాళి కూడా చేస్తున్నారు. నేనిలా చేయడం తప్పా? - శంకర్రావు, జీడిమెట్ల సమాజంలో జరుగుతోన్న అక్రమా లను చూసి ఆవేశం రావడం, రక్తం మరగడం సాధారణమే. అయితే ‘పరిస్థితి అలా తయారవడానికి మనం కూడా దోహదపడుతున్నామా’ అనే విషయం ఆలోచించుకోవాలి. దీన్నే ఇంగ్లిష్లో ‘సెల్ఫ్ రియలైజేషన్’ అంటారు. ఉదాహరణకి రోడ్డు పక్కన చెత్త చూసి, మీరు ప్రభుత్వం మీద కోపం తెచ్చుకున్నారనుకుందాం. ఇంట్లోని చెత్త మీరెప్పుడైనా రోడ్డుమీద పడేశారా అన్నది ఆలోచించుకోవాలి. సినిమాలో లంచగొండి పోలీసు అధికారి మీద హీరో ఉమ్మేసినప్పుడు ప్రేక్షకులంతా చప్పట్లు కొడతారు. చిత్రమేమిటంటే, వాళ్లలో చాలామంది లంచగొండులు ఉంటారు. ఒక వర్షం కురుస్తున్న రాత్రి ఆటోవాడు రెట్టింపు చార్జీ అడిగితే, కోపం రావడం సహజమే. ఎందుకంటే మీ బల హీనతతో అతడు ఆడుకుంటున్నాడు కాబట్టి. అయితే పాస్బుక్ కోసం ఒక రైతు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు లంచం అడిగితే, ఇతరుల బలహీనతలతో ఆడు కునే వారిలో మీరు కూడా ఒకరవుతారు. అప్పుడు మీకు ఆటోడ్రైవర్ మీద కోపం తెచ్చుకునే అధికారం లేదు. ఇలా ఆలో చిస్తే, మనలో కూడా అవే లోపాలుంటే, ఆవేశం తగ్గిపోతుంది. లేదూ మీరు సిన్సియర్గా ఉన్నారంటే... ఓ మంచి అభిరుచిని ఏర్పరచుకోండి, ఆవేశం అదే తగ్గుతుంది. సమాజంలో ఏఏ పరిస్థితుల వల్ల ఉద్వేగం కలుగుతోందో వ్యాసాలుగా రాసి పత్రికలకి పంపండి. ఫేస్బుక్లో పోస్టులు, బ్లాగులు పెట్టడం కూడా ఓ పద్ధతి. దీన్నే ‘ఔట్-లెట్’ అంటారు. అంతర్గత ఆవేశానికీ ఉద్విగ్నతకీ కారణ మైన పరిస్థితుల పట్ల ప్రతిస్పందించ డానికి చాలామంది కళాకారులు ఎన్నుకునే పద్ధతి ఇది. మంచి ఫలితం ఉంటుంది. కులమతాలు పట్టించుకోకుండా, కట్న కానుకలు తీసుకోకుండా పెళ్లాడాను. పదేళ్లు కాపురం చేసి, బాబు పుట్టాక ఆమె అక్రమ సంబంధాల వైపు పరుగెత్తింది. నేను వ్యతిరే కించినా విడాకులు సాధించుకుంది. వేరొక రితో సహజీవనం చేస్తోంది. నేను మా కుటుం బీకుల ప్రోత్సాహంతో ఓ డైవర్సీని పెళ్లాడాను. ఆవిడకు ఎదిగిన కూతురుంది. ముగ్గురం అన్యోన్యంగా ఉంటున్నాం. అయితే నా మొదటి భార్య మా బాబుని నాకు దూరం చేసింది. వాడికి నాపై చెడు అభిప్రాయాన్ని పెంచి నా దగ్గరకు రాకుండా చేసింది. అది నేను తట్టుకో లేకపోతున్నాను. ఏం చేయాలి? - ఓ సోదరుడు, బెంగళూరు మీరు అడిగిన ప్రశ్నకి మొదటి ఐదు వాక్యాలూ అవసరమా? ‘నేను చాలా గొప్ప పని చేశాను, నా భార్య నీచమైన మనస్తత్వం కలది’ అన్న అభిప్రాయం మీ ప్రశ్నలో ఎక్కువగా కనిపిస్తోంది. మొదటి భార్యను వదిలేసినప్పుడు ఆమెతో పాటు మానసికంగా మీ బాబును కూడా వది లేయడానికి సిద్ధపడాలి. మీ రెండో భార్య మాజీ భర్త ఆమెనీ, ఆమె కూతుర్నీ కొంత కాలం తన దగ్గరకు పంపించమంటే మీరు ఎలా ఫీలవుతారో, బహుశా మీ మొదటి భార్య కూడా అలాగే ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. మీరిప్పుడు అన్యోన్యంగానే ఉన్నారు కాబట్టి మొదటి భార్యతో బంధం పూర్తిగా తెంచుకోండి. జిలేబి తింటూ డయాబెటిస్ తగ్గాలంటే ఎలా? మోహం ఎక్కువైతే వ్యామోహం అంటారు. వ్యామోహం ఎక్కువైతే తాపత్రయం అంటారు. తాపం అంటే కోరిక. త్రయం అంటే మూడు. ‘నేను బావుండాలి, నన్ను బాగా ఉంచడం కోసం అవతలివారు బాధపడినా నేను బావుండాలి, నేను పోయాక కూడా నావాళ్లు (మాత్రమే) బావుండాలి’ అనే మూడు కోరికలే తాప త్రయం. ఇదే అన్ని విషాదాలకీ మూలం. నేనో సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నప్పుడు ఓ క్యాబ్ డ్రైవర్ నన్ను రెగ్యులర్గా డ్రాప్ చేసే వాడు. తను నన్ను ప్రేమించాడు. మొదట కాదన్నా నన్ను దేవతలాగా చూడటం చూసి నేనూ ప్రేమించాను. మావాళ్లు ఒప్పుకున్నారు. కానీ ఉద్యోగాలు, స్తోమత కారణంగా తేడాలు వస్తాయంటూ తన ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేశారు. అప్పుడే నాకు ఆస్ట్రేలియాలో ఉద్యోగం రావడంతో వెళ్లాల్సి వచ్చింది. తర్వాత కూడా ఇద్దరం టచ్లో ఉన్నాం. పెళ్లికి డేట్ ఫిక్స్ చేశారని తను చెబితే ‘వెయిట్ చేస్తే చెయ్యి, లేదంటే తననే చేసుకో’ అన్నాను. కోపం వచ్చి ఫోన్ పెట్టేశాడు. తర్వాత ఎన్నిసార్లు చేసినా దొరక లేదు. చాలా రోజులు ప్రయత్నించి, తన ఫ్రెండ్స్ని కాంటాక్ట్ చేస్తే తనకి పెళ్లైపోయిందని చెప్పారు. నంబర్ అడిగితే నాకు ఇవ్వొద్దన్నా డని అన్నారు. నా గుండె పగిలిపోయింది. తను లేకుండా నేను బతకలేను. తనని నేను మర్చిపోలేను. ఇప్పుడు నేనేం చేయాలి? - ప్రియాంక, ఆస్ట్రేలియా అతడిని మర్చిపోవడం తప్ప మీకింకో మార్గం ఏముంది చెప్పండి! రంభ తా వలచి వచ్చిన అనే సామెత గుర్తుందిగా! మీరు దేబిరించేకొద్దీ అతనికి మీమీద ప్రేమ తగ్గడమే కాకుండా అసహ్యం కూడా ఏర్పడుతుంది. కాబట్టి మీరు అతడిని మర్చిపోవడమే మంచిది. గుండెలు పగలటాలూ, మళ్లీ అతుక్కోవడాలూ మామూలే. కాలమే అన్ని గాయాలనూ మానేలా చేస్తుంది. కొంతకాలం ఇతర అభిరుచుల్లో నిమగ్నమైతే మనసు సర్దు కుంటుంది. జీవితాన్ని ఎప్పుడు కావా లంటే అప్పుడు ఫ్రెష్గా ప్రారంభించ వచ్చు. ఈ సూత్రాన్ని అర్థం చేసుకుంటే ఆనందంగా ఉండగలరు. - యండమూరి వీరేంద్రనాథ్ -
ప్రైవేటు కొలువుకు సెలవు!
