responsibilities
-
ఉత్తరాఖండ్లో అమల్లోకి ఉమ్మడి పౌరస్మృతి
డెహ్రాడూన్: మతాలకతీతంగా మహిళలకు నిజమైన సాధికారతే లక్ష్యంగా, పౌరులందరికీ సమాన హక్కులు, బాధ్యతలు దఖలుపరిచే లక్ష్యంతో తీసుకొచ్చిన ఉమ్మడి పౌరస్మృతి చట్టం(యూసీసీ) ఉత్తరాఖండ్లో సోమవారం అమల్లోకి వచ్చింది. దీంతో దేశంలో యూసీసీని అమలుచేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్టులకెక్కింది. అన్ని మతాల్లో లింగభేదం లేకుండా పౌరులందరికీ ఉమ్మడి చట్టం అమలుచేయడమే యూసీసీ ముఖ్యోద్దేశం. చట్టం అమలుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మతాల వారికి ఒకే తరహా వివాహ, విడాకుల, ఆస్తుల చట్టాలు అమలవుతాయి. ఇస్లామ్ను ఆచరించే వారికి ఇకపై విడిగా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ లాంటివి చెల్లుబాటుకావు. ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ అంటూ ఏకపక్షంగా ఇచ్చే విడాకులు చెల్లవు. షెడ్యూల్ తెగలను మాత్రం యూసీసీ నుంచి మినహాయించారు. వాళ్ల గిరిజన సంప్రదాయాలు, కట్టుబాట్లను ప్రభుత్వం గుర్తించి విలువ ఇస్తుంది. సోమవారం యూసీసీ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందని డెహ్రాడూన్లోని అధికార నివాసంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. కేబినెట్ మంత్రులు, నాటి యూసీసీ ముసాయిదా కమిటీ సభ్యుల సమక్షంలో ఆయన యూసీసీ పోర్టల్ను ప్రారంభించారు. వివాహాలు చేసుకున్నా, విడాకులు తీసుకున్నా, సహజీవనం చేసినా ప్రతీదీ ఈ పోర్టల్ ద్వారా ఖచ్చితంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కోసం నమోదుచేసుకోవాల్సిందే. పెళ్లికాకుండా సహజీవనం కారణంగా పుట్టిన పిల్లలకూ వారసత్వ హక్కులు దక్కేలా యూసీసీ చట్టంలో మార్పులుచేసి అమల్లోకి తెచ్చారు. పోర్టల్ ద్వారా ముఖ్యమంత్రి ధామీ తన వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. పోర్టల్ ద్వారా జారీ అయిన తొలి డాక్యుమెంట్ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా సీఎం ధామీకి అందజేశారు. ‘‘ మతాలకతీతంగా పౌరులందరికీ యూసీసీ ద్వారా సమాన హక్కులు, బాధ్యతలు ఉంటాయి. మూడేళ్ల క్రితం యూసీసీపై మాటిచ్చా. ఇన్నాళ్లకు ఇది సాకారమైంది. ఈ ఘనత రాష్ట్ర ప్రజలదే. విభిన్న ఆచార వ్యవహారాలు, జీవనం సాగించే ఎస్టీలను యూసీసీ పరిధిలోకి తెచ్చి వారిని ఇబ్బంది పెట్టొద్దని నిర్ణయించుకున్నాం. అందుకే వారిని యూసీసీ నుంచి మినహాయించాం’’ అని సీఎం స్పష్టంచేశారు. చట్టం ప్రకారం ఇకపై ఉత్తరాఖండ్లో అన్ని మతాలకు చెందిన స్త్రీ, పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది. అన్ని మతాల్లో బహుభార్యత్వం విధానాన్ని నిషేధించారు. హలాల్ విధానాన్ని సైతం రద్దుచేశారు. ‘‘ యూసీసీ అమలుతో భారత రాజ్యాంగ చరిత్రలో మరో సువర్ణాధ్యాయాన్ని లిఖించాం’’ అని సీఎం అన్నారు. -
‘స్టార్’ హోటల్కు తెలంగాణ భవన్ బాధ్యతలు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్ నిర్మాణ బాధ్యతలను పేరు గాంచిన స్టార్ హోటల్కు అప్పగించే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉన్నట్లు సమాచారం. నిర్మాణంతో పాటు నిర్వహణను సైతం స్టార్ హోటల్ యాజమాన్యమే చూసుకునేలా చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఇటీవల మీడియాతో జరిపిన చిట్చాట్లోనే సీఎం ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు.దాదాపు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల బడ్జెట్తో నిర్మించే ఈ ఐకానిక్ భవనాన్ని దేశానికి రోల్మోడల్గా ఉండేలా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రెండు కంపెనీలు ఇచి్చన ప్రెజెంటేషన్ను రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పరిశీలించారు. వీటిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మరో డిజైన్తో రావాలని సూచించారు. అయితే ఇప్పటికే డిజైన్లను ప్రెజెంట్ చేసింది ‘స్టార్ హోటల్’కు సంబంధించిన వారా? లేక ఇతర ప్రైవేటు సంస్థలా? అనేది తేలాల్సి ఉంది. రెండుచోట్ల భవనాలు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన గత మార్చి నెలలో పూర్తి అయ్యింది. ఏపీ భవన్ మొత్తం 19.781 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ఏపీకి 11.536 ఎకరాలు, తెలంగాణకు 8.245 ఎకరాలను కేటాయిస్తూ మార్చి 15న కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీ భవన్ మొత్తం విలువ రూ.9,913.505 కోట్లు అని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించగా.. ఇందులో 3 ఎకరాల విస్తీర్ణంలో శబరి బ్లాక్, 5.245 ఎకరాల విస్తీర్ణంలో పటౌడీ హౌస్ ఉన్నాయి.శబరి బ్లాక్ ఏరియా అంతా హైదరాబాద్ హౌస్ పక్కకు ఉంటుంది. ఈ ఏరియాలోనే గవర్నర్ బ్లాక్, ముఖ్యమంత్రి బ్లాక్, రాష్ట్ర కేబినెట్ మంత్రుల బ్లాక్.. మూడూ కలిపి 5.245 ఎకరాల స్థలంలో ఒక భవనం నిర్మించనున్నారు. ఇక 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పటౌడీ హౌస్ స్థలంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉండేందుకు సౌకర్యవంతమైన భవనాన్ని నిర్మించనున్నారు. ప్రతిరోజూ 100 రూమ్లు తెలంగాణ వారికే.. దేశానికే రోల్ మోడల్గా నిలిచేలా తెలంగాణ భవన్ను తీర్చిదిద్దాలని భావిస్తున్న నేపథ్యంలోనే స్టార్ హోటల్కు నిర్మాణ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. తాజ్ గ్రూప్ లేదా ఇతర స్టార్ హోటల్ గ్రూప్కు అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. ప్రతిరోజూ ఒక వంద రూమ్లు తెలంగాణ నుంచి వచి్చన వారికి కేటాయించేలా చర్యలు తీసుకోనున్నారు. -
రేపు కేంద్రమంత్రులుగా కిషన్రెడ్డి, సంజయ్ బాధ్యతలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రుల బాధ్యతల స్వీకారానికి ముహూర్తాలు ఖరారయ్యాయి. ఈనెల 13న ఉదయం 11 గంటల కు జి.కిషన్రెడ్డి కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి గా శాస్త్రి భవన్లోని ఆ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర హోంశాఖ సహా య మంత్రిగా బండి సంజయ్ నార్త్ బ్లాక్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా రామ్మోహన్ నాయు డు, కేంద్ర సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం లేదా శుక్రవారం, శ్రీనివాస వర్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. -
జనగామ బరిలో నేనే ఉంటా
జనగామ: తెలంగాణ ఆర్టీసీ సంస్థ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినా.. జనగామలో బీఆర్ఎస్ తరపున బరిలో తానే ఉంటానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం టీఎస్ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడానికి కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి హైదరాబాద్ వెళ్లిన ముత్తిరెడ్డి.. కార్యక్రమం అనంతరం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యమని, ఆ మేరకే ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినట్లు చెప్పారు. అంతకుముందు ఆయన హైదరాబాద్లోని బస్భవన్లో ఆర్టీసీ చైర్మన్గా బాధ్య త లు స్వీకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి దేవుళ్ల చిత్రపటాల వద్ద పూజలు నిర్వహించిన అనంతరం ఫైల్పై తొలి సంతకం చేశారు. సీఎం కేసీఆర్ తనపై నమ్మకం ఉంచి అప్పగించిన ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంస్థ పురోగతికి కృషి చేస్తానన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఎండీగా ఉంటూ సంస్థను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నారని, తాను కూడా సంస్థ ఉద్యోగుల్లో ఒకడిగా వ్యవహరిస్తూ సంస్థ బాగుకు యత్నిస్తానని తెలిపారు. అనంతరం ఎండీ సజ్జనార్ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి అభినందించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ముకేశ్ అంబానీ బాటలోనే..
న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీ బాటలోనే ఆయన ఇద్దరు కుమారులు, కుమార్తె జీతాలు తీసుకోకుండా బాధ్యతలు నిర్వహించనున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు, కమిటీ సమావేశాలలో పాలుపంచుకుంటున్నందుకు ఆకాశ్, ఈషా, అనంత్ ఫీజులు మాత్రమే పొందనున్నారు. అంతేకాకుండా నికర లాభాల నుంచి కమీషన్ అందుకోను న్నారు.ముకేశ్ సంతానాన్ని బోర్డులో నియమించేందుకు వాటాదారుల అనుమతి కోరుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఈ అంశాలను వెల్లడించింది. 66ఏళ్ల అంబానీ 2020–21 ఏడాది నుంచి ఎలాంటి జీతాన్ని అందుకోవడంలేదు. అయితే అంబానీ బంధువులు నిఖిల్, హిటల్ వేతనాలతోపాటు.. ఇతర అలవెన్సులు తదితరాలను పొందుతున్నారు. (వాహన స్క్రాపేజీ పాలసీ: కంపెనీలకు నితిన్ గడ్కరీ కీలక సూచనలు) నీతా అంబానీ తరహాలో 2014లో ముకేశ్ భార్య నీతా అంబానీ ఎంపిక తరహాలోనే కవలలు 31ఏళ్ల ఆకాశ్, ఈషా సహా 28ఏళ్ల అనంత్ను ఆర్ఐఎల్ బోర్డులో నియమించనున్నారు. 2022–23లో నీతా అంబానీ రూ. 6 లక్షల సిటింగ్ ఫీజు, రూ. 2 కోట్ల కమీషన్ అందుకున్నట్లు ఆర్ఐఎల్ తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. గత నెలలో నిర్వహించిన కంపెనీ వార్షిక సమావేశంలో ఆర్ఐఎల్ బోర్డులోకి ముగ్గురునీ ఎంపిక చేశారు. అయితే ముకేశ్ ఆర్ఐఎల్ చైర్మన్, సీఈవోగా మరో ఐదేళ్లు బాధ్యతలు నిర్వహించనున్నారు. తద్వారా తదుపరితరం నాయకులకు మార్గదర్శకత్వం వహించనున్నారు. కాగా.. ముకేశ్ సంతానాన్ని బోర్డులో నియమించేందుకు వీలుగా ఆర్ఐఎల్ పోస్టల్ బ్యాలట్ ద్వారా వాటాదారుల అనుమతి కోరుతోంది. (సీఈవో సంచలన వ్యాఖ్యలు: ఉద్యోగుల నెత్తిన పిడుగు) -
కలెక్టర్ల నేతృత్వంలో వీఆర్ఏల విలీనం.. మార్గదర్శకాలు జారీ
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ)ను వివిధ ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసుకునే ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ మంగళవారం ఈ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు ఇచ్చారు. వీఆర్ఏల విలీన ప్రక్రియను జిల్లా కలెక్టర్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఖాళీల గుర్తింపు ప్రకటన నుంచి కేటాయింపు వరకు కలెక్టర్లే బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. 61 ఏళ్లు నిండితే కారుణ్య ఉద్యోగం 61 ఏళ్లు దాటిన వీఆర్ఏల కుమారుడు లేదా కుమార్తెకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేందుకు అవసరమైన మార్గదర్శకాలను కూడా ఉత్తర్వుల్లో పొందుపరిచారు. కారుణ్య ఉద్యోగం కోసం ఈ ఏడాది జూలై 31 నాటికి వీఆర్ఏ వయస్సును పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నియామకాల కోసం దరఖాస్తు ఫార్మాట్ను రూపొందించారు. దీని ప్రకారం దరఖాస్తు చేసుకోవడంతో పాటు సదరు వీఆర్ఏ కూడా అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర కుటుంబసభ్యుల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) సమరి్పంచాల్సి ఉంటుంది. పుట్టిన తేదీ, విద్యార్హత, కుల, నివాస ధ్రువపత్రాలు, ఆధార్ వివరాలను జత పరచాల్సి ఉంటుంది. ఈ కారుణ్య నియామకాల ప్రక్రియను జిల్లా కలెక్టర్లు ఈనెల ఐదో తేదీలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. వీఆర్ఏల విలీనం మార్గదర్శకాలివే.. తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్విస్ రూల్స్లోని రూల్ 10(ఏ) ప్రకారం వీఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసుకుంటారు. ఇదే నియమం ప్రకారం కారుణ్య నియామకాలు కూడా చేపడతారు. విద్యార్హతల ఆధారంగా ప్రభుత్వ శాఖల్లోని చివరి స్థాయి సర్విసు/రికార్డు అసిస్టెంట్/జూనియర్ అసిస్టెంట్ తత్సమాన హోదాల్లో వీఆర్ఏలను రెగ్యులర్ స్కేల్ ఉద్యోగులుగా తీసుకుంటారు. జిల్లాల వారీగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఆయా హోదాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు, ఆ జిల్లాలో విలీనం చేసుకోవాల్సిన వీఆర్ఏల సంఖ్యను కలెక్టర్లు ప్రకటించాలి.వాటి ఆధారంగా వీఆర్ఏల విలీనం, కారుణ్య నియామకాల కోసం అవసరమైతే రెగ్యులర్ లేదా సూపర్ న్యూమరీ పోస్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ జిల్లాలో ఉన్న ఖాళీలకు మించి వీఆర్ఏలను విలీనం చేసుకోవాల్సి వస్తే వారిని ఇతర జిల్లాలకు కూడా పంపవచ్చు. అలా పంపాల్సి వస్తే సదరు వీఆర్ఏల వివరాలను ప్రస్తుత జిల్లా కలెక్టర్ ప్రకటిస్తారు. అలా ప్రకటించిన తర్వాత సదరు వీఆర్ఏలు తమకు కేటాయించిన జిల్లా కలెక్టర్కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆ జిల్లా కలెక్టర్ వీఆర్ఏను ఏదైనా శాఖలో విలీనం చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేస్తారు. అదే జిల్లాలో సర్దుబాటు చేసినా, ఇతర జిల్లాలకు పంపినా కలెక్టర్ కేటాయింపు ఉత్తర్వులు వెలువడిన వెంటనే తహసీల్దార్లు వీఆర్ఏలను రిలీవ్ చేయాల్సి ఉంటుంది. ఏ శాఖలకు పంపితే ఆయా శాఖల సర్వీసు రూల్స్ వీఆర్ఏలకు వర్తిస్తాయి. ఒక్కసారి కేటాయించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు ఉండదు. తమను మార్చాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకునే అవకాశం కూడా ఉండదు. కేటాయింపు ఉత్తర్వులు వెలువడిన వెంటనే వీఆర్ఏలు సంబంధిత అధికారికి రిపోర్టు చేయాలి. ఆ అధికారి బేషరతుగా వారిని విధుల్లోకి తీసుకుని పోస్టింగు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. తహసీల్దార్లను వెంటనే రిలీవ్ చేయండి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మల్టిజోన్లలోని ఇతర జిల్లాలకు బదిలీ అయిన తహసీల్దార్లను వెంటనే రిలీవ్ చేయాలని సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే తహసీల్దార్లను విధుల్లోకి తీసుకోవాలని, ఈసీఐ నిబంధనలకు అనుగుణంగా డిక్లరేషన్లు కూడా పొందుపర్చాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 410 మందికి పైగా తహసీల్దార్లు గత నెల 31న బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇలావుండగా తహసీల్దార్ నుంచి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు పొందిన మరో 9 మందికి మంగళవారం పోస్టింగులిస్తూ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి హోదాలో నవీన్ మిత్తల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్
మన గతంలో చాలామంది సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తల స్టోరీల గురించి తెలుసుకున్నాం. వీరిలో చాలామంది ఆదాయంలో ఖర్చుకంటే పొదుపునకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. విలాసాలకు పోకుండా, సాధారణ జీవితాన్ని గడుపుతూనే ఎన్నో ఉన్నత శిఖరాల నధి రోహించిన వారి జర్నీల గురించి విన్నాం. ఈ లిస్ట్లో తాజాగా వీసీ మీడియా కోఫౌండర్, కంటెంట్ స్పెషలిస్ట్ సుశ్రుత్ మిశ్రా చేరారు. డబ్బును ఎప్పుడు, ఎక్కడ,ఎలా పెట్టుబడి పెట్టాలో అర్థం చేసుకోవడమే తెలివైన వ్యాపారవేత్త లక్షణం.ఎంత డబ్బు సంపాదించాం అన్నది ముఖ్యంకాదు. ఎంత పొదుపు చేయగలిగాం, పెట్టుబడి ద్వారా ఎంత రిటర్న్స్ సాధించాం అనేది ముఖ్యం. ఈ క్రమంలో సుశ్రుత్ మిశ్రా ట్వీట్ వైరల్గా మారింది. 1.7 మిలియన్ల వ్యూస్ను, 12.8 వేల లైక్స్ను సొంతం చేసుకుంది. (ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో) నెలకు 1.5 లక్షలకు పైగా సంపాదించే 23 ఏళ్ల సుశ్రుత్ మిశ్రా తనకు యాపిల్ ఐఫోన్ గానీ, కారుకానీ, కనీసం బైక్ కూడా లేదని ట్వీట్ చేశాడు. ఈ విలాసాలకంటే రిటైర్ అయిన తల్లిదండ్రులు ఆనందంగా గడిపేలా చూడటం, బిల్లులు చెల్లింపులు, భవిష్యత్తు ఎదుగుదల ప్రణాళికలే ఇందుకు కారణమని మిశ్రా చెప్పుకొచ్చాడు. కొడుకుగా అమ్మనాన్నల బాధ్యత అని తెలిపారు. దీన్ని అందరికీ తెలిసేలా గ్లామరైజ్ చేయాలనుకున్నా అంటూ ట్వీట్ చేశాడు. సుశ్రుత్ మిశ్రా లైఫ్ స్టైల్ చాలామందకి ప్రేరణగా నిలిచింది. ఇది ఇండియా స్టోరీ. 2011లో రూ. 35 వేల జీతం ఉన్నపుడు తాను కూడా ఇలాగే చేశానని ఒకరు వ్యాఖ్యానించారు. అయితే దీనిపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. (లేఆఫ్స్ సెగ: అయ్యయ్యో మార్క్ ఏందయ్యా ఇది!) తనకూ పైబాధ్యతలన్నీ ఉన్నాయి..కుటుంబ ఖర్చులు, చెల్లెలి చదువు భవిష్యత్తు పెట్టుబడులు. అమ్మ మందులు, సొంత ఇంటి కోసం పొదుపు, కొన్ని ఇతర ఖర్చులు ఇవన్నీ నా కోరికల కంటే మించినవి..కానీ బైక్, ఐఫోన్ను సొంతం చేసుకోవడం మీకెందుకు అడ్డంకిగా ఉన్నాయి? అని మరొక వినియోగదారు కమెంట్ చేశారు. కాగా కంటెంట్, మార్కెటింగ్ ఏజెన్సీ వ్యాపారాన్ని సుశ్రుత్ మిశ్రా, రోషన్ శర్మ కలిసి స్థాపించారు. (అదరగొట్టిన పోరీలు..ఇన్స్టాను షేక్ చేస్తున్న వీడియో చూస్తే ఫిదా!) I'm a 23yo with ₹1.5 lakh+ monthly income. Yet: - I don't own any 'Apple' - I don't live on my own - I don't have a bike/car Why? Responsibilities of an Indian son who: - Retired his parents - Pays all the bills - Plans for his family's future I want to glamourize this. — Sushrut Mishra (@SushrutKM) June 9, 2023 -
తెలంగాణ కాంగ్రెస్.. అన్నీ ఆ ఆరుగురే! త్వరలో జాబితా విడుదల?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్లో సంస్థాగత పని విభజన ప్రక్రియ ఊపందుకుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ఇటీవల పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన వారికి లోక్సభ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. ఒక పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్కు పూర్తి స్థాయి బాధ్యతలు పార్టీ అప్పజెప్పనుంది. వారికి తోడుగా ఇద్దరు ఉపాధ్యక్షులను కూడా నియమించనుంది. ఈ క్రమంలోనే ఏ వర్కింగ్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షులకు ఏ పార్లమెంటు నియోజకవర్గం అప్పగించాలన్న దానిపై టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇక టీపీసీసీ ప్రధాన కార్యదర్శులకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించనున్నారు. రాష్ట్రంలోని ప్రతి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ప్రధాన కార్యదర్శిని సమన్వయకర్తగా నియమించాలని, ఒక పార్లమెంటు పరిధిలోనికి వచ్చే ముగ్గురు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో పాటు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, ఇద్దరు ఉపాధ్యక్షులు కలిపి మొత్తం ఆరుగురు నాయకులను ఒక లోక్సభ నియోజకవర్గంలో రంగంలోకి దింపనుంది. ఎక్కడా సమన్వయ లోపం లేకుండా.. గాంధీభవన్ నుంచి రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ బూత్ వరకు ఎక్కడా సమన్వయ లోపం లేకుండా చూసేందుకు ఈ పని విభజన చేపడుతున్నామని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, స్థానిక నాయకులకు తోడుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పని చేస్తారని చెబుతున్నాయి. ఒకవేళ వీరిలో ఎన్నికల్లో పోటీ చేసే నేతలున్నట్టైతే వారి స్థానాలకు వెళ్లిపోతారని, మిగిలిన వారంతా ఆ పార్లమెంటు స్థానం పరిధిలోనే ఎన్నికలు పూర్తయ్యేంతవరకు పనిచేస్తారని తెలిపాయి. కిందిస్థాయి నుంచి పైవరకు అన్ని వ్యవహారాలను చక్కదిద్దే బాధ్యతతో పాటు సమన్వయం, పర్యవేక్షణ, పార్టీ కార్యక్రమాల అమలు లాంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఈ ఇన్చార్జులకు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థికి అనుగుణంగా ఎన్నికల సమయంలో పనిచేయించడంతో పాటు ఎన్నికలకు ముందు ఆ నియోజకవర్గంలో పార్టీ కేడర్ను ఉత్సాహపరిచే బాధ్యతను ఈ ఇన్చార్జులు తీసుకుంటారని, అంతర్గత సమస్యల నుంచి ఎన్నికల సంఘం సూచనల వరకు అన్ని అంశాల్లోనూ ఈ ఆరుగురు నేతలు కీలకంగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఎన్నికలు ముగిసే వరకు అక్కడే.. స్థానిక నేతలు, పార్టీ తరఫున అసెంబ్లీ.. లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో కలిసి 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంటు ఎన్నికలు ముగిసేంతవరకు ఈ ఆరుగురు నేతలు వారికి కేటాయించిన లోక్సభ నియోజకవర్గంలోనే పని చేయనున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ జాబితాను కూడా త్వరలోనే అధికారికంగా విడుదల చేయనున్నట్టు సమాచారం. -
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చెల్లుబోయిన వేణు
సాక్షి, అమరావతి: బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రిగా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం రెండో బ్లాక్లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం చెల్లుబోయిన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ ముదనూరి ప్రసాదరాజు, ఐ అండ్ పీఆర్ శాఖాధికారులు మంత్రికి అభినందనలు తెలిపారు. నేపథ్యం పేరు: చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ నియోజకవర్గం: రామచంద్రాపురం స్వస్థలం: అడవిపాలెం తల్లిదండ్రులు: సుభద్రమ్మ, వెంకన్న (లేట్) పుట్టినతేదీ: డిసెంబర్ 23, 1962 విద్యార్హతలు: బీఏ సతీమణి: వరలక్ష్మి సంతానం: కుమారులు నరేన్, ఉమాశంకర్ జిల్లా: కోనసీమ రాజకీయ నేపథ్యం: 2001లో రాజోలు జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. 2006లో తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్గా ఎన్నికయ్యారు. 2008–12లో తూర్పుగోదావరి డీసీసీ అధ్యక్షుడిగా, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. 2013లో వైఎస్సార్సీపీ కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్గా నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలుపొందారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో 2020 జూలై 24న మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రెండోసారి అవకాశం దక్కించుకున్నారు. చదవండి: (Kakani Govardhan Reddy: అన్నదాత.. వ్యవసాయశాఖ మంత్రయ్యాడు) -
ఖాకీ వనంలో ‘గోపాలుడు’
గుమ్మఘట్ట(అనంతపురం జిల్లా): క్షణం తీరిక లేని వృత్తిలో కొనసాగుతూనే పశు పోషణపై ఆసక్తి కనబరుస్తున్నారు గుమ్మఘట్ట ఎస్ఐ తిప్పయ్య నాయక్. ఇది గొప్ప అనుభూతినిస్తుందని అంటున్నారు. విధుల నిర్వహణలో ఆవుల పోషణ అడ్డంకి కాకూడదని భావించిన ఆయన.. తన స్వగ్రామంలో ప్రత్యేకంగా షెడ్ ఏర్పాటు చేసి, వాటి రక్షణ బాధ్యతలు స్వీకరించారు. తనకు ఏమాత్రం తీరిక దొరికినా.. వెంటనే స్వగ్రామానికి వెళ్లి ఆవుల మధ్య గడపడాన్ని ఆలవాటుగా చేసుకున్నారు. ఇది ఒత్తిళ్లతో కూడిన జీవితానికి ఎంతో ఉపశమనంగా ఉంటుందని పేర్కొంటున్నారు. చదవండి: AP: కొలువులు పట్టాలి పూర్వీకుల ఆస్తిగా... పామిడి మండలం పాళ్యం తండాకు చెందిన లక్ష్మానాయక్, లక్ష్మీదేవి దంపతులకు రెండో సంతానంగా తిప్పయ్య నాయక్ జన్మించారు. ఉమ్మడి కుటుంబం విడిపోతున్నప్పుడు ఆస్తుల భాగ పరిష్కారంలో భాగంగా రెండు ఆవులు తిప్పయ్య నాయక్కు వచ్చాయి. తాను పోలీసు శాఖలో సబ్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నా.. పూర్వీకుల ఆస్తిని ఎంతో అపురూపంగా చూసుకుంటూ వచ్చారు. 30కి చేరిన ఆవుల సంఖ్య.. స్వగ్రామంలో తొలుత రెండు ఆవులతో మొదలైన సంరక్షణ బాధ్యతలు.. ప్రస్తుతం 30కి చేరుకుంది. వీటి కోసం ప్రత్యేకంగా ఓ షెడ్ వేశారు. వాటి పోషణకు తన జీతం నుంచి కొంత మొత్తం వెచ్చిస్తున్నారు. దీనికి తోడు భార్య వసంత లక్ష్మి, కుమారులు ఈశ్వర నాయక్, వరప్రసాద్ నాయక్ తరచూ స్వగ్రామానికి వెళ్లి పాడి పోషణను పర్యవేక్షిస్తున్నారు. పాల విక్రయానికి దూరం మందలో పాలిచ్చే ఆవులు పదికి పైగా ఉన్నా... వీటి పాలను ఇతరులకు విక్రయించడం లేదు. మొత్తం పాలను దూడలకే వదిలేస్తున్నారు. అయితే తల్లిని కోల్పోయిన నవజాత శిశువులకు, తల్లిపాలు లేక ఇబ్బంది పడుతున్న చంటి పిల్లలకు మాత్రం ఉచితంగా అందజేస్తున్నారు. నిత్యమూ ఒత్తిళ్లతో కూడిన పోలీసు శాఖలో పనిచేస్తున్న తాను.. ఎలాంటి ఒత్తిడి లేని జీవితాన్ని గడుపుతున్నానంటే దానికి గోసంరక్షణే కారణమని ఎస్ఐ తిప్పయ్య నాయక్ చెబుతున్నారు. పాడి పోషణ ద్వారా మరో రెండు కుటుంబాలకు ఉపాధి కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు. -
Chittoor: అధికారి ఒకరే.. పోస్టులు ఐదు
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో ముఖ్యమైన 5 పోస్టులకు ఒకరే అధికారిగా ఉండడం విశేషం. ఈ ఏడాది జూన్ 30న రెగులర్ డీఈవోగా పనిచేసిన నరసింహారెడ్డి ఉద్యోగ విరమణ పొందారు. ఆ తర్వాత ఏడీ–1 గా ఉన్న శ్రీరాం పురుషోత్తంకు డీఈవోగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. అనంతరం చిత్తూరు డీవైఈవోగా మరో బాధ్యతలు చేపట్టారు. తాజాగా కార్వేటినగరం డైట్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు డైట్ కళాశాల ప్రిన్సిపల్గా ఉండే శేఖర్ పుత్తూరు డీవైఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న పురుషోత్తం కూడా పుత్తూరు డీవైఈవోగా కూడా వ్యవహరించాల్సి ఉంది. దీంతో మొత్తం ఒక అధికారి 5 పోస్టుల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదవండి: శింగనమల ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం -
8 ఏళ్లకే కుటుంబ భారం మోస్తున్న పిల్లాడు
-
బడికి వెళ్లకుంటే.. ఇంటికి వలంటీర్ వస్తారు!
