rallys
-
ప్రజల పట్ల అందరూ బాధ్యతగా ఉండాల్సిందే: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: జీవో నంబర్ వన్పై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు ముందు దాన్ని క్షుణ్ణంగా చదువుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. పదేపదే విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు అసలు ఆ జీవోను ఇప్పటిదాకా చదివాయా అంటూ ప్రశ్నించారు. అందులో రోడ్షోలు, ర్యాలీలు నిషేధమని ఎక్కడుందో చెప్పాలని కోరారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రోడ్లపై బహిరంగ సభలు పెట్టొద్దని మాత్రమే చెప్పాం. అవసరమైతే అనుమతి తీసుకొని బహిరంగ సభలు పెట్టుకోవచ్చు. జోవో నంబర్ వన్ అన్ని పార్టీలకు వర్తిస్తుంది. వైఎస్సార్, జగన్ పాదయాత్రల్లో ఎంతో జాగ్రత్త తీసుకున్నాం. కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాం. ప్రజల పట్ల అందరూ బాధ్యతగా ఉండాలి అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చదవండి: (20 కోట్ల ఆఫర్ని కాదన్నాడు.. రూ.100కోట్లు ఇచ్చినా కూడా..) -
ఇది అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ప్రజల భద్రత కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో నిబంధనలకు లోబడే సభలు జరుపుకోవాలని చెప్పారు. షరతులు ఉల్లంఘిస్తేనే నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేదం. ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని ఆదేశాలు ఇచ్చాము. రోడ్లపై కాకుండా గ్రౌండ్లో సభలు జరుపుకోవచ్చు. కేవలం ప్రతిపక్షాలపై పరిమితులు విధించలేదు. ఇది అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. వైఎస్సార్సీపీ కూడా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. చంద్రబాబు సభల్లో జనం చనిపోతున్నారు. కందుకూరు, గుంటూరులో ఏం జరిగిందో చూశాం. చంద్రబాబు అమాయకుల ప్రాణాలు తీశారు' అని సజ్జల మండిపడ్డారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులపైన, మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతించేది లేదని స్పష్టంచేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు లేదా పోలీస్ కమిషనర్లు కచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వొచ్చని మినహాయింపునిచ్చింది. చదవండి: (పవన్ కల్యాణ్ ద్వంద్వ వైఖరిని కాపులు అర్థం చేసుకోవాలి: మంత్రి అంబటి) -
భారీ లాభాల్లో స్టాక్మార్కెట్, అన్ని రంగాల్లోనూ లాభాలు
సాక్షి, ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడింగ్ను ఆరంభించాయి. సెన్సెక్స్ 648 పాయింట్లు ఎగిసి 59790 వద్ద, నిఫ్టీ195 పాయింట్లు లాభంతో 17817 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ , ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా మోటార్స్, హిందాల్కో, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్ భారీగా లాభపడుతుండగా, గ్రాసిం మాత్రమే స్వల్పంగా నష్టపోతోంది. కాగా వరుస నష్టాలకు చెక్ పెట్టిన కీలక సూచీలు సోమవారం లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ సంకేతాలు, ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో మంగళవారం ర్యాలీని కంటిన్యూ చేస్తున్నాయి. -
ఆగస్టు 17 నుంచి 23 వరకు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ర్యాలీలు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో మెహంగై చౌపాల్(ధరల పెరుగుదల పై చర్చలు) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 17 నుంచి 23 వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మండీలు, రిటైల్ మార్కెట్లు వంటి తదితర ప్రదేశాల్లో ధరల పెరుగుదల పై ర్యాలీలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జై రాం రమేష్ తెలిపారు. ఈ నిరసన ర్యాలీలు ఆగస్టు 28న ఢిల్లీలోని రాంలీలా గ్రౌండ్స్లో సీనియర్ నాయకులు ధరలపై నోరెత్తండి అనే ప్రసంగంతో ముగిస్తుందని చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేరకంగా ఆగస్టు 5న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టిన నిరసనలు ప్రజల్లో బలంగా వెళ్లి ప్రతి ధ్వనించాయని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ చట్టబద్ధమైన నిరసనను చేతబడి లేదా క్షద్ర శక్షులుగా చిత్రకరించే ప్రయత్నం చేశారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు తమ ప్రభుత్వ వైఫల్యాల విషయమైన మోదీలో కలుగుతున్న అభద్రత భావాన్ని తేటతెల్లం చేస్తోందంటూ... ఆరోపణలు చేశారు. రానున్న వారాల్లో ధరల పెరుగుదల, నిరుద్యోగం పై వరుస నిరసనలతో కాంగ్రెస్ ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు. మెదీ చేస్తున్న ఆర్థిక దుర్వినియోగాన్ని కూడా బయట పెడతామని అన్నారు. ఈ మేరకు పెరుగు, మజ్జిగ , ఫ్యాకేజ్డ్ ఆహారధాన్యాల వంటి నిత్యావసర వస్తువుల పై అధిక పన్నుల విధించడం వల్ల ద్రవ్యోల్బణం తీవ్రమవుతోందన్నారు. అంతేకాదు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం, అగ్నిపథ్ వంటి తప్పుదారి పట్టించే పథకాలను ప్రవేశపెట్టడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని జై రాం రమేష్ అన్నారు. (చదవండి: ఈ ఫుడ్ని జంతువులు కూడా తినవు ... కానిస్టేబుల్ ఒకటే ఏడుపు) -
స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనం వద్ద కార్మికుల నిరసన..
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం పెద్ద ఎత్తున కార్మికులు అడ్మిన్ భవనం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో స్టీల్ ప్లాంట్ వద్ద పోలీసు అధికారులు అదనపు బలగాలను మోహరించారు. స్టీల్ ప్లాంట్కు చేరుకునే అన్ని మార్గాలను దిగ్భంధించేందుకు కార్మికులు యత్నించారు. కాగా, భారీవర్షంలోనూ గొడుగులు పట్టుకుని మరీ.. కార్మిక సంఘాల నేతలు ప్రైవేటికరణకు వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేశారు. -
భారీ ఆఫర్: దూసుకుపోయిన ఇన్ఫోసిస్
సాక్షి, ముంబై: 1800 పాయింట్లుకు పైగా కుప్పకూలిన దలాల్ స్ట్రీట్లో ఈ సోమవారం బ్లాక్ మండేగా నిలిచింది. స్టాక్మార్కెట్లో 2021లో ఇదే అదిపెద్ద పతనం. అయితే దేశంలోని రెండవ అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మాత్రం లాభాలతో మురిపించింది. తమ బోర్డు సమావేశంలో వాటాలను తిరిగి కొనుగోలు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తుందని ఆదివారం ఎక్స్ఛేంజీలకు సమాచారం కంపెనీ వెల్లడించడమే ఇందుకు కారణం. దీంతో ఇన్ఫోసిస్ షేరు ఏకంగా 2.72 శాతం ఎగిసి రూ.1480 తాకింది. తద్వారా 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఫలితంగా ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ బీఎస్ఇలో ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 6.12 లక్షల కోట్లను తాకింది. అనంతరం లాభాల స్వీకరణ కారణంగా స్వల్పంగా నష్టపోతోంది. (మార్కెట్ల క్రాష్: రూ. 7 లక్షల కోట్లు మటాష్) ఏప్రిల్ 14, 2021న బోర్డు సమావేశం ముగిసిన తరువాతఇన్ఫోసిస్ భారీ బైబ్యాక్ ప్రకటించనుందన్న అంచనాలు ఇన్వెస్టర్లను కొనుగోళ్లవైపు మళ్లించాయి. ప్రధానంగా క్యూ4 ఫలితాలు, బోర్డ్ మీటింగ్లో ఇన్ఫోసిస్ షేర్ల బైబ్యాక్పై నిర్ణయం తీసుకోనుందని అంచనా. దీనికితోడు ఫైనల్ డివిడెండ్ కూడా కంపెనీ ప్రకటించనుందని సీఎల్ఎస్ఏ అంచనాలు వెలువరించింది. దాదాపు ఒకటి నుంచి ఒకటిన్నరశాతం ఈక్విటీకి సమానమైన షేర్లను ఇన్వెస్టర్ల నుంచి ఇన్ఫోసిస్ తిరిగి కొనుగోలు చేయనుందనితెలిపింది. ఈ బైబ్యాక్ను డైరెక్టర్ల బోర్డు ఆమోదించినట్లయితే,రెండేళ్ళలో ఇన్ఫోసిస్ రెండో బై బ్యాక్ ఆఫర్ అవుతుంది. మార్చి 2019న 747 ధర వద్ద 11.05 కోట్ల ఇన్ఫోసిస్ షేర్లను 8,260 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. (బంపర్ ఆఫర్ : ఈ స్మార్ట్ఫోన్ ధర భారీ తగ్గింపు) చదవండి : ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా...అయితే మీకో శుభవార్త! -
కుళ్లు జోకులు.. వెకిలి పోస్టులు..
సాక్షి,హైదరాబాద్: గుండోడు, బండోడు, బక్కోడు, బికారీ.. గ్రేటర్ ఎన్నికల వేళ సోషల్ మీడియాలో విద్వేషం హద్దులు దాటుతోంది. ప్రత్యర్థులపై అభ్యంతరకర, రాయలేని వ్యాఖ్యలతో చెలరేగుతున్నారు, రెచ్చగొడుతున్నారు. నాయకుల అలవాట్లు, ఆహార్యంపై సెటైర్లు, కుళ్లుజోకులు వేస్తున్నారు. వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. ప్రత్యర్థులను చులకన చేసే ప్రయత్నంలో దిగజారుడు పోస్టులు పెడుతున్నారు. రాజకీయ వేడిలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అరాచకమిది. పార్టీలకు అనుకూలంగా వారి సోషల్మీడియా విభాగాలు చేసే పోస్టులు పద్ధతిగానే ఉంటున్నాయి. కానీ, కొందరు సానుభూతిపరులు, అతివాదులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ పోస్టులపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఇలాంటి విద్వేషపు పోస్టింగులకు దిగిన వారిపై ఐటీయాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. కొత్త ఓటర్లు, యువతకు గాలం.. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ నిత్యావసర వస్తువుగా మారింది. ఆన్లైన్ క్లాసుల పుణ్యమాని ఇప్పుడు ప్రతీ విద్యార్థికి స్మార్ట్ఫోన్ ఉంది. ముఖ్యంగా 18 ఏళ్లు దాటి డిగ్రీ, ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థుల ఓట్లే లక్ష్యంగా ఈ వ్యంగ్యపు, వెకిలి పోస్టులు రూపొందిస్తున్నారు. స్మార్ట్ఫోన్ వినియోగించే యువతలో నూటికి 90 శాతం వినోదానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే, వారి దృష్టిని తమవైపు తిప్పుకునేందుకు, ప్రత్యర్థి పార్టీలపై కుళ్లుజోకులతో బాడీషేమింగ్కు దిగుతున్నారు. చేసిన, చేయబోయే పనులను చెప్పుకొని ఓట్లు అడగటం, ప్రత్యర్థులను విమర్శలతో ప్రశ్నించడం మంచి రాజకీయం. కానీ కొందరు అత్యుత్సాహపరులు తమ ప్రత్యర్థి పార్టీల నాయకులను తాగుబోతు, వదరుబోతు, గుండోడు, బండోడు, బక్కోడు, బికారీ అంటూ ఆకారం, అలవాట్ల ఆధారంగా కుళ్లుజోకులు వేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీపై యువత మనసులో విద్వేషపు బీజాలు నాటుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్లలో ఇలాంటి పోస్టులకు కొదవలేదు. వ్యక్తులను కించపరుస్తూ వీడియోలు, సినిమాల్లోని హాస్యపు బిట్లు, మీమ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కులతో పోస్టులు రూపొందిస్తూ కొత్త ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఇలాంటివారు అరెస్టయినా... పార్టీకి సంబంధం లేదని, స్వచ్ఛందంగానే తాము ఇలా చేశామని పోలీసులకు వివరణ ఇస్తుండటం గమనార్హం. ప్రైవేటు ఆర్మీల పేరుతో.. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కొందరు సానుభూతిపరులు రాజకీయ పార్టీలతో పరోక్షంగా సంబంధాలు నెరుపుతూ సోషల్మీడియా ప్రైవేటు ఆర్మీల పేరిట ప్రత్యేక విభాగాలు నడిపిస్తున్నారు. సాధారణంగా పార్టీ అధికారిక సోషల్మీడియా వింగుల్లో ఎలాంటి అసభ్యతకు తావుండదు. కానీ, అభిమానుల ముసుగులో ప్రైవేటు ఆర్మీలు తమ పోస్టింగులతో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్న తీరు ఆందోళనకరంగా ఉందని పోలీసులే వ్యాఖ్యానిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగొచ్చని, దాడులకు పురిగొలిపే ప్రమాదముందని పోలీసులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే వీటి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే.. పార్టీల సానుభూతిపరులు అప్పటికపుడు ప్రత్యేకంగా కంటెంట్ రైటర్లు, డీటీపీ ఆపరేటర్లు, వీడియో ఎడిటర్లను నియమించుకున్నారు. కేవలం 20 రోజులకే వీరికి రూ.30 వేల నుంచి 40 వేల వరకు చెల్లిస్తూ ఇలాంటి పోస్టులను ప్రోత్సహిస్తున్నారు. సీనియర్ ఐపీఎస్లతో పర్యవేక్షణ! విద్వేషపు పోస్టులపై గ్రేటర్ సీపీ అంజనీకుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్లు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేశామని, ఇకపై పునరావృతమైనా సహించేది లేదని తెలిపారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేసేవారిని ఉపేక్షించమని స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయం ఆదేశాల మేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లోని సీసీఎస్ డీసీపీలతోపాటు, కొందరు సీనియర్ ఐపీఎస్లు ఈ తరహా పోస్టింగులపై నిఘా వేశారు. ప్రజలు, నాయకులు చేసే ఫిర్యాదుల పైనే కాకుండా అవసరమైతే పోలీసులు కూడా స్వచ్ఛందంగా కేసులు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. -
నేడు అమిత్ షా ఇంటికి.. షహీన్బాగ్ ర్యాలీ
న్యూఢిల్లీ/కోల్కతా/ముంబై: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వెనక్కు తీసుకోవాలంటూ షహీన్బాగ్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటి వరకూ ర్యాలీ చేపట్టనున్నట్లు షహీన్బాగ్ నిరసనకారులు తెలిపారు. సీఏఏపై అనుమానాలు ఉన్నవారు తన వద్దకు వస్తే వివరిస్తానని అమిత్షా చెప్పినందుకే ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ర్యాలీ మొదలుకానుంది. ర్యాలీపై తమకు సమాచారం లేదని హోంశాఖ తెలిపింది. సీఏఏ, జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)పై దేశవ్యాప్తంగా నిరసనలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి ఢిల్లీలోని షహీన్బాగ్లో నిరసనలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. శనివారం షహీన్బాగ్ నిరసనకారులు కొందరు కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిసి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి మాట్లాడేందుకు సముఖత వ్యక్తం చేశారు. డబ్బులు, బిర్యానీ కోసమే నిరసనలు.. షహీన్బాగ్లో నిరసనలు తెలుపుతున్న వారు డబ్బు, బిర్యానీల కోసమే రోజూ వేదిక వద్ద కూర్చుంటున్నారని పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ఘోష్ ఆరోపించారు. ‘నిరక్షరాస్యులు, సామాన్యులు, పేదలు, అజ్ఞానులు అక్కడ నిరసనల్లో పాల్గొంటున్నారు. నేతలిచ్చే డబ్బు, బిర్యానీల కోసమే నిరసనలు చేస్తున్నారు. పైగా వీరికి పంపే డబ్బంతా విదేశాల నుంచే వస్తోంది. కాంగ్రెస్ నేత చిదంబరం, సీపీఐ నేత బృందా కారత్లాంటి వారి ప్రసంగాలు వినే శ్రోతలు వారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబైలో భారీ ర్యాలీ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరపట్టిక (ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)లకు వ్యతిరేకంగా శనివారం ముంబైలో భారీ ర్యాలీ జరిగింది. దీనికి వేలాది మంది హాజరు కాగా అందులో అధిక సంఖ్యలో మహిళలు ఉన్నారు. ఉర్దూ కవి ఫయాజ్ అహ్మద్ ఫయాజ్ రచించిన ‘హమ్ దేఖేంగే’ (మేం చూస్తాం) అంటూ.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనకు ముంబైతో పాటు నవీ ముంబై, థానేల నుంచి తరలివచ్చారు. -
దూసుకుపోతున్న మార్కెట్లు
సాక్షి, ముంబై: వరుస నష్టాల నుంచి పుంజుకున్న దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. గురువారం నాటి పాజిటివ్ ధోరణిని శుక్రవారం 380 పాయింట్లకు పైగా ఎగిసింది. తద్వారా 37700 స్థాయిని అధిగమించింది. ప్రస్తుతం 306 పాయింట్లు జంప్చేసి 37,699 వద్ద నిఫ్టీ 85 పాయింట్లు ఎగసి 11,343 వద్ద ట్రేడవుతోంది. ఫార్మా తప్ప అన్ని సెక్టార్లులాభాల నార్జిస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఆటో, మీడియా, బ్యాంక్ నిఫ్టీ 2-1 శాతం మధ్య లాభపడగా.. ఫార్మా దాదాపు 2 శాతం నష్టపోయింది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ 6-5 శాతం చొప్పున జంప్చేయగా.. హీరో మోటో, హెచ్యూఎల్, జీ, ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ, కోల్ ఇండియా, కొటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ 3-1.6 శాతం మధ్య ఎగశాయి. మరోవైపు సన్ ఫార్మా టాప్ లూజర్గా ఉంది. ఐవోసీ, హిందాల్కో, వేదాంతా, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్, టాటా మోటార్స్, సిప్లా తదితరాలు నష్టపోతున్నాయి. -
నిన్ను నమ్మం బాబు!