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ ఇంజనీర్లే కాదు.. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వేల మంది ఇంజనీర్లు సైతం సర్కారీ కొలువును ఒడిసిపట్టుకునేందుకు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉద్యోగాల నియామకాల కోసం జరిగే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వేల మంది ఇంజనీర్లు మూకుమ్మడిగా సెలవులు పెట్టేసి మళ్లీ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇంజనీరింగ్ విద్యను మరోమారు మూలాల నుంచి ఔపోసన పడుతున్నారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ ఉద్యోగావకాశాన్ని ఒడిసి పట్టుకునేందుకు ప్రైవేటు ఇంజనీర్లు తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. పలు ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్పీఎస్సీ) 931 ఏఈఈ (సివిల్) పోస్టులతో పాటు 1058 ఏఈ (సివిల్/మెకానికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి రాత పరీక్షలకు ఏర్పాట్లు చేస్తోంది. ఏఈఈ (సివిల్) పోస్టుల కోసమే 30,783 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలకు సన్నద్ధం కావడానికి వేల మంది ఇంజనీర్లు సెలవులోకి పోవడంతో ఒక్కసారిగా నిర్మాణ రంగం స్తంభించిపోయింది. మెట్రో రైలు లాంటి ముఖ్యమైన ప్రాజెక్టుల పనులు నెమ్మదించాయి. మెట్రో రైలు ప్రాజెక్టుతో పాటు హైదరాబాద్లోని ప్రముఖ నిర్మాణ కంపెనీలు, ఏపీలోని స్థిరాస్తివ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న 15 వేల మందికి పైగా సివిల్ ఇంజనీర్లు సెలవులోకిపోవడం నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని ఆ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పనులకు అనుభవజ్ఞులైన ఇంజనీర్ల కొరత ఏర్పడిందని అభిప్రాయపడుతున్నారు. ఇక విద్యుత్ సంస్థల్లో 2,681 అసిస్టెంట్ ఇంజనీర్లు, సబ్ ఇంజనీర్ల భర్తీకి ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్లు రానున్నాయి. ఈ పోస్టుల కోసం హిమాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని విద్యుదుత్పత్తి కేంద్రాల్లో పనిచేస్తున్న 2 వేల మంది తెలంగాణ ఇంజనీర్లు ఇప్పటికే సెలవులు పెట్టేసి సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. అదేవిధంగా తెలంగాణ, ఏపీల్లోని ప్రైవేటు విద్యుత్ కేంద్రాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు కలిపి మొత్తం 5 వేల మందికి పైగా ప్రైవేటు ఎలక్ట్రికల్ ఇంజనీర్లు సెలవుల బాటపట్టినట్లు అంచనా. ఈ ఉద్యోగ నియామకాల సీజన్ ముగిసే వరకు ప్రైవేటు నిర్మాణ సంస్థలు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సెలవుల ఫీవర్ తప్పదనే చర్చ జరుగుతోంది. -
ప్రైవేటు సంస్థతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
- నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం - అకౌంటెంట్, క్లర్క్ వంటి ఉద్యోగాల బాధ్యతలు అప్పగింత - ఒప్పందం కుదుర్చుకున్న ఎంపీఎంఎస్ సంస్థ సాక్షి, ముంబై: మహారాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఎంపీఎస్సీ) ద్వారా భర్తీ అయ్యే కొన్ని ఉద్యోగాలను ఇకపై ప్రైవేటు సంస్థ ద్వారా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. ఈ భర్తీ ప్రక్రియను ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న నగరాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి ప్రారంభించాలని యోచిస్తోంది. అసిస్టెంట్, క్లర్క్, అకౌంటెంట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఓ ప్రైవేటు సంస్థకు ఇటీవల కాంట్రాక్టు ఇచ్చింది. దీంతో ఎంపీఎస్సీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు, తాత్కాలిక ఉద్యోగులపై ఈ ప్రభావం తీవ్రంగా పడనుంది. అలాగే వెనకబడిన తరగతులకు ఉద్యోగాల భర్తీలో కేటాయించిన రిజర్వేషన్ ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి. ప్రైవేటు సంస్థతో ఉద్యోగ భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తే రాష్ట్ర పరిపాలన విభాగానికి సంబంధించిన రహాస్య సమాచారం లీకయ్యే ప్రమాదం కూడా ఉంది. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ప్రభుత్వంపై ఖర్చులు పెరగడంతో అృవద్ధి పనులకు తీవ్ర నిధుల కొరత ఏర్పడుతోంది. దీంతో ఖర్చులు తగ్గించుకోవాలని ఇనిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ఇందులో భాగంగా కొన్ని ఉద్యోగాలను బయట నుంచి భర్తీ చేయాలని భావించింది. అయితే ప్రైవేటు సంస్థలు డ్రైవర్, ఫ్యూన్, పారిశుద్ధ్య కార్మికులు వంటి నాలుగో శ్రేణి ఉద్యోగాల భర్తీ ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో కొన్ని కీలక పదవులను భర్తీ చేసేందుకు ‘ద మహాత్మా ఫులే మల్టీ సర్వీసెస్’ అనే ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టునిచ్చింది. ఆ సమచారం లీకైతే..? మంత్రాలయ పరిపాలన విభాగంలో అసిస్టెంట్ ఉద్యోగం చాలా కీలకమైనది. చాలా కీలక విషయాలన్నీ చక్కబెట్టే బాధ్యత అసిస్టెంట్ క్లర్కది. పరిపాలన విభాగంలో తీసుకున్న నిర్ణయాలు, జారీ చేసే ఉత్తర్వులు ముందు ఇక్కడే రూపుదిద్దుకుంటాయి. ఆ తర్వాతే ఇతర కార్యాలయాలకు బదిలీ అవుతాయి. మంత్రాలయకు సంబంధించిన గోప్యమైన సమాచారం ప్రైవేటు సంస్థ నియమించిన అసిస్టెంట్ నుంచి లీకైతే మొత్తం మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. ప్రభుత్వ సమాచారం అక్రమార్కుల చేతిలోకి వె ళ్లే ప్రమాదం ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టాఫ్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరిన వ్యక్తికి డిప్యూటీ కార్యదర్శి వరకు పదోన్నతి లభించే అవకాశముంటుంది. ఇప్పటివరకు ఆ స్థాయిలో పదోన్నతి లభించిన వారంతా మంత్రాలయలోనే పనిచేస్తున్నారు. అయితే వారంతా తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మంత్రాలయ వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తొందరపాటు చర్యల వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రసాద్! ఈక్విటీ ఫండ్లు ఎంచుకోండి!!
నాకు 33 ఏళ్లు. హైదరాబాద్లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. నెల జీతం రూ.63,000. వార్షికంగా రూ.7,56,000. భార్య, ఐదేళ్ల బాబు, రెండేళ్ల పాప ఉన్నారు. నాకు, నా భార్యకు కొన్ని బీమా పాలసీలు, కొన్ని పొదుపు పథకాల్లో పెట్టుబడులు ఉన్నాయి. బీమా పాలసీలు... - నా పేరిట రూ.లక్ష మనీ బ్యాక్ పాలసీ. వార్షిక ప్రీమియం రూ.5,000 - నా పేరిటరూ. లక్ష కవరేజీతో బీమా కిరణ్ పాలసీ. వార్షిక ప్రీమియం రూ.800 - ఆఫీస్ ఇస్తున్న బీమా కవరేజీ రూ.25,00,000 - ఆఫీస్ ఇస్తున్న వైద్య బీమా ఫ్లోటింగ్ పాలసీ. కవరేజీ రూ.3,50,000 - మ్యాక్స్ బుపా కవర్ రూ.3,00,000. - నా భార్య పేరిట రూ.లక్ష కవరేజీతో మనీ బ్యాక్ పాలసీ. వార్షిక ప్రీమియం రూ.6,000 ప్రస్తుత నెలవారీ ఖర్చులు... - గృహ అవసరాలకు: రూ.8,000 - కారు లోన్ చెల్లింపులు: రూ.9,000 - ఆర్డీ అలాగే పీపీఎఫ్: రూ. 5,000 - బీమా: రూ.1,000 - స్కూల్ ఫీజు రూ.6,000. - అత్యవసర నిధికి వ్యయం రూ.6,000 - మొత్తం ఖర్చు రూ. 35,000 పొదుపు... ఇతర పెట్టుబడులు - నా భార్య పేరిట నెలకు రూ.2000 చొప్పున బ్యాంక్లో ఆర్డీ. - పీపీఎఫ్లో నెలకు రూ.3,000 చొప్పున పొదుపు - షేర్లలో రూ.70,000 పెట్టుబడులు అప్పులు.. - నెలకు రూ.9,000 చొప్పున ఇంకా 24 నెలలు కారు రుణం చెల్లింపు ప్రణాళికలు... ప్రస్తుత రూ.70,000కు తోడు ఇకపై ప్రతి ఏటా రూ.50,000 చొప్పున షేర్లలో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. రూ.30,000 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడదామనుకుంటున్నాను. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఎందుకంటే పిల్లల చదువు, వారి పెళ్లిళ్లు, నా రిటైర్మెంట్ ఇవన్నీ మున్ముందు ఉన్నాయి. నేను ఏం చేస్తే బాగుంటుంది? - ప్రసాద్, హైదరాబాద్ పెట్టుబడులు/పోర్ట్ఫోలియో సూచనలు... - మీ కుటుంబ ఆర్థిక భద్రతకు తొలుత జీవిత బీమా కావాలి. రూ.50 లక్షల జీవిత బీమా అవసరం ఉంది. - కుటుంబం మొత్తానికి వైద్య అవసరాలకు బీమా చేయించండి - దీర్ఘకాలంలో సంపద సృష్టికి ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు అవసరమే. - దురదృష్టకర పరిస్థితులు ఎదురయితే, ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఒక చైల్డ్ పాలసీ కూడా కావాలి. - మీ ప్రస్తుత పాలసీలు సంప్రదాయబద్ధమెనవి. వీటిని నిలిపేస్తే పలు పెనాల్టి రుసుములు చెల్లించాలి. కాబట్టి వీటిని కొనసాగించండి. తద్వారా వచ్చే డబ్బును పిల్లల విద్య, రిటైర్మెంట్ అవసరాలు వంటికి వినియోగించవచ్చు. సాంప్రదాయ పాలసీలు గనుక, వీటిపై 6 నుంచి 7.5 శాతం వరకూ వడ్డీ వచ్చే అవకాశం ఉంటుంది. - మీరు బ్యాంక్, రికరింగ్ డిపాజిట్లలో ప్రస్తుతం పెట్టుబడులు పెడుతున్నట్లు చెబుతున్నారు. అయితే ట్యాక్స్ అనంతరం వీటి ద్వారా మీకు కొంచెం తక్కువ రిటర్న్స్ వచ్చే వీలుంది. క్రమంగా ఈ పొదుపులను ఈక్విటీ, బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లలోకి మార్చుకోండి. తద్వారా తగిన రిటర్న్స్ పొందే వీలుంటుంది. - ఈక్విటీ, ఎంఎఫ్లలో పెట్టుబడులకు సలహాలను అడిగారు. మ్యూచువల్ ఫండ్స్ డైవర్సిఫైడ్ ఈక్విటీ స్కీమ్స్లో పెట్టుబడులు బాగుంటాయి. ఇవి అధిక ఇబ్బందుల సర్దుబాటు ధోరణిలో రిటర్న్స్ అందిస్తాయి. - ఆయా మార్గాల ద్వారా మీరు మంచి ఆర్థిక లక్ష్యాలను సాధిస్తారని భావిస్తున్నాను. మీరు బీమా పాలసీలు, ఆర్డీ, పీపీఎఫ్ వంటివి ఎప్పుడు... ఎంతవరకూ తీసుకున్నారు... తత్సంబంధ అంశాలు తెలపలేదు. అయితే ఆయా అంశాలకు సంబంధించి ఒక అంచనా ప్రకారం మీకు అందుబాటులో ఉంటుందనుకున్న డబ్బును పరిగణనలోకి తీసుకుని తాజా సూచన చేస్తున్నా. భవిష్యత్తు అవసరాలు ఎలా ఉండవచ్చన్నది చూస్తే... - రిటైర్మెంట్కు, విద్యకు, వివాహాల డబ్బు అవసరాలకు 6, 7.5, 6 శాతం చొప్పున ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరిగింది... - ప్రస్తుతం ఉన్న మీ ఆదాయ, వ్యయాలను, పొదుపులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఈ మ్యూచువల్ ఫండ్స్ను పరిశీలించవచ్చు... -
ప్రైవేటు కంపెనీపై జేపీసీ కన్నెర్ర