అనంతపురం విద్య: విద్యార్థి క్షేమ సమాచారాలు తెలుసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. విద్యార్థులను పర్యవేక్షించేందుకు ప్రధానోపాధ్యాయులతో పాటు కొత్తగా వలంటీర్లకు బాధ్యతలు అప్పగించింది. ఇందుకోసం రోజూ విద్యార్థి హాజరును నమోదు చేసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా ‘స్టూడెంట్ అటెండెన్స్ యాప్’ను ప్రవేశపెట్టింది. ఈ యాప్లో విద్యార్థి హాజరును రోజూ నమోదు చేస్తారు. ఉదయం 11 గంటలకు జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థుల హాజరు వివరాలు డీఈఓ కార్యాలయానికి చేరతాయి. వరుసగా మూడు రోజులు వెళ్లకుంటే... జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు 5,129 ఉండగా.. 6,06,780 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థులంతా క్రమం తప్పకుండా స్కూల్కు హాజరయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్యార్థులు పాఠశాలకు హాజరై.. అభ్యసన ప్రక్రియలో పాల్గొంటున్నారా?... లేదా అని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఏ విద్యార్థి అయినా వరుసగా మూడు రోజులు పాఠశాలకు వెళ్లకపోతే... విద్యార్థి ఉంటున్న ప్రాంతంలోని వలంటీరుకు సమాచారం వెళ్తుంది. దీంతో వలంటీర్ విద్యార్థి ఇంటికి వెళ్లి ఆరా తీస్తారు. అనారోగ్యంతో బాధపడుతుంటే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి సమాచారం పంపుతారు. ఇతరత్రా కారణాలతో పాఠశాలకు గైర్హాజరైతే తల్లిదండ్రులకు సమాచారం చేరవేస్తారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే హాజరు నమోదుపై దృష్టి సారించేవారు. ఇక నుంచి ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు కూడా విద్యార్థుల హాజరును ‘స్టూడెంట్ అటెండెన్స్ యాప్’లో తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఏడాదిలో 70 శాతం హాజరు లేకపోతే ‘అమ్మఒడి ’ పథకం కూడా వర్తించదని తేల్చిచెప్పింది. దీంతో ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థుల హాజరును తప్పకుండా యాప్లో నమోదు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవీ చదవండి: Tank Bund: ఆదివారం.. ఆనంద విహారం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ -
డేటా అనలిస్టులకు ఎంఎన్సీల బంపర్ ఆఫర్స్
డేటా సైన్స్.. బిగ్ డేటా.. డేటా అనలిటిక్స్.. ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విభాగాలు! కారణం.. డేటాకు ఎనలేని ప్రాధాన్యం పెరగడమే!! నేటి ఈ కామర్స్ ప్రపంచంలో డేటా భారీగా తయారవుతోంది. ఈ డేటా తిరిగి మళ్లీ బిజినెస్ నిర్ణయాలకు దోహదపడుతోంది. విస్తృతమైన డేటాను విశ్లేషించి.. ఉపయుక్తమైన ప్యాట్రన్స్ గుర్తించి.. దాని ఆధారంగా కంపెనీలు కీలకమైన వ్యాపార నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దాంతో డేటా విశ్లేషణ నైపుణ్యం ఉన్న నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా ఐటీ, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ అభ్యర్థులకు డేటా అనలిటిక్స్ అద్భుతమైన కెరీర్ అవకాశంగా మారుతోంది. ఈ నేపథ్యంలో.. డేటా అనలిస్టుల విధులు, అవసరమైన అర్హతలు, నైపుణ్యాలు, అందుబాటులో ఉన్న ఉద్యోగావకాశాలపై ప్రత్యేక కథనం... అపరిమితమైన, విస్తృతంగా ఉండే సమాచారాన్ని బిగ్ డేటా అంటారు. ఇది చాలా సంక్షిష్టంగా ఉంటుంది. రోజురోజుకూ భారీగా పోగవుతున్న ఇలాంటి టెరాబైట్ల డేటా నుంచి బిజినెస్ నిర్ణయాలకు అవసరమైన ఉపయుక్త సమాచారాన్ని, ప్యాట్రన్స్(నమూనాలు)ను గుర్తించి,సంగ్రహించే టెక్నిక్ లేదా టెక్నాలజీనే డేటా అనలిటిక్స్ అంటున్నారు. డేటా అనలిటిక్స్ నిపుణులు.. క్లిష్టమైన భారీ స్థాయిలో ఉండే డేటాను విశ్లేషించి.. అందులోంచి ఉపయోగకరమైన సమాచారాన్ని వెలికి తీసి.. ఆయా కంపెనీలు సరైన వ్యాపార నిర్ణయం తీసుకునేలా సహకరిస్తారు. డేటా అనలిస్ట్లు డేటా సేకరణ, సంగ్రహణ, విశ్లేషణను విజయవంతంగా, ఖచ్చితత్వంతో పూర్తిచేసే నైపుణ్యాలు కలిగి ఉంటారు. సేకరణ.. విశ్లేషణ ► గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ వంటి టాప్ కంపెనీలెన్నో డేటాను భద్రపరిచేందుకు డేటా సెంటర్స్ నిర్వహిస్తున్నాయి. కస్టమర్స్ ఎలాంటి వస్తువులు కొంటున్నారు.. వేటికోసం ఆన్లైన్లో వెతుకుతున్నారు.. వారి ఆసక్తులు, అభిరుచులు.. ఇలాంటి సమాచారాన్ని సంస్థలు సేకరించి భద్రపరుస్తుంటాయి. అవసరమైనప్పుడు మళ్లీ ఈ డేటాను బయటకు తీసి.. సాంకేతిక పద్ధతుల ద్వారా విశ్లేషించి.. వినియోగదారుల అవసరాలు, అంచనాలకు తగ్గ వస్తు,సేవలను అందించేందుకు ప్రయత్నిస్తాయి. తద్వారా వ్యాపార విస్తరణలో ముందుంటాయి. ► డేటా అనలిటిక్స్ నిపుణులు.. భద్రపరిచిన డేటా నుంచి ఉపయుక్తమైన ప్యాట్రన్లను గుర్తించి విశ్లేషిస్తారు. తద్వారా కంపెనీలు మరింత సమర్థమైన వ్యాపార నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉపయుక్తమైన డేటాను గుర్తించడం, సేకరించడం, విశ్లేషించడం, విజువలైజ్ చేయడం, కమ్యూనికేట్ చేయడంతోపాటు మార్కెట్ని అధ్యయనం చేయడం బిగ్ డేటా అనలిస్ట్ ప్రధాన బాధ్యతలుగా చెప్పొచ్చు. విభిన్న నైపుణ్యాలు బిగ్ డేటా నిపుణుడు ఏకకాలంలో వివిధ పాత్రలను పోషించాల్సి ఉంటుంది. నిత్యం అధ్యయనం చేయడం.. వివిధ రంగాల్లో, వివిధ రూపాల్లో ఉన్న డేటాను సేకరించడం(డేటా మైనింగ్).. డేటాను స్టోర్ చేయడం.. అవసరమైనప్పుడు సదరు డేటాను విశ్లేషించే నైపుణ్యం ఎంతో అవసరం. వినియోగదారులను ఆకట్టుకునేలా ఓ వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో డేటా ఆధారితంగా ఆలోచించి, తార్కికంగా ప్రజెంట్ చేయగలగాలి. అందుకోసం డేటా అనలిస్టులకు సమస్యా పరిష్కార నైపుణ్యాలు ఉండాలి. వీటితోపాటు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ అండ్ డేటా ఇంటర్ప్రెటేషన్ స్కిల్స్, చక్కటి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, విభిన్న టెక్నాలజీలపై పట్టు అవసరం. ప్రోగ్రామింగ్పై పట్టు డేటా అనలిస్టులుగా పనిచేయాలంటే.. మొదట కొన్ని సాఫ్ట్వేర్ స్కిల్స్పై పట్టు పెంచుకోవాలి. ముఖ్యంగా ఎంచకున్న విభాగంలో ఏ పని చేస్తున్నారో అందుకు అవసరమైన టూల్స్పై శిక్షణ పొందాలి. సంబంధిత టూల్స్ను ముందుగానే నేర్చుకోవడం ద్వారా.. ‘ఆన్ ది జాబ్ ప్రాజెక్ట్’ను ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయగలరు. డేటా అనలిస్ట్లకు ప్రధానంగా పైథాన్, సీ++, ఎస్క్యూల్, పెర్ల్, ఆర్, జావాస్క్రిప్ట్, హెచ్టీఎంఎల్ వంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ తెలిసుండాలి. అనలిస్ట్ కావడం ఎలా ► ఐటీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథ«మెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్లో డిగ్రీ/పీజీ చేసినవారికి డేటా అనలిస్టు కెరీర్ అనుకూలంగా ఉంటుంది. ఆసక్తిని బట్టి సంబంధిత సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేసినవారు ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చినా ఈ విభాగంలో రాణించవచ్చు. ముఖ్యంగా డేటాపై ఇష్టం ఉండాలి. ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు ఎప్పటికప్పుడు మార్పులకు లోనవుతోంది. కాబట్టి మార్పులకు అనుగుణంగా సరికొత్త టూల్స్ను నేర్చుకుంటూ,అప్డేట్గా ఉండాలి. ► ప్రస్తుతం చాలామంది సాఫ్ట్వేర్ నిపుణులు తమ కెరీర్ను మార్చుకునేందుకు అవసరాన్ని బట్టి ఆయా సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేసి.. డేటా అనలిస్టులుగా రాణిస్తున్నారు. ఇందులో హడూప్ అండ్ స్పార్క్ బిగ్ డేటా ఫ్రేమ్ వర్క్స్ను కవర్ చేయడంతోపాటు రియల్ టైమ్ డేటా అండ్ ప్యారలల్ ప్రాసెసింగ్, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అండ్ స్పార్క్ అప్లికేషన్స్ ఉంటాయి. వీటిల్లో పట్టు సాధించాలంటే.. మొదట అభ్యర్థులకు కోర్ జావా, పైథాన్, ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్పై అవగాహన ఉండాలి. సర్టిఫైడ్ డేటా ఇంజనీర్ ప్రపంచ వ్యాప్తంగా డేటా అనలిస్టులకు డిమాండ్ పెరుగుతోంది. దాంతో చాలామంది సర్టిఫికెట్ కోర్సులు చేసి కెరీర్ ప్రారంభిస్తున్నారు. వాస్తవానికి డేటా అనలిటిక్స్లో రాణించాలంటే.. డేటాపై ఆసక్తితోపాటు ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకోవాలనే తపన ఉండాలి. ఐబీఎం లాంటి సంస్థలు సర్టిఫైడ్ బిగ్ డేటా ఇంజనీర్స్ కోసం ప్రత్యేకంగా మాస్టర్స్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాయి. ఇందులో భాగంగా బిగ్డేటా అప్లికేషన్స్లో హడూప్తోపాటు మ్యాప్ డిప్, హైవ్, స్క్రూప్, ఫ్రేమ్ వర్క్, ఇంపాలా, పిగ్, హెచ్బేస్, స్పార్క్, హెచ్డీఎఫ్ఎస్, యార్న్, ఫ్లూమ్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తారు. ఇలాంటి కోర్సులతోపాటు కొంత రియల్ టైమ్ అనుభవం పొందినవారు డేటా అనలిటిక్స్లో మెరుగైన అవకాశాలు అందుకునే వీలుంది. పెరుగుతున్న మార్కెట్ ప్రస్తుతం డేటా అనలిటిక్స్ అనేది చక్కటి కెరీర్గా మారింది. డేటా అనలిస్టులకు మంచి డిమాండ్ ఉంది. అలైడ్ మార్కెట్ రీసెర్చ్ ప్రకారం–డేటా అనలిటిక్స్ మార్కెట్.. 2021 చివరి నాటికి 84.6 బిలియన్ డాలర్లను చేరుతుందని అంచనా. ఇంటర్నేషనల్ డేటా కార్ప్ అండ్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం–ప్రపంచవ్యాప్తంగా ఈ రంగం 2022 నాటికి 274.3 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఒక్క అమెరికాలోనే లక్షన్నర మంది డేటా అనలిస్టుల అవసరం ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. మన దేశంలోనూ ప్రస్తుతం ఈ రంగంలో నిపుణుల కొరత ఉంది. కాబట్టి ఆయా నైపుణ్యాలు పెంచుకుంటే అవకాశాలు అందుకోవచ్చు. బిగ్ డేటా అనలిస్ట్ వేతనాలు ఏదైనా కెరీర్ ఎంచుకునే ముందు వేతనంతోపాటు భవిష్యత్ ఎలా ఉంటుందని ఆలోచిస్తారు. భవిష్యత్లోనూ డేటా అనలిస్ట్లకు చక్కటి అవకాశాలు ఉంటాయని నిపుణుల అంచనా. డేటా అనలిస్టులకు ఎంట్రీ లెవెల్లో సగటు వార్షిక వేతనం రూ.6.5 లక్షలుగా ఉంది. అనుభవం ఉన్నవారికి సుమారు రూ.10 లక్షల వరకు చెల్లిస్తున్నారు. -
ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్గా గౌతమ్రెడ్డి బాధ్యతలు
సాక్షి, విజయవాడ: ఏపీ స్టేట్ ఫైబర్నెట్ మిలిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) చైర్మన్గా పి. గౌతమ్రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన విధానాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ట్రిపుల్ ప్లే సర్వీసులు అందిస్తామని ఆయన వెల్లడించారు.ఈ సర్వీసులు తక్కువ ధరకే అందిస్తామని చెప్పారు. కేబుల్,ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. (చదవండి: టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు..) ‘‘గ్రామ, మండలస్థాయిలో అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్స్ వేస్తాం. ఫైబర్ గ్రిడ్లో 10లక్షల కనెక్షన్స్ ఉన్నాయి. త్వరలో కొత్త సెట్ టాప్బాక్స్లు తీసుకువస్తాం. రూ. 599లకే అన్ లిమిటెడ్ ప్లాన్తో నెట్ కేబుల్ ఇస్తాం. రూ.450లకే ఇంటర్నెట్ను అన్లిమిటెడ్తో ఇస్తాం. విద్యార్థుల లాప్ట్యాప్లకు ఫైబర్ గ్రిడ్ ద్వారా నెట్ ఇస్తాం. ఫైబర్గ్రిడ్లో రూ.వేల కోట్లు స్వాహా చేశారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికి తీస్తాం. సీబీఐ విచారణ కూడా చేస్తుంది.అవినీతికి పాల్పడిన ఒక్కరినీ కూడా వదలమని’’గౌతమ్రెడ్డి స్పష్టం చేశారు.(చదవండి: టీడీపీ కుటిల యత్నం!) -
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఔదార్యం
సాక్షి, తాడిపత్రి రూరల్: ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన మనసు కూడా చాలా పెద్దదేనని మరోసారి చాటుకున్నారు. తల్లి మృతి చెంది.. తండ్రి మద్యానికి బానిసై ఆలనాపాలనకు నోచుకోని చిన్నారిని అక్కున చేర్చుకున్నారు. సంరక్షణ బాధ్యతలు తీసుకుని ఆదర్శంగా నిలిచారు. తాడిపత్రి మండలంలోని పెద్దపొలమడకు చెందిన నాగలక్ష్మీ, అర్జున్రెడ్డి దంపతులకు అజయ్కుమార్రెడ్డి సంతానం. 15 రోజుల క్రితం నాగలక్ష్మి అనారోగ్యంతో మరణించింది. అప్పటికే మద్యానికి బానిసైన అర్జున్రెడ్డి కుమారుడి బాగోగులు విస్మరించాడు. దీంతో గ్రామస్తుల సహాయంతో ఇన్నాళ్లూ అజయ్ కుమార్రెడ్డి గడిపాడు. (టీడీపీ నేతల నిర్వాకం..) ఈ క్రమంలోనే కొందరు గ్రామస్తులు అజయ్ పరిస్థితిని ఎమ్మెల్యే పెద్దారెడ్డి దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన ఆయన మంగళవారం తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. అండగా ఉంటానని, బాగా చదువుకోవాలని సూచించారు. అంతేకాక ఇక నుంచి అజయ్కుమార్ రెడ్డి సంరక్షణ భాధ్యతను తానే తీసుకుంటున్నట్లు ప్రకటించారు. చిన్నారి చదువులు, జీవనానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానన్నారు. ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయంపై పెద్దపొలమడ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
ఏ వార్త అయినా ఏకపక్షంగా రాయెద్దు
-
ఏలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు రాయెద్దు
-
పని చేస్తేనే పదవి ఉంటది!