-
రాజధానిలో లక్షమందితో
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న ఎన్నికల్లో విజయమేధ్వేయంగా జాతీయ రాజధాని ఢిల్లీలో భారీ ర్యాలీలను నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీ నేతలతో చర్చలు జరిపారు. ఢిల్లీలోని మొత్తం ఏడు పార్లమెంట్ స్థానాలు, 70 అసెంబ్లీ స్థానాల్లో భారీ ర్యాలీలను నిర్వహించాలని భావిస్తోంది. ఈ ర్యాలీలో అమిత్ షాతో సహా ప్రధాని మోదీ కూడా పాల్గొని ప్రసంగించనున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం పాల్గొనే ఈ ర్యాలీలో లక్షమందికి పైగా పార్టీ కార్యకర్తలతో ర్యాలీని నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రకటించారు. 45 శాతం వరకు ఓటింగ్ ప్రభావం గల పూర్వాంచాలీస్లో బలపడాలని బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. దానిలో భాగంగానే 2016 భోజ్పూరి నటుడు, బీజేపీ నేత మనోజ్ తివారిని ఢిల్లీ యూనిట్ ప్రెసిడెంట్గా నియమించింది. 2017 ఏప్రీల్లో జరిగిన పురపాలక ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం వెనుక మనోజ్ తివారి కృషి ఎంతో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతిన్న ఢిల్లీలోని స్లమ్ ఏరియాలో మరింత దృష్టి సారిస్తామని తివారి పేర్కొన్నారు. బీజేపీ ప్రధానంగా పూర్వాంచాలీస్ పైనే ఎక్కువగా దృష్టి సారించింది. వారి ప్రభావం గల 20 అసెంబ్లీ స్థానాలతో సహా, 80 పురపాలక వార్డులు బీజేపీకి ఎంతో కీలకం కానున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 67 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ కేవలం మూడు స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోవడం విశేషం. -
నా దుస్తులు చింపాలని ఆదేశించారు
న్యూఢిల్లీ: జేఎన్యూ విద్యార్థులు మార్చి 23న చేపట్టిన ర్యాలీలో ఢిల్లీ పోలీసులు విద్యార్థినులతో వ్యవహరించిన తీరుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చెలరేగుతున్నాయి. 8 మంది విద్యార్థినులపై లైంగికవేధింపులకు పాల్పడిన జేఎన్యూ ప్రొఫెసర్ అతుల్ జోహ్రికి బెయిల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ విద్యార్థులు పార్లమెంటు వరకూ భారీ ర్యాలీ చేపట్టిన సంగతి తెల్సిందే. ర్యాలీలో పోలీసులు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని జేఎన్యూ సోషియాలజీ విభాగానికి చెందిన షీనా ఠాకూర్(24) అనే విద్యార్థిని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ర్యాలీని అడ్డుకున్న ఓ మహిళా పోలీస్ అధికారిణి ఆందోళన చేస్తున్న తన దుస్తుల్ని చించేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించిందన్నారు. దీంతో వెంటనే కొందరు తనపై పిడిగుద్దులు కురిపించారని, లోదుస్తుల్ని లాగేందుకు యత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు తమపై వాటర్ కేనన్లను ప్రయోగించారన్నారు. -
‘ర్యాలీలతో రాముడి పేరు చెడగొడుతున్నారు’
సాక్షి, కోల్కతా: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా నిర్వహించే ర్యాలీలతో శ్రీరాముడి పేరును చెడగొడుతున్నారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ నవమి రోజు ర్యాలీల సందర్భంగా జరిగే మత ఘర్షణలపై సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆయుధాలతో శోభాయాత్రలు జరపాలని దేవుడు ఎవరికైనా చెప్పారా అంటూ ఆమె ప్రశ్నించారు. కొంత మంది అవివేకులు ఆయుధాలతో ర్యాలీలు చేస్తూ దేవుడి పేరు చెడగొడుతున్నారని ఆమె మండిపడ్డారు. శాంతీయుతమైన ర్యాలీలకు మాత్రమే తాను అనుమతి ఇస్తానని, ఆయుధాలతో ఇతరుల ఇంట్లోకి వెళ్లి హత్యచేసే ర్యాలీలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మత పరమైన ర్యాలీలు నిర్వహించినప్పుడు ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, గతేడాది దుర్గ మాత శోభాయాత్ర, మొహర్రం పండుగలు ఒకే రోజున వచ్చినప్పుడు కూడా సీఎం మమతా బెనర్జీ చాకచక్యంగా వ్యవహరించి మత ఘర్షణలు జరగకుండా జగ్రత్తలు తీసుకున్నారు. మన దేశంలో సాధారణంగా సిక్కు మతస్థులు ఆయుధాలతో ర్యాలీలు నిర్వహించడం చూస్తుంటాం. అయితే మత పరమైన ర్యాలీలలో కత్తులు, తుపాకులతో ప్రదర్శనలు నిర్వహించడం చట్టరీత్యా నేరం. -
33 జిల్లాలు, 33 ర్యాలీలు
-
33 జిల్లాలు, 33 ర్యాలీలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్ని ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీజేపీకి మరోసారి అధికారం కట్టబెట్టేలా గుజరాత్లోని మొత్తం 33 జిల్లాల్లో 33 బహిరంగ ర్యాలీల్లో పాల్గొనేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఒక్కో జిల్లాలో 3 నుంచి 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రధాని ఎన్నికల షెడ్యూల్ రూపకల్పనపై కసరత్తు సాగుతున్నట్లు పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం. నవంబర్ 20 తర్వాత మోదీ గుజరాత్ ప్రచారాన్ని ప్రారంభించే అవకాశముంది. గత అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి విభిన్నంగా మోదీ ప్రచార పర్వం ఉంటుందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. నిజానికి గత 22 ఏళ్లుగా బీజేపీనే గుజరాత్ను పాలిస్తోంది. ఈ నేపథ్యంలో ఫలితాలపై ప్రజా వ్యతిరేకత ప్రభావం పడకుండా రక్షణాత్మక ధోరణితో బీజేపీ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. మరోవైపు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రం కుల సమీకరణాలతో బలమైన కూటమి ఏర్పాటు దిశగా కసరత్తులు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కులతత్వాన్ని రెచ్చగొట్టేలా రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ ఇప్పటికే ఆరోపించారు. పటీదార్ వర్గ నేత హార్దిక్తోపాటు ఓబీసీ వర్గానికి చెందిన అల్పేశ్ ఠాకూర్, ఎస్పీ వర్గానికి చెందిన జిగ్నేష్ మేవానీల్ని కాంగ్రెస్ ఇప్పటికే తనవైపుకు తిప్పుకుంది. అలాగే జీఎస్టీ, నోట్ల రద్దు నిర్ణయాలతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల్ని కాంగ్రెస్ ఎక్కువగా ప్రచారం చేస్తోంది. జీఎస్టీ శ్లాబుల్లో తాజా మార్పులతో ప్రజల ఆగ్రహాన్ని కొంతైనా చల్లార్చేందుకు బీజేపీ ప్రయత్నించింది. అయితే జీఎస్టీపై సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం మాత్రం మోదీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. గుజరాతీయుల మనసు మార్చే వ్యూహంతో.. గుజరాత్ అభివృద్ధి కోసం కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం లేదని 2012 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీ ఆరోపించారు. ఈసారి కేంద్రంలోను, రాష్ట్రంలోను ఒకే ప్రభుత్వం ఉండడంతో గుజరాత్ అభివృద్ధిపై ఆ రాష్ట్ర ప్రజల్ని మోదీ ఏ మేరకు నమ్మిస్తారో వేచిచూడాలి. మోదీ ప్రధానిగా ఉన్నప్పటి కంటే సీఎంగా ఉన్నప్పుడే తమ పరిస్థితి బాగుండేదని ఆ రాష్ట్ర ప్రజల్లో బలపడుతున్న ఆలోచనా ధోరణిని ఎదుర్కోవడం ఆయన ముందున్న మరో సవాలు. ఈ ప్రతికూలతల నేపథ్యంలో ఎలాగైనా గుజరాత్ ప్రజల్ని తమ వైపునకు తిప్పుకునేలా మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు భారీ ప్రచార పర్వానికి తెరతీస్తున్నారు. -
ఇలాగైతే...చదువులు సాగేదెలా...!
ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, తమకు విద్యేతర పనులతో విద్యకు దూరం చేస్తున్నారని ఓ వైపు విద్యార్థులు, మరోవైపు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాలకులు తమ ప్రచార ఆర్భాటాల కోసం పాఠశాల విద్యార్థులను వినియోగించడం ద్వారా తమ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని విద్యార్థులే ఆరోపిస్తున్నారు. సాధించేది ఏమీ లేకున్నా...ఏదో ఒక ప్రచారం పేరిట చదువుకు దూరం చేస్తూ తమ పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రామభద్రపురం: ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని పాలకులు ప్రకటనలు చేస్తూనే మరోవైపు ప్రణాళికాబద్దంగా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ పాఠశాలలను బలోపేతం చేసే ఆలోచన చేస్తుంది. దీంతో పేద, మధ్యతరగతులకు చెందిన విద్యార్థులు నష్టపోతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు కంటే ప్రభుత్వ పథకాల ప్రచారానికే ఎక్కువగా ఆర్భాటం చేస్తూ సాధించేదేమి లేకున్నా తమ పిల్లలను చదువుకు దూరం చేస్తున్నారని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఇంకోవైపు ఉపాధ్యాయులను పాఠ్యాంశాల బోధనకు దూరం చేస్తూ ఏదో ఒక శిక్షణ పేరిట పాఠశాలలకు దూరం చేస్తూ నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జిల్లాలో 2817 ప్రభుత్వ పాఠశాలలుండగా వాటిలో దాదాపుగా 2లక్షల 10 వేల మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి సుమారుగా 12 వేల మంది టీచర్లు విద్యాబోధన చేస్తున్నారు. జిల్లాలో 740 పాఠశాలలో ఏకోపాధ్యాయులు, 70 శాతం పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఏకోపాధ్యాయులు ఉన్నచోట ఒక్క టీచరు ఉండకుండా బోధనేతర పనులకు చేయడం, ఇద్దరు ఉన్న చోట ఒకరు బోధనేతర పనులకు వెళ్తే ఒక్కరే మొత్తం ఐదు తరగతులకు చదువులు చెప్పడం కష్టతరంగా ఉందని ఉపాధ్యాయ వర్గాల భావించగా, సకాలంలో సిలబస్లు కాక సామర్ధ్యాలపై ఆ ప్రభావం పడుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రచార పటాటోపం... దోమలపై దండయాత్ర, వనం–మనం, పరిసరాల పరిశుభ్రత ర్యాలీలు, పెద్దవారు ఎవరైనా వచ్చినపుడు, నిరక్షరాస్యత నిర్మూలన చేసేందుకు చిట్టిగురువులు వంటి పలు ప్రచార కార్యక్రమాలకు ప్రభుత్వం విద్యార్థులనే ఉపయోగిస్తుంది. వీటితో తమ చదువులు కుంటుపడుతున్నాయని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఇవి చాలవన్నట్టు ప్రభుత్వం విద్యార్థులను ఓడీఎఫ్ భాగస్వా మ్యం చేస్తూ నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛభారత్ పేరిట ప్రాజెక్టులు తప్పనిసరి చేసింది. మరోవైపు బయోమెట్రిక్ పేరిట యంత్రాల ముందు గంటల తరబడి నిలబడేలాచేసి విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించే యత్నం చేసిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఓడీఎఫ్ కార్యక్రమంలో భాగస్వాములైన విద్యార్థులకు పెర్ఫార్మన్స్ కింద 5 మార్కులు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వాటికోసం ఆలోచిస్తే తమ సామర్ధ్యాలు దెబ్బతింటాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అక్షర విజయం ద్వారా వయోజనులకు చదువు నేర్పించే వారని ఇప్పుడు అలాకాకుండా చిట్టి గురువులు కార్యక్రమం పెట్టి 6, 7, 8 తరగతులలో బాగా చదువుతున్న పిల్లలను గుర్తించి వారితో చదువులు చెప్పించడం వల్ల వారు రాత్రి వేళల్లో చదవక విద్యా సామర్ధ్యం దెబ్బతింటుందని, సరిగా విద్యాబోధన లేని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను ఎందుకు చేర్పించామా?అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘ప్రభుత్వాల చర్యలు తిప్పికొడదాం’
ఘనంగా మేడే కోటగుమ్మం(రాజమహేంద్రవరం సిటీ) : నగర సీపీఐ ఆధ్వర్యంలో మే డే వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు జట్లు లేబర్ యూనియన్, కూరగాయల మార్కెట్, పార్టీ శాఖల్లో పతాకాన్ని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రావుల వెంకయ్య ఎగుర వేశారు. ప్రజా నాట్య మండలి కళాకారులు నృత్య, విప్లవ గీతాలతో మంగళవార పేట నుంచి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ తాడితోట మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ వరకూ ప్రదర్శన నిర్వహించారు. ఈ రావుల వెంకయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను తిప్పికొట్టాలన్నారు. నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక సంస్కరణల పేరుతో కార్మిక సంఘాలు లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ మతోన్మాద విధానాలతో మోడీ ముందుకు వెళుతున్నారని, దేశాన్ని మత విభజనగా చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర సమితి సభ్యుడు మీసాల సత్యనారాయణ, నగర కార్యదర్శి నల్లా రామారావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిర్ల కృష్ణ, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు చిట్టూరి ప్రభాకరచౌదరి తదితరులు పాల్గొన్నారు. -
కుట్రను తిప్పికొడతాం..