న్యూఢిల్లీ: భూ సేకరణ బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ముందు ప్రైవేట్ కంపెనీ తరఫు ప్రతినిధి సొంత అభిప్రాయాలను వ్యక్తం చేయడాన్ని కమిటీలోని విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్, భూమి అధికార్ ఆందోళన్, శ్రీ సమయ, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ, పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థల ప్రతినిధులను జేపీసీ ముందు మంగళవారం భూ బిల్లుపై తమ అభిప్రాయాలు, సూచనలు అందించేందుకు ఆహ్వానించారు. వారిలో ముంబైకి చెందిన శ్రీ సమయ అనే ప్రైవేటు సంస్థ ఎండీ బిల్లుకు అనుకూలంగా మాట్లాడుతుండగా కాంగ్రెస్, టీఎంసీ, బీజేడీ, లెఫ్ట్ తదితర విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల దృష్టితో వచ్చే ప్రైవేటు సంస్థలను, ప్రైవేటు వ్యక్తులను జేపీసీ ముందుకు అనుమతించకూడదని వాదించారు. శ్రీ సమయ కంపెనీ నిర్మాణ రంగంలో ఉందన్నారు. విశ్వసనీయ సంస్థల తరఫున వచ్చే ప్రతినిధుల సూచనలు స్వీకరించేందుకు సిద్ధమే కానీ, వ్యక్తిగత లబ్ధి కోసం వచ్చే వారిని అనుమతించడం సరికాదని జేపీసీ చైర్మన్ ఎస్ఎస్ అహ్లూవాలియాకు స్పష్టం చేశారు. మిగతా ప్రజాస్వామ్య, రైతు సంఘాల విషయంలో వారు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కాగా, యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ సేకరణ చట్టంలో ఎన్డీయే సర్కారు తలపెట్టిన వివాదాస్పద సవరణలపై కేంద్రం వివరణ ఇవ్వాలని జేపీసీ ముందు మంగళవారం హాజరైన పలు స్వచ్చంధ సంస్థలు, రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. దానివల్ల భూ బిల్లుపై సామాన్యుల్లో నెలకొన్న అనుమానాలు, గందరగోళం తొలగిపోతాయన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజే తమ నివేదికను సభ ముందుంచాలని జేపీసీ భావిస్తోంది. అందుకని ఇకపై వారానికి రెండు రోజులు సమావేశం కావాలని నిర్ణయించింది. జూలై రెండు, లేదా మూడో వారంలో వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశముంది. -
బాండ్ల ద్వారా ఎయిర్టెల్ బిలియన్ డాలర్ల సమీకరణ
న్యూఢిల్లీ : టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ పదేళ్ల కాల పరిమితి బాండ్ల జారీ ద్వారా అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి 1 బిలియన్ డాలర్లు సమీకరించింది. ఈ నిధులను పెట్టుబడి వ్యయాల కోసం వినియోగించనుంది. 66 శాతం బాండ్లను అమెరికా ఇన్వెస్టర్లకు, 18 శాతాన్ని యూరప్, 16 శాతాన్ని ఆసియా ఇన్వెస్టర్లకు కేటాయించినట్లు ఎయిర్టెల్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక దేశీ ప్రైవేట్ కంపెనీ.. బాండ్ల జారీ ద్వారా ఇంత పెద్ద మొత్తాన్ని సమీకరించడం ఇదే ప్రథమం. ఎయిర్టెల్ గతేడాది డెట్ మార్కెట్ నుంచి 2.5 బిలియన్ డాలర్లు సమీకరించింది. -
అసిన్ ప్లాట్ వేలానికి కోర్టు ఆదేశం
నటి అసిన్ ప్లాట్ వేలానికి కోర్టు ఆదేశించింది. తమిళ, తెలుగు భాషల్లో అగ్ర నాయకిగా వెలుగొందిన నటి అసిన్. గజనీ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత దక్షిణాదిపై దృష్టి సారించారు. అసిన్కు ప్రస్తుతం బాలీవుడ్లో అవకాశాలు అంతంతమాత్రమే. కాగా, కేరళలోని కొచ్చి సమీపంలోని రవిపురంలో అసిన్కు డబుల్బెడ్ రూం ఫ్లాట్ ఉంది. దీని అలంకార బాధ్యతల్ని కొచ్చికి చెందిన ఓ ప్రైవేటు సంస్థ తీసుకుంది. అందుకుగాను రూ.పది లక్షలు ఖర్చయినట్టు సమాచారం. ఈ మొత్తాన్ని అసిన్ చెల్లించ పోవడంతో ఆ సంస్థ నిర్వాహకురాలు జయలక్ష్మి ఎర్నాకులం న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయ స్థానం ఈ నెల 14వ తేదీలోపు పది లక్షల రూపాయలు కోర్టులో చెల్లించాలని ఆదేశించింది. చెల్లించని యెడల, ఆమె ఇంటిని వేలం వేయాలని పేర్కొంది. -
నకిలీ చెలామనీ
ఈ ఇద్దరే కాదు జిల్లాలో రోజూ ఇలాంటి అనుభవాలు ఎదుర్కొంటున్న వారెందరో... ఫిర్యాదు చేస్తే లేనిపోని తలనొప్పులు వస్తాయేమోనని ఎవరికి వారు మిన్నకుంటున్నారు. అందుకే ఇలాంటి ఘటనపై పెద్దగా కేసులు నమోదు కాకున్నా నకిలీ నోట్ల చెలామణి మాత్రం విస్తృతమైంది. వినుకొండకు చెందిన వినీల్కుమార్ ఓ ప్రయివేటు సంస్థలో చిరుద్యోగి. పోటీ పరీక్షలకు సిద్ధమతున్న తన మేనకోడలిని వెంటబెట్టుకుని కోచింగ్ సెంటర్కు వెళ్లాడు. రెండు నెలల శిక్షణ కోసం రూ.8 వేల ఫీజు చెల్లించాడు. తాను ఇచ్చిన రూ.500 నోట్లలో మూడు నకిలీవని కోచింగ్ సెంటర్ నిర్వాహకులు చెప్పగా విని వినీల్ నోరెళ్లబెట్టాడు. తాను ఇక్కడికి వస్తూ ఏటీఎం సెంటర్లో ఆ డబ్బు డ్రా చేశానని చెప్పినా వినకపోవడంతో ఆ నోట్లు తీసుకుని మరో రూ.1,500 ఇచ్చి వెనుదిరిగాడు. ఇటీవల పొలం అమ్మిన డబ్బుతో భార్యకు బంగారు గొలుసు చేయిద్దామని శ్రీనివాసరావు ప్రముఖ జ్యూవెలరీ దుకాణానికి వెళ్లాడు. దాదాపు రెండున్నర లక్షల రూపాయల విలువైన హారం ఆర్డర్ ఇచ్చాడు. అడ్వాన్సగా రూ.50 వేలు చెల్లించాడు. కౌంటర్ లోని మెషిన్లో డబ్బు లెక్కించిన గుమాస్తా అందులో రూ.500 నోట్లు నాలుగింటిని శ్రీనివాసరావుకు తిరిగిచ్చేసి, వేరే నోట్లు ఇవ్వమని కోరాడు. నకిలీవని గుర్తించడానికి కూడా వీల్లేనంతగా ఉన్న ఆ నోట్లు తాను పొలం రిజిస్ట్రేషన్ చేసిన రోజు కొనుగోలుదారుల నుంచి అందుకున్నవే. గుంటూరు క్రైం : జిల్లాలో రాష్ర్ట రాజధాని ఏర్పాటు నిర్ణయం మంచితోపాటు చెడునూ మోసుకొస్తోంది. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో భూముల క్రయవిక్రయాలు పెరిగాయి. కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరుగుతున్నాయి. వీటితో పాటే నకిలీ నోట్లు కూడా పెద్ద మొత్తంలో చేతులు మారుతున్నాయి. ఒకరి నుంచి మరొకరికి చేరి చెలామణి అవుతున్నాయి. వడ్డీ వ్యాపారులు, కమిషన్ దుకాణాల వద్దే కాకుండా బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల నుంచి కూడా నకిలీ నోట్లు వస్తుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆర్థిక సమస్యల కారణంగా అధిక వడ్డీలకు వడ్డీ వ్యాపారుల నుంచి డబ్బు తీసుకుని కూడా మోసపోతున్నారు. ఆ డబ్బులో నకిలీ నోట్లు ఉండటంతో అవాక్కవుతున్నారు. అదేవిధంగా ఏటీఎంల నుంచి నగదు డ్రా చేసిన సందర్భాల్లో నకిలీ నోట్లు రావడాన్ని గుర్తించి, ఖాతాదారులు లబో దిబోమంటున్నారు. నకిలీ కరెన్సీ కూడా అసలు నోట్లు మాదిరిగానే వుండటంతో వాటిని గుర్తించలేక సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకు అధికారులను సంప్రదించినా ప్రయోజనం లేకపోవడం.. పోలీసుల వద్దకు వె ళ్లి ఫిర్యాదు చేసేందుకు బాధితులు జంకుతుండటంతో ఈ వ్యవహారం చాపకింద నీరులా విస్తరిస్తోంది. పెద్దగా నిఘా కూడా లేకపోవడంతో నకిలీ కరెన్సీ జిల్లాలో హల్చల్ చేస్తోంది. ఈ ఏడాదిలో జిల్లా వ్యాప్తంగా కేవలం ఐదు కేసులే నమోదయ్యాయి. చిరువ్యాపారులు, కూలీలే లక్ష్యం... వ్యాపార అవసరాలకు డ బ్బు కోసం తమను ఆశ్రయించే చిరు వ్యాపారులకు అసలు నోట్లతో పాటు కొన్ని నకిలీవి కలిపి ఇస్తూ వడ్డీ వ్యాపారులు మోసగిస్తున్న సందర్బాలు ఉన్నాయి. అవి ప్రజల చేతుల మీదుగా చెలామణి అవుతుండటంతో వీరి దందా మూడు అసలు నోట్లు ఆరు నకిలీ నోట్లు అన్న చందంగా దర్జాగా సాగిపోతోంది. ఈ వ్యవహారం గుంటూరు మేడికొండూరు మండలం, పేరేచర్ల, నరసరావుపేట, వినుకొండ, పిడుగురాళ్ళ, దాచేపల్లి, మాచర్ల, ప్రాంతాల్లో ఎక్కువగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లో దినసరి కూలీలు, ఉపాధి కోసం వలస వచ్చిన ఇతర రాష్ట్రాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని కొందరు వడ్డీ వ్యాపారులు నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నట్లు గతంలో ఫిర్యాదులు వచ్చాయి. స్పెషల్ బ్రాంచ్ అధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు చేసి, కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించిన ఘటనలు ఉన్నాయి. శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న పోలీసులతోపాటు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండి నకిలీ నోట్ల చెలామణీని అరికట్టాల్సిన అవసరం ఉంది. -
భూసేకరణకు ‘ఎస్ఐఏ’ తప్పనిసరి
పునరావాస చట్టం’ పై సదస్సులో ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శ్రీదేవి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూసేకరణ ప్రక్రియకు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్(ఎస్ఐఏ)ను నిర వహించాల్సిందేనని రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కమిషనర్ టి.కె.శ్రీదేవి స్పష్టం చేశారు. భూసేకరణ చట్టం మేరకు బాధితులకు న్యాయమైన పరిహారం లభించేలా చూడాలన్నారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవనరుల అభివృద్ధి విభాగంలో రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ చట్టం 2013, తెలంగాణ ప్రభుత్వ నిబంధనలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు, భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోషల్ ఇంపాక్ట్ అసెసెమెంట్ పర్యవేక్షణ, వివిధ శాఖల మధ్య సమన్వయ బాధ్యతలను ఆర్అండ్ఆర్ విభాగానికి ప్రభుత్వం అప్పగించిందని చెప్పారు. భూసేకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆమె వివరించారు. రెండువేల ఎకరాలకు మించి ఏదైనా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ భూమిని సేకరిస్తే తప్పనిసరిగా ఆర్అండ్ ఆర్ చట్టం కింద పరిహారం, పునరావాసం కల్పించాల్సిందేనన్నారు. సేకరించిన భూమిలో వ్యవసాయ భూమి 15 శాతానికి మించొద్దని చెప్పారు. భూసేకరణను పారదర్శకంగా పూర్తిచేయాలని ఆమె సూచించారు. జిల్లా కలెక్టర్లకు సర్వాధికారాలు.. భూసేకరణకు సంబంధించి బాధితులకు పరిహారం, పునరావాసం కల్పించే విషయంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే అధికారాలన్నింటినీ తాజాగా జిల్లా కలెక్టర్లకే అప్పగించిందని కమిషనర్ తెలిపారు. -
బందరులో మెరిసిన ‘ప్రిన్స్’
ప్రముఖ సినీ హీరో మహేష్బాబు శనివారం నగరానికి వచ్చారు. బందరు రోడ్డులోని హోటల్ గేట్వేలో ఓ ప్రయివేటు సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మధ్నాహం 12.30 గంటలకు వచ్చిన మహేష్ రెండు గంటలు ఇక్కడే ఉన్నారు. అనంతరం నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. మహేష్ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో హోటల్ వద్ద కోలా హలం నెలకొంది. -
చుక్కలు చూపిన మందు!
