pulses
-
ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు సమగ్ర ప్యాకేజీ
ఆహార ద్రవ్యోల్బణాన్ని(Food Inflation) తగ్గించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో భారత ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్(Union Budget 2025-26)లో సమగ్ర ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. నిత్యావసర సరుకుల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈ ప్యాకేజీ ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.ప్యాకేజీలోని అంశాలు ఎలా ఉండబోతున్నాయంటే..కనీస మద్దతు ధర (MSP)భరోసాపప్పుధాన్యాలు, నూనెగింజలను రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ చర్య వల్ల రైతులకు ఆర్థిక భరోసా అందించాలని భావిస్తోంది. దాంతో వారి ఉత్పత్తులకు న్యాయమైన ధర లభిస్తుంది.ఆర్ అండ్ డీకు కేటాయింపులుఅధిక దిగుబడినిచ్చే విత్తన వంగడాలను అభివృద్ధి చేయడానికి బడ్జెట్లో గణనీయమైన భాగాన్ని పరిశోధన, అభివృద్ధి(ఆర్ అండ్ డీ)కు కేటాయించనున్నారు. ఇది ఉత్పాదకతను మెరుగుపరచడానికి, వ్యవసాయ ఖర్చులను తగ్గించడానికి సహాయపడుతుంది.పంట వైవిధ్యానికి ప్రోత్సాహకాలువివిధ ప్రోత్సాహకాల ద్వారా రైతులు తమ పంటలను వైవిధ్యపరచుకునేలా ప్రోత్సహించాలని చూస్తున్నారు. ఇది పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిని పెంచడమే కాకుండా సుస్థిర వ్యవసాయ పద్ధతులకు మద్దతు ఇస్తుంది.సంప్రదాయేతర ప్రాంతాలపై దృష్టిసంప్రదాయేతర ప్రాంతాల్లో పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించడమే ఈ ప్యాకేజీ లక్ష్యం. ప్రస్తుతం ఈ పంటలు కేవలం 55 జిల్లాల్లో మాత్రమే పండిస్తున్నారు. వాటి సాగును ఇతర ప్రాంతాలకు విస్తరిస్తే పెరుగుతున్న డిమాండ్ను తీర్చేందుకు వీలవుతుందని అభిప్రాయపడుతున్నారు.రైతులకు మద్దతురైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా ధరల మద్దతు పథకం (పీఎస్ఎస్), ధరల స్థిరీకరణ నిధి (పీఎస్ఎఫ్) వంటి పథకాల ద్వారా ప్రభుత్వం మద్దతును అందిస్తుంది.ఇదీ చదవండి: త్వరలో ప్రభుత్వ యాప్ స్టోర్..?స్వయం సమృద్ధి సాధించే దిశగా..ఈ ప్యాకేజీ వ్యవసాయ రంగంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా ప్రస్తుతం దేశ వార్షిక వినియోగంలో వరుసగా 58%, 15% ఉన్న పప్పుధాన్యాలు, నూనె గింజల దిగుమతిని తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది స్వయం సమృద్ధిని సాధించడానికి సహాయపడటమే కాకుండా ధరలను స్థిరీకరించడానికి, ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది. -
ఇక పప్పులుడకవ్!
సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో పప్పు ధాన్యాలకు కొరత ఏర్పడుతుందని నీతి ఆయోగ్ వెల్లడించింది. దేశంలో ఆహార ధాన్యాలకు కొరత లేనప్పటికీ.. పప్పులు, తృణధాన్యాలు, కూరగాయలు, చక్కెర ఉత్పత్తులు డిమాండ్కు తగినట్టు సరఫరా ఉండదని నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక తేల్చింది. వచ్చే ఆర్థిక ఏడాది (2025–26)తో పాటు, 2030–31 ఆర్థిక ఏడాది నాటికి ఆహార ధాన్యాలు డిమాండ్–సరఫరాతోపాటు పప్పులు, తృణధాన్యాలు, కూరగాయల డిమాండ్–సరఫరా మధ్య వ్యత్యాసం ఉంటుందని స్పష్టం చేసింది. నాలుగేళ్లుగా ఆహార ధాన్యాలతోపాటు వివిధ ఆహారోత్పత్తులు రోజువారీ తలసరి లభ్యతపై నీతి ఆయోగ్ అధ్యయన నివేదికలో ఆసక్తికర విషయాలనువెల్లడించింది. నీతి ఆయోగ్ నివేదిక ఏం తేల్చిందంటే..నాలుగేళ్లుగా బియ్యం, గోధుమలు, తృణధాన్యాల రోజువారీ తలసరి లభ్యత పెరుగుతోంది. అయితే, పప్పుల రోజువారీ తలసరి లభ్యతలో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి.రానున్న రోజుల్లోనూ పప్పులు, కూరగాయలు, చక్కెర ఉత్పత్తుల డిమాండ్–సరఫరాకు మధ్య వ్యత్యాసం ఎక్కువగానే ఉంటుంది. దేశంలో వివిధ పంటల సాగు విస్తీర్ణంలో హెచ్చుతగ్గులుంటున్నాయి. దీనికి వాతావరణ పరిస్థితులు, నీటి పారుదల సౌకర్యాల లేమి, నేల పరిస్థితులు, తెగుళ్లు, వ్యాధులు వంటివి ప్రధాన కారణాలు. -
పప్పుల అంగడి!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో ఆచార వ్యవహారాలన్నీ భిన్నంగా కనిపిస్తాయి. ఇక్కడ సంప్రదాయాలు ఎక్కువగా పాటిస్తారు. చాలా మంది ఇక్కడ శాకాహారులే ఉంటారు. ఈ ప్రాంతంలోని ప్రజలు తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు మాట్లాడుతారు. అందుకే దీన్ని త్రిభాషా సంగమం అని అంటుంటారు. జుక్కల్ నియోజకవర్గంలో జుక్కల్, మద్నూర్, పిట్లం, పెద్దకొడప్గల్, డోంగ్లీ, బిచ్కుంద, నిజాంసాగర్, మహ్మద్నగర్ మండలాలున్నాయి. ఆయా మండలాల్లో పలుచోట్ల అంగళ్లు (వారసంతలు) జరుగుతాయి. బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం, జుక్కల్లో గురువారం, పి ట్లంలో శుక్రవారం, మద్నూర్లో సోమవారం, డోంగ్లీ, మేనూర్లో శుక్రవారం అంగళ్లు జరుగుతాయి. ఆ ప్రాంత ప్రజలు ఇంటికి అవసరమైన నిత్యావసరాలు, బట్టలు, వంట పాత్రలు.. ఏవైనా సరే అంగడికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. పేద, మధ్య తరగతి వర్గాలు కూరగాయలు, నిత్యావసరాల కోసం అంగళ్లపైనే ఎక్కువగా ఆధారపడతారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా పప్పులు అమ్ముతుంటారు. స్థానికంగా ఉన్న రైతులు వారు పండించిన పప్పుదినుసులను అంగళ్లలో అమ్ముతారు. పెసర, కంది, మినుము, శనగ, ఎర్రపప్పులతో పాటు జొన్నలు, గోధుమలు, ఆవాలు కూడా విక్రయిస్తారు. పొట్టు పప్పునకు భలే డిమాండ్ సాధారణంగా పంట చేతికి వచ్చిన తర్వాత పప్పు దినుసులు ఎక్కువ మొత్తంలో అమ్మకానికి వస్తాయి. ఆ సమయంలో ధర కొంత తక్కువగా ఉంటుంది. దీంతో ప్రజలు ఆయా అంగళ్లకు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. దుకాణాల్లో మరపట్టిన, పాలిష్ చేసినవి అమ్ముతుంటే అంగళ్లలో మాత్రం రైతులు నేచురల్ గా పండించిన పప్పుదినుసులు దంచి పొట్టుతో అమ్ముతుంటారు. చాలా మంది వాటిని ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. క్వింటాళ్ల కొద్దీ పప్పులు అమ్ముడు పోతాయని చెబుతున్నారు. దేశంలో ఎక్కడైనా పప్పులకు కొరత రావచ్చు గానీ, జుక్కల్ ప్రాంతంలో మాత్రం ఏనాడూ పప్పుదినుసులకు కొరత ఏర్పడదని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడే ఎక్కువగా పప్పుదినుసులు పండిస్తారు. అలాగే పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో కూడా పప్పుదినుసులు సాగుచేస్తారు. జొన్నలు, గోధుమలు కూడా విక్రయిస్తారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా.. జుక్కల్, పిట్లం, మద్నూర్, బిచ్కుంద అంగళ్లకు పొరుగున ఉన్న మహారాష్ట్రలోని దెగ్లూర్, హనేగావ్ ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటకలోని ఔరద్ ప్రాంతానికి చెందిన వారు కూడా పప్పులు అమ్మడానికి వస్తుంటారు. అలాగే అంగళ్లలో పప్పులు, నిత్యావసరాలు, ఇతర వస్తువులు కొనుగోలు చేయడానికి మూడు రాష్ట్రాల ప్రజలు రావడం విశేషం. జుక్కల్ అంగడికి జుక్కల్ మండలంలోని ఆయా గ్రామాల ప్రజలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటకలోని కొన్ని గ్రామాల ప్రజలు కూడా వస్తుంటారు. మద్నూర్, మేనూర్లో జరిగే అంగళ్లకు చుట్టుపక్కల గ్రామాలు, మహారాష్ట్రలోని దేగ్లూర్ తాలూకాలోని గ్రామాల ప్రజలు వస్తారు. బిచ్కుంద అంగడికి బిచ్కుంద మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వస్తుంటారు. పిట్లం మండల కేంద్రంలో జరిగే అంగడికి పిట్లం, పెద్దకొడప్గల్, నిజాంసాగర్ మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలతో పాటు పొరుగున ఉన్న సంగారెడ్డి జిల్లాలోని కంగి్ట, కల్హేర్ మండలాల నుంచి వచ్చి కొనుగోళ్లు చేస్తారు.రెండు తరాలుగా ఇదే దందా మా కుటుంబం రెండు తరాలుగా పప్పులు, జొన్నలు పిట్లం అంగడిలో అమ్ముతున్నం. మా నాయిన అమ్మేవారు. తర్వాత నేనూ పదేళ్లుగా పప్పులు, జొన్నలు అమ్ముతున్నాను. చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పప్పులు, జొన్నలు కొంటారు. – రంజిత్, తిమ్మానగర్ (విక్రయదారుడు) పిట్లం అంగడిలోనే కొంటాను పిట్లం అంగడిలో ఏళ్ల నుంచి పప్పులు కొనుగోలు చేస్తున్నాం. తక్కువ ధరకు దొరుకుతాయి. పప్పులతో పాటు జొన్నలు కూడా అమ్ముతారు. ఇంట్లో అవసరం ఉన్నప్పుడల్లా వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తాను. ఎన్నో ఏళ్లుగా పిట్లం అంగడిలో కొన్నవే తింటున్నాం. – రాజు, ఎల్లారెడ్డి (కొనుగోలుదారుడు)నాణ్యమైన పప్పులు దొరుకుతాయి పిట్లంకు మా ఊరు దగ్గరగా ఉంటుంది. వారం వారం అంగడికి ఇక్కడికే వచ్చి అవసరం ఉన్నవి కొనుగోలు చేస్తాం. పప్పులు ప్రతిసారీ పిట్లం అంగడిలోనే కొంటాం. ఇక్కడ నాణ్యమైనవి దొరుకుతాయి. – రాజేశ్వర్, తాడ్కోల్, సంగారెడ్డి జిల్లా (కొనుగోలుదారుడు) -
వర్షాకాలంలో ఈ పప్పు ధాన్యాలు తింటున్నారా..?
సూర్యుడి భగభగలు నుంచి చల్లటి తొలకరి చినుకులతో వాతావరణమంతా ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. ఇక ఎప్పుడు ముసురుపట్టి వర్షం పడుతుందో తెలియక ఇబ్బందులు పడుతుంటాం. ఓ పక్క వంటిట్లో వస్తువులు నిల్వ చేసుకోవడం కష్టమంటే, మరోవైపు వర్షాలకు బ్యాక్టీరయి, వైరస్లతో సీజనల్ ఫ్లూ జ్వరాలు ఊపందుకుంటాయి. ఇలాంటి వర్షాకాలంలో అందుకు తగ్గట్టు మనం తీసుకునే ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే పలు రకాల సమస్యల నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా పప్పుధాన్యాలు ఆరోగ్యానికి మంచిదని తినేస్తుంటాం. కానీ ఈ వర్షాకాలంలో ఇలాంటివి అస్సలు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కారణాలేంటో సవివరంగా చూద్దాం. పప్పుధాన్యాలు ఆరోగ్యకరమైనవే అయినా వర్షాకాలంలో మాత్రం ఇలాంటి పప్పులకు దూరంగానే ఉండాలి. ఎందకంటే వాతావరణంలోని తేమ శరీరంలోని జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. గ్యాస్, ఉబ్బరం, ఆమ్లత్వం వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా బీన్స్, కాయధాన్యాలు, చిక్పీస్, బఠానీలు వంటి పప్పుధాన్యాలకు దూరంగా ఉండాలి. సెనగపప్పు..సెనగపప్పులో ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ ఉంటాయి. ఇవి అజీర్ణం, అపానవాయువుకి దారితీస్తుంది. సెనగపప్పు బరువు నిర్వహణలో, కొలస్ట్రాల్ను నియంత్రించడం తోపాటు మొత్తం జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మసూర్ పప్పు లేదా ఎర్ర పప్పువాటిలో ప్రొటీన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్లు సీ, బీలు ఉన్నాయి. అయినప్పటికీ దీనిలో ఉండే రాఫినోస్, స్టాకియోస్ వంటి చక్కెరలు జీర్ణం కావడం కష్టమవ్వడం వల్ల ఇది అపానవాయువుకు కారణమవుతుంది.మినపప్పు..ఎముకల ఆరోగ్యానికి మద్దతునిస్తుంది, శక్తిని పెంచుతుంది. ఇది పొట్టపై భారంగా ఉంటుంది. జీర్ణంమవడం కష్టమవుతుంది. ఇది తేమతో కూడిన వాతావరణంలో అసౌకర్యం, ఉబ్బరానికి దారితీస్తుంది.తినకూడని ఇతర ఆహారపదార్థాలు..వేయించిన ఆహారాలు..వర్షాకాలంలో రోజూ వేయించిన ఆహారాన్ని తినకుండా ఉండటం చాలా అవసరం. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఫలితంగా ఆ ఒత్తిడి కాలేయంపై ఏర్పడుతుంది. పచ్చి ఆకుకూరలు..సలాడ్లు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ ఈ కాలంలో వాటిని నివారించడం ఉత్తమం. ఆకుల్లో తరుచుగా వ్యాధికారక కీటకాలు ఉంటాయి. వాటిని తొలగించడం కష్టం. అందువల్ల వాటిని బాగా శుభ్రం చేసుకుని తినడం లేదా దూరంగా ఉండటం మంచిది. (చదవండి: -
వంట చేయాలంటే.. ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. తీవ్రమైన వేడిగాలులు ఈ ప్రాంత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఉష్ణోగ్రతల ప్రభావం కూరగాయలు, పప్పుల ధరలపైన కూడా కనిపిస్తోంది. ఇప్పటికే కూరగాయలు, పప్పుల ధరలు విపరీతంగా పెరిగాయి. వీటి సరఫరా తగ్గడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా బంగాళదుంపలు, టమాటా, ఉల్లి, అల్లం, వెల్లుల్లి ధరలు కొండెక్కాయి. దీంతో సామాన్యులు వాటిని కొనుగోలు చేయాలంటే ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.కూరగాయల ద్రవ్యోల్బణం అత్యంత అస్థిరంగా ఉంటుంది. వేడిగాలులు, భారీ వర్షాలు, పంట నష్టం మొదలైన పరిస్థితుల కారణంగా కూరగాయల ధరలు పెరుగుతుంటాయి. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 11 నెలల కనిష్ట స్థాయి అంటే 4.8 శాతానికి పడిపోయింది. వెల్లుల్లి, అల్లం ద్రవ్యోల్బణం మార్చి , ఏప్రిల్లలో మూడు అంకెలలో ఉంది.పప్పులు, కూరగాయలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే సరఫరా తగినంతగా లేదు. ప్రతికూల వాతావరణం కూరగాయల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వేడిగాలు ఇదే రీతిన కొనసాగితే ధరలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విధమైన అధిక ధరలను అరికట్టడానికి కూరగాయలు, పప్పుల దిగుమతులను సరళీకరించాలని వారు సూచిస్తున్నారు. -
పెరుగుతున్న దిగుమతులు.. ధరలకు రెక్కలు!
రైతులకు వివిధ ప్రోత్సాహకాలు అందిస్తున్నప్పటికీ దేశీయ పప్పుల అవసరాల కోసం భారత్ ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పప్పుల దిగుమతులు 2023-24లో గతంలోకంటే దాదాపు రెండింతలు పెరిగి 3.74 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని తెలిసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 45 లక్షల టన్నుల పప్పు దినుసులు ఎగుమతి చేసుకున్నట్లు అంచనా. ఇది అంతకుమందు ఏడాదిలో 24.5 లక్షల టన్నులుగా ఉంది. దేశీయంగా పప్పు ధరలను నియంత్రణలో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. దేశీయ డిమాండ్కు అనుగుణంగా పప్పు దినుసుల దిగుమతుల కోసం బ్రెజిల్, అర్జెంటీనాలతో ప్రభుత్వం దీర్ఘకాలిక ఒప్పందాల కోసం చర్చలు జరుపుతోందని తెలిసింది. చర్చలు సఫలమైతే బ్రెజిల్ నుంచి మినుములు, అర్జెంటీనా నుంచి కందులను దిగుమతి చేసుకోనుంది. పప్పుధాన్యాలను దిగుమతి చేసుకునేందుకు భారత్ ఇప్పటికే మొజాంబిక్, టాంజానియా, మయన్మార్లతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం పసుపు బఠానీల దిగుమతిపై ఈ ఏడాది జూన్ వరకు సుంకాన్ని వసులు చేయకూడదని నిర్ణయించింది. ఇప్పటికే మినుములు, కందుల దిగుమతులకు ఈ నిబంధన వర్తిస్తోంది. మార్చి 31, 2025 వరకు వీటిని సుంకం లేకుండానే దిగుమతి చేసుకోవచ్చని ప్రభుత్వ తెలిపింది. ఎన్నికల సమయంలో ఆందోళన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పప్పుల ధరల ద్రవ్యోల్బణం ప్రభుత్వానికి ఆందోళన కలిగించే విధంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు. పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం మార్చిలో 17 శాతం నమోదైంది. దాంతో గత కొంతకాలంగా పప్పు ధరలు పెరుగుతున్నాయి. వాటిని అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఏప్రిల్ 15న పప్పు నిల్వలపై పరిమితులను విధించింది. ఇదీ చదవండి: ‘మేడ్ ఇన్ ఇండియా’ సర్వర్లు ప్రారంభించిన ప్రముఖ కంపెనీ ప్రభుత్వం గ్యారెంటీ కొనుగోలు, ఎంఎస్పీ వంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ దేశీయంగా గత కొంతకాలంగా ఉత్పత్తి క్షీణిస్తోంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం 2023-24లో పప్పుధాన్యాల ఉత్పత్తి 234 లక్షల టన్నులుగా ఉంది. అంతకుమందు ఏడాది 261 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. -
వేసవి కాలంలో చలవ చేయాలంటే ఈ పప్పులు ఉత్తమం
ఎండలు ముదురుతున్నాయి. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు చెమటలు విసిగిస్తాయి. దీంతో శ్రద్ధగా వంట చేయాలంటే చాలా కష్టం. ఎంత తొందరగా పని ముగించుకుని వంటింట్లోంచి బైటపడదామా అని పిస్తుంది. అందుకే దీని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే చమటరూపంలో ఎక్కువ నీరు పోవడం వల్ల, దాహంఎక్కువ కావడం వల్ల, శరీరం తొందరగా వేడెక్కుతుంది. మరి శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచడంతోపాటు పోషకాలు అందించే కొన్ని పప్పులు గురించి తెలుసుకుందామా! వేసవి కాలంలో మనం తీసుకునే ఆహారం పై కూడా శ్రద్ధ పెట్టాలి. పెసరపప్పు, శనగ పప్పు, మినపప్పు, సోయా, బఠానీ లాంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. పెసరపప్పు మిగిలిన అన్ని పప్పులతో పోలిస్తే కొద్దిగా భిన్నంగా ఉంటుది. ఎక్కువ చలవ చేస్తుంది. పెసరపప్పు: వేసవికాలంలో ముందుగా గుర్తొచ్చేది పెసరప్పు చేసుకొనే పెసరకట్టు. తేలిగ్గా జీర్ణం అయ్యేలా.. అల్లం, పచ్చిమర్చి, ఉల్లిపాయ, టమాటా ముక్కలతో.. కమ్మ కమ్మగా ఉండేలా దీన్ని చేసుకోవచ్చు. అలాగే పెసర పప్పు-మెంతికూర, బీరకాయ-పెసరపప్పు, పొట్లకాయ-పెసరపప్పు ఇలా రకరకాల కాంబినేషన్స్లో దీన్ని తీసుకోవచ్చు. ఈ పప్పులో ప్రోటీన్, విటమిన్ ఎ, బి, సి, విటమిన్ ఇ, పొటాషియం, కాల్షియం, ఐరన్, కాపర్, మెగ్నీషియం లభిస్తాయి. ఫైబర్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.అలాగే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. కాయధాన్యాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. వేసవిలో పెసరపప్పు చలవచేస్తుందని గర్భధారణ సమయంలో కూడా దీన్ని భేషుగ్గా తినవచ్చని ఆహార నిపుణులు చెబుతారు.. మినపప్పు: ఇది వేసవిలో చల్లదనాన్ని ఇస్తుంది. విటమిన్లు, మినరల్స్ ,ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మంచి ఐరన్ లభిస్తుంది. కడుపు, చర్మానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పోపులు, పచ్చళ్లలో వాడటంతోపాటు, ఇడ్లీ, దోస, వడ లాంటి వంటకాలను తయారు చేసుకోవచ్చు. సోయాబీన్: వేసవిలో సోయాబీన్ పప్పు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా స్థిరంగా ఉంటుంది. ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, శక్తి, కాల్షియం, పొటాషియం అందుతాయి. మినపప్పు ఆహారంలో చేర్చుకుంటే రక్తపోటు ,కొలెస్ట్రాల్ను కూడా నియంత్రిస్తుంది. ఎముకలు ధృఢంగా ఉంటాయి. శనగ పప్పు: ఇదిజీర్ణం కావడం కష్టమని, శరీరంలో వేడి పెంచుతుందని వేసవిలో చాలా మంది దీన్ని తినరు. కానీ వేసవిలో ఈ పప్పు తింటే మేలు జరుగుతుంది. ఫైబర్, ఐరన్, మెగ్నీషియం , కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల వేసవిలో కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. నానపెట్టిన శనగలని అల్పాహారంగా చేసి పిల్లలకి పెడితే చాలా మంచిది. అయితే తిన్న తర్వాత ఎక్కువ నీరు త్రాగాలి. నోట్. కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్టు పప్పుల్లో కూడా కల్లీ ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కల్తీని జాగ్రత్తగా గమనిస్తూ శ్రేష్ఠమైన పప్పులను ఎంచుకోవాలి. -
పప్పు ధాన్యాల సేకరణ షురూ
సాక్షి, అమరావతి: రబీ పంట ఉత్పత్తుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత నెలలో శనగల కొనుగోలుకు అనుమతి ఇచ్చి న ప్రభుత్వం.. తాజాగా మినుము, పెసలు, వేరుశనగ సేకరణకూ అనుమతి ఇవ్వడంతో ఆర్బీకేల ద్వారా కొనుగోలుకు ఏపీ మార్క్ఫెడ్ ఏర్పాట్లు చేసింది. రబీ 2023–24 సీజన్లో 7 లక్షల ఎకరాల్లో శనగ, 7.50 లక్షల ఎకరాల్లో మినుము, 1.92 లక్షల ఎకరాల్లో పెసలు, 1.61 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగయ్యాయి. శనగ 5.26 లక్షల టన్నులు, మినుము 3.89 లక్షల టన్నులు, వేరుశనగ 1.86 లక్షల టన్నులు, పెసలు 84 వేల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేశారు. క్వింటాల్ శనగలకు రూ.5,440, పెసలుకు రూ.8,558, మినుముకు రూ.6,950, వేరుశనగకు రూ.5,850 చొప్పున ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించింది. 2.75 లక్షల టన్నుల సేకరణకు అనుమతి కనీస మద్దతు ధరకు శనగలు 1,14,163 టన్నుల సేకరణకు గత నెలాఖరున ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజాగా 97,185 టన్నుల మినుము, 46,463 టన్నుల వేరుశనగ, 17,505 టన్నుల పెసలు సేకరణకు అనుమతి ఇవ్వడంతో ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసేందుకు ఏపీ మార్క్ఫెడ్ ఏర్పాట్లు చేసింది. పంట నమోదు (ఈ–క్రాప్) ఆధారంగానే ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. పంట కోతల తేదీ ఆధారంగా కొనుగోలు తేదీని నిర్ధారిస్తారు. దళారుల బెడద లేకుండా బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. సేకరించిన ఉత్పత్తులను సులభంగా ట్రాక్ చేయడానికి వీలుగా సంచులకు క్యూఆర్ కోడ్/ఆర్ఎఫ్ ఐడీ ట్యాగ్ వేస్తున్నారు. మార్కెట్లో ధరలు పెరిగే అవకాశం రబీ పంట ఉత్పత్తుల సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శనగలు, మినుము, పెసలు, వేరుశనగ సేకరిస్తున్నాం. మార్కెట్లో కనీస మద్దతు ధర దక్కని వారు ఆర్బీకేల్లో తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలి. మార్కెట్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. తొందరపడి ఏ ఒక్క రైతు తమ పంట ఉత్పత్తులను ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరకు అమ్ముకోవద్దు. – డాక్టర్ గెడ్డం శేఖర్బాబు ఎండీ, ఏపీ మార్క్ఫెడ్ -
వంట పండింది!