ఈడేపల్లి : మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణలు రైతుల భూములను లాక్కునేందుకు పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకే గ్రామాల్లో పాదయాత్రలు చేపట్టినట్టు వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య(నాని) వెల్లడించారు. స్థానిక ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయ భవనంలో శుక్రవారం భూ పరిరక్షణ పోరాట సమితి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.మచిలీపట్నం పోర్టు, పారిశ్రామిక కారిడార్ పేరిట ప్రభుత్వం చేస్తున్న భూ దందాపై నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అరాచకాలను రైతులకు తెలియజేసేందుకు నవంబరు 1వ తేదీ నుంచి బందరు మండలంలోని గ్రామాల్లో రాత్రింబవళ్లు పాదయాత్రలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. పరిశ్రమల పేరుతో నోటిఫికేషన్ జారీ చేసిన గ్రామాల్లో 14 నెలలుగా రైతులు నరకయాతన అనుభవిస్తున్నారన్నారు. పోర్టు నిర్మించాలన్న బందరు ప్రజల చిరకాల వాంఛను పరిశ్రమలవైపు మళ్లించి రైతులను దోచుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పోర్టులైన గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం ప్రాంతాల్లో 1800 నుంచి 2000 వేల ఎకరాల్లో నిర్మించారన్నారు. పోర్టు నిర్మించాలన్న ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి రవీంద్ర, ఎంపీ కొనకళ్లకు ఉంటే పోర్టు నిర్మాణం జరిగేదన్నారు. కానీ దీనిని పట్టించుకోకుండా పరిశ్రమల పేరుతో వేలాది ఎకరాలకు నోటిఫికేషన్ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని రైతులను అనాథలను చేసేందుకే మంత్రి, ఎంపీలు విశ్వప్రయత్నాలు చేస్తూ, అధికారులతో కూడా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. సర్కారీ దందాను వివరిస్తాం... సీపీఐ నేత, భూ పరిరక్షణ పోరాట సమితి సభ్యులు మొదుగుమూడి రామారావు మాట్లాడుతూ వచ్చేనెల ఒకటవ తేదీ నుంచి రాత్రింబవళ్లు గ్రామాల్లో పాదయాత్రలు చేసి ప్రభుత్వం చేస్తున్న భూదందాపై రైతులకు వివరిస్తామన్నారు. మొదటిరోజు పాదయాత్రకు సీపీఐ రాష్ట్ర కార్యాదర్శి రామకృష్ణ హాజరవుతారన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి, భూ పరిరక్షణ పోరాట సమితి కన్వీనర్ కొడాలి శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలోని 10 లక్షల ఎకరాలను ప్రభుత్వం దోచుకుని ఇతర దేశాలకు అమ్మకాలు చేస్తుందని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ పట్టణాధ్యక్షులు షేక్ సిలార్దాదా మాట్లాడుతూ పూటకోమాట చెప్పి నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఇప్పటివరకు పోర్టు, అనుబంధ పరిశ్రమలకు రైతులు ఇచ్చింది కేవలం 543 ఎకరాలేనని, వాటిల్లో సగానికి పైగా తెలుగు తమ్ముళ్ల బినామీ పేర్లతో పత్రాలను తయారు చేసి, తమ భూములకు ఇచ్చినట్లుగా చిత్రీకరిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ప్రతిపక్ష నేత అచ్చేబా, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు మతిన్, ఐఎన్టీయూసీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు రామిశెట్టి ప్రసాద్, సీపీఎం నాయకులు సీహెచ్ జయరావు పాల్గొన్నారు. -
జై జవాన్
-
ఆరోగ్యంతోనే అభ్యుదయ సమాజం
సమష్టి ప్రజా ఉద్యమంతోనే అది సాధ్యం ‘దోమలపై దండయాత్ర’లో మంత్రి దేవినేని కాకినాడ : ప్రాణాంతక వ్యాధులకు కారణమౌతున్న దోమల నిర్మూలనకు ప్రజలంతా సమష్టిగా ఉద్యమించి ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనలో భాగస్వాములు కావాలని జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక రేచర్లపేటలో కాకినాడ నగరపాలక సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత’ కార్యక్రమాల్లో మంత్రి దేవినేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేచర్లపేట నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతులైన ప్రజలతో విలసిల్లే సమాజమే అన్ని రంగాల్లో పురోగమిస్తుందని అన్నారు. దోమకాటు వల్ల డెంగ్యూ, చికున్గున్యా, మలేరియా, ఫైలేరియా, మెదడువాపు వంటి వ్యాధులు ప్రబలి ప్రజలను శారీరకంగా, ఆర్థికంగా కుంగదీస్తున్నాయన్నారు. దోమల నిర్మూలనకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ద్వారా ప్రభుత్వపరంగా చేపడుతున్న చర్యలను వివరించారు. శనివారం జిల్లాలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఇంటింటి ప్రదర్శన ద్వారా 15 లక్షల కుటుంబాలను కలిసి దోమల నిర్మూలనకు చేపట్టవలసిన చర్యలపై అవగాహన కల్పించారన్నారు. దోమలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై ముద్రించిన కరపత్రాలను ఉపాధ్యాయులు, విద్యార్థులకు పంపిణీ చేసి వారి ద్వారా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ, కాకినాడ నగరపాలక సంస్థ ప్రచురించిన ‘దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత’ స్టిక్కర్లు, కరపత్రాలు, బుక్లెట్లు, పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు అందించిన దోమకాటు వల్ల కలిగే రోగాల నివారణకు హోమియో మందును ఆయన పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు, ఉద్యోగులు దోమలపై దండయాత్ర నినాదాలతో నగరవీధుల నుంచి నిర్వహించిన భారీ ర్యాలీని మంత్రి దేవినేని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డేగల శేషువెంకయ్యమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ చైర్మన్ డేగల చంద్రశేఖర్ ఉచితంగా పంపిణీ చేయనున్న హోమియోపతి మందు పంపిణీని ప్రారంభించి మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కలెక్టర్ అరుణ్కుమార్, నగర కమిషనర్ ఆలీమ్బాషా, అదనపు కమిషనర్ గోవిందస్వామి, ఉప కమిషనర్ సన్యాసిరావు, ఈఈ విజయకుమార్, ఆర్డీవో బీఆర్ అంబేద్కర్, తహసీల్దార్ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
పండుగలా..
కర్నూలు (ఓల్డ్సిటీ): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాలో గురువారం పండుగలా జరుపుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. పలు ప్రాంతాల్లో పార్టీ పాతాకావిష్కరణలు జరిగాయి. ర్యాలీలు, పేదలకు అన్నదానం, వృద్ధులకు, రోగులకు పండ్లు, బ్రెడ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను పార్టీ శ్రేణులు నిర్వహించాయి. కర్నూలు నగరంలో కొత్తకోట ప్రకాశ్రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు స్థానిక పార్టీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే గణేశ్నగర్లోని అమ్మ వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు.ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు రాజారత్నం, మున్సిపల్ మాజీ ఛైర్మన్ బుట్టారంగయ్యల ఆధ్వర్యంలో జెండావిష్కరణ కార్యక్రమం జరిగింది. స్థానిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పలు పంపిణీ చేశారు. నంద్యాలలో కౌన్సిలర్లు శివశంకర్, పాణ్యం విజయభాస్కరరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా విష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆదోనిలో పట్టణ అధ్యక్షుడు చంద్రకాంతరెడ్డి, ఛైర్పర్సన్ సరోజమ్మ, ఆమె భర్త రాముడు, బీసీసెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు. డోన్లో మాజీ ఎంపీపీ రామకృష్ణారెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు సోమేశ్యాదవ్ ఆధ్వర్యంలో కోట్లవారిపల్లె సర్కిల్లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆళ్లగడ్డలో పార్టీ నేత బి.వి.రామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పతాకావిష్కరణ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఆలూరులో జెడ్పీటీసీ సభ్యుడు రామ్భీమ్నాయుడు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. వైఎస్ విగ్రహానికి పూలమాలతో నివాళి అర్పించారు.ఆత్మకూరులో శ్రీశైలం నియోజకవర్గ నాయకుడు బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. బనగానపల్లెలో మహిళా ప్రధాన కార్యదర్శి కాటసాని జ్యోతి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కాటసాని రామిరెడ్డి నివాసం వద్ద పతాకావిష్కరణ చేశారు. సంజామలలో ఎంపీపీ గౌరుగారి ఓబుళరెడ్డి, జెడ్పీటీసీ చిన్నబాబు ఆధ్వర్యంలో, అవుకు మండలం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు జెండావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.మంత్రాలయంలో సర్పంచ్ చల్లబండ భీమయ్య ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించారు. పార్టీ పతాకావిష్కరణ చేశారు.పత్తికొండలో కేడీసీసీ బ్యాంక్ మాజీ వైస్ఛైర్మన్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. తుగ్గలిలో నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శ్రీశైలం, నందికొట్కూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. -
బడి పిల్లలు..పని మనుషులు..
బడి బయటి పిల్లలను బడిలో చేర్పించాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం చేపట్టింది. పిల్లలు పనిలో కాదు.. పాఠశాలల్లో ఉండాలని ప్రజాప్రతినిధులు, అధికారులు ఉపన్యసించారు. ర్యాలీలు నిర్వహించారు. మరి బడిలో ఏం జరుగుతోంది.. ఉపాధ్యాయులు పిల్లలను పని మనుషులుగా మార్చేస్తున్నారు. అడపాదడపా అయితే సర్దుకుపోవచ్చు.. ఏకంగా టైం టేబుల్ వేసి కసువు కొట్టిస్తున్నారు. ప్యాపిలి మండల పరిధిలోని చిన్నపూదెళ్ల ఉన్నత పాఠశాలలో ఈ తంతు నిత్యకృత్యం. తరగతి గది గోడలకు సాధారణంగా ఏ సమయంలో ఏ సబ్జెక్టు బోధిస్తారో నిర్ణయించిన టైం టేబుల్ అతికిస్తారు. ఇక్కడ మాత్రం ఎప్పుడెప్పుడు ఎవరు కసువు కొట్టాలో తెలిపే చార్టు అతికించడం చూసి తల్లిదండ్రులు ముక్కున వేలేసుకుంటున్నారు. -
కౌంటింగ్ సందర్భంగా నగరంలో ఆంక్షలు
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా హైదరాబాద్లో ఆంక్షలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ర్యాలీలు, సంబరాలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు రేపు సాయంత్రం ఆరు గంటల వరకూ అమల్లో ఉంటాయన్నారు. ఇక 17వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకూ వైన్ షాపులు, క్లబ్బులు మూసివేత కొనసాగుతుందన్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
హైదరాబాద్: నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ గురువారం ఎల్బీ స్టేడియంలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులను భారీగా మోహరించినట్లు అనురాగ్ శర్మ తెలిపారు. సభలు, విజయోత్సవాలు నిషేధమని, కౌంటింగ్ కేంద్రాల నుండి ఎలాంటి ర్యాలీలకు అనుమతిచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
నామినేషన్ల జాతర
జిల్లాలో నామినేషన్ల జాతర నడుస్తోంది. ముహూర్తం కలిసి రావడంతో మంచిరోజని భావించి భారీగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలో రెండు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగర పంచాయతీలకు బుధవారం ఒక్కరోజే 1400 నామినేషన్లు దాఖలయ్యాయి. రామగుండంలో అత్యధికంగా 422 మంది నామినేషన్ వేశారు. రాష్ట్రంలోనే ఇది రికార్డుగా నిలవనుంది. కరీంనగరంలో 276 మంది నామినేషన్ సమర్పించారు. - సాక్షి, కరీంనగర్ సాక్షి, కరీంనగర్: ఎన్నికల వేడి రాజుకుంది. ఓ పక్క మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం... మరో పక్క ప్రచారంతో జిల్లాలోని కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో కోలాహలం మొదలైంది. బుధవారం మంచి ముహూర్తం ఉండడం.. గురువారం కార్పొరేషన్ల పరిధిలో నామినేషన్ల దాఖలుకు చివరి రోజు ఉండడంతో ఎక్కువ మంది అభ్యర్థులు బుధవారమే నామినేషన్లు సమర్పించారు. జిల్లా వ్యాప్తంగా 1400 నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులు పోటాపోటీ ర్యాలీలు తీసి కోలాహలం మధ్య నామినేషన్లు వేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో 276 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి.. మున్సిపల్ మాజీ చైర్మన్ వావిలాల హన్మంతరెడ్డి 34 వ డివిజన్ నుంచి, పీసీసీ కార్యదర్శి సునీల్రావు 31వ డివిజన్ నుంచి నామినేషన్ వేశారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గుగ్గిళ్ల జయశ్రీ 36వ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకారపు భాస్కర్రెడ్డి 44వ, కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆమ ఆనంద్ 32వ డివిజన్ నుంచి నామినేషన్ వేశారు. వైఎస్సార్సీపీ నుంచి పల్లె లలిత 41వ డివిజన్, కాసారపు కిరణ్కుమార్ 11వ, ముహమ్మద్ సలీం 39వ డివిజన్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. వీరి వెంట పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిథి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్రెడ్డి ఉన్నారు. ఎంఐఎం పార్టీ తర పున మాజీ డెప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ 7వ డివిజన్ నుంచి నామినేషన్ వేశారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా రికార్డుస్థాయిలో 422 నామినేషన్లు దాఖలయ్యా యి. మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం (టీఆర్ఎస్) 30వ డివిజన్ నుంచి, మున్సిపల్ మాజీ చైర్మన్ బడికెల రాజలింగం (కాంగ్రెస్) 12వ, అదే డివిజన్ నుంచి డాక్టర్ అనిల్కుమార్ టీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేశారు. 11వ డివిజన్ నుంచి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తానిపర్తి గోపాల్రావు నామినేషన్ దాఖలు చేశారు. మెట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ తరపున 7వ వార్డు నుంచి మున్సిపల్ మాజీ చైర్మన్ యామ రాజయ్య , వన్నెల గంగారం 16వ, బీజేపీ నుంచి బత్తుల లక్ష్మణ్ 12వ వార్డు నుంచి నామినేషన్లు వేశారు. సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గుడ్ల మంజుల (కాంగ్రెస్) 31వ వార్డు నుంచి నామినేషన్ వేశారు. వేములవాడ నగర పంచాయతీ పరిధిలోని పెరుక శ్రీలతరవి వైఎస్సార్సీపీ తరఫున 19వ వార్డు నుంచి నామినేషన్ వేశారు. హుస్నాబాద్ నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థి సుద్దాల చంద్రయ్య (టీఆర్ఎస్) 16వ వార్డు, 14వ వార్డు నుంచి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్కిరెడ్డి తిరుమల, 11వ వార్డు నుంచి బీజేపీ కిసాన్మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కవ్వ వేణుగోపాల్రెడ్డి నామినేషన్ వేశారు. పెద్దపల్లి నగర పంచాయతీలోని 16వ వార్డు నుంచి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పు రాజు, 14వ వార్డు నుంచి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, చైర్మన్ అభ్యర్ధి పుట్ట మొండయ్య నామినేషన్ వేశారు. -
ఎవరి ఖాతాలోకి..!