సాక్షి, హైదరాబాద్: పనిచేస్తేనే పదవి ఉంటుంది.. బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం, ఉదాసీనత ప్రదర్శించినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా, దురుసుగా ప్రవర్తించినా సస్పెన్షన్కు గురికావడం లేదా పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. మేయర్, చైర్పర్సన్, కార్పొరేటర్, కౌన్సిలర్ పదవులను ఇకపై అధికార దర్పం, దర్జా, పలుకుబడి కోసం వాడుకోవడానికి వీల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టంలో కఠిన నిబంధనలు పొందుపరిచింది. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. 120 మంది చైర్పర్సన్లు, 9 మంది మేయర్లు, 2,727 మంది కౌన్సిలర్లు, 385 కార్పొరేటర్లను ఎన్నుకోబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన వారు తమ అధికార, బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తేనే ఐదేళ్లు పదవిలో కొనసాగుతారు. ఏదైనా కారణాలతో అర్ధంతరంగా పదవి నుంచి తొలగింపునకు గురైతే .. మరో ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధాన్ని ఎదుర్కో వాల్సిందే. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం మేయర్లు/చైర్మన్లు, కార్పొరేటర్లు/కౌన్సిలర్లు తప్పనిసరిగా నిర్వహించాల్సిన బాధ్యతలు ఇవీ.. చైర్పర్సన్/మేయర్ బాధ్యతలు పట్టణం/నగరం పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ. నివాస, వాణిజ్య సముదాయాల నుంచి చెత్త సేకరణ. శాస్త్రీయ పద్ధతిలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ. గ్రీన్ సెల్ ఏర్పాటు చేసి బడ్జెట్లో 10 శాతం నిధులను మొక్కల పెంపకం కోసం కేటాయింపు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయించిన మున్సిపాలిటీలో నర్సరీలు ఏర్పాటు చేసి, మొక్కలు పెంచాలి. సొంత వార్డులో నాటిన మొక్కల్లో 85 శాతం బతికి ఉండేలా చర్యలు తీసుకోవాలి. పార్కుల అభివృద్ధి, చెరువుల పరిరక్షణ. ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాల పరిరక్షణ. ఏటా వార్షిక అకౌంట్ల ముగింపు, ఆడిటింగ్కు చర్య తీసుకోవాలి. పురపాలక ఆస్తుల అతిక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోవాలి. నీటి సరఫరా (అక్రమ నల్లాలు), వృథా నీటి ప్రవాహాన్ని నియంత్రించాలి. అవసరం ఉంటే తప్ప నీటి సరఫరా కోసం విద్యుత్ బోర్లు వాడరాదు. వర్షపు నీటి సంరక్షణతో పాటు ఈసీబీసీ ప్రమాణాలతో చల్లని పైకప్పు గల ఇంధన పొదుపు భవనాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలి. మున్సిపల్ చట్టంలో నిర్దేశించిన అధికారాలు, బాధ్యతలతో పాటు ప్రభుత్వం ఆదేశించే ఇతర అధికారాలు, బాధ్యతలను సైతం నిర్వర్తించాలి. కౌన్సిల్ సమావేశం ముగిసిన 24 గంటల్లోగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు(మినట్స్)పై సంతకం చేయాలి. నర్సరీ నిర్వహణ, మొక్కల పెరుగుదల బాధ్యత మేయర్/చైర్పర్సన్, కమిషనర్లది. నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం తీరును పరిశీలించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్స్తో ఆకస్మిక తనిఖీలు నిర్వ హించే అధికారాన్ని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. వార్డు సభ్యుల బాధ్యతలు.. వార్డులో పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ. ఇంటింటి నుంచి చెత్త సేకరణ. శాస్త్రీయ పద్ధతిలో ఘన వ్యర్థాల నిర్వహణ. చెరువుల పరిరక్షణ. నీటి సరఫరా (అక్రమ నల్లాలు), వృథా నీటి ప్రవాహాన్ని(పైపులైన్ల లీకేజీతో) నియంత్రించాలి. అవసరం ఉంటేతప్ప నీటి సరఫరా కోసం విద్యుత్ బోర్లను వాడరాదు. మున్సిపల్ గ్రీన్ యాక్షన్ ప్లాన్ ప్రకారం తమ వార్డులో మొక్కలు నాటడం, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. పట్టణాభివృద్ధిపై శిక్షణ తీసుకోవాలి. నాటిన మొక్కల్లో 85 శాతం బతికి ఉండేలా చూడాలి. నిర్లక్ష్యం, ఉదాసీనత కారణంగా ఈ శాతానికి మొక్కలు తగ్గితే వార్డు సభ్యుడిని అనర్హుడిగా ప్రకటిస్తారు. ఈ విషయంలో ప్రత్యేకాధికారి విఫలమైనా ఉద్యోగం నుంచి తొలగిస్తారు. నిర్లక్ష్యం వహిస్తే తొలగింపే.. మున్సిపల్ చట్టం నిబంధనలు, ఇతర నియమాలు, ప్రభుత్వ ఉత్తర్వులను అమలుపరిచేందుకు నిరాకరించినా/ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా బాధ్యతలు, కర్తవ్యం నిర్వహణలో విఫలమైనా మున్సిపల్ చట్టం ప్రకారం పురపాలన సక్రమంగా నిర్వహించేందుకు ప్రభుత్వం/ప్రభుత్వం నియమించిన ఇతర ఏ అధికారి జారీ చేసిన ఉత్తర్వుల అమలుకు నిరాకరించినా విధి నిర్వహణలో దుష్ప్రవర్తన కలిగి ఉన్నా.. మున్సిపల్ నిధులను దుర్వినియోగపరిచినా.. పురపాలికల బాధ్యతల నిర్వహణలో తరచూ విఫలమైనా, తన బాధ్యతలను విస్మరిస్తూ అసమర్థుడిగా తయారైనా.. ప్రభుత్వం నిబంధనల ప్రకారం వారిని పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులిస్తుంది. తొలగించడానికి ముందు సంజాయిషీ ఇచ్చుకోవడానికి అవకాశమిస్తుంది. అనర్హత పడితే మరో 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు కానున్నారు. దాడులు చేస్తే సస్పెన్షన్.. పురపాలికల అధికారులు, ఉద్యోగుల పట్ల స్థానిక కౌన్సిలర్లు, చైర్పర్సన్లు దురుసుగా ప్రవర్తించడం, దూషణలకు దిగడం, కొన్ని సందర్భాల్లో భౌతికదాడులకు పాల్పడడం వంటి ఘటనలు గతంలో చాలా చోట్ల జరిగాయి. ఇకపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే పదవి కోల్పోవాల్సిందే. ఉద్దేశపూర్వకంగా అమర్యాదగా ప్రవర్తించినా, తోటి సభ్యుడు/ఉద్యోగిపై చేయి చేసుకున్నా, ఆస్తి ధ్వంసం చేసినా, అసభ్య పదజాలం వాడినా, మున్సిపల్ సమావేశాన్ని ఆటంకపరిచినా, పురపాలిక ఆర్థిక సుస్థిరకు నష్టం కలిగించేలా అధికార దుర్వినియోగానికి పాల్పడినా సదరు చైర్పర్సన్/ వైస్చైర్పర్సన్/ వార్డు సభ్యుడిని సస్పెండ్ చేస్తూ గెజిట్ నోటీసు జారీ చేస్తుంది. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్లు తమంతట కానీ, కౌన్సిలర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కమిషనర్, ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గానీ జిల్లా కలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకోనున్నారు. సస్పెన్షన్ విధిస్తే 30 రోజుల్లోగా మున్సిపల్ ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకోవచ్చు. -
భయమెరగని బామ్మ
బెదిరిస్తే ఏమవుతుంది..? ఏమీ కాదు అలా బెదిరించిన వారే తోకముడుస్తారు.. అంటూ సమస్యల పరిష్కారానికై ముందుకు సాగుతోంది 92 ఏళ్ల ఈ చెన్నై బామ్మ. పేరు కామాక్షి. చెన్నై బెసెంట్ నగర్లో ఉంటున్న ఈ బామ్మను కలిస్తే చాలు మనం మరిచిపోయిన ఎన్నో బాధ్యతలను గుర్తుచేస్తుంది. సమస్యల పరిష్కారానికి మనమూ కదలాలనిపించేలా చేస్తుంది. ‘నేను ముసల్దానినైపోయాను. అలాగని ఇప్పుడప్పుడే ఈ లోకాన్ని విడిచివెళ్లాలనుకోవడం లేదు. నేను భోజనం చేయడానికి ఇప్పుడు నా పళ్లెంలో చాలా పనులున్నాయి. ముందు వాటి సంగతి చూడాలి’ అంటోంది కామాక్షి పాటి. చుట్టుపక్కల కాలనీవాసులే కాదు కార్పొరేషన్ అధికారులు కూడా ఆమెను చూస్తే జంకుతారు. ఆమె బాధ్యతను తెలుసుకొని ప్రేమగా పలకరిస్తారు, గౌరవిస్తారు. పరిచయం లేని వారికి కూడా మన ఇంట్లోని బామ్మలాగానే కనిపిస్తారు. అది ఎంతవరకు అంటే.. చుట్టుపక్కల ఎవరైనా పౌర ప్రమాణాల ఉల్లంఘనకు పాల్పడనంతవరకే. తెల్లవారు ఝాము నుంచి రాత్రి పది వరకు తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కామాక్షి పాటి ఏదైనా సమస్యను పరిష్కరించడానికి వెనకాడరు. ఈ వయస్సులో కూడా ఆమెకు నచ్చని ప్రభుత్వ ప్రతిపాదన ఏదైనా వస్తే దానిని నిరసిస్తూ వీధుల్లోకి వస్తారు లేదా ఆ సమస్యను పరిష్కరించడానికి ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న అధికారినైనా నిలదీస్తారు. ఇంతకీ ఈమె ఎవరంటారా .. తంజావూరులో పుట్టిన కామాక్షి పాటి బెంగుళూరులో చదువుకుంది. పెళ్లై ఢిల్లీ వెళ్లింది. ‘ఢిల్లీలో ఆ మూడు దశాబ్దాలు నా జీవితంలో ఉత్తమమైనవి. 1948లో అక్కడికి వెళ్లాను. నవజాత దేశంలో అల్లకల్లోల రాజకీయాల సమయం. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండేవి. కానీ, ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉండేవారు’ అని నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు వివరిస్తుంది. ‘1981లో తిరిగి చెన్నైకి వచ్చాను. ఇక్కడ మారిన వాతావరణం, సంస్కృతి చూసి షాక్ అయ్యాను. సర్దుబాటు చేసుకోవడానికి కొన్నాళ్లు పట్టింది’ అని చెబుతారు. అనుకోకుండా కార్యకర్తగా.. చెన్నై బెసెంట్నగర్లోని కామాక్షి ఉంటున్న ఇంటి ముందు రహదారి ఓ సమస్యగా మారింది. ప్రజలు దీనిని బహిరంగ మరుగుదొడ్డిగా ఉపయోగించేవారు. చనిపోయిన జంతుకళేబరాలను పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఖననం చేసేవారు. ఇళ్లలోని వ్యర్థాలను పోసి వెళుతుండేవారు. విసిగిపోయిన కామాక్షి పదే పదే అధికారులకు విజ్ఞప్తులు చేసేది. అధికారులు ఆ విజ్ఞప్తులను తీసుకునేవారు. కానీ, ఏదో సాకు చెప్పి అప్పటికి తప్పించుకునేవారు. ‘రహదారికి ఇరువైపులా చెట్లు ఉండాలి’ అని వారికి గుర్తు చేసేది. మూడేళ్లు నిరంతర విజ్ఞప్తులు, నిరసనల తర్వాత కార్పొరేషన్ అధికారులు రహదారిని అందంగా తీర్చిదిద్దడంతోపాటు రోడ్సైడ్ పార్క్ను నిర్మించడంతో ఆమె తన మొదటి విజయాన్ని సాధించింది. కామాక్షి పాటి: అలుపెరుగని అవిశ్రాంత కార్యకర్త ఆమె 80వ పుట్టినరోజు సందర్భంగా అప్పటి చెన్నై కమిషనర్ ఈ పార్కు ఆధునీకరణ బాధ్యతను ఆమెకు అప్పగించారు.అప్పటికి ఆమె కార్పొరేషన్ అధికారులు, స్థానిక చట్టసభ సభ్యులతో పరిచయాలను ఏర్పరుచుకుంది. కామాక్షి పర్యవేక్షణ ఎంత బాగుంటుందో 12 ఏళ్లుగా ఆమె నిర్వహిస్తున్న పార్క్ చెబుతుంది. ‘నేనెప్పుడూ అలవాటు ప్రాముఖ్యతను చెబుతాను. ఒక స్థలాన్ని పునరుద్ధరించినా, ఒకసారి శుభ్రపరిచినా అంతటితో ఏమీ ముగిసిపోదు. దానిని నిరంతరాయంగా కొనసాగించాలి. ఒక బాధ్యతగా తీసుకోవాలి’ అని ఆమె సలహా ఇస్తారు. రోడ్డు, పార్క్ పని పూర్తయింది. ఇక పౌర సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వచ్చారు కామాక్షి. బెసెంట్ నగర్లోని చుట్టుపక్కల వాసులు తమ మనోవేదనలను, పరిపాలనకు సంబంధించి సమస్యలు పరిష్కరించేలా చూడమని కామాక్షికి దగ్గరకు వచ్చేవారు. దీంతో ఆమె తరచూ సమావేశాలను ఏర్పాటు చేస్తుంది. ఆమె సాధించిన విజయాలలో బెసెంట్ నగర్ బీచ్లోని కార్ల్ జెష్మిత్ మెమోరియల్ పునరుద్ధరణ అతి ముఖ్యమైనది. శిథిలావస్థలో ఉన్న ఈ మెమోరియల్లో మద్యం సేవించడం, గోడలపై పిచ్చి రాతలు రాయడం, స్మారక చిహ్నంపై మూత్రవిసర్జన చేయడం వంటివి గమనించిన పాటి అది పూర్తిగా బాగయ్యేంతవరకు అధికారులను వదిలిపెట్టలేదు. బెదిరింపులు బేఖాతరు కామాక్షి పాటి విజయం.. రహదారులు, ష్మిత్ మెమోరియల్ పునరుద్ధరుణతో ఆగలేదు. ఫుట్పాత్లను ఆక్రమించే షాపులను అడ్డుకోవడం, కాలిబాటలను విస్తరించే విధానాల కోసం బెసెంట్ అవెన్యూలో నియమ నిబంధనలను ఏర్పాటు చేసింది. రాత్రి 10 దాటిన తర్వాత నిర్మాణ కార్యక్రమాలు ఆపాలని, పిల్లలు, వృద్ధుల నిద్రకు అవరోధం కలిగించకుండా చూడాలని కోరుతుంది. బాధ్యతాయుతమైన పౌరురాలిగా ఉండటం ఇష్టమైన కామాక్షికి అవినీతి వైఖరులకు పాల్పడే వారితో ఎప్పుడూ గొడవగానే ఉంటుంది. నా విధానాలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు ఇచ్చేవారున్నారు. కానీ, వారెవరూ ఇటువంటి బాధ్యత తీసుకోరు. వీధుల్లో చెత్త వేయద్దని నిలదీస్తే యువకులు స్పందించే తీరు బాధిస్తుంటుందని కామాక్షి తెలుపుతుంది. నిరసన తెలపడం కష్టమైన పనికాదు. ప్రతి ఒక్కరూ తమ సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకోవాలి’ అని కోరుతుంది కామాక్షి. కాటికి కాళ్లు చాపుకున్న ముసలివాళ్లు ఏం చేస్తారులే అనుకోవద్దు. తలుచుకుంటే కొండను కూడా పిండిచేయగలమని నిరూపించగలరు. ముళ్ల మార్గాలనూ నందనవనంగా మార్చగలరు. – ఆరెన్నార్ -
19 ఏళ్ల పోరాట బాట
ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో.. ఇంతవరకూ పార్టీని అన్నీ తానై నడిపించిన సోనియా గాంధీ క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతారా? లేదా ? అన్న పార్టీ శ్రేణుల సందేహాలకు తెరపడింది. తాను రిటైర్ అవుతున్నానని సోనియానే స్వయంగా ప్రకటించారు. అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నా రాజకీయాల్లో ఆమె కొనసాగుతారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. దాదాపు 20 ఏళ్లు(19 ఏళ్ల 9 నెలలు) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ అనుభవం పార్టీకి అండగా ఉంటుందని పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. అనారోగ్య కారణాలతో కొన్నాళ్లుగా సోనియా గాంధీ రాజకీయాలకు దూరంగానే ఉంటున్నా..ఆమె లేని కాంగ్రెస్ను ఊహించడం పార్టీ శ్రేణులకు కష్టమైన విషయం. అంతగా ఆమె కాంగ్రెస్లో జవసత్వాలు నింపి.. ఆ పార్టీకి పదేళ్లు అధికార పగ్గాలు కట్టబెట్టారు. సోనియా నాయకత్వంలో ఐదేళ్లకే కాంగ్రెస్ ఢిల్లీ పీఠాన్ని అధిరోహించింది. అయితే ఆ విజయం అంత సులభంగా దక్కలేదు. నిజానికి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా 20 ఏళ్లలో సోనియా ఎన్నో ఆటు పోట్లను చవిచూశారు. 1998లో ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో లోక్సభలో ఆ పార్టీ బలం 141.. అదే సమయంలో సోనియా విదేశీయతను సాకుగా చూపుతూ శరద్ పవార్, పీఏ సంగ్మా తదితరులు తిరుగుబాటు చేశారు. 1999 ఎన్నికల్లో సోనియా విదేశీ మూలాలే ప్రచారాస్త్రంగా బీజేపీ బాగా లాభపడింది. సోనియా నాయకత్వంలో 1999 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓటమిపాలైంది. కాంగ్రెస్కు కేవలం 114 సీట్లు మాత్రమే వచ్చాయి. సోనియా సమర్ధతపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. అయినా కాంగ్రెస్ పార్టీలో ఆమె స్థానం బలహీనం కాలేదు. 1999–2004 మధ్యలో లోక్సభ ప్రతిపక్ష నేతగా వ్యవహరించి రాజకీయంగా ఎన్నో అనుభవాల్ని నేర్చుకున్నారు. 1999లో చేజారిన ప్రధాని పదవి నిజానికి అధ్యక్షురాలైన ఏడాదికే సోనియాకు ప్రధాని పదవి అందినట్టే అంది చేజారిపోయింది. 1999 ఏప్రిల్ 17న వాజ్పేయి సర్కారు కూలిపోయాక సీపీఎం నేత హరికిషన్సింగ్ సుర్జీత్ చొరవతో కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగాయి. సోనియా గాంధీ రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మద్దతు ఉందని చెప్పారు. అయితే ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ తన మనసు మార్చుకోవడంతో సోనియా అంచనాలు తప్పాయి. దీంతో తమకు బలం లేదని ఆమె రాష్ట్రపతికి చెప్పాల్సి వచ్చింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమి విజయంతో సోనియానే ప్రధాని అని భావించారు. విదేశీ వనిత అంటూ విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె మనసు మార్చుకున్నారు. అదే సమయంలో తనకు అనుకూలంగా ఉండేలా మన్మోహన్ సింగ్ను ప్రధాని పదవికి ఎంపికచేసి తన పట్టు చేజారకుండా చూసుకున్నారు. పదేళ్ల యూపీఏ సర్కారు సమయంలో జాతీయ సలహా మండలి(ఎన్ఏసీ) అధ్యక్షురాలిగా సోనియా పనితీరు ప్రశంసలు అందుకుంది. ఉపాధి హామీ వంటి కీలక చట్టాల రూపకల్పనలో ముఖ్య పాత్ర పోషించారు. అదే సమయంలో మన్మోహన్ సింగ్ను అడ్డుపెట్టుకుని కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నడిపించారన్న అపవాదును మూటగట్టుకున్నారు. సోనియా రిటైర్మెంట్! రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే ముందురోజు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా కీలకవ్యాఖ్యలు చేశారు. రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది? అని శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘నా పాత్ర రిటైర్ కావడమే’ అని అన్నారు. గత కొన్నేళ్లుగా పార్టీకి సంబంధించిన ముఖ్య నిర్ణయాలు తీసుకోవడంలో రాహుల్ కీలక పాత్ర పోషించారన్నారు. సోనియా అధ్యక్షురాలిగా మాత్రమే తప్పుకుంటున్నారనీ, రాజకీయాల నుంచి కాదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా చెప్పారు. సోనియా ఆశీస్సులు కాంగ్రెస్కు ఎల్లప్పుడూ ఉంటాయనీ, ఆమె మార్గదర్శకత్వంలో పార్టీ ముందుకు సాగుతుందని ట్వీటర్లో వెల్లడించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగే కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్గా ఎన్నికైనట్లు రాహుల్ సర్టిఫికెట్ అందుకోనున్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వీరీ వీరీ గుమ్మడి పండు.. వీరి జాడేది?