జీవితంలో సమస్యలు రావడం సాధారణం. ఒక్కోసారి ఇవి ఊపిరాడనివ్వవు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా వాటిని ఎదుర్కొనాలి. తానేమిటో నిరూపించుకోవాలి. అలానే చేసింది బిందు. తన కూతుళ్లకు మంచి చదువును అందించేందుకు ఒక పక్క గరిట తిప్పుతూనే మరోపక్క నాగలి పట్టి పొలం సాగు చేస్తూ ‘‘మనం కూడా ఇలా వ్యవసాయం చేస్తే బావుంటుంది’’ అనేంతగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. తమిళనాడులోని తెనై జిల్లా బొమ్మినాయకన్పట్టి గ్రామానికి చెందిన బిందు, పిచ్చయ్య దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పిచ్చయ్య సొంత పొలంలో చెరకు పండించేవాడు. అయితే ఏటా అప్పులు తప్ప ఆదాయం వచ్చేది కాదు. గ్రామంలో చాలామంది రైతులు చెరకు, పత్తిని పండించి నష్టపోవడాన్ని చూసి ఇతర పంటలను పండించాలని నిర్ణయించుకుంది బిందు. మొక్కజొన్న, వంగ పంటను పొలంలో వేసింది. మరోపక్క సెల్ఫ్హెల్ప్ గ్రూప్లో చేరి చుట్టుపక్కల రైతులు ఏం పండిస్తున్నారో తెలుసుకునేది. ఇతర రైతుల సలహాలు, సూచనలతో సాగును మెరుగు పరుచుకుంటూ, ఎస్హెచ్జీ ద్వారా కృషి విజ్ఞాన్ నిర్వహించే వ్యవసాయ కార్యక్రమాలకు హాజరవుతూ మెలకువలు నేర్చుకుంది. అధికారులు చెప్పిన విధంగా పప్పుధాన్యాలు, మిల్లెట్స్, మినుములు కూడా సేంద్రియ పద్ధతి లో సాగుచేసింది. దీంతో మంచి లాభాలు వచ్చాయి. విరామంలో... పంటకు పంటకు మధ్య వచ్చే విరామంలో కూరగాయలు పండించడం మొదలు పెట్టింది. అవి నాలుగు నెలల్లోనే చేతికి రావడంతో మంచి ఆదాయం వచ్చేది. విరామ పంటలు చక్కగా పండుతుండడంతో.. కొత్తిమీర, కాకర, ఇతర కూరగాయలను పండిస్తోంది. పంటను పసుమయిగా ... ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో చాలా కూరగాయలు వృథా అయ్యేవి. అలా వ్యర్థంగా పోకుండా ఉండేందుకు ‘పసుమయి’ పేరిట ఎండబెట్టిన కూరగాయలు, పొడులను విక్రయిస్తోంది. ఇడ్లీ పొడి, నిమ్మపొడి, ధనియాల పొడి వంటి అనేక రకాల పొడులను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. నెలకు వందల సంఖ్యలో విక్రయాలు జరుగుతున్నాయి. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యాపారవేత్తగా ఎదిగింది బిందు. ఆమె పెద్దకూతురు ఎం.ఎస్. పూర్తి చేస్తే, చిన్నకూతురు బీఎస్సీ నర్సింగ్ చేస్తోంది. అలా సేద్యంతో పిల్లల చదువులనూ పండించుకుంది బిందు. -
పప్పుధాన్యాల ఉత్పత్తి తగ్గింది
సాక్షి, హైదరాబాద్: దేశంలో పప్పుల వినియోగం పెరిగిందని..అదే సమయంలో ఉత్పత్తి భారీగా తగ్గిపోయిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. దీంతో దేశ అవసరాలకు ఇతర దేశాల నుంచి పప్పులు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశంలో పప్పుల ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ హాకా ‘భారత్ దాల్’పేరుతో పంపిణీ చేస్తున్న రాయితీ శనగపప్పు కార్యక్రమాన్ని ఆదివారం హెచ్ఐసీసీలో కేంద్ర వినియోగదారులశాఖ కార్యదర్శి రోహిత్కుమార్ సింగ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ విదేశాల నుంచి కందిపప్పును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నామన్నారు. కంది పండిస్తే మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్ర భుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారత్దాల్ పేరుతో హాకా చేస్తున్న కార్యక్రమం ప్రశంసనీయమన్నారు. మధ్యతరగతి, పేద వినియోగదారులకు ఇది ఎంతో మేలు చేస్తుందన్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.90 ఉన్న శనగపప్పును రూ.60కే అందించడంపై అభినందనీయమని తెలిపారు. కేంద్ర వినియోగదారులశాఖ కార్యదర్శి రోహిత్కుమార్సింగ్ మాట్లాడుతూ రాయితీ శనగ పప్పు పంపిణీకి సంబంధించి తొలు త తమ జాబితాలో హాకా లేదన్నారు. అయితే హా కా చైర్మన్ మచ్చా శ్రీనివాస్రావు తన వద్దకు పలుమార్లు వచ్చి హాకా గొప్పతనాన్ని, తెలంగాణ ప్రభు త్వ మద్దతు వివరించారని తెలిపారు. ఒక అవకాశం ఇచ్చి చూద్దామని హాకాకు శనగల పంపిణీ బాధ్యత అప్పగించామన్నారు. హాకా పనితీరు, ఏర్పాట్లు చూశాకా మరింత నమ్మకం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హాకా చైర్మన్ మచ్చా శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, హా కా ఎండీ సురేందర్, జీఎం రాజ మోహన్, ఆగ్రోస్ ఎండి కె.రాములు తదితరులు పాల్గొన్నారు. -
తగ్గిన పప్పు ధాన్యాల సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో పప్పుధాన్యాల సాగు గణనీయంగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. నేటి(శనివారం)తో వానాకాలం సీజన్ ముగియనుంది. ఆదివారం నుంచి యాసంగి సీజన్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఒక నివేదిక విడుదల చేసింది. వానాకాలం సీజన్లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, గతేడాది ఇదే సీజన్లో 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది మాత్రం 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా వరి సాగు విస్తీర్ణం ఆల్ టైం రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 65 లక్షల ఎకరాల్లో (130.37 శాతం) సాగైంది. ఇక సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, 4.67 లక్షల (113%) విస్తీర్ణంలో సాగైంది. వరి మినహా పెరగని ప్రధాన పంటల విస్తీర్ణం వరి, సోయాబీన్ మినహా ఇతర ముఖ్యమైన పంటల విస్తీర్ణం పెరగలేదు. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, 44.77 లక్షల (88.51 శాతం) విస్తీర్ణంలోనే సాగైంది. ఇక పప్పు ధాన్యాల సాగు మాత్రం గణనీయంగా తగ్గిందని నివేదిక వెల్లడించింది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం ఈ వానాకాలం సీజన్లో 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 5.51 లక్షల ఎకరాల్లోనే సాగైంది. అంటే 58.46 శాతానికే పరిమితమైంది. అందులో కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.69 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.74 లక్షల (61.62 శాతం) ఎకరాల్లోనే సాగైంది. జొన్న సాధారణ సాగు విస్తీర్ణం 81,389 ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 31,107 ఎకరాల్లో (38.22 శాతం) సాగైంది. రాగులు దాని సాధారణ సాగు విస్తీర్ణంలో కేవలం 19.70 శాతం, కొర్రలు, సామలు, కోడో వంటి మిల్లెట్ల సాగు 16.15 శాతానికే పరిమితమైంది. -
శనగ విత్తనాల పంపిణీకి శ్రీకారం
సాక్షి, అమరావతి: ముందస్తు రబీకి సిద్ధమైన రైతులకు అవసరమైన విత్తన సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి శనగ విత్తనాల పంపిణీ ప్రారంభించగా.. మిగిలిన విత్తనాలను అక్టోబర్ మొదటి వారం నుంచి పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. రబీలో 10.92 లక్షలు ఎకరాల్లో శనగ సాగవుతోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్కు దూరంగా ఉన్న రైతులు ముందస్తు రబీలో శనగ సాగువైపు మొగ్గు చూపుతుండటంతో ఈసారి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు రబీ కోసం 3 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాన్ని సబ్సిడీపై పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. అదేవిధంగా 36,121 క్వింటాళ్ల వరి, 14,164 క్వింటాళ్ల మినుము, 4,353 క్వింటాళ్ల పెసలు, 142 క్వింటాళ్ల కందులు, 833 క్వింటాళ్ల ఉలవలు, 502 క్వింటాళ్ల చిరుధాన్యాలు, 367 క్వింటాళ్ల నువ్వులు, 727 క్వింటాళ్ల వేరుశనగ, 1,697 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై పంపిణీకి సిద్ధం చేశారు. పకడ్బందీగా విత్తన పంపిణీ ముందస్తు రబీ సీజన్కు సిద్ధమైన రైతులకు శనగ విత్తన పంపిణీకి శ్రీకారం చుట్టాం. గతేడాది 25 శాతం సబ్సిడీపై పంపిణీ చేయగా.. ఈ సారి రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 40 శాతం సబ్సిడీపై పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి వరితో సహా మిగిలిన విత్తన పంపిణీకి ఏర్పాట్లు చేశాం. – గెడ్డం శేఖర్బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనం గడిచిన సీజన్లో ఎంపిక చేసిన రైతు క్షేత్రాల్లో శనగ విత్తనాన్ని సేకరించారు. ఏపీ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ద్వారా పరీక్షించి నాణ్యతను ధ్రువీకరించారు. 3.44 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఎకరం లోపు రైతుకు బస్తా (25 కేజీలు), ఆ తర్వాత ఎకరానికి ఒకటి చొప్పున ఐదెకరాల్లోపు రైతులకు ఐదు బస్తాల చొప్పున విత్తనాలు పంపిణీ చేయనున్నారు. గతేడాది 25 శాతం సబ్సిడీపై పంపిణీ చేసిన శనగ విత్తనాలపై ఈ సారి 40 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. పచ్చిరొట్టతో పాటు చిరుధాన్యాల విత్తనాలను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేయనుండగా.. వేరుశనగ, నువ్వుల విత్తనాలను 40 శాతం సబ్సిడీ, మినుము, పెసలు, కందులు, అలసందల విత్తనాలను 30 శాతం సబ్సిడీపై పంపిణీ చేయనున్నారు. వరి విత్తనాలను క్వింటాల్కు ఆహార భద్రత పథకం వర్తించే జిల్లాల్లో రూ.1000, వర్తించని జిల్లాల్లో రూ.500 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు. సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది 58 కోట్లు భరించగా, ఈసారి రూ.120 కోట్లు భరించేందుకు సిద్ధమైంది. -
36 లక్షల ఎకరాల్లో పంటల సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం సీజన్లో 36 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదికను అందజేసింది. ఈ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 28.99 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 24.86 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే 49.15 శాతం పత్తి సాగైందని నివేదిక వెల్లడించింది. ఇక వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.39 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే 2.80 శాతంలో వరి సాగైందని తెలిపింది. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2 లక్షల ఎకరాల్లో (21.25%) సాగైంది. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.23 లక్షల ఎకరాల్లో (54.18%) సాగైంది. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 7.13 లక్షల ఎకరాలు కాగా, 87,179 ఎకరాల్లో సాగైందని వెల్లడించింది. ఆదిలాబాద్లో అత్యధికంగా 92 శాతం సాగు... రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాల్లో 92.05 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఆ తర్వాత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 82.86 శాతం విస్తీర్ణంలో, నారాయణపేట్లో 55.85 శాతం విస్తీర్ణంలో సాగ య్యాయి. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో 2.41 శాతం విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగయ్యాయి. ఆ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 2.27 లక్షల ఎకరాలు కాగా, కేవలం 5,474 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగ య్యాయి. కాగా, రాష్ట్రంలో 3 జిల్లాల్లో వర్షాభావ పరి స్థితులు నెలకొన్నాయి. జగిత్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వర్షాభావం నెలకొందని వ్యవసాయశాఖ తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, సూర్యాపేట జిల్లాల్లో లోటు వర్షపాతం నమో దైందని పేర్కొంది. వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్ జిల్లాల్లో మాత్రం సాధారణంకంటే అధిక వర్షపాతం నమోదైంది. కాగా, మిగిలిన 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో జూన్, జూలై నెలల్లో ఇప్పటివరకు కలిపి చూస్తే సరాసరి 32 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో 44 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కాగా, ఈ నెల లో ఐదు రోజుల్లో 29 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జగిత్యాల జిల్లాల్లో ఏకంగా 74 శాతం చొప్పు న లోటు వర్షపాతం నమోదుకాగా, కరీంనగర్ జిల్లాలో 73 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మూసీ ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత కేతేపల్లి: నల్లగొండ జిల్లాలోనిమూసీ ప్రాజెక్ట్ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరడంతో అధికారులు బుధవారం రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మూసీ ప్రాజెక్ట్కు ఎగువ నుంచి పెద్దగా ఇన్ఫ్లో లేకపోయినప్పటికీ తుపాను ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ప్రాజెక్ట్లో నీటిమట్టాన్ని తగ్గించాలని మూసీ అధికారులు నిర్ణయించారు. దీంతో ప్రాజెక్టు రెండు క్రస్ట్ గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 2,466 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్లో గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 641.90 అడుగులు ఉందని అధికారులు తెలిపారు. మూసీ ప్రాజెక్టులో పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.67 టీఎంసీల నీరు ఉంది. -
తక్కువ నీటి వినియోగ పంటలపై దృష్టి
న్యూఢిల్లీ: ఎక్కువ లాభదాయకత, తక్కువ నీటి వినియోగం వంటి సౌలభ్యతలున్న చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల వైపు దృష్టిని మళ్లించేలా రైతులను ప్రోత్సహించాలని నాబార్డ్కు ఆరి్థకశాఖ మంత్రి విజ్ఞప్తి చేశారు. బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) సమీక్షా సమావేశంలో ఆమె ఈ మేరకు కీలక ఉపన్యాసం చేశారు. గ్రామీణ ఆదాయాన్ని పెంపొందించడంతోపాటు స్థానికంగా సమర్ధత పెంపొందడానికి, చక్కటి ఫలితాలను అందించడానికి కృషి చేయాలని అగ్రి–ఫైనాన్స్ సంస్థకు సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ‘2023 అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం’’ను పురస్కరించుకుని ’శ్రీ అన్న’ ఉత్పత్తి, మార్కెటింగ్కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే తృణధాన్యాల కింద ఉన్న భూమి సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి రైతులను ప్రోత్సహించాలని కోరారు. ఇప్పటికే తృణ ధాన్యాలను పండిస్తున్న రైతుల ఆరి్థక ప్రయోజనాల పరిరక్షణకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. నేడు చింతన్ శిబిర్... కాగా, కేంద్ర బడ్జెట్, అలాగే ఫ్లాగ్íÙప్ పథకాల నుండి నిధులు సమకూర్చిన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడానికి, ఆయా అంశాల సమీక్షకు జూన్ 17న ’చింతన్ శిబిర్’ నిర్వహించినట్లు ఆరి్థక మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్లో తెలిపింది. -
పప్పు.. నిప్పు!
సాక్షి, హైదరాబాద్: వంట నూనెల ధరలు తగ్గు ముఖం పట్టాయని సంతోషిస్తున్న సగటు జీవిపై ఇప్పుడు పప్పుల భారం భారీగా పడుతోంది. 20 రోజుల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో కిలో రూ. 120 ఉన్న కందిపప్పు ధర ఇప్పుడు ఏకంగా రూ. 140 నుంచి రూ. 150కి పెరిగింది. అలాగే మినపగుండ్ల ధర రూ. 130కి చేరగా, మినపపప్పు మరింత పెరిగింది. ఎర్రపప్పు (మసూర్ దాల్) కూడా కిలో రూ. 70 నుంచి ఏకంగా రూ. 100కుపైగా పలుకుతోంది. వేరుశనగ (పల్లీలు) ధర కూడా రూ. 90 నుంచి రూ. 130కి ఎగబాకింది. కేవలం పెసరపప్పు ధరలో మాత్రమే పెద్దగా తేడా కనిపించట్లేదు. ఇక సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ షాపింగ్ల ద్వారా ప్యాకేజ్డ్ కందిపప్పు ధర అర కిలోకే రూ. 90 నుంచి రూ. 95 పలుకుతోంది. అంటే అటుఇటుగా కిలో రూ. 200గా ఉంటోంది. అలాగే ఆర్గానిక్ పేరుతో ప్యాక్ చేసిన కందిపప్పు ధర రూ. 250 వరకు అమ్ముడవుతోంది. ఈ కేటగిరీలో మినపపప్పు ధర కిలో రూ. 150పైగా ఉండగా ఎర్రపప్పు రూ. 120గా ఉంది. వేరుశనగ నూనెను కిలోకు రూ. 180పైగా విక్రయిస్తున్నారు. నెల వ్యవధిలోనే పప్పుధాన్యాల, పల్లీల ధరలు పెరిగిపోవడంతో వంటింట పప్పులు ఉడకని పరిస్థితి నెలకొంది. దిగుబడి తగ్గడం, డిమాండ్ పెరగడం వల్లే.. దేశంలో ఏటా సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలను వినియోగిస్తారని అంచనా. గతేడాది దేశవ్యాప్తంగా 43.4 లక్షల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాల దిగుబడి రాగా మరో 15 లక్షల మెట్రిక్ టన్నుల మేర విదేశాల నుంచి కేంద్రం దిగుమతి చేసుకుంది. కానీ ఈ ఏడాది దేశంలో దిగుబడి 38.9 లక్షల మెట్రిక్ టన్నులుగానే నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాతా వరణ పరిస్థితుల్లో మార్పులు, వర్షాలకుతోడు పప్పుధాన్యాలు, వేరుశనగతో పోలిస్తే తక్కువ శ్రమతో చేతికందే ఇతర పంటల సాగు వైపు రైతు లు మొగ్గుచూపడం వల్లే దిగుబడులు గణనీయంగా తగ్గినట్లు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలోనితాండూరు, జహీరాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోనూ గతేడాది పప్పుధాన్యాల దిగుబడి తగ్గినట్లు చెబుతున్నాయి. స్టాక్.. బ్లాక్ మార్కెట్కు? పెరిగిన పప్పుల ధరల నేపథ్యంలో హైదరాబాద్లోని బేగంబజార్ వంటి ప్రధాన మార్కెట్లలో కందిపప్పు నిల్వ లేదంటూ అప్పుడే ‘నో స్టాక్’బోర్డులు దర్శనస్తున్నాయి. కందిపప్పునకు ఉన్న డిమాండ్ దృష్ట్యా బడా వ్యాపారులు దాన్ని బ్లాక్ మార్కెట్లోకి తరలిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల్లోనూ ప్రధాన మార్కెట్లలో కందిపప్పు బ్లాక్ మార్కెట్కు తరలే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల త్వరలోనే కందిపప్పు ధర రిటైల్ మార్కెట్లో రూ. 180 నుంచి రూ. 200 వరకు చేరొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
పప్పు.. పాలు.. గుడ్లు.. టెండర్ల ఖరారు ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాల కింద సరుకుల పంపణీకి కాంట్రాక్టర్ల ఎంపిక అధికార యంత్రాంగానికి ప్రహసనంగా మారింది. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లను ఖరారు చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం టెండరులో పాల్గొంటున్న బిడ్డర్లు అత్యధిక ధరలు కోట్ చేయడమే. బిడ్డర్లు కుమ్మక్కై వాస్తవ ధరల కంటే అత్యధిక ధరలను కోట్ చేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న తీరును అధికారులు గుర్తించడంతో కాంట్రాక్టరు ఎంపిక వాయిదా పడుతూ వస్తోంది. దాదాపు రెండు నెలలుగా ఒక్క టెండరు సైతం ఖరారు కాలేదు. వన్.. టూ.. త్రీ.. అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన గర్భిణులు, బాలింతలు, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులకు ఆరోగ్యలక్ష్మి తదితర పోషకాహార కార్యక్రమాల్లో భాగంగా పాలు, కోడి గుడ్లు, కందిపప్పును వివిధ రూపాల్లో అందిస్తున్నారు. సంపూర్ణ పోషకాహారం కింద పాలను, గుడ్లను నేరుగా అందిస్తుండగా... ఫుల్ మీల్స్లో భాగంగా కందిపప్పుతో కూడిన కూరలతో భోజనాన్ని ఇస్తున్నారు. ఈ పథకాలకు అవసరమైన పాలు, గుడ్లు, కందిపప్పును సరఫరా చేసేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తుంది.మూడు లేదా ఆరు నెలల పాటు ఈ కాంట్రాక్టును అప్పగించి సరుకులను స్వీకరిస్తుంది. తక్కువ ధరల కోసం.. ఈ క్రమంలో మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలో సరుకుల కొనుగోలు లక్ష్యంగా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు చేపట్టింది. కానీ ఇందులో పాల్గొంటున్న వారంతా మార్కెట్ ధర కంటే అత్యధిక ధరలను కోట్ చేస్తూ రావడంతో సర్కారు ఖజానాకు భారీగా గండి పడుతుందన్న భావనతో ఆ శాఖ టెండర్లను రద్దు చేస్తూ వస్తోంది. ► అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరా కోసం ఈ ఏడాది మార్చిలో మొదటిసారి, ఏప్రిల్ మొదటి వారంలో రెండోసారి టెండరు పిలిచారు. కానీ అందులో పాల్గొన్న సంస్థలు నిబంధనలకు సరితూగలేదు. దీంతో రెండు టెండర్ల ద్వారా అర్హులు ఎంపిక కాకపోవడంతో మరో టెండరు పిలవాల్సి వచి్చంది. ఈ క్రమంలో పాల పంపిణీకి ఇబ్బందులు కలగకుండా ఇప్పటివరకు పంపిణీ చేసిన సంస్థకు పాత ధరలోనే పంపిణీ చేసేలా అవకాశమిస్తూ ఆర్నెళ్లకు పొడిగిస్తూ రాష్ట్ర మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సెపె్టంబర్ వరకు పంపిణీకి అవకాశం దక్కినట్లయింది. ► కందిపప్పు పంపిణీకి మార్చి నెలాఖరులోనే టెండరు పిలిచింది. గత టెండరు సమయంలో కిలోకు రూ.114 చొప్పున పంపిణీ చేయగా... ఈ సారి టెండర్లు ఓ కనిష్ట ధర(ఎల్–1)ను రూ.145 కోట్ చేసింది. ఇక గరిష్ట ధర కింద ఏకంగా రూ.175 చొప్పున కోట్ చేశారు. గత ధర కంటే భారీగా ధరలు పెంచిన కారణంగా ఆ టెండరును రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రద్దు చేసింది. కొత్తగా మరో టెండరును పిలిచినప్పటికీ ధరలు ఆదే స్థాయిలో ఉండడంతో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ► కోడిగుడ్ల పంపిణీకి సంబంధించిన టెండరులో జిల్లాల వారీగా పంపిణీ దారుల ఎంపికకు టెండరు పిలిచింది. దీనిపై పలు పౌల్ట్రీ సంస్థల యజమానులు న్యాయపోరాటానికి ఉపక్రమించారు. కోర్టు కేసులు నమోదు చేయగా... కొన్నాళ్లుగా ఎంపిక ప్రక్రియ ముందుకు కదల్లేదు. తాజాగా వీటన్నింటినీ పరిష్కరించి కాంట్రాక్టర్లను ఎంపిక చేసేందుకు సీఎం కార్యాలయాధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ పోస్టులకు ఏజ్ భారమైంది! వైద్య విద్య విభాగంలో ‘వయో పరిమితి’సంక్షోభం -
ఆదాయం.. ఆరోగ్యం మహిళల ‘చిరు’ యత్నం.. ఫలిస్తున్న పాత పంటల సాగు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సామలు.. కొర్రలు.. అరికెలు.. ఊదలు.. జొన్నలు.. ఇలా పలు పాత పంటలు సేంద్రియ పద్ధతిలో సాగు చేయడమే కాకుండా వాటిని వినియోగిస్తూ తమతో పాటు తమ కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు ఆ మహిళా రైతులు. అంతేకాదు వారి అవసరాలు పోను మిగతా ధాన్యాన్ని మంచి ధరకు అమ్ముకుంటూ లాభాలు ఆర్జించడంతో పాటు ఇతరులకు ఆరోగ్యాన్ని పంచుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఈ పాత పంటల సాగు దాదాపు కనుమరుగైందనే చెప్పాలి. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇటీవలి కాలంలో చాలామంది తృణ ధాన్యాల వైపు మొగ్గు చూపుతుండటంతో.. కొద్ది సంవత్సరాలుగా కొన్ని ప్రాంతాల్లో మళ్లీ వీటి సాగు మొదలైంది. అయితే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంత రైతులు మాత్రం ఏళ్ల తరబడి తృణ ధాన్యాల సాగును కొనసాగిస్తుండటం గమనార్హం. ఒక సంఘం..3 వేలమంది సభ్యులు జహీరాబాద్ ప్రాంతంలో సరైన సాగునీటి సౌకర్యం లేదు. వరుణుడు కరుణిస్తేనే పంటలు చేతికందుతాయి. ఈ ఎర్ర నేలల్లో ప్రస్తుతం సుమారు తొమ్మిది వేల ఎకరాల్లో చిన్న సన్నకారు రైతులు చిరుధాన్యాలను సాగు చేస్తున్నారు. అందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఈ పంటలను పండిస్తున్నారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన గ్రూపుల్లో సుమారు మూడు వేల మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. ఒక్క కరోనా మరణం లేదు చిరుధాన్యాలను సాగు చేయడం ద్వారా రూ.లక్షల్లో లాభాలను గడించకపోయినప్పటికీ.. నిత్యం వాటినే వినియోగిస్తుండడంతో ఆ రైతులు ఆరోగ్యంగా ఉంటున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంది. కానీ ఈ చిరుధాన్యాలు వినియోగించిన రైతు కుటుంబంలో ఒక్క కరోనా మరణం కూడా జరగలేదని డీడీఎస్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మూడు వేవ్ల్లో అసలు ఈ మహమ్మారి బారిన పడిన రైతులే చాలా తక్కువని చెబుతున్నారు. రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, ఇతరత్రా వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య కూడా తక్కువేనని అంటున్నారు. కొనసాగుతున్న జాతర చిరుధాన్యాల ఆవశ్యకత.. పౌష్టికాహార భద్రత.. సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యతపై రైతుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా గత 23 ఏళ్లుగా పాత పంటల జాతర జహీరాబాద్ ప్రాంతంలో కొనసాగుతోంది. సంక్రాంతి నుంచి మొదలుపెట్టి కనీసం రోజుకో గ్రామం చొప్పున నెల రోజుల పాటు సుమారు 40 గ్రామాల్లో ఈ జాతర సాగుతుంది. సుమారు 80 రకాల చిరుధాన్యాలను ఎడ్ల బండ్లపై ఆయా గ్రామాలకు తీసుకెళ్లి వాటి సాగు ప్రాధాన్యతను రైతులకు వివరిస్తూ ఆయా పంటల సాగును ప్రోత్సహిస్తుంటారు. డీడీఎస్ ఆధ్వర్యంలో జాతర కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందం.. రసాయనాలు లేకుండా విత్తనాలు భధ్ర పరుచుకోవడం, సేంద్రియ ఎరువుల తయారీ, భూసార పరీక్షల కోసం మట్టి నమూనాల సేకరణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తుండటం విశేషం. జహీరాబాద్ కేంద్రంగా ఈ సంస్థ 35 గ్రామాల్లో రైతులను ప్రోత్సహిస్తోంది. జహీరాబాద్, మొగుడంపల్లి, ఝరాసంగం, న్యాల్కల్ తదితర మండలాల రైతులకు తృణధాన్యాల సాగుపై అవగాహన కల్పిస్తోంది. పండిన పంటలు రైతులు వినియోగించేలా వారిని చైతన్యం చేస్తోంది. మిగిలిన పంటలను మార్కెట్ ధర కంటే సుమారు పది శాతం ఎక్కువ ధరకు రైతుల వద్ద డీడీఎస్ కొనుగోలు చేస్తోంది. మేం పండించిన సాయి జొన్నలనే తింటున్నం.. నాకు ఏడు ఎకరాలు ఉంది. టమాటా, మిర్చి వంటి కూరగాయల పంటలకు భూమి అనుకూలంగా ఉన్నప్పటికీ.. చిరుధాన్యాలను సాగు చేయాలనే ఉద్దేశంతో రెండు ఎకరాల్లో సాయి జొన్న పండిస్తున్న. కూరగాయల పంటలతో పాటు శనగలు, కందులు కూడా సాగు చేస్తున్నా. చిరుధాన్యాలు ఆరోగ్యానికి మంచివనే ఉద్దేశంతో మేం పండించిన సాయి జొన్నలనే ఎక్కువగా తింటాం. ఇవి తింటేనే మాకు ఆరోగ్యంగా అనిపిస్తుంది. – గార్లపాటి నర్సింహులు, బర్దిపూర్, సంగారెడ్డి జిల్లా ఐదు ఎకరాల్లో 20 రకాల పంటలు మాకు ఐదు ఎకరాలుంది. వర్షం పడితేనే పంట పండుతుంది. నీటి సౌకర్యం లేదు. తొగర్లు, జొన్నలు, సామలు, కొర్రలు.. ఇట్లా 20 రకాల పంటలు వేస్తున్నాం. విత్తనాలు మావే.. కొనే అవసరం లేదు. మేమే సేంద్రియ ఎరువులను తయారు చేసుకుంటున్నాం. దీంతో పెట్టుబడి వ్యయం చాలా తక్కువగా ఉంటోంది. – పర్మన్గారి నర్సమ్మ, మెటల్కుంట, సంగారెడ్డి జిల్లా ఎంతో ఆరోగ్యంతో ఉంటున్నారు.. నెల రోజుల పాటు జరిగే పాతపంటల జాతరలో రైతులకు చిరుధాన్యాల సాగు ఆవశ్యకతను వివరిస్తున్నాం. వివిధ రకాల పంటలు సాగు చేయడం ద్వారా వాతావరణం అనుకూలించక ఒక పంట నష్టపోయినా.. మరో పంట చేతికందుతుంది. ఈ చిరుధాన్యాలను పండించడంతో పాటు వాటిని వినియోగిస్తే వచ్చే ఆరోగ్యపరమైన ప్రయోజనాలపై మహిళా రైతులను చైతన్యం చేస్తున్నాం. చిరు ధాన్యాలను వినియోగిస్తున్న రైతులు, వారి కుటుంబాల వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు. – బూచనెల్లి చుక్కమ్మ, జాతర కోఆర్డినేటర్ -
అపరాలు, చిరుధాన్యాలపై గురి
సాక్షి, అమరావతి: రబీలో బోర్లు కింద వరిసాగు చేసే రైతుల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని సంకల్పించింది. ఆరుతడి పంటలవైపు వీరిని మళ్లించేందుకు కార్యాచరణ సిద్ధంచేసింది. వాస్తవానికి మైదాన ప్రాంతాలతో పోల్చుకుంటే బోర్ల కింద వరి సాగుకయ్యే ఖర్చు ఎక్కువ. ఫలితంగా పెట్టుబడి పెరిగి, గిట్టుబాటు ధర దక్కక ఆర్థికంగా నష్టపోతుంటారు. దీనిని నివారించేందుకు సర్కారు ఈ ప్రణాళిక రూపొందించింది. సాధారణంగా రబీలో సాగు విస్తీర్ణం 56.19 లక్షల ఎకరాలు. అయితే, గతేడాది 57.27 లక్షల ఎకరాల్లో సాగైంది. 19.72 లక్షల ఎకరాల్లో వరి, 24 లక్షల ఎకరాల్లో అపరాలు, 4.97 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 3.47 లక్షల ఎకరాల్లో నూనెగింజలు, 3.2 లక్షల ఎకరాల్లో చిరుధాన్యాలు సాగవుతున్నాయి. కానీ, ఈ ఏడాది 58.68 లక్షల ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఇందులో ఇప్పటివరకు 2.50 లక్షల ఎకరాల్లో రబీ పంటల సాగుకు వడివడిగా శ్రీకారం చుట్టారు. రూ.25 కోట్లతో కార్యాచరణ రాష్ట్రంలో 12 లక్షల బోర్ల కింద 24.63 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులోని 11.55 లక్షల ఎకరాల్లో సుమారు 10 లక్షల మంది సంప్రదాయంగా వరిసాగు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రస్తుత రబీ సీజన్లో ప్రయోగాత్మకంగా బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటల సాగుకోసం రూ.25 కోట్లతో వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్ధంచేసింది. ఇందులో భాగంగా బోర్ల కింద 750 క్లస్టర్ల (ఒక క్లస్టర్ కింద 50 ఎకరాలు) పరిధిలోని 37,500 ఎకరాల్లో వరికి బదులుగా అపరాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించనున్నారు. ఇలా ఒక్కో క్లస్టర్లోని రైతులకు విత్తనాలు, సూక్ష్మ పోషకాలు, జీవన ఎరువులు, వ్యవసాయ యంత్ర పరికరాలను 50 శాతం సబ్సిడీపై అందించనున్నారు. అదే విధంగా మిషన్ మిల్లెట్ పాలసీ కింద బోర్ల కింద ప్రాంతాలతోపాటు మైదాన ప్రాంతాల్లో కూడా ప్రస్తుత రబీ సీజన్లో కనీసం 50వేల ఎకరాల్లో రాగి, కొర్ర పంటల సాగును ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులకు ప్రోత్సాహకాలు ఇలా.. ఇక ఈ కార్యాచరణలో భాగంగా బోర్ల కింద ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్నదాతలకు అనేక ప్రోత్సాహకాలు అందించబోతోంది. బోర్ల కింద అపరాలకు రూ.9వేలు, నూనెగింజలకు రూ.10వేలు, బోర్లతోపాటు మైదాన ప్రాంతాల్లో చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు హెక్టార్కు రూ.6వేల విలువైన విత్తనాలు, విత్తనశుద్ధి చేసే రసాయనాలు, బయో ఫెర్టిలైజర్స్, పీపీ కెమికల్స్, లింగాకర్షక బుట్టలను ఆర్బీకేల ద్వారా అందించనున్నారు. వీటితో పాటు రూ.1.25 లక్షల రాయితీతో రూ.3 లక్షల విలువైన మినీ ప్రాసెసింగ్ యూనిట్లు 20–25 మందితో ఏర్పాటయ్యే ఫార్మర్ ఇంట్రస్ట్ గ్రూపులకు (ఎఫ్ఐజీ) అందించనుంది. చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజలు పండించే రైతుల గ్రూపులకు రాష్ట్ర ప్రభుత్వం 150 యూనిట్లు ఇవ్వనుంది. బోర్ల కింద ఆరుతడి పంటలే మేలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బోర్ల కింద వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు, నూనెగింజలు, చిరు«ధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కార్యాచరణ సిద్ధంచేశాం. ఈ ఏడాది బోర్ల కింద 37,500 ఎకరాల్లో నూనెగింజలు, అపరాలతో పాటు 50 వేల ఎకరాల్లో చిరుధాన్యాల సాగుకు రాయితీలు అందించనున్నాం. ఇలా దశల వారీగా రానున్న నాలుగు సీజన్లలో కనీసం 3 లక్షల ఎకరాల్లో పంటల మార్పిడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ ప్రోత్సాహకాలు ఇలా.. బోర్ల కింద ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్నదాతలకు అనేక ప్రోత్సాహకాలు అందించబోతోంది. బోర్ల కింద అపరాలకు రూ.9వేలు, నూనెగింజలకు రూ.10వేలు, బోర్లతోపాటు మైదాన ప్రాంతాల్లో చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు హెక్టార్కు రూ.6వేల విలువైన విత్తనాలు, విత్తనశుద్ధి చేసే రసాయనాలు, బయో ఫెర్టిలైజర్స్, పీపీ కెమికల్స్, లింగాకర్షక బుట్టలను ఆర్బీకేల ద్వారా అందించనున్నారు. వీటితో పాటు రూ.1.25 లక్షల రాయితీతో రూ.3 లక్షల విలువైన మినీ ప్రాసెసింగ్ యూనిట్లు 20–25 మందితో ఏర్పాటయ్యే ఫార్మర్ ఇంట్రస్ట్ గ్రూపులకు (ఎఫ్ఐజీ) అందించనుంది. చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజలు పండించే రైతుల గ్రూపులకు ప్రభుత్వం 150 యూనిట్లు ఇవ్వనుంది. -