‘సుధీర్ఘ పోరాట ఫలితంగా ఆవిర్భవించిన ‘తెలంగాణ’ సాధన ఎవరి ఖాతాలో వేసుకుంటే బాగుంటుంది. ఒకరికే ఎందుకు...అంతా మాదంటే మాది అని చెప్తే పోలా’.. క్రెడిట్ను కాస్తా తమకు అన్వయించుకుంటే ఓట్ల పంట పండక పోదా అని అంతా తెగ పోటీపడుతున్నారు. దీనికోసం హడావుడి చేస్తున్నారు.అందుకే అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొని అంబరాన్నంటే సంబరంలా మార్చేసి ధూం..ధాం చేసి పడేస్తున్నారు.ఇలాంటి హడావుడే జిల్లాలో ఇప్పుడు కనిపిస్తోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంకం తుది దశకు చేరుకోవడంతో రాజకీయ పక్షాలు, నేతలు క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకునేందుకు త హతహలాడుతున్నారు. ఇప్పటికే ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ’ శుభాకాంక్షల పేరిట నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో అన్ని కూడళ్లలో ఎన్నికల వాతావరణం తలపిస్తోంది. సాధారణ ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న నేతలు, అనుచరుల ఫోటోలతో ఫ్లెక్సీలను నింపేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే తమ మనోగతాన్ని నేతలు ఫ్లెక్సీల రూపంలో బయట పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఇ న్నాళ్లూ దేశ రాజధాని ఢిల్లీలో మకాం వేసిన నేతలు ఇప్పుడిప్పుడే జిల్లాకు చే రుకుంటున్నారు. నేతలు ఎవరికి వా రుగా విమానాశ్రయంలో, సొంత ని యోజకవర్గంలో అనుచరులు భారీ స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేసుకుం టున్నారు. ప్రత్యర్థి పార్టీలతో పాటు, సొంత పార్టీలోని ప్రత్యర్థులపై పైచేయి సాధించే దిశలో నేతల ఎత్తుగడలు సా గుతున్నాయి. ఇందులో భాగంగానే తె లంగాణ విజయోత్సవ ర్యాలీలు, స మావేశాలు ఏర్పాటు చేసేందుకు నేత లు సన్నాహాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పార్టీల అగ్రనేతలను జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గాల కు రప్పించడం ద్వారా బల ప్రదర్శన చే యాలనే యోచనలో ఔత్సాహిక నేతలున్నారు. ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించని పార్టీలు, నేతలు కూడా క్రెడిట్ను దక్కించుకునే దిశగా వాదన లు సిద్ధం చేసుకుంటున్నారు. మొదలైన రాజకీయ సందడి టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు కు అనుచరులు శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. మహబూబ్నగర్లో టీఆర్ఎస్ పొలిట్బ్యూ రో సభ్యుడు ఇబ్రహీం శనివారం అనుచరులతో ర్యాలీ పేరిట హడావుడి సృ ష్టించారు. బీజేపీ ఎమ్మెల్యేలు నాగం జ నార్దన్రెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి షా ద్నగ ర్, మహబూబ్నగర్లో ర్యాలీలు నిర్వహించారు. జడ్చర్ల నుంచి కాంగ్రె స్ టికెట్ ఆశిస్తున్న మల్లు రవి, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా ఇ దే రీతిలో ఏర్పాట్లు చేసుకున్నారు. మంత్రి డీకే అరుణ ఇప్పటికే సొంత ని యోజకవర్గం గద్వాలలో సంబురాల పేరిట సందడి చేస్తున్నారు. త్వరలో జి ల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని శనివారం హైదరాబాద్లో జరి గిన తెలంగాణ ప్రాంత టీడీపీ నాయకుల సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 25 లేదా 26 తేదీల్లో దిగ్విజయ్ సింగ్ను ఆహ్వానిస్తామని డీసీసీ అధ్యక్షుడు కొత్వాల్ ప్రకటించారు. మహబూబ్నగర్ ఎంపీగా తనను గెలిపిం చిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు త్వరలో కేసీఆర్ జిల్లా కేంద్రానికి వస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. రాజ్నాథ్ సింగ్ లేదా సుష్మా స్వరాజ్ తో బహిరంగ సభ ఏర్పాటు చేయాల ని బీజేపీ జాతీయ నేతలకు జిల్లా నే తలు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఇన్నాళ్లూ ఎదుటి పార్టీల వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారం కావడం లేదంటూ విమర్శించిన నేతలు, ఇప్పుడు తమ వల్లే ఏర్పడిందనే ప్రచారానికి పదును పెట్టేందుకు సన్నద్దమవుతున్నారు. -
సమైక్య హోరు
సాక్షి, నెల్లూరు: జిల్లాలో సమైక్యపోరు కొనసాగుతోంది. మూడో రోజు శనివారం ఎన్జీఓలు, సమైక్యవాదులు జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. ఉద్యోగులు విధులు బహిష్కరించి ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేయించారు. ఎన్జీఓల దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్సీపీ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త పి.అనిల్కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గాంధీబొమ్మ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఎన్జీఓలు ఆదివారం నిర్వహించనున్న సమైక్యరన్ కోసం శనివారం సాయంత్రం ఎన్జీఓ భవన్ నుంచి ఏసీస్టేడియం వరకు సమైక్య ట్రైల్ రన్ నిర్వహించారు. ఆత్మకూరులో రెవెన్యూ ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాళెంలోని రెవెన్యూ కార్యాలయాలు పని చేయలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కావలి తాలూకా ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజాసంఘాలు, విద్యార్థులు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి శ్రీపొట్టిశ్రీరాములు విగ్రహం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పొదలకూరు మండల పరిషత్, రెవెన్యూ కార్యాలయ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ముత్తుకూరులో రెవెన్యూ, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఉద్యోగులు తాళాలు వేశారు. రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకిస్తూ ఏపీఎన్జీఓలు ఇచ్చిన పిలుపు మేరకు రెవెన్యూశాఖ పరిధిలోని అన్ని శాఖల వారు సమ్మెను కొనసాగిస్తున్నారు. అన్ని కార్యాలయాలను మూసివేసి పరిపాలనను స్తంభింపజేశారు. -
‘రాయల’ పై రగడ
‘మా తెలంగాణ మాకివ్వాలంటే.. మధ్యల గీ రాయల తెలంగాణ లొల్లి ఏంది...’ అంటూ బుధవారం జిల్లా భగ్గుమంది. రాయల తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం నివే దిక రూపొందిస్తున్నట్లు వార్తలు రావడంతో జిల్లా వ్యాప్తంగా తెలంగాణవాదులు ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని తేల్చిచెప్పారు. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ జిల్లావ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు, టీఆర్ఎస్వీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వీరితో పాటు బీజేపీ, సీపీఐ, టీఎస్జేఏసీ, ఏబీవీపీ, పీడీఎస్యూ ఆధ్వర్యంలో ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించారు. పలు చోట్ల కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు సయ్యద్ ఇబ్రహీం నేతృత్వంలోబైక్ ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్వీ, తెలంగాణ విద్యార్థి జేఏసీ సంయుక్తంగా భారీ ర్యాలీ చేపట్టారు. తెలంగాణ ఆటో యూనియన్ ఆధ్వర్యం లో ర్యాలీ నిర్వహించారు. గురువారం జరగనున్న బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వనపర్తిలో జేఏసీ, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, టీవీవీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ను దహనం చేశారు. టీఆర్ఎస్ విద్యార్థి వి భాగం ఆధ్వర్యంలో రాజీవ్చౌక్లో మానవహా రం నిర్వహించి, అక్కడి నుంచి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి ధర్నా చేపట్టారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. పెబ్బేరు, గో పాల్పేట మండలాల్లోనూ నిరసన ర్యాలీలు చేపట్టారు. నాగర్కర్నూల్, తాడూరు, బిజినపల్లి, తి మ్మాజీపేట, తెలకపల్లి మండలాల్లో రాయల తె లంగాణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్, టీఆర్ఎ స్వీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. నాగర్కర్నూల్లో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. పాలెంలో ఏబీ వీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. అచ్చంపేట, బల్మూరు, ఉప్పునుంతల, అమ్రాబాద్ మండలాల్లో ర్యాలీలు నిర్వహించారు. జడ్చర్లలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబేద్క ర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి, జీఓఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ జా గృతి ఆధ్వర్యంలో కళాశాలలు బహిష్కరించి, నే తాజీ చౌరస్తాలో కొద్దిసేపు రాస్తారోకో చేసి, అం బేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి, మానవహా రం నిర్వహించారు. షాద్నగర్, కొందుర్గు, కొ త్తూరు మండలాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. దేవరకద్రలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి అలవెంకటేశ్వరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గోపన్పల్లిలో కేంద్ర దిష్టిబొమ్మను దహనం చేశారు. కొత్తకోటలో టీఆర్ఎస్వీ, ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో చేయగా, అడ్డాకులలో జాతీయ రహదారిపై విద్యార్థులు మానవహారం నిర్వహించారు. మక్తల్ నియోజకర్గంలోని పలుచోట్ల నిరసన ర్యాలీలు చేపట్టారు. మాగనూరు మండలం గుడెబళ్లూరులో అంతర్ర్రాష్ట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఆత్మకూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో తరగతులు బహిష్కరించారు. కోస్గిలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జీఓఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. నారాయణ పేటలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. గద్వాలలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించగా, ఏబీవీపీ ఆధ్వర్యంలో మానవహారం చేపట్టారు. మల్దకల్లో టీఆర్ఎస్, ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జీఓఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అలంపూర్, మానవపాడు, శాంతినగర్ మండలాల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు. కల్వకుర్తిలో జేఏసీ, టీఆర్ఎస్, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాలమూరు చౌరస్తాలో మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రధాని మన్మోహన్సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తలకొండపల్లి, మాడ్గుల, వెల్దండ, ఆమనగల్లులో నిరసన ర్యాలీ చేసి, రాస్తారోకో నిర్వహించారు. కొల్లాపూర్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టగా, ఏబీవీపీ ఆధ్వర్యంలో జీఓఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. పెంట్లవెల్లి, పాన్గల్, వీపనగండ్లలో నిరసన ర్యాలీలు చేశారు. నేడు బంద్ జెడ్పీసెంటర్, న్యూస్లైన్: రాయల తెలంగాణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్రావు పిలుపు మేరకు గురువారం జిల్లాలో బంద్ నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు సయ్యద్ఇబ్రహీం, జిల్లా కోకన్వీనర్ బెక్కం జనార్దన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్య, వ్యాపార సంస్థలతోపాటు అన్ని వర్గాల ప్రజలు బంద్కు సహకరించాలని కోరారు. బంద్కు జేఏసీ మద్దతు.. రాయల తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ బంద్కు జేఏసీ మద్దతు ఇస్తుందని జిల్లా చైర్మన్ రాజేందర్రెడ్డి, సమన్వయకర్త చంద్రనాయక్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ, ప్రభుత్వ, ైప్రైవేట్ ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపి, బంద్ను విజయవంతం చేయాలని కోరారు. -
దిగ్బంధం
సాక్షి, కడప : సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు జిల్లాలో ఉద్యోగులు కదం తొక్కారు. కడప, రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, బద్వేలులో ఉద్యోగులు ర్యాలీలు, మానవహారాలు చేపట్టారు. జాతీయ రహదారులను దిగ్బంధించారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. వైఎస్సార్ సీపీ నేతృత్వంలో సడలని సంకల్పంతో రిలే దీక్షలు సాగుతున్నాయి. సమైక్య శంఖారావం సభ సక్సెస్ కావడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులతోపాటు సమైక్యవాదుల్లో కొత్త ఊపు వచ్చింది. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగుతాయని అన్ని వర్గాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. కడపలో ఎన్జీఓలు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఇర్కాన్ సర్కిల్లో ఉదయం జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. దీంతో వందలాది వాహనాలు ఆగిపోయాయి. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ నాయకుడు శివారెడ్డి, కన్వీనర్ శ్రీనివాసులు, ఉపాధ్యాయ నాయకులు వెంకటశివారెడ్డి, తిరుపాలు పాల్గొన్నారు. వీరికి డీఆర్వో ఈశ్వరయ్య సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ నగర ప్రధాన కార్యదర్శి షబ్బీర్ ఆధ్వర్యంలో ఆరుగురు రిలే దీక్షల్లో కూర్చొన్నారు. కోర్టు వద్ద న్యాయవాదులు, కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. జమ్మలమడుగులో రాజీవ్ కాలనీకి చెందిన వైఎస్సార్సీపీ నేత సంజీవరాయుడు ఆధ్వర్యంలో 10 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రైల్వేకోడూరులో జేఏసీ చైర్మన్ ఓబులేశు నేతృత్వంలో ఉద్యోగులు రోడ్డుపైన బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వైఎస్సార్ సీపీ నేత శారదమ్మ నేతృత్వంలో ఆరుగురు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. బద్వేలులో మహేశ్వర్రెడ్డి ఉన్నత పాఠశాల విద్యార్థినులు 40 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి మద్దతుగా ప్రైవేటు పాఠశాలల యూనియన్, స్కూలు విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి 89 ఆకారంలో కూర్చొన్నారు. జేఏసీ నాయకుడు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో నాలుగురోడ్ల కూడలిలో రాస్తారోకో చేపట్టారు. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆర్టీసీ బస్సులు, లారీలు పెద్ద సంఖ్యలో ఆగిపోయాయి. నియోజకవర్గంలోని పోరుమామిళ్ల పట్టణంలో కృష్ణశారద కళాశాల ఇంటర్ విద్యార్థులు 15 మంది దీక్షల్లో కూర్చొన్నారు. పులివెందులలో మున్సిపల్ పరిశీలకుడు వరప్రసాద్ నేతృత్వంలో మహిళలు 60 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రాయచోటిలో ఎన్జీఓలు భారీ ర్యాలీ నిర్వహించి నేతాజీ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ కార్యక్రమం ఎన్జీఓ నేతలు వెంకటేశ్వరరెడ్డి, వేణుగోపాల్రెడ్డితోపాటు పలువురి ఆధ్వర్యంలో కొనసాగింది. అర్చన విద్యా సంస్థల ఆధ్వర్యంలో 30 మంది విద్యార్థులు రిలే దీక్షలు చేపట్టారు. వీరికి వైస్సార్ సీపీ నేత మదన్మోహన్రెడ్డి సంఘీభావం తెలిపారు. మైదుకూరులో సిండికేట్బ్యాంకు, రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. కమలాపురంలో వైఎస్సార్సీపీ నేత మెడికల్ షాప్ రవిశంకర్రెడ్డి ఆధ్వర్యంలో పలువురు దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి డీసీఎంఎస్ వైస్ చైర్మన్ లక్ష్మినారాయణరెడ్డి సంఘీభావం తెలిపారు. రాజంపేటలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎన్జీఓ నేత ఎస్వీ రమణ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. కడప-తిరుపతి జాతీయ రహదారిపై బైఠాయించారు. ఏడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రొద్దుటూరులో న్యాయవాదులు రిలే దీక్షలు కొనసాగించారు. -
ఉవ్వెత్తున ఉద్యమం
సాక్షి, నెల్లూరు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చేస్తున్న ఉద్యమాన్ని వైఎస్సార్సీపీ మరింత ఉధృతం చేసింది. జిల్లా వ్యాప్తంగా గురువారం పెద్ద ఎత్తున ఆటో ర్యాలీలు నిర్వహించింది. రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితిలో అంగీకరించేదిలేదంటూ ఆందోళనకు దిగింది. 10 నియోజక వర్గాలలో ర్యాలీలు జరిగాయి. పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొని సమైక్య నినాదాలతో హోరెత్తించారు. గూడూరులో జరిగిన ఆటో ర్యాలీలో వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ పాల్గొన్నారు. ఎన్జీఓలు, ఉపాధ్యాయుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్త అనిల్కుమార్యాదవ్ ఆధ్వర్యంలో గాంధీబొమ్మ సెంటర్ నుంచి నగరంలో పెద్ద ఎత్తున ఆటో ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో గాంధీబొమ్మ కూడలిలో రిటైర్డ్ టీచర్లు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. వీఆర్సీ కూడలిలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. వైఎస్సార్సీపీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని జెండాచెట్టు సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయ సెంటర్ వరకు సుమారు వెయ్యి ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. సూళ్లూరుపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు దబ్బల రాజారెడ్డి, కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో భారీ ఎత్తున పట్టణంలో ఆటోల ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరిలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోసం బ్యాంకులను మూయించారు. నారాయణ కళాశాల భవనంపై ఎక్కి ఆందోళన చేశారు. రాష్ట్రం విచ్ఛిన్నం కావడానికి టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ అన్నారు.గూడూరులో నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్కుమార్ ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్రెడ్డి పాల్గొన్నారు. -
విశ్రమించం
సాక్షి, అనంతపురం : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవరకు విశ్రమించబోమని ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నారు. పండుగైనా పబ్బమైనా, ఎండైనా వానైనా అలుపెరుగని పోరు కొనసాగిస్తామంటున్నారు. ఈ క్రమంలో దసరా పండుగ రోజైన ఆదివారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని హోరెత్తించారు. ర్యాలీలు, రాస్తారోకోలు చేపట్టడంతో పాటు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. అనంతపురంలోని టవర్క్లాక్ కూడలిలో జాక్టో ఆధ్వర్యాన ఉపాధ్యాయులు వినూత్న నిరసన తెలిపారు. అలనాడు పాండవులు అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాత వాసానికి ముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టుపై ఉంచి విజయదశమి నాడు వాటిని స్వీకరించిన విధానాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ముఖ్యంగా అర్జునుడు నాటి కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించిన తీరును సమైక్య పోరుకు అన్వయిస్తూ ప్రదర్శించిన తీరు అమితంగా ఆకట్టుకుంది. ఇక నగరంలో నీటిపారుదల, హౌసింగ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్కేయూలో జేఏసీ నాయకులు, ధర్మవరంలో వైఎస్సార్సీపీ, జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ముఖ్య భూమిక పోషించాలని, రాష్ట్ర విభజన ఆగేదాకా విశ్రమించకూడదని ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త తాడిమర్రి చంద్రశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. పామిడిలో సమైక్యవాదులు మౌనదీక్ష చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పూలతో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ను ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ చేశారు. గుత్తిలో జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. అనంతరం స్థానిక సద్భావన సర్కిల్లో టీ-నోట్ ప్రతులను దహనం చేశారు. రాజీవ్ సర్కిల్లో సప్తగిరి కళాశాల విద్యార్థులు మానవహారం నిర్మించారు. కదిరిలోని అంబేద్కర్ సర్కిల్లో వడ్డెర్లు ఒక్క రోజూ సామూహిక దీక్ష చేశారు. తలుపులలో సమైక్యవాదులు రోడ్డుపై గడ్డం గీయించుకుని నిరసన తెలిపారు. మడకశిరలో ఆందోళన చేపట్టారు. రాయదుర్గంలోని వినాయకసర్కిల్, పాతబస్టాండ్ ఎదుట రిలేదీక్షలు చేస్తున్న జేఏసీ నాయకులు, సమైక్యవాదులకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. రాష్ట్రం విడిపోతే గంజినీళ్లు తాగి బతకాల్సిందేనంటూ ఎన్జీఓలు రోడ్డుపై గంజి అమ్ముతూ నిరసన తెలిపారు. తాడిపత్రిలో ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ విద్యార్థుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. యాడికిలో వీఆర్ఓలు, వీఆర్ఏలు రిలేదీక్ష చేపట్టారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయకుండా.. సోనియాగాంధీకి మంచి బుద్ధి ప్రసాదించాలని ఉరవకొండలో జేఏసీ నాయకులు దుర్గామాతకు పూజలు చేశారు. బెళుగుప్పలో జేఏసీ నాయకులు డప్పులు.. సన్నాయి వాయిద్యాల నడుమ వినూత్న నిరసన తెలిపారు. -