► జిల్లా సమస్యలు గాలికొదిలేసిన మంత్రులు ► ‘వంశధార’ భగ్గుమంటున్నా కనిపించని కలమట ► అధికార పార్టీ ఎమ్మెల్యేలకు నంద్యాలే ముద్దు! ► అక్కడే ఎన్నికల ప్రచారంలో బిజీ పొలం మడుల్లో నిర్వాసితులు రక్తాశ్రువులు చిందిస్తున్నారు. అమాత్యులకు వారి కన్నీరు కనిపించడం లేదు. సాయం అందడం లేదంటూ వందలాది మంది నిస్సహాయంగా రోదిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు వారి రోదన వినిపించడం లేదు. గడప దాటడానికి పోలీసుల అనుమతి కావాలని ఆంక్షలు పెట్టి హక్కులు కాలరాస్తుంటే.. ‘మీ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ అని చెప్పిన నాయకుడు ఏ దిక్కున ఉన్నాడో కానరావడం లేదు. వంశధార నిర్వాసితుల బాధలు పట్టని టీడీపీ నేతలు నంద్యాల ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నారు. పోలీసులు లాఠీలతో తలలు పగలగొడితే నేతలు తమ నిర్లక్ష్యంతో నిర్వాసితుల గుండెలు బద్దలుగొడుతున్నారు. సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: వారం రోజులుగా వంశధార భగ్గుమంటుంటే జిల్లా మంత్రులు అచ్చెన్నాయుడు, కళావెంకటరావే కాదు స్థానిక ఎమ్మెల్యే కలమట వెంకటరమణ సహా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ‘నంద్యాల ఎన్నికలే’ ప్రధానమయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరి నిర్వాసితుడు వరకూ పరిహారం చెల్లించాకే వంశధార ప్రాజెక్టు పనులు పునఃప్రారంభిస్తామని గత జనవరి నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా జిల్లాకు చెందిన అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతూ వచ్చారు. జనవరి 22వ తేదీన జరిగిన విధ్వంసం ఒక దురదృష్టకర సంఘటన అని, నిర్వాసితులకు క్షమాపణ చెబుతున్నానని ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతీ అందరికీ తెలుసు. ఇదంతా చూసి... తమ సమస్యలు పరిష్కారమవుతా యని నిర్వాసితులు ఆశపడ్డారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వారి మాటలు నీటిమూటలేనన్న విషయం గ్రహించారు. యూత్ ప్యాకేజీ ఇస్తామంటూ ఊరించినా ఆ జాబితాలో అర్హుల కంటే అధికార పార్టీ నాయకులు, వారి అనుచరుల పేర్లే ఎక్కువగా ఉండడంతో అసలు విషయాన్ని తెలుసుకున్నారు. దీంతో ఈనెల 2వ తేదీన హిరమండలం వద్ద స్పిల్ వే, హెడ్ రెగ్యులేటరీ పనులను నిర్వాసితులు అడ్డుకున్నారు. తాము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, తమ సమస్యలు పరిష్కరించిన తర్వాతే పనులు చేసుకోవాలని కాంట్రాక్టర్లకు తెగేసి చెప్పారు. దీంతో పనులు నిలిచిపోయాయి. కనిపించని కలమట... నిర్వాసితులే తనకు ముఖ్యమని ఇన్నాళ్లూ ఊకదంపుడు ప్రసంగాలిచ్చిన ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఇప్పుడు కనిపించకుండా పోయారు. నిర్వాసితుల సమస్యలు నెలకొన్న హిరమండలం, కొత్తూరు మండలాలు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాతపట్నం నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిరోజుల్లో నిర్వాసితుల సమస్యను తనకు అనుకూలంగా మలచుకోవడంలో ఆయన విజయవంతమయ్యారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ప్రాజెక్టు వద్ద ఆమరణ దీక్షకైనా సిద్ధమని, అప్పటికీ ఫలితం లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. తీరా టీడీపీలోకి ఫిరాయించిన తర్వాత ఆయన వైఖరిలో మార్పు వచ్చిందని నిర్వాసితులు వాపోతున్నారు. తమ భయాన్ని ఆయన ‘క్యాష్’ చేసుకున్నారనే విమర్శలు వారి నుంచి వినిపిస్తున్నాయి. వంశధార నిర్వాసితుల ఆందోళన మళ్లీ ప్రారంభమయ్యేసరికి ఎమ్మెల్యే కలమట నంద్యాల ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఆయనకు పార్టీ అధినేత నంద్యాల 20వ వార్డు బాధ్యతలు అప్పగించడంతో దాన్ని సాకుగా చూపించి నిర్వాసితులకు ముఖం చాటేశారనే ఆరోపణలు ఉన్నాయి. తూతూమంత్రంగా సమీక్ష... నంద్యాల బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబే ఈనెల 6వ తేదీన స్పందించి కలమటను వంశధార ప్రాజెక్టు వద్దకు వెళ్లాలని ఆదేశించారనే ప్రచారం జరిగిం ది. తీరా నిర్వాసితుల దగ్గరకు వెళ్లాల్సిన కలమట.. 7వ తేదీ సాయంత్రం జిల్లా కలెక్టరేట్లో కలెక్టరు, ఎస్పీల సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి నిర్వాసితుల్లో తమ అనుచరులనే ఈ సమావేశానికి రప్పించి తూతూమంత్రంగా ముగించారు. ఆ తర్వాత నిర్వాసిత గ్రామాలకు వెళ్లకుండా సొంతూరు కొత్తూరు దగ్గరి మాతలలో ఒక్కరోజు గడిపి మళ్లీ నంద్యాల తిరిగి వెళ్లిపోయారు. ఈ తర్వాత కాలంలో పోలీసు బలగాలను భారీ సంఖ్యలో మోహరించి నిర్వాసితుల పొలాలను ధ్వంసం చేస్తున్నా ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదు. మూడు రోజులు వేచిచూసినా కలమట నుంచే కాదు జిల్లాకు చెందిన మంత్రులు, అధికార పార్టీకి మరే నాయకుల నుంచి భరోసా లేకపోయింది. దీంతో చివరకు ఈనెల 16వ తేదీన నిర్వాసితులే పొలాలను ధ్వంసం చేస్తున్న పొక్లెయిన్లను అడ్డుకున్నారు. కొంతమంది ఆవేశంతో పొక్లెయిన్ అద్దాలను పగులగొట్టారు. నిలువరించడానికి వచ్చిన పోలీసులపై బురద, రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. చేతికి దొరికిన నిర్వాసితులను మహిళలను సైతం చితక్కొట్టి వ్యానుల్లోకి ఎక్కించారు. తర్వాత మహిళలను వదిలేసినా మిగతా 28 మందిపై కేసులు బనాయించారు. నిందితులైన నిర్వాసితులు ప్రస్తుతం రిమాండులో ఉన్నారు. నిర్వాసితులపై కేసులు... పొక్లెయిన్లను అడ్డగించిన నిర్వాసితులపై హిరమండలం పోలీసుస్టేషన్లో కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ప్రమాదకరమైన ఆయుధాలతో దాడి చేసి గాయపర్చడం, చట్టాన్ని ఉల్లంఘిస్తూ అడ్డగించడం, ప్రభుత్వాస్తుల ధ్వంసం వంటి నేరాలు మోపారు. ఈ కేసుల్లో ఇప్పటికే అరెస్టయిన 28 మందే గాకుండా మరికొంత మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నిందితుల్లో ఎక్కువ మంది గార్లపాడు, పాడలి, దుగ్గుపురం, తులగాం నిర్వాసిత గ్రామాలకు చెందిన వారు. ఈ దాడి ఘటన తర్వాత అదనంగా బలగాలను రప్పించి నిర్వాసిత గ్రామాలకు సమీపంలో పోలీసులు మోహరించారు. నిత్యావసర సరుకుల కోసమో, మరేదైనా అవసరానికో ఊళ్ల నుంచి వచ్చిన నిర్వాసితులను ఆరా తీస్తున్నారు. వారి ఫోన్లతో నిర్వాసిత నాయకులకు, కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి ఫోన్ చేయిస్తున్నారు. సిగ్నల్స్ ఆధారంగా వారికి వల వేయాలనే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమయ్యారు. నిర్వాసితులను పరామర్శించడానికి జిల్లా కేంద్రం నుంచి వెళ్లాలనుకున్న విపక్ష నాయకులను, న్యాయవాదులను ఎక్కడికక్కడకే పోలీసులు నిలువరిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల తీరిదీ.. జిల్లా మంత్రిగా ఇటీవల వరకూ జలవనరుల శాఖ, వంశధార అధికారులు, రెవెన్యూ అధికారులతో వరుస సమీక్షలతో హడావుడి చేసిన కింజరాపు అచ్చెన్నాయుడు నెల రోజులుగా కర్నూలు జిల్లాలో నంద్యాలకే పరిమితమైపోయారు. గత నెల 30వ తేదీన టెక్కలిలో పోలీసు సర్కిల్ కార్యాలయం ప్రారంభానికి, మళ్లీ ఈనెల 9వ తేదీన పాతపట్నంలో జరిగిన గిరిజన ఉత్సవానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోయారు. కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్నంత మాత్రాన నంద్యాల ఎన్నికలపై దృష్టి పెట్టి సొంత జిల్లా ప్రజల సమస్యలను గాలికొదిలేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాకు మరో మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు తొలినుంచీ వంశధార నిర్వాసితుల సమస్యలు పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా నెలలో రెండు రోజులు రాజాంలో క్యాంపు కార్యాలయానికి లేదా ఎచ్చెర్లలో మరేదైనా కార్యక్రమానికి తప్పితే మరో సమస్యలను పట్టించుకున్న దాఖలాల్లేవు. ఈనెల 1వ తేదీకే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఇక్కడే తరగతులు నిర్వహిస్తామని ఏడాది క్రితం నుంచి ఊదరగొట్టినా చివర్లో చేతులెత్తేశారనే విమర్శలు వినపిస్తున్నాయి. ఇప్పుడు ట్రిపుల్ ఐటీ కన్నా కాకినాడ నగరపాలక సంస్ ఎన్నికలపైనే ఆయన దృష్టి పెట్టారు మరి! జిల్లాలో మరో ముఖ్య నాయకుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ కూడా నంద్యాల ఎన్నికల ప్రచారంలోనే తలమునకలై ఉన్నారు. ఆయన హామీ ఇచ్చిన ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం ఎంతవరకూ వచ్చిందో రైతులకే ఎరుక! ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందా ళం అశోక్ కూడా కొద్దిరోజులుగా విజయవాడ, నంద్యాల మధ్య చక్కర్లు కొడుతున్నారే తప్ప కిడ్నీవ్యాధిగ్రస్తుల సమస్యలను పట్టించుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏవో కొన్ని కారణాల రీత్యా పలాస ఎమ్మెల్యే జీఎస్ఎస్ శివాజీ, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ప్రస్తుతానికి జిల్లాలోనే ఉండిపోయారు. -
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
ఫ్యాక్షన్, మట్కా, పేకాట, బెట్టింగ్ అణిచివేతకు కృషి నూతన ఎస్పీ జీవీజీ అశోక్కుమార్ అనంతపురం సెంట్రల్ : జిల్లాలో ప్రణాళికా బద్ధంగా పనిచేసి శాంతిభద్రతలను పరిరక్షిస్తానని నూతన ఎస్పీ గోరంట్ల వెంకటగిరి అశోక్కుమార్ తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉదయం 10 గంటల సమయంలో పోలీసు కార్యాలయంలోని ఆయన చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అశోక్కుమార్ మాట్లాడారు. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతమిదేనని చెప్పారు. ఈ ఏడాది పంటలు బాగా పండి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ జిల్లాకు ఎస్పీగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ జిల్లాలో మొదటి నుంచి ఫ్యాక్షన్ , భూ తగాదాలు ఎక్కువేనన్నారు. అలాంటి గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని తెలిపారు. జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మట్కా , పేకాట, క్రికెట్ బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో జిల్లా 7వ స్థానంలో ఉందని, ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. మైనర్ బాలికల మిస్సింగ్ కేసులు అధికంగా ఉన్నాయని నివేదికలను బట్టి తెలుస్తోందని, కారణాలను అన్వేషించి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రజలతో పోలీసులు సఖ్యతగా మెలిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో పోలీసు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని, వాటిని కొనసాగిస్తూనే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. టెక్నాలజీ సహాయంతో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మాల్యాద్రి, డీఎస్పీలు, సీఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
డీడీఏగా శ్రీనివాసులు బాధ్యతల స్వీకరణ
అనంతపురం అగ్రికల్చర్ : వ్యవసాయశాఖ జేడీ కార్యాలయంలో డీడీఏగా శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆయన కర్నూలు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారు. అగ్రానమీ డీడీఏగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులకు ఆశాఖ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జేడీఏ పీవీ శ్రీరామమూర్తిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. -
బాధ్యత మరిచిన పార్టీలు
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నాక కేంద్ర ప్రభుత్వం అందుకు ఎన్నెన్నో కారణాలు చెప్పింది. నల్లడబ్బు అంతుచూడటం మొదలుకొని నగదు రహిత ఆర్ధిక వ్యవస్థ వరకూ ఆ జాబితాలో ఎన్నెన్నో ఉన్నాయి. మిగిలినవాటి సంగతలా ఉంచి అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో పార్టీలు మితిమీరి చేసే వ్యయం, అందుకోసం భారీ మొత్తంలో ఆ పార్టీలు సేకరిస్తున్న విరాళాలు నల్లడబ్బు మహమ్మారిని నానాటికీ పెంచుతున్నాయని తెలియనిదేమీ కాదు. పెద్ద నోట్ల రద్దు సమయంలో నల్లడబ్బు గురించి అంతగా హోరెత్తించినందుకైనా ఇతర పార్టీలకు ఆదర్శ ప్రాయంగా ఉండాలని బీజేపీ అనుకోలేదు... తామే ఆ విషయంలో మెరుగ్గా ఉన్నామని చాటుకునేందుకు మరో ప్రధాన పక్షం కాంగ్రెస్ ప్రయత్నించలేదు. ఎన్నికల సంఘానికి అక్టోబర్ 30లోగా తమ తమ జమాఖర్చుల నివేదికలను సమర్పించాల్సి ఉన్నా ఈ రెండు ప్రధానపక్షాలతో పాటు మరికొన్ని పార్టీలు కూడా ఇంతవరకూ ఆ పని చేయలేదంటే నల్లడబ్బు నిర్మూలన విషయంలో వాటి చిత్తశుద్ధి ఏపాటో అర్ధమవుతుంది. దేశంలోని స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి విరాళాలు తీసుకుంటూ ఆ లెక్కల్ని సమర్పించడంలేదని కేంద్ర ప్రభుత్వం వాటిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. గ్రీన్పీస్తో సహా దాదాపు 10,000 సంస్థల లైసెన్స్లు రద్దు చేసింది. వాటి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. కానీ తమ పార్టీ జమాఖర్చుల్ని గడువులోగా ఎన్నికల సంఘానికి సమర్పించాలన్న స్పృహ ఎన్డీఏ సర్కారుకు నేతృత్వం వహిస్తున్న బీజేపీకి కొరవడింది. నల్లడబ్బు కారణంగా దేశం ఎలా నాశనమైపోతున్నదో చెప్పడానికి మన నేతల్లో చాలామంది ఉబలాటపడతారు. తమకు అధికారం అప్పగిస్తే దాని సంగతి తేలుస్తామని ఎన్నికల ప్రచారంలో చెబుతుంటారు. అయితే నాయకులకు దగ్గర్లో మైకు లేనప్పుడో, అనుకోకుండా వారు నోరు జారినప్పుడో మాత్రమే నికార్సయిన నిజం వెల్లడవుతుంది. నాలుగేళ్ల క్రితం బీజేపీ సీనియర్ నేత స్వర్గీయ గోపీనాథ్ ముండే ఒక సెమినార్లో ఎన్నికల ఖర్చు నానాటికీ ఎలా పెరుగుతూ పోతోందో సోదాహరణంగా వివరించారు. 1980 అసెంబ్లీ ఎన్నికల్లో తాను కేవలం రూ. 29,000 మాత్రమే ఖర్చు చేశానని... 2009 లోక్సభ ఎన్నికలకు రూ.8 కోట్లు వ్యయం చేయాల్సివచ్చిందని చెప్పారు. సరిగ్గా ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సైతం నోరు జారారు. ఎన్నికల వ్యయం తడిసి మోపెడవుతున్నదని ఒక చానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో చెబుతూ 2014 ఎన్నికల్లో తనకు రూ.11.5 కోట్లు ఖర్చయిందని చెప్పారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం ఎన్నికల్లో నిజంగా ఖర్చుచేసిన మొత్తాన్నే ఏ అభ్యర్థి అయినా వెల్లడించాల్సి ఉంటుంది. అలా వెల్లడించలేదని రుజువైతే చట్టసభ సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ముండే అయినా, కోడెల అయినా ఎన్నికలైన తర్వాత ఈసీకి సమర్పించిన వ్యయ నివేదికల్లో నిజాలే వెల్లడించి, పర్యవసానాలకు సిద్ధపడి ఉంటే వారి నిజాయితీని అందరూ కొనియాడేవారు. కానీ ఆ వ్యయ నివేదికల్లో మాత్రం నిబంధనల పరిమితుల్లోనే ఖర్చు చేశామని తెలిపి, అనంతర కాలంలో వేరే లెక్కలు చెప్పడంపైనే అందరికీ అభ్యంతరం. ముండే, కోడెల ఇద్దరూ తమ ప్రకటనలు సృష్టించిన వివాదాలకు జడిసి మేం చెప్పింది అది కాదని ఆ తర్వాత సర్దుకున్నారు. అది వేరే విషయం. సాధారణంగా ఎన్నికల సమయంలో పార్టీలు, అభ్యర్థులు చేసే వ్యయమంతా నగదుగానే తప్ప చెక్కుల రూపంలో ఉండదు. చాలా రాష్ట్రాలు నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించడానికి కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని అక్కడ కార్డు చెల్లింపులను, చెక్కు లావా దేవీలను ప్రోత్సహిస్తున్నాయి. ఆ ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తున్న పార్టీలు ఇదే నిబంధనను తమ ఖర్చులకు, తమ అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయానికి వర్తింపజేస్తాయా? అలా చేస్తే నల్లడబ్బు చాలా భాగం తగ్గిపోతుంది. పార్టీలు, నాయకులు చెప్పే లెక్కలకూ, చేసే ఖర్చులకూ పొంతన ఉండదన్నది ఇవాళ బహిరంగ రహస్యం. నిబంధనలను పాటించి ఆడిట్ చేయించిన జమా ఖర్చుల నివేదికల్ని గడువులోగా సమర్పించాలన్న కనీస స్పృహ వాటికి లేకపోవడమే విషాదం. ఇలా నిబంధనల పాటింపుతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీలకు అనేక రాయితీలు, మినహాయింపులు లభిస్తున్నాయి. రూ.20,000కు మించిన విరాళాలకు మాత్రమే పార్టీలు లెక్కలు చెప్పాల్సి ఉంటుందన్నది అలాంటిదే. ఈ నిబంధన సాకుతో చాలా రాజకీయ పార్టీలు తమకొచ్చే నిధులకు లెక్క చెప్పడంలేదు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఒకపక్క సాధారణ పౌరుల ఖాతాల్లో అధిక మొత్తంలో డబ్బు జమ అయితే దర్యాప్తు చేస్తామన్న కేంద్రం... ఐటీ చట్టం నిబంధన ప్రకారం రాజకీయ పార్టీలకు మాత్రం దీన్నుంచి మినహాయింపు ఉంటుం దని చెప్పడం అందరికీ గుర్తుంది. ఈ ప్రకటన కల్లోలం రేపాక కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్జైట్లీ సర్దుకున్నారు. ఐటీ చట్టానికి తాజా సవరణ తర్వాత ఆ మినహాయింపు పోయిందన్నారు. నిబంధనలను బేఖాతరు చేస్తున్న పార్టీలకు మినహాయింపు ఎందుకివ్వాలన్నదే సామాన్యుల ప్రశ్న. దానికి జవాబిచ్చేవారు లేరు. విరాళాలకు సంబంధించి ఉన్న పరిమితిని అడ్డం పెట్టుకుని రాజకీయ పార్టీలు అనేక రకాల విన్యాసాలు చేస్తున్నాయి. ఉదాహరణకు 2015-16లో బీఎస్పీకొచ్చిన మొత్తం ఆదాయమంతా రూ. 20,000 చొప్పున విడివిడిగా విరాళాల రూపంలో వచ్చిందే. వాస్తవానికి బీజేపీ, కాంగ్రెస్తోసహా ప్రధాన పార్టీలన్నీ నిబంధనలను అడ్డం పెట్టుకుని తమకొచ్చే నిధుల్లో 70 శాతం మొత్తానికి లెక్కలు చెప్పడంలేదు. ఆ విరాళాలు ఎవరిచ్చారో వెల్లడించడంలేదు. అసెంబ్లీ ఎన్నికలకు రూ. 28లక్షలు, లోక్సభ ఎన్నికలకు రూ. 70 లక్షలు మించి వ్యయం చేయడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నా... పార్టీల ఆదాయానికీ, వ్యయానికీ మాత్రం ఎలాంటి పరిమితులూ విధించడం లేవు. ఇలాంటి లొసుగుల వల్లే నల్లడబ్బువేళ్లూనుకుంటోంది. విస్తరిస్తోంది. ప్రధాన పార్టీలైనా పారదర్శకతతో, జవాబు దారీ తనంతో నిబంధనలు పాటించడం నేర్చుకుంటే అందరికీ ఆదర్శప్రాయమవుతాయి. -
ప్రతి విద్యార్థికి రాయడం.. చదవడం రావాలి
కడప : గ్రామీణ ప్రాంత పాఠశాలలోని ప్రతి విద్యార్థికి రాయడంతోపాటు చదవటం రావాలని అందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆర్జేడీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ ఆర్జేడీగా విధులను నిర్వహిస్తూ గత నెల 31న ప్రేమానందం పదవీ విరమణ చేసిన విషయం విదితమే. ఆయన స్థానంలో కృష్ణా జిల్లా డీఈఓగా పనిచేస్తున్న సుబ్బారెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నాలుగు జిల్లాలలో విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వం నిర్వహించనున్న సమగ్ర నిరంతర విద్యా విధానానికి పిల్లలను సంసిద్ధులను చేయాలన్నారు. -
కార్పొరేట్ వారసులకూకోట్లలో వేతనాలు
బాధ్యతలు అప్పగించగానే ప్యాకేజీలు న్యూఢిల్లీ: వస్తూ వస్తూనే కోటీశ్వరుల క్లబ్లో చేరిపోతున్నారు ప్రముఖ వ్యాపారవేత్తల వారసులు. అంబానీల నుంచి అదానీల వరకు, ప్రేమ్జీ నుంచి ఖొరాకివాలా వరకు దేశంలో కుటుంబాల ఆధ్వర్యంలో నడుస్తున్న పలు ఇతర వ్యాపార సంస్థల్లో చేరిన తదుపరి తరం నాయకులు వేతనాలు, పారితోషికాల రూపంలో అప్పుడే కరోడ్పతి క్లబ్లో చేరిపోయారు. చాలా మంది తమ కుమారులు, కుమార్తెలను తమ వారసులుగా కీలక బాధ్యతల్లోకి తీసుకొస్తున్నారు. కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా వారికి మంచి ప్యాకేజీలనే ఫిక్స్ చేసేస్తున్నారు. అదానీ వారసుడికి రూ.కోటిన్నర ⇔ అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ కుమారుడు కరణ్... అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ సీఈవోగా నియమితులయ్యారు. 2015-16లో ఎలాంటి వేతనాన్నీ అందుకోలేదు. అయితే, వేతనం, ఇతర పారితోషికాలు, ప్రయోజనాల రూపంలో కరణ్కు రూ.1.5 కోట్లను ఈ సెప్టెంబర్ 1 నుంచి చెల్లించేందుకు బోర్డ్ ఆమోదం తెలిపింది. అనుమోల్ అంబానీకి రూ.1.2 కోట్లు ⇔ అనిల్ అంబానీ కుమారుడు జై అనుమోల్ అంబానీ (24) ఇటీవలే గ్రూపు కంపెనీ రిలయన్స్ కేపిటల్లో డెరైక్టర్గా చేరిపోయారు. ఆయనకు నెలకు రూ.10 లక్షల చొప్పున వేతనాన్ని చెల్లించేందుకు కంపెనీ ప్రతిపాదించింది. వేతనానికి అదనంగా అలవెన్స్లు, కమీషన్లు, ఇతర ప్రతిఫలాలు కూడా అందించేందుకు బోర్డు సుముఖత చూపింది. ముకేశ్ వారసుల సంగతో...? ⇔ దేశీయ సంపన్నుడిగా వెలుగుతున్న ముకేశ్ అంబానీ వారసులు గ్రూపు కంపెనీల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. కుమార్తె ఇషా, ఆకాష్ జియో వెనుకనున్న విషయం తెలిసిందే. అయితే, వీరి వేతనాల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. టీవీఎస్ వారసుడికి రూ.10 కోట్లు ⇔ టీవీఎస్ మోటార్స్ ఎండీ వేణు శ్రీనివాసన్ కుమారుడు సుదర్శన్ వేణు జాయింట్ ఎండీగా గత ఆర్థిక సంవత్సరానికి రూ.9.59 కోట్లు అందుకున్నారు. ఇతర వారసుల వేతనాలు ⇔ ఐటీ కంపెనీ విప్రో చైర్మన్ ప్రేమ్జీ కుమారుడు రిషద్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్, ఈడీగా ఉన్నారు. 2015-16లో ఆయన వేతనం రూ.2.15కోట్లు. ⇔ ఫార్మా కంపెనీ వోకార్డ్ చైర్మన్ హబిల్ ఖొరాకివాలా వేతనం 1.32 కోట్లు. కంపెనీలో ఈడీ, ఎం డీలుగా ఉన్న ఆయన కుమారులు హుజైఫా, ముర్తజాల వేతనం రూ.1.32 కోట్ల చొప్పున ఉంది. ⇔ మరో ఫార్మా కంపెనీ సిప్లా చైర్మన్ వైకే హమీద్ మేనకోడలు సమీనా వజిరల్లి 2015-16లో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్గా రూ.2.47 కోట్ల వేతనాన్ని తీసుకున్నారు. అయితే, ఆమె ఈ నెల 1 నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా ప్రమోట్ అయ్యారు. ⇔ డీఎల్ఎఫ్ చైర్మన్ కేపీసింగ్ కుమారుడు రాజీవ్ సింగ్ కంపెనీ వైస్ చైర్మన్గా తీసుకున్న వేతనం రూ.4.42 కోట్లు. -
ఐసీఎస్ఐ కార్యదర్శిగా దినేశ్ చంద్ర అరోరా
హైదరాబాద్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) కార్యదర్శిగా దినేశ్ చంద్ర అరోరా బాధ్యతలు స్వీకరించారు. చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీల్లో అర్హత సాధించిన దినేశ్చంద్ర... ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ వంటి తదితర రంగాలకు చెందిన పలు కంపెనీల్లో పనిచేశారు. అరోరాకు బిజినెస్ ప్రణాళికల రూపకల్పన, వ్యాపార వ్యూహరచన, బడ్జెటింగ్, నిధుల సమీకరణ, ప్రైవేట్ ఈక్విటీ మేనేజ్మెంట్, ట్యాక్స్ ప్లానింగ్, లీగల్ డ్రాఫ్టింగ్, రిస్క్ మేనేజ్మెంట్ తదితర అంశాల్లో మంచి అనుభవముంది. -
బాధ్యతలు తీసుకున్న గోయెల్
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా విజయ్ గోయెల్ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా గోయెల్కు క్రీడా మంత్రిత్వశాఖను కేటాయించారు. ఈయన వాజ్పేయి హయాంలోనూ క్రీడా శాఖ మంత్రిగా పనిచేశారు. రియోలో భారతీయ భోజనం భారత ఆటగాళ్ల కోరిక మేరకు రియోలో అథ్లెట్లందరికీ భారతీయ వంటకాలను అందిస్తారని క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ‘రియో గేమ్స్ అధికారిక ఫుడ్ మెనూలో భారతీయ వంటకాలను భాగం చేసినట్లు రియో ఒలింపిక్స్ ఆర్గనైజర్స్ నుంచి స్పష్టత వచ్చింది. ఈ మెగా ఈవెంట్ పూర్తయ్యేవరకు క్రీడా గ్రామంలో భారతీయ భోజనం అందుబాటులో ఉంటుంది’ అని క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవ్ యాదవ్ స్పష్టం చేశారు. -
రాష్ట్రపతిగా ప్రణబ్ @ మూడేళ్లు
న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ పదవీబాధ్యతలు చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్లో కేంద్రమంత్రులకు ఆయన విందు ఇవ్వనున్నారు. మంత్రులతోపాటు అతిథులు ఈ విందులో పాల్గొంటారని రాష్ట్రపతిభవన్ శుక్రవారం విడుదలచేసిన ఓ ప్రకటనలో తెలిపింది. వేర్వేరు సందర్భాల్లో రాష్ట్రపతిగా ప్రణబ్ చేసిన 154 ప్రసంగాలను పొందుపరిచిన రెండు సంపుటాలను, రాష్ట్రపతిభవన్ విశిష్టతను వివరించే రెండు పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారు. వీటిని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరిస్తారు. భారతదేశ 13వ రాష్ట్రపతిగా 2012, జులై 25వ తేదీన ప్రణబ్ ముఖర్జీ బాధ్యతలు స్వీకరించారు. -
కలవరం కాదు... వరం!
బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే మూడు దశలలో జీవితం గడుస్తుంది. బాల్యంలో ఆటపాటలు, విద్యాభ్యాసం; యవ్వనంలో ఉద్యోగం, వివాహం, సంతానం; వృద్ధాప్యంలో అరోగ్య, ఆర్థిక, కుటుంబ సమస్యలు... ఇలా జీవనక్రమం ఉంటుంది. ఈ క్రమంలో ఉద్యోగ జీవితం... కుటుంబపరంగా కూడా అనేక బాధ్యతలను నెరవేర్చుకోవడంతో సాగుతుంది. పిల్లల చదువుల, పిల్లల పెళ్లిళ్లు, అదే సమయంలో ఉద్యోగనిమిత్తం కొత్త కొత్త ప్రదేశాలలో పనిచేయాల్సి రావడం, కొత్తవారితో పరిచయాలు... జీవితాన్ని వేగంతో నింపేస్తాయి. అయితే ఉద్యోగ విరమణ పొందాక ఒక్కసారిగా పరిస్థితి మారిపోతుంది. ఒంటరితనం మిగులుతుంది. దీంతో మనోవేదన కలుగుతుంది. వయసు తెచ్చిపెట్టే ఆరోగ్య సమస్యలూ ముప్పిరిగొంటాయి. అందుకే పదవీ విరమణ తర్వాత ఏదైనా ఒక వ్యాపకాన్ని పెట్టుకోవాలి. ఉచిత సేవలు అందించడం కానీ, ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడం కానీ చేయాలి. సమాజానికి ఉపకరించే పనుల్లో నిమగ్నం అయి ఉండడం వల్ల కూడా మనం ఈ ‘శూన్యత’ నుండి బయటపడవచ్చు. దాంతో మనసు ఉల్లాసంగా ఉంటుంది కనుక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలూ తగ్గుతాయి. ఇక లలిత కళలు ఇచ్చే ఆనందం గురించైతే చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నిస్తే, ఉల్లాసాన్నిచ్చే వ్యాపకాలను ఏర్పరచుకుంటే ఉద్యోగ విరమణ అన్నది శాపంలా కాకుండా వరంలా పరిణమిస్తుంది. - చెన్నమాధవుని అశోక్రాజు -
యూజీసీని రద్దు చేయండి
న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ని రద్దు చేయాలని మానవవనరుల అభివృద్ధిశాఖ ప్యానెల్ సూచించింది. రద్దు చేయలేకపోతే మరింత మెరుగుపరచాలని కూడా పేర్కింది. ఆచరణకు అనుకూలమైనవే అయినప్పటికీ తన విధులు నిర్వహించడంలో, అప్పగించిన బాధ్యతలను పూర్తిచేయడంలో యూజీసీ విఫలమైందని వెల్లడించింది. వెంటనే జాతీయ ఉన్నత విద్యా సంస్థ ద్వారా యూజీసీని తీసేయాలని సూచించింది. ఒకవేళ అలా రద్దు చేయడం వీలుకాకుంటే అది పనిచేసే విధానాన్ని మరింత మెరుగుపరచాలని సదరు ప్యానెల్ సూచించింది. గత ఆరు నెలల కిందట యూజీసీ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించాల్సిందిగా స్మృతి ఇరానీ ఆధ్వర్యంలోని మానవ వనరుల అభివృద్ధిశాఖ ఒక కమిటీని వేసింది. ఇది యూజీసీ పూర్తిగా విఫలమైందని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అంతే కాకుండా యూజీసీ చైర్మన్ తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలకు వెళ్లి విశ్వవిద్యాలయాల పనితీరును నేరుగా తెలుసుకోవాలని, కార్యాలయానికి పరిమితం కాకుడదని కూడా సూచించినట్లు సమాచారం. అయితే, ఈ నివేదికను ఇంకా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వద్దకు తీసుకెళ్లలేదు. త్వరలోనే దీనిపై చర్చించనున్నారు. -
వారఫలాలు: 8 ఫిబ్రవరి నుంచి 14 ఫిబ్రవరి, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించి సత్తా చాటుకుంటారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. అరుదైన ఆహ్వానాలు రాగలవు. వాహనయోగం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహణి, మృగశిర 1,2 పా.) పరపతి కలిగిన వారితో పరిచయాలు. మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. నాయకులకు పదవీయోగం. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) సంఘంలో ఎనలేని గౌరవం లభిస్తుంది. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వాహనాలు, ఆభర ణాలు కొంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు లభిస్తాయి. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో దూరప్రయాణాలు. అనారోగ్యం. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు గడిస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు. నాయకులు నిరాశ చెందుతారు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి ధనలాభం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణాలు తీరతాయి. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు త థ్యం. ఉద్యోగులకు పదోన్నతులు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం చివరిలో ధనవ్యయం. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. అరుదైన ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ఊహించని పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు అరుదైన సత్కారాలు. వారం చివరిలో అనుకోని ఖర్చులు. ఆరోగ్యభంగం. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) విద్య, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు శుభవార్తలు. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం మధ్యలో కుటుంబంలో వివాదాలు. ధనవ్యయం. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళారంగం వారికి అవార్డులు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనులు నెమ్మదించినా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. కాంట్రాక్టర్లకు అనుకూల కాలం. వ్యాపారాలలో ప్రోత్సాహకరం. ఉద్యోగవర్గాలకు ఉత్సాహవంతం. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. ధనవ్యయం. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక పరిస్థితి కాస్త నిరాశ కలిగిస్తుంది. శ్రమానంతరం పనులు పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. వాహనాలు, భూములు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో చికాకులు. అనారోగ్యం. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు -
టీఆర్ఎస్కు కొత్త అధ్యక్షుడు?
-
ఉత్కంఠకు తెర
18న ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్న సుమతి సంగారెడ్డి క్రైం: జిల్లా ఎస్పీగా నియామకమైన బి.సుమతి ఈ నెల 18న బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 మంది ఐపీఎస్లకు పోస్టింగ్లు, బదిలీలు చేస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా జిల్లా ఎస్పీ శెముషీ బాజ్పేయ్ని బాలానగర్ డీసీపీగా నియమిస్తూ.. మెదక్ నుంచి బదిలీ చేశారు. గతంలో ఈమెను ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆమెను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. రెండు నెలల క్రితమే ఎస్పీ బదిలీ అయినప్పటికీ పోస్టింగ్లు ఇవ్వడంలో జాప్యం జరిగింది. కౌంటర్ ఇంటలిజెన్స్లో ఎస్పీగా పనిచేస్తున్న సుమతిని రెండు నెలల క్రితమే మెదక్కు నియమించినప్పటికీ పోస్టింగ్ ఇవ్వలేదు. తాజాగా ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇవ్వడంతో రెండు నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 1984 బ్యాచ్కు చెందిన సుమతి వరంగల్ డీఎస్పీగా, మల్కాజ్గిరి ఏసీపీగా, సీఐడీ ఎస్పీగా, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా పనిచేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎవరినీ ఉపేక్షించరని పేరు తెచ్చుకున్నారు. -
ఎంఈవో పోస్టా.. మాకొద్దు బాబోయ్..
35 పోస్టులు ఖాళీ! బాధ్యతలు తీసుకునేందుకు ఉపాధ్యాయుల వెనుకంజ అవసరమైతే సెలవు పెట్టేస్తున్న వైనం విద్యాశాఖ దృష్టిసారించేనా! మచిలీపట్నం : మండల విద్యాశాఖాధికారి పోస్టు అంటేనే ఉపాధ్యాయులు భయపడిపోతున్నారు. ఈ బాధ్యతలు తీసుకునేందుకు ఎవరికి వారు వెనుకంజ వేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎంఈవో బాధ్యతలు తీసుకోవాల్సి వస్తే సెలవు పెట్టి మరీ వెళ్లిపోతున్నారు. కొంతకాలంగా రాజకీయ నాయకుల ఒత్తిళ్లు పెరిగిపోవటంతో ఎంఈవో పోస్టును చేపట్టేందుకే ఉపాధ్యాయులు ముందూవెనుకా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో 50 ఎంఈవో పోస్టులకు గాను 15 మంది మాత్రమే రెగ్యులర్గా పనిచేస్తున్నారు. మిగిలిన 35 మండలాల్లో పూర్తి అదనపు బాధ్యతలతో ఎంఈవోలుగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కొన్ని మండలాల్లో ఈ బాధ్యతలు తమకు వద్దని, వేరెవరినైనా నియమించుకోవాలని ప్రతిపాదనలు ఎంఈవోల నుంచి వస్తుండటం గమనార్హం. మచిలీపట్నం ఎంఈవో విఠల్కుమారి తనకు ఈ బాధ్యతలు వద్దని, అనారోగ్య కారణాలు చూపి సెలవుపై వెళ్లిపోయారు. ఈ బాధ్యత తనకు ఎక్కడ అప్పగిస్తారోనని లేడియాంప్తిల్ పాఠశాల హెచ్ఎం సెలవు పెట్టినట్లు సమాచారం. వీరిద్దరి తరువాత ప్రాధాన్యత క్రమంలో బందరు మండలం చిట్టిపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం స్టీవెన్సన్ను ఎంఈవోగా నియమించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఆయన కూడా జనవరి మొదటి వారంలోనే బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రచారం జరుగుతోంది. బందరు మండలానికి ఎంఈవో లేకపోవడంతో ఈ మండలంలో పనిచేసే 200 మంది ఉపాధ్యాయుల వేతనాలు జనవరి ఒకటిన అందే పరిస్థితి లేకుండాపోయింది. ఖాళీగా 35 పోస్టులు... జిల్లాలో 49 మండలాలతో పాటు విజయవాడ అర్బన్తో కలుపుకొని 50 ఎంఈవో పోస్టులు ఉన్నాయి. వీటిలో గుడివాడ, విజయవాడ అర్బన్, పెనమలూరు, పెదపారుపూడి, నాగాయలంక, ముసునూరు, బాపులపాడు, నూజివీడు, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, చందర్లపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలుతో పాటు మరో మండలంలో రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారు. మిగిలిన 35 మండలాల్లో పూర్తి అదనపు బాధ్యతలతో ఉపాధ్యాయులే ఎంఈవోలుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఎంఈవో పోస్టులను భర్తీ చేయకపోవడంతో మండలంలో ఆసక్తి ఉన్న ఉపాధ్యాయుడిని అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఎంఈవోగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. వాస్తవానికి ఎంఈవో పోస్టు ఖాళీగా ఉంటే ఆ మండలంలోని సీనియర్ ఉపాధ్యాయుడిని ఎంఈవోగా నియమించే అధికారం డీఈవోకు ఉన్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. సీనియర్ ఉపాధ్యాయుడు ఎంఈవో పోస్టు తీసుకునేందుకు నిరాకరిస్తే సంబంధిత ఉపాధ్యాయుడి ఎస్ఆర్లో ఈ విషయాన్ని నమోదు చేయాలనే నిబంధన ఉంది. ఇలా రాస్తే భవిష్యత్తులో ఈ ఉపాధ్యాయుడికి ఎలాంటి పదోన్నతులూ వచ్చే అవకాశం ఉండదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇలాంటి నిబంధనలు ఉన్నా జిల్లాలో 35 మండలాల్లో ఎంఈవోలుగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆయా మండలాల్లో ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సీనియర్ హెచ్ఎంలు వెనుకంజ వేస్తున్నారు. డీఈవో తన సర్వాధికారాలను ఉపయోగించి ఎంఈవో పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నా ఆ పని కొంతకాలంగా జరగకపోవడంతో ఎంఈవో పోస్టుల్లో ఎవరో ఒక ఉపాధ్యాయుడినితాత్కాలికంగా నియమించి చేతులు దులిపేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అన్ని జిల్లాల్లో సీనియార్టీ జాబితాలు తయారు చేసి ఉన్నాయని, కృష్ణాజిల్లాలో సీనియార్టీ జాబితాలు తయారు కాకపోవడంతో ఆయా మండలాల్లో ఉన్న సీనియర్ ఉపాధ్యాయులను ఎంఈవోలుగా నియమించేందుకు అవకాశం లేకుండా పోతోందనే వాదన ఉపాధ్యాయుల నుంచి వినబడుతోంది. విద్యాశాఖ అధికారులు ఎంఈవో పోస్టుల భర్తీపై దృష్టిసారిస్తే ఆయా మండలాల్లో విద్యాశాఖ గాడిన పడే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారు. -
తల్లిదండ్రుల దీవెనలతో..
కన్నవారు ఎదురొచ్చాకే ప్రమాణ స్వీకారానికి బయలుదేరిన సాంబశివరావు భక్తురాలి తొలి ఫిర్యాదుపై స్పందించిన కొత్త ఈవో తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నూతన ఈవోగా డాక్టర్ దొండపాటి సాంబశివరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రమాణస్వీకారం కోసం కుటుంబ సభ్యులందరూ తిరుమలకు వచ్చారు. ప్రమాణ స్వీకారం కోసం బయలుదేరేందుకు సాంబశివరావు, జేఈవో కేఎస్.శ్రీనివాసరాజుతో కలసి కారులో సిద్ధంగా కూర్చుకున్నారు. వీరి కారుకు సాంబశివరావు తల్లిదండ్రులు దొండపాటి కృష్ణమూర్తి, దుర్గాంబ ఎదురొచ్చారు. ఆ తర్వాతే కారు బయలుదేరింది. తర్వాత తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులతో కలసి ఆయన భూ వరాహస్వామిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని ప్రమాణ స్వీకారం చేశారు. ఈవోగా బాధ్యతలు చేపట్టాక ఆలయం వెలుపలకు వచ్చిన ఈవో తొలిసారిగా మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ‘‘నా పూర్వజన్మసుకృతంతో పాటు నా తల్లిదండ్రుల పుణ్యఫలం వల్లే ధార్మిక సంస్థలో స్వామికి, భక్తులకు సేవ చేసే భాగ్యం కలిగింది’’ అని చెప్పటం చూస్తే తన తలిదండ్రుల పట్ల సాంబశివరావుకు భక్తి ప్రపత్తులు, బాధ్యతను గుర్తు చేసిందని చెప్పక తప్పుదు. ఆ తర్వాత ఆలయం వెలుపల పెద్దజీయర్మఠంలో జీయర్ల ఆశీస్సులు అందుకున్నారు. తర్వాత బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. కొత్త ఈవోగా బాధ్యతలు స్వీకరించాక సాంబశివరావును జేఈవోలు కేఎస్.శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, ఎస్టేట్ ఆఫీసర్ వీ.దేవేంద్రరెడ్డి, డెప్యూటీ ఈవోలు ఈవో వెంకటయ్య, ఓఎస్డీ దామోదరం, పేష్కార్లు సెల్వం, రామూర్తిరెడ్డి, కేశవరాజు, వీఎస్వో విమలకుమారి, ఏవీఎస్వోలు సాయిగిరిధర్, కోటిబాబు, మల్లికార్జున్ అభినందనలు తెలిపారు. తొలి ఫిర్యాదును పరిష్కరించిన కొత్త ఈవో టీటీడీ ఈవోగా సాంబశివరావు బాధ్యతలు స్వీకరించాక జీయర్ మఠంలో పెద్ద జీయర్, చిన్న జీయర్ల ఆశీస్సులు అందుకున్నారు. వెలుపలకు రాగానే ఓ మహిళ తనకు లడ్డూలు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. వెంటనే సాంబశివరావు స్పందించారు. ఆమెకు లడ్డూలు ఇవ్వాలని డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ద్వారా సూపరింటెండెంట్ను ఆదేశించారు. నిమిషాల్లోనే ఆ భక్తురాలికి లడ్డూలు అందటంతో ఆమె ఆనందానికి అవుధుల్లేకుండా పోయింది. నిజాయితి, నిక్కచ్చి అధికారిగా గుర్తింపు సాంబశివరావు సొంతూరు కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి. 1986 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన సాంశివరావు రాష్ట్ర, కేంద్ర సర్వీసుల్లో అనేక హోదాల్లో పనిచేశారు. సమర్థవంతమైన అధికారిగా పేరుంది. నిజాయితీ అధికారిగాను, ఏ విషయంలోనూ నాన్చుడు ధోరణి కాకుండా ముక్కుసూటితనంతో వ్యవహరించే అధికారిగా గుర్తింపు ఉంది. టీటీడీ ఈవో పోస్టు విషయంలో సీనియర్ ఐఏఎస్ అధికారులెందరో ప్రయత్నాలు చేసినా సీఎం చంద్రబాబునాయుడు మాత్రం సాంబశివరావు వైపే మొగ్గు చూపారు. -
ఆర్నెల్లు.. చేసింది నిల్
ఎన్నికలకు ముందు ఇబ్బడిముబ్బడిగా హామీలు సీఎం అయ్యాక మరికొన్ని వరాలు జిల్లాకు నాలుగుసార్లు వచ్చిన బాబు నెల్లూరు (అర్బన్): ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు పూర్తయింది. ఈ ఆర్నెల్ల కాలంలో జిల్లాకు ప్రత్యేకంగా చేసిందంటూ ఏమీ లేదు. కేవలం ప్రచారానికే ప్రాధాన్యమిచ్చారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు నాలుగు పర్యాయాలు జిల్లాలో పర్యటించారు. ఆ పర్యటనల్లోనూ అనేక హామీలను గుప్పించారు. వాటిలోనూ ఒక్క హామీ కూడా కార్యరూపం దాల్చలేదు. వచ్చిన ప్రతిసారీ కోస్తా కారిడార్లో భాగంగా జిల్లాను పారిశ్రామిక హబ్, పర్యాటక హబ్ చేస్తాం, నెల్లూరుకు భూగర్భ డ్రైనేజీ, ఫిషింగ్ హార్బర్, నెల్లూరుకు విమానాశ్రయం.... ఇలా హామీల మీద హామీలను గుప్పించారు. అయితే ఇప్పటివరకు వీటి కోసం జిల్లాకు ఒక్క పైసా కూడా విదల్చలేదు. ఎన్నికలకు ముందు.. ఎన్నికలకు ముందు మార్చి 5న చంద్రబాబు జిల్లాకు వచ్చారు. నగరంలోని వీఆర్సీ గ్రౌండ్స్లో జరిగిన ప్రజాగర్జనలో అనేక హామీలు ఇచ్చారు. నెల్లూరులో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంకా నెల్లూరును పారిశ్రామిక నగరంగా, మహానగరంగా తీర్చిదిద్దుతామని, ఒకటి, రెండుచోట్ల రింగురోడ్డును ఏర్పాటు చేయిస్తామని, మత్స్యకార హార్బర్ను నిర్మిస్తామని చెప్పారు. పెన్నా, కండలేరు, సోమశిల, ఉత్తర కాలువను అభివృద్ధి చేస్తామని, కృష్ణపట్నం, దుగ్గరాజపట్నం పోర్టుల అభివృద్ధి కోసం ప్రయత్నిస్తానని ప్రకటించారు. ఇంకా ఎరువుల పరిశ్రమ, చేనేత కార్మికులను ఆదుకునేందుకు జిల్లాలో టెక్స్టైల్ పార్క్, జాతీయ విద్యాసంస్థలు, కిసాన్సెజ్లో రైతులకు ఉపయోగపడే పరిశ్రమలు స్థాపిస్తానని ఆర్భాటంగా సభలో చెప్పారు. ఎన్నికలు జరిగాక మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ముఖ్యమంత్రి హోదాలో నాలుగుసార్లు బాబు జిల్లాకు వచ్చారు. జూన్ 6న షార్లో జరిగిన కార్యక్రమం కోసం, జులై 19న నెల్లూరులోని వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి, ఆగస్టు 24న స్వర్ణభారత్లో జరిగిన కార్యక్రమం కోసం, అక్టోబర్ 10న జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చారు. ఈ పర్యటనలో ఆయన ఇచ్చిన హామీలనే మళ్లీ మళ్లీ వల్లిస్తూ వచ్చారు గానీ చేసిందేమీ లేదు. సీఎంగా చంద్రబాబు ఇచ్చిన హామీలు జూలై 19న: వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి వచ్చిన బాబు ఈ సమయంలోనే అధికంగా హామీలు గుప్పించారు. సోమశిల ఎత్తిపోతల పథకం, సంగం, నెల్లూరు బ్యారేజీలు, తెలుగుగంగ కాలువలు, సోమశిల-స్వర్ణముఖి లింకుకాలువతో పాటు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ ఒక కాలపరిమితి నిర్ణయించి ఐదేళ్లలో పూర్తిచేస్తామని, మరో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. మత్స్యకారుల కోసం జువ్వలదిన్నె ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని, పులికాట్ సరస్సు ముఖద్వారాలు తెరిచి మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. నెల్లూరు నగరాన్ని స్మార్టుసిటీగా రూపొందిస్తామని కేంద్రం ప్రకటించిన వంద స్మార్ట్సిటీల్లో నెల్లూరు ఉండేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరుకు విమానాశ్రయం సాధించాల్సి ఉందని తెలిపారు. నెల్లూరు నగర భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు రూ.575 కోట్ల హడ్కో రుణం, మంచినీటి పథకానికి రూ.500 కోట్లు మంజూరుకు రాష్ట్రప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. రే కింద నెల్లూరుకు రూ.16 కోట్లు, సూళ్లూరుపేటకు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. పులికాట్, నేలపట్టు, మైపాడ్, పెంచలకోనలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని, మైపాడుకు నాలుగు వరుసల రోడ్డు మంజూరుచేస్తున్నట్లు, నెల్లూరుకు రింగురోడ్డు కావాలని అడిగారని, అది కూడా మంజూరు చేస్తున్నామని సభలో ఘనంగా ప్రకటించారు. ఆగస్టు 24న ఇచ్చిన హామీలు: నేషనల్ గేమ్స్ను నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఒక ఈవెంట్ను నెల్లూరులో నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తానని ప్రకటించారు. అక్టోబర్ 10న : కోవూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాళెంలో, వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిలిలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న బాబు జిల్లాను టూరిజం హబ్గా తయారుచేస్తానని, వెంకటగిరి సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ నిర్మాణం పూర్తిచేస్తానని, తెలుగుగంగ బ్రాంచి కాలువల నిర్మాణంపై దృష్టిపెడతానని, వెంకటగిరి ప్రాంత పొలాలకు కండలేరు జలాలు తెప్పిస్తానని, వెంకటగిరిలో విమానాశ్రయం ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చారు. చేసింది శూన్యం.. బాబు ప్రటించిన హామీలు ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. ఉదాహరణకు నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు సంగం బ్యారేజీ నుంచి తాగునీటి పథకం, భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి హడ్కో నుంచి రూ.1500 కోట్ల రుణం ఇస్తామని కేంద్రమంత్రి వెంకయ్యనాయడు హామీ ఇచ్చారు. ఆ నిధులు వచ్చేలా చూస్తానని బాబు కూడా మాట ఇచ్చారు. దీంతో అధికారులు హడావుడిగా రెండు పథకాల కోసం ప్రతిపాదనలు పంపారు. అయితే ఆర్థిక శాఖ దానిని బుట్టదాఖలు చేసింది. ఒకసారి నెల్లూరులో విమానాశ్రయం అని చెప్పిన బాబు మరోసారి వెంకటగిరిలో విమానాశ్రయం అని ప్రకటన చేశారు. రెండుసార్లు రెండు ఊర్ల పేర్లు చెప్పడంతో జిల్లా ప్రజలు బాబు తీరును చూసి నవ్వుకున్నారు. అలాగే అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం ఐదు పథకాలను ప్రారంభించింది. ఇవి జిల్లాలో సక్రమంగా అమలు కాలేదు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో రూ.2 కు ఇరవై లీటర్ల మంచి నీళ్ల పథకాన్ని జిల్లాలో 420 గ్రామాల్లో అమలు చేయాలని నిర్ణయించగా కేవలం 18 చోట్ల మాత్రమే ప్లాంట్లు మొదలుపెట్టారు. ఇవీ అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. జిల్లాలో 50వేల మంది అర్హులను పింఛన్ల జాబితా నుంచి తొలగించారు. నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అదీ సక్రమంగా అమలు కావడంలేదు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ అని చెప్పి.. 7 గంటలు కూడా సక్రమంగా ఇవ్వడంలేదు. వేల కోట్ల రూపాయలు అవసరమయ్యే హామీలు ఇచ్చి ఇప్పటివరకు జిల్లాకు పైసా కూడా ఇవ్వని బాబుపై జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ సంగతి సరేసరి రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించిన బాబు అధికారంలోకి వచ్చాక మాత్రం ఈ విషయంలో ఇరువర్గాలను మోసం చేశారు. రూ.50వేల లోపు తీసుకున్న రైతులకు మాత్రమే పూర్తి మాఫీ వర్తిస్తుందని, ఆ పైన లక్షన్నర లోపు తీసుకున్న రైతులకు వాయిదాల పద్ధతిన చెల్లిస్తామని ప్రకటించారు. మొదటి విడతలో కేవలం 63 వేలమంది రైతులను మాత్రమే అధికారులు అర్హులుగా గుర్తించినట్లు తెలిసింది. జిల్లాలో 35,335 డ్వాక్రా సంఘాలు రూ.592.28 కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సుమారు రూ.300 కోట్ల రుణం మాఫీ కావాల్సి ఉంది. అయితే ఇంతవరకు డ్వాక్రా రుణాల ఊసెత్తకపోవడంతో తీసుకున్న అప్పులకు వడ్డీ పెరిగిపోతోంది. -
విమ్స్ డెరైక్టర్ పదవి ముళ్లపాన్పు
సాక్షి, బళ్లారి : బళ్లారి విమ్స్ డెరైక్టర్ పదవి ముళ్లపాన్పు కానుంది. డెరైక్టర్గా బాధ్యతలు చేపట్టినవారు నాలుగేళ్లు పదవిలో కొనసాగాల్సి ఉండగా ప్రస్తుతం నాలుగేళ్లలో ఏడు మంది డెరైక్టర్లు మారడం చర్చనీయాంశమైంది. కేవలం ప్రభుత్వ నిర్వాహకం వల్లే ఇలా జరుగుతోందన్న విమర్శలు సర్వత్రా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే.. ఇటీవల విమ్స్ డెరైక్టర్ డాక్టర్ శంకర్ ఉన్నఫళంగా రాజీనామా చేశారు. వారం రోజుల క్రితం విమ్స్ డెరైక్టర్గా నియమితులైన ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ శంకర్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా లేఖను ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపినట్లు పేర్కొన్నప్పటికి రాజీనామా వెనుక బలమైన కారణాలున్నాయని తెలుస్తోంది. విమ్స్ డెరైక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మీనారాయణరెడ్డిని ఉన్నఫళంగా తొలగించి డాక్టర్ శంకర్ను నియమించిన సంగతి తెలిసిందే.రాష్ట్ర వైద్యశాఖ మంత్రి శరణుప్రకాష్ పాటిల్,సెక్రటరీలు విమ్స్ ఆస్పత్రిని సందర్శించి,హెచ్ఓడీలు,వైద్యులతో సమస్యలు తెలుసుకుని బెంగళూరుకు వెళ్లారు. మరుసటి రోజు విమ్స్ డెరైక్టర్గా శంకర్ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. డెరైక్టర్ ఎల్ఎన్రెడ్డికి, మంత్రికి సరిపోకపోవడంతోనే ఆయన స్థానంలో శంకర్ను ఏర్పాటు చేసినట్లు వదంతులు వచ్చాయి అయితే శంకర్ ఎందుకు రాజీనామా చేశారన్నది వైద్య వర్గాల్లోనే కాకుండా నగరంలోహాట్టాపిక్ మారింది. సౌమ్యుడు,మంచి వైద్యుడుగా పేరున్న శంకర్ రాజీనామా లేఖను పంపారని తెలియగానే విమ్స్కు కొత్త బాస్ ఎవరుని నియమిస్తారనే చర్చసాగుతోంది. -
‘గ్రేటర్’ మార్పులు
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్లను ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది. దీంతో నగరంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రత్యూష్సిన్హా కమిటీ సిఫార్సుల మేరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపుల తుది జాబితా శుక్రవారం విడుదలైంది. గ్రేటర్లో ముఖ్య విభాగాల బాధ్యతలు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్, స్పెషల్ కమిషన ర్లు అహ్మద్బాబు, ప్రద్యుమ్న, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేశ్కుమార్ మీనాలను ఆంధ్రప్రదేశ్కు కేటాయించడంతో ఆయా స్థానాల్లో కొత్త అధికారులు రానున్నారు. హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్కుమార్ ప్రసాద్ను అక్కడి నుంచి ఇప్పటికే బదిలీ చేయడంతో ఆ స్థానానికీ కొత్త అధికారి రానున్నారు. గత జాబితాలోనే వీరిని ఆంధ్రప్రదేశ్కు కేటాయించి నప్పటికీ, తుది జాబితాలో మార్పుచేర్పులకు అవకాశముంటుం దనే అభిప్రాయాలు వెలువడ్డాయి. మెట్రోపొలిస్ సదస్సు ముగింపు రోజే తుది జాబితా వెలువడటం యాధృచ్ఛికమే అయినా, జీహెచ్ఎంసీ వర్గాల్లో ఇది హాట్ టాపిక్గా మారింది. తుదిజాబితాలో సోమేశ్కుమార్ను తెలంగాణకే కేటాయిస్తారని.. కాదు ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తారని పందేలు కూడా జరిగాయి. సార్వత్రిక ఎన్నికలు.. సమగ్ర కుటుంబ సర్వే.. బతుకమ్మ ఉత్సవాలు.. మెట్రోపొలిస్ వంటి కార్యక్రమాలను విజయవంతం చేయడంలో సోమేశ్కుమార్ ముఖ్యభూమిక పోషించారు. మెట్రోపొలిస్ నిర్వహణలో, విదేశీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటంలో అహ్మద్బాబు ఎంతోకృషి చేశారు. పనితీరుతోనే కాక, వ్యవహార తీరుతోనూ సోమేశ్కుమార్ వివిధ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. పలువురికి కంటగింపుగామారినప్పటికీ తనదైన శైలిలో ముందుకు సాగారు. గత ఏడాది అక్టోబర్ 23న సోమేశ్కుమార్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణకు ఆప్షన్ ఇచ్చుకున్నప్పటికీ తొలిజాబితాలో ఆయనను ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. తుది జాబితాలో మార్పులు జరగవచ్చుననే అభిప్రాయాలు వెలువడ్డాయి. స్పెషల్ కమిషనర్లు అహ్మద్బాబు, ప్రద్యుమ్నలు కొద్దినెలల కిందటే జీహెచ్ఎంసీకి బదిలీపై వచ్చారు. వీరిస్థానంలోనూ కొత్త అధికారులు రానున్నారు. తొలిజాబితాలో ఆంధ్రప్రదేశ్కు కేటాయింపు జరిగిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేశ్కుమార్ మీనా సైతం తుదిజాబితాలోనూ అక్కడకే వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. రాబోయే అధికారుల కనుగుణంగా ఆయా విభాగాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. -
పోరుబాట వీడిన మావోయిస్టు దంపతులు
రూరల్ ఎస్పీ ఎదుట లొంగుబాటు ఎన్నికల సమయంలో హింసకు విఫలయత్నం లొంగిపోయినవారిలో ఏటూరునాగారం-మహదేవ్పూర్ ఏరియా కమిటీ కార్యదర్శి రాజు వరంగల్ క్రైం : దశాబ్దకాలం మావోయిస్టు పార్టీలో పనిచేసిన మావోయిస్టు దంపతులు పోరుబాట వీడారు. రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు రంగారావు ఎదుట శుక్రవారం లొంగిపోయూరు. హన్మకొండ పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారి లొంగుబాటు వివరాలను రూరల్ ఎస్పీ వెల్లడించారు. భూపాలపల్లి మండలం అజాంనగర్కు చెందిన మేకల రాజు అలియాస్ రాజ్కుమార్ అలియాస్ మురళి ఏటూరునాగారం-మహదేవ్పూర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. చత్తీస్గఢ్ రాష్ట్రంలోని మద్దేడు తాలూకా చెలాంనెంద్రాకు చెందిన మిడియం సోమిడి అలి యాస్ సంగీత ఏటూరునాగారం-మహదేవ్పూర్ ఏరియా దళ సభ్యురాలిగా పనిచేస్తోంది. దంపతులైన వీరిద్దరు పార్టీలో పనిచేస్తున్న క్రమంలోనే వివాహం చేసుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక, ప్రాదేశిక ఎన్నికల సందర్భంగా సంచలనాలకు పాల్పడేందుకు విఫలయత్నం చేశారు. అజాంనగర్ నుంచి అజ్ఞాతంలోకి.. అజాంనగర్కు చెందిన మేకల రాజు ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు స్థానిక ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాడు. భూపాలపల్లి సమీపంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో పదో తరగతి పూర్తి చేశాడు. ఆ తర్వాత తన గ్రామంలో మావోయిస్టు పార్టీ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలకు ఆకర్షితుడై 2003లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. మొదట మహదేవ్పూర్ ఏరియా కమిటీ దళ సభ్యుడిగా, 2005లో జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న ప్రొటెక్షన్ టీమ్లో గార్డుగా బాధ్యతలు నిర్వహించాడు. 2009లో ఏటూరునాగారం-మహదేవ్పూర్ ఏరియా కమిటీ సభ్యుడిగా, 2011లో వాజేడు ఏరియా ఎల్ఓఎస్ కమాండర్గా బాధ్యత లు నిర్వహించిన అనంతరం 2012 జూన్ నుంచి ఏటూరునాగారం-మహదేవ్పూర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. ఎన్నికల సమయంలో ఇతడి సారథ్యంలో అనిల్, కృష్ణ, మహేష్, రంజిత్ కలిసి బుట్టాయిగూడెం పరిసర ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులను హతమార్చి సంచలనం సృష్టించాలని యత్నించారు. అలాగే భద్రు సారథ్యంలో కొత్తగూడ ఏరియాలో సంఘటనలకు పాల్పడి సంచలనం సృష్టించాలనుకున్నా రు. కానీ పోలీసుల నిఘా ఎక్కువగా ఉండడంతో వెనుదిరిగారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన మిడియం సోమిడి సోమిడి నిరుపేద కుటుంబంలో పుట్టి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న క్రమంలో మద్దెడు ఏరియా కమిటీ కమాండర్ నగేష్ నిర్వహించే విప్లవ సాంస్కృతిక కార్యక్రమాలకు ఆకర్షితురాలై 2003లో అజ్ఞాతంలోకి వెళ్లింది. మద్దేడు ఏరియా కమిటీ దళంలో పనిచేసి 2006లో మచ్చ సొమయ్య అలియాస్ సురేందర్ అలియూస్ సతీష్ ప్రొటెక్షన్ టీమ్ సభ్యురాలిగా పనిచేసింది. అనంతరం ఏటూరునాగారం-మహదేవ్పూర్ ఏరియా దళసభ్యురాలిగా పనిచేసింది. 2011లో ఇదే ఏరియా కమిటీ సభ్యురాలిగా ప్రమోట్ అయింది. మేకల రాజుపై పలు కేసులు.. 2009లో పోలీసులకు, మావోయిస్టు దళానికి జరిగిన ఎదురు కాల్పుల ఘటన. 2009లో బోర్లగూడెం వద్ద ముగ్గురు వ్యక్తులను ఇన్ఫార్మర్ నెపంతో కాల్చిచంపిన కేసు. ఏటూరునాగారంలో రమేశ్, బుట్టాయిగూడెంలో మధుక ర్ హత్య కేసులు. 2012లో సుకుమా జిల్లా మిన్నప్ప వద్ద సీఆర్పీఎఫ్ క్యాంప్పై దాడి చేసి ఏడుగురు జవాన్లను హతమార్చిన కేసు. తాళ్లగూడెం వద్ద జగదీష్, శ్రీను, రాజును, దుద్దెడ వద్ద శివయ్య, రామయ్యను, అన్నారం వద్ద కురుసం రోశయ్యను కాల్చి చంపిన కేసుల్లో నిందితుడు. దేవాదుల వద్ద ప్రాజెక్టుకు సంబంధించిన సా మగ్రిని పాక్షికంగా ధ్వంసం చేసిన సంఘటన. బోర్లగూడెం, అజాంనగర్ వద్ద బస్సులను, లారీని దగ్ధం చేసిన సంఘటనలో నిందితుడు. రాజుపై రూ.4 లక్షల రివార్డు ఉంది. -
మహా మార్పు
జీవీఎంసీ కమిషనర్సత్యనారాయణను తప్పించిన సర్కారు పేరుకుపోయిన ఆరోపణల చిట్టా జేసీకి తాత్కాలిక బాధ్యతలు వుడా ఇన్చార్జిగా ఈపీడీసీఎల్ సీఎండీ సాక్షి, విశాఖపట్నం : జీవీఎంసీ కమిషనర్ పోస్టు నుంచి సత్యనారాయణ ప్రభుత్వం తప్పిం చింది. ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి పోస్టింగ్ ఇచ్చేంత వరకు సాధారణ పరిపాలనా విభాగంలో రిపోర్టింగ్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఆయన ఇప్పటి వరకు జీవీఎంసీ కమిషనర్తోపాటు, వుడా వీసీగా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ రెండు స్థానాలూ ఖాళీ అయ్యాయి. కమిషనర్గా జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రవీణ్కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎం.జానకి ఫేజ్-3 మిడ్ కెరీర్ శిక్షణలో ఉన్నారు. ఆమె అక్టోబర్ 8న తిరిగి విధుల్లో చేరనున్నారు. ఆమె విధుల్లో చేరాక జేసీ ప్రవీణ్ కుమార్ నుంచి జీవీఎంసీ కమిషనర్గా అదనపు బాధ్యతలు చేపట్టేలా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వుడా వీసీగా ఈపీడీసీఎల్ సీఎండీ ఎం.వి.శేషగిరిబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. ఆరోపణలే కారణమా? 1993 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఎం.వి.సత్యనారాయణను 2012 ఆగస్టు 27న జీవీఎంసీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. ఆరంభంలో పాలనాపరంగా కాస్త కఠినంగానే వ్యవహరించినప్పటికీ రాన్రానూ స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు లోనై పక్కదారిపట్టారన్న ఆరోపణలున్నాయి. పార్టీతో సంబంధం లేకుండా పూర్తిగా ఓ మంత్రికే అనుకూలంగా వ్యవహరించడం కూడా మిగిలిన వారిలో ఆగ్రహానికి కారణమయింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ వైఖరి మరింత పెరిగింది. మున్సిపల్ మంత్రితో జరిగిన సమీక్షా సమావేశంలో ఇదే విషయంపై టీడీపీకే చెందిన కొందరు ఎమ్మేల్యేలు బాహాటంగానే ఆరోపణలు గుప్పించారు. గాజువాక ప్రాంతానికి చెందిన టీడీపీ మాజీ కార్పొరేటర్లు కమిషనర్ తీరును ఎండగట్టారు. జీవీఎంసీ నీటి సరఫరా విభాగానికి చెందిన పర్యవే క్షక ఇంజినీరు(ఎస్ఈ) మరియన్న ఆరోపణలు కల్లోలం రేపాయి. కమిషనర్ రెండేళ్ల పాలనలో రూ.వందల కోట్ల బిల్లులు ప్రాధాన్యతతో పనిలేకుండా కమీషన్ల కోసం అడ్డగోలుగా చెల్లించినట్టు సమాచారహక్కు చట్టం(ఆర్టీఏ) ద్వారా సేకరించిన సమాచారాన్ని బయటపెట్టారు. కొన్నాళ్లుగా వివిధ విభాగాల్లో అవినీతి, అక్రమాలపై పత్రికల్లో వచ్చిన కథనాల్ని జోడించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. జీవీఎంసీ కాంట్రాక్టర్లు కొందరు కమిషనర్ అవినీతికి పాల్పడుతున్నారంటూ కోర్టులో కేసు దాఖలు చేయడం అప్పట్లో చర్చనీయాంశమయింది. వీటితోపాటు ఓ మంత్రికే అనుకూలంగా వ్యవహరించడంతో టీడీపీకి చెందిన మరో మంత్రి ముఖ్యమంత్రి వద్ద ఈయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ ఫిర్యాదుల కారణంగానే ఆయన్ని బదిలీ చేసినా ఎక్కడా పోస్టింగ్ కేటాయించలేదని సమాచారం. ‘ప్రత్యూష’ కమిటీతో కొత్త నియామకాలు! ఐఏఎస్ల కేటాయింపుపై ప్రత్యూష సిన్హా కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ కమిటీ నివేదిక అమలైతే రాష్ట్రానికి ఐదుగురు ఐఏఎస్లను కేటాయించే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ కేటాయింపులు పూర్తయ్యాకే జీవీఎంసీకి, వుడాకు పూర్తి స్థాయి అధికారుల్ని కేటాయించనున్నట్టు తెలిసింది. జీవీఎంసీ కమిషనర్గా వచ్చేందుకు ఇప్పటికే కొందరు ప్రయత్నిస్తున్నారు. పంచాయితీరాజ్ కమిషనర్ వరప్రసాద్, అనంతపురం జేసీ సత్యనారాయణ, గతంలో విశాఖ జేసీగా పనిచేసిన గిరిజాశంకర్ పోటీలో ఉన్నట్టు సమాచారం. గతంలో ఈ స్థానానికి విజయనగరం కలెక్టర్గా పనిచేసిన వీరబ్రహ్మయ్య పేరు దాదాపు ఖరారైనప్పటికీ ఆయన్ని తెలంగాణాకు కేటాయించడంతో కొత్తవారు ప్రయత్నాలు మొదలెట్టారు. -
ఇన్చార్జి కమిషనర్గానా... వామ్మో.. మేం చేయలేం!
సాక్షి, ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ ఇన్చార్జ్ కమిషనర్ బాధ్యతలంటేనే అధికారులు జంకుతున్నారు. ఈ కార్యాలయంలో కొందరు కిందిస్థాయి సిబ్బంది దీర్ఘకాలంగా ఇక్కడే పాతుకుపోవడం.. వారు పాలనకు సహకరించకపోవడంతోపాటు అనవసర వ్యవహారాల్లో తల దూర్చడం తదితర కారణాలతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క అధికారిపైనే బాధ్యతంతా పడుతోంది. అందుకే.. ఇన్చార్జ్ కమిషనర్ బాధ్యతలంటేనే ‘వామ్మో.. మేం చేయలేం’ అంటూ అధికారులు సెలవుపై వెళ్తున్నారు. కమిషనర్ శ్రీనివాస్ సెలవుపై వెళ్లారు. ఇన్చార్జి కమిషనర్గా బాధ్యతులు చేపట్టిన ఎంఈ శంకర్లాల్ కూడా వారం రోజులు తిరగకముందే నెల రోజులు సెలవు పెట్టారు. ఇప్పుడు ఈ బాధ్యతలను నెత్తికెత్తుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. సంక్షేమ పథకాలను అర్హులకే అందించేందుకు, అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో నగర పాలక అభివృద్ధికి కీలమైన ‘మన డివిజన్-మన ప్రణాళిక’ను కూడా కార్పొరేషన్ అధికారులు రూ.1500 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇటీవల సమగ్ర సర్వేలో కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. కలెక్టర్ అక్షింతలు కూడా వేశారు. సర్వేను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఓ అంచనా లేకుండా అధికారులు ముందుకెళ్లడం, అసలు దీనిపై అవగాహన లేనట్టుగా ఉండడంతో నగరంలో సర్వే పూర్తిస్థాయిలో కాలేదు. నగర ప్రజలు తమ ఇళ్లకు సర్వే బృందం రాలేదని కార్పొరేషన్ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు కలెక్టర్ రంగంలోకి దిగి జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో సర్వేను పూర్తిచేయించారు. గతంలో పలు ఆరోపణల్లో చిక్కుకున్న కమిషనర్ బి.శ్రీనివాస్.. సర్వే పూర్తయిన వెంటనే సెలవు పెట్టి వెళ్లారు ఆ తర్వాత ఇన్చార్జి బాధ్యతలను ఎంఈ శంకర్లాల్కు అప్పగిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజులు తిరగముందే ఆయన కూడా (ఈ నెల 9 నుంచి) నెల రోజులు సెలవు పెట్టారు. ఇన్చార్జి కమిషనర్గా వరంగల్లో పనిచేస్తున్న పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేశ్వరరావుకు ఉన్నతాధికారులు బాధ్యతలు అప్పగించారు. సిబ్బంది సహకరించనందునే.. ప్రధానంగా కార్పొరేషన్ కార్యాలయంలో దీర్ఘకాలికంగా తిష్టవేసిన కొందరు అధికారులు, సిబ్బంది పాలన వ్యవహారాల్లో ఉన్నతాధికారులకు సహకరించడం లేదనే ఆరోపణలున్నాయి. వారు అవినీతి, అక్రమాలకు పాల్పడినప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. నగరంలో మంచినీటి సరఫరా, ఇతర పాలన వ్యవహారాల్లో సిబ్బంది వ్యవహారు తీరు ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. వీరి కారణంగా ఇటు కలెక్టర్, అటు పురపాలక శాఖ ఉన్నతాధికారుల నుంచి కమిషనర్కు,ఇన్చార్జి కమిషషనర్కు మొట్టికాయలు పడుతున్నాయి. ఈ కారణంగానే.. ఇన్చార్జి కమిషనర్ బాధ్యతలంటేనే భయపడాల్సిన పరిస్థితేర్పడింది. కలెక్టర్ చొరవతోనే గాడిలోకి.. పాలకవర్గం లేకపోవడంతో ఇక తమను ప్రశ్నించేవారే లేరన్న ధోరణితో నగర పాలక సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారు విధులకు కూడా సక్రమంగా రావడం లేదు. కార్యాలయానికి ఎప్పుడు వస్తారో.., అసలు వస్తారో... రారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ కార్యాలయ సిబ్బంది పనితీరును గాడిలో పెట్టాలంటే ప్రత్యేకాధికారయిన కలెక్టర్ చొరవ చూపాల్సిందే. -
అందుబాటులో ఉంటా
సబ్-కలెక్టర్ నాగలక్ష్మి బాధ్యతల స్వీకరణ విజయవాడ : ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని విజయవాడ సబ్-కలెక్టర్ షణ్ముగం నాగలక్ష్మి అన్నారు. గురువారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసి బదిలీ అయిన డి.హరిచందన నుంచి నాగలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సబ్-కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ తనను ఎవరైనా ఎప్పుడైనా కలవ వచ్చన్నారు. ప్రజల సమస్యలు సత్వర పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాన ని చెప్పారు. విజయవాడ రెవెన్యూ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. చట్టప్రకారం భూసేకరణ నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం రూపొం దించిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడానికి ప్రయత్ని స్తామన్నారు. పేదల సంక్షే మానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. అధికారులు, సిబ్బంది సహకారంతో డివిజన్లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆమె చెప్పారు. విజయవాడ సబ్-కలెక్టర్గా తొలి బాధ్యతలు స్వీకరించడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం కార్యాలయ అధికారులు,సిబ్బందిని, కార్యాలయ పరిపాలనా అధికారి జయశ్రీ సబ్-కలెక్టర్కు పరిచయం చేశారు. ప్రొఫైల్ ఎస్.నాగలక్ష్మి, 2012 బ్యాచ్ ఐఏఎస్, విద్యార్హతలు : బిఇ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, బిట్స్బిలానీ. స్వస్థలం : కోయంబత్తూర్ తమిళనాడు. శిక్షణ : అనంతపురం జిల్లా -
ఇక ప్రజాక్షేత్రంలోకి..
వైఎస్సార్సీపీ సంస్థాగత కసరత్తు కొత్త జట్టు ఏర్పాటు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : సంస్థాగత కసరత్తు దిశగా వైఎస్సార్సీపీ రెండో అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాక్షేత్రంలోకి దూసుకువెళ్లడమే లక్ష్యంగా జిల్లా పార్టీకి కొత్త జట్టును ప్రకటించింది. సంస్థాగత వ్యవహారాల్లో జిల్లా పార్టీకి సహాయసహకారాలు అందించడానికి పరిశీలకులను నియమించింది. అదే విధంగా పార్టీ ప్రధాన కార్యదర్శులను ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించింది. జిల్లాకు చెందిన పలువురు పార్టీ నేతలకు రాష్ట్ర కమిటీలో తగిన ప్రాధాన్యం కల్పించారు. ఈమేరకు వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర పార్టీ కార్యాలయం బుధవారం ఓ జాబితాను ప్రకటించింది. ఆ ప్రకారం... ముగ్గురు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు: జిల్లాలోని మూడు లోక్సభ నియోజకవర్గాలకు ముగ్గురు పరిశీలకులను నియమించారు. విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడిగా తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు బాధ్యతలు అప్పగించారు. అనకాపల్లికి పరిశీలకుడిగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును నియమించారు. అరకుకు జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్కు బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాంధ్ర పరిశీలకుడిగా సుజయ్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జ్గా బొబ్బిలి ఎమ్మె ల్యే సుజయ్కృష్ణ రంగారావును నియమించారు. ఆయన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జ్గా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాబూరావు పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు పార్టీ రాష్ట్ర కమిటీలో ప్రాధాన్యం కల్పించారు. ఆయన్ని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తొలి జాబితాలో 8మందిని పార్టీ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. తాజాగా విడుదల చేసిన రెండో జాబితాలో బాబూరావును కూడా ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు ప్రకటించారు. దాంతో ఆయనకు అధిక గుర్తింపు ఇచ్చినట్టయింది. ఇతర జిల్లాలకు పరిశీలకులుగా... జిల్లాకు చెందిన మరో ఇద్దరు నేతలకు కూడా రాష్ట్ర పార్టీ గుర్తింపునిచ్చింది. మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడును తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడిగా నియమించారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని తూర్పుగోదావరి జిల్లా పరిశీలకుడిగా బాధ్యతలు అప్పగించారు. ఇక త్వరలో జిల్లా పార్టీ అనుబంధ కమిటీలను కూడా ప్రకటించేందుకు పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. -
ఉత్సవ విగ్రహాలు
అధికారాలు, విధులు లేవు ఎంపీపీ, జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోవడానికే సమావేశాల కోసమే ఎంపీటీసీ, జెడ్పీటీసీలు గ్రామీణాభివృద్ధిలో వీరి పాత్ర నామమాత్రం. చేతికి ఆరోవేలు వంటివారు. అధికారాలు, బాధ్యతలు, విధులు లేని పదవులు ఇవి. కేవలం ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోవడం, మండల, జెడ్పీ సమావేశాలకు హాజరు కావడం మినహా అధికారికంగా నిర్వహించే విధులేమిటో చట్టంలో పేర్కొనలేదు. మండల, జిల్లా పరిషత్ విధుల్లోనూ వీరికి కనీసం పర్యవేక్షణ అవకాశం కూడా లేదు. కార్యాలయాల్లో కూర్చోవడానికి కనీసం కుర్చీ కూడా లేదు. కోటి ఆశలతో కోట్లు వెచ్చించి గెలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ప్రస్తుతం ఉత్సవ విగ్రహాల్లా మారారు. విశాఖ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏవేవో వాగ్ధానాలు చేశారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేసి గెలిచారు. రెట్టింపు సంపాదించవచ్చని భావించారు. గెలిచాక చేతిలో చిల్లిగవ్వ లేదు. జిల్లా పరిషత్లో ఉన్న నిధుల గురించి తెలిశాక వారికి కంటిమీద కునుకులేదు. హామీల మేరకు మండలాల్లో ఏ పనులు చేపట్టాలో తెలియక జిల్లాలోని 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ సభ్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిం ది. వీరి కంటే సర్పంచ్ల పరిస్థితే నయం. పంచాయతీ కార్యాలయం,నిధులు, అధికారాలు ఇలా అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. కానీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు అవేవి లేక ఉత్సవ విగ్రహాల్లా మారారు. జెడ్పీలో కోట్లకు కోట్లు బడ్జెట్ ఉంటుందని ఆశించిన జెడ్పీటీసీలు అభివృద్ధి కార్యక్రమాలకే సరిపడని నిధులున్నట్లు తెలుసుకొని విస్తుపోతున్నారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చాలో తెలి యక, ప్రజల మధ్యకు వెళ్లలేక కిందామీదా పడుతున్నారు. అధికారదాహంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎంపీటీసీల పరిస్థి తి మరింత దయనీయంగా మారింది. అటువంటి వారిపై అనర్హత వేటుపడడం ఉన్న పదవీ పోయి.. ఎన్నికల్లో చేసిన ఖర్చు తిరిగి సంపాదించుకునే అవకాశం లేక.. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అధికార పార్టీ సభ్యులుసైతం వారిని పట్టించుకోకపోవడంతో రెంటికీ చెడ్డ రేవడిలా మారారు. జెడ్పీలో రూ.12 కోట్లు నిధులు జిల్లా పరిషత్లో ప్రస్తుతం రూ.12 కోట్లు నిధులున్నాయి. 13వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.4.5 కోట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.1.5 కోట్లు, సాధారణ నిధులు రూ.5 కోట్లు ఇటీవలే విడుదలయ్యాయి. వీటితో పాటు తలసరి నిధుల కింద మరో రూ.కోటి వరకు వ చ్చింది. ఇంతకు మించి జిల్లా పరిషత్కు ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు వచ్చే అవకాశాలు లేవు. వీటిలో రూ.కోటి వరకు గ్రామీణప్రాంతాల్లో తాగునీటి సరఫరా కోసం వినియోగిస్తున్నారు. ఆందోళనలో సభ్యులు జెడ్పీటీసీ సభ్యుడు నిర్వహించే విధులు, బాధ్యతలు స్పష్టం చేయలేదు. మండల పరిషత్లలో వీరికి స్థానమే లేదు. ఎంపీపీకి ఓ కార్యాలయం ఉంటుంది. ప్రజల ఓట్లతో నేరుగా ఎన్నికయ్యే జెడ్పీటీసీలకు ఎటువంటి కార్యాలయం ఉండదు. ఎంపీపీ, జెడ్పీటీసీలు వేర్వేరు పార్టీలకు చెందిన వారైనప్పుడు ప్రొటోకాల్ వివాదాలు ఉంటాయి. ఒకప్పుడు జిల్లా ప్రణాళిక కమిటీలు ఉండేవి. వాటిల్లో జెడ్పీటీసీలు సభ్యులుగా ఉండేవారు. నిధుల వ్యయం, తదితర అంశాలపై కొంత అజమాయిషీ సాగేది. ఇప్పుడు ఈ కమిటీలను పూర్తిగా నిర్వీర్యం చేసి జిల్లాఅభివృద్ధి సమీక్ష మండలి(డీడీఆర్సీ)తో పెత్తనం కొనసాగిస్తున్నారు. మండల స్థాయిలోనూ ఎమ్మెల్యేల హవా ఎక్కువగా ఉంటోంది. ఇటు అధికారాలు లేక.. సంపాదించుకొనే మార్గాలు కానరాక జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు బొమ్మలుగా మారిపోయారు. -
సారూ మరిచారా?మీరు జిల్లాకు కలెక్టరు కదా !
ఫోకస్ మొత్తం కుప్పంపైనేనా ? ఐదుగురు ఆర్డీవో స్థాయి అధికారుల నియామకం డెప్యుటేషన్పై 26మంది టీచర్ల బదలాయింపు వైద్యశాఖలోనూ 48 మందిని పంపిన వైనం అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి కంకణం కలెక్టర్ పనితీరుపై జిల్లాలో జోరుగా చర్చ కుప్పం నియోజకవర్గం చాలా వెనుకబడింది...కచ్చితంగా అభివృద్ధి చేయాల్సిందే ! ఇది ఎవరూ కాదనలేని సత్యం. అయితే ఫోకస్ మొత్తం కుప్పంపైనే ఉంచి తక్కిన నియోజకవర్గాలను విస్మరిస్తే...అది కూడా సరికాదనేది విశ్లేషకుల అభిప్రాయం. అచ్చం ఇదే తంతుతో ముందుకెళుతున్నారు కలెక్టర్ సిద్ధార్థ్జైన్. విధుల్లో చేరినప్పటి నుంచి ‘కుప్పం’పై కలెక్టర్ అనుసరిస్తున్న పాలన, విధానపరమైన నిర్ణయాలపై అధికారులతో పాటు, విశ్లేషకుల్లో జోరుగా చర్చసాగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే జిల్లా కలెక్టర్లా కాకుండా కుప్పం ఆర్డీవోగా సిద్ధార్థ్జైన్ వ్యవహరిస్తున్నారని చర్చించుకుంటున్నారు. సాక్షి, చిత్తూరు: జిల్లా కలెక్టర్గా సిద్ధార్థ్జైన్ గత నెల 12న బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో చేరినప్పటి నుంచి దూకుడుగా పాలన సాగిస్తున్నారు. అధికారులను పరుగెత్తిస్తున్నారు. తనదైన ‘మార్క్’ను చూపించి పాలనను గాడిలో పెట్టాలని యత్నిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా సమగ్రాభివృద్ధిపై కాకుండా కుప్పం నియోజకవర్గంపైనే కలెక్టర్ ఫోకస్ పెట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెలరోజుల్లో కుప్పంపై కలెక్టర్ మార్క్ ఇది బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐదు రోజులకే కలెక్టర్ కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు నలుగురు ఆర్డీవో స్థాయి అధికారులను నియమించారు. ఆధార్ సీడింగ్తో పాటు అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యత వారికి అప్పగించారు. వీరితో పాటు అమలాపురం ఆర్డీవో ప్రియాంకను కుప్పం ప్రత్యేకాధికారిగా రప్పించడంలో కూడా కలెక్టర్ చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రితో చర్చించి ప్రత్యేకాధికారిగా రప్పించారని తెలిసింది. దీంతో కుప్పం నియోజకవర్గాన్ని ఐదుగురు ప్రత్యేకాధికారులు పర్యవేక్షిస్తున్నారు. తొలి గ్రీవెన్స్ సెల్ చిత్తూరులో నిర్వహించి, రెండో గ్రీవెన్స్డేను కుప్పంలో నిర్వహించారు. తాజాగా కుప్పంలో ఉపాధ్యాయులు, వైద్య, ఆరోగ్యశాఖల్లో ఖాళీల భర్తీపై దృష్టి సారించారు. ఇటీవల 26మంది ప్రభుత్వ టీచర్లను జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కుప్పం నియోజకవర్గానికి డెప్యుటేషన్పై పంపించారు. అలాగే 48మంది వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందిని కుప్పానికి పంపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం డెప్యుటేషన్పై ఎవరినీ ఎక్కడా నియమించకూడదు. పైగా కౌన్సెలింగ్ ద్వారా కాకుండా ప్రత్యేకంగా కలెక్టర్ చొరవ తీసుకుని కుప్పం ఖాళీల భర్తీకి ఉపక్రమించారు. జిల్లా వ్యాప్తంగా 2629 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కుప్పం నియోజకవర్గంలో 510 ఖాళీలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఇతర నియోజకవర్గాలపై దృష్టి సారించకుండా కుప్పం వెళ్లేందుకు టీచర్ల నుంచి వినతిపత్రాలు తీసుకుని పంపించారు. ఇదే తరహాలో పూతలపట్టు, గంగాధర నెల్లూరు, మదనపల్లెలోని మారుమాల ప్రాంతాల్లో ఖాళీలపై కలెక్టర్ ఎందుకు దృష్టిసారించడం లేదని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఏలుబడిలో పాతికేళ్ల నిర్లక్ష్యం: చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గ వాసి అయినప్పటికీ కుప్పం ప్రజలు పాతికేళ్లుగా చంద్రబాబును ఆరాధిస్తున్నారు. అందలం ఎక్కిస్తున్నారు. తొ మ్మిదేళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్షనేతగా కూడా ‘కుప్పం’ నుంచే ప్రాతినిథ్యం వహించారు. అయితే ఇన్నేళ్లు ఆదరించిన కుప్పం వాసులను చంద్రబాబు మాత్రం పూర్తిగా విస్మరించారు. కుప్పంలోని వలసలను నివారించడం, ఉపాధి కల్పనపై దృష్టిసారించడం, వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. కుప్పం కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైంది. గంగాధర నెల్లూరు, పూతలపట్టు, నగరి, సత్యవేడు, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలు కూడా అభవృద్ధిలో వెనుకబడి ఉన్నాయి. జిల్లా కలెక్టర్గా వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యత కలెక్టర్పై ఉంటుంది. అయితే తాగునీటికి కటకటలాడుతున్న పూతలపట్టు లాంటి నియోజకవర్గాలతో పాటు జిల్లా అభివృద్ధిపై పాక్షిక దృష్టి పెట్టి, కుప్పంపై మాత్రం పూర్తి దృషి సారిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కూడా ఇదే దోవలో వెళుతున్నారు. దీంతో ప్రజాప్రతినిధులు బయటపడకపోయినా లోలోపల కలెక్టర్ వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారు. బాధ్యత లు తీసుకున్న నెలరోజుల్లోనే కలెక్టర్ తన మనసులోని ‘లక్ష్యాన్ని’ బయట పెట్టారని చెబుతున్నారు. అధికారపార్టీ నేతలు కూడా కలెక్టర్ తీరుపై నిరుత్సాహాంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు కూడా కలెక్టర్ వైఖరిపై నేరు గా మాట్లాడకున్నా, కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరుపై అధికారుల అంతర్గత చ ర్చల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి నెలరోజులు ‘పాలనబండిని’ కు ప్పంవైపు నడిపిన కలెక్టర్ ఇప్పుడైనా దారి మారుస్తారో లేదో చూడాల్సిందే! -
మహిళలు.. మనీ రాణులు
మహిళలు వంటింటికే పరిమితమన్న మాటలకు కాలం చెల్లి చాలా రోజులయ్యింది. ఆర్థిక రంగం నుంచి అంతరిక్షం దాకా అన్నింటిలోనూ వారు దూసుకెళ్లిపోతున్నారు. ప్రపంచస్థాయిలో పెద్ద పెద్ద కంపెనీల్లో వన్ మ్యాన్ షో .. సారీ.. వన్ ఉమన్ షో నడిపించేస్తున్నారు. పురుషాధిక్య రంగాల్లో కూడా ఆధిపత్యాన్ని చాటుతున్నారు. దేశంలోనే అతి పెద్ద బ్యాంకులైన ఎస్బీఐ (అరుంధతి భట్టాచార్య), ఐసీఐసీఐ బ్యాంకు (చందా కొచర్), యాక్సిస్ (శిఖా శర్మ) బ్యాంకులకు సారథ్యం వహిస్తున్నది మహిళలే. అంతర్జాతీయంగా సాఫ్ట్డ్రింక్స్ దిగ్గజం పెప్సీకి (ఇంద్రా నూయి), ఇంటర్నెట్ దిగ్గజం యాహూకి (మెరిస్సా మెయర్) నేతృత్వం వహిస్తున్నది వారే. వీరికి ఇంతటి విజయాలెలా సాధ్యమయ్యాయి.. వీటి వెనుక రహస్యాలేమిటి.. మనీ మ్యాటర్స్లో పురుషాధిక్యతను అధిగమించగలగడంలో మహిళల ప్రత్యేకతలేమిటీ? వీటిపైనే ఈ వారం ధనం కథనం. టైమ్ కావొచ్చు, మనీ కావొచ్చు.. మేనేజ్మెంట్ విషయంలో మహిళలే నంబర్వన్. అందుకే, మిగతా విషయాలెలా ఉన్నా ఇంటి ఖర్చుల మేనేజ్మెంటు బాధ్యతలు వారికి అప్పగిస్తుంటారు. పెద్దగా దృష్టి పెట్టం గానీ.. రిస్కులు తీసుకోవడం నుంచి లక్ష్యాలు సాధించడం దాకా మహిళల్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో కొన్ని.. లక్ష్యం నిర్దేశించుకోవడం.. లక్ష్యాలు నిర్దేశించుకోవడం, సాధించడంలో మహిళలు మేటి. అత్యధిక శాతం మహిళలు ఇంటిలోనైనా ఆఫీసులోనైనా.. ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంపైనా, సాధించడంపైనా ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అందుకే, స్కూలు స్థాయి నుంచి యూనివర్సిటీల దాకా టాపర్స్లో ఎక్కువశాతం వారే. లక్ష్య సాధనపై దృష్టి కారణంగానే కెరియర్లో కూడా మగవారి కన్నా కాస్త వేగంగా ముందుకెళ్లగలుగుతారు. ఇలా లక్ష్యాలను నిర్దేశించుకోవడమనేది విజయంతో పాటు కాస్త సమయం ఆదా చేసుకోవడానికి కూడా తోడ్పడుతుంది. విద్య ఎంపికలో.. చదువుకు సంబంధించి కోర్సులను ఎంచుకోవడంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తమకు అనుకూలమైనవి, తాము అన్ని విధాలా రాణించేందుకు అవకాశాలు ఉన్న రంగాలను ఎంచుకుంటూ ఉంటారు. మేనేజ్మెంట్, మెడికల్, అడ్మినిస్ట్రేటివ్ కోర్సులు వారికి ఆల్టైమ్ ఫేవరెట్స్గా ఉంటుంటాయి. ఒక టి, రెండు మార్కులు పోయినా పర్లేదులే అని అబ్బాయిలు లైట్గా తీసుకున్నా.. అమ్మాయిలు మాత్రం ఆ ఒక్క మార్కు కూడా పోకూడదని సీరియస్గానే తీసుకుంటుంటారు. సాధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తారు. సెల్ఫ్-హెల్ప్.. ఇంటి పనుల విషయంలో చూడండి. పిల్లల డైపర్లు మార్చడం నుంచి నిత్యావసరాలు కొనుక్కుని తెచ్చుకోవడం, బిల్లులు కట్టేసేయడం దాకా అన్ని విషయాలను ఎవరిపైనా ఆధారపడకుండా స్వంతంగానే చక్కబెట్టుకుంటుంటారు మహిళలు. వారు సెల్ఫ్-హెల్ప్కి ప్రాధాన్యమిస్తారు. భర్తకో, కుటుంబ సభ్యులకో, స్నేహితులకో పని అప్పజెప్పి.. వారు చేసే దాకా ఎదురుచూస్తూ కూర్చుని సమయం వృదా చేసుకోవడం కన్నా సొంతంగా పనులు పూర్తి చేసుకోవడానికి మొగ్గు చూపుతారు. ఇతరులకు అప్పజెబితే తమలాగా శ్రద్ధగా చేస్తారో లేదోనన్న సందేహం కూడా దీనికి కొంత కారణం. ఎందుకంటే..మహిళలు పర్ఫెక్షనిస్టులు కూడా. రోజువారీ రికార్డు.. ఆర్థిక విషయాలు ఇంటికి సంబంధించినవైనా.. ఆఫీసుకు సంబంధించినవైనా.. మహిళలు రికార్డు పాటించడంలో పక్కాగా ఉండేందుకు ఇష్టపడతారు. ప్రతీ పైసాకి వారి దగ్గర లెక్క ఉంటుంది. ఇది మగవారికి కాస్త చాదస్తంగా అనిపించినా.. నెల తిరిగేసరికి జమాఖర్చుల పక్కా రికార్డు చూస్తే మరి మాట్లాడటానికి ఉండదు. నేర్చుకోవడానికి ప్రాధాన్యం.. మహిళలు సాధ్యమైనంత వరకూ తప్పులకు దూరంగా ఉండటానికి ప్రాధాన్యమిస్తారు. ఒకవేళ చేసినా దాన్నుంచి నేర్చు కుంటారు. ఒకసారి చేసిన మిస్టేక్ను మరోసారి చేయరు. ఏదైనా డీల్తో లాభం వచ్చిందంటే.. మరింత అధిక టార్గెట్లతో మరోసారి ప్రయత్నిస్తారు. అదే నష్టం వస్తే.. దాన్ని పాఠంగా తీసుకుని మళ్లీ రిపీట్ కాకుండా జాగ్రత్తపడతారు. ప్లాన్ బీ.. ఒక ప్లాన్ వర్కవుట్ కాకపోతే.. మరొకటి..ఇలా ప్రతిదానికీ మహిళల దగ్గర ప్లాన్ బి అంటూ ఒకటి ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర ఫుడ్ సరిగ్గా లేకపోయినా.. నచ్చినవి కొనేందుకు సరిపడేంత డబ్బు చేతిలో లేకపోయినా.. అప్పటికప్పుడు ఏదో ఒకటి అరేంజ్ చేసేయగలరు వారు. సందర్భం ఏదైనా సరే వారి దగ్గర ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధంగా ఉంటుంది. ఆఖరు నిమిషంలో కూడా మార్పులు, చేర్పులను సమర్థంగా చేయగలరు. అప్పులు.. సాధ్యమైనంత వరకూ అప్పు ఊసే ఉండకుండా చూసుకోవడానికి మహిళలు మొగ్గు చూపుతుంటారు. కుటుంబసభ్యులో, స్నేహితులో ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకుని కొనుక్కోవడం కన్నా.. చేతిలో ఉన్నప్పుడే కొనుక్కునేందుకు ఇష్టపడుతుంటారు. అందుకే మహిళలు అప్పుల బారిన పడటం కూడా చాలా తక్కువే. ఎలాంటి పరిస్థితినైనా మేనేజ్ చేసేయగల పుష్కలమైన మేనేజ్మెంట్ నైపుణ్యాలు, ఆఖరు నిమిషంలో కూడా దేన్నయినా సెట్ రైట్ చేయగలిగే సామర్థ్యాలు ఉండటమే ఇందుకు కారణం. రిస్కుకి రెడీ.. మిగతావారు మనకి రిస్కు ఎందుకులే అనుకున్న వాటిని కూడా జంకకుండా చేపట్టగలిగే ధైర్యం మహిళల సొంతం. రిస్కు తీసుకున్నా.. విజయాలు సాధించిన వారి ఉదంతాలు కోకొల్లలు. నష్టపోవాల్సి వస్తుందన్న భయం కన్నా.. విజయంపై ఆశావహంగా ఉండగలగడం, నేర్పుగా వ్యవహరించగలగడం ఇందుకు కారణం. పైగా.. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో సమర్థత కలిగి ఉండటం మరో కారణం. మనీ మేనేజ్మెంట్.. కీలకమైన డబ్బు సంగతికొస్తే.. ఎక్కడ, దేనిపై, ఎంత ఖర్చు చేయాలన్న దానిపై మహిళలు ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అనవసరమైన వాటిపై ఖర్చు చేయడం కన్నా.. దీర్ఘకాలిక అవసరాల కోసం డబ్బును పొదుపు చేయడానికే ప్రాధాన్యమిస్తుంటారు. ఆదాయం కన్నా ఖర్చుల లిస్టు తక్కువగా ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంటి విషయంలోనైనా ఆఫీసు విషయంలోనైనా అవసరమనుకున్న వాటిపై తప్ప మిగతా వాటిపై ఖర్చు చేసేందుకు ఇష్టపడరు. మనీ మేనేజ్మెంట్లో వారి సామర్థ్యం ఇందుకు ఉపయోగపడుతుంది. -
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తా
ఎస్పీ జి విజయకుమార్ మచిలీపట్నం : ఎస్పీగా జి.విజయకుమార్ సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. పోలీసు సంప్రదాయం ప్రకారం అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విజయకుమార్ విలేకరులతో మాట్లాడారు. తనకు విజయవాడలో డీసీపీగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలీసుశాఖాపరంగా ఉన్న సమస్యలపై అవగాహన పెంచుకుని, సమర్థంగా విధులు నిర్వహిస్తానని చెప్పారు. శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు, నేరాల సంఖ్యను తగ్గించేం దుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తానన్నారు. జిల్లాలోని పాత్రికేయులు, మేధావుల నుంచి సలహాలు స్వీకరించి జిల్లాలో పోలీసుల పని తీరును మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని చెప్పారు. తొలుత ఎస్పీకి ఏఎస్పీ వి.డి.వి.సాగర్, వోఎస్డీ వృషికేశ్రెడ్డి, జిల్లాలోని ఆయా డివిజన్ల డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు స్వాగతం పలికారు. కలెక్టర్ను కలిసిన ఎస్పీ చిలకలపూడి : కలెక్టర్ ఎం.రఘునందనరావును ఎస్పీ విజయకుమార్ సోమవారం ఆయన చాంబ ర్లో కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేశారు. -
పాలన దారిలోకి తెస్తున్నాం
మంత్రి అయ్యన్నపాత్రుడు చోడవరం టౌన్: గడచిన పదేళ్లలో రాష్ట్రంలో పరిపాలన గాడితప్పిందని, దాన్ని గాడిలో పెడుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు ఆదివారం చోడవరం వచ్చిన ఆయన ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. లక్షన్నర మాఫీతో 86 శాతం మంది లబ్ధిపొందనున్నారని చెప్పారు. రాష్ట్రం లో 13 వేల పంచాయతీలకుగాను 3 వేల పంచాయతీల్లో స్వచ్ఛంద సంస్థలు తాగునీటిని సరఫరా చేస్తున్నాయని, మిగలిన వాటిలో 5 వేల పంచాయతీల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్రా రంభించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మండలానికి ఐదు పంచాయతీలు ఎంపిక చేస్తామని, విశాఖ జిల్లాలో మాత్రం పది పంచాయతీలు చొ ప్పున ఎంపిక చేయన్నుట్లు తెలిపారు. డ్వాక్రా సంఘాలు ముందుకు వస్తే వారికి ఈ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం టూర్ ప్రోగ్రాం వివరించారు. 30న చోడవరంలో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రైతులతో సమావేశం, అనంతరం అనకాపల్లి పరిశోధనా కేంద్రంలో అధికారులతో సమీక్ష ఉంటుందన్నారు. 31న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు జిల్లా ముఖ్య నాయకులు, అధికారులతో సమీక్ష సమావేశాలుంటాయన్నారు. ఆ తర్వాత కశింకోటలో జరిగే ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. అనంతరం తాళ్లపాలెంలో ప్రజాసదస్సు, తర్వాత యలమంచిలిలో రోడ్షో, మధ్యాహ్నం 2 గంటలకు పురుషోత్తపురంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభం ఉంటుందన్నారు. 3 గంటలకు నక్కపల్లిలో డ్వాక్రా మహిళలతో సమావేశం, 5 గంటలకు ఉపమాక వేంకటేశుని దర్శనం అనంతరం హైదరాబాద్ ప్రయాణమవుతారని చెప్పారు. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం పరిశీలించారు. చోడవరం హైస్కూల్ ఆవరణను పరిశీలించాక కలెక్టర్, ఎస్పీతో చర్చించారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంత్రుల వెంట ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పీలాగోవింద, కె.ఎస్.ఎన్.రాజు, టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు రామానాయుడు ఉన్నారు. -
బెల్ ద క్యాట్..
ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లలో పీజీ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశించాలంటే రాయాల్సిన పరీక్ష.. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్). వేలల్లో ఉండే సీట్ల కోసం లక్షల మంది పోటీ పడే పరీక్ష.. క్యాట్. గతేడాది 13 ఐఐఎంలలో ఉన్న 3335 సీట్ల కోసం రెండు లక్షల మంది పోటీపడ్డారు. ప్రస్తుతం క్యాట్ - 2014 ప్రకటన వెలువడింది. ఆన్లైన్ విధానంలో ఉండే పరీక్షను ఈ ఏడాది నవంబర్ 16, 22 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ ఏడాది పరీక్షలో ప్రశ్నల సంఖ్యను, పరీక్ష వ్యవధిని పెంచనున్నారు. ఈ నేపథ్యంలో ఔత్సాహిక అభ్యర్థులు మంచి పర్సంటైల్ సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై నిపుణుల సలహాలు.. క్యాట్-2014 సమాచారం అర్హత: 50 శాతం (ఎస్సీ, ఎస్టీ, శారీరక వికలాంగులకు 45 శాతం) మార్కులతో ఏదైనా బ్యాచిలర్స డిగ్రీ ఉత్తీర్ణత. పరీక్ష ఫీజు: జనరల్, ఓబీసీ (ఎన్సీ) - రూ.1600, ఎస్సీ, ఎస్టీ, శారీరక వికలాంగులకు రూ.800. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: ఆగస్టు 6, 2014 ఆన్లైన్ దరఖాస్తుల ముగింపు: సెప్టెంబర్ 30, 2014 ఆన్లైన్ పరీక్ష తేదీలు: నవంబర్ 16, 22 తేదీల్లో ఫలితాల ప్రకటన: డిసెంబర్ మూడోవారం 2014. వెబ్సైట్: www.iimcat.ac.in రెండు విభాగాల పరీక్ష గత కొన్నేళ్లుగా క్యాట్లో రెండు విభాగాల్లో (క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్; వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్) అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. గతేడాది ప్రతి విభాగానికి 70 నిమిషాలు చొప్పున మొత్తం 140 నిమిషాలు సమయం కేటాయించారు. అదే విధంగా ప్రతి విభాగంలో 30 ప్రశ్నలు అడిగారు. అయితే ఈ ఏడాది ప్రతి విభాగంలో 50 ప్రశ్నలు ఇవ్వనున్నారు. సమయాన్ని కూడా 140 నిమిషాల నుంచి 170 నిమిషాలకు పెంచుతున్నట్లు క్యాట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఐఐఎం-ఇండోర్ ప్రకటించింది. కాబట్టి అభ్యర్థులు ఈ మార్పులను దృష్టిలో పెట్టుకోవాలి. వీటికనుగుణంగా ప్రిపరేషన్ సమయంలోనే తగిన కసరత్తు చేయాలి. క్వాంటిటేటివ్ ఎబిలిటీ క్యాట్లోని మిగతా విభాగాలతో పోల్చితే విజయ సాధనలో అత్యంత కీలకమైన విభాగం.. క్వాంటిటేటివ్ ఎబిలిటీ. అందుకే ప్రిపరేషన్ను కూడా వ్యూహాత్మకంగా చేయాలి. తొలుత ఈ విభాగానికి సంబంధించి నిర్దేశిత సిలబస్లోని అన్ని అంశాలను ఆసాంతం చదవాలి. ఇదే వ్యూహాన్ని.. అభ్యర్థులు ఆన్లైన్ టెస్ట్ తేదీకి నాలుగు వారాల ముందు వరకు అనుసరించాలి. ప్రతి అంశంలోని ప్రాథమిక భావనలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. అప్లికేషన్ ఓరియెంటేషన్తో ప్రిపరేషన్ సాగించాలి. ముఖ్యంగా జామెట్రీ, అల్జీబ్రా, నంబర్స్కు సంబంధించి ఆయా అంశాలను అనుసంధానం చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. చదివేటప్పుడే ఆయా అంశాలకు సంబంధించిన ముఖ్యమైన ఫార్ములాలను, కాన్సెప్ట్లను షార్ట్నోట్స్ రూపంలో పొందుపరుచుకోవాలి. ఇది రివిజన్ సమయంలో ఉపయోగపడుతుంది. టెస్ట్ తేదీలకు కనీసం నెలరోజుల ముందు నుంచి గత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. అలాగే రివిజన్ కొనసాగించాలి. చివరి నెలరోజుల వ్యవధిలో కొత్త అంశాలు చదవాలనుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. పైగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇంగ్లిష్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా ఉండే విభాగం.. ఇంగ్లిష్. ఇందులో ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు ఎక్కువ వెయిటేజీ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో తులనాత్మక అధ్యయనం చేయాలి. ఒక ప్యాసేజ్లోని ‘కీ’ వర్డ్స్ను, ‘కీ’పాయింట్స్ను గుర్తించే విధంగా సూక్ష్మ పరిశీలన నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఇందుకు సరైన సాధనం.. ఇంగ్లిష్ దినపత్రికలను, మేగజైన్లను క్రమం తప్పకుండా చదవడం. వాటిలోని ఎడిటోరియల్స్, ఇతర వ్యాసాలను చదివి.. సదరు అంశం సారాంశాన్ని సంక్షిప్తంగా రాయగలిగే నేర్పు మెరుగుపరచుకోవాలి. వొకాబ్యులరీని పెంచుకునేందుకు కృషి చేయాలి. డేటా ఇంటర్ప్రిటేషన్ డేటా ఇంటర్ప్రిటేషన్లో మంచి స్కోర్ సాధించేందుకు అభ్యర్థులు విశ్లేషణ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఈ విభాగం నుంచి సూక్ష్మ పరిశీలన, కాలిక్యులేషన్, లాజికల్ రీజనింగ్ ఆధారిత ప్రశ్నలు అధికంగా ఉంటాయి. కంపేరిటివ్ అప్రోచ్ కూడా ఎంతో కలిసొస్తుంది. గణాంకాలు, కూడికలు, తీసివేతల ప్రమేయం ఎక్కువగా ఉండే ఈ విభాగంలో రాణించడానికి మరో ముఖ్య సాధనం.. వేగంగా గణించే నేర్పు సొంతం చేసుకోవడం. దీనికి మార్గం రెగ్యులర్ ప్రాక్టీస్. ముఖ్యంగా పర్సంటేజెస్, సగటులు, ప్రాబబిలిటీ సంబంధిత అంశాలపై బాగా పట్టు సాధించాలి. స్టాండర్డ్ మెటీరియల్, ఆన్లైన్ టెస్ట్ ఎక్స్పీరియన్స్తో చక్కటి ఫలితాలు ఆశించొచ్చు. క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ కోసం అరుణ్ శర్మ పుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయి. లాజికల్ రీజనింగ్ అభ్యర్థుల్లోని తులనాత్మక సామర్థ్యాన్ని పరీక్షించే విభాగం.. లాజికల్ రీజనింగ్. ఇందు లో స్వీయ ఆలోచన శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. నిర్దిష్ట సమాచారం ఆధారంగా అడిగే ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సిన విభాగం. కాబట్టి అభ్యర్థులు పజిల్స్, డిడక్షన్, వెన్ డయాగ్రమ్స్, క్యూబ్స్, లాజికల్ కనెక్టివిటీస్ తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలు కూడా అడిగే అవకాశముంది. పజిల్స్ కోసం శకుంతలా దేవి, జార్జ్ సమ్మర్స్ పుస్తకాలను చదివితే సరిపోతుంది. మిగిలిన అంశాల కోసం ఏదైనా క్యాట్ స్టాండర్డ్ మెటీరియల్ను చదవడం లాభిస్తుంది. వెర్బల్ రీజనింగ్ పేరా జంబ్లింగ్, పేరా కంప్లీషన్, క్రిటికల్ రీజనింగ్ తరహా ప్రశ్నలు ఎక్కువగా అడిగే వెర్బల్ రీజనింగ్లో రాణించేందుకు పేరాగ్రాఫ్ ఇంట్రడక్టరీ స్టేట్మెంట్స్పై అవగాహన పెంచుకోవాలి. ఒక పేరాలో రెండు వాక్యాలను అనుసంధానం చేసే పదాలను గుర్తించగలగాలి. దీనికి కూడా ప్రాక్టీస్ కీలక పాత్ర పోషిస్తుంది. వెర్బల్ ఎబిలిటీ ఇంగ్లిష్ బేసిక్ గ్రామర్, పదాల ఆధారిత ప్రశ్నలు ప్రధానంగా ఉండే వెర్బల్ ఎబిలిటీలో మంచి స్కోర్ కోసం.. గ్రామర్కు సంబంధించి రెన్ అండ్ మార్టిన్ లేదా ఇతర స్టాండర్డ్ గ్రామర్ బుక్స్ను చదివితే సరిపోతుంది. వర్డ్ బేస్డ్ కొశ్చన్స్లో స్వీయ ప్రాక్టీస్ కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ తప్పనిసరిగా కొన్ని కొత్త పదాలను ప్రాక్టీస్ చేయాలి. కనీసం రోజుకు 60 నుంచి 80 కొత్త పదాలు తెలుసుకునేలా ప్రిపరేషన్ సాగించాలి. క్యాట్ - టైం ప్లాన్ ప్రతి రోజూ తప్పనిసరిగా మూడు నుంచి నాలుగు గంటలు క్యాట్ కోసం కేటాయించాలి. ఆయా విభాగాలకు సంబంధించి తాము బలహీనంగా ఉన్న అంశాలపై ముందుగా పట్టు సాధించేందుకు కృషి చేయాలి. దీనికి అనుగుణంగా ప్రిపరేషన్కు కేటాయించిన సమయాన్ని విభజించుకోవాలి. క్రిటికల్ థింకింగ్, కంపేరిటివ్ అప్రోచ్తో విజయం క్యాట్ ఔత్సాహిక అభ్యర్థులు ముందుగా అలవర్చుకోవాల్సిన లక్షణాలు.. క్రిటికల్ థింకింగ్, కంపేరిటివ్ స్టడీ అప్రోచ్. సిలబస్లోని నిర్దేశిత అంశాలను చదివేటప్పుడు ఆయా అంశాలను తులనాత్మకంగా, సూక్ష్మ పరిశీలనతో అధ్యయనం చేయాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో సిలబస్లోని అన్ని అంశాలు పూర్తి చేయడం సులభమే. నాన్-మ్యాథ్స్ అభ్యర్థులు క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్కు సంబంధించి ఆందోళన చెందక్కర్లేదు. పదో తరగతి స్థాయిలో మ్యాథమెటిక్స్ ఫండమెంటల్స్లో పట్టు ఉన్న అభ్యర్థులెవరైనా సమాధానాలు ఇచ్చే విధంగానే ప్రశ్నలు ఉంటాయి. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఇప్పటి నుంచే బేసిక్స్పై పట్టు కోసం సీబీఎస్ఈ టెన్త్ స్టాండర్డ్ బుక్స్ను అధ్యయనం చేయాలి. ప్రస్తుత సమయంలో కచ్చితంగా నిర్దిష్ట సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆయా సబ్జెక్ట్లలో తమ బలాలు, బలహీనతల ఆధారంగా ఆ సమయాన్ని ప్రిపరేషన్కు కేటాయించాలి. మాక్ టెస్ట్లు, ఆన్లైన్ టెస్ట్లకు హాజరై.. వాటి ఫలితాల విశ్లేషణ ద్వారా ఇంకా మెరుగుపరచుకోవాల్సినఅంశాలను గుర్తించాలి. పరీక్షలో వాటి ప్రాధాన్యం ఆధారంగా ప్రిపరేషన్ సాగించాలి. - కె.రామనాథ్, డెరైక్టర్, క్యాట్ కోచింగ్ (టైమ్ ఇన్స్టిట్యూట్) ప్రాక్టీస్.. మాక్ టెస్ట్స్ క్యాట్లో మంచి స్కోరుకు మార్గం వేసే ముఖ్య సాధనాలు.. ప్రాక్టీస్, మాక్ టెస్ట్స్. ప్రిపరేషన్ సమయంలో థియరాటికల్ అప్రోచ్కు పరిమితం కాకుండా ప్రాక్టీస్ ఓరియెంటెడ్ ప్రిపరేషన్కు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ విభాగానికి సంబంధించి ఇది ఎంతో కీలకం. కంప్యూటేషనల్ స్కిల్స్ పెంచుకోవాలి. ప్రిపరేషన్ ప్రారంభ దశ నుంచే మాక్ టెస్ట్స్కు హాజరవడం కలిసొస్తుంది. ముందుగా తాము బలహీనంగా ఉన్న అంశాలపై దృష్టి సారించాలి. దీన్ని కూడా కొంత వరకే పరిమితం చేయాలి. లేదంటే మిగతా అంశాల ప్రిపరేషన్కు సమయం సరిపోదు. పరీక్షకు నెల రోజుల ముందు నాటికి సిలబస్ ప్రిపరేషన్ పూర్తి చేసుకునేలా టైం ప్లాన్ రూపొందించుకోవాలి. అప్పుడు క్యాట్లో మంచి స్కోరు ఆశించొచ్చు. - పి.వెంకట కృష్ణ, క్యాట్-2013 విజేత (100 పర్సంటైల్) క్యాట్ - ఫ్యాక్ట్స్ అభ్యర్థులు క్యాట్ స్కోర్ ఆధారంగా ప్రతి ఐఐఎంకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ఐఐఎంలు.. క్యాట్ కటాఫ్ స్కోర్ను కూడా ప్రకటిస్తాయి. క్యాట్ స్కోర్ ఆధారంగా షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులకు తదుపరి దశలో రిటెన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఐఐఎంలు తుది జాబితా ప్రకటిస్తాయి. ఈ క్రమంలో క్యాట్ స్కోర్, జీడీ/పీఐ, రిటెన్ ఎబిలిటీ టెస్ట్లకు నిర్దిష్టంగా వెయిటేజీలు ప్రకటిస్తున్నాయి. ఇవి.. ఆయా ఐఐఎంలకు వేర్వేరుగా ఉంటాయి. ఇవే కాకుండా.. అకడెమిక్ రికార్డ్, వర్క్ ఎక్స్పీరియన్స్లకు కూడా వెయిటేజీ ఉంటుంది. -
జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ బాధ్యతల స్వీకరణ
- జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి పాతగుంటూరు: జిల్లా పరిషత్ చైర్పర్సన్ షేక్ జానీమూన్ సోమవారం తన చాంబర్లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు జెడ్పిటీసీ సభ్యులు ఆమెకు అభినందనలు తెలిపారు. అనంతరం జానీమూన్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాపరిషత్ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. జిల్లా పరిషత్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ లక్ష్యసాధనకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పని చేయూలని అన్నారు. పాలన వ్యవహారాలను తెరవెనుక నుంచి ఎవరైనా చూస్తారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా తాను ఎమ్మెస్సీ కంప్యూటర్స్ చేశానని, అన్ని అంశాలను సొంతంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలో తనకు తెలుసని చెప్పారు. అధికారులను సమన్వయం చేసుకుని పని చేస్తామని వివరించారు. -
నేడు బాధ్యతలు స్వీకరించనున్న డిప్యూటీ సీఎంలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులతో పాటు పలువురు మంత్రులు ఆదివారం బాధ్యతలు చేపట్టనున్నారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప హెచ్ బ్లాక్లో ఉదయం 8.30 గంటలకు, మరో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మధ్యాహ్నం 12 గంటలకు జె బ్లాక్లో, పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు హెచ్ బ్లాక్లో ఉదయం 7.46 గంటలకు, రవాణా మంత్రి సిద్ధా రాఘవరావు ఉదయం 9.30 గంటలకు ఎల్ బ్లాక్లో, గనులు, మహిళా సాధికారత మంత్రి పీతల సుజాత ఉదయం 7.50 గంటలకు జే బ్లాక్ లో, దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు 7.45 గంటలకు, గ్రామీణాభివృద్ధి మంత్రి మృణాళిని 7.55 గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారు. -
సంక్షేమ హాస్టళ్లకు విద్యార్థులు కావలెను
జిల్లాలో ఆరువేల సీట్లు ఖాళీ విద్యార్థుల అన్వేషణలో అధికారులు పెద్దతిప్పసముద్రం: జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. స్థానికంగా కాపు రం ఉండని వార్డన్లు, ఇన్చార్జి వార్డన్లు సైతం సిబ్బం దికే అన్ని బాధ్యతలు అప్పజెప్పడం, అరకొర వసతు లు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా హాస్టళ్లలో ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో ఈ ఏడాది ఆరువేల వ రకు సీట్లు ఖాళీగా ఉండటమే ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు హాస్టల్లో సీటు కావాలంటే విద్యార్థులు అధికారుల చుట్టూ తిరిగేవారు. ప్రస్తుతం విద్యార్థుల కోసం సంక్షేమశాఖ అధికారులు తిరగాల్సిన దుస్థితి నెలకొంది. కనీసం 50 మంది విద్యార్థులు కూడా లేని హాస్టల్ను పక్కనున్న హాస్టల్లో కలిపేందుకు జిల్లా అ ధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 124 ఎస్సీ, 16 ఎస్టీ, 68 బీసీ సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. ఎస్సీ హా స్టళ్లలోనే 4 వేల సీట్లు ఖాళీగా ఉన్నాయి. హాస్టళ్లల్లో వి ద్యార్థుల బాగోగులు, కనీస సౌకర్యాలు కల్పించటం పై సంక్షేమ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించట మే ఇందుకు కారణమనే విమర్శలు వస్తున్నాయి. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను వసతులు లేని సంక్షే మ హాస్టళ్లలో చేర్పించేందుకు వెనుకంజ వేస్తున్నారు. నెలాఖరులోగా విద్యార్థుల సంఖ్యను పెంచకుంటే వే రే హాస్టల్లో కలిపేస్తామని జిల్లా సంక్షేమ అధికారులు వార్డన్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సంక్షేమ హా స్టళ్లలో పని చేసే సిబ్బంది విద్యార్థుల కోసం అన్వేషణ ప్రారంభించారు. విద్యార్థులను చేర్పించేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. ఒకవైపు హాస్టళ్లలో అరకొర విద్యార్థులు, మరోవైపు విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇంతవరకు బెడ్షీట్లు, నోటుపుస్తకాలు, ట్రంకుపెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు వంటివి హాస్టళ్లకు చేరకపోవడంతో పాత వస్తువులతోనే విద్యార్థులు కాలం గడపాల్సిన దుస్థితి నెలకొంది. సీట్ల భర్తీకి చర్యలు సంక్షేమ హాస్టళ్లల్లో ఖాళీగా వున్న సీట్లను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాము. ప్రతి హాస్టల్లో విద్యార్థుల సంఖ్య 50కి తగ్గితే పక్క హాస్టల్లో కలిపేస్తామని ఆయా పరిధిలోని వార్డన్లకు సూచించాం. విద్యార్థుల సంఖ్య పెంపు కోసం ఆయా గ్రామాల ప్రధానోపాధ్యాయులతో చర్చిస్తున్నాము. జిల్లాలో 22 ఎస్సీ హాస్టళ్లు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా పీటీఎం మండలంలోని కందుకూరు, పెద్దపంజాణి మండలంలోని నిడిగుంట గ్రామాల్లో ఉన్న ఎస్సీ హాస్టల్లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ రెండు హాస్టళ్లలో విద్యార్థులకు అయ్యే నెలవారి ఖర్చుకన్నా భవనం అద్దె, కరెంటు బిల్లులు, సిబ్బంది జీతభత్యాలే అధికంగా ఉన్నాయి. నెలాఖరులోగా విద్యార్థుల సంఖ్య పెరగకపోతే హాస్టళ్లను మూసివేసి పిల్లలను సమీపంలోని వేరే హాస్టల్లో చేర్పిస్తాం. - కెఎస్.ధనంజయ్రావ్. జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి -
తూర్పు నావికాదళ చీఫ్గా సతీష్ సోనీ
విశాఖపట్నం: తూర్పు నావికాదళ చీఫ్గా వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ సోమవారం ఇక్కడి నావల్బేస్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి 1976 జూలై ఒకటో తేదీన భారత నావికా దళంలో చేరిన ఆయన ఎయిర్క్రాఫ్ట్ డెరైక్షన్, నావిగేషన్ విభాగాల్లో ప్రావీణ్యత సాధించి స్వార్డ్ ఆఫ్ ఆనర్ అందుకున్నారు. డిఫెన్స్ స్టాఫ్ కాలేజ్, నావల్ వార్ఫేర్ కళాశాలల్లో విద్యనభ్యసించారు. ప్రతిష్టాత్మక నౌసేన మెడల్, అతి విశిష్టసేవా మెడల్, పరమ విశిష్టసేవా మెడల్స్ను అందుకున్నారు. తూర్పు నావికాదళ ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో చీఫ్గా సతీష్ సోనీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ అనిల్చోప్రా పదోన్నతిపై పశ్చిమ నావికాదళం చీఫ్గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో సతీష్ సోనీ నియమితులయ్యారు. -
దారి చూపు దీపాలు...
పెద్దవారి మాటలు అనుభవాల మూటలు. వెలుగు దీపాలు. యువత సరియైన దారిలో నడవాలంటే, ఒక ఆశయం అంటూ ఏర్పరచుకోవాలంటే, దాన్ని సాధించాలంటే, విజయ ధ్వజాన్ని సగర్వంగా పదిమందిలో ఎగరేయాలంటే ఆ వెలుగు కళ్లలో పడాలి. ప్రపంచవ్యాప్తంగా పేరున్న పెద్దలు, పేరు బయటపడడానికి ఇష్టపడని అజ్ఞాత జ్ఞానులు తమ మాటల్లో ఎన్నో మంచి విషయాలు చెప్పారు. ఆ మాటల వెలుగులు ఇవి.... ఒక యువకుడు తన సాయంత్రాలను ఏ విధంగా గడుపుతున్నాడో చెబితే... అతడు ప్రపంచం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపగలడో చెప్పవచ్చు. తమ ఖాళీ సమయాన్ని హానిరహిత ఆలోచనలతో, సృజనాత్మక, బాధ్యతాయుతమైన విషయాలకు సంబంధించిన చర్చలతో గడిపేవారు గొప్ప బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధులైనవారని చెప్పవచ్చు. - బి.సి.ఫోర్బ్స్, స్కాటిష్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్, ఫోర్బ్స్ మ్యాగజీన్ వ్యవస్థాపకుడు ఒక దేశం, ఆ క్షణంలో నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకోవడం అనేది ఆ దేశంలో ఉండే యువత మీద ఆధారపడి ఉంటుంది. - జాన్ పి.గ్రియర్, జర్నలిస్ట్, ఫోర్బ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ యవ్వనమనేది వసంతకాలంలాంటిది. ఆ సమయంలో నన్ను మనిషిగా నిలబెట్టే సుసంపన్నమైన విత్తనాలు నాటాను. మనిషిగా నేను ఎదిగే క్రమంలో అవి వృక్షాలుగా మారి, వయసులోకి వచ్చేసరికి చక్కని ఫలాలు ఇచ్చాయి. -రిచర్డ్ హిల్ ఫౌస్ యవ్వనంలో ఉన్నప్పుడు అనేక సమస్యలు ఎదురవుతాయి. యవ్వనం అంటేనే పోరాడే వయసు అని అర్థం. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలిగే తెలివితేటలతో కూడిన శక్తి ఆ వయసులో వస్తుంది. - అజ్ఞాత రచయిత విజయవంతమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించవద్దు. విలువలతో కూడా కూడిన విజయాన్ని సాధించిన వ్యక్తిగా నిలబడేందుకు ప్రయత్నించు. -అల్బర్ట్ ఐన్స్టిన్, శాస్త్రవేత్త నువ్వు చేసే పనులు అవతలి వారిలో స్ఫూర్తిని కలిగించి, ఉత్సాహాన్ని నింపి, నేర్చుకోవడానికి అవకాశం ఇస్తున్నాయంటే... నువ్వే ఒక లీడర్. - అజ్ఞాత రచయిత ఈ ప్రపంచం శక్తియుక్తులు కలిగిన వారి సొంతం. -రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, అమెరికన్ రచయిత ఒక అవసరాన్ని గుర్తించు, దాన్ని తీర్చడానికి ప్రయత్నించు. -మిసెస్ రూత్ స్టాఫోర్డ్ పీలే, అమెరికన్ రచయిత్రి చతురత, తెలివిగలవానిగా ఎదగడంలో ఒక శాతం స్ఫూర్తి ఉంటే 99 శాతం కష్టం ఉంటుంది. -థామస్ ఎడిసన్, శాస్త్రవేత్త భరించలేకపోతున్నాను అనుకుంటే.. దాన్ని ఎదురించి పోరాడు. పోరాడలేకపోతున్నాను అనుకుంటే.. దాన్ని భరించి బతుకు. - అజ్ఞాత రచయిత నిన్న చేసిన పని ఈ రోజుకూ నీకు అనందాన్ని ఇస్తుంటే.. ఈ రోజు అంతకన్నా గొప్పగా ఏమీ చేయలేవు. - అజ్ఞాత రచయిత నువ్వు ఏం ఆలోచిస్తున్నావనే విషయాన్ని ఎదుటివారి అంచనాలకు అందనివ్వకు. - అజ్ఞాత రచయిత