పప్పు ధాన్యాల కొనుగోళ్లు షురూ
సాక్షి, అమరావతి: రబీ సీజన్లో రైతులు పండించిన పప్పు ధాన్యాల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పటికే శనగలు, కందుల కొనుగోళ్లు మొదలవగా.. ఏప్రిల్ మొదటి వారం నుంచి పెసలు, మినుములను కొనుగోలు చేసేందుకు మార్క్ ఫెడ్ ద్వారా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కనీస మద్దతు ధర చెల్లించి రూ.10.47 కోట్ల విలువైన 2,047 టన్నుల శనగల్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అదేవిధంగా రూ.14 లక్షల విలువైన 22 టన్నుల కందులను ఇప్పటివరకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో 1,26,270 టన్నుల శనగలు, 91,475 టన్నుల మినుములు, 19,632 టన్నుల పెసలు కొను గోలు చేసేందుకు అనుమతినిచ్చింది. శనగలకు క్వింటాల్ రూ.5,230, పెసలు రూ.7,275, మినుము, కందులకు రూ.6,300 చొప్పున మద్దతు ధర ప్రకటించింది. శనగలు క్వింటాల్ రూ.4,800 నుంచి రూ.5,000, పెసలు క్వింటాల్ రూ.6,500 నుంచి రూ.6,800 వరకు మాత్రమే ధర ఉండటంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. ఆ ఇబ్బంది లేకుండా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం ద్వారా రైతులను ఆదుకోనుంది. ఎస్ఎంఎస్ ద్వారా రైతుకు సమాచారం పంట నమోదు (ఈ–క్రాప్) ఆధారంగానే ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. ప్రతి రైతు రబీలో సాగు చేసిన పంట వివరాలను సమీప ఆర్బీకేలో నమోదు చేసుకోవాలి. కొనుగోలు సందర్భంగా సన్న, చిన్నకారు రైతులకే ప్రాధాన్యత ఇస్తారు. పంట కోత ల తేదీ ఆధారంగా కొనుగోలు తేదీని నిర్ధారిస్తారు. పంట సేకరణ తేదీ, కొనుగోలు కేంద్రం సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా రైతులకు తెలియజేస్తారు. దళారుల బెడద లేకుండా బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. కొనుగోలు వేళ రైతులకు ఈ–రసీదు ఇస్తారు. సేకరించిన ఉత్పత్తులను సులభంగా ట్రాక్ చేయడానికి వీలుగా సంచులకు క్యూఆర్ కోడ్/ఆర్ఎఫ్ ఐడీ ట్యాగ్ వేస్తారు. చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఈ–సైన్ (ఈ–హస్తాక్షర్) అమలు చేస్తున్నారు. నాణ్యత (ఎఫ్ఏక్యూ) ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరిగేలా థర్డ్ పార్టీ ఆడిట్ చేస్తున్నారు. -
పప్పులు.. కుప్పలు తెప్పలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పప్పుధాన్యాల ఉత్పత్తి ఏడాదికేడాది పెరుగుతోంది. ఐదేళ్ల కిందటితో పోలిస్తే 2020– 21లో 1.28 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి పెరిగింది. 2016 –17లో 5.36 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా 2020–21లో 6.64 లక్షలకు చేరుకుంది. మొత్తంగా 2020–21లో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో దేశంలో 9వ స్థానంలో రాష్ట్రం నిలిచింది. ఇటీవలి కేంద్రం నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అత్యధికంగా రాజస్తాన్ రాష్ట్రంలో 48.21 లక్షల టన్నులు, మధ్యప్రదేశ్లో 43.64 లక్షల టన్నులు, మహారాష్ట్రలో 42.24 లక్షల టన్నుల పప్పుధాన్యాల ఉత్పత్తి జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 11.85 లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యాయి. దేశంలో 2016–17లో 2.31 కోట్ల టన్నుల పప్పు ధాన్యాలు ఉత్పత్తి కాగా 2020–21లో 2.55 కోట్లకు పెరిగాయి. ఉత్పత్తి పెంచే కార్యాచరణతో.. పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం ప్రత్యేక కార్యా చరణను అమలు చేస్తోంది. విత్తనాల పంపిణీ, అధిక దిగుబడినిచ్చే రకాలు, వ్యవసాయ యంత్రాలు, నీటి ఆదా పరికరాలు, మొక్కల రక్షణ రసాయనాలు, పోషకాల నిర్వహణ, నేల మెరుగుదల, రైతులకు శిక్షణ చేపట్టింది. దేశంలో ఆయా రాష్ట్రాల వ్యవసాయ వర్సిటీలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో 150 సీడ్ హబ్లు ఏర్పాటయ్యాయి. బీహార్, గుజరాత్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 2018–19 నుంచి చెరకులో పప్పు ధాన్యాల అంతర పంట అనే కొత్త పథకం అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను ప్రోత్సహిస్తుండటంతో మున్ముందు ఈ పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది. కంది, శనగ కొనుగోలుకు ఏర్పాట్లు రాష్ట్రంలో ఈ వానాకాలంలో 4.67 లక్షల మెట్రిక్ టన్నులు కంది ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. మద్దతు ధరకు 80,142 మెట్రిక్ టన్నులు కొనేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు 103 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్క్ఫెడ్ నిర్ణయించిం ది. అందులో 50 కేంద్రాలు ఏర్పాటు చేశారు. క్వింటా మద్దతు ధర రూ. 6,300 కాగా బహిరంగ మార్కెట్లోనూ ఇంతే ధర ఉందని, దీంతో కేంద్రాలకు రైతులు రావట్లే దని మార్క్ఫెడ్వర్గాలు అంటున్నాయి. కేంద్రం 58,485 మెట్రిక్ టన్నుల శనగ కొనాలని నిర్ణయించడంతో వాటి కోసం కూడా మార్క్ఫెడ్ ఏర్పాట్లు చేసింది. 38 కేంద్రాలు గుర్తించి ఇప్పటికే 18 తెరిచామని మార్క్ఫెడ్ పంటల సేకరణ విభాగం ఇన్చార్జి చంద్రశేఖర్ తెలిపారు. మద్దతు ధర క్వింటాకు రూ. 5,230 ఉంది. -
పప్పు, నూనెగింజల సాగుపై రైతుల ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటల మార్పిడి పెద్దఎత్తున జరుగుతోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. పప్పు, నూనెగింజల సాగుకు రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని తెలిపారు. అందుకు కావాల్సినన్ని విత్తనాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నాయని, గతంతో పోలిస్తే మినుములు, ఆముదాలు, నువ్వులు, ఆవాల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని వివరించారు. వేరుశనగ, పప్పుశనగ విత్తనాలు తగినన్ని అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యాన శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, మార్కెటింగ్ అదనపు డైరెక్టర్ లక్ష్మణుడు, వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడారు. ఆయిల్ పామ్పై దృష్టి పెట్టాలి పంటల మార్పిడిలో భాగంగా ఆయిల్ పామ్ నర్సరీలలో మొక్కల పెంపకంపై దృష్టి సారించామని మం త్రి చెప్పారు. వచ్చే వానాకాలానికి నిర్దేశించిన లక్ష్యం ప్రకారం క్షేత్రస్థాయిలో రైతులకు ఆయిల్ పామ్ మొ క్కలు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. యాసంగి సాగుకు అవసరమైన ఎరువులు అందుబా టులో ఉన్నాయని తెలిపారు. పత్తి మద్దతు ధర రూ. 6,025 ఉండగా, బహిరంగ మార్కెట్లో రూ.7 వేలకు పైగా పలకడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది రైతులు భారీగా పత్తి సాగు చేయాలని సూచించారు. -
15.18 లక్షల హెక్టార్లలో మూషిక నిర్మూలన
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సాగులో అన్నదాతను కలవరపెడుతున్న మూషికాల ఆటకట్టించేందుకు సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమానికి వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టింది. గత రెండేళ్లలో మాదిరిగానే ఈ ఏడాది కూడా అన్నదాతకు అండగా నిలిచేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి మార్గదర్శకాలు జారీచేసింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఏడాది పొడవునా వరి, వేసవిలో పప్పుధాన్యాలు సాగుచేస్తారు. ఏడాది పొడవునా పంటలు సాగుచేయడంతో ఎలుకల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణ ద్వారా వరిపంట నష్టాన్ని తగ్గించడం, నాణ్యమైన ఆహార ఉత్పత్తులను సాధించడం లక్ష్యంగా 2019–20 నుంచి సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రెండేళ్లలో 25.95 లక్షల మంది రైతులకు లబ్ధి ఖరీఫ్లో జూన్ నుంచి అక్టోబర్ వరకు, రబీలో నవంబర్ నుంచి మార్చి వరకు చేపడుతున్న ఈ కార్యక్రమం వల్ల గత రెండేళ్లలో హెక్టార్కు 5 నుంచి 7 క్వింటాళ్ల ధాన్యాన్ని సంరక్షించగలిగారు. 2019–20లో 13.05 లక్షల హెక్టార్లలో రూ.1.75 కోట్లతో చేపట్టగా 14.57 లక్షల మంది రైతులకు లబ్ధికలిగింది. 2020–21లో 12.03 లక్షల హెక్టార్లలో రూ.1.14 కోట్లతో చేపట్టగా 11.38 లక్షల మంది అన్నదాతలు లబ్ధిపొందారు. 2021–22 వ్యవసాయ సీజన్లో రూ.2.01 కోట్లతో 15.18 లక్షల హెక్టార్లలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం అమలు చేయాలని సంకల్పించారు. దీనికి 14,376 కిలోల ఎలుకల మందు (బ్రోమోడయోలిన్)ను వినియోగించనున్నారు. ఖరీఫ్ సీజన్లో కృష్ణాలో 2.54 లక్షల హెక్టార్లు, గుంటూరులో 2.34 లక్షల హెక్టార్లు, తూర్పుగోదావరి 2.46 లక్షల హెక్టార్లు, పశ్చిమగోదావరిలో 2.02 లక్షల హెక్టార్లు చొప్పున మొత్తం 9.36 లక్షల హెక్టార్లలో రూ.1.25 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం 8,915 కిలోల ఎలుకల మందు (బ్రోమోడయోలిన్)ను రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) అందుబాటులో ఉంచారు. 2021–22లో కార్యాచరణ ఇలా.. ఎంపికచేసిన గ్రామాల్లో గ్రామాన్ని యూనిట్గా తీసుకుని సామూహిæకంగా ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తారు. వ్యవసాయ క్షేత్రాలతోపాటు సాధారణ స్థలాలు, రోడ్లు, కాలువలు, మురుగుకాలువల తిన్నెలు, బీడు, బంజరు, ప్రభుత్వభూముల్లో కూడా ఈ కార్యక్రమం చేపడతారు. ఆర్బీకేల వద్ద విషపు ఎరను తయారుచేసి సాగు విస్తీర్ణాన్ని బట్టి రైతులకు పంపిణీ చేస్తారు. విషపు ఎరలకు వ్యవసాయ క్షేత్రాల్లో అయ్యే ఖర్చును రైతులు, బంజరు, ప్రభుత్వ భూముల్లో అయ్యే ఖర్చును పంచాయతీలు భరించాల్సి ఉంటుంది. హెక్టార్కు 8 నుంచి 10 గ్రాముల బ్రోమోడయోలిన్ను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈ మందులో నూకలు, వంటనూనె కలిపి ఎరను రైతులు పంట నష్టం జరిగే ప్రదేశాల్లో ఎలుకల బొరియల్లో ఉంచాలి. సామూహిక ఎలుకల నిర్మూలన కోసం ఆర్బీకే స్థాయిలో ప్రత్యేక ప్రచారం చేస్తున్నారు. స్పెషల్ క్యాంపైన్ నిర్వహిస్తున్నాం గడిచిన రెండు సీజన్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా సామూహిక ఎలుకల నిర్మూలనకు ఏర్పాట్లు చేశాం. ఇందుకోసం ఆర్బీకే స్థాయిలో స్పెషల్ క్యాంపైన్ నిర్వహిస్తున్నాం.ఎలుకల నివారణ మందును ఆర్బీకే ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్నాం. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ -
మార్కెట్లో మంచి ధర
సాక్షి, అమరావతి: ప్రభుత్వ చర్యల కారణంగా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను మించి బహిరంగ మార్కెట్లో ధరలు పలుకుతున్నాయి. వ్యాపారులు గతంలో సిండికేట్గా ఏర్పడి తమ ఇష్టమొచ్చిన ధరలకే రైతులు పండించిన పంటల్ని కొనుగోలు చేసేవారు. దీనివల్ల కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలు కూడా రైతులకు లభించేవి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి కనీస మద్దతు ధర లభించని పంటలను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్, ఇతర పద్ధతుల్లో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. గత ఏడాది ఈ విధంగా పెద్దఎత్తున పంట ఉత్పత్తుల్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. దీంతో రైతులంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఫలితంగా బహిరంగ మార్కెట్లో వ్యాపారులకు వ్యవసాయ ఉత్పత్తులు దొరకని పరిస్థితి తలెత్తింది. దీంతో ఈ ఏడాది పంట ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడానికి వ్యాపారులు పోటీ పడ్డారు. దీంతో పప్పు ధాన్యాలు, రాగులు, సజ్జలు, ఇతర చిరు ధాన్యాల ధరలు పెరిగాయి. కనీస మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించి వాటిని కొనుగోలు చేస్తుండటంతో రైతుల పంట పండింది. ఈ కారణంగా రైతులు ఈసారి మార్క్ఫెడ్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వైపు కన్నెత్తి చూడలేదు. గతేడాది రూ.2,856.53 కోట్ల విలువైన పంటల కొనుగోలు కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం గతేడాది మాదిరిగానే కందులు, శనగలు, జొన్న, మొక్కజొన్న ఇతర పంటల కొనుగోలుకు రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా సుమారు 10 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ అధ్వర్యంలో మార్చి 1న తెరిచింది. అయితే, ఇప్పటివరకు రూ.796.81 కోట్ల విలువైన 4.05 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే రైతులు వాటిలో విక్రయించారు. గతేడాది రబీలో రూ.2,856.53 కోట్ల విలువైన 8,19,572 టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల్ని మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. అంటే గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది సుమారు రూ.2 వేల కోట్ల విలువైన పంట ఉత్పత్తులు బహిరంగ మార్కెట్లో అమ్ముడుపోయాయి. మొక్కజొన్న, జొన్న రైతుల్ని ఆదుకుంటున్న కొనుగోలు కేంద్రాలు మొక్కజొన్న, జొన్న రైతులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు ఆదుకుంటున్నాయి. ఈ ఏడాది మొక్కజొన్న కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.1,850 కాగా, బహిరంగ మార్కెట్లో రూ.1,450 నుంచి రూ.1,550 మధ్య పలుకుతోంది. ఈ కారణంగా మొక్కజొన్న రైతులు పంటను అమ్ముకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు క్యూ కట్టారు. ఈ ఏడాది 3.96 లక్షల టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించగా.. ఇప్పటివరకు రూ.553.01 కోట్ల విలువైన 2,98,924.50 టన్నులను కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి ఆదుకుంది. జొన్నలు 1.10 లక్షల టన్నులు కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ.195.33 కోట్ల విలువైన 96,332.85 టన్నులను కొనుగోలు చేశారు. ఈ విధంగా ఈ ఏడాది 60,953 మంది రైతుల నుంచి రూ.796.81 కోట్ల విలువైన 4,04,763.10 టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే మార్క్ఫెడ్ కొనుగోలు చేయగలిగింది. ఇది శుభపరిణామం ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈ ఏడాది బహిరంగ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర వచ్చింది. మినుములు, కందులు, పెసలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో కనీస మద్దతు ధర కంటే మిన్నగా ధరలు పలకడం వలన ఈ ఏడాది మార్క్ఫెడ్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు పెద్దగా రాలేదు. ఇది నిజంగా శుభపరిణామం. – పీఎస్ ప్రద్యుమ్న, ఎండీ, మార్క్ఫెడ్ -
ఏపీలో 15 నుంచి పప్పుధాన్యాల సేకరణ
సాక్షి, అమరావతి: ఈ నెల 15 నుంచి రైతుల వద్ద పప్పుధాన్యాలను ప్రభుత్వం సేకరించనుంది. రైతుల పంటలకు గిట్టుబాటు ధర రానప్పుడు ధరల స్థిరీకరణ నిధితో పంటలను కొనుగోలు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పప్పుధాన్యాల సేకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో రాష్ట్రంలోని 31 కొనుగోలు కేంద్రాల్లో అపరాల కొనుగోలుకు మార్క్ఫెడ్ చర్యలు తీసుకుంది. వైఎస్ జగన్ సీఎం బాధ్యతలు స్వీకరించాక తొలుత శనగల కొనుగోలుకు రూ.333 కోట్లు విడుదల చేశారు. రెండో విడతగా కేంద్ర నిధులు వచ్చే వరకు వేచి చూడకుండా ధరల స్థిరీకరణ నిధితో అపరాలను కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కొనుగోలులో నిజమైన రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఈ–క్రాపింగ్ను ప్రాతిపదికగా తీసుకోవాలని, రైతులు ఈ–క్రాపింగ్లో నమోదు చేసుకోకపోతే ఈ నెల 15 లోపు వారి పేర్లను కూడా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. వ్యాపారుల పట్ల రైతు సంఘాల ఆందోళన శనగల కొనుగోలు సమయంలో కొందరు రైతులు ఈ–క్రాపింగ్లో నమోదు చేసుకోకపోవడంతో కొంత నష్టపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ–క్రాపింగ్పై పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ–క్రాపింగ్లో నమోదు చేసుకోని రైతులు గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ కార్యదర్శిని కలిసి నమోదు చేసుకోవాలని సూచించింది. ఆ వివరాలను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రైతులు అపరాలను అమ్ముకోవచ్చని తెలిపింది. గతేడాది రైతులు అమ్ముకున్న అపరాలను వ్యాపారులు రైతుల పేరున నిల్వ చేసుకున్నారు. వారంతా కొనుగోలు కేంద్రాలకు ఆ పంటను తీసుకొచ్చి రైతుకు లభించాల్సిన మద్దతు ధరను తన్నుకుపోయే ప్రమాదముందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. రైతుల మేలుకే కొనుగోలు కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం క్వింటా పెసలకు రూ.7,050, మినుములకు రూ.5,700లను కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)గా ప్రకటించింది. అయితే.. మార్కెట్లో పెసలకు రూ.5,500, మినుములకు రూ.4,700లకు మించి ధర లభించడం లేదు. దీంతో రైతులకు మేలు చేకూర్చేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. రెండో దశలో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. గుంటూరు జిల్లా తెనాలి, పొన్నూరు, తూర్పు గోదావరి జిల్లా రంగంపేట, జెడ్ రంగంపేట, కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్, మైలవరం, పరిటాల, కర్నూలు జిల్లా నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆత్మకూరు, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు, పెద్దపాడేరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, పోలవరం, కన్నాయిగుట్ట, కృష్ణారావుపేటల్లో మినుముల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పెసల కొనుగోలు కేంద్రాలను తూర్పుగోదావరి జిల్లా రంగంపేట, జెడ్ రంగంపేట, కృష్ణా జిల్లా నందిగామ, పరిటాల, అల్లూరు, చౌటపల్లి, పొన్నవరం, మైలవరం, కర్నూలు జిల్లా నంద్యాల, ఆత్మకూరు, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు, పెద్దపాడేరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, పోలవరం, కన్నాయిగుట్ట, కృష్ణారావుపేటల్లో ఏర్పాటు చేస్తారు. పెసలు, మినుములు 20 వేల టన్నులు, కందులు 40 వేల టన్నులు రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. -
బరువును సులువుగా తగ్గించే చనాచాట్
కాలంతో పాటు మనిషి కూడా పరిగెత్తడంతో జీవన శైలిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో చాలామంది సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో పాటు, కంటి నిండ నిద్రకు దూరం అవుతున్నారు. దీని ప్రభావం ఆరోగ్యంపైన పడుతోంది. ఒత్తిడి కారణంగా అతిగా తినడం వల్ల కూడా అధిక బరువుకు దారి తీస్తోంది. ఈ రోజుల్లో చాలా మందిని కలవరపరుస్తున్న వాటిలో అధిక బరువు. అయితే అదనపు బరువు అనేది మనం రోజు తీసుకునే ఆహారం మీదే ముడిపడి ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. పాశ్చాత్య ధోరణికి అలవాటు పడిన నేటి సమాజం అధిక కొవ్వు పదార్థాలు ఉండే ఫాస్ట్ ఫుడ్లైన పిజ్జా, బర్గర్లకు బాగా అలవాటైపోయారు. ఆ తర్వాత సరైన వ్యాయమం లేకపోవడం, ఎక్కువ గంటలు కూర్చోనే పని చేయడం కూడా బరువుకు కారణం అవుతోంది. తీరా పెరిగిన బరువును తగ్గించుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. జిమ్ల్లో చెమటలు పట్టేలా వ్యాయామాలు చేసినా ఫలితం మాత్రం అనుకున్నంతగా కనిపించడం లేదని వాపోవడం చూస్తూనే ఉన్నాం. అయితే మన దేశంలో ప్రాచీన కాలం నుంచే అందుబాటులో ఉన్న పప్పు ధాన్యాలు, చిక్కుళ్లలో ప్రొటీన్ పాళ్లు పుష్కలంగా ఉండి బరువు సమస్యను తగ్గించేందుకు దోహదపడుతాయన్నవిషయం చాలా మందికి తెలియదనే చెప్పాలి. ముఖ్యంగా చిక్కుళ్లలో చిక్పీస్(శనగలు), బఠానీ, సోయాబీన్స్ వంటివి బరువును తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిని సంవృద్ధిగా తీసుకుని వంటిపై ఉన్న బరువును తేలిగ్గా వదిలించుకోవచ్చు. ప్రొటీన్ల రారాజు చిక్పీస్ చిక్కుళ్లలో ఒక రకమైన శనగల్లో(చిక్పీస్) ప్రొటీన్, ఫైబర్లు మెండుగా ఉండి బరువు తగ్గేందుకు దోహదపడుతుందని ఇటీవలే అమెరికాకు చెందిన ఓ ఆహార,న్యూట్రిషన్ సంస్థ తన సర్వేలో వెల్లడించింది. ఉదాహరణకు ఉడకబెట్టిన 100గ్రాముల చిక్పీస్లో 9గ్రా ప్రొటీన్స్,8గ్రా ఫైబర్, 2.6గ్రా ఫ్యాట్, ఐరన్లు ఉంటాయని నివేదికలో తెలిపింది. రోజు ఆహారంలో చనాచాట్ను తీసుకుంటే వీటిలో ఉండే ప్రొటీన్, ఫైబర్ కొద్ది రోజుల్లోనే బరువును తగ్గించడంతో పాటు, బ్లడ్ లెవల్, షుగర్ పాళ్లను కంట్రోల్లో ఉంచేందుకు దోహదపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మార్కెట్కు వెళ్లి చిక్పీస్ను కొనుగోలు చేయండి, అధిక బరువును తగ్గించుకోండి. -
ఒకటికి పది పంటలు!
ప్రతాప్ వృత్తిరీత్యా న్యాయవాది. రసాయన ఎరువులతో పండించిన పంట తినడం వల్ల మానవాళి మనుగడకు ఏర్పడుతున్న ముప్పును గుర్తించారు. అందుకే సేంద్రియ సాగును తన ప్రవృత్తిగా ఎంచుకున్నారు. ప్రతాప్ ప్రకృతి వ్యవసాయం చేస్తూ విషతుల్యమైన ఆహార పదార్థాల బారి నుంచి తన కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నారు. తనకున్న పదెకరాల వ్యవసాయ క్షేత్రాన్ని పూర్తిగా ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దారు. మంచిర్యాల జిల్లా కేంద్ర శివారులోని హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలో ఆయన క్షేత్రం ఉంది. వరి, మొక్కజొన్న, సజ్జలతోపాటు దాదాపు 50 రకాల పండ్ల మొక్కలు, పప్పుదినుసులు, కూరగాయలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. సుభాష్ పాలేకర్ ప్రకృతివ్యవసాయ సూత్రాలు, ‘సాక్షి సాగుబడి’ కథనాల స్ఫూర్తితో గత ఏడేళ్లుగా పంటల సాగు చేస్తూ.. అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఎకరన్నర విస్తీర్ణంలో మామిడి బత్తాయి (మొసంబి), సంత్ర, సపోట, ఆపిల్ బెర్, దానిమ్మ, అంజీర, సీతాఫలం, జామ, అరటి, బొప్పాయి తదితర పండ్ల తోటలు... ఎకరన్నరలో చిరుధాన్యాలు... ఎకరన్నరలో వరి... ఎకరన్నరలో పప్పుదినుసులు... రెండు ఎకరాల్లో కూరగాయల పందిళ్లు... రెండు ఎకరాల్లో వాణిజ్య పంటలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో.. పది ఎకరాల నల్లరేగడి భూమిలో పూర్తి సొంత వనరులతో తయారు చేసుకునే సహజ ఎరువులు వాడుతూ ప్రతాప్ వ్యవసాయం చేస్తున్నారు. రెండు ఆవులు, నాలుగు ఎద్దులు, ఒక గేదెను పెంచుతున్నారు. పేడ, మూత్రంతో జీవామృతం, ఘనాజీవామృతం, వర్మీ కంపోస్టు తయారు చేసి పంటలకు వేస్తున్నారు. పచ్చిరొట్ట ఎరువులను వాడుతూ మంచి దిగుడులు సాధిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో మెళకువలను ఇతర రైతులకు తెలియజెప్పేందుకు ప్రతి జూన్ నెలలో రైతులకు తన సేంద్రియ క్షేత్రంలో ప్రదర్శన ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకం వల్ల కలిగే నష్టాలను వివరిస్తున్నారు. రసాయన ఎరువులతో ఇటు మనుషులకు తినే తిండిలో, అటు పండించే పంట భూమికి నష్టాలు వాటిల్లుతాయని విడమరుస్తున్నారు. కూరగాయల సాగులో దిగుబడి రెట్టింపు భూమిని పైపైన దున్ని మాగిన ఆవు పేడను వేస్తారు. ఎకరా పొలాన్ని మడులుగా విభిజించి, ఒక్కో మడిలో ఒక్కో రకం కూరగాయ పంటను సాగు చేస్తున్నారు. దేశవాళీ వంగడాలతో పాటు సంకర రకాలను సాగు చేస్తున్నారు. బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తారు. రెండు వారాలకోసారి ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని నీటి ద్వారా అందిస్తారు. చీడపీడల నివారణకు కషాయాలు వాడుతున్నారు. పురుగును గుడ్డుదశలోనే నివారించేందుకు నీమాస్త్రం, వేప పిండి వాడుతున్నారు. అయినా పురుగు ఆశిస్తే అగ్ని అస్త్రం ద్రావణం పిచికారీ చేస్తారు. లద్దె పురుగు నివారణకు బ్రహ్మాస్త్రం వాడుతున్నారు. 20 లీటర్ల కషాయాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేస్తున్నారు. వారానికి రెండు కోతలు తెగుతున్నాయి. కిలో రూ.20 నుంచి రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. కూరగాయల సాగుకు ఎకరాకు రూ. 6 వేల నుంచి 8 వేల వరకు ఖర్చు అవుతుండగా, రూ. 60 నుంచి రూ. 70 వేల వరకు నికరాదాయం లభిస్తోంది. కూరగాయలు పండించిన చోట తర్వాత ఏడాది వరి పండిస్తున్నారు. వరి పండించిన చోట తర్వాత ఏడాది కూరగాయలు పండిస్తున్నారు. దీనివల్ల పంట దిగుబడులు బాగున్నాయని ప్రతాప్ చెబుతున్నారు. ప్రకృతి సేద్యం చేసిన తొలి నాళ్లతో పొల్చితే దిగుబడి రెండింతలైంది. అప్పట్లో కూరగాయలు వారానికో కోత తెగితే ఇప్పుడు రెండు కోతలు తెగుతున్నాయి. పూర్తి సొంతంగా తయారు చేసుకున్న ఎరువులతో సాగుచేయడంతో బియ్యం, పప్పుదినుసులు, కూరగాయలు, పండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందంటున్నారు. సేంద్రియ పంటను మంచిర్యాలలో విక్రయిస్తున్నారు. కొంత మంది ఫోన్ ద్వారా సంప్రదించి సీజన్ల వారీగా కొనుగోలు చేస్తున్నారు. ఆదాయం అధికం.. ప్రతాప్ సాగు చేస్తున్న ఎకరం మామిడి తోటలో 60 చెట్లున్నాయి. 15ఏళ్లపాటు రసాయనిక సేద్యంలో ఉన్న తోటను ప్రకృతి సేద్యంలోకి మార్చారు. చెట్ల మధ్య ఎటు చూసినా 45 అడుగుల స్థలం ఉంటుంది. గాలి, వెలుతురు పుష్కలంగా లభిస్తుంది. తొలకరిలో చెట్టుకు ఐదులీటర్ల జీవామృతం పోస్తారు. 10 కిలోల ఆవుపేడ వేసి చెట్ల చుట్టూ దున్నుతున్నారు. పూతదశలో బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం పిచికారీ చేస్తారు. ఫిబ్రవరిలో పిందెదశలో, పురుగుదశలో మరోసారి పిచికారీ చేస్తారు. రసాయనిక సేద్యంలో వచ్చే దిగుబడిలో కంటే ఎక్కువగానే దీని ద్వారా దిగుబడి వస్తోంది. రసాయనిక ఎరువులు, పురుగుల మందులకు ఎకరాకు రూ. 20 వేల వరకు ఖర్చువుతుంది. ప్రకృతి సేద్యంలో రూ. 5 వేల నుంచి 8 వేలకు మించి ఉండదు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చెట్లు బాగుంటే రసాయన సేద్యంలో కన్నా ప్రకృతి సేద్యంలో రెండురెట్లు అధికంగా దిగుబడి తీయవచ్చని ప్రతాప్ తెలిపారు. పాడికి దిగుల్లేదు.. ఎరువులూ కొనక్కర్లేదు! మా వ్యవసాయానికి రెండు ఆవులు, నాలుగు ఎద్దులు, ఒక గేదె పట్టుగొమ్మగా నిలుస్తున్నాయి. వీటికి పొలం నుంచే గడ్డి అందుతుంది. పాడికి దిగుల్లేదు. వీటి పేడ, మూత్రంతో జీవామృతం, ఘనాజీవామృతం, వర్మీ కంపోస్టు తయారు చేసి పంటలకు వేస్తున్నాం. ఎరువులు, పురుగుమందులు కొనాల్సిన అవసరం లేకుండా పోయింది. రసాయన ఎరువుల పంటలతో భూ సారం దెబ్బతినడమే కాకుండా, ఆ పంటలు ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నాయి. అందుకే ప్రకృతి సేద్యం చేస్తున్నా. నా క్షేత్రంలో జూన్లో రైతులకు శిక్షణ ఇస్తున్నా. జీవన ఎరువులు, పురుగుమందుల తయారీ లాబ్ పెట్టి రైతులకు స్వల్ప ధరకే ఇవ్వాలనుకుంటున్నా. ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం రాయితీలు ఇచ్చి, మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే, రసాయనాల్లేని పంటలతో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చు. – కే వీ ప్రతాప్ (98499 89117), గుడిపేట, హాజీపూర్ మం., మంచిర్యాల జిల్లా నువ్వు చేను, పందిరి బీర తోట, వ్యవసాయ క్షేత్రంలో..ఆవుతో ప్రతాప్ –ఆది వెంకట రమణారావు, సాక్షి, మంచిర్యాల ఫొటో జర్నలిస్టు: Vð ల్లు నర్సయ్య -
ఇదిగో ‘సిరి’ లోకం!