అదే దూకుడు
సాక్షి, అనంతపురం : ప్రతి ఊరూ పోరుగడ్డ అవుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ పోరాటవీరులు అవుతున్నారు. వారందరిలోనూ చెక్కుచెదరని సమైక్య సంకల్పం కన్పిస్తోంది. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా 62 రోజులుగా సమైక్య నినాదం మార్మోగుతూనే ఉంది. సమ్మెలు, బంద్ లు, దీక్షలు, ర్యాలీలు, మానవహారాలతో పాటు వినూత్న నిరసనలు హోరెత్తుతూనే ఉన్నాయి. సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం జోరుగా కొనసాగింది. అనంతపురం నగరంలోని టవర్క్లాక్ సర్కిల్లో జాక్టో నాయకులు రోడ్డుపై పడుకుని సమైక్య నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. నగర పాలక సంస్థ ఉద్యోగులు నోటికి నల్లగుడ్డలు కట్టుకుని ర్యాలీ చేపట్టారు. విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీ చేశారు. నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తున్న స్వయం సహాయక సంఘాల మహిళలకు వైఎస్సార్సీపీ నేత ఎర్రిస్వామిరెడ్డి సంఘీభావం తెలిపారు. పంచాయతీ రాజ్ ఉద్యోగులు ర్యాలీ చేపట్టి... స్థానిక సప్తగిరి సర్కిల్లో మానవహారం నిర్మించారు. కేసీఆర్, సుష్మాస్వరాజ్ దిష్టి బొమ్మలు దహనం చేశారు. వ్యవసాయ మార్కెట్యార్డులో మార్కెటింగ్ సిబ్బంది వంటా వార్పు చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ ఉప సంచాలకుడు (ఆర్డీడీ) కే.రాజశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల అధ్యాపకులు, నోడల్ స్కూల్ సిబ్బంది ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ చేశారు. ఎస్కేయూలో జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యవాదులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి... 205 జాతీయ రహదారిపై వాహన రాకపోకలను అడ్డుకున్నారు. ధర్మవరంలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రోడ్డుపై బట్టలు కుట్టి, గుంతకల్లులో మునిసిపల్ కార్యాలయం ఎదుట సిబ్బంది నడి రోడ్డుపై వరినాట్లు వేసి, పామిడిలో జాక్టో నేతలు బజ్జీలు వేస్తూ.. రోడ్డుపై వెళ్లేవారికి మెహందీ పెడుతూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పామిడిలో సమైక్యవాదులు ర్యాలీ చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రధాన రహదారుల్లో ఇటుకలు మోసి నిరసన తెలిపారు. స్థానిక సద్భావన సర్కిల్లో ఉపాధ్యాయులు మానవహారం నిర్మించారు. ఆర్టీసీ ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. చిలమత్తూరులో జెడ్పీ పాఠశాల సిబ్బంది రిలే దీక్షలు చేపట్టారు. కదిరిలోని అంబేద్కర్ కూడలిలో తనకల్లు మండల ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేశారు. మడకశిరలో జేఏసీ నాయకులు భారీ ర్యాలీ, రాస్తారోకో చేశారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జాతీయ నాయకుల వేషధారణలతో విద్యార్థులు చేపట్టిన ప్రదర్శన ఆకట్టుకుంది. పుట్టపర్తిలో ‘సమైక్య సమర భేరి’ విజయవంతమైంది. ఈ కార్యక్రమాన్ని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యుడు ఆర్జే రత్నాకర్ ప్రారంభించారు. వేలాది మంది ప్రజలు పాల్గొని సమైక్య నినాదాలు మార్మోగించారు. గజల్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెనుకొండలో జేఏసీ నాయకులు ర్యాలీ చేశారు. రొద్దంలో టీ విక్రయిస్తూ నిరసన తెలిపారు. గోరంట్లలో జేఏసీ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రాయదుర్గంలో ఆల్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు తెలుగుతల్లి వేషధారణలో హైలెట్గా నిలిచారు. పట్టణంలోని వినాయక సర్కిల్లో 600 మంది సమైక్యవాదులు రిలే దీక్షలు చేపట్టారు. రిలే దీక్షలు చేస్తున్న సమైక్యవాదులకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి భారతి సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్ర ప్రకటన వచ్చే వరకు ఉద్యమం ఉధృతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కణేకల్లులో జేఏసీ నాయకులు కేంద్ర మంత్రుల మాస్కులు ధరించి నిరసన తెలిపారు. డీ.హీరేహాళ్లో జేఏసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాప్తాడులో జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు రాస్తారోకో చేశారు. శింగనమలలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి.. దహనం చేశారు. నార్పలలో సమైక్యవాదులు రోడ్డుపై ఆట పాటలతో నిరసన తెలిపారు. తాడిపత్రిలో ఆర్టీసీ కార్మికులు మోకాళ్లపై నడిచారు. సమైక్యాంధ్ర అనే అంశంపై వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు పాటల పోటీలు నిర్వహించారు. జేఏసీ నాయకులు రోడ్డుపై బఠానీలు, బిస్కెట్లు అమ్ముతూ నిరసన తెలిపారు. పెద్దవడుగూరులో ఉపాధి హామీ మేట్లు, ఉరవకొండలో ఆర్టీసీ జేఏసీ నాయకులు రిలే దీక్షలు ప్రారంభించారు. ఉరవకొండలో వైఎస్సార్సీపీ కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కూడేరులో వైద్య సిబ్బంది, బెళుగుప్పలో జేఏసీ నాయకులు ర్యాలీలు నిర్వహించారు. -
అదే జోరు
సాక్షి, నెల్లూరు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ జిల్లా వాసులు 44వ రోజూ ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగించారు. కావలిలో గురువారం ‘కావలి కేక’ పేరుతో లక్షగళ ఘోష కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ, టీడీపీ నేతలతో పాటు విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అందరూ వెలుగెత్తి చాటారు. సమైక్య రాష్ట్రం కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రతిజ్ఞబూనారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు మూతపడ్డాయి. సమైక్యవాదులు పెద్ద ఎత్తున ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు నిరసన దీక్షలు కొనసాగించారు. ఆర్టీసీ బంద్ కొనసాగుతోంది. విద్యుత్ ఉద్యోగులు 72 గంటలు సమ్మెకు దిగారు. నగరంలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండు నుంచి వీఆర్సీ వరకు నిరసన ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. ఏపీఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. వీఎస్యూ అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన, గాంధీబొమ్మ కూడలిలో రోడ్డుపైనే యోగా ప్రదర్శన చేశారు. ఉదయగిరిలో బస్టాండ్ ఆవరణలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు గురువారం కొనసాగాయి. పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయ సిబ్బంది దీక్షలు చేశారు. మండలంలోని గండిపాళెం పంచాయతీకి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు దీక్షలు చేపట్టారు. వరికుంటపాడులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. దుత్తలూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. సీతారామపురంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన దీక్షల్లో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. వెంకటగిరి పట్టణంలో గురువారం ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్వీఎం ఉన్నత పాఠశాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. గూడూరులో వ్యాయామ ఉపాధ్యాయులు రోడ్డుపైనే డ్రిల్ చేశారు. సమైక్యాంధ్ర కోరుతూ పొట్టి శ్రీరాముల విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. రవీంద్రభారతి పాఠశాల విద్యార్థులు టవర్క్లాక్ కూడలి ప్రాంతంలో రాస్తారోకో నిర్వహిం చారు. కోట మండలంలో సమైక్యాంధ్రకు మద్దతుగా బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో వంటావార్పు, చిట్టమూరు మండలంలోని ఉపాధ్యాయులు గురువారం రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రిలేదీక్షలు చేపట్టారు. కోవూరులోని ఎన్జీఓ హోంలో గుమ్మళ్లదిబ్బ వాసుల ధర్నా చేశారు. ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం గ్రామస్తులు సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపై రాస్తారోకో చేశారు. అనంతరం వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. పొదలకూరులో గురువారం ఉపాధ్యాయులు, వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు రిలేదీక్షల్లో పాల్గొన్నారు. ఈనెల 17న జరిగే పొలికేకను విజయవంతం చేసేందుకు ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఎంఈఓ, ఉపాధ్యాయ సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. సూళ్లూరుపేటలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగాయి. ఉగ్గుమూడి సర్పంచ్, వార్డు సభ్యులు దీక్షలో కూర్చుని సంఘీభావం తెలిపారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని వీధులు చిమ్మూతూ నిరసన తెలిపారు. తడలో సమైక్యపోరులో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కాదలూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. నాయుడుపేటలోని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. సమైక్యపోరులో అసువులు బాసిన శంకరయ్య యాదవ్కు నివాళులర్పించి దీక్షను కొనసాగిస్తున్నారు. స్వర్ణముఖి గర్జనకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
సింహ గర్జన
సాక్షి, కర్నూలు : సకల జనం సమైక్యరాగం అందుకున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారు. వినూత్న నిరసనలతో హోరెత్తిస్తున్నారు. గత 39 రోజులుగా సడలని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణ, మండల కేంద్రాల్లోని ముఖ్య సర్కిళ్లు ఉద్యమకారులతో పోటెత్తుతున్నాయి. శనివారం సైతం జిల్లావ్యాప్తంగా సమైక్యాంధ్ర పరిరక్షకు ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. కల్లూరు మండలానికి చెందిన పొదుపు లక్ష్మీగ్రూపు మహిళలు పెద్దటేకూరు గ్రామం వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై నాలుగు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. అక్కడే వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కర్నూలులో వాసవీ మహిళా కళాశాల విద్యార్థులు తెలుగుతల్లి విగ్రహం వద్ద మానహారం నిర్వహించారు. జై సమైక్యాంధ్ర అంటూ నినదించారు. హైకోర్టు వద్ద సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణా లాయర్లు చేసిన దాడికి నిరసనగా జూనియర్ కళాశాలల జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో బైక్ ర్యాలీ చేశారు. సి.క్యాంపు సెంటర్ నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు కొనసాగించి అక్కడ అధ్యాపకులు మానవహాహరం నిర్వహించారు. హైదరాబాద్లో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి సంఘీభావంగా ప్రాంతీయ కంటి ఆసుపత్రి స్టాఫ్నర్సులు, పారామెడికల్ సిబ్బంది ర్యాలీ జరిపారు. ఆదోనిలో జడివానలోనూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తాయి. ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి, కార్మిక, కుల సంఘాల జేఏసీల ఆద్వర్యంలో నిరసన ప్రదర్శనలు, సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఆళ్లగడ్డ పట్టణంలో ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో సిబ్బంది, విద్యార్థులు భారీ ర్యాలీ జరిపారు. ఆలూరులో జేఏసీ నాయకులు, సాక్ష్భ్రారత్ వలంటీర్ల ఆధ్వర్యంలో రిలేనిరహార దీక్షలు ప్రారంభించారు. బనగానపల్లెలో సేవ్ ఆంధ్రప్రదేశ్కు మద్దతుగా సమైక్యవాదులు మహామానవహారం ఏర్పడ్డారు. ఇక్కడ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. కొలిమిగుండ్ల మండలంలో పాలీష్ ప్యాక్టరి యాజమానుల ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. డోన్ పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు 38వరోజుకు చేరాయి. శనివారం సమైక్యాంధ్ర కోరుతూ దూదేకుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఒంటెలతో ప్రదర్శన చేశారు. అనంతరం జాతీయరహదారిపై వంటావార్పు చేశారు. ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ నాయకులు రిలే నిరాహారదీక్షలను కొనసాగించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమతి ఆధ్వర్యంలో విద్యార్థులు, నాయీ బ్రాహ్మణ, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ సంఘాలు ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి శిల్పా చక్రపాణిరెడ్డి సమైక్యాంధ్రకు మద్దతుగా 48గంటల దీక్షను చేపట్టారు. కోసిగిలో జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక సెల్ఫోన్ షాపుల యజమానులు దుకాణాలు మూసివేసి స్థానిక మార్కండేయ ఆలయ ప్రాంగణం నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. చాగలమర్రిలో ఆర్యవైశ్యులు పొట్టి శ్రీరాములు చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మిగనూరులో సకల జనుల సింహగర్జన విజయవంతమైంది. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు నినాదాలతో హోరెత్తించారు. పాటలు పాడి కళాకారులు ఉద్యమస్ఫూర్తిని రగలించారు. -
సమైక్యమే శ్వాసగా
సాక్షి, నెల్లూరు: సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో హోరెత్తుతోంది. సమైక్యమే శ్వాసగా సింహపురి వాసులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రోజురోజుకూ ఉద్యమతీవ్రతను పెంచుతున్నారు. ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసనదీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిరసన గళం వినిపించిన ఉద్యోగులు శనివారం హైదరాబాద్లో జరగనున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు తరలివెళ్లారు. ఉద్యమానికి మద్దతుగా జర్నలిస్టులు ర్యాలీలు నిర్వహించారు. మొత్తం మీద జిల్లాలో 38వ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగింది. నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట కాంట్రాక్టు లెక్చరర్లు రిలేదీక్షలు చేశారు. వీఎస్యూ అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్సీ కూడలిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ప్రధాన బస్టాండ్లో నిరసన ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో వివిధ శాఖలకు చెందిన 1,500 మంది ఉద్యోగులు 25 బస్సుల్లో హైదరాబాద్కు వెళ్లారు. కేంద్ర మంత్రుల ఫొటో మాస్క్లు ధరించిన వారికి తెలుగు మహిళ ఆధ్వర్యంలో వీఆర్సీ సెంటర్లో సీమంతం చేశారు. బుచ్చిరెడ్డిపాళెంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కోవూరులోని ఎన్జీఓ హోంలో గంగవరం వా సులు నిరాహారదీక్ష చేశారు. గూడూరులోని పాలిటెక్నిక్, సిరామిక్ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకుడు రోడ్డుపై వంటావార్పు చేపట్టారు. టవర్క్లాక్ కూడలిలో పండరి భజనతో నిరసన తెలిపారు. జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు. చిట్టమూరు మండలం కొత్తగుంటలో ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమైక్య గర్జన జరిగింది. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో రిలేదీక్ష జరి గింది. మొదట ఉపాధ్యాయులు జెడ్పీ పాఠశాల మీదుగా సత్రం సెంటర్ వ రకు ర్యాలీ నిర్వహించారు. నాయిబ్రాహ్మణులు పట్టణంలో ర్యాలీ చేశారు. పొట్టిశ్రీరాములు విగ్రహానికి పాలాభి షేకం చేసిన అనంతరం ర్యాలీగా ము న్సిపల్ బస్టాండ్కు చేరుకున్నారు. అం బేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. సోమశిల రోడ్డు సెంటర్లో మేళతాళాలతో నిరసన తెలిపారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తుఫాన్ సినిమా ప్రదర్శనను అడ్డుకోవడంతో పాటు పోస్టర్లను దహనంచేశారు. పొదలకూరులో ప్రధానోపాధ్యాయు లు, ఉపాధ్యాయులు రిలే దీక్ష చేశారు. మనుబోలులోని వైఎస్సార్ విగ్రహం వద్ద ఎంపీడీఓ, తహశీల్దార్, ఉద్యోగు లు రిలే దీక్షలో కూర్చున్నారు. కావలిలోని పొట్టిశ్రీరాములు విగ్రహం సెంటర్లో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గాంధీబొ మ్మ సెంటర్లో రిలేదీక్ష చేశారు. 14వ తేదీ నుంచి ఉద్యమంలో పాల్గొంటామని ఎమ్మెల్యే బీద మస్తాన్రావు, టీ డీపీ జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర ప్రకటించారు. ఉదయగిరిలో పట్టణ వ్యాపారుల సం ఘం ఆధ్వర్యంలో బంద్, ర్యాలీ, రాస్తారోకో, వంటావార్పు జరిగింది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వింజమూరులో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యం లో రిలే దీక్షలు 31వ రోజుకు చేరుకున్నాయి. సీతారామపురంలో ఉద్యోగ జే ఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరుగుతున్నాయి. స్థానిక బస్టాండ్ సెంటర్ కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహ నం చేశారు. ముస్లింలు ర్యాలీ నిర్వహిం చారు. కలిగిరిలో రోడ్డుపై విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామస్తులు ఆటాపాటల తో నిరసన తెలిపారు. కొండాపురం త హశీల్దార్ కార్యాలయం ఎదుట రెవె న్యూ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్త లు రిలేదీక్షలు చేశారు. వరికుంటపాడు బస్టాండ్లో ఉపాధ్యాయులు, విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. సూళ్ళూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో తుఫాన్ సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. బస్టాండు సెంటర్లో జేఏసీ ఆ ధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నా యి. వ్యవసాయాధికారుల ఆధ్వర్యం లో రైతులు ట్రాక్టర్లతో తడ తహశీల్దార్ కార్యాలయం నుంచి బజారు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చే శారు. మాంబట్టు వాసులు రిలేదీక్షలు చేపట్టారు. నాయుడుపేట జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నా యి. వైఎస్ఆర్సీపీ నాయకురాలు నీరజమ్మ బస్టాండు సెంటర్లో రిలే దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. -
అంతా సమైక్యమై..