పాలకొండ రూరల్:‘మా డ్రాప్స్ వేసుకుంటే పిల్లల్లో ధాతుపుష్టి ఏర్పడుతుంది. ఆకలి పెరుగుతుంది. శారీరక ఎదుగుదల బాగుంటుంది. రూ. 13 చెల్లిస్తే.. ఓ హెల్త్ కార్డు ఇస్తాం. నాలుగు వారాలు డ్రాప్స్ వేస్తాం’.. గత రెండు రోజులుగా పాలకొండ నగర పంచాయతీ, మండల పరిధిలోని ప్రధాన కూడళ్లలో ఓ ప్రైవేట్ సంస్థ చేసిన ప్రచారం స్థానికులను బాగా ఆకట్టుకుంది. బుధవారం సుమారు 67 మంది పిల్లలకు వారి తల్లిదండ్రులు ఈ డ్రాప్స్ వేయించారు. అయితే కొన్ని గంటల్లోనే పరిస్థితి తిరగబడింది.. చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి వంటి బాధలతో పిల్లలు పడుతున్న బాధ చూసి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పిల్లలను పట్టుకొని పాలకొండ ఏరియా ఆస్పత్రికి పరుగులు తీశారు. రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్దసంఖ్యలో పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకోవడంతో అక్కడ వాతావరణం మారిపోయింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ అయి న చిన్నపిల్లల వైద్య నిపుణుడు రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో వారందరినీ పరీక్షించి కడుపునొప్పితో కూడిన అస్వస్థతగా నిర్థారించి చికిత్స అందించారు. ఎటువంటి ప్రమాదం లేదని తేల్చడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఆస్పత్రికి వచ్చిన వారిలో ఎన్.చరణ్(2), ఎన్.గోపి(4), సంజన(5), శ్రీలత(1)తో పాటు 33 మంది చిన్నారులు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ ఆయుర్వేదానికి చెందిన ఈ డ్రాప్స్ కొందరికి పడవచ్చు.. కొందరికి పడకపోచ్చని చెప్పారు. ఆ విషయం నిర్థారించుకోకుండా వేయడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. విచారణ జరిపిస్తాం:డీఎంహెచ్వో విస్తృత ప్రచారం చేసి, పిల్లలకు డ్రాప్స్ వేసిన శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఈ సంస్థకు అనుమతులు ఉన్నాయా? అన్న విషయమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి(డీఎంహెచ్వో) డాక్టర్ శ్యామలను ప్రశ్నించగా ఈ తరహా సంస్థ గూర్చి తమకేమీ సమాచారం లేదన్నారు. దీనిపై స్థానిక అధికారులతో చర్చిస్తామని, విచారణ కూడా చేపడతామన్నారు. స్థానిక పోలీసులను సంప్రదించగా ఏరియా ఆస్పత్రి నుంచి తమకు సమాచారం లేదని, వైద్యులు సమాచారం అందిస్తే మెడికో లీగల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ ఎల్.చంద్రశేఖర్ చెప్పారు. ఈ తరహా సంస్థలు, గుర్తింపు లేని వైద్య బృందాలు ఇచ్చే వ్యాక్సిన్లు, డ్రాప్స్ వేసుకునేముందు ఒకటికి వందసార్లు ఆలోచించాలని, వెద్యుల సూచనలు తీసుకోవాలని ఏరియా ఆస్పత్రి వైద్యులు సూచించారు. అవి బాల్కాల్విన్ డ్రాప్స్ కాగా డ్రాప్స్ వేసిన సంస్థ ప్రతినిధి ఈశ్వరి, మరో అమ్మాయిని ‘సాక్షి’ ప్రశ్నించగా శ్రీకాకుళంలోని కృష్ణాపార్కు వద్ద నుంచి హెల్త్కేర్ సెంటర్ నుంచి వచ్చామని చెప్పారు. పాల కొండ పట్టణంతో పాటు మండల పరిధిలో ప్రచారం చేసి బాల్కాల్విన్(కాల్షియం) డ్రాప్స్ వేశామని వివరించారు. 1-5 ఏళ్ల పిల్లలకు ఒక డ్రాప్, 5-10 మధ్య వారికి రెండు డ్రాప్స్, 10-15 మధ్య వారికి మూడు డ్రాప్స్ చొప్పున నాలుగు వారాలపాటు వేయాల్సి ఉంటుందన్నారు. అయితే పిల్లలు ఎందుకు అస్వస్థతకు గురయ్యారో అర్థం కావడంలేదని.. ఇంతకుముందు చాలా చోట్ల వేసినా ఇటువంటి సమస్య ఎదురుకాలేదన్నారు. -
ప్రైవేట్ కంపెనీతో మంత్రి డీకే కుమ్మక్కు
మాజీ సీఎం కుమారస్వామి జాతీయ రహదారిని నిర్బంధించిన గోరూరు గ్రామస్తులు బెంగళూరు: మంత్రి డీకే శివకుమార్ ఒక ప్రైవేట్ కంపెనీలతో కుమ్మక్కై గోరూరు ప్రాంతంలో చెత్త డంపింగ్ చేయడానికి యత్నాలు చేస్తున్నారని మాజీ సీఎం, జేడీఎస్ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి ఆరోపించారు. శనివారం ఆయన గోరూరు గ్రామస్తులు జాతీయ రహదారి నిర్బంధించిన విషయం తెలుసుకుని అక్కడి చేరుకుని మాట్లాడారు. ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ఈ పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటున్న గ్రామస్తులు ఆనారోగ్యాలకు గురి అవుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటు చేయకూడదని శుక్రవారం శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న మహిళలు, వృద్ధులు, పిల్లలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి ప్రతాపం చూపించారని మండిపడ్డారు. మహిళలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారని తెలుసుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వెంటనే ఈ గ్రామస్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సందర్బంలో స్థానిక గ్రామస్తులు జాతీయ రహదారిపై రెండు గంటల పాటు ధర్నా చేసి రాష్ట్ర మంత్రి డి.కే. శివకుమార్ దిష్టిబొమ్మ దగ్దం చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోయినా ఇక్కడ చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చెయ్యడానికి అంగీకరించమని మాగడి తాలుకాలోని పలు ప్రాంతాలలో ఉన్న గ్రామస్తులు తేల్చి చెప్పారు. ధర్నాలో బండేమఠాధిపతి బసవలింగస్వామీజి, మహంతేషస్వామీజి, చిలుమమఠస్వామీజి, శాసన సభ్యుడు డాక్టర్ శ్రీనివాసమూర్తి, ఎంఎల్సీ, కన్నడ సినీ నిర్మాత ఇ. కృష్ణప్ప, స్థానిక జేడీఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
వానర ప్రేమికుడు
జీవ దయ కోతులను చూసి భయపడడమో, భయపెట్టడమో, వాటిని అల్లరి పెట్టడమో చాలా మంది చేసే పని. ఆ యువకుడు మాత్రం కోతిచేష్టల వైపు కాదు కోతుల కష్టాల వైపు దృష్టి సారించాడు. అవి ఆకలితో ఉన్నా, గాయపడినా, ఏ కష్టంలో ఉన్నా... వాటి గురించి ఆలోచించడమే కాదు అండగా నిలబడుతున్నాడు. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పూండికి చెందిన పిడబ్ల్యూడి అధికారి నీలమేఘం కుమారుడు వెంకటేశన్ ఓ ప్రైవేటు కంపెనీలో సీనియర్ ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నాడు. నీలమేఘం పూండి రిజర్వాయర్ దగ్గర ఉద్యోగం చేసేవాడు. ఆయనకు భోజనం తీసుకు వెళ్ళే సమయంలో వానరాలు ఆహారం కోసం పడుతున్న కష్టాలు వెంకటేశన్ను కంటతడి పెట్టించాయి. ‘మూడు వేల మందికి పైగా ప్రజలు నివాసం వుంటున్న ప్రాంతంలో కనీసం యాభై వానరాలకు తిండి పెట్టలేరా?’ అని మనసులో బాధ పడ్డాడు. రోజుకు కనీసం వంద రూపాయల వరకు ఖర్చు పెట్టి వాటి ఆకలి ఎంతో కొంత తీర్చేవాడు. అయినా ఎక్కడో అసంతృప్తి. ఇది సరిపోదని... రోజుకు కనీసం 50 కోతుల ఆకలి అయినా తీర్చాలనుకున్నాడు. తాను చేస్తున్న హోంగార్డు ఉద్యోగం ద్వారా వచ్చే వేతనం సరిపోకపోవడంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రైవేటు ఉద్యోగంలో చేరడంతో పాటు ప్రతి రోజు మూడు గంటల పాటు ఎలక్ట్రికల్ వైరింగ్ పనులను పార్ట్టైమ్గా చేసి తద్వారా వచ్చే ఆదాయాన్ని వానరాల కోసం ఖర్చు చేయడం ప్రారంభించాడు వెంకటేశన్. ‘‘మనం జల్సాల కోసం వినియోగించే మొత్తంలో కొంత భాగాన్ని కోతుల కోసం వినియోగిస్తే ఎంతో పుణ్యం వుంటుంది. ఒక వ్యక్తి ఒక వానరాన్ని దత్తత తీసుకుంటే మంచిది’’ అంటున్న వెంకటేశన్ నాలుగు సంవత్సరాల క్రితం ఇంటి వద్దే చిన్నగుడిసె వేసి కోతులను పెంచాడు. బ్లూక్రాస్ నుండి ఇబ్బందులు వస్తాయని కొందరు భయపెట్టారు. మరికొందరు ‘‘ఈ కోతుల గోల ఏమిటి?’’ అని గొడవకు దిగారు. దీంతో ఇంటి పక్కనే వున్న గుడిసెను ఖాళీ చేసి వేరే ప్రాంతంలో వాటి బాగోగులను చూడడం ప్రారంభించాడు. రాముడు, లక్ష్మీ, పెరుమాళ్, శివ, అజిత్, జిమ్మీ... మొదలైనవి వెంకటేశన్ పెంచుతున్న కోతుల పేర్లు. బంధువులు, గ్రామస్థులు ఇలా అందరూ వ ద్దని వారించినా నాలుగు సంవత్సరాల నుండి వానరాల సేవలో తరిస్తూ తన ఆత్మబంధువులు వానరాలే అని చెప్పుకుంటున్న వెంకటేశన్ను ఆదర్శంగా తీసుకుని రోజుకు ఒక పూటైనా ఒక జంతువుకు అన్నం పెట్టాలని నిర్ణయించుకుందాం. మూగప్రాణుల కోసం చేసే ఏ స్వల్ప కార్యమైనా అంతర్గతమైన శక్తిని మేల్కొలిపి హృదయాన్ని బలోపేతం చేస్తుందన్న విషయాన్ని గ్రహిద్దాం. - కోనేటి వెంకటేశ్వర్లు, తిరువళ్లూరు, తమిళనాడు -
కోల్ ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకులను ఈ-ఆక్షన్ ద్వారా ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలన్న నిర్ణయంతో రూపొందించిన ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం ఆమోదం తెలిపారు. ఆర్డినెన్స్కు కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించింది. అవకతవకల అభియోగాలతో 1993 నుంచి జరిగిన 214 బొగ్గు బ్లాకుల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ను రూపొందించింది. ప్రైవేటు కంపెనీల వినియోగం కోసం సదరు కంపెనీలకు ఈ-ఆక్షన్ ద్వారా బొగ్గు గనులను కేటాయించేందుకు, కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వరంగ సంస్థలకు నేరుగా కేటాయింపులు జరిపేందుకు వీలుగా రూపొందించిన ఈ ఆర్డినెన్స్ను విద్యుత్ సంస్కరణల్లో ప్రభుత్వం వేసిన ముందడుగుగా అభివర్ణిస్తున్నారు. కాగా, వాణిజ్య ప్రాతిపదికన బొగ్గుగనుల తవ్వకానికి ప్రైవేటు సంస్థలకు త్వరలోనే అనుమతి ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మరోవైపు ప్రైవేటు కంపెనీలకు ఈ-ఆక్షన్ ద్వారా బొగ్గు బ్లాకులను కేటయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగేందుకు సిద్ధమమతున్నాయి. -
హౌస్ కీపింగ్ మాయాజాలం
సాక్షి,తిరుమల: తిరుమలలో కాటేజీల పరిశుభ్రత విషయంలో ప్రైవేట్ కంపెనీలు చేతులెత్తేశాయి. టీటీడీ విధించిన నిబంధనలు పాటించడం లేదు. హౌస్కీపింగ్ పేరుతో ప్రైవేట్ కంపెనీలకు ఏటా రూ.2కోట్లు కేటాయించే సంబంధిత అధికారులు గదుల శుభ్రత తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. నాలుగు కంపెనీలకు ఏటా రూ.2 కోట్లపైగా కాంట్రాక్టు తిరుమలలో మొత్తం 6,800 గదులున్నాయి. వీటిని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ప్యాకేజీల కింద టీటీడీ విభజిచింది. వాటి శుభ్రత కోసం బీవీజీ (వెస్ట్ ), క్రిస్టల్ (నార్త్), పనోరమ (ఈస్ట్), ఆల్సర్వీస్ (సౌత్) ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. ఇందుకోసం ఏటా రూ.2 కోట్లకుపైగా కేటాయిస్తోంది. టీటీడీ నిబంధనల ప్రకారం ఆయా ప్రాంతాల్లోని కాటేజీలు, అతిథి గృహాల్లోని గదుల్లో పరిశుభ్రత చర్యలు, నిర్వహణ అంతా ఆ కంపెనీల నిర్వాహకులే చూడాలి. నిబంధనలకు పాతర గదుల శుభ్రత విషయంలో సంబంధిత ప్రైవేట్ సంస్థలు టీటీడీ నిబంధనల్ని ఏమాత్రం పాటించడం లేదన్న విమర్శలున్నాయి. ఖాళీ అయిన గదిని తిరిగి కేటాయించేందుకు అనువైన మార్గం కల్పించడంలో విఫలమవుతున్నాయి. గది, మరుగుదొడ్డి, స్నానాల గది శుభ్రత వినియోగించాల్సిన పరికరాలు, మాఫ్, సువాసనలతో కూడిన ఫినాయిల్, నాప్తలిన్ ఉండలు కూడా అందుబాటులో ఉంచడం లేదు. విరిగిన కొళాయిలు, లీకేజీ బెడత, బొద్దింకలు, నల్లుల గోల, పేరుకుపోయిన దుమ్ము, ధూళితో నిండిన గదులను వంద శాతం శుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకు భిన్నంగా కాటేజీల్లోని గదులు అపరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి. అదేమని కార్మికులను అడిగితే సంబంధిత కంపెనీలు అవసరమైన వస్తువులు, పదార్థాలు ఇవ్వడం లేదని కుండబద్ధలు కొడుతున్నారు. గదులు నిర్వహణ చేసే టీటీడీ రిసెప్షన్ సిబ్బంది కూడా సంబంధిత కంపెనీల ప్రతినిధులను నిలదీసిన సందర్భాలూ ఉన్నాయి. వీఐపీలు బస చేసే ప్రాంతాల్లో అన్నీ ఉన్నా..సామాన్య భక్తులు బసచేసే గదుల్లో మాత్రం పారిశుధ్యం బాగోలేదు. ఆచరణలోలేని కమిటీలు నాలుగు ప్యాకేజీల్లోని గదుల శుభ్రతను ఎప్పటికప్పుడు పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు రిసెప్షన్, హెల్త్, ఎఫ్ఎంఎస్ ఇంజినీరింగ్ విభాగాలతో కమిటీలు వేశారు. ఆచరణలో మాత్రం కమిటీలు పనిచేయడం లేదనే విమర్శలున్నాయి. గదుల్లో పారిశుధ్య లోపాలను గుర్తించి సంబంధిత కంపెనీల నుంచి జరిమానా వసూలు చేయాల్సిన కమిటీలు ఏమాత్రం పట్టీపట్టనట్టుగా ఉండడంతో సంబంధిత పారిశుద్ధ్య పనులు దక్కించుకున్న కంపెనీలకు కలసి వస్తోంది. -
కూలిన శ్లాబ్
హెచ్సీయూలో ఘటన త్రుటిలో తప్పిన ప్రమాదం నాలుగేళ్లలో రెండో ఘటన సెంట్రల్ యూనివర్సిటీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రూ.13.80 కోట్లతో నిర్మిస్తున్న జాకీర్ హుస్సేన్ లెక్చర్ హాల్ కాంప్లెక్స్ శ్లాబ్ బుధ వారం కుప్ప కూలింది. నాలుగేళ్ల క్రితం లైఫ్ సైన్స్ భవనం కూలిన ఘటన మరువక ముందే తాజాగా ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. తక్కువ సామర్థ్యం గల ఇనుపరాడ్లు ఉపయోగించడం, శ్లాబ్ భీంను ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. మధ్యాహ్నం సమయంలో భవన నిర్మాణం జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు అక్కడ పనులు చేస్తున్న కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. 2014 జనవరి నుంచి సీపీడ బ్ల్యూ పర్యవేక్షణలో బెంగుళూరుకు చెందిన ప్రైవేటు సంస్థ ఈ ఈ భవన నిర్మాణ పనులు చేస్తోంది. ఏప్రిల్ 2015 కల్లా పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఈ భవనంలో లెక్చర్ హాల్ కాంప్లెక్స్తో పాటు అకడమిక్ సపోర్ట్ సెంటర్, లైబ్రరీ, క్లాస్ రూంలు, సెమినార్ హాల్ వంటి 15 హాళ్లు నిర్మిస్తున్నారు. ఘటన స్థలాన్ని హెచ్సీయూ రిజిస్టార్ రామబ్రహ్మం, సీపీడబ్ల్యూ అధికారులు, మాదాపూర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఖురేషీ, విద్యార్థి, ఉద్యోగ సంఘ నాయకులు పరిశీలించారు. ఉన్నత స్థాయి విచారణ కోరతాం... శ్లాబ్ కూలిన ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కోరతాం. ఇన్చార్జి యూఈ ఏసీ నారాయణ హయాంలో చేపట్టిన అన్ని నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలి. నాసిరకంగా చేపట్టిన ఈ భవనం నిర్మాణం పూర్తయ్యాక కూలి ఉంటే భారీ ప్రాణ, ఆస్తినష్టం జరిగి ఉండేది. - బండి డానియల్, యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నాసిరకంగా నిర్మిస్తున్నారు... యూనివర్సిటీ భవన నిర్మాణాల్లో జరుగుతున్న అవకతవకలపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలి. విద్యార్థుల భవిష్యత్ను కాల రాసేలా నాసిరకంగా భవనాలు నిర్మిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. - వెంకటేష్ చౌహాన్, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు, హెచ్సీయూ -
‘ఫైన్’గా దోపిడీ!
రామారావు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. మధ్యాహ్నం విధులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. భార్య భోజనం వడ్డించింది. ప్లేట్లో అన్నం కలపడానికి ప్రయత్నించగా ముద్దముద్దగా తగిలింది. అన్నం ఇలా ఉందేటి... ఈ వండటమేంటి?.. అంటూ భార్యపై చిందులేశాడు. అరే.. నాపై చిందులేస్తారేంటండీ.. సూపర్ఫైన్ బియ్యమంటూ తెచ్చింది మీరే కదా?.. అప్పటికీ నీళ్లు తక్కువ వేసి వండాను. అయినా ఇలా అయ్యింది. నన్నేం చేయమంటారు?!.. అంటూ ఆవిడ కూడా అదేస్థాయిలో సమాధానమిచ్చింది. అంతే బిత్తరపోయిన రామారావు మౌనం వహించాడు.. కుటుంబాల్లో ఇలాంటి కలహాలకు బియ్యం పేరుతో జరుగుతున్న దోపిడీ కారణమవుతోంది. శ్రీకాకుళం అగ్రికల్చర్:జిల్లాలో పలువురు వ్యాపారులు సూపర్ ఫైన్, ఫైన్ రకం పేరుతో నాసిరకం బియ్యం అంటగటుతుండటంతో ప్రజలు మోసపోతున్నారు. కొందరు వ్యాపారులు, మిల్లర్లు ధనార్జనే ధ్యేయంగా రేషన్ బియ్యా న్ని పాలిష్ చేసి ఫైన్ రకంగా కనిపించేం దుకు కొన్ని రకాల పౌడర్లు, ఆయిల్ వాడి.. సూపర్ ఫైన్ రకం అని పేరుపెట్టి విక్రయిస్తున్నారు. అయితే వీటిలో కొంతమేరకు పాత బియ్యం, ఫైన్ రకం బియ్యం కల్తీ చేయడంతో వండిన అన్నం ముద్ద అయిపోతోంది. బియ్యం నాణ్యత, రకాలపై పెద్దగా అవగాహన లేని వినియోగాదారులు ఈ మాయలో పడి మోసపోతున్నారు. మరోవైపు భోజన హోటళ్లలో చాలా వరకు ఈ బియ్యాన్నే వినియోగిస్తున్నారు. గత క్టోబర్లో కురిసిన వర్షాలతో ఖరీప్లో దిగుబడి బాగా తగ్గింది. దీనికి తోడు ఫైన్ రకం ధాన్యం ధరలు కూడా అధికం. దీంతో మిల్లర్లు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించారు. రేషన్బియ్యం, దొడ్డ రకాలను పాలిష్ పట్టించి ఫైన్ రకంగా మార్చి విక్రయిస్తున్నారు. జిల్లాలో సన్న బియ్యం వాడేవారి సంఖ్య 15 లక్షలకు పైగా ఉంది. దాంతో రేషన్ షాపులో కొన్న బియ్యంలో అల్పాహారాల(ఇడ్లీ, దోసె, పొంగల్, వడియాలు ఇతరత్రా) తయారీకి వాడుకోగా మిగిలిన వాటిని స్థానిక వ్యాపారుల సహకారంతో తిరిగి మిల్లర్లకే అమ్ముతున్నారు. అన్నం కోసం మాత్రం సన్న బియ్యాన్ని మార్కెట్లో కొనుక్కుంటున్నారు. సన్న బియ్యాన్ని డిమాండ్ ఎక్కువగా ఉన్నా.. జిల్లాలో తగినంత పంట లేకపోవడంతో వ్యాపారులు, మిల్లర్లు నాసి రకం బియ్యాన్నే సన్న రకాలుగా చెలామణీ చేస్తున్నారు. మార్చేది ఇలా.. కార్డుదారుల నుంచి రేషన్ బియ్యాన్ని స్థానికంగా ఉండే వ్యాపారులు కిలో రూ. 10 రేటుకు కొనుగోలు చేస్తారు. దాన్ని మిల్లర్లకు కిలో రూ. 17కు విక్రయిస్తారు. ఆ బియ్యాన్ని మిల్లర్లు రకరకాల పౌడర్లు, ఆయిల్స్తో పాలిష్ పట్టించి సన్న బియ్యం అనిపించేలా మెరుగులు దిద్దుతారు. వీటిని మార్కెట్ పరిస్థితులను బట్టి కిలో రూ. 25 నుంచి 35 మధ్య విక్రయిస్తున్నారు. మరికొందరు పాలిష్ చేసిన ఈ బియ్యంలోనే కొంత మోతాదులో ఫైన్ బియ్యాన్ని కలిపి సూపర్ ఫైన్గా మారుస్తున్నారు. దీన్ని కిలో రూ. 45 వరకు విక్రయిస్తున్నారు. అధికారుల నిఘా లేకపోవడంతో ఈ ఘరానా మోసం దర్జాగా సాగిపోతోంది. -
ప్రైవేట్ కంపెనీలకు ఊరట
ఫాస్ట్ ట్రాక్... కొత్త కంపెనీల చట్టానికి త్వరలో సవరణలు న్యూఢిల్లీ: ప్రైవేట్ కంపెనీలపై పాలనా సంబంధ భారాన్ని తగ్గించే ఉద్దేశంతో కొత్త కంపెనీల చట్టంలోని కొన్ని నిబంధనలను సరళతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టంలో దాదాపు 13 సడలింపులను కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రతిపాదించింది. షేర్ క్యాపిటల్, ఓటింగ్ హక్కులు, ఆడిటర్, డెరైక్టర్ల నియామకం, పబ్లిక్ డిపాజిట్ల స్వీకరణపై నిషేధం, బోర్డు హక్కులు, డెరైక్టర్లకు రుణాలు, ఉన్నత యాజ మాన్య స్థాయి సిబ్బంది నియామకాలపై పరిమితుల నిబంధనలను సడలించాలని కార్పొరేట్ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఈ మేరకు రూపొం దించిన ముసాయిదా నోటిఫికేషన్పై ప్రజలు తమ సూచనలు, వ్యాఖ్యానాలను జూలై 1లోగా పంపాలనీ, తర్వాత నోటిఫికేషన్ను పార్లమెంటు ఉభయ సభల ముందుంచుతామని ఆ శాఖ ఓ సర్క్యులర్లో తెలిపింది. -
సివిల్స్లో సత్తాచాటిన రైతు బిడ్డ
- వేంపల్లె మహేంద్రకు 694 ర్యాంకు - ఐపీఎస్ లేదా ఐఆర్ఎస్కు ఎంపికయ్యే అవకాశం మదనపల్లె రూరల్: సివిల్స్ ఫలితాల్లో మదనపల్లె మండలానికి చెందిన రైతు బిడ్డ తంబా మహేంద్ర సత్తాచాటాడు. జాతీయస్థాయిలో 694వ ర్యాంకును సాధించాడు. మదనపల్లె మండలం వేంపల్లె పంచాయతీ తాలిపల్లెకు చెందిన రైతు కూలీ తంబా జగదీశ్వర్, కుప్ప మ్మ దంపతుల పెద్ద కుమారుడు మహేంద్ర. ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఇంటర్, డిగ్రీ మదనపల్లె బీటీ కళాశాలలో చదివారు. శ్రీవేంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రయివేటు సంస్థలో పనిచేస్తూ గత ఏడాది డిసెంబర్లో సివిల్స్ మెయిన్ పరీక్ష రాశారు. వాటి ఫలితాలు గురువారం వెలువడ్డాయి. 694వ ర్యాంకు సాధించారు. ఈయన ఐపీఎస్ లేదా ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్కు ఎంపికయ్యే అవకాశం ఉంది. 2010 నుంచి సివిల్స్కు ప్రిపేర్ అవుతూ మూడో ప్రయత్నంలో ఈ ర్యాంకు సాధిం చాడు. తమ గ్రామానికి చెందిన రైతుబిడ్డ సివిల్స్లో ర్యాంకు సాధించారని తెలుసుకుని గ్రామస్తులు హర్షాన్ని వెలిబుచ్చారు. చిన్ననాటి నుంచి చదువులో ప్రతిభ కనబర్చే మహేంద్ర కష్టపడి ఉన్నత చదువులు చదివాడని కుటుంబ సభ్యులు తెలిపారు. -
ప్రేమ వివాహం విషయంలో కిడ్నాప్ కేసు నమోదు
ఉంగుటూరు, న్యూస్లైన్ : ప్రేమ వివాహ విషయంలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి.. చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా, హత్య చేస్తామంటూ బెదిరించి వదిలివేసిన ఘటన ఉంగుటూరు మండలం తేలప్రోలులో జరిగింది. ఈ వ్యవహారం విజయవాడ పోలీసు కమిషనర్ వరకు చేరింది. ఆయన ఆదేశాల మేరకు కిడ్నాప్కు పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ జి. వసంతబాబు గురువారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం తేలప్రోలుకు చెందిన చిటికల కిరణ్, గుంటూరు జిలా ్ల గురజాల మండలం పల్లేగుంత కు చెందిన బండారుపల్లి గౌతమి (24) హైదరాబాదులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి మే 17న పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న గౌతమి అన్నయ్య బండారుపల్లి ఈశ్వరరావు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు రామ్మోహనరావు, మరికొందరు బుధవారం సాయంత్రం సుమోలో కిరణ్ ఇంటికి వెళ్లారు. తాము పోలీసులమని గుంటూరు జిల్లా నుంచి వచ్చామని కిరణ్ కుటుంబ సభ్యుల్ని నమ్మించారు. వారు తీసుకువచ్చిన సుమోలో కిరణ్ తండ్రి రాజబాబు, సోదరుడు కుమారుడు శ్రీనివాసరావులను ఎక్కించుకుని ఏలూరు తీసుకెళ్లారు. గుంటూరు తీసుకువెళ్లాల్సిన తమను ఏలూరు తీసుకువెళ్లడంతో అనుమానం వచ్చిన రాజ బాబు, శ్రీనివాసరావులు వారిని ప్రశ్నించారు. అప్పుడు వాస్తవ విషయాలు చెప్పి.. మా అమ్మాయిని మాకు అప్పగించాలని, పెళ్ళిచేసుకున్న ఆధారాలు చూపాలంటూ రాజబాబును, అన్నయ్య కుమారుడు శ్రీనివాసరావులను తీవ్రంగా కొట్టి బెదిరించారు. శ్రీనివాసరావుకు, నిందితులకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరుగుతుండటంతో శ్రీనివాసరావును మార్గంమధ్యలో కిందకు తోసేసి, రాజబాబును బలవంతంగా గుంటూరు తీసుకువెళ్లిపోయారు. వాహనం ప్రధాన రహదారిలో వెళితే రహదారులపై ఉండే సీసీ కెమెరాలలో రికార్డు అవుతుందని భావించిన నిందితులు కెమెరాలకు చిక్కకుండా గుంటూరు చేరినట్లు తెలిసింది. సీపీని ఆశ్రయించిన ప్రేమజంట తన తండ్రిని రాజబాబు, వరుసకు సోదరుడైన శ్రీనివాస్ను కిడ్నాప్ చేసినట్లు తెలుసుకున్న కిరణ్ గౌతమితో కలిసి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసుల్ని ఆశ్రయించారు. ఆయన పోలీసుల్ని అప్రమత్తం చేసి కేసు నమోదు చేయించారు. మేజర్లయిన నూతన జంటకు రక్షణ కల్పించాలని ఆదేశించారు. పోలీసులు రంగంలోకి దిగారని తెలుసుకున్న నిందితులు రాజబాబును మంగళగిరి వద్ద గురువారం సాయంత్రం తీసుకువచ్చి వదిలి వేశారు. ఆయన అక్కడ నుంచి తేలప్రోలు చేరుకున్నారు. కులాంతర వివాహం చేసుకోవడం వల్లనే కిడ్నాప్ :రాజబాబు తమ కుమారుడు కులాంతర వివాహం చేసుకోవటం వల్లనే కిడ్నాప్కు గురైనట్లు కిరణ్ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేలప్రోలు చేరుకున్న రాజబాబు తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ కుమారుడు ప్రేమించి వివాహం చేసుకున్న విషయం అమ్మాయి బంధువులకు తెలిపామన్నారు. గుంటూరు పోలీసులు ఇంటికి వచ్చి, తమను నమ్మించి సుమోలో ఎక్కించుకుని తీసుకువెళ్ళారని తెలిపారు. వాహనంలో తమను తీసుకువెళ్లుతూ పోలీసులు చిక్కకుండా ఉండేం దుకు సీసీ కెమెరాల్లో నమోదు కాకుండా ఉండేం దుకు అడ్డదారుల్లో తీసుకువెళ్లాలని నిందితులు మాట్లాడుకున్నారని వివరించారు. గుంటూరు వెళ్లిన తరువాత తమ పిల్లను తమ వద్దకు పంపించాలని, లేకపోతే చంపేస్తామంటూ బెదిరించారని రాజబాబు పేర్కొన్నారు. గౌతమి ఫిర్యాదు మేరకు ఉంగుటూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. -
మళ్లీ తెరపైకి ఎక్స్ప్రెస్ హైవే పనులు
మొదలైన రోడ్డు సర్వే ప్రక్రియ ఐదు మీటర్ల ఎత్తులో, 300 మీటర్లతో రోడ్డు నిర్మాణం ఆరు నెలల్లో పూర్తి కానున్న సర్వే మార్కింగ్ రూ.4,800 కోట్ల అంచనాతో ప్రాజెక్టు పలమనేరు, న్యూస్లైన్: బెంగళూరు నుంచి చెన్నై వరకు పలమనేరు మీదుగా నిర్మించనున్న ఎక్స్ప్రెస్ హైవే (6 ట్రాక్రోడ్)కు సంబంధించి సర్వే పనులు ప్రారంభమయ్యాయి. అడిషనల్ జాయింట్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి పర్యవేక్షణలో బెంగళూరుకు చెందిన ప్రైవేటు కంపెనీ ఇంజనీర్లు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు మండలంలోని జల్లిపేట, వెంకటేష్పురం కాలనీ, కొలమాసనపల్లె, బేలుపల్లె క్రాస్ గ్రామాల సమీపంలో ఆదివారం మార్కింగ్లు ఇచ్చారు. ఈ ప్రక్రియ మరో ఆరునెలలపాటు జరుగుతుందని సర్వే చేపట్టేందుకు వచ్చిన అధికారులు చంద్రారెడ్డి, గిరీశ్వరయ్య తెలిపారు. విమాన మార్గం ఆధారంగా నిర్మితం కానున్న ఈ రోడ్డు భూమికి ఐదు మీటర్ల ఎత్తులో, 300 మీటర్ల వెడల్పుగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం బంగారుపాళ్యం, పలమనేరు ప్రాంతాల్లో రెండు బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయని వారు పేర్కొన్నారు. రూ.4,800 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు ఈజీఎస్ ఇండియా ఇంటర్నేషనల్ అనే కంపెనీ ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) సౌజన్యంతో రూ.4,800 కోట్ల వ్యయంతో ఎక్స్ప్రెస్ హైవేను చేపట్టేందుకు రెండేళ్ల క్రితం ముందుకొచ్చింది. ఈ రోడ్డు పనులకు అవసరమైన సర్వే, భూముల సేకరణకు సంబంధించి ఆ ప్రతినిధులు అప్పట్లోనే ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ఏడాది క్రితం ఇక్కడ భూమి పటుత్వ పరీక్షలను సైతం నిర్వహించారు. ఎలా నిర్మిస్తారంటే.. బెంగళూరు సమీపంలోని హొస్కోట నుంచి చెన్నై సమీపంలోని శ్రీపెరంబదూర్ వరకు 268 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఇది సిక్స్ట్రాక్ రహదారిగా ఐదు మీటర్ల ఎత్తు కల్గి రోడ్డుకు ఇరువైపులా ఏడుమీటర్ల వెడల్పుతో గ్రామీణ రహదారులకు అనుసంధానం చేస్తారు. బహుళ ప్రయోజనకారిగా ఈ రహదారిని ఉపయోగించుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలోని హొస్కోట, కోలారు, ముళబాగల్, మన రాష్ట్రంలోని బెరైడ్డిపల్లె, పలమనేరు రూరల్, బంగారుపాళ్యం, గుడిపాల మండలాల మీదుగా ఈ రహదారి తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబదూర్ వరకు నిర్మిస్తారు. మామూలు రోడ్ల మాదిరి కాకుండా ఆకాశమార్గం ఆధారంగా పాయింట్ టు పాయింట్ నిర్మాణం జరుగుతుంది. రోడ్డు నిర్మాణంతో లాభాలెన్నో.. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే రవాణా సౌకర్యాలు పెరిగి ఉపాధితో పాటు రైతులు పండించిన పంటలను ఇటు చెన్నై, అటు బెంగళూరుకు తరలిం చేందుకు వెసులుబాటు కలుగుతుంది. అంతేగాక ఈ రోడ్డుకు ఆనుకుని భవిష్యత్తులో కోట్లాది రూపాయల వ్యయంతో భారీ పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉందనే ప్రచారంతో స్థానికంగా భూముల విలువ ఇప్పటికే అమాంతం పెరిగింది. మరోవైపు చెన్నై-బెంగళూరుకు వంద కిలోమీటర్లు ప్రయాణదూరం తగ్గుతుంది. ఫలితంగా 2.30 గంటల్లో బెంగళూరు నుంచి చెన్నైకు చేరుకోవచ్చు. -
అశ్లీల సందేశాలు
పంపిస్తున్న సీఈఓ అరెస్ట్ బెంగళూరు, న్యూస్లైన్ : మహిళా ఉద్యోగినికి అశ్లీల సందేశాలు, బూతు ఎస్ఎంఎస్లు పంపిస్తున్న ఓ ప్రైవేట్ కంపెనీ సీఈఓని స్థానిక కమర్షియల్ స్ట్రీట్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే... భారత ఆర్మీలో 25 సంవత్సరాలు పనిచేసి 2006లో కల్నల్ హోదాలో ఉద్యోగ విరమణ పొందిన విజయ్బాత్రా(60), బెంగళూరులోని వెరిఫ్యాక్ట్ సర్వీసెస్ కంపెనీ సీఈఓగా 2011 నుంచి పనిచేస్తున్నారు. ఇదే కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతి(29)పై కన్నేసిన అతను నిత్యం వేధించేవాడు. ఆమె మొబైల్కు అసభ్య ఎస్ఎంఎస్లు, అశ్లీల దృశ్యాలు పంపించేవాడు. సహనం కోల్పోయిన యువతి ఈ విషయంపై విజయ్బాత్రాను నిలదీసింది. అప్పటి నుంచి ఆమెకు మరింత వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో కంపెనీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఫలితం లేకపోవడంతో ఉద్యోగం మానివేసి, మరో కంపెనీలో చేరింది. కంపెనీకి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మానివేయడంతో రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వకుండా యాజమాన్యం జాప్యం చేస్తూ వచ్చింది. విజయ్ బాత్రా వేధింపుల వల్లనే తాను ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉద్యోగం మానివేశానని, తనకు న్యాయం చేయాలని యాజమాన్యంను వేడుకున్నా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు విజయ్బాత్రాను అరెస్ట్ చేసి, బెయిల్పై విడుదల చేశారు. అయితే తన భార్యకు సందేశాలు పంపించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు పొరపాటుగా ఆమెకు వెళ్లాయని విచారణలో విజయ్బాత్రా పేర్కొన్నట్లు సమాచారం. సంఘటనకు సంబంధించి వాస్తవాలు కూపీ లాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
ముప్పుతిప్పలు
ఆధార్ హడావుడి అంతాఇంతా కాదు. సంక్షేమ పథకాలన్నింటికీ దీనితో ముడిపెట్టడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజానీకం అన్ని పనులు వదులుకుని రోడ్డున పడ్డారు. సరైన ఏర్పాట్లు చేపట్టకపోవడంతో లక్షలాది మంది ఆధార్ కార్డులు పొందేందుకు ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతం. సాక్షి, కర్నూలు: సంక్షేమ పథకాల లబ్ధిదారులు.. తెల్ల రేషన్కార్డుదారులు.. వంట గ్యాస్ వినియోగదారులు.. అందరికీ ఆధార్ సమస్యే. వచ్చే నెల నుంచి అన్నింటికీ ఆధార్ను తప్పనిసరి చేయడం ముప్పుతిప్పలు పెడుతోంది. నమోదు ప్రక్రియ ఓ పట్టాన కొలిక్కి రాకపోవడం సమస్యలకు కారణమవుతోంది. వేగవంతం చేసేందుకు వందకు పైగా శాశ్వత కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నా పురోగతి కరువైంది. ఆధార్ అనుసంధాన(సీడింగ్) ప్రక్రియ కూడా అధ్వానంగా మారింది. ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని అధికార యంత్రాంగం కసర్తు చేస్తున్నా ఆశించిన ఫలితాలు లేకపోవడం గమనార్హం. సామాజిక భద్రతా పింఛన్లకు సంబంధించిన ఆధార్ సీడింగ్ ప్రక్రియలోనూ ఇదే తరహా నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా పథకాలను లబ్ధిదారులకు ఎలా వర్థింపజేయాలో తెలియక అధికారులు తికమకపడుతున్నారు. వచ్చే నెల నుంచి జిల్లాలో సంక్షేమ పథకాలకు ఆధార్ను తప్పనిసరి చేశారు. అయితే ఆలోపు ఆధార్ ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాలేవీ పట్టించుకోకుండా అధికారులు ఆధార్ విషయంలో ముందడుగు వేస్తుండటం తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతోంది. జిల్లాలో 5,54,724 వంటగ్యాస్ కనెక్షన్లు ఉండగా.. 4,35,424 మంది నుంచి నగదు బదిలీ శాపమే నేను ప్రైవేట్ సంస్థలో గుమాస్తాగా పనిచేస్తున్నా. అమ్మానాన్నలతో పాటు భార్యను పోషిస్తున్నాను. నెలకు వచ్చే రూ.4వేలతో ఇంటి బాడుగ, కుటుంబ ఖర్చులు పోగా.. గ్యాస్ సిలిండర్కు రూ.1370 చెల్లించాలంటే ఎలా సాధ్యం. నగదు బదిలీ పథకం మాలాంటి వారికి శాపమనే చెప్పాలి. పైగా డెలివరీ సమయంలో సిలిండర్పై రూ.40 అదనంగా వసూలు చేస్తున్నారు. - రవికుమార్, కోవెలకుంట్ల ఆధార్ వివరాలు సేకరించారు. ఇందులో సుమారు 3,90,075 కనెక్షన్లకు ఎల్పీజీ సీడింగ్ పూర్తయింది. వీరంతా తమ ఆధార్ సంఖ్యలను సంబంధిత గ్యాస్ డీలర్లకు సమర్పించారు. వీరిలో 3,52,840 కనెక్షన్లకు బ్యాంకు సీడింగ్ పూర్తయింది. ఎల్పీజీ సీడింగ్ చేయించుకున్న వారంతా బ్యాంకు సీడింగ్ కూడా చేయించుకుంటేనే రాయితీ వర్తించనుంది. జిల్లా అధికారులు 57 శాతం ఎల్పీజీ సీడింగ్ పూర్తయినట్లు గొప్పగా చెబుతున్నా.. బ్యాంకు సీడింగ్ ఎందుకు తక్కువగా ఉందానే విషయంపై దృష్టి సారించడం లేదు. తాజాగా పెరిగిన ధరతో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.444లు. సీడిండ్ సక్రమంగా జరిగిన వారి బ్యాంకు ఖాతాల్లో రూ.926 రాయితీ జమ అవుతుంది. లేకపోతే పూర్తి మొత్తం చెల్లించాల్సి ఉంది. జిల్లా అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇప్పటికీ 1,19,299 వంటగ్యాస్ వినియోగదారులకు ఆధార్ లేదని తెలుస్తోంది. మరో 2,01,884 మందికి ఆధార్ ఉన్నా.. బ్యాంకు సీడింగ్ జరగలేదు. ఈ లెక్కన ఫిబ్రవరి నెలలో 3,21,183 మంది వినియోగదారులు వంట గ్యాస్ రాయితీకి దూరం కానున్నారు. ఆధార్-బ్యాంక్ సీడింగ్ పూర్తయ్యే వరకు వీరంతా పూర్తి మొత్తం చెల్లించి సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంది. ఫలితంగా వీరిపై నెలకు రూ.44 కోట్ల భారం పడనుంది. జిల్లాలో 55 శాశ్వత ఆధార్ సెంటర్లు కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్ : జిల్లాలో 55 శాశ్వత ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు చర్యలు చేపట్టారు. అన్ని ప్రభుత్వ పథకాల అమలుకు ఆధార్ను అనుసంధానం చేస్తుండటంతో ఆధార్ నమోదు శాశ్వత కేంద్రాలు అవసరమయ్యాయి. ఆధార్ నమోదు కార్యక్రమం నిరంతర ప్రక్రియగా మారడంతో మీ-సేవ కేంద్రాల్లోనే శాశ్వత ఆధార్ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నారు. మీ-సేవ కేంద్రాలలో ఆధార్ నమోదు ఫిబ్రవరి మొదటి వారం నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. గ్యాస్ వినియోగదారులు, స్కాలర్షిప్ విద్యార్థులు, రేషన్ కార్డులను ఆధార్తో నమోదు చేయడంలో జేసీ తీసుకున్న చొరవతో జిల్లా ప్రగతి పథంలో ఉంది. ఫిబ్రవరి 15లోగా వివరాలివ్వండి: కె.కన్నబాబు, జేసీ జిల్లాలో నగదు బదిలీ పథకం ఫిబ్రవరి నుంచి మొదలుకానుంది. ఫిబ్రవరి 15వ తేదీలోపు గ్యాస్ వినియోగదారులు డీలర్లకు ఆధార్ వివరాలను అందజేయాలి. లేకపోతే నగదు బదిలీ వర్తించదు. ఇప్పటికీ ఆధార్ నమోదు చేసుకోని వారి కోసం జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున శాశ్వత ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. రేషన్కార్డుల అనుసంధాన ప్రక్రియ నెమ్మదిగానే సాగుతోంది. ఎల్పీజీ గ్యాస్ డీలర్ల ద్వారా వినియోగదారుల వివరాలను సేకరించి.. ఎల్డీఎం ద్వారా బ్యాంకర్లకు అందజేస్తాం. పేదోడిపై భారం: మహదేవరావు, కోవెలకుంట్ల సైకిల్పై ఉరూరూ తిరుగుతూ బట్టల వ్యాపారం చేస్తున్నా. వచ్చే అరకొర సంపాదనతో తల్లి, భార్య, కుమార్తెను పోషిస్తున్నా. కూతురు టీటీసీ చదువుతోంది. ఇప్పటికీ కష్టంగా బతుకు బండి లాగిస్తున్నా. ఈ పరిస్థితుల్లో సిలిండర్కు ముందుగానే రూ.1370 చెల్లించాలంటే కష్టమవుతోంది. ఆధార్తో పేదల బతుకు మరింత దుర్భరం అవుతుంది. ప్రభుత్వం పునరాలోచించాలి. -
బెంబేలెత్తిస్తున్న కర్నూలు-బళ్లారి రహదారి
సాక్షి ప్రతినిధి, కర్నూలు/కోడుమూరు, న్యూస్లైన్: కర్నూలుకు చెందిన రమేష్ ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని హంపికి వెళ్లాలని సిద్ధమయ్యారు. ఇందుకోసం ఓ ప్రైవేట్ వాహనాన్ని బుక్ చేసుకున్నారు. బయలుదేరే ముందు వాహన డ్రైవర్ చెప్పిన సమాధానం వారిని ఆశ్చర్యపర్చింది. బాడుగనైనా వదులుకుంటాను కానీ.. కోడుమూరు మీదుగా రానంటే రానని మొండికేశాడు. ఆ రహదారిలో వెళితే వాహనం ఎందుకూ పనికిరాకుండా పోతుందని.. పైగా ఆ కుదుపులకు ఒళ్లంతా పులిసిపోతుందని తన గోడు వెళ్లబోసుకున్నాడు. మీకూ క్షేమం కాదని డ్రైవర్ వారించడంతో చివరకు వారంతా డోన్ మీదుగా తమ ప్రయాణాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. కర్నూలు-బళ్లారి రహదారిలో ప్రయాణమంటే ఎలా ఉంటుందో ఇదో ఉదాహరణ మాత్రమే. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు సైతం ఈ దారిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులకు హాజరవుతున్నారు. తమ తప్పు లేకపోయినా జరిగిపోయే ప్రమాదానికి ఎక్కడ బాధ్యులమవుతామోనని వారు నిత్య నరకం చూస్తున్నారు. గురువారం ‘సాక్షి’ బృందం ఈ రహదారిలో ప్రయాణించింది. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆదోని బస్సులో ఎక్కగా రెండు కిలోమీటర్లు దాటగానే అవస్థలు మొదలయ్యాయి. అడుగడుగునా మోకాల్లోతు గుంతలు.. కుదుపులతో బస్సుల్లోని ప్రయాణికులంతా తమ సీట్లలో నుంచి ఎగిరిపడుతున్నారు. పాలు పట్టినా.. జోల పాడినా చంటిబిడ్డ ఏడుపు ఆపకపోవడంతో సరోజ అనే మహిళ తల్లడిల్లింది. దుమ్ము లేస్తుండటంతో ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నడుమ రెండు గంటలు ప్రయాణించగా కోడుమూరుకు చేరుకున్నాం. అక్కడి నుంచి మరో రెండు గంటల ప్రయాణంతో ఎట్టకేలకు ఆదోనికి వెళ్లగలిగాం. అక్కడి నుంచి ఆలూరు నియోజకవర్గంలోని వందవాగిలి, ఎల్లార్తికి వెళ్లేందుకు మరో బస్సులో ప్రయాణించాం. కంకర తేలిన రోడ్డుపై ప్రయాణం అత్యంత కష్టంగా సాగింది. నాగన్న అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా టైర్ పగిలి గాయాలపాలవడం.. సిద్దప్ప అనే వ్యక్తి కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పంక్చరైంది. దీంతో ఆ వాహనాన్ని ఓ చెట్టుకింద పెట్టి ఆటోలో ఆదోనికి వెళ్లిన ఘటనలు కనిపించాయి. చివరకు వందవాగిలికి చేరుకునే సరికి.. హమ్మయ్యా వచ్చేశామనిపించింది. పర్సెంటేజీలకు జడిసి చేతులెత్తేసిన కాంట్రాక్టర్ రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని కర్నూలు-బళ్లారి మధ్య 30 మీటర్ల(డబుల్ లైన్) రోడ్డు వేసేందుకు ఐదేళ్ల క్రితం ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు అభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకొచ్చారు. రూ.120 కోట్లతో అంచనాలు రూపొందించగా.. కర్నూలు నుంచి దేవనకొండ వరకు 55 కి.మీ.ల రోడ్డు వేసేందుకు ఏపీఆర్డీసీ సంస్థ టెండర్లను ఆహ్వానించింది. 30 శాతం లెస్తో రూ.75 కోట్లకు పనులు దక్కించుకున్న రాణి కన్స్ట్రక్షన్స్ రోడ్డు నిర్వహణ పనులు మొదలు పెట్టింది. కోడుమూరు, ప్యాలకుర్తి, లింగందిన్నె గ్రామాల వద్ద రోడ్డుకు ఇరువైపులా మట్టి తీసి కోటి రూపాయల వ్యయంతో గ్రావెల్ పనులు చేపట్టింది. అప్పటికి మొబిలైజేషన్ నిధుల కింద రూ.10 కోట్లను ప్రభుత్వం నుంచి ఆ సంస్థ తీసేసుకుంది. అయితే పర్సెంటేజీల కోసం రాజకీయ నాయకుల ఒత్తిళ్లు అధికం కావడంతో కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. అదేవిధంగా ఎల్లార్తి రోడ్డుకు రూ.8 కోట్లు మంజూరైనా టెండర్లు పిలువలేదు. మార్లమరికి రోడ్డు మరమ్మత్తుల కోసం రూ.60 లక్షలకు ప్రతిపాదనలు పంపినా ఇంతవరకు నిధులు మంజూరు కాకపోవడం గమనార్హం.