ఆరోగ్యం కోసం ఆహారం.. ఆహారం కోసం వ్యవసాయం.. వ్యవసాయం కోసం అడవి! ఇదీ అటవీ వ్యవసాయానికి మూలసూత్రం. రైతు తమకున్న వ్యవసాయ భూమిలో విధిగా (కనీసం 20%) కొద్ది భాగాన్నయినా అటవీ జాతి చెట్ల పెంపకానికి కేటాయించాలని అటవీ వ్యవసాయ (కాడు కృషి) నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్ వలి సూచిస్తున్నారు. పొలం అంతా ఒకే పంట వేయడం అనర్థదాయకం.. సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజ పంటలను ఒకే పొలంలో పక్కపక్కనే కలిపి సాగు చేయాలి.. జీవవైవిధ్యంతోనే సాగుకు జవజీవాలు చేకూరతాయని, చీడపీడల బెడద కూడా తగ్గిపోతుందన్నది సారాంశం. అటవీ కృషిపై డా. ఖాదర్ వలితో ఇటీవలి సంభాషణ నుంచి కొన్ని విశేషాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం.. ప్రకృతిలో ఏ జీవీ, ఏ వ్యవస్థా ఒంటరిగా మన జాలదు, పరస్పరాధారితంగానే విరాజిల్లుతుంటాయి. ప్రకృతితో, అడవితో వ్యవసాయానికి అంతటి విడదాయరాని అనుబంధం ఉందని అంటారు స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి. ఇందుకోసం ‘అటవీ వ్యవసాయ’ (కాడు కృషి) పద్ధతికి ఆయన రూపకల్పన చేశారు. మైసూరుకు సమీపంలోని కిబిని డ్యాం దగ్గరలోని తన పదెకరాల వ్యవసాయ క్షేత్రంలో తాను అనుసరిస్తూ రైతులకూ శిక్షణ ఇస్తున్నారు (అటవీ వ్యవసాయంపై డా. ఖాదర్ వలి అభిప్రాయాలతో కూడిన కథనం ‘సిరిధాన్యాలే నిజమైన ఆహార పంటలు’ శీర్షికన 2017 సెప్టెంబర్ 19న, ‘మిక్సీ–సిరిధాన్యాల మిల్లు’ కథనం 2017 డిసెంబర్ 26న ‘సాగుబడి’లో ప్రచురితమైన సంగతి తెలిసిందే). మూడున్నర ఎకరాల్లో అడవిని పెంచుతూ, పక్కనే మిగతా భూమిలో సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను పండిస్తున్నారు. ఆ వ్యవసాయ క్షేత్రం విశేషాలను పరిశీలిద్దాం. వర్షపు నీటి సంరక్షణకు కందకాలు వ్యవసాయంలో నీటి కొరతను అధిగమించడానికి పొలంలో కందకాలు తవ్వుకోవడం ద్వారా వర్షపు నీటిని ఎక్కడికక్కడ ఇంకింపజేసుకోవడం తెలివైన పని. డా. ఖాదర్ వలి క్షేత్రం కొండ ప్రాంతం కావడంతో (30%) ఏటవాలుగా ఉంటుంది. వాన నీటిని ఒడిసిపట్టుకోవడంతోపాటు భూసారం కొట్టుకుపోకుండా కాపాడుకోవడం కోసం ప్రతి వంద మీటర్లకు ఒక వరుసలో మీటరు లోతు, మీటరు వెడల్పున కందకాలు తవ్వారు. కందకాలలో 10 మీటర్లకు ఒక చోట కట్ట వేశారు. కందకంలో పండ్ల చెట్లు నాటారు. గట్ల మీద 400 మునగ చెట్లు వేశారు. సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలోకి పరిసర పొలాల నుంచి రసాయనిక అవశేషాలతో కూడిన వర్షపు నీరు రాకుండా చూసుకోవడం అవసరం. బయటి నుంచి వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చే వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేయడానికి సరిహద్దు చుట్టూ అడుగు లోతు, అడుగు వెడల్పున కందకం తవ్వారు. సరిహద్దులో అక్కడక్కడా పెద్ద గుంతలు ఏర్పాటు చేశారు. రసాయనిక అవశేషాలకు విరుగుడుగా ఆ గుంతల్లో ‘అటవీ చైతన్య ద్రావణం’ పోసి, వాన నీటిని భూమిలోకి ఇంకింపజేస్తారు. అక్కడి సాధారణ వార్షిక వర్షపాతం 800 ఎం.ఎం.–1000 ఎం.ఎం. మధ్య ఉంటుంది. తొలి పంట వర్షాధారంగానే సాగు చేస్తారు. భూమిలోకి ఇంకింపజేసిన నీటిలో మూడింట రెండొంతుల వరకు.. స్ప్రింక్లర్లతో రెండో పంటకు వాడుతున్నారు. సిరిధాన్యాల సాగు ఎలా? కొర్రలు, సామలు, అరికెలు, అండుకొర్రలు, ఊదలను డా. ఖాదర్ వలి సిరిధాన్యాలుగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. వీటిని ముఖ్య ఆహారంగా తింటూ ఉంటే కొద్దికాలంలో జబ్బులను తగ్గించుకోవడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ఆయన చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సిరిధాన్యాల వినియోగం బాగా పెరిగినందున రైతులు సైతం వీటి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ సిరిధాన్యాల సాగుపై డా. ఖాదర్ వలి సూచనలేమిటో చూద్దాం. మిశ్రమ సాగే మేలు ప్రతి రైతు భూమిలో కనీసం 20% విస్తీర్ణంలో అడవిని పెంచాలి. మిగతా 80% భూమిలో పంటలు పండించుకోవాలి. సిరిధాన్యాలను ఏక పంట (మోనో క్రాప్)గా కాకుండా పప్పుధాన్యాలు (అపరాలు), నూనెగింజలతో కలిపి పండించడం ఉత్తమం. సాగుకు ఎంపిక చేసుకున్న పొలంలో 60% విస్తీర్ణంలో కొర్రలు లేదా సామలు లేదా అరికెలు లేదా అండుకొర్రలు లేదా ఊదలు, 30% విస్తీర్ణంలో కంది/ పెసర/ వేరుశనగ/ శనగ/ మినుము వంటి పప్పుధాన్యాలు, 10% విస్తీర్ణంలో నువ్వులు లేదా కుసుమలు లేదా వేరుశనగ వంటి నూనె నూనెగింజలు పక్కపక్కనే సాగు చేయాలి. పప్పుధాన్యం పంట పక్కన ఉన్న పంటలకు వాతావరణం నుంచి గ్రహించిన నత్రజనిని అందిస్తుంది. ఎకరం నుంచి ఏడు ఎకరాల వరకు విస్తీర్ణాన్ని ఒక గ్రిడ్గా భావించి మిశ్రమ పంటలను ఈ నిష్పత్తిలో సాగు చేసుకోవాలి. ప్రతి గ్రిడ్లో ఈ మూడు రకాల పంటలను పక్కపక్కనే ఉండాలన్న మాట. ఎంత విస్తారమైన పొలంలోనైనా అలాగే గ్రిడ్లుగా విభజించుకొని సాగు చేయాలి. అప్పుడు ప్రతి గ్రిడ్లోనూ అన్ని రకాల పంటలూ సాగవుతూ ఉంటాయి. గ్రిడ్లో గత పంట కాలంలో వేసిన చోట వచ్చే పంట కాలంలో ఇతర పంటలు వేసేలా పంటల మార్పిడి పాటించాలి. ఉదా.. 20 ఎకరాల పొలం ఉంటే 4 ఎకరాల్లో అడవిని పెంచాలి. 16 ఎకరాల్లో రెండు ఎకరాలకో గ్రిడ్గా విభజించి పంటలు పండించాలి. కొన్ని గ్రిడ్లలో సిరిధాన్యాలు ప్రధాన పంటైతే, మరికొన్ని గ్రిడ్లలో కూరగాయలు కూడా ప్రధాన పంటలుగా వేసుకోవచ్చు. టర్పిన్లతో చీడపీడలకు విరుగుడు సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను కలిపి సాగు చేయడం ద్వారా చీడపీడల నుంచి తమను తాము రక్షించుకునే శక్తి పంటలకు కలుగుతుంది. ఏ మొక్కలైనా ఆకుల ద్వారా వైవిధ్య భరితమైన వాసనలను గాలిలోకి వదులుతూ ఉంటాయి. ఈ వాసనలను టర్పిన్స్ అంటారు. కొన్ని రకాల మొక్కలు విడుదల చేసే వాసనలు మనుషుల ఇంద్రియాలు గ్రహించగలుగుతాయి. కొన్నిటిని గ్రహించలేవు. మనుషులు గ్రహించలేని వాసనలను కూడా పిల్లులు, కుక్కలు, పందులు, పక్షులు గ్రహించగలుగుతాయి. ఈ వాసనలు పంటలపై చీడపీడలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి. అండుకొర్ర మొక్కల వాసనలను గ్రహించడం ద్వారా వేరుశనగ మొక్కలు అంతర్గతంగా చీడపీడలను తట్టుకునే శక్తిని సంతరించుకుంటాయి. అందువల్లనే, కనీసం 3 నుంచి 5 రకాల పంటలను కలిపి మిశ్రమ పంటలుగా సాగు చేస్తే ప్రకృతి సమతుల్యత ఏర్పడుతుంది. ఒకే పంటను వేయడం సమస్యలను ఆహ్వానించడమేనని, పాశ్చాత్య ఆలోచనా ధోరణితో వస్తున్న సమస్య ఇదేనని డా. ఖాదర్ అన్నారు. అండుకొర్రలు వర్సెస్ అడవి పందులు అండుకొర్ర పంట మొక్కలు విడుదల చేసే వాసనలు (టర్పిన్లు) అడవి పందులకు సుతరాము గిట్టదు. పొలానికి చుట్టూతా 4 వరుసలుగా అండుకొర్రలను సాగు చేస్తే ఆ పొలం వైపు అడవి పందులు రాకుండా దూరంగా ఉంటాయి. ∙డా. ఖాదర్ పొలంలో మిశ్రమ పంటల సాగు వరి, సిరిధాన్యాల సాగుకు కావాల్సిన నీరెంత? సిరిధాన్యాలుగా మనం పిలుచుకుంటున్న కొర్రలు, అరికలు, అండుకొర్రలు, సామలు, ఊదలను నాలుగు వర్షాలు పడితే చాలు.. అంతగా సారం లేని మెట్ట భూముల్లో కూడా పండించుకోవచ్చు. వరి ధాన్యం, చెరకు వంటి పంటలు పండించడానికి సాగు నీరు పెద్ద మొత్తంలో అవసరమవుతోంది. కిలో వరి బియ్యం పండించానికి 9,000 లీటర్ల నీరు, కిలో సిరిధాన్యాల (కొర్రలు, అరికలు, అండుకొర్రలు, సామలు, ఊదల)ను సాగు చేయడానికి 300 లీటర్ల నీరు చాలు. అంటే, కిలో వరి బియ్యంతో ఐదుగురికి ఒకసారి భోజనం పెట్టవచ్చు. 30 కిలోల సిరిధాన్యాలతో 240 మందికి ఒకసారి భోజనం పెట్టవచ్చు (పట్టిక చూడండి). నీటి వనరులు నానాటికీ క్షీణిస్తున్న ఈ తరుణంలో ప్రధాన ఆహార పంటలుగా సిరిధాన్యాలను సాగు చేసుకోవడమే అన్ని విధాలా ఉత్తమ మార్గమని మనందరం గ్రహించాలని డా. ఖాదర్ చెబుతున్నారు. అటవీ చైతన్య ద్రావణంతో జవజీవాలు నిస్సారమైన భూములను సైతం మూడు నెలల్లో సారవంతం చేయడానికి భూసార వర్థిని అయిన ‘అటవీ చైతన్య’ ద్రావణం ఉపయోగపడుతుందని డా. ఖాదర్ అంటున్నారు. ఇది ఎరువు కాదు. భూమిలో సూక్ష్మజీవ రాశిని ఇబ్బడిముబ్బడిగా పెంపొందించే తోడు (మైక్రోబియల్ కల్చర్) మాత్రమే. అటవీ చైతన్య ద్రావణం తయారు చేసే పద్ధతి: 20 లీటర్ల కుండలో 10 లీటర్ల నీరు పోసి, లీటరు అటవీ చైతన్యం కలిపి, పావు కిలో సిరిధాన్యాల పిండి, పావు కిలో పప్పుల పిండి, 50 గ్రాముల తాటి బెల్లం కలపాలి. దీన్ని రోజూ కలియదిప్పాలి. వారం రోజులకు వాడకానికి సిద్ధమవుతుంది. 21 రోజుల వరకు వాడుకోవచ్చు. ఏమిటి ప్రయోజనం? ఆమ్ల, క్షార గుణాలు సమసిపోయి భూమి సాధారణ స్థితికి చేరుకొని జవజీవాలను సంతరించుకోవడానికి అటవీ చైతన్య ద్రావణం దోహదం చేస్తుంది. లీటరు అటవీ చైతన్య ద్రావణానికి 20 లీటర్ల నీరు కలిపి నేలపై పిచికారీ చేయాలి. సాయంత్రం 5–6 గంటల మధ్య భూమిపై అటవీ చైతన్య ద్రావణాన్ని పిచికారీ చేస్తే మూడు–ఆరు నెలల్లో ఆ భూమి సాగుకు యోగ్యంగా జీవవంతం అవుతుందని డా. ఖాదర్ చెబుతారు. మొదటి నెలలో.. వారానికి 2 సార్లు, రెండో నెలలో.. వారానికోసారి, మూడో నెలలో.. 10 రోజులకోసారి, నాలుగో నెల నుంచి 15 రోజులకోసారి అటవీ చైతన్య ద్రావణం పిచికారీ చేస్తూ ఉంటే భూసారం పెరుగుతుంది. సాయంత్రం వేళల్లో పిచికారీ చేస్తాం కాబట్టి ఉదయం కల్లా నేల పీల్చుకొని నేల జవజీవాలను పొందుతుంది. ఆచ్ఛాదన వేయాల్సిన అవసరం లేదు. ఎండలు మండిపోయే మే నెలలో తప్ప ఏడాది పొడవునా దీన్ని పిచికారీ చేసుకోవచ్చని డా. ఖాదర్ తెలిపారు. అటవీ ప్రసాదం అటవి వ్యవసాయానికి మూలాధారమని డా. ఖాదర్ వలి చెబుతున్నారు. అందుకే పొలంలో 20% శాతంలో అటవీ జాతి చెట్లను పెంచాలని, ఆ చెట్లు రాల్చే ఆకులను పోగు చేసి, వేసవిలో పొలంలో చల్లి, ఆ ఆకులపై ‘అటవీ చైతన్య’ ద్రావణం పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. భూమి లోతుల నుంచి పోషకాలను గ్రహించే చెట్లు రాల్చిన ఆకులే ‘అటవీ ప్రసాదం’ వంటివని, భూమికి పోషకాహారమని అంటారు. అటవీ సహితం చీడపీడల బెడద నుంచి పంటల రక్షణకు ‘అటవీ సహితం’ ద్రావణాన్ని డా. ఖాదర్ వలి వాడుతున్నారు. వివిధ రకాల ఔ«షధ మొక్కల ఆకులతో దీన్ని తయారు చేస్తారు. పాలు కారే మొక్కల ఆకులు 2 రకాలు (జిల్లేడు, మర్రి, పలవర బొప్పాయి వంటివి), 2 చేదు రకాలు (వేప, కానుగ వంటివి), ఆకర్షణీయంగా ఉండే చెట్ల పూలు, ఆకులు (మందార, తంగేడు వంటివి) ఇవన్నీ 6 కేజీలు తీసుకొని.. దంచాలి. దీన్ని కుండలో వేసి లీటరు దేశీ ఆవు మూత్రం, 10 లీటర్ల నీరు కలిపి.. వారం మురగబెట్టాలి. తర్వాత వడకట్టుకొని లీటరుకు 20 లీటర్ల నీరు కలిపి పంటలపై పిచికారీ చేయాలి. అటవీ చైతన్య ద్రావణం ఔషధ మొక్కలు ఒకే పంట సాగు చేయడం మూర్ఖత్వం! పొలం అంతా ఒకే రకం పంటను పండించడం మూర్ఖత్వం. మోనోకల్చర్ నుంచి బయటకు రావాలి. మిశ్రమ పంటలు సాగు చేయాలి. అటవీ కృషి పద్ధతుల్లో 30 రకాల పంటలు పండించమని సూచిస్తున్నాం. కనీసం 5 రకాలైనా పొలంలో పెంచుకోవడం రైతులు అలవాటు చేసుకోవాలి. సిరిధాన్య పంటలకు కూడా కొన్ని చోట్ల కత్తెర పురుగు సోకడానికి కారణం ఒకే పంటను సాగు చేయడమే. పొలంలోని విస్తీర్ణంలో 60% ఏక దళ పంటలు, 30% పప్పుధాన్యాలు, 10% నూనె గింజల పంటలు సాగు చేయాలి. సిరిధాన్య పంటలు, నువ్వులు, గోంగూర, వేరుశనగ వంటి పంటలను కలిపి పండించాలి. కత్తెర పురుగు నివారణకు సీతాఫలం ఆకులు, గింజల ద్రావణం చక్కగా పనిచేస్తుంది. ఒకే పంట పండిస్తూ ఉంటే ఒక పురుగు పోయినా మరొకటి వస్తుంది. మిశ్రమ పంటలే శ్రేయస్కరం. – డాక్టర్ ఖాదర్ వలి, అటవీ కృషి నిపుణులు – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
పంటలు మారితే బతుకు బంగారం
రైతమ్మలు, రైతన్నలు, వ్యవసాయ కార్మికులు.. అష్టకష్టాలు పడి ఆరుగాలం చెమట చిందిస్తే.. ఆ తడితో మొలిచి పండిన గింజలే మనందరి ఆకలి తీరుస్తున్నాయి.అందుకు అన్నదాతకు ప్రతి ముద్దకూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. దొరికీ దొరకని సాయంతో.. నిండీ నిండని డొక్కలతో.. చిన్నా చితకా కమతాల్లో నేలతల్లినే నమ్ముకొని మొక్కవోని మనోబలంతో ముందడుగేసే మట్టి మనుషులందరికీ నిండు మనసుతో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతోంది ‘సాగుబడి’. ప్రకృతి మాత కనుసన్నల్లో సాగే వ్యవసాయంలో కష్టనష్టాలు.. ఒడిదొడుకులెన్నో. జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లిపోయిన 2018 మనకు అందించిన మార్గదర్శనం చేసే ఊసులను స్మరించుకుంటూ.. ప్రకృతికి ప్రణమిల్లుతూ.. సరికొత్త ఆశలతో ముందడుగు వేద్దాం! భారతీయుల్లో 30 శాతం మందికి రక్తహీనత ఉంది. భూతాపోన్నతి వల్ల చాలా ప్రాంతాల్లో సాగు నీటి కొరత తీవ్రంగా ఉంది. వర్షపాతం తగ్గిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ రైతులు వరి, గోధుమ పంటలను వదిలి... మొక్కజొన్న, చిరుధాన్య పంటలు సాగు చేయడం ప్రారంభిస్తే సాగు నీటి బాధలు 33% తీరిపోతాయని ఒక ముఖ్య అధ్యయనం(2018) తేల్చింది. అంతేకాదు, పౌష్టికాహారాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తేవచ్చని అమెరికాకు చెందిన ఎర్త్ ఇన్స్టిట్యూట్, కొలంబియా యూనివర్సిటీ, హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంయుక్తంగా చేసిన అధ్యయనం తేల్చింది. 1996–2009 మధ్యకాలంలో ధాన్యం ఉత్పత్తి గణాంకాల ఆధారంగా ఎంత నీరు ఖర్చయిందో లెక్కగట్టారు. వరి సాగుకు అత్యధికంగా సాగు నీరు ఖర్చవుతోంది. వరికి బదులు మొక్కజొన్న, రాగి, సజ్జ, జొన్న వంటి చిరుధాన్యాలు సాగు చేస్తే సాగు నీరు ఆదా కావడమే కాకుండా.. ఐరన్ (27%), జింక్ (13%) వంటి పోషకాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని ‘సైన్స్ అడ్వాన్సెస్’లో ప్రచురితమైన ఈ అధ్యయనం విశ్లేషించింది. అన్ని జిల్లాలకూ ఒకే పరిష్కారం కుదరదు. ప్రతి జిల్లా స్థితిగతులను బట్టి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించాలి అని కొలంబియా యూనివర్సిటీ ఎర్త్ ఇన్స్టిట్యూట్కి చెందిన కైలె డావిస్ అంటున్నారు. అధిక నీటిని వాడుకుంటూ అధిక ఉద్గారాలను వెలువరిస్తున్న వరికి బదులు.. అంతకన్నా పోషక విలువలున్న, కొద్దిపాటి నీటితో పండే మిల్లెట్స్ను పండించి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలందరికీ అందించవచ్చు. వీటిని సేంద్రియంగానే పండించవచ్చు అని ఆయన అంటున్నారు. 2018ని భారత్ జాతీయ చిరుధాన్య సంవత్సరంగా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. -
వరి వైపే రైతుల మొగ్గు!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రబీ సీజన్లో రైతులు వరి వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో ఇతర పంటల సాగు విస్తీర్ణం తగ్గి వరి విస్తీర్ణం పెరుగుతోంది. ఈ పరిస్థితి తెలంగాణలోనూ కనిపిస్తుండటం గమనార్హం. అక్టోబర్లో అనేకచోట్ల భారీ వర్షాలు కురవడం, చెరువులు, బావుల్లోకి నీరు వచ్చి చేరడంతో వరి పంట వేయడమే మంచిదని రైతులు భావిస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు రబీలో 11.05 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 11.21 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గతేడాదితో పోలిస్తే 16 లక్షల ఎకరాల్లో తేడా కనిపిస్తోంది. గతేడాది ఇదే సమయానికి 5.08 కోట్ల ఎక రాల్లో గోధుమ పంట సాగు చేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు 4.77 కోట్ల ఎకరాల్లో మాత్రమే గోధుమ వేశారు. ఏకంగా 31 లక్షల ఎకరాల్లో గోధుమ సాగు విస్తీర్ణం తగ్గినట్లు కేంద్ర వ్యవసాయశాఖ నివేదిక వెల్లడించింది. ఇక నూనె గింజలను గతేడాది ఇదే సమయానికి 1.80 కోట్ల ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడా ది ఇప్పటివరకు 1.69 కోట్ల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. అయితే వరి మాత్రం గతేడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది. తగ్గిన ఇతర పంటల సాగు దేశవ్యాప్తంగా ఉన్న సరళిలో భాగంగా రాష్ట్రంలోనూ రైతులు వరి పంటవైపే మొగ్గు చూపుతున్నారని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే రబీ సాగు విస్తీర్ణం మాత్రం గతేడాదితో పోలిస్తే నిరుత్సాహంగా ఉంది. ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణ రబీ సాధారణ సాగు విస్తీర్ణం 31.8 లక్షల ఎకరాలు. కాగా గతేడాది ఇదే సమయానికి 9.77 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు 7.50 లక్షల ఎకరాలకు సాగు పడిపోవడం గమనార్హం. గతేడాదికి ఇప్పటికి 2.27 లక్షల ఎకరాల తేడా కనిపిస్తోంది. ఇతర పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. నీటి నిల్వలతో వరివైపే చూపు మరోవైపు అక్టోబర్లో కురిసిన వర్షాలతో నీటి నిల్వలు కనిపిస్తుండటంతో రైతులు వరి వైపు మొగ్గుచూపుతున్నారని వ్యవసాయశాఖ చెబుతోంది. రబీలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 15.1 లక్షల ఎకరాలు కాగా, గతేడాది ఈ సమయానికి 25 వేల ఎకరాల్లో నాట్లు వేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు 40 వేల ఎకరాల్లో నాట్లు వేశారు. -
పప్పుధాన్యాల ఎగుమతికి ఓకే
రైతులకు మేలు చేకూర్చేలా అన్ని రకాల పప్పుధాన్యాల ఎగుమతులకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఆ మేరకు ఎగుమతులపై నిషేధం ఎత్తివేతకు ఆమోదం తెలిపారు. సాక్షి, న్యూఢిల్లీ: రైతులకు మేలు చేకూర్చేలా అన్ని రకాల పప్పుధాన్యాల ఎగుమతులకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఆ మేరకు ఎగుమతులపై నిషేధం ఎత్తివేతకు ఆమోదం తెలిపారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన–అర్బన్ పథకంలో ఇళ్ల నిర్మాణాల కార్పెట్ ఏరియాను పెంచేందుకు కూడా కేబినెట్ అనుమతించింది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘రైతులు తమ ఉత్పత్తుల్ని మంచి ధరకు అమ్ముకునేందుకు పప్పు ధాన్యాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేత నిర్ణయం దోహదం చేస్తుంది. అలాగే పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగేందుకు రైతులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది’ అని చెప్పారు. మన అవసరాలకు మించి అధికంగా పండే పప్పుధాన్యాలకు ప్రత్యామ్నాయ మార్కెట్గా ఈ ఎగుమతులు ఉపయోగపడతాయని కేంద్రం భావిస్తోంది. కాగా పప్పు దినుసులపై ఎగుమతి, దిగుమతి విధానాన్ని సమీక్షించేందుకు కేంద్ర ఆహార, పౌర సరఫరా కార్యదర్శి నేతృత్వంలోని కమిటీకి అధికారం కల్పిస్తూ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) నిర్ణయం తీసుకుంది. పప్పు ధాన్యాల నిల్వల పరిమాణం, ఉత్పత్తికి అనుగుణంగా దిగుమతి సుంకాల్లో మార్పులు, డిమాండ్, స్థానిక, అంతర్జాతీయ ధరలు తదితర అంశాల్ని కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది. 2016–17లో ప్రభుత్వం 20 లక్షల టన్నుల పప్పుధాన్యాల్ని మద్దతు ధర చెల్లించి సేకరించింది. అంత భారీ మొత్తంలో పప్పుధాన్యాల్ని సేకరించడం ఇదే తొలిసారి. యాంటీ–ప్రాఫిటీరింగ్ అథారిటీకి... జీఎస్టీలో భాగంగా నేషనల్ యాంటీ–ప్రాఫిటీరింగ్ అథారిటీ ఏర్పాటుకూ కేబినెట్ పచ్చజెండా ఊపింది. జీఎస్టీలో పన్ను తగ్గింపు లాభం వినియోగదారుడికి అందకపోతే.. ఈ అథారిటీకి ఫిర్యాదు చేయొచ్చని కేంద్ర మంత్రి రవిశంకర్ తెలిపారు. ఈ కమిటీ ఏర్పాటుకు ఇప్పటికే జీఎస్టీ మండలి ఆమోదం తెలిపింది. ఐదుగురు సభ్యుల ఈ కమిటీకి కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా నేతృత్వం వహిస్తారు. రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా, సీబీఈసీ చైర్మన్ వనజా సర్నా, రెండు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. చైర్మన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్ల పాటు కమిటీ కొనసాగుతుంది. ఐసీడీఎస్లో నాలుగు పథకాల్ని నవం బర్ 2018 వరకూ కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందులో అంగన్వాడీ సేవలు, సబల, బాలల పరిరక్షణ సేవలు, జాతీయ శిశు సంరక్షణ పథకాలు ఉన్నాయి. కింది కోర్టుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అమలు చేస్తున్న ‘నేషనల్ మిషన్ ఫర్ జస్టిస్ డెలివరీ అండ్ లీగల్ రిఫార్మ్స్’ పథకాన్ని మార్చి 31, 2020 వరకూ పొడిగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ పథకంలో 3 వేల కోర్టు గదులు, కింది కోర్టుల్లోని న్యాయాధికారుల కోసం 1800 గృహ సముదాయాలకు రూ. 3,320 కోట్లు వెచ్చిస్తున్నారు. కార్పెట్ ఏరియా పరిమితి పెంపు పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై–అర్బన్) లో మధ్య తరగతి ఆదాయ వర్గాల(ఎంఐజీ) ఇళ్ల నిర్మాణాలకు కార్పెట్ ఏరియా పెంపునకు కేబినెట్ ఆమోదించింది. ఎంఐజీ–1 కేటగిరీలో (రూ.6 లక్షలు–12 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు) కార్పెట్ ఏరియాను 90 చ.మీ.ల(968 చ.అడుగులు) నుంచి 120 చ.మీ.(1291 చ.అ.)లకు, ఎంఐజీ–2 కేటగిరీ(రూ. 12 లక్షలు– 18 లక్షల ఆదాయం)లో పరిమితిని 110 చ.మీ.ల (1184 చ.అ.) నుంచి 150 చ.మీ.లకు(1614 చ.అ.) పెంచారు. ఈ మార్పు జనవరి 1, 2017 నుంచే వర్తించేలా సవరించారు. ఎంఐజీ–1లో 9 లక్షల వరకూ రుణంపై 4% వడ్డీ రాయితీ, ఎంఐజీ–2లో రూ.12 లక్షల వరకూ రుణంపై 3% వడ్డీ రాయితీ అమల్లో ఉంది. -
కూరగాయలు, పప్పుల రేట్లు భారీగా తగ్గాయ్!
రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో రికార్డు కనిష్టానికి పడిపోయింది. కూరగాయలు, పప్పుధాన్యాల రేట్లు భారీగా తగ్గిపోవడంతో వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మే నెలలో 2.18 శాతంగా నమోదైంది. పండ్ల ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ, కూరగాయలు ధరలు తగ్గుట దీనికి బాగా సహకరించింది. వస్త్రాలు, ఇంధనం, గృహాల రేట్లు కూడా తగ్గినట్టు ప్రభుత్వ డేటాలో వెల్లడైంది. రాయిటర్స్ పోల్ లో ఈ ద్రవ్యోల్బణం 2.60 శాతంగా ఉంటుందని విశ్లేషకులు అంచనావేశారు. అయితే ఏప్రిల్ నెలలో వినియోగదారుల ధరల సూచీ 2.9 శాతానికి ఎగిసింది. ప్రస్తుతం ఈ ద్రవ్యోల్బణం 2012 కనిష్ట స్థాయిలకు దిగొచ్చింది. 2016 మే నెలలో ఇది 5.76 శాతం ఉంది. ఈ నెలలో మొత్తంగా ఆహార ద్రవ్యోల్బణం నెగిటివ్ లో -1.05 శాతంగా నమోదైంది. కూరగాయల ధరలు 13.44 శాతం కిందకి పడిపోయాయి. పప్పులు, ఉత్పత్తులు కూడా 19.45 శాతం పడిపోయాయి. ద్రవ్యోల్బణం పెరిగే అంచనాలతో రిజర్వు బ్యాంకు ఇటీవల జరిగిన పాలసీ విధానంలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. ప్రస్తుతం తగ్గిన ద్రవ్యోల్బణంతో ఆగస్టులో నిర్వహించబోయే మీటింగ్ లో కచ్చితంగా రేట్లను తగ్గిస్తుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 25 బేసిస్ పాయింట్లు వరకు తగ్గించవచ్చని పేర్కొంటున్నారు. రుతుపవనాలు మంచిగా ఉంటే, కనీస మద్దతు ధరల్లో ఎలాంటి పెంపు ఉండదని, దీంతో ఆహార ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందని ఎస్క్వైర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ అడ్వయిజర్స్ సీఈవో సామ్రాట్ దాస్ గుప్తా చెప్పారు. -
భారీగా ఆహార ధాన్యాల దిగుబడి
న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశవ్యాప్తంగా మంచి వర్షపాతం నమోదుకావడంతో ఆహార ధాన్యాలు రికార్డు స్థాయిలో దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ఏడాది జూన్ నాటికి 271.98 మిలియన్ల టన్నుల ఆహార ధాన్యాలు దిగుబడి రానున్నాయి. ఇందులో వరి, గోధుమ, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలు సైతం గత ఏడాది దిగుబడికంటే అధికంగానే చేతికి రానున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి 251.57 మిలియన్ టన్నులుగా నమోదైంది. 2013–14 ఏడాదిలో 265.04 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయని వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2016–17 ఏడాదికి గాను 108.86 మిలియన్టన్నుల వరి దిగుబడి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గత ఏడాది జూలై నాటికి 104.41 మిలియన్ టన్నులు వరి ఉత్పత్తి కాగా, 2013–14 ఏడాదికి గాను రికార్డు స్థాయిలో 106.65 మిలియన్ టన్నుల వరి దిగుబడి నమోదైనట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. ఇక గోధుమ విషయానికొస్తే ఈ ఏడాది 96.64 మిలియన్ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేస్తోంది. 2015–16 ఏడాదిలో 92.29 మిలియన్ టన్నుల దిగుబడి లభించింది. -
పప్పుధాన్యాల సాగు భేష్
సాక్షి, హైదరాబాద్: ఈ రబీలో అంచనాలకు మించి పప్పుధాన్యాలు సాగయ్యాయి. ప్రభుత్వం ఈసారి పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలనుకున్న నేపథ్యంలో సాగు పెరగడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా సాధారణంగా 3.17 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 4.52 లక్షల ఎకరాల్లో (146%) సాగైనట్లు తెలంగాణ వ్యవసాయశాఖ తన నివేదికలో తెలిపింది. సాధారణం కంటే ఏకంగా 1.35 లక్షల ఎక రాల్లో సాగయ్యాయి. అందులో శనగ సాధారణ సాగు 2.20 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3.05 లక్షల ఎకరాల్లో (158%) సాగైంది. పెసర సాధారణ సాగు 35 వేల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 37,400 ఎక రాల్లో (127%) సాగైంది. మినుము సాధారణ సాగు 32,500 ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 45 వేల ఎకరాల్లో (141%) సాగైంది. ఇక రబీలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 13.32 లక్షల ఎకరాలు కాగా... ఏకంగా 14.60 లక్షల ఎకరాల్లో (110%) నాట్లు పడ డం గమనార్హం. మొక్కజొన్న సాధారణ విస్తీ ర్ణం 4.07 లక్షల ఎకరాలు కాగా,3.80 లక్షల ఎకరాల్లో (93%) సాగైంది. రాష్ట్రవ్యాప్తంగా రబీ పంటల సాగు విస్తీర్ణం 97 శాతానికి చేరు కుంది. సాధారణంగా అన్ని పంటలు 30.20 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 29.45 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వంద శాతానికి మించి పంటల సాగు జరిగింది. -
రబీ జోష్.. సాగు భేష్..!
• 12.08 లక్షలకు 9.26 లక్షల హెక్టార్లలో పంటలు • పప్పుధాన్యాల సాగుకు పెరిగిన ప్రాధాన్యం • 142 శాతంగా పప్పుధాన్యాల సాగు • ఆరు జిల్లాల్లో 100 నుంచి 127 శాతం.. • రాష్ట్రంలో సగటున 77 శాతం పంటల సాగు సాక్షి, కరీంనగర్: కాలం కలసిరావడంతో ఈసారి రబీసాగు మంచి జోష్లో ఉంది. రెండు మూడేళ్లలో ఎన్నడూ లేనివిధంగా సాగు జోరందుకుంది. తెలంగాణలో 31 జిల్లాల్లో ఇప్పటికే సగటున 77 శాతానికి చేరింది. మొత్తంగా పారిశ్రామిక ప్రాంతమైన మేడ్చల్ను మినహాయిస్తే ఐదు జిల్లాల్లో 25 నుంచి 50 శాతం, 11 జిల్లాల్లో 51 నుంచి 75 శాతం, ఏడు జిల్లాల్లో 76 నుంచి 100 శాతం కాగా, ఆరు జిల్లాల్లో 100 నుంచి 127 శాతానికి సాగు పెరిగింది. పంటల సాగుపై వ్యవసాయశాఖ అంచనాలతో పోలిస్తే ఆరుతడి పంటలు ఎక్కువగా వేశారు. కందు లు, శనగ, పెసర, మినుముల సాగు 100 నుంచి 127% కాగా, మొక్కజొన్న, వేరుశనగ 76% నుంచి 100% అయ్యింది. తర్వాతి స్థానంలో వరి, జొన్న, మిర్చి, పొగాకు, ఆ తర్వాత గోధుమ, రాగులు, ఉల్లి, పొద్దుతిరుగుడు పంటలు సాగయ్యాయి. పప్పుధాన్యాలకు పెరిగిన ప్రాధాన్యం రాష్ట్రంలో మొత్తంగా చూస్తే వ్యవసాయశాఖ అంచనాలను మించి పప్పుధాన్యాల సాగు కు రైతులు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వరి, గోధుమ, జొన్న, సజ్జలు, మొక్కజొన్న తదితర ముతక ధాన్యాలు 2.10 లక్షల హెక్టార్లలో సాగవుతాయని అంచనా వేయగా.. 1.61 లక్షల హెక్టార్ల (77శాతం) లో వేశారు. కందులు, శనగ, పెసర, మినుములు తదితర పప్పుధాన్యాలు 1.27 లçక్షల హెక్టార్ల సాగు అంచనాకు 1.79 లక్షల హెక్టార్ల (142 శాతం)లో సాగు చేశారు. ఇందులో కందులు 154 శాతం, శనగలు 158, పెసర 124 శాతం వేశారు. మిర్చి సాగు 118% కాగా, వేరుశనగ 95%గా నమోదయ్యింది. మొత్తంగా నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమ తదితర నూనెగింజలు 1.95 లక్షల హెక్టార్లలో సాగవుతాయనుకుంటే, 1.57 లక్షల హెక్టా ర్లతో 81 శాతంగా ఉంది. ఇదిలావుంటే ఈ రబీలో పంటల సాగు శాతం జిల్లాల వారీ గా చూస్తే అత్యధికంగా కామారెడ్డి, సిద్ది పేట, మహబూబాబాద్, వనపర్తి, ఆదిలా బాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో 94 శాతం నుంచి 162 శాతం వరకు పంటలు సాగు కాగా, అత్యల్పంగా మేడ్చల్, రంగా రెడ్డి, నల్లగొండ, సంగారెడ్డి తదితర జిల్లాలు న్నాయి. ఇందులో కొన్ని పారిశ్రామిక ప్రాంతాలైనప్పటికీ అతి తక్కువ హెక్టార్ల లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. చి‘వరి’వరకు సా..గుతోంది నవంబర్ చివరివారం నుంచి ఊపందు కున్న వరినాట్లు తెలంగాణ జిల్లాల్లో ఇంకా సాగుతున్నాయి. ఈ రబీలో 5.33 లక్షల హెక్టార్లలో సాగు లక్ష్యం కాగా, ఇప్పటికీ 3.53 లక్షల హెక్టార్ల (66 శాతం)లో వేశారు. గతేడాదితో పోలిస్తే ఇప్పటికే మూడింతలు ఎక్కువ అయ్యింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,12,241 హెక్టార్లు వరి సాగు లక్ష్యం కాగా, 74,998 హెక్టా ర్లలో సాగైంది. పెద్దపల్లి జిల్లాలో ముందు గానే వరినాట్లు మొదలు కాగా, 29,590 హెక్టార్ల సాగు అంచనాకు అత్యధికంగా 34,348 హెక్టార్లలో వరి వేశారు. సిద్ది పేటలో 29,997 హెక్టార్లకు 39,688 హెక్టార్లలో, నిజామాబాద్లో 51,923లకు 45,333 హెక్టార్లు వరి వేశారు. గద్వా లలో అసలే వరినాట్లు లేవు. నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, ఎల్ఎండీ తదితర ప్రాజెక్టుల కింద నీటి విడుదల ప్రణాళిక ఇటీవలే ప్రకటించగా వరినాట్లు ఇంకా సాగుతున్నాయి. -
విత్తనోత్పత్తితో స్వయం సమృద్ధి
నంద్యాలరూరల్: ఏటా ఖరీఫ్ సీజన్లో విత్తనాల కోసం రైతులు పరిగెత్తడం సర్వ సాధారణంగా మారిందని, ఈ పద్ధతికి స్వస్థి పలికి రైతులే సొంతంగా విత్తనోత్పత్తి చేసుకోవాలని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం ఏడీఆర్ గోపాల్రెడ్డి కోరారు. సోమవారం ఆర్ఏఆర్ఎస్ సమావేశ మందిరంలో నంది రైతు సమాఖ్య ఆధ్వర్యంలో మిరప, అపరాల సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు సొంతంగా వ్తినాలను ఉత్పత్తి చేసుకొని సాగు చేసుకోవడానికి అనువైన వాతావరణం జిల్లాలో ఉందన్నారు. శనగ, వేరుశనగ, జొన్న, కొర్ర, సోయచిక్కుడు, పెసర, మినుము, కంది పంటల సాగులో కర్నూలు జిల్లా ముందుందని వివరించారు. సుమారు లక్ష ఎకరాల్లో అపరాల సాగు అంతర్పంటగా సాగులో ఉందన్నారు. శనగ సాగులో కర్నూలు జిల్లా దేశంలో మొదటి స్థానంలో ఉందని వివరించారు. రైతులు మూడేళ్లకోసారి విత్తన, పంట మార్పిడి చేపట్టాలని సూచించారు. నందిరైతు సమాఖ్య ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించడం మంచి సంప్రదాయమన్నారు. కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎన్.నాగరాజరావు, డాక్టర్ జయలక్ష్మి, నంది రైతు సమాఖ్య అధ్యక్షుడు ఉమామహేశ్వరరెడ్డి, కార్యదర్శి ఎంవీ కృష్ణారెడ్డి, రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
ఇకపై పోస్టాఫీసుల్లో పప్పు దినుసుల విక్రయం
న్యూఢిల్లీ: పోస్టాఫీసుల్లో రాయితీలో పప్పు దినుసులను అమ్మాలని కేంద్రం నిర్ణయించింది. శుక్రవారం కేంద్ర వినియోగదారుల వ్యవ హారాల శాఖ కార్యదర్శి హేమ్ పాండే నేతృత్వంలో జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలు, రాష్ట్రాల్లో ప్రభుత్వ దుకాణాలు అందుబాటులో లేకపోవడం, రానున్న పండుగలను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో పప్పులను అమ్మనున్నారు. ముఖ్యంగా కంది, మినప, శనగపప్పులను విక్రయించనున్నారు. వీటిని అత్యవసర నిల్వల నుంచి వినియోగదారులకు రాయితీతో అమ్ముతామని, ఇందుకోసం 20 లక్షల టన్నుల పప్పు దినుసులను సేకరిస్తామని ఓ అధికారి చెప్పారు. -
పప్పు ధాన్యాల ధరలకు కళ్లెం..!
న్యూఢిల్లీ: నింగిని తాకుతున్న పప్పుధాన్యాల ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. పప్పుధాన్యాల నిల్వలను భారీ ఎత్తున పెంచాలని ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) నిర్ణయించింది. ప్రస్తుతం 8 లక్షలుగా ఉన్న బఫర్ స్టాక్ ను 20 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. దేశీయ సేకరణ ద్వారా 10 లక్షల టన్నులు, దిగుమతి ద్వారా 10 లక్షల టన్నులను సేకరించనున్నట్టుతెలిపింది. పప్పుధాన్యాల నిల్వలు పెంచితే అది భవిష్యత్తులో ధరలకు కళ్లెం వేయడానికి ఉపయోగపడుతుందని సీసీఈఏ అంచనా వేస్తోంది. కాగా ఈ ఏడాది జూన్ లో సబ్సిడీపై కిలో రూ.120కు విక్రయించేందుకు వీలుగా పప్పుధాన్యాల నిల్వలను 8లక్షల టన్నులకు పెంచిన సంగతి తెలిసిందే. -
31 రకాల పప్పులతో..
అబిడ్స్: ప్రతి సంవత్సరం వెరైటీ గణనాథులను ప్రతిష్టిస్తున్న గోషామహల్లోని హిందీనగర్ బాల యువమండలి ఈ సంవత్సరం వినూత్న తరహాలో 31 రకాల పప్పుదినుసులతో గణనాథుడిని తీర్చిదిద్దారు. గత 35 రోజులుగా యువ మండలి యువకులు పప్పులు, ఇతర ఆహార ధాన్యాలతో 8.7 అడుగుల విఘ్నేశ్వరునికి రూపకల్పన చేశారు. గతంలో అమెరికన్ డైమండ్స్తో గణనాధున్ని నెలకొల్పగా... ఈ సంవత్సరం కందిపప్పు, శెనగపప్పు, పెసరపప్పు, పుట్నాల పప్పు, మినపప్పు, ఎర్రపప్పు, శెనగలు, రాజ్మా పప్పు, జొన్నలు, కాబూద్ చెన, పల్లీలతో పాటు పలు రకాల ఆహార ధాన్యాలతో విఘ్నేశ్వరుడిని తయారుచేశారు. యువ మండలి అధ్యక్షులు ఆకాష్ అగర్వాల్, మండలి యువకులు హితేష్ అగర్వాల్, కృష్ణసేన్, సంతోష్కుమార్, శుభం అగర్వాల్, యశ్ అగర్వాల్, శుభంలు ఈ గణనాధున్ని రేయింబవళ్లు శ్రమించి తీర్చిదిద్దారు. -
పప్పుల ‘మద్దతు’ పునస్సమీక్ష
బఫర్ స్టాక్ 20 లక్షల టన్నులకు పెంపు: కేంద్రం న్యూఢిల్లీ : చుక్కలనంటిన పప్పుధాన్యాల ధరల నియంత్రణ, రైతులను ప్రోత్సహించేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తిదారులకు ప్రస్తుతమిస్తున్న కనీస మద్దతు ధర, బోనస్లపై పునస్సమీక్షించేందుకు ప్రత్యేక కమిటీని నియమించాలని నిర్ణయించింది. అలాగే బఫర్ స్టాక్ను 8 లక్షల టన్నుల నుంచి 20 లక్షల టన్నులకు పెంచనున్నట్టు తెలిపింది. సోమవారం ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ అధ్యక్షతన సమావేశమైన ఉన్నత స్థాయి మంత్రుల బృందం ఈ మేరకు నిర్ణయించింది. ఇందులో పాల్గొన్న ఆహార మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ భేటీ వివరాలను విలేకరులకు తెలిపారు. ‘పప్పుధాన్యాలపై దీర్ఘకాలిక విధానాన్ని రూపొందించేందుకు ముఖ్య ఆర్థిక సలహాదారు నేతృత్వంలో కమిటీ వేయాలని నిర్ణయించాం రైతులకిచ్చే కనీస మద్దతు ధర, బోనస్ తదితర అంశాలపై కమిటీ కసరత్తు చేసి రెండు వారాల్లో నివేదిక ఇస్తుంది. దాని ఆధారంగా కచ్చితమైన విధానాన్ని తెచ్చి, దేశంలో పప్పుల సాగును ప్రోత్సహించాలన్నది లక్ష్యం’ అని చెప్పారు. 2016-17 పంట సంవత్సరానికి(జూలై-జూన్) కేంద్రం ఇప్పటికే మద్దతు ధర ప్రకటించింది. దేశంలో కొరతను దృష్టిలో పెట్టుకుని పప్పుధాన్యాలు అధికంగా పండే కెనడా వంటి దేశాల నుంచి భారీ దిగుమతులు చేసుకోవడానికి యత్నిస్తామన్నారు. బఫర్ స్టాక్ను 20 లక్షల టన్నులకు పెంచనున్నామని, రాష్ట్రాలకు కిలో రూ.120 చొప్పున సబ్సిడీపై సరఫరా చేసేందుకు 2016-17కు సంబంధించి ఇప్పటికే 1.19 లక్షల టన్నుల కందిపప్పు సేకరించామన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్తతతో కేంద్రానికి చెడ్డపేరు వస్తోందని, తమ వదద ఉన్న పప్పులను తీసుకెళ్లాలని రాష్ట్రాలను కోరారు. -
ఇంటింటా చిటపట
మండుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలు మార్కెట్కు వెళ్లాలంటనే భయమేస్తోందంటున్న జనం 15% వరకూ పెరిగిన నూనెల ధరలు కుతకుతలాడుతున్న పప్పులు.. బియ్యం, చక్కెర, అల్లం, వెల్లుల్లి ధరలూ నింగికి.. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఇప్పటికే పెరిగిన స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులతో ప్రజల విలవిల ప్రభుత్వం వెంటనే కల్పించుకుని ధరలు తగ్గించే చర్యలు చేపట్టాలని డిమాండ్ పచ్చిమిర్చి రూ. 100 పైనే కిలో టమాటా రూ. 90 బీరకాయ, చిక్కుడు రూ. 80పైనే సాక్షి నెట్వర్క్: కూరగాయల ధరలు కొండెక్కాయి.. పప్పులు ఎంతకూ దిగిరానంటున్నాయి.. నూనెలు మంటెక్కుతున్నాయి.. బియ్యం ధరలు చుక్కలను తాకుతున్నాయి.. చక్కెర చేదెక్కిపోయింది.. సంచుల్లో డబ్బులు తీసుకెళ్లి జేబుల్లో సరుకులు తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తోంది.. సగటు మనిషి జీవితం ఆగమాగమవుతోంది.. పేదలు, మధ్యతరగతి జనాలు విలవిల్లాడిపోతున్నారు. వంద రూపాయలు పట్టుకుని బజారుకు వెళితే ఒక్కరోజుకు సరిపడా సరుకులు కూడా రాక లబోదిబోమంటున్నారు. ఇప్పటికే భారీగా పెరిగిన స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులతో సతమతమవుతున్నవారు ధరల పెంపుతో నిండా ఆవేదనలో కూరుకుపోతున్నారు. ధరల మంటతో ఇలా పేదలు, మధ్య తరగతి అల్లాడుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. అటు కేంద్ర ప్రభుత్వం ‘అచ్ఛేదిన్ ఆగయే’ అంటూ డప్పు కొట్టుకుంటోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ వెలిగిపోతోందని ప్రకటనలు చేస్తోంది. నిత్యావసరాల ధరలు తగ్గించడంపై మాత్రం ఎవరికీ పట్టింపు లేదు. కొనాలంటే భయం.. రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూరగాయల ధరలు 30 శాతానికిపైగా పెరగగా.. నిత్యావసరాల ధరలు 15 శాతం వరకు పెరిగాయి. టమాటా, పచ్చిమిర్చి వంటివి కిలో రూ.100కు చేరుకున్నాయి. బీరకాయ, బెండకాయ, చిక్కుడు, కాకర, క్యాబేజీ వంటివి వాటితో పోటీ పడుతున్నాయి. పాలకూర, మెంతికూర, కొత్తిమీర, తోటకూర వంటి ఆకుకూరలన్నీ పది రూపాయలకు నాలుగైదు కట్టలు చొప్పున విక్రయించేవారు. ప్రస్తుతం పది రూపాయలకు రెండు కట్టలు కూడా ఇవ్వడం లేదు. మార్కెట్లకు వెళుతున్నవారు ఒక్కో కూరగాయలను పావుకిలోకు మించి కొనేందుకు సాహసించడం లేదు. ఇక మార్కెట్లకు దూరంగా ఉన్న ప్రాంతాల్లోని దుకాణాలు, తోపుడు బండ్లు వంటి వాటిలో కిలోకు మరో పది ఇరవై రూపాయలు అదనంగా విక్రయిస్తున్నారు. హైదరాబాద్లోని గుడిమల్కాపూర్, బోయిన్పల్లి తదితర హోల్సేల్ మార్కెట్లతోపాటు మెహిదీపట్నం, ఎర్రగడ్డలోని రైతుబజార్లలోనూ కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. నెల క్రితం హోల్సేల్ మార్కెట్లో కిలో రూ.7కు లభించిన టమాటా ఇప్పుడు రూ.60 నుంచి రూ.70 మధ్య పలుకుతోంది. ఇది రిటైల్కు వచ్చే సరికి ప్రాంతాన్ని బట్టి రూ.90-100 వరకు విక్రయిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంట్లో వారానికి సరిపడా కూరగాయల కోసం నెల రోజుల కింద రూ.300 వరకు ఖర్చు కాగా.. ఇప్పుడది రూ.550-600కు చేరుకోవడం గమనార్హం. ఇక అప్పుడప్పుడూ చుక్కలనంటే ధరలతో భయపెట్టే ఉల్లిగడ్డ మాత్రం ఇప్పుడు తక్కువ ధరకే (కిలో రూ.15కే) దొరుకుతుండడం గమనార్హం. ఈ జ్ఞాపకం మధురమే! కందిపప్పు కిలోకు ఒక రూపాయి డెబ్బై పైసలు, నూనె కిలోకు నాలుగున్నర రూపాయలు.. భలే తక్కువ ధరలు కదా! దాదాపు 45 ఏళ్ల కింద 1971లో రాసిన సరుకుల చిట్టా ఇది. మధుర జ్ఞాపకాలు అంటూ ఈ చిత్రం ఫేస్బుక్లో చెక్కర్లు కొడుతోంది. అప్పట్లో నాలుగు రకాల పప్పులు ఎనిమిది కిలోలు, మూడు కిలోల నూనె, పావుకిలో నెయ్యి, రెండు కేజీల చక్కెర, 2 సబ్బులు, పోపు సామగ్రి అంతా కలిపి కేవలం 40 రూపాయల 75 పైసలకే ఇచ్చేశారు. నిజంగా ఇది మధుర జ్ఞాపకమే! నిత్యావసరాలు భగ్గు కూరగాయలే కాదు బియ్యం, పప్పులు, నూనెలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా అనూహ్యంగా పెరిగాయి. గత ఏడాది హోల్సేల్ మార్కెట్లో రూ.110కు కిలోచొప్పున లభించిన కందిపప్పు ఇప్పుడు రూ.150 దాటింది. అది రిటైల్ దుకాణాలకు వచ్చే సరికి కిలో రూ.180 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు. లీటర్ వేరుశనగ నూనె రూ.100 నుంచి రూ.125కు, సన్ఫ్లవర్ నూనె రూ.80 నుంచి రూ.95కు పెరిగాయి. పేదలు వినియోగించే పామాయిల్ ధర కూడా లీటర్ రూ.65 నుంచి రూ.75కు పెరిగింది. బియ్యం, గోధుమలు వంటి వాటి ధరలూ 15 శాతం వరకూ పెరిగాయి. ఇక చింతపండు, అల్లం, వెల్లుల్లి, చక్కెర వంటి వాటి ధరలు కూడా బాగా పెరిగాయి. ధరల పెంపుపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కందిపప్పు కొనడం మానేశామని, ఇప్పుడు టమాటా వంటి కూరగాయలను కూడా కొనలేని పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కల్పించుకుని నిత్యావసరాల ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తగ్గిన సాగు కొన్నేళ్లుగా కొనసాగుతున్న తీవ్ర వర్షభావ పరిస్థితులుతో కూరగాయల సాగు తగ్గిపోయింది. భూగర్భజలాలూ అడుగంటడంతో నీళ్లు లేక చిన్న రైతులు కూడా కూరగాయలు పండించలేకపోతున్నారు. రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, మదనపల్లి, అనంతపురం ప్రాంతాల్లో కూరగాయలు సాగవుతుంటాయి. కానీ కరువు పరిస్థితుల కారణంగా పంటల సాగు తగ్గింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో రైతులు అత్యధికంగా కూరగాయల సాగు చేసి హైదరాబాద్ నగరంలో విక్రయిస్తుంటారు. వారిలో ఈసారి సగం మంది కూడా కూరగాయలు సాగు చేయకపోవడం గమనార్హం. ఖమ్మం జిల్లాలో ఏటా దాదాపు 10 వేల ఎకరాల్లో కూరగాయలు సాగు చేసేవారు. ఈసారి 6 వేల ఎకరాల్లోనే వేశారు. అందులోనూ నీళ్లు లేక దిగుబడి బాగా తగ్గిపోయింది. ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో కూరగాయల పంటలకు భారీగా మచ్చల తెగులు సోకడంతో నష్టం కలిగింది. మార్కెట్కు వెళ్లాలంటే భయమే.. ‘‘పప్పులు, బియ్యం ధరలు బాగా పెరిగాయి. మార్కెట్కు వెళదామంటే భయమేస్తుంది. ధరలు ఇలా పెరిగితే పేదలు, సామాన్యుల పరిస్థితి ఏం కావాలి? ప్రభుత్వం వెంటనే ధరలు నియంత్రించాలి.’’ - బసయ్య, తాండూరు, రంగారెడ్డి జిల్లా ఏం తినేటట్లు లేదు ‘‘కనీసం కూ రగాయలు కూడా కొనలేకపోతున్నాం. రెండు నెలల్లో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్నడూ లేనట్లు పచ్చిమిర్చి, టమాటా ధరలు కిలో 100 రూపాయలు దాటిపోయాయి. ఇలాగే ఉంటే ఏమీ కొనలేం. ఏమీ తినలేం..’’ - చింతల ఏసమ్మ, హైదరాబాద్ -
పప్పుధాన్యాలపై పన్నులొద్దు...
న్యూఢిల్లీ : దేశంలో పప్పుధరలు కొండెక్కనున్నాయా..? అంటే అవుననే సంకేతాలు వచ్చాయి. కొన్ని నెలల్లోనే ఈ ధరల మోత సాధారణ వినియోగదారుడిపై పడనుందని తెలిసింది. దీంతో పప్పు ధాన్యాల ధరలు మండకుండా ఉండేందుకు కేంద్రప్రభుత్వం ఉపశమన చర్యలు ప్రారంభించింది. పప్పుధాన్యాలపై స్థానిక పన్నులు వ్యాట్ లాంటివి వేయొద్దని రాష్ట్రప్రభుత్వాలను కేంద్రప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా పప్పుధాన్యాలను మార్కెట్లోకి విడుదలచేయకుండా అక్రమంగా నిల్వలకు పాల్పడే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని పేర్కొంది. అక్రమ నిల్వలను నిరోధించి, సప్లై పెంచి ధరలను అదుపులో ఉంచాలని కేంద్ర ఆహార మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. ప్రస్తుతమున్న 1.5లక్షల టన్నుల పప్పు ధాన్యాల నిల్వలను, 9లక్షల టన్నులకు పెంచాలని నిర్ణయించినట్టు మంత్రి చెప్పారు. స్థానిక పన్నులను తగ్గించడమే కాకుండా.. రాష్ట్రాలు సొంతంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేసుకోవాలని పాశ్వాన్ ఆదేశించారు. దీనివల్ల పెరిగిన ధరల భారం నుంచి వినియోగదారులకు ఉపశమనం కల్పించవచ్చన్నారు. గత రెండేళ్లగా ఏర్పడిన కరువు నేపథ్యంలో పప్పు ధాన్యాల డిమాండ్ - సప్లైలకు అంతరం ఏర్పడిందని, ఉత్పత్తి 170లక్షల టన్నులుంటే, డిమాండ్ 236లక్షల టన్నులున్నట్టు పాశ్వాన్ చెప్పారు. 55లక్షల టన్నుల పప్పులను 2015-16 ఏడాదిలో భారత్ దిగుమతి చేసుకుందని, అయినప్పటికీ ఇంకా 10లక్షల టన్నుల కొరత ఏర్పడిందన్నారు. ఈ కొరతనే ధరల పెరగడానికి దోహదం చేస్తుందని చెప్పారు. ప్రజలకు అందుబాటులోకి తెచ్చే పప్పుధాన్యాల్లో ట్రేడర్స్ ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా, పారదర్శకతతో అందించాలని పాశ్వాన్ పేర్కొన్నారు. మార్కెట్లోకి విడుదలయ్యే ఉత్పత్తిని, డిమాండ్ ను, ధరల పెరుగుదలను వెంటవెంటనే అంచనా వేసి, ధర పెరుగుదలను నియంత్రించడానికి కేంద్రప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీల సహాయం తీసుకోనుంది. -
రాష్ట్రంలో యథేచ్ఛగా పప్పు ధాన్యాల బ్లాక్ దందా!
కమీషన్ ఏజెంట్లు, బ్రోకర్ల ద్వారా సాగుతున్న అక్రమ రవాణా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల విలువైన పప్పు ధాన్యాలు యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్కు తరలుతున్నాయి. వాణిజ్యపన్నుల శాఖకు నిర్దేశిత 5 శాతం పన్ను చెల్లించకుండా ఇతర రాష్ట్రాల నుంచి జీరో దందా రూపంలో పప్పులను రాష్ట్రానికి తరలిస్తున్నారు. కమీషన్ ఏజెంట్లు, కాన్వాసింగ్ ఏజెంట్లు, బ్రోకర్లుగా వ్యవహరించే కొందరు వ్యక్తుల ద్వారా రాష్ట్రానికి ఏటా రూ.10వేల కోట్ల విలువైన పప్పులు దిగుమతి అవుతుండగా, అందులో 30% సరుకుకే పన్ను వసూలవుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలోని వాంఖిడి, భైంసా, మద్నూర్, చిరాగ్పల్లి చెక్పోస్టుల ద్వారానే అక్రమ రవాణా సాగుతోంది. ఇతర రాష్ట్రాల్లో పప్పులపై పన్ను (వ్యాట్) లేకపోవడం, మన రాష్ట్రంలో 5 శాతం పన్ను విధిస్తుండడంతో చెక్పోస్టుల వద్ద సిబ్బందిని మేనేజ్ చేసుకుంటూ వేల కోట్ల రూపాయల విలువైన పప్పులను రాష్ట్రానికి తరలిస్తుండడం గమనార్హం. ఆయా రాష్ట్రాల నుంచి తెలంగాణకు తరలివస్తున్న పప్పుల అక్రమ రవాణా వెనుక ప్రధాన హస్తం కమీషన్ ఏజెంట్లదేనని అధికారులు గుర్తించారు. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల దొంగ వేబిల్లులు, ట్రాన్సిట్ పాస్లతో రాష్ట్రంలోకి ప్రవేశించే ట్రక్కులు కొన్నైతే, ఎలాంటి కాగితాలు లేకుండానే కంది, మినప, పెసర తదితర పప్పులను రవాణా చేయడం ద్వారా ఏజెంట్లు కోట్లకు పడగలెత్తారు. అక్రమ వ్యాపారంపై అధికారుల కన్ను రాష్ట్రానికి తరలివస్తున్న పప్పు ధాన్యాలకు, మార్కెట్లలోని నిల్వలకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉండడంతో పౌరసరఫరాల శాఖ ఈ ఏడాది మార్చిలో వాణిజ్యపన్నుల శాఖను అప్రమత్తం చేసింది. ఏకంగా మంత్రి ఈట ల రాజేందర్, పరిస్థితిని సమీక్షించాలని ఆదేశాలు జారీ చేయడంతో వాణిజ్యపన్నుల శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో వినియోగమయ్యే పప్పులకు 5 శాతం పన్ను కింద కనీసం రూ.500 కోట్ల వరకు రావలసి ఉండగా, 2015-16లో కేవలం రూ.163 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతో ఇటీవ ల ఒకేరోజు 60 బృందాలను ఏర్పాటు చేసి, హైదరాబాద్తో పాటు ఖమ్మం, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లోని ప్రధాన కమీషన్ ఏజెంట్లు, బ్రోకర్లపై దాడికి దిగారు. వారి రికార్డులను పరిశీలిస్తే రూ.10వేల కోట్లకు పైగా విలువైన పప్పు ధాన్యాలు రాష్ట్రానికి తరలివచ్చినట్లు ప్రాథమికంగా తేలింది. -
పప్పులు ఉడకవు
► చుక్కల్లో పప్పు దినుసుల ధరలు కంది పప్పు కిలో రూ.150 ► పల్లి నూనె లీటర్ రూ.110 ► అదే బాటలో ఇతర పప్పుదినుసులు, వంట నూనె ఆసిఫాబాద్ : ఇక ఇంట్లో పప్పులూ ఉడకని పరిస్థితి నెలకొంది. పప్పు దినుసుల ధరలు చుక్కలనంటడమే అందుకు కారణం. జిల్లాలో పక్షం రోజుల్లోనే హోల్సేల్ మార్కెట్లో క్వింటాల్కు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు ధరలు పెరిగాయి. వారం రోజుల క్రితం హోల్సేల్ మార్కెట్లో క్వింటాల్ కందిపప్పు రూ.13,500 ఉండగా, పెరిగిన ధరలతో ప్రస్తుతం రూ.14,500కు చేరింది. దీంతో రిటైల్ మార్కెట్లో కిలో కంది పప్పు రూ.150కి విక్రయిస్తున్నారు. యేటా కందుల సీజన్ ప్రారంభంలో కంది పప్పు ధర తగ్గేది. ఈ యేడాది ప్రారంభంలో కొంత తగ్గినా, నెలరోజుల్లోనే పెరిగి ధరలు ఆకాశాన్నంటాయి. కిలో మినపప్పు రూ.145 ఉండగా.. రూ.165, శనగపప్పు రూ.53 ఉండగా.. రూ.66కు పెరిగాయి. దీంతోపాటు మార్కెట్లో పల్లి నూనె సైతం లీటర్కు రూ.20 పెరిగింది. వారం రోజుల క్రితం లీటర్ పల్లి నూనె రూ.90 ఉండగా.. పెరిగిన ధరలతో రూ.110కి చేరింది. పామాయిల్ సైతం లీటర్కు రూ.10 పెరిగింది. పెరుగుతున్న పప్పుల ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో పప్పు దినుసుల సాగు ఏటేటా తగ్గడంతోనే పప్పుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని వ్యాపార వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారుు. వరి, పప్పుదినుసులకు మద్దతు ధర లభించకపోవడంతో గత పదేళ్లుగా రైతులు పత్తి సాగుపై మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర కేవలం పత్తికి మాత్రమే అమలవుతుండగా, పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు, ఎరువులు, విత్తనాల ధరలతో రైతులకు ఇతర పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. దీంతో రైతులు పత్తి పంటవైపే మొగ్గు చూపుతున్నారు. ఈ యేడాది ఖరీఫ్లో జిల్లాలో 5.40 వేల హెక్టార్లలో పత్తి, 92 వేల హెక్టార్లలో సోయా, 45 వేల హెక్టార్లలో కంది, 60 వేల హెక్టార్లలో వరి, 15 వేల హెక్టార్లలో మొక్కజొన్న పంట సాగు చేశారు. ప్రతి యేటా జిల్లాలో వరి సాగు గణనీయంగా తగ్గుతోంది. వర్షాభావంతో సాగు ఖర్చులు పెరగడంతోపాటు దిగుబడి తగ్గడంతో పప్పు దినుసుల కొరత ఏర్పడింది. దీంతో ప్రతి యేటా పప్పు దినుసులు ఇత ర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. పెరిగిన నిత్యావసర వస్తువులు,పప్పుదినుసుల ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భార మయ్యాయి. ప్రభుత్వం పప్పుల ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు -
ప్చ్..‘పప్పులు’ పండడం లేదు..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పప్పుధాన్యాల ఉత్పాదకత భారీగా పడిపోయింది. దేశ సగటుతో పోల్చినా... ఇతర రాష్ట్రాల ఉత్పాదకతతో బేరీజు వేసినా ఇక్కడ బాగా తక్కువగా ఉందని వ్యవసాయ అధికారులు చెపుతున్నారు. దిగుబడి లేక వీటి సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. వాణిజ్య పంటలైన పత్తి, మిరప సాగుకు ఆసక్తి చూపుతున్నారని జాతీయ ఆహార భద్రత మిషన్ అంచనా వేసింది. ఇది రాబోయే రోజుల్లో పప్పుధాన్యాల కొరతకు దారి తీస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. హరియాణాతో పోల్చితే సగానికంటే తక్కువ... ప్రపంచంలోనే మన దేశం పప్పుధాన్యాల ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ ముందు వరుసలో ఉంది. దేశ అవసరాలకు 220 లక్షల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉండగా... భారత్లో పండించేది 197.8 లక్షల మెట్రిక్ టన్నులే. మిగిలినది విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. 2050 నాటికి 500 లక్షల మెట్రిక్ టన్నులు దేశ వినియోగానికి అవసరమని జాతీయ పప్పుధాన్యాల పరిశోధన సంస్థ అంచనా. జనాభా పెరుగుతుండటం, ఆ ధాన్యాల్లో అధిక పోషక విలువలు, మాంసకృత్తులు ఉండటంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. అందుకు తగ్గట్లుగా ఉత్పాదకత లేక కొరత ఏర్పడే ప్రమాదముంది. తెలంగాణలో 2014 లెక్కల ప్రకారం 14 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాల సాగు జరగ్గా... ఏడాదికి 4.7 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. 73 శాతం రబీ సీజన్లోనే సాగవుతోంది. తెలంగాణలో వీటి సాగుకు అత్యంత అనుకూల పరిస్థితి ఉన్నా రైతులు శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. ఇక హరియాణా రాష్ట్రంలో హెక్టారుకు 1,764 కిలోల పప్పుధాన్యాల ఉత్పాదకత ఉండగా... మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లోనూ 1000 నుంచి 1100 కిలోల వరకు దిగుబడి వస్తోంది. కానీ తెలంగాణలో కేవలం 774 కిలోలే ఉత్పాదకత వస్తోంది. ముఖ్యమైన కందిపప్పు ఉత్పాదకత హెక్టారుకు 517 కిలోలే . మినప పప్పు 637 కిలోలు, పెసర పప్పు 764 కిలోలే . రబీలో భూములు పడావు... వాణిజ్య పంటలు లేదా వరి వంటి వాటి పైనే రైతులు దృష్టిసారిస్తున్నారు. రబీలో కూడా వరి వేసే పరిస్థితి లేకపోతే భూమిని ఖాళీగా వదిలేస్తున్నారే గానీ పప్పుధాన్యాల వైపు రైతులు మరలడం లేదని జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రభుత్వం పప్పుధాన్యాల వైపు రైతులను మరలిస్తే సాగు విస్తీర్ణతకు అవకాశాలున్నాయంటున్నారు. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి వీలుంది. తక్కువ దిగుబడి రావడం, కనీస మద్దతు ధరలు లేకపోవడం వల్ల కూడా రైతులు ఈ పంట పట్ల ఆసక్తి చూపడంలేదని జాతీయ సర్వేలు చెప్తున్నాయి. అయితే పండించాక నిల్వకు అవకాశాలు లేకపోవడంతో పురుగుపట్టడం తదితర కారణాలతో 9 శాతం పప్పుధాన్యాలు వృథా అవుతున్నాయని ఆ సర్వేల కథనం. దాల్ మిల్లుల పరిశ్రమ పరంగా దేశంలోనే రెండో స్థానంలో నిలిచినా పప్పుధాన్యాల సాగుపై ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నాయి. దీనిపై ఇప్పటికైనా వ్యవసాయశాఖ దృష్టిసారించి రబీలో పప్పుధాన్యాల సాగువైపు రైతులను మరలించేలా చూడాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
ఏం కొనేటట్టు లేదు..ఏం తినేటట్టు లేదు..
-
క్షీణతలోనే... టోకు ద్రవ్యోల్బణం
అక్టోబర్లో మైనస్ 3.81 శాతం * 12 నెలల నుంచీ ఇదే ధోరణి * అంతర్జాతీయ కమోడిటీ ధరల తగ్గుదల ఎఫెక్ట్ * నిత్యావసరాల్లో... పప్పులు, ఉల్లి ధరలు భారం న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 12వ నెలలోనూ అసలు పెరక్కపోగా... మైనస్లోనే కొనసాగింది. అక్టోబర్లో -3.81%గా నమోదయ్యింది. సెప్టెంబర్లో ఈ రేటు -4.54%. 2014 ఇదే నెలలో ఈ రేటు 1.66%గా ఉంది. దేశంలో టోకు ధరల సూచీ అసలు పెరక్కపోడానికి కారణాల్లో అంతర్జాతీయ కమోడిటీ ధరలు కనిష్ట స్థాయిల్లో ఉండడం ఒకటి. అయితే టోకున చూస్తే... నిత్యావసరాల్లో పప్పులు, ఉల్లి ధరలు తీవ్రంగా ఉన్నాయి. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... మూడు ప్రధాన విభాగాల వార్షిక రీతిన వివరాలు... మూడు విభాగాలూ మైనస్లోనే... ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్-ఫుడ్, మినరల్స్ విభాగాలతో కూడిన ఈ కేటగిరీలో ద్రవ్యోల్బణం -0.36% క్షీణతలో ఉంది. అయితే ప్రధానంగా ఫుడ్ ఆర్టికల్స్ను ఇందులో చూస్తే పెరుగుదల రేటు 2.44%. ఫ్యూయల్ అండ్ పవర్: ద్రవ్యోల్బణం క్షీణతలో -16.32%గా ఉంది. తయారీ: సూచీలో దాదాపు 65 శాతం వాటా ఉన్న ఈ రంగంలో కూడా ద్రవ్యోల్బణం -1.67 శాతంగా ఉంది. ఆహార ఉత్పత్తులు...: ఫుడ్ కేటగిరీలో టోకు ద్రవ్యోల్బణం మొత్తంగా 2.44% పెరిగితే... ప్రధానంగా పప్పులు, ఉల్లి ధరలు సామాన్యునికి చుక్కలు చూపిస్తున్నాయి. పప్పు దినుసుల ధరలు వార్షికంగా 52.98% పెరిగాయి. ఉల్లి ధరలు 85.66% అధికంగా ఉన్నాయి. కూరగాయల ధరలు 2.56% పెరిగాయి. ఈ నెలలో ధరలు పెరిగిన ఆహార ఉత్పత్తుల్లో పాలు (1.75%), గోధుమలు (4.68%) ఉన్నాయి. ధరలు తగ్గిన ఉత్పత్తుల్లో ఆలుగడ్డ (-59%) ఉంది. పాలసీ సమీక్షపై దృష్టి... డిసెంబర్ 1న ఆర్బీఐ పాలసీ సమీక్షను నిర్వహించనుంది. ఈ సందర్భంగా నిర్ణయానికి అక్టోబర్ టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. అక్టోబర్లో వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా ఈ రేటు నాలుగు నెలలుగా పెరుగుతూ వస్తోంది. పప్పులు, ఇతర ఆహార ఉత్పత్తుల రిటైల్ ధరల పెరుగుదలే దీనికి కారణం. -
ఇంటిపట్టునే పప్పుల మిల్లు !
రైతుకు శ్రమ తగ్గేలా, నాణ్యమైన పప్పు దినుసులను పొందేలా పలు ప్రయోజనాలు గల చిన్న మిల్లును ఐఐపీఆర్ (భారత పప్పుధాన్యాల పరిశోధన కేంద్రం) మినీ దాల్ మిల్ను రూపొందించింది. రైతులు తాము పండించిన పప్పుధాన్యాలను మరపట్టించి పప్పులుగా మార్చి అమ్ముకోవటం ద్వారా అధిక లాభాలను పొందవచ్చు. ఈ చిన్ని మిల్లును రైతులే ఇంటివద్ద లేదా చిన్న గదిలో ఏర్పాటు చేసుకొని పప్పులను మరపట్టించి విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చుకొని అమ్ముకోవచ్చు. అన్ని రకాల పప్పు ధాన్యాలను దీని ద్వారా మరపట్టవచ్చు. 2 హెచ్. పీ. సింగిల్ ఫేజ్ మోటార్తో ఇది నడుస్తుంది. గంటకు 75 - 125 కిలోల పప్పుగింజలను మరపట్టే సామర్థ్యం దీని సొంతం. దీని ధర రూ. 80 వేలు. ఇది పరిమాణంలో చాలా చిన్నది. మిల్లుపైన గరాటు ఆకారంలో అమర్చిన అరలో పప్పుధాన్యాలను పోయాలి. ఇది క్రమ పద్ధతిలో పప్పులను మిల్లులోకి పంపుతుంది. గరాటు కింద భాగంలో మిల్లుకు వంకీలు కలిగిన రెండు స్టీల్ చక్రాలు అమర్చి ఉంటాయి. ఇవి తిరుగుతూ.. గింజలను పప్పులుగా మార్చుతాయి. గింజల పరిమాణాన్ని లేదా మరపట్టించే పంటను బట్టి ఈ చక్రాలను సర్దుబాటు చేసుకోవచ్చు. పప్పులు, ఊక అక్కడ నుంచి దిగువనున్న గాలిపంకా(బ్లోయర్) భాగంలోకి వస్తాయి. గాలిపంకా పొట్టును, పప్పులను వేరు చేస్తుంది. పప్పుధాన్యాలను పోయటం, మిల్లింగ్ చేయటం, శుభ్రం చేయటం, గ్రేడింగ్ చేయటం, సంచుల్లో నింపటం వంటి పనులను ఏకకాలంలో చేస్తుంది. ఇందులో రబ్బరు డిస్క్లను వాడటం వల్ల ఇతర మిల్లుల కన్నా 5-10 శాతం అధికంగా పప్పులను పొందవచ్చు. ఇందులో ఉన్న మరో అదనపు ప్రయోజనం.. రబ్బరు డిస్క్ల స్థానంలో స్టీల్ డిస్క్లను అమర్చుకోవటం ద్వారా పశువుల దాణాకు కూడా ఉపయోగపడేలా పప్పులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు. వీటిని ప్యాకింగ్ చేసి స్థానికంగాను, అవకాశాన్ని బట్టి పట్టణాల్లోను విక్రయించవచ్చు. దీనిలో పప్పులు నునుపుదనం వచ్చి ఆకర్షణీయంగా కనపడేందుకు పాలిష్ వేసే ఏర్పాటు లేకపోవటం వల్ల వినియోగదారుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పప్పుధాన్యపు పంటలను అధికంగా సాగు చేసే ప్రాంతాల్లోని రైతులకు ఈ మిల్లు చాలా ఉపయోగకరం. ప్రస్తుతం 75 శాతం పప్పుధాన్యాలను మరపట్టే పరిశ్రమ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగ యువకులు, ఔత్సాహికులు, రైతులు ఈ మిల్లును ఏర్పాటు చేసుకోవటం ద్వారా స్వయం ఉపాధి పొంద వచ్చు. మరో ముగ్గురికి ఉపాధి లభిస్తుంది. ఇతర రైతుల పప్పుధాన్యాలను మరపట్టడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. ( వివరాలకు దుష్యంత్ శర్మ: 98391 15497- భారత్ హెవీ మెషీన్స్ కాన్పూర్ వారిని సంప్రదించవచ్చు) - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్ -
అక్రమ నిల్వలపై అధికారుల దాడులు
జనరల్ స్టోర్స్పై సివిల్ సఫ్లై అధికారులు దాడిచేసి నాలుగు లక్షల విలువైన పప్పు ధాన్యాలను సీజ్ చేశారు. ఈ సంఘటన ఏలూరులోని బెనర్జీపేటలో గురువారం మధ్యాహ్నం జరిగింది. బెనర్జీపేటకు చెందిన సాంబశివ జనరల్ స్టోర్లో అక్రమంగా పప్పు దాన్యాలు నిలువ ఉంచారనే సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో షాప్పై దాడిచేసి నాలుగు లక్షల విలువ చేసే పప్పు ధాన్యాలను అధికారులు సీజ్ చేశారు. -
పప్పులు, నూనెలపై ‘నియంత్రణ’ పెంపు
ఏడాది పెంపునకు కేబినెట్ నిర్ణయం: రవిశంకర్ వెల్లడి * అక్రమ వ్యాపారం, నిల్వలపై రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు ఆస్కారం * రిజిస్టర్డ్ గోదాముల్లో పప్పులు, నూనెల నిల్వలపైనా పరిమితులు న్యూఢిల్లీ: పప్పుధాన్యాలు, వంట నూనెలు, నూనెగింజల అక్రమ వ్యాపారం, అక్రమ నిల్వలను రాష్ట్ర ప్రభుత్వాలు నిరోధించేందుకు చర్యలు తీసుకునే వీలు కల్పిస్తూ నిత్యావసర సరుకుల చట్టం కింద జారీ చేసిన నియంత్రణ ఉత్తర్వు గడువును మరో ఏడాది పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ మంగళవారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. పప్పుధాన్యాలు, వంట నూనెలు, వంట నూనె గింజల కొరత దృష్ట్యా.. వాటిని వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చూసేందుకు వాటిని నియంత్రణ ఉత్తర్వు కిందకు తీసుకురావాలని 2014లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ ఉత్తర్వు గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ నియంత్రణ ఉత్తర్వు గడువును ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి 2016 సెప్టెంబర్ 30వ తేదీ వరకూ పొడిగించినట్లు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ అనంతరం టెలికం మంత్రి రవిశంకర్ప్రసాద్ విలేకరులకు తెలిపారు. పప్పుధాన్యాలు, వంట నూనెలు, నూనెగింజలకు సంబంధించి.. రిజిస్టర్ చేసుకున్న గోదాముల్లో నిల్వపై పరిమితులు పెట్టాలని కూడా కేబినెట్ నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. నియంత్రణ ఉత్తర్వు గడువు పెంపు వల్ల.. ఆయా సరుకుల అక్రమ వ్యాపారం, అక్రమ నిల్వలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నిల్వలపై పరిమితులు విధించటం, లెసైన్సు నిబంధనలు కఠినం చేయటం వంటి చర్యలు చేపట్టవచ్చునని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో వివరించింది. తద్వారా అంతర్గత మార్కెట్లలో ఆయా సరుకులు అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు ధరలు కూడా నియంత్రణలో ఉండేలా చూడవచ్చునని పేర్కొంది. నిత్యావసర సరుకులు, వాటి ధరలు.. ప్రత్యేకించి పప్పుధాన్యాలు, ఉల్లిపాయలు అందుబాటులో ఉండేలా చూసేందుకు పలు చర్యలు చేపట్టామని తెలిపింది. ‘కందులు, మినుములు వంటి పప్పుధాన్యాలపై ఫ్యూచర్ ట్రేడింగ్ను ఇప్పటికే నిలిపివేశాం. పప్పుధాన్యాల ఎగుమతిని నిషేధించాం. వాటి దిగుమతిపై సుంకం తొలగించాం. దేశీయ మార్కెట్లో పప్పుధాన్యాల లభ్యతను పెంచేందుకు 5,000 టన్నుల కందులు, 5,000 టన్నుల మినుముల దిగుమతికి ఆదేశాలిచ్చాం. ఇవి త్వరలోనే రానున్నాయి. వీటివల్ల ధరల పరి స్థితి కాస్త సరళమవుతుంది’ అని వివరించింది. ఇదిలావుంటే.. పర్యాటక రంగంలో ద్వైపాక్షిక సహకారం కోసం భారత్, కంబోడియా దేశాల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. -
నిప్పుల్లా పప్పులు
కిలోకు రూ.50 పెరుగుదల జిల్లా ప్రజలపై నెలకు రూ.25కోట్ల భారం యలమంచిలి : జిల్లాలో పప్పుల ధరలు నిప్పుల్లా మండుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనిరీతిలో వాటి ధరలు నింగిని తాకుతున్నాయి. ఒక పక్క బియ్యం ధరలు పెరుగుతుండగా పప్పుల ధరలు అట్టుడుకుతుండటంతో వినియోగదారులకు దిక్కుతోచడం లేదు. కంది, మినుము, పెసర తదితర రకాల పప్పులు రెండు నెలల ముందు ధరలతో పోలిస్తే కిలోకు రూ.50 వంతున పెరిగాయి. ప్రస్తుతం కిలో కందిపప్పు రూ.140 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. మినప పప్పు రూ.130, పెసర పప్పు రూ.120, శనగపప్పు రూ.70కు పెరిగింది. ఇంత ధరలు ఎప్పుడూ చూడలేదని వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లా ప్రజలకు అన్ని రకాల పప్పులు కలిపి నెలకు 60వేల క్వింటాళ్లు వినియోగిస్తుంటారు. కంది, మినప పప్పుల ధరలు కిలోకు రూ.50, పెసరపప్పుకు రూ.40, శనగపప్పుకు రూ.20 వంతున పెరగడం వలన జిల్లా ప్రజలపై నెలకు రూ.25కోట్ల భారం పెరుగుతోంది. ధరలు పెరిగిపోతుండటంతో పప్పుల వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు. సామాన్యులైతే పప్పులను కొనుగోలుకు వెనుకడుగు వేస్తున్నారు. నిద్రావస్థలో పర్యవేక్షణ కమిటీ... నిత్యావసర వస్తువుల ధరలు అనూహ్యంగా పెరుగుతున్నప్పుడు వాటిని కట్టడి చేయాల్సిన ‘పర్యవేక్షణ కమిటీ’ నిద్రావస్థలో ఉందనే విమర్శలు ఉంటున్నాయి. నల్లబజారుకు తరలే వస్తువుల నిరోధానికి ఈ కమిటీ నిర్ణయాలు తీసుకుని దాడులు చేయడానికి చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇందుకు విజిలెన్స్, వాణిజ్య పన్నులు, తూనికలు, కొలతల శాఖాధికారులతో టాస్క్ఫోర్సును ఏర్పాటు చేసి అక్రమ నిల్వలను బయటకు తీయాల్సి ఉంది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన కమిటీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నందువల్లే అక్రమార్కుల ఆటలు కొనసాగుతున్నాయి. అవసరమైనపుడు ఇతర జిల్లాలు, ప్రాంతాల నుంచి సరుకులను దిగుమతి చేసుకుని మార్కెట్లో ధరలను క్రమబద్ధీకరించడానికి వీలుపడుతుంది. ప్రభుత్వం కిలో రూ.50కు కందిపప్పును సరఫరా చేస్తున్నా జిల్లా ప్రజల అవసరాలను తీర్చడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికార యంత్రాంగాలు, పాలకులు పప్పులను తక్షణమే రాయితీ ధరలకు విక్రయించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పెరుగుదలకు ఇదీ కారణం. దేశంలో పప్పుల ఉత్పత్తి తగ్గడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఉన్న నిల్వలను ముందుగానే వ్యాపారులు నల్లబజారుకు తరలించడంతో పప్పుల లభ్యత తగ్గించి ధరలు పెంచుతున్నారనే ఆరోపణలున్నాయి. అక్రమ నిల్వలను బయటకు తీయాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పప్పు.. నిప్పు
► ఆకాశాన్నంటుతున్న పప్పుల ధరలు ► కందిపప్పు ధర కిందటేడాదితో పోలిస్తే రెట్టింపు ► గత ఏడాది కిలో రూ. 75.. ఇప్పుడు రూ. 150 ► వారంలోనే రూ. 40 పెరుగుదల ►రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గడం.. ►విదేశాల్లో నిల్వలు పడిపోవడమే కారణం ►మిగతా పప్పుల ధరల్లోనూ 35 శాతం నుంచి ► 45 శాతం దాకా పెరుగుదల ► మిర్చి, చింతపండు, వేరుశనగ నూనెల రేట్లూ పైపైకే.. ► కందులకు రికార్డు ధర.. తాండూరు: తాండూరు మార్కెట్లో కందులు రికార్డు ధర పలికాయి. శుక్రవారం వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాలు కందులకు ప్రభుత్వ మద్దతు ధర రూ.4,625 ఉండగా గరిష్టంగా రూ.10,400, కనిష్టంగా రూ. 9,950 ధర పలికింది. ఈ ధరలకు యార్డులో 42 క్వింటాళ్ల కందులను కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేశారు. సీజన్, అన్ సీజన్లో అయినా కందులకు ఇంత భారీ ధర రావడం ఇదే మొదటిసారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: ఓవైపు ఉల్లి కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తుంటే.. మరోవైపు పప్పులు నిప్పుల్లా మండిపోతున్నాయి! రాష్ట్రంలో పప్పుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. కంది పప్పు ధర గతేడాది ఇదే సమయంలో రూ.75 ఉండగా ఇప్పుడది రూ.150కి పెరిగింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో 15 శాతం మేర కంది సాగు తగ్గిపోవడం, దిగుమతి చేసుకుంటున్న దేశాల్లోనూ సాగు తగ్గి, నిల్వలు నిండుకోవడంతో భవిష్యత్తులో కంది ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెపుతున్నారు. ధర పెరగడమే కాదు.. మున్ముందు కంది పప్పుకు తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో ఏటా 1.90 లక్షల టన్నుల కందిపప్పు అవసరం ఉండగా గతేడాది కేవలం 80 వేల టన్నుల కందిపప్పు మాత్రమే లభించింది. రబీలో తగ్గిన సాగు కారణంగా కందిపప్పు లభ్యత ఏకంగా 41 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది సైతం కందిసాగు 2.78 లక్షల హెక్టార్లకు గానూ 2.12 లక్షలకు మాత్రమే పరిమితమైంది. మయన్మార్, దక్షిణాఫ్రికా, సింగపూర్, కెన్యా దేశాల నుంచి దీనిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటారు. అయితే అక్కడ కూడా వర్షాభావం వల్ల సాగు తగ్గి దిగుబడులు పడిపోయాయి. దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో అధిక వాటా కలిగిన కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్లోనూ ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. దీంతో విదేశీ దిగుమతులపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ పప్పుకు డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గడంతో కొరత పెరిగింది. వారం కిందటే కందిపప్పు ధర రూ.110 వరకు ఉందని, కేవలం వారం రోజుల్లోనే ధర అమాంతం రూ.40 మేర పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మున్ముందు మరింత పెరుగుదలకు అవకాశం ఉండడంతో కందిపప్పు నిల్వలపై కేంద్రం పరిమితిని విధించింది. హైదరాబాద్లో హోల్సేలర్ అయితే 4 వేల క్వింటాళ్లు, రిటైలర్ అయితే 125 క్వింటాళ్లను మించి నిల్వ చేయరాదని, మిగతా ప్రాంతాల్లో హోల్సేలర్ 2,500 క్వింటాళ్లు, రిటైలర్ 100 క్వింటాళ్లను మించి నిల్వ చేయరాదని నిర్దేశించింది. అయినా మున్ముందు ధరలు పెరిగే అవకాశం ఉండటంతో వ్యాపారులు పప్పును రహస్యంగా గోడౌన్లకు తరలిస్తున్నారు. పెసళ్లకు పెరుగుతున్న ధర తాండూరు: మార్కెట్ యార్డులో పెసళ్ల ధర కూడా క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం క్వింటాలు పెసళ్లకు గరిష్టంగా రూ.7,590, కనిష్టంగా రూ.6,300, సగటు ధర రూ. 6,800 పలికిందని మార్కెట్ కమిటీ వర్గాలు తెలియజేశాయి. సగటు ధర ప్రకారం రూ. 25.16 లక్షల విలువచేసే 370 క్వింటాళ్ల పెసళ్లను కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేశారు. మిగతా పప్పులూ అదే దారి.. పెసర, మినప, శనగపప్పు ధరలూ ఆకాశంలోనే ఉన్నాయి. వీటి సాగు కూడా తగ్గిపోవడంతో 45 నుంచి 55 శాతం వరకు ధరలు పెరిగిపోయాయి. పెసర పప్పు ధర ప్రస్తుతం రూ.110 వరకు ఉండగా మినపపప్పు కిలో రూ.140 నుంచి రూ.150 మధ్య ఉంది. శనగపప్పు రూ.70 వరకూ ఉంది. నిత్యావసర సరుకులు మిర్చీ, చింతపండు, వేరుశనగ నూనె ధరలూ మండిపోతున్నాయి. మిర్చీ ధర గత ఏడాది కిలో రూ.79.35 ఉండగా ఇప్పుడు రూ.105 పైనే ఉంది. వేరుశనగ నూనె ధర గతేడాది రూ.90 ఉండగా.. ప్రస్తుతం రూ.120కి చేరింది. పప్పులు, నిత్యావసర ధరల్లో పెరుగుదల ఇలా.. (రూపాయల్లో) సరుకు గతేడాది ప్రస్తుతం కందిపప్పు(ఒకటో ర కం) 73.64 150 కందిపప్పు(రెండో రకం) 65.18 145 మినప్పప్పు 84.77 140-150 పెసరపప్పు 94.93 110 శనగపప్పు 43.34 70 చింతపండు 67.73 85 మిర్చి 79.35 105 వేరుశనగ నూనె 88.08 110 నెలలో ఒక వ్యక్తి తలసరి వినియోగం ఇలా ఉండాలి సరుకు వినియోగం (గ్రాముల్లో) కందిపప్పు 432 పెసరపప్పు 84 శనగపప్పు 52 మినప్పప్పు 129 శనెగనూనె 241 చింతపండు 69 మిర్చీ 717 సాగు విస్తీర్ణం పడిపోయిందిలా.. (హెక్టార్లలో) పంట సాధారణం సాగు జరిగింది కందిపప్పు 2.78 లక్షలు 2.12 లక్షలు పెసరపప్పు 1.29 లక్షలు 1.04 లక్షలు మినపపప్పు 39 వేలు 27 వేలు వేరుశనగ 21 వేలు 5 వేలు మిర్చీ 58 వేలు 3 వేలు తాండూరులో క్వింటాలు కందులు రూ.10,400 -
పప్పుల మంట.. కూరగాయలతో తంటా!
రాష్ట్రంలో చుక్కలను తాకుతున్న ధరలు వర్షాభావంతో తగ్గిన సాగు.. పడిపోయిన దిగుమతులు 50శాతం వరకు పెరిగిన పప్పుల ధరలు.. రెండింతలైన కూరగాయల ధరలు కందిపప్పు, పెసరపప్పు ధరలన్నీ కిలో రూ.120పైనే టమాటా నుంచి చిక్కుడుదాకా రూ.40కి పైనే ధరల పెరుగుదలకు దోహదపడ్డ ఎంట్రీ ట్యాక్స్ హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి భగభగలకు పప్పులు, కూరగాయల ధరలు తోడయ్యాయి.. జేబులన్నీ ఖాళీ చేసినా కొన్ని రోజులకు సరిపడా కూరగాయలు, పప్పులు కొనలేని పరిస్థితి నెలకొంది. పప్పుల ధరలు ఇప్పటికే కిలోకు రూ.120ని దాటిపోగా.. కూరగాయల ధరలు నిరుడితో పోలిస్తే రెండింతలకు పైగా పెరిగాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో పప్పుధాన్యాలు, కూరగాయల సాగు తగ్గిపోవడం, ఇతర రాష్ట్రాల నుంచీ సరఫరా తగ్గిపోవడం, వ్యాపారులు నిల్వలు పెంచేసుకుని కృత్రిమ కొరతను సృష్టించడం ఈ ధరాఘాతానికి కారణమవుతున్నాయి. మరోవైపు ఏపీ నుంచి వచ్చే వాహనాలపై తెలంగాణలో ప్రవేశపన్ను విధిస్తుండడం కూడా కూరగాయల ధరలు పెరగడానికి కారణమవుతోంది. తగ్గిన దిగుబడులు: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా కూరగాయలు, పప్పుధాన్యాల సాగు గణనీయంగా తగ్గింది. భూగర్భ జలాలు ఎన్నడూ లేనిరీతిలో అడుగంటడంతో బోర్ల కింద సాగు చతికిలపడింది. 2013-14లో (జూన్ వరకు) 6.25లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగుకాగా.. ఈసారి 4.75లక్షల ఎకరాలకు పడిపోయింది. పప్పుధాన్యాల సాగు సైతం 11.67లక్షల ఎకరాల నుంచి 7.72లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. దీంతో కూరగాయలు, పప్పుధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. దీంతో మార్కెట్లో ప్రస్తుత డిమాండ్కు, సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడి ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలు కిలో రూ.35 నుంచి రూ.40 మధ్య ఉన్నాయి. ఇవి నిరుడితో పోలిస్తే రెట్టింపు కావడం గమనార్హం. పప్పుల మంట: ఇక రాష్ట్రంలో పప్పుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. పెసరపప్పు, కందిపప్పు కిలో రూ.130కి చేరుకోగా.. మినపపప్పు రూ.120 వద్ద ఉంది. చివరికి శనగపప్పు ధర కూడా కిలోకు రూ.70కి చేరుకుంటోంది. ఈ ధరలన్నీ కూడా గత ఏడాదితో పోలిస్తే.. 35 నుంచి 50శాతం మేర ఎక్కువకావడం ఆందోళనకరం. పప్పుధాన్యాల సాగు తగ్గిన నేపథ్యంలో... భవిష్యత్ డిమాండ్ను ముందుగానే ఊహించిన వ్యాపారులు భారీగా పప్పులను నిల్వచేయడం, కొద్దికొద్దిగా మార్కెట్లోకి విడుదల చేస్తూ ధరలను ఇష్టారీతిన నిర్ణయిస్తుండటంతో సామాన్యుడికి ధరాఘాతం తప్పడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి తగ్గిన సరఫరా ఈ ఏడాది పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతులు భారీగా తగ్గాయి. సాధారణంగా కూరగాయలు రాష్ట్రంలోనే 32శాతం దాకా ఉత్పత్తవుతుండగా.. ఏపీ నుంచి 26 శాతం, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి 42 శాతం దిగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం ఆయా రాష్ట్రాలన్నిటా వర్షాభావం నేపథ్యంలో దిగుమతులు 30 శాతం వరకు తగ్గాయి. దీంతో కర్నూలు, అనంతపురం, మదనపల్లి నుంచి రావాల్సిన టమాటా, ప్రకాశం, గుంటూరు, అనంతపురం ప్రాంతాల నుంచి రావాల్సిన వంకాయ, బెంగళూరు, చిక్బల్లాపూర్ల నుంచి రావాల్సిన బెండకాయ, చిక్కుడు, గోరుచిక్కుడు తదితరాల దిగుమతులు తగ్గిపోయాయి. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. కూరగాయల ధరలు.. (కిలోకి రూ.లలో) టమాటా గత ఏడాది రూ.14 ప్రస్తుతం రూ. 32 వంకాయ గత ఏడాది రూ.8 ప్రస్తుతం రూ.28 బెండకాయ గత ఏడాది రూ. 15 ప్రస్తుతం రూ.40 పచ్చిమిర్చి గత ఏడాది రూ.16 ప్రస్తుతం రూ.42 గోరుచిక్కుడు గత ఏడాది రూ.18 ప్రస్తుతం రూ.40 చిక్కుడు గత ఏడాది రూ.30 ప్రస్తుతం రూ.35 బీరకాయ గత ఏడాది రూ.16 ప్రస్తుతం రూ.30 సొరకాయ గత ఏడాది రూ.6 ప్రస్తుతం రూ.20 క్యారెట్ గత ఏడాది రూ.22 ప్రస్తుతం రూ.38 క్యాప్సికం గత ఏడాది రూ.18 ప్రస్తుతం రూ.42 హైదరాబాద్కు కూరగాయల దిగుమతులు.. (క్వింటాళ్లలో) కూరగాయలు ఏప్రిల్ మే టమాటా 964 799 వంకాయ 79 59 బెండకాయ 101 125 పచ్చిమిర్చి 200 224 గోరుచిక్కుడు 94 91 చిక్కుడు 62 10 సొరకాయ 187 57 క్యారెట్ 1,220 1,098 క్యాప్సికం 419 345 -
‘పప్పులు’డకవ్.. జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: పప్పు దినుసుల అక్రమ నిల్వలపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. వ్యాపారుల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటోంది. డిమాండ్, సరఫరాకు మధ్య అంతరం పెంచేం దుకు ప్రైవేటు వ్యాపారులు తెరతీశారన్న సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు మూడు రోజుల క్రితం పప్పు ధరలపై అధికారులతో ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. అక్రమ నిల్వలపై దాడులు పెంచాలని పౌరసరఫరాల శాఖ అధికారులను, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రం లో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్లలో పప్పు ధాన్యాల సాగు భారీగా తగ్గింది. ఖరీఫ్లో మొత్తంగా 4.67 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాల సాగు కావాల్సి ఉండగా కేవలం 3.17 లక్షల హెక్టార్లకే పరిమితమైంది. పెసర సాగులో భారీ అంతరం ఉండగా, మినుములు, కందుల సాగు 40 నుంచి 50 శాతం మేరకు తగ్గింది. పెసరపప్పు 1.07 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కావాల్సి ఉండగా కేవలం 24 వేల మెట్రిక్ టన్నులకు పడిపోవడంతో దీని ధర కిలో రూ.115 చేరింది. ఈ ధరలు గత ఏడాది ధరతో పోలిస్తే రెండింత లు. కందిపప్పు, మినప్పప్పు ధరలు సైతం రూ.80 నుంచి రూ.90 వరకు చేరాయి. కేంద్ర ప్రభుత్వం 2013 నుంచి నియంత్రణను ఎత్తివేసిన నేపథ్యంలో రాష్ట్రీయంగా ఉత్పత్తవుతున్న పప్పు ధాన్యాలను మహారాష్ట్ర, కర్ణాటకలో అధిక లాభాలకు విక్రయిస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ కృతిమ కొరతను సృష్టించి డిమాండ్ను పెంచుతూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో రాష్ట్రీయ మార్కెట్లో ధరలు గతంలో ఎన్నడూ లేనివిధంగా చుక్కలనంటుతున్నాయి. ఇప్పటికే రంగంలోకి దిగిన పౌరసరఫరాల శాఖ వివిధ జిల్లాల్లో నాలుగైదు కేసులు పెట్టగా, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ సైతం మరో పది కేసులు నమోదు చేసినట్లు సమాచారం. -
చిరు, పప్పుధాన్యాల సాగుతో మేలు
అనంతపురం అగ్రికల్చర్ : అందర్-బాహర్ జూదంలా తయారైన వేరుశనగ పంట స్థానంలో చిరుధాన్యపు, పప్పుదినుసుల పంటల సాగు విస్తీర్ణం పెరిగితే తప్ప వ్యవసాయం లాభసాటి అయ్యే పరిస్థితి లేదని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ తరహా వ్యవసాయ పద్ధతులు సాగులోకి రావాలంటే ప్రజల ఆహారపు అలవాట్లలో గణనీయమైన మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. అనంతపురం రైతు బజార్ ప్రాంగణంలో జరుగుతున్న రాయలసీమ పంటలు-వంటల పండుగ రెండో రోజు కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. నిర్వహణ కమిటీ చైర్మన్, ఏఎఫ్ ఎకాలజీ డెరైక్టర్ డాక్టర్ వై.వి.మల్లారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం హాజరై స్టాళ్లను ఆసక్తిగా తిలకించారు. కొన్ని రకాల వంటకాలను రుచి చూశారు. ప్రజాపంపిణీలో మార్పులు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ... వ్యవసాయ పరంగా దేశం, రాష్ట్రం అగ్రస్థానాల్లో కొనసాగుతున్నా ప్రజల ఆహారపు అలవాట్లలో బియ్యం, గోధుమలు లాంటి కొన్నింటికే ప్రాముఖ్యత ఉందన్నారు. తీసుకుంటున్న ఆహారంలో ప్రోటీన్లు, క్యాల్షియం లాంటివి తక్కువగా ఉంటున్నాయని తెలిపారు. ఫలితంగా అనేక రకాలైన వ్యాధుల బారిన పడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తీసుకునే ఆహారంలో ఆరు రకాల పదార్థాలు సమంగా ఉంటేనే ప్రజారోగ్యానికి ఇబ్బంది ఉండదన్నారు. కానీ ఇపుడున్న పరిస్థితుల్లో సమతుల్య ఆహారం దొరకడం కష్టంగా మారిందని తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వం చౌకదుకాణాలు, ఐసీడీఎస్ ద్వారా చేపడుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పీడీఎస్ బియ్యంతో పాటు రాగులు లాంటివి ఒకట్రెండు నిత్యావసర వస్తువుల జాబితాలోకి చేర్చి, పంపిణీ చేయడానికి వీలుగా సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు. స్మార్ట్విలేజ్ కార్యక్రమంలో తీసుకున్న 20 సూత్రాల్లో పౌష్టికాహార అంశం నాలుగో సూత్రంగా చేర్చి ప్రాముఖ్యత ఇచ్చారన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో కొంతవరకు చైతన్యం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పురాతన పంటలు, వంటలు పునరుద్ధరణ జరగాలి డాక్టర్ వై.వి.మల్లారెడ్డి మాట్లాడుతూ... ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పు వస్తే రైతుకు వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు. అందుకోసం పురాతన పంటలు, వంటల పునరుద్ధరణ కోసం ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు. బియ్యం వంటకాలు తగ్గించి వాటి స్థానంలో తృణ, చిరు, పప్పుధాన్యపు పంటల ఉత్పత్తుల వంటకాలు ఆహారంగా తీసుకుంటే వాటికి డిమాండ్ ఏర్పడుతుందని తెలిపారు. అప్పుడు రైతు ఆలోచనలు కూడా ఏకపంటగా ఉన్న వేరుశనగ నుంచి ఇతర పంటల వైపునకు మళ్లుతుందన్నారు. వినియోగదారుల సంఖ్య పెరిగితే చిరుధాన్యపు, పప్పుధాన్యపు పంటలకు గిరాకీ ఏర్పడి, రైతు పండించిన పంట ఉత్పత్తులు మార్కెట్లో మంచి ధర పలుకుతుందని చెప్పారు. తద్వారా రైతు ఆర్థికంగా గట్టెక్కడంతో పాటు వ్యవసాయం సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా పయనిస్తుందని తెలిపారు. ప్రజలు తీసుకుంటున్న ఆహారంలో సమతుల్యత లోపించడంతో రక్తహీనత లాంటి జబ్బులు వస్తున్నాయన్నారు. గతంలో బీపీ, షుగర్ లాంటి అరుదుగా కనిపించేవన్నారు. మారిన ఆహారంలో బీపీ, షుగర్ కామన్ అయిందని తెలిపారు. దీంతో దాదాపు అన్ని వర్గాల ప్రజలు పెడుతున్న ఖర్చుల్లో సగానికి పైగా వైద్యానికి పెడుతున్నారని ఒక సర్వేలో వెల్లడైందన్నారు. ఈ క్రమంలో అటు రైతుల్లో ఇటు ప్రజల్లోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వంతో పాటు ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాలు తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. అనూహ్య స్పందన రాయలసీమ పంటలు-వంటలు పండుగ కార్యక్రమానికి రెండో రోజు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో రైతుబజార్ ప్రాంగణం కిటకిటలాడింది. టింబక్టు, ఏపీఎంఎస్, జీ-4, రెడ్డిపల్లి కేవీకే, డీఆర్డీఏ వెలుగు సంఘాల ఆధ్వర్యంలో కొర్ర పలావ్, కొర్ర అన్నం, కోడికూర, రాగి సంకటి, రాగిదోసే, మునగ, పితకబ్యాళ్ల కుర్మా, వట్టిచేపల పులుసు, నరిడి చెట్నీ, ముద్ద పప్పు, రాగులు, జొన్నలు, సద్దలతో తయారు చేసిన పలు వంటకాలు, పచ్చళ్లు, చిరుతిళ్లు అక్కడే వంటా వార్పు చేసి ప్రదర్శనకు పెట్టారు. నగర ప్రజలు కొత్త రుచులు ఆస్వాదించారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన కొందరు మహిళలు ఇంటి దగ్గరే వండుకుని తెచ్చిన సంప్రదాయ వంటలను నిర్వాహకులు రుచి చూసి బహుమతులకు ఎంపిక చేశారు. ఆర్డీవో హుస్సేన్సాబ్, వ్యవసాయశాఖ జేడీ పి.వి.శ్రీరామమూర్తి, ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఏపీడీ ఆర్.విజయశంకర్రెడ్డి, ఉద్యానశాఖ డీడీ బి.ఎస్.సుబ్బరాయుడు, డ్వామా పీడీ నాగభూషణం, మార్కెటింగ్శాఖ ఏడీ బి.శ్రీకాంత్రెడ్డి, ఎస్టేట్ అధికారి ప్రతాప్రుద్ర తదితరులతో పాటు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ వర్గాలు, నగర వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
నేటి నుంచి చిరుధాన్యాల ప్రదర్శన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చిరుధాన్యాల ప్రదర్శన నేటి నుంచి ప్రారంభం కానుంది. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో శుక్రవారం (ఈ నెల 27) నుంచి మార్చి ఒకటి వరకు జరిగే ఈ ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరగనుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ వ్యవసాయ శాఖ సమన్వయంతో ఈ ప్రదర్శన జరగనుంది. దీన్ని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రారంభిస్తారు. -
పప్పు కూడుకూ కరువే..?
రాష్ట్రంలో పప్పుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. సాధారణ ప్రజలకు అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. వర్షాభావంతో సాగు తగ్గడం, దిగుబడి తగ్గిపోవడంతో పప్పు ధాన్యాలకు కొరత ఏర్పడింది... వ్యాపారుల ‘నిల్వల’ మాయాజాలం మరింత కరువు తెచ్చిపెట్టింది. దీంతో పెసరపప్పు ధర ఇప్పటికే ‘వంద’ మార్కును దాటి దూసుకుపోతుండగా... మినపపప్పు, కందిపప్పుల ధరలు దాని దగ్గరికి చేరుకుంటున్నాయి. ఇక వేసవి ముదిరే సమయానికి పప్పుల ధరలు అందనంత ఎత్తుకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో చుక్కలను తాకుతున్న పప్పుల ధరలు ⇒ రూ. 112కు చేరిన పెసరపప్పు.. ⇒ రూ. 100కు చేరువలో కందిపప్పు, మినపపప్పు ⇒ వర్షాభావంతో తగ్గిన సాగు.. పడిపోయిన దిగుబడి ⇒ దీనిపై ఎప్పుడో హెచ్చరించిన అసోచామ్ ⇒ ఏకంగా 32 శాతం తగ్గిన పప్పు ధాన్యాల సాగు ⇒ భారీగా నిల్వలతో కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ⇒ రంగంలోకి దిగిన ప్రభుత్వం.. నిల్వలపై నిఘా సాక్షి, హైదరాబాద్:- సాగు తగ్గింది.. దిగుబడీ పోయింది.. సాధారణంగా రాష్ట్రంలో 4.67 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాల సాగు జరగాల్సి ఉండగా.. 3.17 లక్షల హెక్టార్లలోనే రైతులు సాగుచేశారు. పెసర 48 శాతం, మినుములు 45 శాతం, కందులు 87 శాతం మేర మాత్రమే సాగయినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీంతో పప్పుధాన్యాల ఉత్పత్తి పడిపోయింది. ఒక్క కందుల ఉత్పత్తి పరిస్థితి మాత్రమే కొంతవరకూ మెరుగ్గా ఉంది. పెసరపప్పు అయితే ఏకంగా 1.07 లక్షల టన్నుల ఉత్పత్తికిగానూ కేవలం 24 వేల టన్నులకు తగ్గిపోయింది. మినుముల ఉత్పత్తి 46 వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి చాలా దూరంగా.. కేవలం ఆరు వేల టన్నులకు పరిమితం కావడం ఆందోళనకరం. ముందే హెచ్చరించినా.. దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తిపై పారిశ్రామిక మండలి ‘అసోచామ్’ గత ఖరీఫ్ సీజన్ మొదట్లోనే ప్రభుత్వాలను హెచ్చరించింది. రుతుపవనాలు సరిగా ఉండని నేపథ్యంలో వర్షపాతం తగ్గొచ్చని... దానివల్ల పప్పుధాన్యాల ఉత్పత్తి పడిపోయి ధరలు పెరగవచ్చని తమ నివేదికలో పేర్కొంది. అందులోనూ పప్పు ధాన్యాల ఉత్పత్తిలో 80 శాతం వాటా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని స్పష్టంగా తెలియజేసింది. కానీ ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించలేదు. అసోచామ్ చెప్పిన విధంగానే పప్పుధాన్యాల సాగు గణనీయంగా తగ్గింది. నిల్వలపై ఆంక్షలు.. విజిలెన్స్ నిఘా రాష్ట్రంలో పప్పుల ధరలు మరింతగా పెరిగే అవకాశాన్ని, డిమాండ్ను ఆసరాగా తీసుకొని వ్యాపారులు కృతిమ కొరత సృష్టించే అవకాశాలున్న దృష్ట్యా ప్రభుత్వం రంగంలోకి దిగింది. పప్పుల నిల్వలపై పరిమితిని నిర్దేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరానికి ఒక పరిమితిని, ఇతర ప్రాంతాల్లో మరో పరిమితిని విధించింది. హైదరాబాద్లో శనగపప్పు మినహా అన్ని రకాల పప్పులను హోల్సేల్ వ్యాపారులైతే నాలుగు వేల క్వింటాళ్లు, రిటైల్ వ్యాపారులు 125 క్వింటాళ్లను మించి నిల్వ చేయరాదని స్పష్టం చేసింది. అదే శనగపప్పును హోల్సేలర్ వెయ్యి క్వింటాళ్లు, రిటైలర్ 30 క్వింటాళ్లను మించరాదని తెలిపింది. మిగతా ప్రాంతాల్లో శనగపప్పు హోల్సేలర్ 500 క్వింటాళ్లు, రిటైలర్ 20 క్వింటాళ్లు.. ఇతర పప్పులైతే హోల్సేల్ వ్యాపారి 2,500 క్వింటాళ్లు, రిటైలర్ 100 క్వింటాళ్లను మించి నిల్వ ఉంచరాదని ప్రభుత్వం నిర్దేశించింది. ఇంతకు మించి పప్పులు నిల్వ చేసిన వ్యాపారులపై విజిలెన్స్ దాడులు చేయాల్సిందిగా ఇటీవల నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్శాఖ పప్పు ధాన్యాల నిల్వలపై నిఘాను పెంచింది. చుక్కల్ని తాకుతున్న పెసరపప్పు.. పప్పు ధాన్యాల ఉత్పత్తులు తగ్గడంతో రాష్ట్రంలో పెసరపప్పు ధర కిలో రూ. 112 కు చేరింది. గత ఏడాది ధరతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. పలు చోట్ల రిటైల్ మార్కెట్లో పెసరపప్పు ధర కిలో రూ. 120 వరకూ ఉంది. ఇక కందిపప్పు ధర కిలో రూ. 90కి పెరగగా... మినపపప్పు ధర రూ. 94కు చేరింది. సాగు తగ్గిన నేపథ్యంలో భవిష్యత్ డిమాండ్ను ముందుగానే ఊహించిన వ్యాపారులు పప్పుల నిల్వలను భారీగా పోగు చేయడం, వాటిని కొద్దికొద్దిగా మార్కెట్లోకి విడుదల చేస్తూ ధరలను ఇష్టారీతిన నిర్ణయిస్తుండటం వంటివి జరుగుతున్నాయి. దీంతో సామాన్యుడికి మాత్రం ధరాఘాతం తప్పడం లేదు. -
ఆపదలో అన్నదాత
పంట దిగుబడి పడిపోవడంతో రైతుల ఆక్రందన 83శాతానికి తగ్గిన సాగు విస్తీర్ణం తీవ్ర వర్షాభావమే కారణం వ్యవసాయశాఖ నివేదికలో వెల్లడి చుక్కల్ని తాకుతున్న బియ్యం, పప్పు ధాన్యాల ధరలు సాక్షి, హైదరాబాద్: ఊరించి ఉస్సూరనిపించిన రుతుపవనాలు.. సరిగా కురవని వానలు.. ఎండిపోయిన బావులు.. వట్టిపోయిన బోర్లు.. అన్నీ కలసి అన్నదాతను నట్టేట ముంచేశాయి. దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో ఖరీఫ్ పంటలు రైతన్నను రోడ్డున పడేశాయి. నానాతిప్పలూ పడి, అప్పులూ తెచ్చి పెట్టిన పెట్టుబడులు గాలిలో కలిసిపోయాయి. ఎటూ తోచక కూలీలుగా మారిపోయే దుస్థితిని తెచ్చిపెట్టాయి.. రైతు కష్టం ఇటు సామాన్యుడికీ తిప్పలు తెచ్చిపెట్టింది. పంటల దిగుబడి తగ్గిపోవడంతో ఆహార ధాన్యాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లోనూ వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. దీనికితోడు సాగు విస్తీర్ణం కూడా తగ్గడంతో 2014-15 ఖరీఫ్ ఆహార ధాన్యాల దిగుబడి భారీగా తగ్గిపోయింది. ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యంతో పోల్చినా.. గత రెండేళ్లతో పోల్చినా ఈ సారి దిగుబడి, ఉత్పాదకత గణనీయంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఖరీఫ్ పంటల దిగుబడులు దాదాపుగా రైతుల చేతుల్లోకి వచ్చాయి. ఖరీఫ్ ఆలస్యం కారణంగా అక్కడక్కడా కొంతమేర పంట పూర్తి కావాల్సి ఉన్నా దాదాపు 95 శాతం వరకు పూర్తయినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ మేరకు దిగుబడులపై ఆ శాఖ తయారు చేసిన నివేదిక ‘సాక్షి’కి అందింది. ఆ వివరాల ప్రకారం గతంలో వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. ఇది ఆహార భద్రతకు ముప్పు కలిగిస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 31 శాతం తగ్గిన ఉత్పత్తి.. ఖరీఫ్లో ఆహారధాన్యాల మొత్తం ఉత్పత్తి లక్ష్యం 78.98 లక్షల టన్నులుగా వ్యవసాయశాఖ నిర్దేశించుకుంది. కానీ దిగుబడి మాత్రం 53.86 లక్షల టన్నుల వరకు మాత్రమే వచ్చింది. అంటే ఏకంగా 25.11 లక్షల టన్నుల (31.81%) ఉత్పత్తి తగ్గిపోయింది. ఇందులో వరి దిగుబడి లక్ష్యం 50.81 లక్షల టన్నులుకాగా... దిగుబడి 35.27 లక్షల టన్నులకే పరిమితమైంది. ఈ లెక్కన 15.54 లక్షల టన్నులు (30.59%) తగ్గింది. ఇక పప్పుధాన్యాల పరిస్థితీ అంతే. శనగ ఉత్పత్తి లక్ష్యం 47 వేల టన్నులుకాగా.. దిగుబడి 14 వేల టన్నులకే పరిమితమైంది. సోయాబీన్ 4.7 లక్షల టన్నుల లక్ష్యానికి 4.12 లక్షల టన్నులు దిగుబడి అయింది. పంటలు వేసిన విస్తీర్ణం తగ్గిపోవడంతో పాటు ఉత్పాదకత తగ్గడం మూలంగానే దిగుబడి బాగా తగ్గిపోయింది. వర్షాలు సరిగా కురవకపోవడం, పంటలు ఎండిపోవడంతో ఉత్పాదకత తగ్గిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2012-13 ఖరీఫ్లో బియ్యం ఉత్పాదకత హెక్టారుకు 3,263 కేజీలు అయితే, 2013-14 ఖరీఫ్లో 3,227 కేజీలకు, ఈ ఖరీఫ్లో 3,072 కేజీలకు తగ్గిపోయింది. మిగతా పంటల ఉత్పాదకత పరిస్థితి కూడా అలాగే ఉంది. గతేడాదితో పోలిస్తే పత్తి దిగుబడి ఐదున్నర లక్షల టన్నులు తగ్గిపోవడం ఆందోళనకరమైన విషయం. సాగు తగ్గడం, వర్షాభావమే కారణం: ఖరీఫ్లో రుతుపవనాలు సకాలంలో రాకపోవడం, వర్షాలు సరిగా కురవకపోవడం, పంటల సాగు తగ్గిపోవడం వల్లే ఆహారధాన్యాల ఉత్పత్తి భారీగా తగ్గిపోవడానికి ప్రధాన కారణమని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. మహబూబ్నగర్ మినహా ఏ జిల్లాలోనూ ఖరీఫ్లో సాధారణ వర్షపాతం నమోదుకాలేదు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి జూన్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రంలో 715 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాలి. కానీ ఈ సారి 498.1 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని మొత్తం 464 మండలాలకుగాను 339 మండలాల్లో లోటు వర్షపాతమే ఉంది. కేవలం 80 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షాలు సరిగా కురవని కారణంగా.. రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటాయి. ఇది కూడా సాగు విస్తీర్ణం పడిపోవడానికి కారణమయింది. ఖరీఫ్లో 20.60 లక్షల హెక్టార్లలో ఆహారధాన్యాల సాగు జరగాల్సి ఉండగా... 17.18 లక్షల హెక్టార్లకు (83%) పడిపోయింది. అందులో వరి 10.04 లక్షల హెకార్లలో సాగుకావాల్సి ఉండగా... 8.17 లక్షల హెక్టార్లకు (81%) తగ్గిపోయింది. పప్పుధాన్యాల సాగు 4.92 లక్షల హెకార్లకుగాను 3.45 లక్షల హెక్టార్లకు (70%) పడిపోయింది. కూలీలుగా మారుతున్న రైతులు.. ఖరీఫ్ సాగు విస్తీర్ణం తగ్గడం, ఆహారధాన్యాల దిగుబడులు భారీగా పడిపోవడం, గిట్టుబాటు ధర లభించకపోవడం, రబీలోనూ కరువు ఛాయలు కనిపిస్తుండడంతో... రాష్ట్రంలో అన్నదాతలు నిండా ఆందోళనలో మునిగిపోయారు. దిగుబడి తగ్గిపోవడంతో పంటల కోసం పెట్టిన పెట్టుబడులు కూడా అందలేదు. ఫలితంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఎటూతోచని పరిస్థితుల్లో కూలీలుగా మారుతున్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల రైతులు ‘ఉపాధి’ హామీ పనులకు వెళుతున్నారు. మరోవైపు తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వలసలు పెరుగుతున్నాయి. ఏదో పనిచేసుకొని పొట్టపోసుకునేందుకు రైతులు పట్టణాలకు వస్తున్నారు. భవన నిర్మాణ కూలీలుగా, వాచ్మన్లుగా చేరుతున్నారు. కొందరు ఆటో రిక్షాలనూ నడుపుతున్నారు. చుక్కల్ని తాకుతున్న ధరలు.. వరి, పప్పుధాన్యాల దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో వాటి ధరలు చుక్కలను తాకుతున్నాయి. గత నెలతో పోలిస్తే సూపర్ఫైన్ బియ్యం ధర కిలోకు రూ.5 నుంచి రూ. 10 వరకు పెరిగింది. సాధారణంగా రూ. 35 బియ్యం ధరలు రూ. 40కి.. రూ. 40 నుంచి రూ. 45 వరకు ఉన్న బియ్యం ధరలు రూ. 50 వరకు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక పప్పుల ధరలు కిలోకు రూ. పది నుంచి పదిహేను వరకు పెరిగాయి. రాబోయే రోజుల్లో మరిం తగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. -
హుదూద్ టై
రేపు మధ్యాహ్నం విశాఖ సమీపంలో తీరం దాటే అవకాశం జిల్లా యంత్రాంగం అప్రమత్తం కంట్రోల్ రూముల ఏర్పాటు రంగంలోకి భద్రతా బలగాలు నేడు విద్యా సంస్థలకు సెలవు పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు జిల్లాకు పెనుముప్పు పొంచి ఉంది. పెను తుపాను రూపంలో హుదూద్ శరవేగంగా దూసుకొస్తోంది. విశాఖకు సుమారు 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం మధ్యాహ్నానికి విశాఖ సమీపంలో తీరం దాటే అవకాశముంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సహాయక చర్యలకు సర్వసన్నద్ధంగా ఉంది. ఇప్పటికే నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. కంట్రోల్ రూమ్లు ఏర్పాటయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా విద్యా సంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. విశాఖ రూరల్ : హుదూద్ తీవ్ర పెనుతుపానుగా మారి మనవైపే దూసుకువస్తోంది. నగరం పరిసరాల్లోనే తీరం దాటుతుందనే వాతావరణ నిపుణుల సమాచారం కొంత కలవరపరుస్తోంది. వాస్తవానికి తుపానులు చాలాసార్లు ఏర్పడినా మనకు చేరువుగా తీరం దాటడం ఇదే ప్రప్రథమం. మునుపెన్నడూ ఇ లా విశాఖ వైపు దూసుకొచ్చిన సందర్భాలు లేవు. భౌగోళికంగా చుట్టూ ఉన్న కొండలు, సముద్ర అడుగు భాగంలో ఉన్న ప్రత్యేకమైన సహజ నిర్మాణం తుఫానును విశాఖ తీరానికి రాకుండా చేస్తున్నాయి. అనుకున్నట్టుగా హుదూద్ విశాఖ సమీపాన తీరం దాటితే చరిత్రే. జిల్లాలో పాయకరావుపేట, ఎస్.రాయవరం, నక్కపల్లి, రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ, గాజువాక, పెదగంట్యా డ, విశాఖ అర్బన్, విశాఖ రూరల్, భీమిలి మొత్తం 11 కోస్తా తీర మండలాలు ఉన్నాయి. వీటితో పాటు 16 మండలాలపై హుదూద్ ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేశారు.వీటిలో 50 తీర ప్రాంత గ్రామాలకు తుపాను ప్రమాదం పొంచి ఉంది. 1967 నుంచి గత ఏడాది వరకు వచ్చిన తుపాన్లు ఏ ఒక్కటీ విశాఖ మీదుగా తీరం దాటలేదు. కానీ తుపాన్ల ధాటికి జిల్లా అతలాకుతలమైంది. అటువంటిది ఈ హుదూద్ విశాఖ మీదుగా తీరం దాటుతుండడంతో ఎటువంటి ఉపద్రవాన్ని మోసుకొస్తుందోనని అందరిలో ఆందోళన నెలకొంది. తీరం దాటే సమయంలో గాలులు గంటకు 140 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. సముద్రం 1.5 మీటర్ ముందు వస్తుంది. ఈ తీవ్రతను ఎదుర్కోడానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. రెండు కంపెనీల మిలటరీ బలగాలు కూడా జిల్లాకు వస్తున్నాయి. 30 నేవీ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఆరు ఎన్డీఆర్ఎఫ్ టీమ్లు జిల్లా నుంచి తుపాను ప్రభావిత మండలాలకు పయనమయ్యాయి. నేడు పునరావాస కేంద్రాలకు తరలింపు తుపాను ప్రభావిత, లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు శనివారం ఉదయం నుంచి తరలిస్తారు. జిల్లాలో మొత్తం 125 పునరావాస కేంద్రాలను గుర్తిం చినప్పటికీ అవసరాన్ని బట్టి తొలి దశలో 40 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. విశాఖ, అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ల పరిధిలో 10 మండలాల్లో 57 గ్రామాల నుంచి 89,776 మంది 40 పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి కేంద్రం వద్ద డిప్యూటీ తహశీల్దార్ను ఇన్చార్జ్గా నియమించారు. ఇప్పటికే ఈ కేంద్రాలకు బియ్యం, పప్పు, తాగునీరు, మందులు, ఇతర సదుపాయాలను సిద్ధం చేశారు. భారీ గాలులకు చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగే అవకాశాలు ఉండడంతో వెంటనే వాటిని తొలగించడానికి జేసీబీలు, క్రేన్లు సిద్ధంగా ఉంచారు. భారీగా భద్రతా దళాలు :కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా దశలు జిల్లాకు చేరుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2 కంపెనీల మిలటరీ బలగాలను జిల్లాకు పంపిస్తోంది. శనివారం ఉదయానికి 36 వాహనాల్లో ఇవి జిల్లాకు రానున్నాయి. వీటికి అచ్యుతాపురంలో చేశారు. 30 నేవీ బృందాలు తమ సామగ్రితో సిద్ధంగా ఉన్నాయి. ప్రతి బృందంలో అయిదుగురు ఈతగాళ్లు ఉన్నారు. వీటితో పాటు జిల్లాకు నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించినప్పటికీ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని భావించి మరో రెండు టీమ్లను జిల్లాకు కేటాయించారు. ఒక్కో బృందంలో 40 మంది సభ్యులు ఉండనున్నారు. ఈ టీమ్లు శనివారం ఉదయానికి 15 ప్రభావిత ప్రాంతాలకు చేరుకోనున్నాయి. వీటితో పాటు హైదరాబాద్ నుంచి రాష్ర్ట స్థాయి విపత్తు నిర్వహణ బృందం జిల్లాకు రానుంది. ఫైర్మెన్ టీమ్లను కూడా సిద్ధం చేశారు. హెలికాప్టర్లు సిద్ధం : అత్యవసర పరిస్థితుల కోసం జిల్లాలో 5 నేవీ హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. వరదలప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, వారికి ఆహారాన్ని అందించే విషయంలో వీటిని వినియోగించనున్నారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన మరో హెలికాప్టర్ కూడా హైదరాబాద్లో సిద్ధంగా ఉంది. రవాణా వ్యవస్థపై ప్రభావం : హుదూద్ తుఫాన్ ప్రభావం రైళ్లపై పడింది. ఎలాంటి విపత్తు సంభవించినా తూర్పు కోస్తా రైల్వే సర్వసన్నద్దంగా వుందని ఆశాఖ ప్రకటించింది. అన్ని మేజర్ రైల్వే స్టేషన్లలో కంట్రోల్ గదులను ఏర్పాటు చేసింది. విశాఖ మీదుగా నడిచే రైళ్లను రద్దు చేసింది. విశాఖ నుంచి బయలుదేరే రైళ్లు కూడా రద్దయ్యాయి.ముందుజాగ్రత్తగా శనివారం కూడా కొన్నింటిని రద్దు చేసింది. పలు రైళ్లను ఖరగ్పూర్, ఝార్సుగుడ, రాయపూర్, నాగపూర్ మీదుగా దారిమళ్లించారు. 12న విశాఖపట్నం, విజయనగరం, రాయగడ, పలాస, కోరాపుట్ల నుంచి బయలుదేరాల్సిన అన్ని పాసిం జర్ రైళ్లను రద్దు చే శారు. 12న ఆర్టీసీ బస్సులను నడిపే విషయంపై ఆ రోజు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోనునున్నారు. రిజర్వాయర్లపై దృష్టి : ప్రస్తుతం జిల్లాలో 7 జలాశయాల్లో నీటి మట్టాలు 50 శాతం తక్కువగానే ఉన్నాయి. భారీ వర్షాలు కురిసినా వెంటనే రిజర్వాయర్ల గేట్లు ఎత్తే అవకాశం లేదు. వాటి కింద గ్రామాలకు ప్రస్తుతానికి ఎటువంటి భయం లేదు. అయితే స్థానికంగా భారీ వర్షాలు పడితే ఇన్ఫ్లోను బట్టి నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. నేడు విద్యా సంస్థలకు సెలవు : పెను తుపాను నేపథ్యంలో శనివారం జిల్లాలోని అన్ని పాఠశాలలు, కాలేజీలకు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ సెలవు ప్రకటించారు. యాజమాన్యాలు ఎటువంటి తరగతులు నిర్వహించకూడదని సూచించారు. తీరప్రాంతంలో ఉన్న పరిశ్రమలు శనివారం రాత్రి షిఫ్ట్ నిర్వహించకూడదని ఆయా సంస్థలకు, ప్రధానంగా బ్రాండిక్స్కు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సిద్ధంగా ఉన్నాం ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాం. ఈ నెల 12న భారీ వర్షాలతో పాటు గాలులు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది. సముద్రం 1.5 మీటర్లు ముందు వస్తుంది. లోతట్టు ప్రాం తాల ప్రజలను శనివారం ఉదయం నుంచి 40 పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాం. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ ఎఫ్, ఫైర్మెన్, పోలీసులు, జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదు. ప్రజలు కూడా సహకరించాలి. - డాక్టర్ ఎన్.యువరాజ్, కలెక్టర్ ఏర్పాట్లు ఇలా... 274 మంది ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఉదయం బ్రేక్ఫాస్ట్, ఆహారం, పాలు, బ్రెడ్ సరఫరాకు ఏర్పాట్లు చేశారు. తుపాను కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించడం వల్ల గ్యాస్, కిరోసిన్, పెట్రోల్, డీజిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉండడంతో ప్రతి మండల కేంద్రంలో వీటిని సిద్ధంగా ఉంచుతున్నారు. 300 గ్యాస్ సిలిండర్లతో ఒక లారీ, 12 కిలోలీటర్లతో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, పాలు ట్యాంకర్లు ప్రతి మండల కేంద్రంలో ఉండనున్నాయి. జిల్లాలో అన్ని మండలాల్లో వైర్లెస్ సెట్లు రెడీ చేశారు. కేంద్రం నుంచి వచ్చిన 14 శాటిలైట్ ఫోన్లలో 8 జిల్లాలో వినియోగించనున్నారు. వర్షాలు, గాలులకు నెలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించేందుకు 43 జేసీబీలను, 36 ట్రీ కటర్లను, 32 రంపాలను, 46 ట్రాక్టర్లను, 35 గన్నీ బ్యాగ్ సప్లయిర్లను సిద్ధం చేశారు. -
జోరుగా జీరో బిజినెస్
విజయవాడ కేంద్రంగా వ్యాపారం అక్రమంగా పుప్పుధాన్యాల దిగుమతి మామూళ్ల మత్తులో వాణిజ్య పన్నుల అధికారులు కోట్లాది రూపాయల పన్ను ఎగనామం విజయవాడ : మామూళ్ల మత్తులో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కార్యాలయాలకే పరిమితం కావడం.. ఆన్లైన్లో వే ఫ్రీగా బిల్లులు లభిస్తుండటంతో విజయవాడ కేంద్రంగా పప్పుధాన్యాల జీరో వ్యాపారం జోరుగా సాగుతోంది. విజయవాడలో 14 బోగస్ సంస్థల పేరుతో ఇప్పటికీ ఈ వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. వాణిజ్య కూడలి అయిన విజయవాడ నుంచి రాష్ట్రంలోని కొన్ని ముఖ్యమైన పట్టణాలకు అక్రమంగా పప్పుధాన్యాలను తరలిస్తున్నారు. ఈ విషయం తెలిసినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా అక్రమార్కులు రోజుకు రూ.60 లక్షలు చొప్పున నెలకు రూ.18 కోట్ల పన్నులను ప్రభుత్వానికి చెల్లించకుండా తప్పించుకుంటున్నట్లు ‘సాక్షి’ సేకరించిన సమాచారంలో స్పష్టమైంది. పక్కా ప్రణాళికతో మోసం బ్రోకర్లు విజయవాడలో తిష్టవేసి అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి పక్కా ప్రణాళికతో బిల్లులు లేకుండా మహారాష్ట్ర నుంచి పప్పుధాన్యాలను దిగుమతి చేస్తున్నారు. రోజుకు వంద లారీల కందిపప్పు అనామతుగా దిగుమతి అవుతోంది. పప్పుధాన్యాలపై దిగుమతి టాక్స్ లేని చెన్నై, ఒడిశా తదితర రాష్ట్రాలకు సరుకు తీసుకెళ్తున్నట్లు చూపించి విజయవాడలో దింపేస్తున్నారు. వాస్తవానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లే సరుకు మన రాష్ట్రంలోకి ప్రవేశించగానే బోర్డర్ చెక్పోస్టులో ట్రాన్సిస్ట్మెంట్ పాస్ తీసుకోవాల్సి ఉంది. దాన్ని మన బోర్డర్ దాటగానే అక్కడ చెక్పోస్టులో అందించాలి. బ్రోకర్లు పథకం ప్రకారం ఖాళీ లారీలను చెక్పోస్టులు దాటించేస్తున్నారు. కొందరు బిల్ట్రేడింగ్లోనూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. సుగుణ, రాఘవేంద్ర, నాగేశ్వరావు వంటి బినామీ పేర్లతో పది మంది బ్రోకర్లు, వారి గుమాస్తాలు విజయవాడలో ఈ అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. రోజుకు వంద లారీలు.. ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన దాదాపు వంద లారీల కందిపుప్పు, శనగపుప్పును విజయవాడలో దిగుమతి చేస్తున్నారు. ఒక్కో లారీలో 17 టన్నుల సరుకు ఉంటుంది. దాని విలువ రూ.12లక్షలు. ఈ లెక్కన రోజుకు రూ.120కోట్ల విలువైన పప్పుధాన్యాలు దిగుమతి చేస్తున్నారు. ఒక్కో లారీకి ఐదు శాతం చొప్పున రూ.60వేలు పన్ను చెల్లించాల్సి ఉంది. అక్రమంగా దిగుమతి చేసిన పప్పుధాన్యాలకు పన్ను చెల్లించకపోవడం వల్ల ప్రభుత్వానికి నెలకు రూ.18కోట్లు నష్టం వస్తోందని అంచనా. ఇతర ప్రాంతాలకు సరఫరా.. విజయవాడలో అక్రమంగా దిగుమతి చేసిన సరుకును బ్రోకర్లు రోజూ గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి, భీమవరం, పాలకొల్లు తదితర పట్టణాలకు తరలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోనూ సబ్-బ్రోకర్లను ఏర్పాటు చేసి జీరో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ జీరో వ్యాపారంపై ఉన్నత స్థాయి విచారణ నిర్వహించి పప్పుధాన్యల అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకోవటంతోపాటు బినామీ వ్యాపార సంస్థలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి కోట్లాది రూపాయల పన్నులు సమకూరే అవకాశం ఉంది. విజయవాడలోని బెంజిసర్కిల్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం పరిధిలో రెండు చోట్ల బాలాజీ ఎంటర్ప్రెజైస్ పేరుతో వ్యాపారాల నిర్వహణకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు. ఈ సంస్థలు జనవరి నుంచి ఆగస్టు వరకు దాదాపు రూ.42 కోట్ల విలువైన పప్పుధాన్యాలను విక్రయించి పన్ను చెల్లించలేదు. వాస్తవానికి బాలాజీ ఎంటర్ప్రెజైస్ పేరుతో అనుమతి కోసం అందజేసిన దరఖాస్తుల్లో పేర్కొన్న చిరునామాల్లో ఎటువంటి వ్యాపార సంస్థలు లేవని, రెండు సంస్థలను ఒకే వ్యాపారి నిర్వహించాడని తర్వాత తేలింది. గుట్టుగా తన పని ముగించుకున్న వ్యాపారి ఆ తర్వాత బోర్డు తిప్పేశాడు. విజయవాడ సూర్యారావుపేట సర్కిల్ పరిధిలో విజయలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ నకిలీ చిరునామాతో జనవరి నుంచి జూన్ వరకు రూ.24 కోట్ల విలువైన కందిపప్పును నిబంధనలకు విరుద్ధంగా నగరానికి తీసుకొచ్చినట్లు ఆన్లైన్లో వే బిల్లులు చూపిస్తున్నాయి. సీతారామపురం సర్కిల్ ఏరియాలో శ్రీ వెంకటలక్ష్మి ట్రేడర్స్ అనే సంస్థ గత ఏడాది ఆన్లైన్లో వేబిల్లులు పొంది రూ.10 కోట్ల మేర వ్యాపారం నిర్వహించి పన్ను చెల్లించకుండా బోర్డు తిప్పేసింది. గుడివాడ వాణిజ్య పన్నుల శాఖ సర్కిల్ పరిధిలో నెక్కలం-గొల్లగూడెం గ్రామంలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ పేరుతో ఈ సంవత్సరం మే నెల వరకు రూ.30 కోట్ల విలువైన కందిపప్పు లావాదేవీలు జరిగినట్లు ఆన్లైన్లో వే బిల్లులు చూపిస్తున్నాయి. కానీ, ఒక్క పైసా కూడా పన్ను చెల్లించలేదు. ఆడిట్ సమయంలో ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు వెళ్లి పరిశీలించగా నెక్కలం-గొల్లడూడెంలో అసలు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ లేదని తేలింది. -
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యుడు విలవిల
కూర‘గాయాలే’.. కూరగాయల ధరలు భగ్గుమన్నాయి. వీటిని కొనాలంటేనే ప్రజలు బెంబేలెత్తారు. కిలో కూరగాయలకు బదులు పావుకిలోతోనే సరిపెట్టుకున్న కుటుంబాలున్నాయంటే ధరలు ఏవిధంగా ఎగబాకాయో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో కూరగాయల కంటే చికెన్ కొనుగోలు సులువు అనిపించింది. సంవత్సరం మొదట్లో కిలోకు రూ 15 ఉన్న టమాట సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రూ 60కి తాకింది. వంకాయ రూ 15 నుంచి రూ 40, బెండ రూ 20 నుంచి రూ 40, మిర్చి రూ 20 నుంచి రూ 60, బీర రూ 25 నుంచి రూ 40, క్యాబేజీ రూ 20 నుంచి రూ 35, దోస రూ 10 నుంచి రూ 35కి పెరిగాయి. ఇంతటి భారీ స్థాయిలో ధరలు పెరగడం చరిత్రలో ఇదే మొదటిసారి. మధ్యతరగతి కుంటుంబాల మాటేమోగాని.. సామాన్యుల కుటుంబాలు విలవిలలాడాయి. అయితే ఏడాది చివర డిసెంబర్లో కొంతమేర ధరలు క్షీణించాయి. అమ్మో ఉల్లి.. ఉల్లి.. అంటేనే జనాలు జంకారు. కోస్తే నీరొచ్చే ఉల్లి... అసలు ధర వింటే కంటతడి పెట్టించింది. రాష్ట్రంలో అకాల వర్షాలు, తుపానుల ప్రభావంతో ఉల్లి పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో మహారాష్ట్రలోని షోలాపూర్, గుజరాత్, కర్నూలు ప్రాంతాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకున్నారు. దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో ఉల్లి రేటు మూడింతలైంది. మరోవైపు ఉద్యమ సెగలతో రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగింది. దీంతో వ్యాపారులు కూడా తీవ్ర సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు రూ 30 నుంచి ఒక దశలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రూ 70 వరకు ఉల్లిధర పలికింది. పెట్రో బాంబ్... ఏడాది పొడవునా పెట్రో బాంబు పేలుతూనే ఉంది. ప్రభుత్వం పలుమార్లు ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది. జిల్లాలో ద్విచక్ర వాహనాలు 1.86 లక్షలు, 17 వేల కార్లు, 21 వేల ఆటోలు, మరో 9 వేల ఇతర వాహనాలు ఉన్నాయి. 170 బంకుల ద్వారా నిత్యం 7 లక్షల లీటర్ల డీజిల్, 2 లక్షల లీటర్ల పెట్రోలు అమ్ముడవుతోంది. పెట్రోలు లీటర్పై ఫిబ్రవరిలో రూ 1.42, జూన్లో రూ 2, ఇదే నెలలో మరోసారి రూ 1.82, జూలైలో రూ 1.55, ఆగస్టులో 70 పైసలు, సెప్టెంబర్లో ఏకంగా రూ 2.35 పెంచేసింది. అదేనెలలో మరోసారి రూ 1.65లు బాదింది. తాజాగా ఈనెల 20వ తేదీన మరో 41 పైసలు వడ్డించింది. అడపాదడపా స్వలంగా తగ్గించినా అందుకు రెట్టింపుగానే ధరల బాజా మోగించింది. ఏడాది మొదట్లో సుమారు రూ 70 ఉన్న లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ 77.60కు చేరుకుంది. అంటే ఒక్క ఏడాదిలోనే ఒక్కో లీటరుపై వినియోగదారులు రూ 7.60 అదనపు భారం మోశారన్నమాట. ఈ లెక్కన ఏడాదికి రూ 54 కోట్ల భారం ప్రజలపై సర్కారు మోపింది. జనవరిలో లీటరు డీజిల్ ధర రూ 50.23 ఉండగా ప్రస్తుతం రూ. 58.60కు చేరుకుంది. రూ 8.37 అదనంగా పెరగడంతో రవాణా వ్యవస్థపై పెనుభారం పడింది. ఏడాదికి రూ 210 కోట్ల భారం వినియోగదారులకు వడ్డించింది. ఈ పెంపుతో రవాణా చార్జీలు ఎగబాకడంతో పరోక్షంగా సామాన్యుడు విలవిలలాడాడు. గ్యాస్ మంట.. జిల్లాలో మూడు ఆయిల్ కంపెనీల పరిధిలో 6.54 లక్షల గృహ వినియోగ వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ‘ఆధార్’ తప్పనిసరి చేసింది. అయితే అందరికీ పూర్తిస్థాయిలో ఆధార్ లేకపోవడంతో మరో మూడు నెలలు పొడిగించిన విషయం తెలిసిందే. గ్యాస్ కనెక్షన్ను ఆధార్, బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకున్న వినియోగదారులు పూర్తిస్థాయిలో గ్యాస్ ధర చెల్లిస్తున్నారు. వినియోగదారుడు సిలిండర్ తీసుకున్న తర్వాత సబ్సిడీ బ్యాంకులో జమవుతోంది. ప్రస్తుతం సబ్సిడీ కాకుండా సిలిండర్ ధర రూ 1,107. గ్యాస్ ధర రూ 420 పోను రూ 687 సబ్సిడీ బ్యాంకులో జమ చేయాల్సి ఉంది. రూ 50లను గతంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ భరించింది. కనెక్షన్ను ఆధార్కు అనుసంధానం చేసిన వినియోగదారులకు ఈ రూ 50 ల సబ్సిడీని ఎత్తివేసింది. మిగిలిన రూ 637 మాత్రమే ఖాతాలో వేస్తోంది. ఈ లెక్కన జిల్లాలో 2.50 లక్షల మంది వినియోగదారులపై మూడు నెలలుగా భారం పడుతూనే ఉంది. ఈ లెక్కన రూ 3.75 కోట్ల భారం భరించారు. కష్టాల‘పాలు’.... ఈ ఏడాది ప్రతి నిత్యావసర సరుకు ధర ఎగబాకింది. సగటున ప్రతి వస్తువు ధర 20 నుంచి 50 శాతం వరకు పెరిగిందని అంచనా. లీటరు పాల ధర మూడు రూపాయల చొప్పున పెంచారు. ఏడాది ఆరంభంలో పాల పాకెట్ లీటర్ సుమారు రూ 33 ఉండగా.. ఏకంగా రూ 36 నుంచి రూ 38కి పెరిగింది. సరాసరి రోజుకు ప్రైవేటు డెయిరీలలో 2.15 లక్షల లీటర్లు, గ్రామాల్లో, పట్టణాల్లో విడిగా 6.50 లక్షల లీటర్లు అమ్ముతున్నారు. మొత్తం 8.65 లక్షల లీటర్ల పాలను జిల్లా ప్రజలు నిత్యం వినియోగిస్తున్నారు. ఈ లెక్కన రోజుకు రూ 25.95 లక్షలు, నెలకు రూ 7.78 కోట్లు, ఏడాదికి రూ 93.42 కోట్ల భారం ప్రజలపై పడింది. బస్సు ప్రయాణం భారం.. డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీ కూడా బస్చార్జీలు పెంచేసింది. రెండు సార్లు చార్జీలు పెంచి ప్రయాణికుల నెత్తిన రుద్దారు. చివరికి విద్యార్థుల బస్ పాస్ చార్జీలూ పెంచేసింది. 2012 సెప్టెంబర్ 24న సాధారణ చార్జీలను 9.5 శాతం పెంచారు. ఆర్డినరీ( పల్లెవెలుగు) బస్లకు కిలోమీటర్కు 5 పైసలు, ఎక్స్ప్రెస్కు, డీలక్స్కు 10 పైసలు, సూపర్ లగ్జరీకి 12 పైసలు పెంచి చుక్కలు చూపించింది. జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో 739 సర్వీలు ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేస్తున్నాయి. చార్జీల పెంపుతో ప్రయాణికులపై *రెండు కోట్ల భారం పడింది. సర్ర్ర్... షాక్ విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలకు సర్కారు షాకిచ్చింది. మార్చిలో చార్జీలను సగటున 15 శాతం పెంచి ఏప్రిల్ నుంచి అమలులోకి తెచ్చింది. సర్చార్జీల పేరుతో పెనుభారం మోపింది. పాన్డబ్బా నుంచి మొదలుకుని పరిశ్రమల వరకు అన్ని కేటగిరీల వినియోగదారులకూ వడ్డించింది. 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకునే కుటుంబాలను సైతం వదిలిపెట్టలేదు. ఈ ఏడాది జిల్లా ప్రజలపై విద్యుత్ సర్చార్జీల రూపంలో అదనంగా సుమారు రూ 130 కోట్ల భారం పడిందని అంచనా. ఓ వైపు విద్యుత్ కోత లు పెడుతూనే.. మరోవైపు బిల్లుల రూపంలో వాతలు పెట్టింది. గత వేసవిలో చిన్న చిన్న పరిశ్రమలు అధిక సంఖ్యలో మూతబడ్డాయి. ఏప్రిల్ లో చార్జీలు పెంచి పదిశాతం అదనపు ఆదాయాన్ని రాబట్టేందుకు కార్యాచరణను అమలు చేసింది. ఇందులో భాగంగా గృ హ వినియోగ విద్యుత్కు యూనిట్పై 50 పైసల నుంచి రూ 1 వరకు పెంచింది. ఇంకా ఎల్టీ వినియోగంపై 58 పైసలు, హెచ్టీ వినియోగదారులపై రూ 1.12 యూనిట్పై అదనపు భారాన్ని మోపింది. పప్పు, బియ్యం ధర పైపైకి.. పప్పు, బియ్యం ధరలు ఈ ఏడాది పాడవునా పెరుగుతూనే వచ్చాయి. పెసరపప్పు రూ 70 నుంచి రూ 92, పల్లి నూనె రూ 90 నుంచి రూ 110 పలికింది. బియ్యం ధరలు అడ్డగోలుగా ఎగబాకాయి. సన్న బియ్యం ధరలైతే ఓ మోస్తరు సంపాదన ఉన్నవారు కూడా కొనలేనంతగా పెరిగాయి. బీపీటీ రకం రూ 30 నుంచి ఏకంగా రూ 37కి చేరింది. ఫలితంగా మధ్యతరగతివారికి కుటుంబం గడవడం కష్టంగా మారింది. అన్నదాత అతలాకుతలం.. పుడమి బిడ్డలపై ప్రకృతి కత్తి కట్టింది. ఖరీఫ్లో వచ్చిన పై-లీన్ తుపాను జిల్లా రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బకొట్టింది. తీరని నష్టాన్ని మిగిల్చింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఐదు రోజుల పాటు ఏకధాటిగా వర్షం విరిసిన పంజాకు అన్నదాత విలవిలలాడిపోయాడు. దిగుబడి చేతికి వచ్చే దశలో పంటలన్నీ కొట్టుకుపోయాయి. పొలాలు జలసంద్రమయ్యాయి. 3.80 లక్షల ఎకరాల్లో పత్తి, 91,865 ఎకరాల్లో వరి పైరు పనికిరాకుండా పోయింది. అంతేగాక 15 వేల ఎకరాల మిరప, 5060 ఎకరాల కంది, 1035 ఎకరాల వేరుశనగ, 930 ఎకరాల మొక్కజొన్న, 256 ఎకరాల ఆముదం పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాలు వేశారు. దాదాపు రూ 900 కోట్ల మేర రైతులు నష్టపోయారని గుర్తించారు. అయితే పూర్తి స్థాయి సర్వే చేపట్టిన తర్వాత అధికారులు వెల్లడించిన వివరాలను చూసి రైతులు నిర్ఘాంతపోయారు. 50 శాతం, ఆపై పంట నష్టపోయిన వాటినే పరిగణనలోకి తీసుకోవడం శోచనీయం. జిల్లాలో పత్తి, వరి, ఇతర అన్ని పంటలు కలిపి 1.20 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని అధికారులు తేల్చారు. మొత్తం 1,35,603 మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించారు. వీరిని ఆదుకునేందుకు రూ 54.07 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించాలని ప్రభుత్వానికి నివేదిక పంపడం గమనార్హం. భారీ వర్షాల కారణంగా 15 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. బాధితుల్లో 95 శాతం పేదలే ఉన్నారు. మొత్తం రూ 60 కోట్ల నష్టం సంభవించిందని అధికారులు లెక్కలుగట్టారు. దీనికితోడు మత్స్య కార్మికులు పెద్ద ఎత్తున నష్టపోయారు.