సాక్షి,నెల్లూరు: సింహపురివాసులంతా ‘సమైక్య’మై గర్జించారు. 37 రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉర్రూతలూగిస్తున్న జిల్లా ప్రజలు గురువారం మరో అడుగు ముందుకేసి ‘సమైక్య సింహగర్జన’లో కదం తొక్కారు. సభ ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచి విద్యార్థులు, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు మొత్తంగా సమైక్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సమైక్య నినాదాలతో సభ జరిగిన ఏసీసుబ్బారెడ్డి స్టేడియం హోరెత్తింది. విభజన ప్రకటనను తక్షణం ఉపసంహరించుకోవాలని ఉద్యోగసంఘాల నేతలు తమ ప్రసంగాల్లో డిమాండ్ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఉత్తేజితులను చేశాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమైక్య సింహగర్జన సభ ఊహించిన దానికంటే మిన్నగా విజయవంతమైంది. ఇదిలా ఉండగా జిల్లాలో సమైక్యవాదులు ర్యాలీలు, రాస్తారోకోలు, నిరసన దీక్షలు కొనసాగించారు.ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా సమైక్యవాదులు, ఉద్యోగులు, సింహపురి లక్ష గళ గర్జనకు తరలివచ్చారు. ఉదయగిరిలో వైఎస్సార్సీపీ రిలే దీక్షలు 17వ రోజుకు చేరుకున్నాయి. సీతారాంపురంలో ఉద్యోగ జేఏసీ నిర్వహిస్తున్న దీక్షలో వికలాంగులు పాల్గొన్నారు. బస్టాండ్ సెంటర్లో కేసీఆర్ను వలవేసి పట్టుకున్నట్టుగా వినూత్న నిరసన తెలిపారు. కేరళ ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలతో ర్యాలీ నిర్వహించి బస్టాండ్లో మానవహారం ఏర్పాటు చేశారు. సోనియా శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. కావలిలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్షలు, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు, రజక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, విచిత్ర వేషధారణతో నృత్యాలను ప్రదర్శిం చారు. మానవహారం, రాస్తారోకో చేశారు. కోవూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి నెల్లూరులో జరిగిన సింహగర్జనకు భారీగా తరలి వచ్చారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో గ్రామస్తులు నిరాహారదీక్ష చేపట్టారు. సింహగర్జనకు గూడూరు నుంచి వైఎస్సార్సీపీ సమన్వయకర్త పాశం సునీల్కుమార్ ఆధ్వర్యంలో భారీగా తరలి వచ్చారు. చిట్టమూరులో మోటారుసైకిళ్ల ర్యాలీ, మల్లాంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం మోటారుసైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. నెల్లూరులో జరిగిన సింహపురి సింహగర్జనకు సూళ్లూరుపేట నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సుమారు వెయ్యిమంది వచ్చారు. పట్టణంలో పురోహితుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రిలే నిరాహారదీక్షలో కూర్చున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గ జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో ‘ఆంధ్ర రాష్ర్ట విభజనతో అన్నీ కష్టాలే.. అందరికీ నష్టాలే’ అనే శీర్షికన రాసిన కరపత్రాన్ని జేఏసీ కన్వీనర్ వాకిచర్ల శాంతారామ్ ఆవిష్కరించి అందరికీ పంపిణీ చేశారు. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో విశ్రాంత ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. సింహగర్జనకు వెంకటగిరి తహశీల్దార్ ఆధ్వర్యంలో 20 వాహనాల్లో వివిధ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, కార్మికులు తరలి వచ్చారు. -
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం
కళ్యాణదుర్గం టౌన్, న్యూస్లైన్: ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని, శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్యామ్సుందర్ హెచ్చరించారు. బుధవారం కళ్యాణదుర్గం డీఎస్పీ కార్యాలయం, టౌన్ పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ మోహన్రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమ పరిస్థితులపై ఆరా తీశారు. ఉద్యమమంటే అందరికీ ఒకే న్యాయం ఉండాలి కదా! ఉద్యమకారులు ఇతరుల ఆస్తులను ధ్వంసం చేయడం నేరం కాదా..? ఉద్యమ స్ఫూర్తి ఉంటే వారు తమ సొంత ఆస్తులను ధ్వంసం చేసుకోవాలి కదా! ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా ప్రతినిధుల పిల్లలకు కార్పొరేట్ పాఠశాలల్లో చదువులు కొనసాగిస్తున్నారు? ఇదెక్కడి న్యాయం’ అన్నారు. పేద పిల్లలను చదువులకు దూరం చేసి, వారితో వీధుల్లో ర్యాలీలు చేయిస్తూ ఉద్యమం చేయడం సబబా? అంటూ ప్రశ్నించారు. ప్రతి పౌరుడు వీధుల్లోకి వచ్చి శాంతియుతంగా ఉద్యమం చేస్తే సార్థకత ఉంటుందని సూచించారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యంపై బైండోవర్ కేసులు ఎందుకు బనాయిస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా, తల్లిదండ్రులు పాఠశాలలకు పిల్లలను పంపితే, వారి అనుమతి లేకుండా పిల్లలను వీధుల్లో ర్యాలీలు చేయించడం నేరమని ఎస్పీ వివరణ ఇచ్చారు. ఉద్యమ ర్యాలీల్లో అనూహ్య సంఘటనలు చోటుచేసుకుని విద్యార్థులు బలైతే, అందుకు బాధ్యులెవరని ఆయన ప్రశ్నించారు. బైండోవర్ అంటే కేసు నమోదు చేయడం కాదు... పిల్లల భవిష్యత్తుకు బాధ్యతగా ఉండేందుకే బాండ్ తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 30 ఉద్యమ కేసులు బనాయించామని చెప్పారు. వీటిలో 95 శాతం మంది విద్యార్థులే ఉన్నారన్నారు. వారి భవిష్యత్తును ఆలోచించి ఎవరిని అరెస్టు చేయలేదన్నారు. ఉద్యమ కారులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించి ఉద్యమానికి రూపకల్పన చేసుకుంటే మంచిదని సూచించారు. అనంతరం జిల్లాలో సాగు, తాగు నీరు ఎలా ఉందని విలేకరులను ఆరా తీశారు. ఈ ప్రాంతంలో ప్రధాన ఆధార పంట ఏదని అడిగి తెలుసుకున్నారు. తాగు, సాగునీరు సాధించుకోవడానికి ఉద్యమాలు చేయాలి తప్ప, హైదరాబాద్ కావాలని ఉద్యమం చేస్తే ఏమొస్తుందంటూ నవ్వారు. -
జన ప్రవాహం
జిల్లాలో సమైక్య ఉద్యమం ఎగిసిపడుతోంది. నెల రోజులు దాటినా ఏమాత్రం జోరు తగ్గలేదు. రెట్టించిన ఉత్సాహంతో సమైక్యవాదులు ఉద్యమంలో ఉరకలేస్తున్నారు. జై సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటుతున్నాయి. పల్లెలు మొదలుకుని పట్టణాల వరకు ప్రతి చోటా సమైక్య ఉద్యమ ర్యాలీలు, ధర్నాలు, దీక్షలు కనబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి సమైక్యాంధ్ర ప్రకటన చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ప్రతిన బూనుతున్నారు. నెల రోజులుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూత పడటంతో పరిపాలన స్తంభించింది. ప్రజలకు అసౌకర్యం క లుగుతున్నా చలించడం లేదు. సమైక్యాంధ్రే తమ లక్ష్యమంటూ నినదిస్తున్నారు. సాక్షి, కడప : సమైక్యాంధ్ర గర్జన సభలకు జన ప్రవాహం వెల్లువెత్తుతోంది. పురిటిబిడ్డ మొదలు పండు ముదుసలి వరకు అందరి తారకమంత్రం సమైక్యాంధ్రనే. ప్రతిక్షణం సమైక్య నినాదం వినిపిస్తోంది. ఢిల్లీ పెద్దలు కదిలే వరకు అదే నినాదం మారుమోగించాలి అనే రీతిలో ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తోంది. ఎన్జీఓలు, వివిధ సంఘాలు ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు భారీ కసరత్తు చేస్తున్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కచోట సమైక్య పరంపర కొనసాగుతూనే ఉంది. 36 రోజుల కిందట మొదలైన సమైక్య సెగలు జిల్లాలో ఇప్పటికి రాజుకుంటూనే ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమబాట పడుతున్నారు. కడపలో వైఎస్సార్సీపీ నేతలు, డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు సౌదరి రామకృష్ణారెడ్డి, కోటా నరసింహారావు చేపట్టిన ఆమరణ దీక్షలు మంగళవారంతో రెండవరోజు పూర్తయ్యాయి. వీరి దీక్షలకు వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్బాబు, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ లక్ష్మినారాయణరెడ్డి,యానాదయ్య తదితరులు సంఘీభావం తెలిపారు. నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ఏజేసీ సుదర్శన్రెడ్డి ప్రగతి భవన్పై సమైక్యాంధ్ర బెలూన్ను ఎగురవేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగే సభకు జిల్లా నుంచి ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ఇంటికి ఒకరు చొప్పున ఉద్యోగులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఈశ్వరయ్య, ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు కేవీ శివారెడ్డి, ఆర్వీఎం పీఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. జిల్లా అన్ ఎయిడెడ్ రికగ్నైజ్డ్ స్కూల్స్ కరస్పాండెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. కార్పొరేట్ విద్యా సంస్థలు కేశవరెడ్డి, నారాయణ, చైతన్య, రవీంద్రభారతి పాఠశాలలకు చెందిన వేలాదిమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద దీక్షలకు సంఘీభావం తెలిపారు. విచిత్ర వేషధారణలు ఆకట్టుకున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రైవేటు వృత్తి విద్య కళాశాలల ఆధ్వర్యంలో అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల సిబ్బంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, డీఆర్డీఏ, వాణిజ్యపన్నులశాఖ ఉద్యోగులు, మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, విద్యుత్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. జమ్మలమడుగులో ప్రైవేటు స్కూల్స్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. రిపబ్లిక్ క్లబ్ సొసైటీ సభ్యులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఈ దీక్షలకు ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి, తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డిలు సంఘీభావం తెలిపారు. పట్టణంలో ‘జన గర్జన’ పేరుతో బుధవారం పీఆర్ హైస్కూలులో జరిగే సభను జయప్రదం చేయాలని ఆర్డీఓ రఘునాథరెడ్డి ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు. బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల పట్టణంలో పోరు గర్జన పేరుతో 20 వేల మందికి పైగా ఉద్యోగులు, విద్యార్థులు అంబేద్కర్ విగ్రహం నుంచి పోలీసుస్టేషన్ వరకు రోడ్లపై కూర్చొని మొత్తం పట్టణాన్ని దిగ్బంధించారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది. దీనికి వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి సంఘీభావం తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో వైఎస్సార్సీపీ నేతృత్వంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలు వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ పులి సునీల్కుమార్ నేతృత్వంలో దాసరి పెద్ద భూషయ్య తదితరులు కూర్చొన్నారు. బద్వేలు పట్టణంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించి వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు వెంకటేశ్వర్లు, బద్వేలు మాజీ మున్సిపల్ చైర్మన్ మునెయ్య, వైస్ చైర్మన్ గురుమోహన్ తదితరులు తమ మద్దతు తెలిపారు. ఉపాధ్యాయులు వెనక్కి నడుస్తూ పట్టణంలో వినూత్న నిరసన తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణంలో పద్మశాలీయులు మగ్గాలతో ర్యాలీని నిర్వహించారు. రోడ్డుపైనే మహిళలు పడుగు వేస్తూ నిరసన తెలిపారు. వసంతపేట సాయిబాబా ఆలయం నుంచి పుట్టపర్తి సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆర్టీసీ కార్మికులు, ఆదర్శ రైతులు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు బైక్ర్యాలీని చేపట్టారు. పులివెందులలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. ఎన్జీఓల దీక్షలు కొనసాగుతున్నాయి. ఈనెల 7వ తేదీ హైదరాబాదులో జరిగే ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. వేంపల్లె, సింహాద్రిపురంలలో ఆందోళనలు కొనసాగాయి. రాయచోటి పట్టణంలో వ్యాయామ ఉపాధ్యాయులు రిలే దీక్షల్లో కూర్చొన్నారు. న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. జేఏసీ శిబిరంలో ఆటాపాటా కార్యక్రమాన్ని చేపట్టారు. మైదుకూరు పట్టణంలో చిరు వ్యాపారులు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి వంటా వార్పు చేపట్టారు. ఖాజీపేటలో ఆర్టీసీ డ్రైవర్లు, వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిని దిగ్బంధించారు. రైల్వేకోడూరులో వైద్య సిబ్బంది రోడ్డుపైన బైఠాయించి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర జేఏసీ నేతలు మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలిపారు. రాజంపేటలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వడ్డెర సంఘం నాయకులు పసుపులేటి సుధాకర్ నేతృత్వంలో రిలే దీక్షలు సాగుతున్నాయి. ఈ దీక్షలకు ఆకేపాటి మురళి, పోలా శ్రీనివాసులురెడ్డి, శరత్కుమార్రాజులు సంఘీభావం తెలిపారు. మహిళలు సమైక్యాంధ్ర కోసం తహశీల్దార్ కార్యాలయం ఎదుట రోడ్డుపైనే యాగం నిర్వహించారు. కమలాపురంలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో గ్రామ చావిడి నుంచి కమలాపురం క్రాస్రోడ్డు వరకు పెద్ద ఎత్తున ఉద్యోగులు, ప్రజలు నోటికి నల్ల రిబ్బన్లు ధరించి మౌన ప్రదర్శన నిర్వహించారు. క్రాస్రోడ్డులో మానవహారంగా ఏర్పడ్డారు. -
అదరం..బెదరం
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ను కాపాడుకునే క్రమంలో ఎన్ని కష్టాలు ఎదురైనా అదరం, బెదరమని సమైక్య వాదులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకోవడమే తమ ఏకైక లక్ష్యమంటూ పోరాటంలో ముందుకు సాగుతున్నారు. విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయులు, ఎన్జీఓలు, గెజిటెడ్ ఆఫీసర్లతో పాటు అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకొచ్చి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విభజన కుట్రకు తెరదీసిన వారిపై నిప్పులుగక్కుతున్నారు. ఆదివారం సైతం జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన దీక్షలు కొనసాగించారు. ఉదయగిరి, సూళ్లూరుపేట, గూడూరు తదితర నియోజక వర్గాల్లో వైఎస్సార్సీపీ నాయకులు దీక్షలకు సంఘీభావం పలికి నిరసన కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. మొత్తంగా 33వ రోజూ జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగింది. నెల్లూరులో కలెక్టరేట్ ఎదుట గెజిటెడ్ అధికారుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్లో నిరసన తెలిపారు. వీఆర్సీ సెంటర్లో యూటీఎఫ్, వీఎస్యూ అధ్యాపక జేఏసీల నాయకులు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. రాజీవ్ విద్యామిషన్, సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆర్వీఎం కార్యాలయం, ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమాలు జరిగాయి. విద్యుత్ ఉద్యోగులు టౌన్హాలులో సమావేశమై ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. గూడూరులో రిలే దీక్షలు సాగిస్తున్న వారికి వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్కుమార్ మద్దతు పలికారు. బ్రాహ్మణసేవా సంఘం ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. జర్నలిస్టులు వీధులు చిమ్ముతూ నిరసన తెలిపారు. చిల్లకూరు మండలం కొత్తగుంటలో ఆటో యూనియన్ నేతలు రిలే దీక్షలో కూర్చున్నారు. వెంకటగిరిలో జేఏసీ ఆధ్వర్యంలో అడ్డరోడ్డు సెంటర్లో మానవహారం నిర్వహించడంతో పాటు ఆటాపాటలతో నిరసన తెలిపారు. సైదాపురంలో జరిగిన నిరసన కార్యక్రమంలో భీముడు, దుర్యోధనుడు, యముడు తదితర వేషధారణలో ఉన్న వారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండు వద్ద వసతి గృహాల నాల్గో తరగతి ఉద్యోగులు, వార్డెన్లు రిలే దీక్ష చేశారు. మున్సిపల్ బస్టాండు నుంచి పొట్టిశ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో వైఎస్సార్సీపీ నేతలు రిలే దీక్షలు చేశారు. సమైక్యాంధ్ర, ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు ఆరో రోజుకు చేరాయి. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు. మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు దీక్షలో కూర్చున్నారు. ఉదయగిరి-సీతారాంపురం రోడ్డుపై వాలీబాల్ఆడారు. దుత్తలూరు సెంటరులో జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం సిబ్బంది రిలే దీక్ష చేశారు. వరికుంటపాడులో దీక్షలో ఉన్న వారికి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి మద్దతు ప్రకటించారు. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో 19 రోజులుగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. న్యాయవాదులు దీక్షలో కూర్చున్నారు. విభజనతో వచ్చే నష్టాలపై మదర్ సేవాసంస్థ కరపత్రాలు పంచిపెట్టింది. నాయుడుపేట ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష, యూటీఎఫ్ ఆధ్వర్యంలో గాంధీ మందిరం వద్ద రిలేదీక్షలు నిర్వహించారు. యువశక్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రక్తదానం చేశారు. ముస్లింలు భారీ ర్యాలీ చేసి రిలే దీక్షలో ఉన్న వారికి సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించి ట్రాఫిక్ను అడ్డుకున్నారు. తడలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ వద్ద ఉపాధ్యాయ జేఏసీ నాయకులు దీక్షలో కూర్చున్నారు. దొరవారిసత్రంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు దువ్వూరు బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి రోడ్డుపైనే భోజనం చేశారు. టీపీగూడూరు మండలంలోని ఐదు పంచాయతీల్లో తహశీల్దార్, ఎంపీడీవో, ఎంఈఓల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులందరూ సమైక్యాంధ్రకు మద్దతుగా పర్యటించారు. చింతోపులో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. పొదలకూరులో ప్రభుత్వ ఉద్యోగుల దీక్షలు కొనసాగుతున్నాయి. కోవూరులోని ఎన్జీఓ హోమ్లో మైనార్టీ నాయకులు రిలే దీక్ష చేశారు. బుచ్చిరెడ్డిపాళెంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వవ్వేరు బ్యాంకు నుంచి బస్టాండు మీదుగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ విగ్రహ కూడలి వరకు ర్యాలీ జరిగింది. కావలిలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ట్రంకురోడ్డుపై ముగ్గువేసి గొబ్బెమ్మలను పెట్టి నిరసన తెలిపారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్లోకి బస్సులను రానివ్వకుండా ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ నేతలు అడ్డుకున్నారు. అనంతరం రిలే దీక్షలు కొనసాగించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అధ్వర్యంలో వికలాంగులు, ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ శిబిరంలో ఉద్యోగులు రిలే దీక్షలు చేశారు. -
రోడ్డెక్కిన జనం
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షకు మద్దతుగా ఆ పార్టీ శ్రేణులు రోడ్డెక్కాయి. జిల్లా వ్యాప్తంగా నిరసన దీక్ష లు, ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. జగన్ ఆరోగ్యం బాగుం డాలంటూ గూడూరులో బత్తిన విజయ్కుమార్ నేతృత్వంలో కార్యకర్తలు చిల్లకూరు దోషాహీద్ దర్గాలో ప్రార్థనలు చేశారు. జగన్కు మద్దతుగా నాల్గో రోజు కలువాయిలో దీక్ష కొనసాగిస్తున్న అనిల్కుమార్రెడ్డికి మద్దతుగా పార్టీ సీఈసీ సభ్యుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్త అనిల్కుమార్ యాదవ్ సంఘీభావం ప్రకటించారు. నగరంలో జగన్ దీక్షలకు మద్దతుగా వైఎస్సార్సీపీ రూరల్ నియోజక వర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నేతృత్వంలో గాంధీ బొమ్మ సెంటర్లో రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. అనంతరం దీపాలతో ప్రదర్శన చేశారు. వెంకటగిరి నియోజక వర్గంలోని కలువాయిలో వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా వైఎస్సార్సీపీ నాయకుడు అనిల్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష నాల్గోరోజుకు చేరింది. ఈ నిరాహారదీక్షకు మద్దతుగా పార్టీ సీఈసీ సభ్యుడు కాకాణి గోవర్థన్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్లు పాల్గొని సంఘీభావం తెలిపారు. సైదాపురం బస్టాండ్ సెంటర్లో మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, నాయకులు మహేందర్రెడ్డి, జనార్దన్రాజు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మర్లపూడి గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకుడు మస్తాన్ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. ఉదయగిరి నియోజక వర్గంలోని జలదంకి బస్టాండ్లో వైఎస్సార్సీపీనేతలు జగన్ దీక్షకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సూళ్లూరుపేట బస్టాండ్ సెంటర్లో నియోజకవర్గ సమన్వయకర్త దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా క్రిస్టియన్ మైనార్టీలు నిరాహారదీక్ష చేశారు. అడ్డగోలు రాష్ట్ర విభజనకు నిరసగా వైఎస్ జగన్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు ప్రభుత్వం, సోనియాగాంధీ బాధ్యత వహించాల్సి ఉంటుందని నెల్లూరు రూరల్ నియోజక వర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. -
‘ముల్కీ’ అమరవీరుల వారోత్సవాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యం లో జిల్లాలో ముల్కీ అమరుల వారోత్సవాలు నిర్వహించనున్నారు. మూడు డిమాండ్లు, ఓ విజ్ఞప్తితో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆదివారం నుంచి ఈ నెల 7 వరకు తెలంగాణ ముల్కీ అమరుల స్మృత్యార్థం వారోత్సవాలు నిర్వహించనున్నట్లు రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఇటీవల ప్రకటించా రు. ఇందులో భాగంగా జిల్లాలోనూ శాంతి ర్యాలీలు నిర్వహించేలా రాజకీయ జేఏసీ, తె లంగాణవాదులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా లో ముల్కీ అమరుల వారోత్సవాల ఠ మొదటి పేజీ తరువాయి సందర్భంగా శాంతి ర్యాలీలు ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణవాదులు కూడా సన్నద్ధమయ్యారు. భారీగా ఏర్పాట్లు.. 1952 సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జరిగిన ముల్కీ ఉద్యమంలో నాన్ ముల్కీలను బయటకు పంపించి ముల్కీలకే ఉద్యోగాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన ఉద్యమంలో పలువురు పోలీసు కాల్పుల్లో అమరులయ్యారు. ఈ నేపథ్యంలో వారిని స్మరించుకుంటూ జిల్లాలో వారోత్సవాలు నిర్వహించి ప్రజల వద్దకు వెళ్లేందుకు కార్యాచరణ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆదివారం నుంచి ఈ నెల 7 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నెల 1 నుంచి 6 వరకు తెలంగాణలోని పది జిల్లాల్లో ర్యాలీలు, దీక్షలు, 7న హైదరాబాద్లో శాంతి ర్యాలీ చేపట్టనున్నారు. మూడు డిమాండ్లు.. ఓ విజ్ఞప్తి.. ముల్కీ అమరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా రాజకీయ జేఏసీ తెలంగాణ ప్రజల తరఫున మూడు డిమాండ్లు, ఓ విజ్ఞప్తిని ప్రభుత్వం, రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లనుంది. మొదటి డిమాండ్ హైదరాబాద్తో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ర్టం. దీనిపై ఎలాంటి మార్పునూ అంగీకరించం. రెండోది కేంద్ర కేబినేట్ వెంటనే తెలంగాణపై తీర్మానం చేసి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి. చివరగా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రకటన అమలు అయ్యే వరకు ఎలాంటి సన్మానాలు, విజయోత్సవాలను నిర్వహించుకోవద్దు. సీమాంధ్ర నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలు, కుట్రలు తిపికొట్టాలి. సీమాంధ్ర నాయకులు విభజనకు సహకరించి సోదరభావంతో విడిపోయి అందరూ కలిసి ఉండాలని ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు. రేపు ప్రొఫెసర్ కోదండరామ్ రాక... ముల్కీ అమరుల వారోత్సవాల సందర్భంగా ఆదివారం నుంచి గ్రేటర్ హైదరాబాద్లో శాంతి ర్యాలీని ప్రారంభించనున్నారు. 2న జిల్లా కేంద్రంలో నిర్వహించే భారీ శాంతి ర్యాలీకి రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్తోపాటు పలువురు తెలంగాణవాదులు హాజరుకానున్నారు. 3న నిజామాబాద్, 4న కరీంనగర్, 5న వరంగల్, 6న మహబూబ్నగర్ , 7న హైదరాబాద్లో శాంతి ర్యాలీలు నిర్వహించనున్నారు. 7న హైదరాబాద్లో జరిగే ర్యాలీ సిటీ కాలేజ్ నుంచి ప్రారంభమై బేగంబజార్, నాంపల్లి, సెక్రటేరియట్, గన్పార్క్ మీదుగా ఇందిరాపార్కుకు చేరుతుందని జేఏసీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై సానుకూలంగా స్పందించినా ఇటీవల సీమాంధ్ర మంత్రులు, నేతలు అడ్డుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణవాదులు తమ వాణిని గట్టిగా వినిపించనున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం మంచిర్యాలలో నిర్వహించిన ‘లక్ష గళ గర్జన’ విజయవంతమైంది. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే శాంతిర్యాలీని సైతం విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ర్యాలీని విజయవంతం చేయండి.. ముల్కీ అమరుల స్మృత్యార్థం సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే శాంతి ర్యాలీని విజయవంతం చేయా తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా కన్వీనర్, రాజకీయ జేఏసీ కో కన్వీనర్ ఎ.విజయ్కుమార్ కోరారు. 1952 సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జరిగిన ముల్కీ ఉద్యమంలో నాన్ ముల్కీలను బయటకు పంపించి ముల్కీలకే ఉద్యోగాలు ఇచ్చారని, ఈ విషయమై ఉద్యమించిన ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు అమరులయ్యారని అన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టే వారోత్సవాల్లో తెలంగాణ ప్రజలు, యువకులు, విద్యావంతులు, తెలంగాణవాదులు, వివిధ జేఏసీల నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజయ్కుమార్ పిలుపునిచ్చారు. -
సమైక్య సమరం
సాక్షి, నెల్లూరు : వైఎస్ జగన్ ఆమరణదీక్షకు మద్దతుగా జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులు కదంతొక్కాయి. జిల్లావ్యాప్తంగా నిరసన దీక్షలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సోనియాదిష్టిబొమ్మల దహనం తదితర ఆందోళనలు నిర్వహించారు. పార్టీ నెల్లూరు సిటీ సమన్వయకర్త అనిల్కుమార్ యాదవ్ నేతృత్వంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, పార్టీ కో ఆర్డినేటర్ డీసీ గోవిందరెడ్డి, దబ్బల రాజారెడ్డి, నెలవల సుబ్రమణ్యం, సంజీవయ్య తదితర నేతలు శుక్రవారం జరిగిన జైల్భరోలో పాల్గొన్నారు. ర్యాలీగా వస్తున్న కార్యకర్తలను పోలీసులు డీఆర్ ఉత్తమ్ హోటల్ వద్ద అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేసి కోవూరు పోలీసు స్టేషన్కు తరలించారు. సూళ్లూరుపేటలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా బస్టాండ్ సెంటర్లో నియోజకవర్గ సమన్వయకర్త దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు నిరాహారదీక్ష చేశారు. ఉదయగిరి నియోజక వర్గం జలదంకి బస్టాండ్లో వైఎస్సార్సీపీ నేతలు జగన్ దీక్షకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఉదయగిరి బస్టాండ్లో వికలాంగులు రిలే నిరాహార దీక్షలు చేశారు. సీతారామపురం బస్టాండ్లో వైఎస్సార్సీపీ నేతలు జగన్ దీక్షకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు చేశారు. ఆత్మకూరు నియోజక వర్గంలోని అనంతసాగరం నుంచి వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రాపూరు వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అనంతసాగరం నుంచి బయల్దేరి మర్రిపాడు, డీసీపల్లి, ఆత్మకూరు, ఏఎస్పేట, సంగం మండలానికి చేరింది. కావలిలో వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు గాంధీ బొమ్మ సెంటర్లో రిలేనిరాహారదీక్ష చేపట్టారు. వైఎస్సార్సీపీ నేతలు కేఎం జయకుమార్, సుధాకర్, పులి పెనుకొండయ్య, జరుగుమల్లి రామారావు తదితరులు రిలేనిరాహార దీక్ష చేపట్టారు. వెంకటగిరి నియోజక వర్గంలోని కలువాయిలో జగన్కు మద్దతుగా వైఎస్సార్సీపీ నాయకుడు అనిల్కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష మూడో రోజుకు చేరింది. -
జోరు తగ్గని సమైక్యం
సాక్షి, నెల్లూరు: నిరసన కార్యక్రమాలతో తాత్కాలికంగా ఎన్ని సమస్యలు వ చ్చినా వెనక్కితగ్గేది లేదని సింహపురి వాసులు స్పష్టం చేస్తున్నారు. భావితరా ల భవిష్యత్తే తమకు ప్రధానమని తేల్చిచెబుతున్నారు. 29 రోజులుగా ఉద్యమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతు న్నా, వెనకడుగు వేయక ముందుకు సా గుతున్నారు. సమైక్య పోరును మరింత ఉధృతం చేస్తున్నారు. వినూత్న నిరసనలతో సమైక్యవాణి వినిపిస్తున్నారు. అం దులో భాగంగా బుధవారం జిల్లా వ్యా ప్తంగా ర్యాలీలు, నిరశన దీక్షలు, మానవహారాలు, సోనియాగాంధీ దిష్టిబొమ్మ ల దహనం తదితర కార్యక్రమాలు కొనసాగాయి. నెల్లూరులో మహిళా ఉద్యోగులు, విద్యుత్, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు, విక్రమసింహపురి యూని వర్సిటీ అధ్యాపకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. టీపీ గూడూరులో ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన నిర్వహిం చారు. పొదలకూరులో ప్రభుత్వ ఉద్యోగులు రిలే దీక్షలో కూర్చున్నారు. వెంకటాచలం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు రిలే దీక్షలు చే పట్టారు. ఉదయగిరిలో ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి.. బస్టాండ్ సెంటర్లో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఉదయగి రి-సీతారామపురం రోడ్డుపై మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు అ ధ్యాపకులు రోడ్డుపైనే విద్యాబోధన చే సి నిరసన తెలిపారు. దుత్తలూరు, కలి గిరిలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వింజమూరులో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది బస్టాండ్ సెంటరు వరకు ర్యాలీ నిర్వహించారు. జేఏసీ రిలే దీక్షలు 22వ రోజుకు చేరా యి. సీతారాంపురం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సిబ్బంది రిలే దీక్షలు చేపట్టారు. కోవూరు ఎన్జీఓ హోంలో ఉపాధ్యాయులు నిరాహార దీక్షకు దిగా రు. మైపాడు సమీపంలోని కృష్ణాపురం తీరంలో మత్స్యకారులు బోట్లతో స ముద్రంలో సమైక్య వాణి వినిపించారు. గూడూరు టవర్క్లాక్ కూడలిలో సమైక్యభేరి నిర్వహించారు. విద్యార్థులు రోడ్లపైనే ఆటలాడి నిరసన తెలిపారు. వాకాడు అశోక్పిల్లర్ సెంటర్లో వైఎస్సార్సీపీ నేత నేదురుమల్లి పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో నేతలు దీక్షలు చేపట్టారు. కోట మండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. వెంకటగిరి లో పద్మనాయక వెలమ సంఘం ఆధ్వర్యంలో పోలేరమ్మ ఆలయం వద్ద నుం చి కాశీపేట సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాజా విగ్రహానికి పాలాభి షేకం చేశారు. పట్టణ జేఏసీ ఆధ్వర్యం లో విద్యార్థులకు ఆర్టీసీ బస్టాండు ఎ దుట వివిధ ఆటల పోటీలు నిర్వహించి ఉట్టి కొట్టారు. కావలిలో ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు పట్టణ వీధుల్లో కదం తొక్కారు. విట్స్, వెక్ ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో వివిధ సం ఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ గ్యారేజ్ నుంచి డిపోలోకి బస్సులు రాకుండా ఉద్యోగులు, కార్మికులు అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వస్తున్న కేశినేని ట్రావెల్స్ బస్సును నిలిపివేశారు. ఆత్మకూరు ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. దొరవారిసత్రంలో వైఎస్సార్సీపీ నేతలు చేపట్టిన రిలే దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. సూళ్లూరుపేట, నాయుడుపేట, పెళ్లకూరు తదితర ప్రాంతాల్లోనూ నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. వైఎస్సార్సీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో నాయుడుపేట బస్టాండ్ సెంటర్లో వంటావార్పు చేశారు. -
సమైక్యమే అభిమతం
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్లైన్ : సమైక్యమే తమ అభిమతమంటూ ‘అనంత’ వాసులు వెలుగెత్తి చాటుతున్నారు. తెలుగు జాతిని విచ్ఛిన్నం చేసే అధికారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లేనేలేదంటూ తెగేసి చెబుతున్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే చేష్టలుడిగి చూస్తున్న సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు పుట్టగతులు లేకుండా చేస్తామని ప్రతినబూనారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ‘అనంత’లో 29వ రోజైన బుధవారం కూడా ఉద్యమం ఉప్పెనలా కొనసాగింది. కృష్ణాష్టమి నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో యాదవులు, ఇతర వర్గాల వారు సమైక్య ర్యాలీలు నిర్వహించారు. గుడిబండ మండలం కేకేపాళ్యంలో లక్ష్మణ్ణ (38), కణేకల్లు మండలం అంబాపురానికి చెందిన హెచ్. హనుమక్క (58) అనే సమైక్యవాదులు గుండెపోటుతో మృతి చెందారు. అనంతపురం నగరంలో ఉద్యమ తీవ్ర మరింత ఎక్కువైంది. హౌసింగ్ అధికారులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ బస్సుల యజమానులు బస్సులతో ర్యాలీ చేశారు. ఎన్జీఓ, రెవెన్యూ, జెడ్పీ, పీఆర్, ట్రాన్స్కో, వాణిజ్య పన్నుల శాఖ, మున్సిపల్, నీటిపారుదల, ఆర్అండ్బీ ఉద్యోగులు, న్యాయవాదులు, ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ సంఘాల జేఏసీ నాయకులు, అధ్యాపకుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్కేయూలో ఉద్యోగ, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రెస్క్లబ్లో జనచైతన్య సమితి ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర సదస్సులో కాంగ్రెస్ పార్టీ నేత ఎన్.తులసిరెడ్డి పాల్గొన్నారు. ధర్మవరంలో ఉద్యోగ సంఘాల జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. వివిధ వర్గాలు నిరసన ర్యాలీలు నిర్వహించారు. గుంతకల్లులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజాగర్జన నిర్వహించారు. ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. హిందూపురంలో తెలుగుతల్లి విగ్రహం చుట్టూ పశువైద్యసిబ్బంది మోకాళ్లపై కూర్చుని మానవహారం నిర్మించారు. చిలమత్తూరులో యాదవులు, లేపాక్షిలో లారీ యజమానులు ర్యాలీలు చేశారు. మంత్రి ఎన్.రఘువీరారెడ్డి కనబడటం లేదని సమైక్యవాదులు లేపాక్షి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కదిరిలో న్యాయవాదులు, ఉద్యోగ సంఘాల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. నల్లచెరువు, తనకల్లులో బంద్ కొనసాగింది. రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు. కళ్యాణదుర్గంలో న్యాయవాదులు, ఉద్యోగ, విద్యార్థి జేఏసీ నాయకుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కుందుర్పి నుంచి కళ్యాణదుర్గం వరకు సమైక్యవాదులు పాదయాత్ర చేశారు. మడకశిరలో సోనియా, కేసీఆర్, రాహుల్గాంధీలను సమైక్యాంధ్ర ద్రోహులుగా చిత్రీకరిస్తూ ఉట్టి కొట్టి నిరసన తెలిపారు. అమరాపురంలో ఉపాధ్యాయులు భిక్షాటన చేశారు. పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం, నల్లమాడలో ర్యాలీలు హోరెత్తాయి. పెనుకొండలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ, పరిగి, గోరంట్లలో సమైక్యవాదుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సోమందేపల్లిలో యాదవులు, రొద్దంలో ఈడిగ కులస్తులు ర్యాలీలు చేశారు. గోరంట్లలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాయదుర్గంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గొర్రెలకు సోనియా, దిగ్విజయ్, కేసీఆర్ చిత్రపటాలు తగిలించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆత్మకూరులో మహిళా సంఘాలు భారీ ర్యాలీ చేశాయి. బుక్కరాయసముద్రం, నార్పల, గార్లదిన్నె, పామిడి, రాప్తాడు, కనగానపల్లి మండలాల్లో సమైక్యవాదులు, ఉద్యోగ జేఏసీ నేతలు ర్యాలీలు చేశారు. యల్లనూరులో వంటా వార్పు చేపట్టారు. తాడిపత్రిలో సమైక్యవాదులు సర్వమత ప్రార్థనలు చేశారు. జేఏసీ, మున్సిపల్ ఉద్యోగుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. యాడికిలో యాదవులు, పెద్దవడుగూరులో ఆటోయూనియన్ సభ్యులు ర్యాలీలు చేశారు. పెద్దపప్పూరులో సమైక్యవాదులు, ఉద్యోగులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఉరవకొండలో రెవెన్యూ, ఉద్యోగ సంఘాల జేఏసీ రిలే దీక్షలకు వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి సంఘీభావం ప్రకటించారు. బెళుగుప్ప, కంబదూరు, విడపనకల్లు, వజ్రకరూరు, గుత్తి తదితర ప్రాంతాల్లో సమైక్య నినాదాలు మార్మోగాయి. -
ఉద్యమ హోరు
సాక్షి, కడప : ప్రజలు పోటెత్తుతున్నారు. సమైక్య ఉద్యమం మరింత రాజుకుంటోంది. సమైక్యవాదుల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. ఉద్యమం హోరెత్తుతోంది. దీక్షలు జోరందుకుంటున్నాయి. నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆందోళనలు సాగుతున్నాయి. ఉద్యోగులు, న్యాయవాదులు కదం తొక్కుతున్నారు. విద్యార్థులు, కార్మికులు సమరనాదం పూరిస్తున్నారు. యువకులు, మహిళలు సమైక్య గర్జన చేస్తున్నారు. ఇలా ఎవరికి వారే విభిన్నరీతుల్లో నిరసన తెలుపుతుండడంతో ఉద్యమం వాడివేడిగా దూసుకుపోతోంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ 28వ రోజు ఉద్యమం అదే హోరుగా కొనసాగింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షలకు మద్దతుగా జిల్లాలో పలుచోట్ల ర్యాలీలు, నిరాహార దీక్షలు కొనసాగాయి. జాతీయ రహదారులను దిగ్బంధనం చేశారు. కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ నేతలు దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, భూపేష్రెడ్డి, కిశోర్కుమార్, అఫ్జల్ఖాన్, నరసింహారెడ్డి ఆమరణ దీక్షలు మంగళవారంతో రెండవరోజు పూర్తయ్యాయి. వీరి దీక్షలకు పెద్ద ఎత్తున ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం తెలిపారు. న్యాయవాదులు, ఇండస్ట్రీయల్ అసోసియేషన్, నాయీ బ్రాహ్మణులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, సహకార ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. విచిత్ర వేషధారణలతో, ఆటపాటలతో ఆందోళన చేపట్టారు. రహదారులు భవనాలశాఖ సిబ్బంది రిలే దీక్షలను ఎస్ఈ మనోహరరెడ్డి ప్రారంభించారు. కడప నగర పాలక సంస్థ, విద్యుత్ ఉద్యోగుల రిలే దీక్షలు సాగుతున్నాయి. రెవెన్యూ ఉద్యోగుల దీక్షలకు మద్దతుగా ప్రభుత్వ చౌక దుకాణల డీలర్ల అసోసియేషన్ వారు, ఉపాధ్యాయ, ఆర్టీసీ కార్మికులు, జేఏసీ, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగుల దీక్షలు కొనసాగాయి. టీడీపీ నాయకులు అమీర్బాబు, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, సురేష్నాయుడు ఆమరణ దీక్షల్లో కూర్చొన్నారు. వీరికి టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు సంఘీభావం తెలిపారు. జిల్లా కన్వీనర్ సురేష్బాబు, మాజీ మేయర్ రవీంద్రనాథ్రెడ్డి వైఎస్ జగన్ దీక్షకు సంఘీభావంగా జాతీయరహదారులను దిగ్బంధనం చేశారు. జమ్మలమడుగులో వస్త్ర వ్యాపారులు, కిరాణా, టెంటు హౌస్, బంగారు వ్యాపారులు, విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వంటా వార్పు చేపట్టారు. విచిత్ర వేషధారణలు, ఒంటె, గుర్రంపై తిరుగుతూ నిరసన తెలిపారు. కేసీఆర్ దిష్టిబొమ్మ తల నరికారు. క్యాంబెల్ ఆస్పత్రి ఉద్యోగులు సమైక్యాంధ్రపై సదస్సు నిర్వహించారు. ఎర్రగుంట్లలో రిలే దీక్షలు సాగాయి. ఎమ్మెల్యే దేవగుడి నారాయణరెడ్డి,మాజీమంత్రి పీఆర్ సంఘీభావం తెలిపారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆర్టీపీపీలో విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో బహిరంగసభ నిర్వహించారు. ప్రొద్దుటూరులో చాపాడుకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఒలంపియాడ్, సెయింట్ మేరీస్ విద్యార్థులు రిలే దీక్షల్లో పాలుపంచుకున్నారు. రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో భారీర్యాలీ నిర్వహించారు. ఇద్దరు హిజ్రాలకు కేసీఆర్, సోనియా మాస్క్లు ధరింపజేసి వివాహం జరిపించారు. విద్యార్థులు, వైద్యులు, న్యాయవాదులు, ఎన్జీఓల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. రిక్షావాలాలు పుట్టపర్తి సర్కిల్లో మానవహారంగా ఏర్పడ్డారు. పులివెందులలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రం విడిపోతే ఏర్పడే ఇబ్బందులను వివిధ నాటకాలు, నిరసన ప్రదర్శనల ద్వారా కళ్లకు కట్టినట్లు వివరించారు. గొడుగులు, విచిత్ర వేషధారణలతో ఆందోళన చేపట్టారు. ఎన్జీఓలు రిలే దీక్షలు చేపట్టారు. వేంపల్లెలో వినూత్నంగా దున్నపోతులతో ర్యాలీ నిర్వహించారు. బద్వేలులో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఉపాధ్యాయులు నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి వినూత్న రీతిలో ర్యాలీ చేపట్టారు. పోరుమామిళ్లలో విద్యార్థుల ర్యాలీలు, మానవహారాలు కొనసాగాయి. జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. రాయచోటిలో జేఏసీ, న్యాయవాదుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు సాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు చెవిలో పూలతో పట్టణంతో ర్యాలీ చేపట్టారు. రైల్వేకోడూరులో ఐకేపీ మహిళలు భారీ ర్యాలీ చేపట్టారు. వీరికి ఉపాధి సిబ్బంది సంఘీభావం తెలిపారు. కార్మిక సంఘాలు మానవహారంగా ఏర్పడి ధర్నా చేపట్టారు. రాజంపేటలో ఉద్యోగ, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించి రిలే దీక్షలు చేపట్టారు. విద్యుత్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో మౌన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి పాత బస్టాండు కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. కమలాపురంలో ఉపాధ్యాయులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. విద్యార్థులు సమైక్యాంధ్ర ప్లకార్డులు చేతబూని పట్టణంలో ర్యాలీ చేస్తూ సమైక్య నినాదాలతో హోరెత్తించారు. మైదుకూరులో నాయీ బ్రాహ్మణులు ర్యాలీ, మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. వీరికి మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి,ఉపాధ్యాయ జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు.