shivani
-
Paragamanjari: పుప్పొడి నేత..పరాగ మంజరి
పూల అందాలను చూసి మైమరచిపోవడం మనకు తెలిసిందే! వాటిలో దాగున్న పరాగ రేణువుల అందం చూస్తే... ప్రకృతి ఒడిలో మనకు తెలియని ఇన్ని అద్భుతాలు దాగున్నాయా అని ఆశ్చర్యపోవాల్సిందే! అత్యంత సంక్లిష్టంగా ఉండే ఆ పరాగ రేణువుల నిర్మాణపు అందాన్ని చూడటమే కాదు, వాటిని టెక్స్టైల్ డిజైన్స్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్శిటీ ఎమ్మెస్సీ విద్యార్థిని శివాని నేత చిలుకూరి. అత్యంత సూక్ష్మంగా కనిపించే ఈ అద్భుతాలను ‘పరాగ మంజరి’గా మనకు పరిచయం చేస్తున్నది. ‘దేశానికి గుర్తింపు తెచ్చే లక్షలాది యునిక్ డిజైన్స్ని పరిచయం చేయబోతున్న ఆనందంలో ఉన్నాను’ అంటున్న శివాని నేత తనప్రాజెక్ట్ విశేషాలను ఇలా మన ముందుంచింది..‘‘పరాగ అంటే పుప్పొడి – మంజరి అంటే డిజైన్. సంస్కృతం నుంచి తీసుకున్న ఈ పదాలను మాప్రాజెక్ట్కు పెట్టాం. బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకుని, కుదరక బోటనీ సబ్జెక్ట్ తీసుకున్నాను. ఉస్మానియా యూనివర్శిటీలో ఎమ్మెస్సీ బోటనీ చేస్తున్నాను. నాకు డ్రాయింగ్ కూడా తెలుసు అని మా బోటనీ ప్రొఫెసర్ విజయభాస్కర్ రెడ్డి సర్ నాకు ఈ డిజైనింగ్ టాపిక్ ఇచ్చారు. దానిని ఇలా మీ ముందుకు తీసుకు రాగలిగాను.లక్షలాది మోడల్స్పరాగ రేణువులను రెండు విధాలుగా మైక్రోస్కోప్ చేశాను. లైట్ మైక్రోస్కోపీలో ఫ్లవర్ స్ట్రక్చర్, సెమ్(స్కానింగ్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్)లో పుప్పొడి రేణువులను స్కాన్ చేశాను. భూమిపైన లక్షలాది మొక్కలు, వాటి పువ్వులు వేటికవి భిన్నంగా ఉంటాయి. ఇక వాటిలోని పరాగ రేణువులు మరింత భిన్నంగా ఉంటాయి. మందార, వేప, తులసి, తిప్పతీగ, తుమ్మ, అర్జున, ఉల్లిపాయ, కాకర, ఆరెంజ్, జొన్న, మొక్కజొన్న, ఖర్జూరం, దోస పువ్వు... ఇలా దాదాపు 70 రకాల పుప్పొడి రేణువులను స్కాన్ చేసి, ఆ స్కెలిటిన్ నుంచి మోటిఫ్స్ను వెలుగులోకి తీసుకువచ్చాను. ఈ అందమైన పరాగ రేణువుల నుంచి మోటిఫ్స్ డిజైన్స్గా తీసుకు రావడానికి నాలుగు నెలల సమయం పట్టింది.పేటెంట్ హక్కుఇప్పటి వరకు సాఫ్ట్వేర్లోనే టెక్స్టైల్ ΄్యాటర్న్ని తీసుకున్నాను. క్లాత్ మీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మాది నేత కుటుంబమే. నేను చేసిన ఈ ప్రింట్స్ క్లాత్స్ మీదకు తీసుకురావచ్చని నిర్ధారణ చేసుకున్నాం. కాటన్, పట్టు, సీకో మెటీరియల్ మీదకు మోటిఫ్స్ ప్రింట్స్ చేయచ్చు. నేతలోనూ డిజైన్స్ తీసుకోవచ్చు. ఎంబ్రాయిడరీ కూడా చేయచ్చు. మేం ముందు టీ షర్ట్ పైన ప్రింటింగ్ ప్రయత్నం చేశాం. ఇంకా మిగతా వాటి మీదకు ప్రింట్స్ చేయాలంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ మద్దతు అవసరం అవుతుంది. బ్లాక్ ప్రింట్ చేయాలన్నా .. అందుకు తగిన వనరులన్నీ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ముందుగా పేటెంట్ హక్కు ΄÷ందేవరకు వెళ్లింది. దీనిని ఒక స్టార్టప్గా త్వరలోప్రారంభించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.టెక్స్టైల్ రంగం మద్దతుతో...ప్రకృతిలో కళ్లకు కనిపించేవి లైట్ మైక్రోస్కోపిక్ ద్వారా నలభై వరకు పిక్చర్స్ తీసుకుంటే, స్టెమ్ ద్వారా మరికొన్ని సాధించాం. కంప్యూటర్లో వియానా దేశం నుంచి పోలెన్ గ్రెయిన్స్ స్కెలిటన్ స్ట్రక్చర్ నుంచి కొన్ని తీసుకున్నాం. మన దేశానికి వేల సంవత్సరాల నుంచి అద్భుతమైన టెక్స్టైల్ డిజైనింగ్ కల్చర్ ఉంది. కలంకారీ, ఇకత్ పోచం పల్లి, గొల్లభామ, రాజస్థాన్లో బాందినీ, గుజరాతీలో లెహెరియా, కాశ్మీర్ ఎంబ్రాయిడరీ ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాగే ‘పరాగ మంజరి’ మన దేశానికే వన్నె తెచ్చేలా తీసుకురావాలన్నది నా ప్రయత్నం. దీనిని తెలంగాణ ప్రభుత్వం టెక్స్టైల్ శాఖకు అందించి, వారి సపోర్ట్ తీసుకొని, ఈ వర్క్ను వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నాం’’ అని శివాని నేత చిలుకూరి తెలియజేశారు. లక్ష ΄్యాటర్న్స్ఒక్కో చెట్టు పువ్వుకు ఒక్కో ప్రత్యేకమైన పరాగ రేణువులు ఉంటాయి. ఈ పరాగ రేణువుల మోడల్స్ నుంచి కొన్ని లక్షల ΄్యాటర్న్స్ టెక్స్టైల్ రంగంలోకి తీసుకురావచ్చు. వీటిని పట్టు, కాటన్, సిల్క్, బెడ్ షీట్స్.. ఇలా ప్రతి క్లాత్ మీదకు తీసుకురావచ్చు. ఈప్రాజెక్ట్ తయారు చేస్తున్నప్పుడు ప్రపంచంలో ఎవరైనా ఇలా చేశారా.. అని శోధించాను. కానీ, ఎక్కడా మాకు ఆ సమాచారం లభించలేదు. అందుకే, పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేశాం. ఈ ΄్యాటర్న్స్ వస్త్ర డిజై¯Œ పరిశ్రమల్లో గణనీయమైన ప్రభావం చూపుతాయి. – డాక్టర్ అల్లం విజయ భాస్కర్రెడ్డి, అసోసియేట్ప్రొఫెసర్, బోటనీ డిపార్ట్మెంట్, ఉస్మానియా యూనివర్శిటీ – నిర్మలారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి -
Shivani Raghuvanshi: మేడ్ ఇన్ హెవెన్..
అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ‘మేడ్ ఇన్ హెవెన్’ సిరీస్ అనగానే శోభిత ధూళిపాళ సరే.. ఇంకో అమ్మాయి కూడా చటుక్కున గుర్తొస్తుంది. జాజ్.. జస్ప్రీత్గా వీక్షకులను అలరించిన శివానీ రఘువంశీ! తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు సంజయ్ లీలా భన్సాలీ ‘దేవదాసు’ సినిమా చూసి ముందు డైరెక్టర్ కావాలనుకుంది.. తర్వాత అందులోని కథానాయికల భారీ ముస్తాబుకు ముచ్చటపడి సినిమాల్లోకి వెళ్లడమంటూ జరిగితే హీరోయిన్గానే అని నిశ్చయించుకుంది. సొంతూరు ఢిల్లీ నుంచి ‘సిటీ ఆఫ్ ద డ్రీమ్స్’ ముంబైకి ఎలా చేరిందో చూద్దాం..!‘దేవదాసు’ ఫీవర్తో శివానీ.. హీరోయిన్ కావాలని కలలు కంటూ చదువును అశ్రద్ధ చేస్తుంటే వాళ్లమ్మ చెవి మెలేసి స్ట్రిక్ట్గా వార్న్ చేసిందట.. ‘ముందు డిగ్రీ తర్వాతే నీ డ్రీమ్’ అని! దాంతో బుద్ధిని చదువు మీదకు మళ్లించింది. అయినా సినిమా ఆమె మెదడును తొలుస్తూనే ఉండింది.శివానీ డిగ్రీలో ఉన్నప్పుడు.. సినిమా కాస్టింగ్ కో ఆర్డినేటర్ ఒకరు పరిచయం అయ్యారు. ఆమె కాంటాక్ట్ నంబర్ తీసుకున్నారు. వారానికే ఓ టీవీ కమర్షియల్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి.. ఆసక్తి ఉంటే అటెండ్ అవమని సమాచారమిచ్చారు. వెళ్లింది. అలా ‘వొడా ఫోన్’ కమర్షియల్తో తొలిసారి స్క్రీన్ మీద కనిపించింది. అది ఆమెకు మరిన్ని మోడలింగ్ అవకాశాలను తెచ్చిపెట్టింది.టీవీ కమర్షియల్స్లో నటిస్తూనే డిగ్రీ పూర్తి చేసింది. ముందుగానే అమ్మ అనుమతిచ్చేసింది కాబట్టి డిగ్రీ పట్టా పుచ్చుకున్న మరుక్షణమే ముంబై రైలెక్కేసింది.ముంబై చేరితే గానీ తెలియలేదు సినిమా చాన్స్ అనుకున్నంత ఈజీ కాదని. ఆ స్ట్రగుల్ పడలేక ఎందుకొచ్చిన యాక్టింగ్ అనుకుంది. అప్పుడే ‘తిత్లీ’ అనే సినిమాలో హీరోయిన్గా సైన్ అయింది. కానీ అది తను కోరుకున్నట్టు గ్లామర్ రోల్ కాదు. పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకే సెట్స్ మీద సీరియస్నెస్ లేకుండా జోకులేస్తూ ఉండసాగింది. ఆమె తీరు ఆ సినిమా డైరెక్టర్ కను బహల్కి కోపం తెప్పించింది. ‘ఇలాగైతే కెరీర్ కొనసాగినట్టే’ అని హెచ్చరించాడు. ఆ సినిమా విడుదలై.. తాను పొందిన గుర్తింపును ఆస్వాదించాక గానీ శివానీకి అర్థంకాలేదు తనకొచ్చిన చాన్స్ ఎంత గొప్పదో అని!అప్పటి నుంచి ఆమె శ్వాస, ధ్యాస అంతా అభినయమే అయింది. ‘అంగ్రేజీ మే కహతే హై’ చిత్రంతో పాటు ‘జాన్ ద జిగర్’, ‘జుత్తీ ద షూ’ వంటి షార్ట్ ఫిల్మ్స్లోనూ నటించింది.‘తిత్లీ’తో శివానీ క్రిటిక్స్ కాంప్లిమెంట్స్ అందుకున్నా.. ఫిల్మ్ ఫ్రెటర్నిటీ దృష్టిలో పడినా.. ఇంటింటికీ పరిచయం అయింది మాత్రం ‘మేడ్ ఇన్ హెవెన్’ జాజ్తోనే! ఆమె ప్రధాన పాత్ర పోషించిన మరో వెబ్ సిరీస్ ‘మర్డర్ ఇన్ మాహిమ్’ ప్రస్తుతం జీయో సినిమాలో స్ట్రీమ్ అవుతోంది.గ్లామర్ హీరోయిన్గా నటించాలనే కల ఇంకా నెరవేరలేదు. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా..! – శివానీ రఘువంశీ -
Video: భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా శివాని ప్రమాణం
భారత సంతతికి చెందిన 29 ఏళ్ల శివాని రాజా యూకే పార్లమెంటులో హిందువుల పవిత్రగ్రంథం భగవద్గీత సాక్షిగా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. తాను ఎంపీగా ప్రమాణం చేసిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. లీసెస్టర్ ఈస్ట్కు ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. భగవద్గీతపై ప్రమాణం చేసి కింగ్ ఛార్లెస్ రాజుకు విదేయతగా ఉంటానని పేర్కొన్నారు.శివాని రాజా చేసిన స్వీకారోత్సవం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనేక మంది నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటున్నారు. మన పవిత్ర గ్రంథాలకు మీరు తగిన గౌరవం ఇవ్వడం సంతోషంగా ఉంది. మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంలో ఈ భగవద్గీత మార్గదర్శకంగా పనిచేస్తుందని భావిస్తున్నాం* అంటూ కామెంట్ చేస్తున్నారు.It was an honour to be sworn into Parliament today to represent Leicester East. I was truly proud to swear my allegiance to His Majesty King Charles on the Gita.#LeicesterEast pic.twitter.com/l7hogSSE2C— Shivani Raja MP (@ShivaniRaja_LE) July 10, 2024 కాగా గుజరాత్ మూలాలున్న ఈ 29 ఏళ్ల శివాని వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఇటీవల జరిగిన యూకే పార్లమెంట్ ఎన్నికల్లో లీసెస్టర్ ఈస్ట్ నుంచి ఆమె కన్జర్బేటివ్ పార్టీ ఎంపీగా విజయం సాధించారు. అక్కడ గత 37 ఏళ్లుగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన నేతలెవరూ గెలవకపోవడం గమనార్హం. ఇన్నేళ్ల తరవాత గెలిచి శివాని రాజా రికార్డు సృష్టించారు. అయితే ఈ ఎన్నికల్లో ఓడించింది కూడా భారత సంతతికి చెందిన నేత (రాజేశ్ అగర్వాల్) కావడం విశేషం. శివానికి 14,526 ఓట్లు రాగా రాజేశ్కు 10,100 ఓట్లు పడ్డాయి.ఇక ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 పార్లమెంటు స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ మార్కు 326 సీట్లు కాగా లేబర్ పార్టీ 412 స్థానాల్లో గెలుపొందింది. కన్జర్వేటివ్లు కేవలం 121 స్థానాలకే పరిమితమైంది. దీంతో భారత సంతతికి చెందిన రిషి సునాక్ అధికారాన్ని కోల్పోగా.. 14 ఏళ్ల తర్వాత లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ బ్రిటన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. -
ఐఐఎం పరీక్షల్లో అంధురాలి ప్రతిభ
కనుచూపు లేక ముసిరిన చీకటిలో పట్టుదల కాంతిపుంజమై దారి చూపింది. రెప్పల మాటున దాగున్న కలలను చదువుతో సాకారం చేసుకుంది.అంధత్వాన్ని జయించి జాతీయ స్థాయిలో నిర్వహించే ఐ.ఐ.ఎం. (ఇండియ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చి దేశంలోని 21 ఐ.ఐ.ఎం. కళాశాలల్లోని 19 కళాశాలల్లో అర్హత సాధించింది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని గడి మహెలాలకు చెందిన కొత్తకాపు శివాని భవిష్యత్తుకు నిర్మించుకుంటున్న సోపానాలను ఇలా మన ముందుంచింది.‘మాది వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్నలు కొత్తకాపు విజయలక్ష్మి, గోపాల్రెడ్డిలకు రెండోసంతానాన్ని. మా అక్క కీర్తన గ్రూప్ 4 పరీక్ష రాసి ఉద్యోగం సాధించింది. మా చెల్లి భవానికి 80 శాతం చూపులేదు. హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ లో ఎంబీఏ సీటును సాధించింది. నాకు పుట్టుకతోనే చూపు లేదు. అయినా, చదువంటే మాకెంతో ఆసక్తి. అదే మమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని మా నమ్మకం. జహీరాబాద్లోని శ్రీ సరస్వతీ శిశుమందిరంలో నా ప్రైమరీ చదువు ఆరంభమైంది. కానీ, చూపు లేక΄ోవడంతో చాలా ఇబ్బంది పడేదాన్ని. నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అమ్మానాన్నలు హైదరాబాద్లోని బేగంపేటలో గల దేవనార్ పబ్లిక్ స్కూల్లోని అంధుల పాఠశాలలో చేర్పించారు. ఒకటి నుంచి పదోతరగతి వరకు అదే బడిలో చదువుకున్నాను. పదోతరగతిలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించాను. ఇంటర్మీడియెట్ను జహీరాబాద్లోని మాస్టర్ మైండ్స్ కాలేజీలో కామర్స్తో పూర్తి చేశాను. కాలేజీలో క్లాసులను విని, సహాయకులతో పరీక్షలు రాశాను. ఆ రెండేళ్లూ కాలేజీ టాపర్గా నిలిచాను.ఉన్నతస్థాయి ఉద్యోగమే లక్ష్యంచెన్నైలోని సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరి బీబీఏ కోర్సు పూర్తి చేశాను. క్యాట్ ఎగ్జామ్ కోసం ఆ¯Œ ౖలñ న్లో కోచింగ్ తీసుకున్నాను. 2023లో నిర్వహించిన ఐఐఎం ప్రవేశ పరీక్ష రాసి 93.51 శాతం మార్కులతో దేశంలోని 21 ఐఐఎం కళాశాలల్లోని 19 కళాశాలల్లో ప్రవేశార్హత సాధించాను. వాటిలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ ఐఐఎంను ఎంపిక చేసుకున్నాను. కిందటి నెల 23న కళాశాలలో చేరాను.శక్తినిచ్చే గీతోపదేశం చూపు లేక΄ోవడంతో చదువు కష్టంగా ఉండేది. బ్రెయిలీ లిపి నేర్చుకునేంతవరకు చదువు పట్ల నాకున్న తపనను ఎలా తీర్చుకోవాలో తెలిసేది కాదు. అంధుల పాఠశాలలో చేరాక నాకు పెద్ద అండ దొరికినట్టుగా అనిపించింది. కార్పొరేట్ కంపెనీలలో టాప్ లెవల్ ఉద్యోగం చేయాలని ఉంది. అందుకు తగిన అర్హతలు సం΄ాదించుకోవడానికి స్పెషలైజేషన్ కూడా చేస్తాను. శ్రీకృష్ణుడి గీతోపదేశం వింటూ ఉంటాను. జీవితంలోని ఒడిదొడుకులను ఎలా ఎదుర్కోవాలో, సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎలా నిలబడాలో గీత ద్వారానే నేను తెలుసుకుంటున్నాను. రెండు సంవత్సరాల ఐఐఎం కోర్సును విజయవంతంగా పూర్తి చేసి, ఉన్నతస్థాయి ఉద్యోగాన్ని సాధించాలన్నదే నా లక్ష్యం. అమ్మానాన్నలకు, పుట్టిన ఊరికి మంచి పేరు తేవాలన్నదే నా ఆకాంక్ష’’ అని చెప్పింది శివాని. – యెర్భల్ శ్రీనివాస్రెడ్డి, సాక్షి, జహీరాబాద్ఎంతో గర్వంగా ఉందిమా అమ్మాయి శివానీ జాతీయ స్థాయిలో ఐఎంఎ సీటును సాధించడం మాకెంతో గర్వంగా ఉంది. ఆమె పుట్టుగుడ్డిగా పుట్టినప్పుడు కొంత బాధపడ్డాం. కొందరు మనసు నొప్పించే మాటలు అనేవారు. కానీ, వాటిని పట్టించుకోకుండా అమ్మాయిలను ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే పట్టుదలతో కష్టపడి చదివించాం. ఇప్పుడు శివానీ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది. – విజయలక్ష్మి, గో΄ాల్రెడ్డి -
నా తల్లివి నువ్వే
దిల్లీలోని ఒక అనాథాశ్రమంలో పెరిగింది శివాని. చా...లా సంవత్సరాల తరువాత భర్త, కూతురుతో కలిసి ఆ అనాథాశ్రమానికి వచ్చింది. ‘నేను శివానిని. గుర్తున్నానా?’ అన్నది గార్డియన్ దగ్గరికి వచ్చి. శివాని చిన్నప్పటి జ్ఞాపకాలు గార్డియన్ను చుట్టుముట్టాయి. అంతే....గార్డియన్కు ఏడుపు ఆగలేదు. ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తూ తాను కూడా ఏడ్చేసింది శివాని. చాలాసేపటి వరకు వారి మధ్య ఏడుపు తప్ప మాటలు లేవు. ఈ వైరల్ వీడియోలోని భావోద్వేగాలు నెటిజనులను కళ్లనీళ్ల పర్యంతం చేశాయి.శివాని గతంలోకి వెళితే...ఆమె తండ్రి మద్యానికి బానిస అయ్యాడు. తల్లిని హింసించేవాడు. ఈ హింస తట్టుకోలేక భర్త నుంచి విడాకులు తీసుకుంది. తల్లి ఒకచోట, తండ్రి ఒకచోట. పిల్లల ఆలనా΄ాలనా చూసేవారు లేరు. చివరికి అనాథలుగా మిగిలారు. వీరి దీనస్థితి చూసి ఒక పుణ్యాత్ముడు అనాథాశ్రమంలో చేర్పించాడు. మూడు సంవత్సరాల తరువాత ఆ పిల్లలను ఒక కుటుంబం దత్తత తీసుకుంది. పెరిగి పెద్దయి జీవితంలో స్థిరపడింది. తన కష్టకాలంలో ఆదుకున్న ఆశ్రమాన్ని, తల్లిలా ఆదరించిన గార్డియన్ను చూడడానికి వచ్చింది. అనాథాశ్రమంలో ఉన్నప్పుడు అక్కడి ‘గార్డియన్’ అక్కా, తమ్ముళ్లను సొంతబిడ్డల్లా చూసుకుంది. ‘నా సొంత తల్లి దగ్గరికి వచ్చినట్లు ఉంది’ అని గార్డియన్ గురించి రాసింది శివాని. -
మరో పెళ్లి చేసుకుంటున్నాడని.. భర్త ఇంటి ఎదుటే భార్య?
నిజామాబాద్: అదనపు కట్నం కోసం వేధించడంతోపాటు తనకు తెలియకుండా మరో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఓ మహిళ తన భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే కామారెడ్డి పట్టణంలోని భవానీనగర్ కాలనీకి చెందిన వడ్ల కార్తీక్కు సిరిసిల్లకు చెందిన శివానితో 2019లో వివాహమైంది. పెళ్లిసమయంలో శివానీ కుటుంబ సభ్యులు కార్తీక్కు రూ.5లక్షల నగదుతోపాటు 15తులాల బంగారాన్ని కట్నంగా ఇచ్చారు. కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రాగా, గర్భిణీగా ఉన్న శివానీని కార్తీక్ ఆమె తల్లిగారింటి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. పాప పుట్టిన తరువాత పెద్ద మనుషుల సమక్షంలో రాజీకుదర్చగా హైదరాబాద్లో కాపురం పెట్టారు. మరో 6 నెలల గడిచిన తరువాత రూ.10 లక్షలు అదనపు కట్నం తేవాలని శివానీని వేధించడం మొదలు పెట్టిన కార్తీక్.. శివానీని మళ్లీ తల్లి గారి ఇంటి వద్ద వదిలేసి వెళ్ళిపోయాడు. వారి మధ్య గొడవలు పోలీస్స్టేషన్లు, కోర్టుల వరకు వెళ్లాయి. ఈ క్రమంలో కార్తీక్ మరో పెళ్ళికి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుసుకున్న శివాని.. తన మూడేళ్ల కుమార్తె, తల్లిదండ్రులు, సోదరునితో కలిసి ఆదివారం కామారెడ్డికి వచ్చింది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. తమకు కార్తీక్ వచ్చి తీవ్రంగా కొట్టి వెళ్లిపోయాడని శివానీ కుటుంబ సభ్యులు ఆరోపించారు. పట్టణ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఇరు కుటుంబాల సభ్యులను పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఇవి చదవండి: క్యాబ్ డ్రైవర్ది హత్యా? ఆత్మహత్యా? -
సుహాస్ నన్ను సైకోల భయపెట్టాడు: నటి శివాని
-
అంబాజిపేట మ్యారేజి బ్యాండు ట్రైలర్.. హీరోయిన్ చనిపోతుందా?
కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఓ మెట్టు ఎక్కేశాడు సుహాస్. కమెడియన్గా నవ్వులు పూయించడమే కాదు నటుడిగా కన్నీళ్లు పెట్టించగలనని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అతడు హీరోగా నటిస్తున్న చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు. దుశ్యంత్ కటికనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శివానీ నాగరం హీరోయిన్గా యాక్ట్ చేసింది. బుధవారం (జనవరి 24న) ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. బ్యాండ్ కొట్టే అబ్బాయి ప్రేమలో పడ్డాక అతడి జీవితం ఎలా ఉంది? అతడి అక్క ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? ఆమె కోసం ఈ హీరో ఏం చేశాడు? అన్నదే కథ. ప్రేమ, అవమానం, ప్రగ, ప్రతీకారాల సమ్మేళనమే అంబాజీపేట మ్యారేజి బ్యాండు. అయితే ట్రైలర్ చివర్లో చితి ముందు హీరో కూర్చుని ఏడుస్తున్నాడు. ఆ సమయంలో 'మన ప్రేమ నీ ప్రాణం మీదకు తేకూడదు మల్లి' అని హీరోయిన్ చెప్పిన డైలాగ్ వేశారు. అంటే ఈ మూవీలో హీరోయిన్ చనిపోతుందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఏదైతేనేం.. ట్రైలర్ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. కలర్ ఫోటో అంత పెద్ద హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతమందించారు. -
లింగి లింగిడి..!
శ్రీకాంత్ మేక, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల అవుతోంది. రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘లింగి లింగిడి..’ అంటూ సాగే పాటను ఇటీవల విడుదల చేయగా, 30 మిలియన్ వ్యూస్ను పూర్తి చేసుకుంది. ‘‘ఈ పాటలానే మా చిత్రానికి ప్రేక్షకులు విజయం అందిస్తారనే నమ్మకం ఉంది’’ అని హైదరాబాద్లో నిర్వహించిన సెలబ్రేషన్స్లో ‘బన్నీ’ వాసు అన్నారు. -
నిన్న.. నేడు.. రేపటి స్టైల్
ఒకరేమో నిన్నటి తరం ఇష్టాలను తెలిసున్నవారు మరొకరు నేటి తరపు ఆసక్తులను ఒంటపట్టించుకున్నవారు. ఈ ఇద్దరూ తూరుపు పశ్చిమానికి వారధులుగా ఇండోవెస్ట్రన్ డ్రెస్ డిజైన్స్తో సినీ స్టార్స్ను కూడా ఆకట్టుకుంటున్నారు. హైదరాబాద్ వాసులైన ఈ అత్తాకోడళ్ల పేర్లు శివానీ సింఘానియా, మాన్సీ సింఘానియా. అత్త తన డిజైన్స్ని కోడలికి నేర్పిస్తుంటే.. కోడలు నేటి ట్రెండ్ని అత్తకు పరిచయం చేస్తుంది. ఇద్దరూ కలిసి ఒకే రంగంలో రాణిస్తూ పాతికమందికి ఉపాధి కల్పిస్తున్నారు. డిజైన్స్ తెలుసుకుంటూ.. కోడలు మాన్సీ మాట్లాడుతూ.. ‘నేను ఎంబీయే చేశాను. డ్రెస్ డిజైన్స్ని ఎంపిక చేసుకోవడంలో ఇష్టంతో పాటు ఈ తరం ఎలాంటి మోడల్స్ని ఇష్టపడుతుందో తెలుసు. అయితే, ఈ రంగంలోకి వస్తాను అనుకోలేదు. నా పెళ్లికి మా అత్తగారే డిజైనర్. అవి నాకు చాలా బాగా నచ్యాయి. పెళ్లయ్యాక మా అత్తగారు శివానీ దగ్గర డిజైన్స్కు సంబంధించి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ వాటి రూపకల్పనలో ఉంటున్నాను. మా కలెక్షన్లో బ్రైడల్, కాంటెంపరరీ, వెస్ట్రన్, ఇండో–వెస్టర్న్– క్లాసిక్ వేర్లలో స్ట్రెయిట్ కట్ ΄్యాటర్న్స్, మినిమలిస్ట్ ఎంబ్రాయిడరీ ప్రత్యేకంగా ఉంటాయి. వింటేజ్ స్టైల్స్తో పాటు మోడర్న్ డ్రెస్సుల రూపకల్పన మా ప్రత్యేకత’ ’ అని వివరిస్తుంది మాన్సీ. సెల్ఫ్ డిజైనర్ని.. వ్యక్తిగత శైలి, క్లిష్టమైన డిజైన్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ తమ ప్రత్యేకతలు అని చెబుతారు ఈ అత్తాకోడళ్లు. బాలీవుడ్ స్టార్ సోహా ఆలీఖాన్, సోనాక్షి, మోడల్స్, ప్రముఖ గాయకులతో కలిసి తమ క్రియేషన్స్తో వేదికలపైన ప్రదర్శించామని వివరించారు. ‘‘నేను చదువుకున్నది ఇంటర్మీడియెట్ వరకు. కానీ ఈ రంగంలో ఉన్న ఆసక్తి నన్ను ఎంతోమందికి పరిచయం చేసింది. ఇంట్లో ఖాళీ సమయాల్లో పెయింట్స్, పెన్సిల్ డ్రాయింగ్ చేసేదాన్ని. కొన్నాళ్లకు ఆ డ్రాయింగ్స్ని టైలర్కి చూపించి మోడల్ డ్రెస్సులు తయారు చేయమని చె΄్పాను. మొదట మా ఇంట్లో అమ్మాయిలకు, బంధువులకు డిజైన్ చేసి ఇస్తూ, ఈ రంగంలోకి వచ్చేశాను. ఆ విధంగా ఫ్యాషన్ డిజైనింగ్ని సొంతంగా నేర్చుకున్నాను. నా డిజైన్స్ మామూలు వారి దగ్గర నుంచి టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ కూడా మెచ్చుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుంది. ప్రతి అమ్మాయి మా దుస్తుల్లో ఒక దివ్వెలా వెలిగి΄ోవాలని ఊహించి తొమ్మిదేళ్ల క్రితం బంజారాహిల్స్లో కనక్ పేరుతో డ్రెస్ డిజైన్ స్టూడియో ్రపారంభించాం’ అని వివరిస్తారు శివాని. -
‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’సినిమా టీజర్ ఈవెంట్ (ఫొటోలు)
-
అంబాజీపేట బ్యాండు
సుహాస్, శివానీ నాగరం జంటగా నటించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’. దుశ్యంత్ కటికినేని దర్శకుడు. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్పై నిర్మించారు. హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా టీజర్ విడుదలలో దర్శకులు మారుతి, హను రాఘవపూడి, శైలేష్ కొలను, సాయి రాజేశ్, సందీప్ రాజ్, ప్రశాంత్, మెహర్ రమేశ్, భరత్ కమ్మ, నిర్మాతలు ఎస్కేఎన్, శరత్ అతిథులుగా పాల్గొన్నారు. ‘‘నాలాంటి కొత్త డైరెక్టర్కు చాన్స్ ఇచ్చిన అల్లు అరవింద్, ‘బన్ని’ వాసు, వెంకటేష్ మహాగార్లకు, సుహాస్కి థ్యాంక్స్’’ అన్నారు దుశ్యంత్ కటికినేని. ‘‘నా కెరీర్లో ఈ మూవీ మైలురాయిగా నిలుస్తుంది’’అన్నారు సుహాస్. సినిమాటోగ్రాఫర్ వాజిద్ బేగ్, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడారు. -
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండులో గట్టిగానే కొట్టిన మల్లిగాడు
కేరాఫ్ కంచర పాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేశ్ మహా. ఇప్పుడాయన సమర్పణలో సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’. ఈ సినిమాకు దుశ్యంత్ కటికనేని దర్శకత్వం వహిస్తున్నారు.జీఏ2 పిక్చర్స్, స్వేచ్ఛ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. (ఇదీ చదవండి: సూర్యచంద్రులకు కూడా నిన్ను చూపించేదాన్ని కాదు: విజయ్ ఆంటోనీ భార్య) ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్ ఫోటో’ జాతీయ స్థాయిలో అవార్డు దక్కడంతో సుహాస్కు మంచి గుర్తింపు దక్కినా రైటర్ పద్మభూషణ్తో ఫ్యామిలీ ఆడియెన్స్ కు మరింత చేరువయ్యాడు. తాజాగా ఆయన నుంచి వస్తున్న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు టీజర్ అందరినీ మెప్పించేలా ఉంది. మల్లిగాడు (సుహాస్) ఒక సెలూన్ నడుపుతూనే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో డప్పు కొడుతుంటాడు. అలాంటి వాడికి ఒక కాలేజీ అమ్మాయి పరిచయం కావడం.. వారిద్దరూ ప్రేమలో పడటం వల్ల ఎదరయ్యే సమస్యలు కథలు ప్రధానంగా ఉన్నట్లు టీజర్లో తెలుస్తోంది. టీజర్ చివరిలో సుహాస్కు గుండు కొట్టిస్తూ ఉన్న షాట్ హైలైట్గా ఉన్నా.. అందుకు ప్రధాన కారణాలు ఎంటి..? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతుంది. టీజర్ చూస్తుంటే మల్లిగాడు బ్యాండ్ గట్టిగానే కొట్టినట్లు ఉన్నాడు. -
'మనీషా, శివాని ఆత్మహత్య'పై.. ఇద్దరు అనుమానితులు అదుపులోకి..
నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన బీఎస్సీ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు మనీషా, శివాని ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నల్లగొండ టూటౌన్ పోలీసులు గురువారం ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి వివరాలు రాబడుతున్నారు. విద్యార్థినుల ఇద్దరి ఫోన్లో కాల్ డేటా ఆధారంగా అనుమానితులను విచారిస్తున్నారు. ఎవరితో ఎక్కువగా మాట్లాడారు? వాట్సాప్ చాటింగ్ ఎవరితో ఉంది? మెస్సేజ్ల వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో బెదిరిస్తున్నాడని.. వాడు ఎవడో తెలియదని ఆ విద్యార్థులు మాట్లాడినట్లు ఫోన్ రికార్డు వైరల్ కావడంతో ఆ దిశగా దర్యాప్తు సాగుతోంది. పరువు పోతుందని ఫోన్లో ఏమైనా ఫొటోలు ఉంటే విద్యార్థులు డిలీట్ చేశారా? అనే కోణంలో ఫోన బ్యాకప్ను పరిశీలిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన వివరాలను డిలీట్ చేసిన వివరాలను సైబర్ క్రైం విభాగం నుంచి బ్యాకప్ తీసి పరిశీలిస్తున్నారు. విద్యార్థులకు వచ్చిన ఇన్కం, అవుట్ గోయింగ్ ఫోన్ కాల్స్ కూడా పరిశీలిస్తున్నారు. నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో బస్సు దిగిన విద్యార్థులు నడుచుకుంటూ ప్రకాశంబజార్కు అటునుంచి రాజీవ్పార్కులోకి వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సీసీ కెమెరా పుటేజీని పరిశీలిస్తే ఇద్దరు విద్యార్థినులు ఉత్సాహంగా నడుచుకుంటూ వెళ్తూ కనిపించారని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత పార్కులో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు సాంకేతికంగా ఉన్న అన్ని ఆధారాలనూ పోలీసులు పరిశీలిస్తున్నారు. లోకేషన్ ఆధారంగా.. ఇద్దరు విద్యార్థులకు ఏ ప్రాంతాల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి? ఆ సమయంలో వీరిద్దరు ఎక్కడ ఉన్నారని ట్రేస్ చేస్తున్నారు. డీపీలో ఫొటోలు పెట్టుకోవద్దు.. దర్యాప్తులో భాగంగా పోలీసులు గురువారం విద్యార్థినుల స్వగ్రామాలకు వెళ్లి విచారించారు. నక్కలపల్లి గ్రామంలో శివాని స్నేహితుల నుంచి, అమ్మనబోలు గ్రామానికి మనీషా క్లాస్మేట్లు, స్నేహితుల నుంచి పోలీసులు సమాచారం రాబట్టారు. అయితే, అమ్మాయిలు తమ ఇన్స్ట్రాగామ్లో డీపీగా ఫొటోలు పెట్టుకోవద్దని శివాని గ్రామంలోని స్నేహితులకు చెప్పినట్లు తెలిసింది. ఎందుకు పెట్టుకోవద్దని అడిగితే సమాధానం చెప్పలేదని ఆమె స్నేహితులు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. నక్కలపల్లిలో ఇటీవల ఓ మహిళ ఎస్సై ఉద్యోగం సాధించడంతో.. డిగ్రీ పూర్తి కాగానే మనం కూడా ఎస్సై ఉద్యోగం సాధించాలని ఇద్దరు విద్యార్థినులు నిర్ణయించుకున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. -
మటన్ పెట్టి.. మద్యం తాగించి..
విశాఖపట్నం: వన్టౌన్ స్టేషన్ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో లభించిన వీడియో చూసిన పోలీసులు.. అతని భార్య తెలివితేటలకు షాక్ అయ్యారు. ప్రియుడు రామారావుతో కలిసి శివాని మంగళవారం రాత్రి రమేష్ను ఊపిరాడకుండా చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. రమేష్ హత్యకు ముందు ప్రియు డితో కలిసి ఆమె పెద్ద కుట్రే పన్నింది. తన మీద అనుమానం రాకుండా భర్తతో ప్రేమగా ఉన్నట్టు ఆమె వీడియో రికార్డు చేసింది. మంగళవారం రాత్రి భర్తకి మటన్ వండి పెట్టి.. మద్యం తాగించింది. నా భార్య చాలా మంచిది.. ధైర్యవంతురాలు, మై వైఫ్.. మై లైఫ్ అంటూ అతనితో చెప్పించింది. ఆపై మద్యం మత్తులో జోగుతున్న భర్తను మంచంపై పడుకోబెట్టింది. ఈ దృశ్యాలు వైరల్గా మారాయి. హత్య నేరం తనపైకి రాకుండా ఉండేందుకే.. తాను మంచిదానినంటూ భర్తతో చెప్పించే ప్రయత్నంగా ఈ వీడియో తీసినట్లు పోలీసులు ఎదుట ఆమె అంగీకరించింది. దీంతో ఆమె నేరపూరిత వైఖరి పట్ల అంతా అవాక్కవుతున్నారు. కాగా.. తన పెద్దమ్మ కూతురు పైడమ్మ ద్వారానే టాక్సీ డ్రైవర్ రామా రావు పరిచయం అయినట్లు పోలీసుల దర్యాప్తులో శివాని చెప్పినట్లు సమాచారం. పైడమ్మకు కూడా ఈ హత్య కేసులో సంబంధం ఉందని పోలీసులను శివాని నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఈ కేసులో శివానీతో పాటు ప్రియు డు రామారావు, అతని స్నేహితుడు నీలాపై మాత్రమే ప్రస్తుతం కేసు నమోదు చేసినట్లు ఎంవీపీ పోలీసులు వెల్లడించారు. -
సంచలన వీడియో: శివాని తెలివితేటలకు పోలీసులు షాక్
-
మై వైఫ్ .. శివాని గురించి రమేశ్ చివరిమాటలు
సాక్షి, క్రైమ్: విశాఖలో వివాహేతర సంబంధంతో భర్త రమేశ్ను ప్రియుడితోపాటు హత్య చేసిన ఉదంతంలో సంచలన వీడియోలు బయటకు వచ్చాయి. భర్తను హత్యకు ముందు శివాని చేసిన పనికి పోలీసులు సైతం షాక్ తిన్నారు. రమేశ్కు మద్యం తాగించి.. ఆ సమయంలో తన గురించి పొగిడినదంతా ఆమె వీడియోలు తీయించుకుంది. కానిస్టేబుల్ రమేష్ హత్య కేసు లో కీలక వీడియోలు సాక్షి టివి చేతికి అందాయి. రమేశ్ని చంపే ముందూ.. తన మీద అనుమానం రాకుండా భర్తతో ప్రేమగా ఉన్నట్టు ఆమె వీడియోలు రికార్డు చేసింది. భర్తకి మటన్ వండి పెట్టీ.. మందు తాగించి.. ‘నా భార్య మంచిది’ అని రమేశ్తో చెప్పించింది శివాని. ఆపై మద్యం మత్తులో జోగుతున్న భర్తను మంచంపై పడుకోబెట్టినదంతా కూడా రికార్డు అయ్యింది. మా ఆవిడ చాలా తెలివైంది. గైడెన్స్ ఇస్తే ఏదైనా సాధిస్తుంది. నా వైఫ్.. మై లైఫ్. చాలా ధైర్యవంతురాలు. నేను ఉన్నంత వరకు ధైర్యం చూపిస్తుంది. నేను ఎప్పుడు ఉంటానో.. ఎప్పుడు పోతానో తెలియదు. నేను పోయాక కూడా అదే ధైర్యం చూపించాలి. నా వైఫ్ బెస్ట్ అంటూ మాట్లాడిన మాటలు అందులో ఉన్నాయి. భర్త హత్య తర్వాత గుండెపోటుతో చనిపోయాడని నాటకం ఆడే క్రమంలో.. తనపై ఎలాంటి అనుమానాలు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ పని చేసింది శివాని. ఆమె ఫోన్ నుంచి వీడియోలు సేకరించిన పోలీసులు.. నేరస్తురాలి తెలివితేటలు చూసి షాక్ తిన్నారు. 2009 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ బర్రి రమేష్(35). 2012లో శివాని(జ్యోతి)తో వివాహం జరిగింది. వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదర్శనగర్లో ఉంటూ వన్టౌన్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య శివాని(శివజ్యోతి) పోలీసులకు చెప్పింది. అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవాలు బయటకొచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో సైతం అతను ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో కుట్రకోణం వెలుగుచూసింది. రామారావు అనే టాక్సీ డ్రైవర్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమేష్ భార్య శివాని.. అతని మోజులో కట్టుకున్న భర్తను మట్టుబెట్టింది. రామా రావు విషయంలో గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కాగా.. మంగళవారం రాత్రి ఆమె రమేష్తో బాగా మద్యం తాగించి.. దాన్ని వీడియో కూడా తీసింది. కొంతసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఆమె ప్రియుడు రామారావుకు సమాచారం ఇవ్వడంతో.. అతని స్నేహితుడు నీలాతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఆమె సమక్షంలోనే అతనిని వీరు హత్య చేశారు. నీలా రమేష్కి ఊపిరాడకుండా దిండుతో నొక్కిపట్టుకోగా.. రామారావు కదలకుండా అతని కాళ్లు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఊపిరాడక రమేష్ మృతి చెందాడు. ఇలా పక్కాగా రమేష్ను హతమార్చిన శివాని, అతని ప్రియుడు రామారావు దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే తొలుత మద్యం తాగి చనిపోయాడని శివాని పోలీసులకు చెప్పినట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను రాబట్టినట్లు తెలిపారు. శివానీని ఏ1గా, ప్రియుడు రామారావును ఏ2గా, వారికి సహకరించిన నీలాను ఏ3గా నిర్ధారించి కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు. ఈ అఘాయిత్యంలో శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మకు కూడా భాగం అయ్యిందనే అనుమానాలు ఉన్నాయి. పైడమ్మ వల్లే తనకు రామారావు పరిచయం అయ్యాడని శివాని పోలీసులకు చెప్పింది. అంతేకాదు.. కాన్ఫరెన్స్ కాల్స్లో మాట్లాడినట్లు నిర్థారించిన పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. అయితే తాను అమాయకురాలినని పైడమ్మ వాపోతోంది. -
ఓరి బాబోయ్ ఇది మాములు ర్యాగింగ్ కాదు...నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉంటారు..
-
సాయి శ్రీ చరణ్ శృతికని ఇమిటేట్ చేస్తుంటే సుధాన్షు శివాని ఇలా పగలబడి నవుతున్నారో చుడండి..
-
శ్రీముఖి తో వున్న రీలేషన్ ని రివీల్ చేసిన సాయి చరణ్..
-
ఉగాది పచ్చడి తింటాం.. చేయడం రాదు: శివాని, శివాత్మిక
హైదరాబాద్లో ఉంటే అమ్మ, నాన్న, మేమిద్దరం కలిసి పండగ జరుపుకుంటాం. అమ్మ ఉగాది పచ్చడి, గారెలు, పులిహోర, పాయసం.. ఇలా అన్నీ చేస్తుంది. ఒకవేళ మేం చెన్నైలో ఉంటే... అక్కడి మా బంధువులతో పండగ జరుపుకుంటాం. మా ఇద్దరికీ పచ్చడి తినడం తప్ప చేయడం రాదు. మా చిన్నప్పుడు ఇద్దరం ముగ్గులు వేసేవాళ్లం. పండగ అంటే మాకు ముగ్గులే ఎగ్జయిటింగ్. ఇక పండగ రోజున కొత్త బట్టలంటే అది ఆ రోజు మూడ్ని బట్టి ఉంటుంది. ఒక్కోసారి ఫుల్ ట్రెడిషనల్గా డ్రెస్ చేసుకుంటాం.. చక్కగా నగలు పెట్టుకుని గుడికి వెళతాం. చీర, లంగా, ఓణీ, చుడీదార్.. ఇలా ఏదో ఒకటి ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడు చెన్నైలో ఉన్నాం. ఈసారి ఫుల్ ట్రెడిషనల్గా రెడీ అవుతాం. ఈ ఉగాది అందరి జీవితాల్లో ఆనందం నింపాలని కోరుకుంటూ.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇంకా మంచి ఆర్టిస్ట్గా గుర్తింపు సంపాదించుకోవాలనుకుంటున్నాను. ఇంకా మంచి నటిగా ఎదగాలని ఉంది. అలాగే మంచి డాక్టర్ అవ్వాలన్నది లక్ష్యం. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ మెడిసన్ చేస్తున్నాను. ఏం చేసినా నిబద్ధతతో చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. వర్కవుట్, షూటింగ్, చదువు, హార్స్ రైడింగ్.. ఏదైనా మరింత క్రమశిక్షణగా చేయాలనుకుంటున్నాను. – శివాని ఈ సంవత్సరం చేతినిండా పని ఉండాలని కోరుకుంటున్నాను. తెలుగు, తమిళంలో సినిమాలు చేయాలనుకుంటున్నాను. అలాగే ఇతర భాషల్లోనూ అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. కెరీర్పరంగా ఎదగాలన్నదే ప్రస్తుత లక్ష్యం. వీలైతే ఏదైనా స్పోర్ట్ నేర్చుకోవాలని ఉంది. ఏడాది మొత్తం చాలా ప్రశాంతంగా గడిచిపోవాలని ఉంది. ఆరోగ్యం బాగుండాలి. – శివాత్మిక -
ఇళ్లున్నా ఆక్రమణలు: అటవీశాఖ
సాక్షి, హైదరాబాద్: కోయపోచగూడలో పోడు భూములు లేవని, గతంలో ఎప్పుడూ అక్కడి వారు పోడు వ్యవసాయం చేసిన దాఖలాలు లేవని అటవీశాఖ స్పష్టంచేసింది. కోయపోచగూడకు ఆనుకుని ఉన్నదంతా కవ్వాల్ టైగర్ రిజర్వ్కు చెందిన అటవీభూమి మాత్రమేనని, అటవీ, రెవెన్యూ రికార్డుల్లో పోడు భూమే లేదని వెల్లడించింది. గ్రామంలో ఇళ్లు, భూములున్నా కూడా, అటవీభూమిని ఆక్రమించాలనే దురుద్దేశంతోనే కోయపోచగూడలో కొందరు రాద్దాంతం చేస్తున్నారని మంచిర్యాల జిల్లా అటవీ అధికారి శివాని డోగ్రా ఒక ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, మాకులపేట పంచాయతీ, కోయపోచగూడలో అటవీ భూములను ఆక్రమిస్తున్నారని, అడ్డుకున్న అధికారులపై దాడులకు పాల్పడుతూ అటవీశాఖ అధికారుల విధులను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. వాస్తవంగా వారికి మాకులపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఇళ్లు ఉన్నాయని, కొందరి ప్రోద్బలంతో ఫారెస్ట్ భూములను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అక్కడికి మహిళలని పంపించి, వారిని ముందు పెట్టి పోడు భూముల పేరుతో ఫారెస్ట్ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అది చట్టరీత్యా నేరమని స్పష్టంచేశారు. కోయపోచగూడ పరిధిలో పోడు భూములు లేవని చెప్పడానికి తమ వద్ద ఆధారాలున్నాయన్నారు. పోడు భూముల్లో ఆక్రమణలకు పాల్పడ్డ వారు అధికారులకు సహకరిస్తే భవిష్యత్లో వారికి అక్కడ చేపట్టే ఫారెస్ట్ పనుల్లో ఉపాధి కల్పిస్తామని శివాని వెల్లడించారు. -
స్విమ్మర్ శివానికి స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ అక్వాటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ స్విమ్మర్ శివాని కర్రా మూడు పతకాలతో మెరిసింది. గుజరాత్లో జరుగుతున్న ఈ పోటీల్లో హైదరాబాద్కు చెందిన 11 ఏళ్ల శివాని అండర్–11 బాలికల 50 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో పసిడి పతకం సాధించింది. శివాని 34.93 సెకన్లలో రేసును ముగించి విజేతగా నిలిచింది. 100 మీటర్ల బటర్ఫ్లయ్ ఫైనల్ రేసును శివాని 1ని:14.81 సెకన్లలో ముగించి రజత పతకం గెలిచింది. అనంతరం 4్ఠ50 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో శివాని, అన్నిక దెబోరా, మేఘన నాయర్, వేములపల్లి దిత్యా చౌదరీలతో కూడిన తెలంగాణ బృందం 2ని:12.31 సెకన్లలో గమ్యానికి చేరి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. గచ్చిబౌలిలోని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) స్విమ్మింగ్పూల్లో కోచ్ ఆయుశ్ యాదవ్ వద్ద గత ఐదేళ్లుగా శివాని శిక్షణ తీసుకుంటోంది. చదవండి: Ranji Trophy Final 2022: ‘తొలి టైటిల్’కు చేరువలో... -
అది జరగపోతే అప్పుల పాలవుతాం: రాజశేఖర్
కోవిడ్ టైమ్లో చావు అంచులదాకా వెళ్లి వచ్చాను. 75 కేజీలు ఉన్న నేను 62 కేజీలకు తగ్గాను .ఇక జీవితం అయిపోయింది..సినిమాలను చేయలేను అనుకున్నా. కానీ నా ఫ్యామిలీ సపోర్ట్తో పాటు అభిమానుల ప్రేమతో మళ్లీ కోలుకున్నా.మళ్లీ ఒక్కొక్కటిగా నేర్చుకొని ‘శేఖర్’ చిత్రంలో నటించాను . ఈ చిత్రం నాకు చాలా స్పెషల్’అని హీరో రాజశేఖర్ అన్నారు. రాజశేఖర్ హీరోగా, ముస్కాన్, ఆత్మీయ రాజన్ హీరోయిన్లుగా శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 20న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా రాజశేఖర్ గురువారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. మీ కెరీర్లో ఎప్పుడులేనంతగా.. ప్రీరిలీజ్ ఈవెంట్లో మా సినిమాను బతికించండి అని ప్రేక్షకులను వేడుకున్నారు.ఎందుకు? ఇంతవరకు మా వెనక ప్రాపర్టీ ఉంది. కాబట్టి సినిమాలు ఆడినా ఆడకపోయినా..పెద్దగా బాధ అనిపించేది కాదు. కానీ ఇప్పుడు శేఖర్ సినిమా సక్సెస్ అయితేనే అప్పుల నుంచి బయటపడతాం. లేదంటే అప్పుల పాలవుతాం. అందుకే నాకు టెన్షన్ ఎక్కువవుతుంది. ఓ ఢిపరెంట్ సినిమా ఎంచుకొని వచ్చాం. సినిమా బాగుందని తెలిసిన తర్వాతే థియేటర్స్ వెళ్లి చూడండి. కానీ త్వరగా వచ్చి చూడండి. ఈ టెన్షన్స్ కారణంగానే మనసులోనుంచి ఆటోమేటిగ్గా ఈ సినిమాను బతికించండి అని వచ్చింది. మీ గత సినిమాలతో పోలిస్తే.. శేఖర్లో కొత్తగా ఏం ఫీలయ్యారు? ఆర్టిస్టుగా చాలా సంతృప్తి చెందాను. శేఖర్ క్యారెక్టర్లో ఉన్న ఎమోషన్, బాధను చూపించడానికి బాగా చేశాను. ఈ చిత్రంలో మీ పాత్ర మేకోవర్ గురించి? 55-60 ఏళ్ల వయసు ఉన్న క్యారెక్టర్ నాది. ఈ క్యారెక్టర్కి కొత్త లుక్ ఉంటే.. సినిమాకు ప్లస్ అవుతుందని ఆలోచించి.. సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్లో వచ్చాం. ఆ గెటప్ బాగుందని చాలా మంది చెప్పారు. అయినా కొంచెం భయం ఉండేది. ఇటీవల ట్రైలర్ విడుదలైన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సెన్సార్ బోర్డు సభ్యులు కూడా సినిమా చూసి చాలా మెచ్చుకున్నారని జీవిత చెప్పారు. దీంతో నాకు చాలా ధైర్యం వచ్చింది. జీవిత దర్శకత్వం గురించి? షూటింగ్కి వెళ్తే మేమిద్దరం ఒక డైరెక్టర్, ఆర్టిస్టుగానే ఉంటాం. కానీ ప్రతి విషయంపై ఇద్దరం చర్చింకుంటాం. ఆమె గొప్ప దర్శకురాలు. అందరి నుంచి కావాల్సిన పనిని రాబట్టుకుంటుంది. మలయాళం మూవీ జోసెఫ్ మూవీని రీమేక్గా ఎంచుకోవడానికి కారణం? నా గత సినిమాలు ఒక్కసారి తలంబ్రాలు, అంకుశం,ఆహుతి, మగాడు, మా అన్నయ్య, సింహరాశి.. ఇవన్నీ రీమేక్ సినిమాలే. అన్ని సూపర్ హిట్ అయ్యాయి. అందుకే జోసెఫ్ మూవీ ఎంచుకున్నాం. మలయాళంలో పెద్ద సక్సెస్ అయిన సినిమా అది. నేను గతంలో చాలా మళయాల మూవీలను రీమేక్ చేసి హిట్ కొట్టాను. రీమేక్లకు సక్సెస్ గ్యారెంటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే జోసెఫ్ని సెలెక్ట్ చేశాం. ఈ చిత్రంలో మీ కూతరు శివాణి నటించారు. ఆమె నటన గురించి? మొదట ఈ చిత్రంలో కూతురి పాత్రలకు శివాణి, శివాత్మికలను కాకుండా వేరే వాళ్లను తీసుకుందామని అనుకున్నాం. ఈ విషయం జీవితతో చెబితే.. లేదంటే..మన ఇద్దరి కూతుళ్లలో ఎవరినో ఒకరిని పెడితే..ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. మీ కూతురు అని చెప్పడానికి ఎక్కువ సీన్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు. చూడడానికి బాగుంటదని చెప్పింది. నేను ఓకే అన్నారు. ఇద్దరిలో ఎవరు చేస్తారని అడిగితే..ఇద్దరు చేస్తామని చెప్పారు. చివరకు అక్క కోసం శివాత్మిక త్యాగం చేసింది(నవ్వుతూ..) మీ పాత్రలకు సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పేవారు. ఈ మధ్యలో బ్రేక్ ఇచ్చినట్లు ఉన్నారు కదా? మధ్యలో 10 ఏళ్లు సాయికుమార్ డబ్బింగ్ చెప్పలేదు. గత పదేళ్లుగా శ్రీనివాస్ మూర్తి నా పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఎవరు డబ్బింగ్ చెప్పారో ఆడియన్స్ కూడా గుర్తుపట్టకుండా ఇద్దరు బాగా చెప్పారు. శేఖర్ చిత్రానికి సాయికుమార్ డబ్బింగ్ చెప్పాడు. 37 ఏళ్ల నా సినీ కెరీర్లో 27 ఏళ్లు సాయికుమార్, 10 ఏళ్లు శ్రీనివాస్ మూర్తి నా పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. కోవిడ్ టైమ్లో చాలా బ్యాడ్ సిచ్యుయేషన్ని ఫేస్ చేశారు కదా? అవును. చావు అంచులదాకా వెళ్లి వచ్చాను. 75 కేజీలు ఉన్న నేను 62 కేజీలకు తగ్గాను. మళ్లీ కోలుకుంటానని అనుకోలేదు. ఐసీయూలో ఉన్నప్పుడు బోర్ కొట్టకుండా ఉండడానికి అక్కడ టీవీ పెట్టారు. సినిమాలో హీరోలు చేస్తున్న ఫైట్స్, డాన్స్లు చూసి.. నేను కూడా ఇలా ఉండేవాడిని.. ఇప్పుడిలా అయిపోయిందే అని బాధపడేవాడిని. ఇక జీవితం అయిపోయిందని అనుకున్నాను. ఇక సినిమాలు చేయలేనని అనుకొని జోసెఫ్ రీమేక్ హక్కులను వేరే వాళ్లకు ఇవ్వమని చెప్పాను. కానీ జీవితతో పాటు అందరూ.. నువ్వు కోలుకుంటావని భరోసా ఇచ్చారు. సినిమాపై ఉన్న కసితో ఒక్కొక్కటిగా మళ్లీ నేర్చుకొని ‘శేఖర్’ మూవీ చేశాను. నా కెరీర్లో చేసిన సినిమాలన్నింటిలో ‘శేఖర్’మూవీ చాలా స్పెషల్. ఇంత ఎనర్జిటిక్ పాత్రను మళ్లీ చేయలేను అనుకుంటా. ఒరిజినల్ మూవీతో పోలిస్తే ‘శేఖర్’లో ఏమైనా మార్పులు చేశారా? పెద్దగా మార్పులు చేయలేదు. మలయాళంలో కొంచెం పేస్ స్లోగా ఉంటుంది. తెలుగులో అలా ఉంటే పనికిరాదు. మన తెలుగు ఆడియన్స్ తగ్గట్టుగా మార్చుకున్నాం. అలాగే మలయాళం చిత్రంలో కొన్ని సీన్స్కి వివరణ ఉండదు..ఇందులో ఆడియన్స్కు అర్థం అయ్యేలా వివరణ ఇచ్చాం. నిడివి కూడా ఒరిజినల్తో పోలిస్తే.. ఈ చిత్రం నిడివి తక్కువ. మీ అమ్మాయి(శివాణి) పాత్రను ఏమైనా పెంచారా? లేదు. మా అమ్మాయి కదా అని పాత్రను పెంచితే.. సినిమాను చెడగొట్టినవాళ్ల అవుతాం. అలా చేయలేదు. అనూప్ రూబెన్స్ మ్యూజిగ్ గురించి? ఈ చిత్రానికి సంగీతం చాలా ముఖ్యం. అనూప్ రూబెన్స్ చాలా మంచి మ్యూజిగ్ ఇచ్చారు. ఈ చిత్రంలో నా పాత్ర స్మోకింగ్ చేయాలి. కానీ నా అనారోగ్యం కారణంగా స్మోకింగ్ చేయొద్దని వైద్యులు చెప్పారు. అనూప్ తన మ్యూజిగ్తో ఈ సీన్స్ మ్యానేజ్ చేశారు. కోవిడ్ టైమ్లో మీ ఇద్దరు కూతుళ్లు దగ్గర ఉండి మీ బాగోగులు చూశారు.ఎలా అనిపించింది? నా తమ్ముడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాడే నాతో ‘మీ ఇద్దరు కూతుళ్లే నిన్ను కాపాడారు.గుర్తుపెట్టుకో. నా కొడుకులు కూడా నన్ను అలా చూసుకోలేదు’అన్నాడు. నిజంగా నా కూతుళ్లు, జీవిత ఆ సమయంలో నన్ను బాగా చూసుకున్నారు. కోవిడ్ టైమ్లో మేం నలుగురం ఐసీయూలోనే ఉండిపోయాం. నేను ఇలా లేస్తే చాలు..డాడీ ఏం కావాలి అంటూ ఇద్దరు వచ్చేవాళ్లు. కొడుకులు తక్కువ అని నేను చెప్పను కానీ.. కూతుళ్లు మాత్రం ఎక్కువే. మీ నలుగురు కలిసి సినిమా చేసే అవకాశం ఉందా? ఉంది. కొన్ని కథలు కూడా వచ్చాయి. ‘దొరసాని’ ఫేమ్ మహేందర్ కూడా మా నలుగురితో ఓ సబ్జెక్ట్ అనుకుంటున్నాడు.మేం కొన్ని మార్పులు చెప్పాం. అలాగే ప్రవీణ్ సత్తారు కూడా గరుడవేగ పార్ట్2లో ఇద్దరు కూతుళ్లను యాడ్ చేసే ప్లాన్లో ఉన్నాడు. భవిష్యత్తులో తప్పుకుండా మేమంతా కలిసి సినిమా చేస్తాం. ప్రీరిలీజ్ ఈవెంట్లో సుకుమార్ గారు మాట్లాడుతూ..మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనే సినిమాల్లోకి వచ్చామని చెప్పారు.ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీలయ్యా. నాకు ఇన్ని రోజులు ఈ విషయం తెలియదే అని ఫీలయ్యా(నవ్వుతూ..) కొత్త సినిమాలు ఏం ఉన్నాయి? త్వరలోనే ఓ పెద్ద అనౌన్స్మెంట్ ఉంటుంది. పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నాం. -
Raj Tarun: రాజ్తరుణ్ ‘అహ నా పెళ్లంట’.. ఆ విశేషాలు ఏమిటంటే..
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్)/తూర్పుగోదావరి: తమడ మీడియా, జీ 5 భాగస్వామ్యంలో రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటిస్తున్న అహ నా పెళ్లంట వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభమైంది. ఏబీసీడీకి దర్శకత్వం వహించిన సంజీవరెడ్డి దర్వకత్వంలో రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్రా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని గరిమెళ్ల సత్యనారాయణ ట్రైనింగ్ కళాశాలలో షూటింగ్ మొదలైంది. చదవండి: చిరంజీవిపై నటి రాధిక ఆసక్తికర వ్యాఖ్యలు, ఏం చెప్పిందంటే రాజ్తరుణ్, కమెడియన్ హర్షవర్థన్పై ఎంపీ భరత్ రామ్ క్లాప్ కొట్టగా, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, వైఎస్సార్ సీపీ రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, గాదంశెట్టి శ్రీధర్ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ సినిమాలు, వెబ్ సిరీస్ల షూటింగ్లకు రాజమహేంద్రవరం, మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో అనువైన ప్రదేశాలు ఉన్నాయన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి సినిమా షూటింగ్లు, స్టూడియోల ఏర్పాటుకు విశాఖలో తొలి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. తర్వాత రాజమహేంద్రవరంలోని పిచ్చుకలంకను తీర్చిదిద్దుతామన్నారు. ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ మాట్లాడుతూ 25 ఏళ్ల క్రితం జంధ్యాల తీసిన అహ నా పెళ్లంట సినిమాలాగా ఈ వెబ్ సిరీస్ విజయవంతం అవుతుందన్నారు. దర్శకుడు సంజీవరెడ్డి మాట్లాడుతూ ఈ వెబ్సిరీస్లో ఆమని, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తారన్నారు. -
రెండో రౌండ్లో శ్రావ్య శివాని
న్యూఢిల్లీ: జాతీయ ఓపెన్ టెన్నిస్ చాంపియన్షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణి చిలకలపూడి శ్రావ్య శివాని రెండో రౌండ్లోకి అడుగుపెట్టింది. తొలి రౌండ్లో మూడో సీడ్ శ్రావ్య శివాని 6–3, 7–5తో శ్రీనిధిపై గెలిచింది. తెలంగాణకే చెందిన స్మృతి భాసిన్ కూడా రెండో రౌండ్కు చేరింది. స్మృతి 7–6 (7/1), 5–7, 6–4తో మిహికా యాదవ్ను ఓడించింది. పురుషుల సింగిల్స్లో గంటా సాయికార్తీక్ రెడ్డి 4–6, 3–6తో టాప్ సీడ్ నిక్కీ పునాచా చేతిలో ఓడిపోయాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో కాజా వినాయక్ శర్మ 6–4, 6–1తో భూపతి శక్తివేల్పై, విష్ణువర్ధన్ 6–4, 6–3తో ఆదిల్ కల్యాణ్పూర్పై నెగ్గారు. -
Shivani Misri Sadhoo: ‘విడిపోవడం’ అనే గాయం నుంచి బయటపడటానికి..
ప్రేమికులైనా, దంపతులైనా కలిసున్న ఇద్దరు వ్యక్తులు విడిపోతే.. ఆ ‘విడి’బంధం తాలూకు ప్రభావం ఎవరి మీద ఉంటుంది? దుఃఖంలో నిండా కూరుకుపోతే ముందున్న జీవితం కనపడుతుందా? చీకటి నిండిన ఒంటరితనంలో తిరిగి వెలుగులు నింపుకోవడం సాధ్యమేనా? విడిపోయే బంధాలను తిరిగి కలపడానికి ప్రయత్నించవచ్చు. కానీ, విడిపోయాక ఆ శూన్యంలో కలిసిపోకూడదు. తిరిగి నిలబడటానికి ప్రయత్నించాలి. మాజీ జ్ఞాపకాలకు బై బై చెప్పి తాజా దారులకు ఆహ్వానం పలకాలి. అందుకు ఏం చేయాలో చెబుతున్నారు మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్ కౌన్సెలర్ శివాని మిశ్రి సాధు. Marriage Counselor Shivani Misri Sadhoo: శివాని మిశ్రి సాధు ఇరవై ఏళ్ల నుంచి సైకాలజిస్ట్గా సేవలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా 17,000 జంటలకు కౌన్సెలింగ్ ఇచ్చి, దేశరాజధాని ఢిల్లీలో బెస్ట్ మ్యారేజ్ కౌన్సెలర్గా పేరొందారు. ప్రతి నెలా వందలాది యువతకు కౌన్సెలింగ్ ఇచ్చే శివాని ఢిల్లీ ఐబిఎస్ (ఇన్స్ట్యూట్ ఆఫ్ బ్రేయిన్ అండ్ స్పైన్), ఫోర్టిస్ హాస్పిటల్స్లో కౌన్సెలర్గా ఉన్నారు. సార్ధి కౌన్సెలింగ్ పేరుతో వ్యక్తిగతంగా సేవలను అందిస్తున్నారు. కౌన్సెలింగ్కు వచ్చే వారిలో అమ్మాయిలే ఎక్కువ అని చెప్పే శివాని మిశ్రి సాధు పెళ్లికి ముందైనా, పెళ్లి తర్వాతైనా రిలేషన్షిప్ బ్రేక్ అయితే, ఆ డిప్రెషన్తో బాధపడేవారు జీవితాలను అంతం చేసుకోకుండా, గతం నుంచి ఎలా బయటపడాలో సూచనలు చేస్తున్నారు. ‘‘ప్రేమ, పెళ్లి బంధంలో వచ్చే సమస్యల గురించి ప్రతి నెలా వందలాది మంది యువతీ యువకులతో సంభాషిస్తుంటాను. వారితో మాట్లాడుతున్నప్పుడు తెలిసిన విషయాలేంటంటే.. బంధం నుంచి విడిపోయిన తర్వాత ప్రపంచం శూన్యమైపోయినట్టుగా ఉంటుంది. తమని తాము ఒంటరిగా చేసుకోవడం, పుచ్చుకున్న కానుకలను ముందు పెట్టుకొని గంటలు గంటలు కూర్చోవడం, కెరీర్పై ఏమాత్రం దృష్టి పెట్టకపోవడం.. వంటివి చేస్తున్నారు. అదే అబ్బాయిలైతే వీటితోపాటు తాగుడుకు అలవాటు పడటం, సోషల్ మీడియాలో తమ మాజీ ప్రియురాలు లేదా మాజీ భార్యతో ఉన్న పాత ఫొటోలను అప్లోడ్ చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. కృత్రిమ జీవితానికి స్వస్తి కలిసున్న ఇద్దరు వ్యక్తులు విడిపోవాలనుకున్న బాధను అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ అనుభవిస్తారు. ఆ బాధను వెలిబుచ్చడానికి మరొకరి ఓదార్పును కోరుకుంటారు. దీని కారణంగా వారు చాలాసార్లు పెద్ద సమస్యల్లో చిక్కుకోవడం గమనించాను. మన నుంచి ఒకరు విడిపోతే అంతటితో జీవితం ముగియదు. జీవితాన్ని తరచి చూసుకుంటే మరో కొత్త కోణం తప్పక కనిపిస్తుంది. నచ్చని మనిషితో ఉంటూ భావోద్వేగాలను అదుపులో పెట్టుకుంటూ నాటకం ఆడాల్సిన అవసరం లేదు. కృత్రిమ జీవితాన్ని గడపాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీ మంచి రేపటి కోసం ఈ రోజు మీ మాజీ జ్ఞాపకాలకు బై బై చెప్పండి. జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి ఈ ఆరు అంశాలను అనుసరించండి. 1. మాజీ జ్ఞాపకాలలో ఓదార్పు వద్దు గతంలో గడిపిన అందమైన లేదా భయంకరమైన సమయాలు ఎన్నో ఉంటాయి. మీరు ఆ క్షణాలను పదేపదే తలచుకుంటూ వాటిలోనే ఓదార్పు కోరుకుంటూ జీవించాలనుకుంటే అది వృథా ప్రయాస అవుతుంది. అక్కడితోనే ఆగిపోతే జీవితంలో ఎప్పటికీ ముందుకు సాగలేరు. 2. తిరిగి వచ్చి మాట్లాడటానికి సాకులు వెతకద్దు ప్రతి చిన్న, పెద్ద విషయాలను ఉదయం నుండి సాయంత్రం వరకు మీ ‘మాజీ’తో పంచుకోవడం మీకు అలవాటు ఉండి ఉంటుంది. అందుకు పదేపదే కాల్/ మెసేజ్/ ఇ–మెయిల్ చేయడం, అతను/ఆమె ఇంటి చుట్టూ తిరగడం చేయవద్దు. ముందుగా మీ సంబంధం ముగిసి పోయిందనే వాస్తవంలోకి రండి. మీ జీవితం నుంచి మీ మాజీని పూర్తిగా తొలగించండి. 3. ఆ జ్ఞాపకాలను చెత్తబుట్టలో వేయండి దిగిన ఫోటోలు, వీడియోలు, ఫోటో ఫ్రేమ్లు, ఇచ్చి పుచ్చుకున్న బహుమతులు లేదా మీ మాజీని మళ్లీ మళ్లీ గుర్తుచేసే ఏదైనా వస్తువును ముందు పెట్టుకొని బాధపడుతూ కూర్చోకుండా వాటిని చెత్తబుట్టలో వేసేయండి. మీ ఇంటిలో ఫర్నిచర్ క్రమాన్ని మార్చండి. మీకు నచ్చిన రంగురంగుల పువ్వులు, లైట్లతో అలంకరించండి. మీ అందమైన ఫొటోలను గోడపై ఉంచండి, తద్వారా మీరు ఉదయం కళ్ళు తెరిచినప్పుడు, ప్రతిదీ మీదే కనిపిస్తుంది. మంచం మధ్యలో పడుకుని మీరే చెప్పుకోండి.. ‘ఇప్పుడు అంతా నాదే’ అని. 4. మీ ప్రత్యేక లక్షణాలను రాయండి ఒక డైరీ, పెన్ను తీసుకొని మీ 10 ప్రత్యేక లక్షణాలను రాయండి. ఈ జాబితా కొత్త విషయాలను ప్రయత్నించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఉదాహరణకు.. మీరు మంచి డ్యాన్సర్. గొప్ప పెయింటింగ్స్ చేస్తారు. నేను నా చేతులపై పచ్చబొట్లు ఇష్టపడతాను. ఇలాంటివి రాస్తున్నప్పుడు భవిష్యత్తు అందంగా కనిపిస్తూ ఉంటుంది. 5. ఆరు నెలల మేజిక్ పాట్ మీ ‘మాజీ’ని మరచిపోవడానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ‘మీ మాజీ గురించి ఆలోచించడం మానేసి, చేయవలసిన పనుల జాబితా’ను రూపొందించండి. బరువు తగ్గడం, మారథాన్కు సిద్ధపడటం, కొత్త భాష నేర్చుకోవడం, ఇల్లు కొనడం లేదా కొత్త ఇంటికి వెళ్లడం, సెలవులో వెళ్లడం, రాఫ్టింగ్, బంగీ జంపింగ్, పారాగ్లైడింగ్ వంటి సాహసాలు చేయడం, మీరు ఆనందించే కొత్త వ్యక్తులను కలవడం వంటి వాటిని జాబితా చేయండి. వీటిలో ఎప్పుడూ ప్రయత్నించని వాటిని రాబోయే ఆరు నెలల్లో చేయండి. అప్పుడు మీ మాజీ మీ ఆలోచనలలో కూడా పలచ బడిపోతారు. 6. మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా భావించండి ‘విడిపోవడం’ అనే గాయం నుండి బయటపడటానికి మీకు మీరే ఒక పార్టీని ఇవ్వడం ద్వారా మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా భావించుకోవచ్చు. మీ భాగస్వామితో సంబంధంలో ఉండటం వలన మీరు దూరంగా పెట్టిన మీ స్నేహితులను ఈ పార్టీకి ఆహ్వానించండి. రెట్టింపులుగా ఆనందాన్ని వెతుక్కుంటూ కొత్త జీవితానికి ఆహ్వానం పలకండి. -
Shivani Sisodia: ఈ శివానీ శివంగి!
సమస్యలు ఎదురైనప్పుడు పారిపోయేవారు కొందరైతే.. సమస్య మూలాలను కనుక్కొని దానిని కూకటివేళ్లతో సహా పెకలించేసేవారు మరికొందరు. ఈ కోవకు చెందిన అమ్మాయే 18 ఏళ్ల శివానీ సిసోడియా. రాజస్థాన్కు చెందిన శివానీ జీవితంలో ఎదురైన ఓ సంఘటన తన ఆలోచనా విధానాన్ని మార్చడంతో సెల్ఫ్ డిఫెన్స్ తను నేర్చుకుని, వందలమంది అమ్మాయిలకు శిక్షణనిస్తూ ధైర్యవంతులుగా తీర్చిదిద్దుతోంది. దీని వెనకాల ఒక కథ ఉంది. శివానీ పదోతరగతిలో ఉన్నప్పుడు.. ఒకరోజు స్కూలు అయిపోయిన తరువాత తన స్నేహితురాలితో కలిసి నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఆ సమయం లో అటుగా వెళ్తున్న కొందరు పోకిరీలు శివానీ వాళ్లను అసభ్యంగా కామెంట్ చేస్తూ.. ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. ఆ సమయంలో ఏం చేయాలో వాళ్లకు అర్థం కాలేదు. దాంతో వారినుంచి ఎలాగో తప్పించుకుని అక్కడినుంచి పారిపోయారు. మరుసటిరోజు స్కూలుకు వెళ్లిన శివానీ ముందురోజు జరిగిన విషయాన్ని తన స్నేహితులతో పంచుకోగా... వాళ్లు తాము కూడా అటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నట్లు చెప్పడంతో శివానీకి ఆశ్చర్యమేసింది. ‘ఎందుకు మీరు వాళ్లను ఎదుర్కోలేదు’ అని స్నేహితులను ప్రశ్నించింది. అప్పుడు వాళ్లు ‘ఏమో ఆ సమయంలో ఏం చేయాలో తట్టలేదు, వాళ్లను ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు’ అని చెప్పారు. అప్పుడే నిర్ణయించుకుంది శివానీ... నేను మాత్రం ఇంకోసారి ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు అస్సలు భయపడకూడదు అని. ఇందుకోసం ఆమె తన మనసును, శరీరాన్ని దృఢం చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులు, స్కూలు టీచర్, యోగా టీచర్ల సాయంతో ఆత్మరక్షణ విద్యలలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. తరువాత రాజస్థాన్లోని భరత్పూర్లోని రాజస్థాన్ కరాటియన్స్ స్కూల్లో చేరింది. ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు శ్రద్ధతో సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంది. తనలా అమ్మాయిలందర్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో శివానీ తన కోచ్ ఓంకార్తో కలిసి ఆడపిల్లల కోసం ఆత్మరక్షణపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలా రెండేళ్లలో.. స్కూళ్లు, కాలేజీకెళ్లే 1500 మందికి పైగా విద్యార్థినులకు శివానీ శిక్షణ నిచ్చింది. ‘‘మా కరాటే స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తీసుకుంటున్న అమ్మాయిలందరిలోకి, శివానీ చాలా చురుకైనది. ఆత్మరక్షణ మెళకువలను సులువుగా నేర్చుకుంది. జాతీయస్థాయి కుస్తీపోటీలలో రజత పతకం కూడా గెలుచుకుంది. శివానీ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించే పద్ధతి చాలా విలక్షణంగా ఉంటుంది’’ అని శివానీ ట్రైనర్ ఓంకార్ పంచోలి చెప్పారు. శివానీ మాట్లాడుతూ..‘‘నాకు అద్భుతమైన ట్రైనర్ దొరకడంతో ఆత్మరక్షణ విద్యలను ఎంతో బాగా నేర్చుకున్నాను. నేటి తరం అమ్మాయిలకు తమని తాము కాపాడుకోగల శక్తి సామర్థ్యాలు తప్పనిసరిగా ఉండాలి. అందుకే నేను నేర్చుకోవడమేగాక ఎంతోమందికి నేర్పిస్తున్నాను. ఎవరైనా ఆకతాయులు దాడిచేసినప్పుడు వారి నుంచి తప్పించుకోవడమేగాక వారిపై ఎదురు దాడికి ఎలా దిగాలో నేర్పిస్తుండడం వల్ల వాళ్లు ఎంతో కాన్ఫిడెంట్ గా తమ ఇళ్లకు ఒంటరిగా వెళ్లగలుగుతున్నారు’’ అని చెప్పింది. శివానీకి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వాళ్లలో ఒకరు జూడో ఛాంపియన్, మరొకరు తైక్వాండోలో బ్లాక్బెల్ట్ హోల్డర్. -
బిగ్బాస్: అతడికి ఊడిగం చేస్తున్నావా?
స్టార్ హీరో కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమిళ బిగ్బాస్ నాల్గో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఎన్నో రోజులుగా అయినవారికి దూరంగా ఉంటున్న హౌస్మేట్స్ కోసం బిగ్బాస్ వారి ఫ్యామిలీ మెంబర్స్ను లోనికి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కంటెస్టెంటు శివానీ తల్లి అఖిల నారాయణన్ మంగళవారం హౌస్లో అడుగు పెట్టింది. ఆమెను చూడగానే శివానీ కన్నీటి పర్యంతం అయింది. ఆమె కంటినీరు తుడిచి ఓదార్చిన అఖిల కూతురిని పక్కకు తీసుకెళ్లి మాట్లాడింది. ఆమె మీద ఉన్న కోపాన్నంతా ప్రదర్శిస్తూ చీవాట్లు పెట్టింది. అసలు నువ్వు బిగ్బాస్ హౌస్కు ఎందుకు వచ్చావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? అని నిలదీసింది. బాలాజీని అంటి పెట్టుకుని ఉండటం తప్ప నువ్వు సొంతంగా గేమ్ ఆడుతున్న దాఖలాలే లేవని ఘాటుగా రియాక్ట్ అయింది. (చదవండి: ఒక్క సినిమాకు రూ.135 కోట్లు తీసుకోనున్న హీరో?!) 'నువ్వేమైనా బాలాజీకి ఊడిగం చేస్తున్నావా?, నిన్ను చూస్తుంటే కొట్టాలన్నంత కోపం వస్తుంది. ఈ ఇంట్లో ఎంతో మంది అమ్మాయిలు ఉండగా నేను ఇచ్చిన క్రిస్మస్ బహుమతులను బాలాజీకే ఎందుకిచ్చావు? అతడేం మాట్లాడినా ఎందుకు సపోర్ట్ చేస్తావు? ఇది జోడీ నంబర్ 1 కాదు, బిగ్బాస్ షో' అని హెచ్చరించింది. ఇక బిగ్బాస్ హౌస్లో నీ ప్రవర్తన వల్ల మేము గర్వపడటం కాదు కదా! ట్రోల్ అవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తీవ్రస్థాయిలో ఆమెపై ఫైర్ అవడమే కాదు ఏకంగా దూషణలకు కూడా దిగడతో శివానీ మరింత దుఃఖించింది. ఇది ఆమె అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. శివానీ తన ఆటపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశ్యంతోనే ఆమె తల్లి అంత సీరియస్ అయినప్పటికీ నోటికొచ్చినట్లు తిట్టడం ఏమాత్రం సరికాదని అభిప్రాయపడుతున్నారు. తమిళ దర్శకుడు సీఎస్ అముధాన్ సైతం అఖిల ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని చెప్పుకొచ్చారు. ఇక శివానీని కించపరిచేలా మాట్లాడినందుకు ఆమె తల్లిని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె మాట్లాడినదాంట్లో తప్పేమీ లేదని వెనకేసుకొస్తున్నారు. మరోవైపు ఇదంతా తనవల్లే జరిగిందని బాలాజీ హౌస్మేట్స్ దగ్గర వాపోయాడు. (చదవండి:బిగ్బాస్ కంటెస్టెంట్ ఇంట తీవ్ర విషాదం) According to #Shivani mom This is This is Right wrong 🤧 pic.twitter.com/6oD8NuZ6zp — HBD Taetae 😻|| Lekha💜 || 레카 💜 (@LekhaOffl) December 29, 2020 Ok. Just happened to watch the Big Boss episode. That was clearly normalising extremely toxic parental abuse. No..No come on that’s not acceptable content at all. — CS Amudhan (@csamudhan) December 29, 2020 -
అవును.. మాకు కరోనా సోకింది
సాక్షి, హైదరాబాద్: నటుడు జీవితా రాజశేఖర్ కుటుంబ సభ్యులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా రాజశేఖర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనతో పాటు భార్య జీవిత, పిల్లలు శివానీ, శివాత్మికలకు కరోనా సోకిన విషయం నిజమేనని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ‘పిల్లలిద్దరూ పూర్తిగా కోలుకున్నారని.. జీవిత, తాను మాత్రం ఇంకా వైద్యుల సంరక్షణలోనే ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మా ఇద్దరి ఆరోగ్యం బాగానే ఉంది. త్వరలోనే ఇంటికి వెళ్తామంటూ’ ట్వీట్ చేశారు. హిందీ ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్లో శివానీ నటిస్తుండగా, విష్ణు విశాల్ హీరోగా వెంకటేశ్ దర్శకత్వంలోనూ కథానాయికగా ఛాన్స్ కొట్టేశారు. ఈ సినిమాతో హీరోయిన్గా శివానీ పరిచయం కానుంది. ఇక నూతన దర్శకుడు దుర్గానరేశ్ గుట్ట డైరెక్షన్లో ‘విధివిలాసం’ సినిమాలో శివాత్మిక నటిస్తుంది. ఈ సినిమాలో అరుణ్ అదిత్ జోడిగా ఆమె కనిపించనున్నారు. (ఇంటికి చేరుకున్న హీరోయిన్.. ఆత్మీయ స్వాగతం) The news is true that Jeevitha, Kids and I have tested positive for corona and are currently being treated in the hospital. Both the kids are completely out of it, Jeevitha and I are feeling much better and will be back home soon! Thank you ! — Dr.Rajasekhar (@ActorRajasekhar) October 17, 2020 -
మాటలే అస్త్రాలు
పాప్ ఈవెంట్ అంటే చాలు యూత్ ఉత్సాహంతో ఉర్రూతలూగిపోతుంటుంది. స్టేజ్ మీదకు దూకేస్తారేమో అనిపించే ఉత్సాహమది. అదే సమయంలో ఛీఫ్ గెస్ట్ ప్రసంగం స్టార్ట్ అవబోతుంటుంది. యూత్ కేరింతల్ని ఆపాలి. ముఖ్య అతిథిని మైక్ దగ్గరకు సగౌరవంగా ఆహ్వానించాలి. ఆ సమయంలో యువోత్సాహం సన్నగిల్లకూడదు. వచ్చినవారు చిన్నబోకూడదు. అప్పుడే ఓ వ్యక్తి మాటల మంత్రదండాన్ని తీస్తారు. తన చాకచక్యం ఉపయోగిస్తారు. యాంకరింగ్ అనిపించేలా సాగే ‘మాస్టర్ ఆఫ్ సెర్మనీ’లో టాప్స్టార్గా ఎదిగింది హైదరాబాద్ వాసి శివానీసేన్. పదేళ్లుగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ఎదుగుతున్న శివానీ నవతరం అమ్మాయిలు ఈ రంగంలో నెగ్గుకు రావాల్సిన విధానాలను పంచుకున్నారు.. ‘మాటల్నే అస్త్రాలుగా మార్చి కొన్ని గంటల పాటు సాగే ఈవెంట్ని ఆద్యంతం సజావుగా జరిగేలా చూడటం అంటే మాటలు కాదు. ఈ పనిని ‘మాస్టర్ ఆఫ్ సెర్మనీ’ అంటారు. పెద్ద నగరాల్లోనే కాదు చిన్న పట్టణాల్లోనూ ఈవెంట్ల జోరు పెరుగుతున్న కొద్దీ ఈ ‘మాస్టర్ ఆఫ్ సెర్మనీ’ డిమాండ్ కూడా అంతకంతకూ పెరుగుతోంది. వేల సంఖ్యలో జనం చేరే పబ్లిక్ ఫంక్షన్లలో ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా నిర్వహించడం అనేది అంత సులువు కాదు. నవ్వుతూ, నవ్విస్తూ గెస్ట్లను ఆహ్వానించడం నుంచి ఆడియన్స్ దాకా చక్కబెట్టాల్సిన బాధ్యతలెన్నో ఉంటాయి. స్టేజ్ మీద డ్యాన్స్ చేసేవారితో అవసరమైతే నేనూ డ్యాన్స్ చేయాలి. పాడేవాళ్లతో నేనూ పాడాలి. మూడు భాషలైనా అనర్గళంగా మాట్లాడగలగాలి. అందుకే ఆల్ ఇన్ వన్ డ్యూటీ అంటే ఇదే అనుకుంటాను. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్లు దీన్ని కెరీర్గా మలచుకోవచ్చు. పదేళ్లుగా ఈ ఫీల్డ్లో ఉన్నాను. కార్పొరేట్ షోస్, కాన్ఫరెన్స్లు, యాన్యువల్ డేస్, ఫ్యామిలీ డేస్, ప్రెస్ లాంచ్లు, యాన్యువల్డేస్, కాలేజ్ రీ యూనియన్స్, సంగీత్ ఫంక్షన్స్.. ఇలా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. జాతీయ, అంతర్జాతీయ కంపెనీల బ్రాండ్స్తో పని చేశా. ఇంటినీ... ఈవెంట్స్నీ.. ఈ ఫీల్డ్లోకి రాకముందే పెళ్లి చేసుకున్నాను. తొమ్మిదేళ్ల బాబు కూడా ఉన్నాడు. ఈ ప్రొఫెషన్ అందించే జాబ్ శాటిస్ఫ్యాక్షన్ ఇంట్లో నా రెస్పాన్సిబిలిటీస్ని మరింత సులభతరం చేసింది. ఈ ప్రొఫెషన్ కారణంగా సినిమా, స్పోర్ట్స్ సెలబ్రిటీలతో పాటు పొలిటిషియన్స్, అవార్డ్ విన్నర్స్ను కూడా కలిసే ఛాన్స్ దక్కింది. ఈ ఈవెంట్స్లో పార్టీలు కూడా ఉంటాయి కాబట్టి, ప్రత్యేకంగా వేరే పార్టీలు అక్కర్లేదు. ఆ టైమ్ని జిమ్లో స్పెండ్ చేస్తా. రక్షణ తప్పనిసరి పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యే ఈవెంట్స్ను నడిపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది అంత తేలికైన ప్రొఫెషన్ కాదు. చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్ద పెద్ద సమస్యలు తెచ్చిపెడుతుంటాయి. ఒక్కోసారి ఊర్లకు ఒంటరి ప్రయాణం చేయాలి. చాలా ఈవెంట్స్ అర్ధరాత్రి దాకా నిర్వహిస్తుంటారు. తిరిగొచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రోగ్రాం అయిపోయాక డబ్బులు ఎగ్గొట్టే ఈవెంట్ మేనేజర్లూ ఉంటారు. ఈవెంట్ అయిపోయాక లేట్నైట్ అయితే డ్రాపింగ్ సౌకర్యం కూడా డిమాండ్ చేయాలి. ఇప్పుడు కరోనా కారణంగా వచ్చిన గ్యాప్ ఈ రంగంపై కొన్నాళ్లు ప్రభావం ఉంటుంది. మళ్లీ ఈవెంట్స్ చేసే రోజు కోసం ప్రస్తుతం ఎదురుచూస్తున్నాను’ అంటూ శివానీ ఈ ఫీల్డ్లో పదేళ్లుగా రాణిస్తున్న అనుభవాలను పంచుకున్నారు. – నిర్మలారెడ్డి -
సీఎం సహాయనిధికి శివానీ, శివాత్మికా విరాళం
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ (కోవిడ్ –19) నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం టాలీవుడ్ ప్రముఖులు తమవంతు సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హీరో రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రెండు లక్షలు విరాళంగా ఇచ్చారు. 'దొరసాని' సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైన శివాత్మిక పుట్టినరోజు (ఏప్రిల్ 22) సందర్భంగా ఇవాళ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కలిసి ...విరాళం చెక్ను అందించారు. (అన్నయ్యా.. వదినకు చాన్స్ ఇస్తున్నవా? ) అనంతరం శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చక్కటి చర్యలు తీసుకుంటున్నాయి. మా వంతుగా వీలైనంత సహాయం చేయాలని ముందుకొచ్చాం. ప్రజలందరూ తమ తమ ఇళ్లకు పరిమితమై, ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నాము. స్టే హోమ్. స్టే సేఫ్’ అని అన్నారు. ఆ సమయంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా ఉన్నారు. (సీఎం సహాయ నిధికి రూ.4.70 కోట్ల విరాళం) -
కరోనా క్రైసిస్: శివాని, శివాత్మిక ఉదారత
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది. ఇక చిత్ర పరిశ్రమలో థియేటర్ల మూసివేయడంతో పాటు షూటింగ్లు కూడా వాయిదా పడ్డాయి. ఈ లాక్డౌన్ కారణంగా రోజువారీ కార్మికులకు పనిలేకుండా పోయింది. రెక్కాడితేగాని డొక్కాడని పేద సిని కార్మికుల కోసం టాలీవుడ్ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సి. సి. సి. మనకోసం (కరోనా క్రైసిస్ ఛారిటీ మన కోసం) ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో సిసిసికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున చెరో కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. వీరిని చూసి మిగతా నటులు కూడా ముందుకు వచ్చి తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. తాజాగా సీనియర్ నటీనటులు జీవితా రాజశేఖర్ల ఇద్దరు కుమార్తెలు శివాని, శివాత్మికలు పేద కార్మికుల కోసం తమ వంతుగా సాయం ప్రకటించారు. సిసిసికి శివాపి, శివాత్మికలు చెరో లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ మేరకు జీవితా రాజశేఖర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఇప్పటికే రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులను అందించాము. ఈ కార్యక్రమం కరోనా క్రైసిస్ ఉన్నంతవరకు సాగుతుంది. అయితే పేద సినీ కార్మికుల కోసం ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీలో మా కుటుంబం కూడా భాగం అయింది. మా ఇద్దరు కుమార్తెలు శివాణి, శివాత్మికలు తమ సంపాదన నుంచి చెరో లక్ష రూపాయాలు విరాళంగా ఇచ్చారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి, కష్టాల్లో ఉన్న పేద కార్మికులకు సహాయం అందించడంలో మా కుటుంబం సహాయం ఎప్పుడూ ఉంటుంది. నిత్యావసర వస్తువుల పంపిణీలో మాకు సహకరిస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’అంటూ జీవితా రాజశేఖర్ పేర్కొన్నారు. Inspired by Nanna and Amma,@Rshivani_1 and I will be contributing rupees 1 lakh each from our earnings to the #coronacrisischarity Proud to see our industry come together during this crisis! Love you all Take care🤗 We'll make it through this🙏🙌 — Shivathmika Rajashekar (@ShivathmikaR) April 4, 2020 @Rshivani_1 & @ShivathmikaR Contributed 1 lakh rupees each from their earnings to the #coronacrisischarity Here's everything I want to say! 😊 pic.twitter.com/DZ7D4Qi7cp — Dr.Rajasekhar (@ActorRajasekhar) April 4, 2020 చదవండి: ప్రధాని పిలుపుపై రామ్ చరణ్ ట్వీట్ పెద్ద మనసు చాటుకున్న నయనతార -
బ్రెయిన్లో బ్లడ్ క్లాట్.. జార్జియాలో శివాణి
యాదాద్రి జిల్లా : భువనగిరికి చెందిన శివాణి అనే విద్యార్థిని జార్జియా దేశంలో చిక్కుకుపోయింది. వెంకటేష్, సరిత దంపతుల కూతురు శివాణి పై చదువుల కోసం జార్జియా వెళ్లింది. స్థానిక అకాకి త్సెరెటెలి విశ్వవిద్యాలయంలో ఆమె మెడిసిన్ చదువుతోంది. కళాశాలకు బస్సులో వెళుతున్న సమయంలో ఒకసారి వాంతి చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ బ్రెయిన్లో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. వెంటనే శివాణి తల్లిదండ్రులకు విద్యార్థులు సమాచారం అందించారు. దీంతో కూతురుకు మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించి శివాణిని రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జార్జియా నుంచి వచ్చే సమయంలో ఎయిర్ పోర్ట్ సబ్బంది చివరి నిమిషంలో శివాణిని భారత్కు పంపేందుకు నిరాకరించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కూతురు శివాణి భారత్కు రావడానికి అన్ని ఏర్పాట్లు చేసినా.. చివరి నిమిషంలో రాకుండా అడ్డుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురును ఆదుకోవాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. -
తైక్వాండో రారాణి శివాని
ఆడపిల్ల అంటేనే చిన్నచూపు! అది ఒకప్పుడులే!! ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది. అమ్మాయిలూ అన్నిరంగాల్లోనూ రాణిస్తున్నారు. చదువేకాదు ఏ రంగంలోనైనా మేమూ ఏదైనా సాధించగలమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు నేటి యువతులు. ప్రోత్సాహం ఉండాలే గాని క్రీడారంగంలో పతకాల మీద పతకాలు తెస్తామంటున్నారు. అందుకు అంతర్జాతీయస్థాయిలో తైక్వాండో క్రీడలో రాణిస్తోన్న ఇందూరు రారాణి ధాత్రిక శివానియే నిదర్శనం. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. నిజామాబాద్స్పోర్ట్స్: ఒకప్పుడు ఆడ పిల్లలు పెళ్లి కాకముందు ఇంటికి, పెళ్లయ్యాక వంటింటికే పరిమితమయ్యేవారు. మరి ఇప్పుడు ఆ ధోరణి మారింది. ఆధునికంగా ఆలోచిస్తున్నారు. కాలానికనుగుణంగా మారాలని నిర్ణయించుకుంటున్నా రు. చదువు, ఉద్యోగం, క్రీడలు, ఇతర పోటీ పరీక్షల్లో ప్రతిభ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రంగాల్లో అమ్మాయిలూ అదుర్స్ అనిపిస్తున్నారు. ఆ కోవకు చెందినవారే ధాత్రిక శివాణి. తనకు ఇష్టమైన క్రీడారంగంలో విశేషంగా రాణిస్తోంది. ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రులు స్వేచ్ఛగా నీ ఇష్టం వచ్చినట్లు ఉండు.. నీకు ఇష్టమున్నది నేర్చుకో.. అంటూ చెప్పగానే ఆ మాటలనే స్ఫూర్తిగా తీసుకున్న శివాణి అందరిలా కాకుండా తాను ఏదో సాధించాలనుకుంది. అదే ఆశయంతో చిన్ననాటి నుంచే పట్టుదలతో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాధించుకోవాలని ఇటు చదువుతో పాటు క్రీడలపై మక్కువ పెంచుకుంది. ఫలితంగా తైక్వాండో క్రీడలో ప్రతిభ చూపుతోంది. అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధిస్తోంది. కుటుంబ నేపథ్యం.. జిల్లా కేంద్రానికి చెందిన ధాత్రిక శ్రీనివాస్–పద్మలత మొదటి కూతురైన శివాని చిన్న నాటి నుంచే చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తోంది. రన్నింగ్, హైజంప్, లాంగ్జంప్లలో తన ప్రతిభను చాటుతూనే పాఠశాల స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఒకటి నుంచి 5వ తరగతి వరకు అపూర్వ విద్యాలయంలో 6 నుంచి 10 ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో చదువు కొనసాగింది. 10వ తరగతిలో 9 జీపీఏ సాధించింది. ఇంటర్ నారాయణ కాలేజీలో చదివి మంచి మార్కులతో ప్రతిభను చాటింది. హైదరాబాద్లోని బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతూ మిగతా సమయంలో ఖాళీగా ఉండకుండా తన సీనియర్ తైక్వాండో అడడం చూసి డిఫెన్స్ కోసమైనా తైక్వాండో నేర్చుకోవాలని పట్టుదలతో శిక్షణ తీసుకొని అమీర్పేటలోని మోయిన్ మాస్టర్ దగ్గర మొదట కోచింగ్లో చేరింది. గ్రాండ్ మాస్టర్ జయంత్రెడ్డి దగ్గర కోచింగ్ తీసుకుంటూ ఆయన ఇచ్చిన స్ఫూర్తితో తైక్వాండోలో రాటుదేలింది. అప్పటి నుంచి తైక్వాండో ఆటను సీరియస్గా తీసుకొని పోటీలలో పాల్గొనడం ప్రారంభించింది. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీల వరకు అనేక పతకాలను సాధించింది. శివాణి రికార్డులు మచ్చుకు కొన్ని.. 2018 ఒక్క నిమిషంలో 139 ఎల్బ్లోస్టోర్లు కొట్టి హైరేంజ్ వరల్డ్ రికార్డు బుక్లో స్థానం సాధించింది. 2018 ఆగస్టు 24, 26 తేదీలలో మలేషియాలో జరిగిన 12వ క్లాసిక్ ఇంటర్నేషనల్ తైక్వాండో పోటీలలో 3వ స్థానంలో నిలిచి భారత దేశానికి బ్రాంజ్ మెడల్ను సాధించింది. 2018 జనవరి 21న తెలంగాణ స్టేట్ తైక్వాండో చాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించింది. 2017 ఆగస్టు 27న ఎన్సీసీ బెస్ట్ క్యాడెట్ అవార్డు పొందింది. ఒలింపిక్స్లో ప్రాతినిధ్యమే లక్ష్యం ఒలింపిక్స్లో తాను భారత దేశానికి ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చిన్ననాటి నుంచి చదువుతోపాటు ఆటలపై మక్కువ పెంచుకున్నా. సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకొని తైక్వాండో ఆటను ఆశయంగా మార్చుకున్నా. చిన్ననాటి నుంచి తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిది. ప్రభు త్వం సహకరిస్తే ఆటలో మరింత రాణిస్తాం. –ధాత్రిక శివాని, అంతర్జాతీయ తైక్వాండో క్రీడాకారిణి -
విజేత శివాని
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్–4 జూనియర్ సర్క్యూట్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి అమినేని శివాని చాంపియన్గా నిలిచింది. న్యూఢిల్లీలోని ఆర్కే ఖన్నా టెన్నిస్ కాంప్లెక్స్లో శనివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ శివాని 6–1, 6–3తో రెండో సీడ్ ఎరిన్ రిచర్డ్సన్ (ఇంగ్లండ్)పై విజయం సాధించింది. శివాని కెరీర్లో ఇది రెండో ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్. 17 ఏళ్ల శివాని ఇప్పటి వరకు ఏడు ఐటీఎఫ్ టోర్నీల్లో ఫైనల్కు చేరుకోగా ఐదుసార్లు రన్నరప్గా నిలిచి, రెండుసార్లు టైటిల్ను సొంతం చేసుకుంది. -
శివాని, సాత్విక ముందంజ
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్షిప్లో తెలంగాణ ప్లేయర్లు సామ సాత్విక, శ్రావ్య శివాని, షేక్ హుమేరా ముందంజ వేశారు. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో వీరు మూడో రౌండ్కు చేరుకున్నారు. బుధవారం జరిగిన మహిళల రెండో రౌండ్లో సాత్విక 6–1, 6–1తో రిషిక సుంకర (ఢిల్లీ)పై, శ్రావ్య శివాని 6–2, 6–3తో నిత్యరాజ్ బాబురాజ్ (తమిళనాడు)పై విజయం సాధించారు. హుమేరా 1–0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ఆమె ప్రత్యర్థి ముస్కాన్ గుప్తా (ఢిల్లీ) రిటైర్డ్హర్ట్గా వెనుదిరగడంతో ఆమె ముందంజ వేసింది. పురుషుల విభాగంలో తెలంగాణకు చెందిన సీపీ అనిరుధ్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. అండర్–18 బాలికల విభాగంలోనూ షేక్ హుమేరా, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక మూడో రౌండ్కు చేరుకున్నారు. రెండోరౌండ్లో హుమేరా 3–6, 6–4, 6–3తో ముస్కాన్ గుప్తా (ఢిల్లీ)పై గెలుపొందగా, రష్మిక 6–2, 6–3తో విపాసా మెహ్రా (తమిళనాడు)ను ఓడించింది. బాలుర విభాగంలో రాష్ట్రానికి చెందిన గంటా సాయికార్తీక్ రెడ్డి 5–7, 6–4, 4–7 (4/7)తో అజయ్ మలిక్ (హరియాణా) చేతిలో పరాజయం పాలై రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. -
కోలీవుడ్ కాలింగ్
ఇంకా సిల్వర్ స్క్రీన్పైకి ఎంట్రీ ఇవ్వలేదు. హీరోయిన్గా చేస్తున్న సినిమా ఆన్ సెట్స్లో ఉంది. కానీ కోలీవుడ్ నుంచి శివానీకి కబురొచ్చింది. జీవితా రాజశేఖర్ల కుమార్తె శివానీ హిందీ ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్లో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళ ఆఫర్ గురించి చెప్పాలంటే... విష్ణు విశాల్ హీరోగా వెంకటేశ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులోనే కథానాయికగా చాన్స్ను దక్కించుకున్నారు శివానీ. ఈ సినిమా షూట్లో పాల్గొనడానికే ప్రస్తుతం ఆమె చెన్నైలో ఉన్నారని సమాచారం. లవ్స్టోరీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కే ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్లో కనిపిస్తారట శివానీ. ఇదిలా ఉంటే మన తెలుగమ్మాయి శివానీ ఈ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమకు వెళుతుంటే, ఈ చిత్ర కథానాయకుడు విష్ణు విశాల్.. రానా హీరోగా నటిస్తున్న ‘అరణ్యం’ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం కానున్నారు. -
అందమైన ప్రేమకథ
అడవి శేష్, శివానీ రాజశేఖర్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘2 స్టేట్స్’ (వర్కింగ్ టైటిల్). చేతన్ భగత్ రాసిన ‘2 స్టేట్స్’ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. వెంకట్ రెడ్డి కుంచం దర్శకత్వంలో ఎంఎల్వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ కోల్కత్తాలో ముగిసింది. ఈ సందర్భంగా ఎంఎల్వి సత్యనారాయణ (సత్తిబాబు) మాట్లాడుతూ– ‘‘బ్యూటిఫుల్, క్యూట్ రొమాంటిక్ లవ్స్టోరీగా రూపొందుతోన్న చిత్రమిది. హైదరాబాద్లో ఫస్ట్ షెడ్యూల్, కోల్కత్తాలో సెకండ్ షెడ్యూల్ పూర్తి చేశాం. అడవి శేష్, శివానీ, భాగ్యశ్రీ, రజిత్ కపూర్, లిజి, ఆదిత్య మీనన్ కాంబినేషన్లో కీలకమైన టాకీ సన్నివేశాలను చిత్రీకరించాం. పూర్తయినంత వరకు రషెస్ చూశాం. సినిమా చాలా బాగా వస్తోంది. ఈ నెల 7న మూడో షెడ్యూల్ను హైదరాబాద్లో ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘2 స్టేట్స్’ నవల చదువుతున్నంతసేపు పాఠకుడు ఎంతగా ఆస్వాదిస్తాడో, మా సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ అంతకు రెట్టింపు ఆస్వాదిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు వెంకట్ రెడ్డి కుంచం. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: షానియల్ డియో, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్. కుమార్. -
నాన్నే నిజమైన హీరో !
సినీరంగంలో మా నాన్నే నా హీరో అని అంటోంది రాజశేఖర్, జీవితల పెద్ద కూతురు శివాని. వైద్యవిద్య చదువుతున్న ఈ బ్యూటీ ఇప్పుడు హీరోయిన్గా పరిచయం కానుంది. ఇప్పటికే 2స్టేట్స్ హిందీ చిత్ర తెలుగు రీమేక్లో నటించడానికి ఎంపికైన శివాని త్వరలో తమిళ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సందర్భంగా శివాని ఏమంటుందో చూద్దాం. ‘నా తండ్రి రాజశేఖరే నాకు నటనలో స్ఫూర్తి. ఆయన డాక్టరు వృత్తిని వదిలి పెట్టకుండానే నటనను కొనసాగిస్తున్నారు. నాన్న వద్ద వైద్యం చేయించుకునేవారు ఆయన్ని మ్యాజిక్మ్యాన్ అంటుంటారు. నాకు నచ్చిన రంగాలు రెండు. ఒకటి వైద్యం, రెండు నటన. నేను మంచి డాక్టరుగా, నటిగా అవుతాననే నమ్మకం ఉంది. కుటుంబం, స్నేహితుల ముందు నటిస్తున్నానని భావించు. అప్పుడే కెమెరా ముందు ఎలాంటి భయం లేకుండా నటించగలవు అని నాన్న చెప్పారు. ఆయన మాటల్ని పాఠిస్తున్నాను. నేను కూచిపూడి, కథకళి డాన్స్ నేర్చుకుంటున్నాను. కిక్బాక్సింగ్ విద్యలోనూ శిక్షణ పొందుతున్నాను. చిత్రాల్లో గాయనిగానూ పేరు తెచ్చువాలన్న ఆశ ఉంది. అందుకే కర్ణాటక సంగీతాన్ని నేర్చుకుంటున్నాను. నాన్నే నా సినీ ప్రపంచ హీరో. నేను మా అమ్మలా ఉన్నానంటే సంతోషమే. ఈ తరం హీరోయిన్లలో నటి సమంత నచ్చిన నాయకి’. అని తన అభిరుచులు, అభిప్రాయాలు తెలిపారు. -
రెండు రాష్ట్రాల ప్రేమ మొదలు
హిందీ హిట్ మూవీ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్ మొదలైంది.‘2 స్టేట్స్’ పేరుతోనే రూపొందుతోన్న ఈ చిత్రం ద్వారా జీవితారాజశేఖర్ల తనయ శివానీ హీరోయిన్గా పరిచయమవుతున్నారు. వెంకట్రెడ్డి కుంచం దర్శకత్వంలో లక్ష్య ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నటుడు కృష్ణంరాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి క్లాప్ ఇచ్చారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘అడివి శేష్ మంచి నటుడు. శివానీని హీరోయిన్గా పరిచయం చేయడం హ్యాపీగా ఉంది. అనూప్ ఇప్పటికే మూడు బ్యూటిఫుల్ ట్యూన్స్ అందించారు’’ అన్నారు వెంకట్ కుంచం. ‘‘తెలుగులో బెస్ట్ మూవీస్లో ఒకటిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత ఎం.ఎల్.వి. సత్యనారాయణ (సత్తిబాబు). ‘‘నేను నటించడానికి అంగీకరించిన నా తల్లిదండ్రులకు థ్యాంక్స్’’ అన్నారు శివానీ రాజశేఖర్. ‘‘ఎప్పటి నుంచో మంచి లవ్స్టోరీలో నటించాలనుకుంటుంటే ఈ సినిమాతో కుదిరింది’’ అన్నారు అడివి శేష్. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్ కూఛిబొట్ల, సమర్పణ: విశ్వప్రసాద్. -
2 స్టేట్స్ మూవీ ఓపెనింగ్
-
కోలీవుడ్కు మరో వారసురాలు
తమిళసినిమా: సినీ వారసుల ఎంట్రీలు ఈజీనే. అయితే ఇక్కడ నిలదొక్కుకోవడం అనేది వారి ప్రతిభ, అదృష్టం పైనే ఆధారపడి ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యమే. అలా నవ నటి శివాని కోలీవుడ్లో తన అదృష్టాన్ని పరిక్షంచుకోనుంది. శివాని అంటే ఎవరన్నది చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. ఎస్ నటి జంట రాజశేఖర్, జీవిత దంపతులు పెద్ద కూతురే ఈ శివాని. ఈ బ్యూటీని ఇంతకు ముందే దర్శకుడు బాలా తన చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం చేయనున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఎందుకనో జరగలేదు. తాజాగా ఒక తెలుగు చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యింది. హిందీ చిత్రం 2 స్టేట్స్ తెలుగు రీమేక్లో శివాని హీరోయిన్గా పరిచయం కానుంది. ఇలాంటి పరిస్థితిలో కోలీవుడ్ నుంచి శివానికిప్పుడు పిలుపు వచ్చింది. తన యువ నటుడు విష్ణువిశాల్తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ విషయం గురించి శివాని తెలుపుతూ ఇటీవల విష్ణు విశాల్ కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చిందని చెప్పింది. తన ఫొటోలు పంపించమని చెప్పారని తెలిపింది. ఆ తరువాత తాను చెన్నైకి వచ్చి, దర్శకుడు వెంకటేశ్, విష్ణువిశాల్లను కలిశానని చెప్పింది. దర్శకుడు చెప్పిన కథ తనకు చాలా బాగా నచ్చిందని, అయితే ఆ సమయంలో వారు హీరోయిన్గా తనను కన్ఫార్మ్ చేయలేదని అంది. మరి కొన్ని రోజుల తరువాత తమ చిత్రంలో హీరోయిన్వి నువ్వే అని చెప్పారని తెలిపింది. ప్రేమతో కూడిన చాలా ఢిపరెంట్ కథా చిత్రంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పింది. తన పాత్రలో నటించడానికి చాలా స్కోప్ ఉంటుందని అంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో ఎప్పుడెప్పుడు నటిస్తానా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొంది. ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్న శివానికి నటన గురించి చెప్పనక్కర్లేదు. తను నటనలో శిక్షణ తీసుకోవలసిన అవసరం ఉండదనుకుంటా. కారణం ఆమె తల్లిదండ్రులిద్దరూ నటీనటులే కాబట్టి. తను సినిమా వాతావరణంలోనే పుట్టి పెరిగింది.శివాని కూడా ఇదే విషయాన్ని పేర్కొంది. అదే విధంగా తను చిన్న వయసులోనే హీరోయిన్ కావాలని నిర్ణయించుకుందట. అయితే ప్రస్తుతం తాను డాన్స్ క్లాసులకు వెళ్లుతున్నట్లు, బెల్లీ, కథక్ నృత్యాలను నేర్చుకుంటున్నట్లు చెప్పింది. ఈ చిత్రం ఏప్రిల్లో ప్రారంభం కానుంది. వేల్రాజ్ ఛాయాగ్రహణం, గాయకుడు క్రిష్ సంగీతాన్ని అందించనున్నారు. -
సెమీస్లో శివాని
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ జూనియర్స్–2018 గ్రేడ్–2 టోర్నమెంట్లో శివాని అమినేని సెమీస్కు చేరింది. కోల్కతాలో జరుగుతున్న ఈ టోర్నీ బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శివాని 6–0, 6–1తో మరో తెలుగమ్మాయి శ్రీవల్లి రష్మికపై విజయం సాధించింది. సెమీస్లో సెలీన్ ఓవున్క్ (టర్కీ)తో శివాని తలపడనుంది. -
క్వార్టర్స్లో శివాని, రష్మిక
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ జూనియర్స్–2018 గ్రేడ్–2 టోర్నమెంట్లో తెలుగమ్మాయిలు జోరు కొనసాగిస్తున్నారు. కోల్కతాలో జరుగుతున్న ఈ టోర్నీలో శ్రీవల్లి రష్మిక, శివాని అమినేని క్వార్టర్స్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్స్లో శివాని అమినేని 6–4, 7–5తో కావ్య (భారత్)పై విజయం సాధించగా... శ్రీవల్లి రష్మిక 7–6 (7/1), 6–3తో పూజ ఇంగాలే (భారత్)పై గెలుపొంది క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. -
క్వార్టర్స్లో రష్మిక, శివాని
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయిలు శ్రీవల్లి రష్మిక, శివాని అమినేనిలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సింగిల్స్ విభాగంలో క్వార్టర్స్కు చేరిన వీరిద్దరూ... డబుల్స్ కేటగిరీలో ఓటమి పాలయ్యారు. ఢిల్లీలో బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో శ్రీవల్లి రష్మిక (భారత్) 6–4, 6–4తో సొనాషి భట్నాగర్ (భారత్)పై గెలుపొందింది. మరో ప్రిక్వార్టర్స్లో ఐదోసీడ్ శివాని (భారత్) 6–2, 6–2తో జూలి బెల్గ్రావెర్ (నెదర్లాండ్స్)ను ఓడించి ముందంజ వేసింది. మరోవైపు డబుల్స్ క్వార్టర్స్లో శివాని అమినేని (భారత్)–డోరోతేజ జొక్సోవిక్ (సెర్బియా) జంట 3–6, 4–6తో ఆంచిసా చాంట (థాయ్లాండ్)–హొ కి జెన్ని వాంగ్ (హాంకాంగ్) జోడీ చేతిలో ఓటమి పాలైంది. మరో మ్యాచ్లో శ్రీవల్లి రష్మిక (భారత్)–యునా ఒహాషి (జపాన్) ద్వయం 3–6, 6–3, 9–11తో సోఫియా–మార్గక్స్ (ఫ్రాన్స్) జంట చేతిలో పరాజయం చవిచూసింది. బాలుర డబుల్స్ విభాగంలో రిత్విక్ చౌదరి బొల్లిపల్లి సెమీస్కు చేరుకోగా, మాచెర్ల తీర్థ శశాంక్ జంట క్వార్టర్స్లో నిష్క్రమించింది. క్వార్టర్స్లో రిత్విక్ చౌదరి–అభిమన్యు రెడ్డి (భారత్) జంట 6–3, 6–4తో సుశాంత్–రిథమ్ మల్హోత్రా (భారత్) జోడీపై గెలిచింది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్లో రిత్విక్–అభిమన్యు (భారత్) జంట 6–4, 6–1తో నాలుగో డాంగ్ జు కిమ్–జోంగ్ పార్క్ (కొరియా) జోడికి షాకిచ్చింది. మరో క్వార్టర్స్లో తీర్థ శశాంక్–పీయూశ్ సురేంద్ర (భారత్) జంట 4–6, 2–6తో లూయిస్ హెర్మన్–గౌథియర్ (బెల్జియం) జోడీ చేతిలో ఓటమి పాలైంది. అంతకుముందు ప్రిక్వార్టర్స్లో తీర్థ శశాంక్ జోడి 7–5, 7–5తో నాథోలిన్ కాల్విన్ గోల్మి (భారత్)–నికిత్ రెడ్డి (అమెరికా) జోడీపై గెలుపొందింది. -
బెస్ట్ చాయిస్
‘‘మంచి సినిమాతో పరిచయం చేయాలని ఉంది. సరైన కథ కోసం చూస్తున్నాం’’ అని రెండు మూడు నెలల క్రితం జీవిత ‘సాక్షి’తో అన్నారు. పెద్ద కుమార్తె శివానీ సినీ రంగప్రవేశం గురించి మాట్లాడినప్పుడు ఆమె అలా అన్నారు. ఆ టైమ్ వచ్చేసింది. రాజశేఖర్–జీవితలకు మంచి కథ దొరికింది. కూతురి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి ఇది కరెక్ట్ మూవీ అని ఫిక్స్ అయ్యారు. యస్.. శివానీ ఎంట్రీ షురూ అయింది. హిందీ హిట్ మూవీ ‘2 స్టేట్స్’ రీమేక్ ద్వారా శివానీ తెలుగు తెరపై మెరవనుంది. అర్జున్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ‘2 స్టేట్స్’ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అడవి శేష్ హీరోగా నటించనున్న ఈ చిత్రం తెలుగు రీమేక్లో శివానీ హీరోయిన్గా దాదాపు ఫిక్స్ అయింది. అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావడమే ఆలస్యం. నూతన దర్శకుడు వెంకట్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ‘2 స్టేట్స్’ కథ విషయానికొస్తే.. ఓ తమిళ బ్రాహ్మణ యువతి, పంజాబీ యువకుడు ప్రేమలో పడతారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఈ ఇద్దరూ పెద్దల్ని ఒప్పించి, ఎలా పెళ్లి చేసుకున్నారు? అనేది కథ. లైన్ సింపుల్ అయినా తీసిన విధానం బాగుంటుంది. అందుకే కుమార్తె ఎంట్రీకి ఇదే ‘బెస్ట్ చాయిస్’ అని రాజశేఖర్ దంపతులు అనుకుని ఉంటారు. -
శివాని జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–3 టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి అమినేని శివాని సత్తా చాటింది. పుణేలో జరిగిన ఈ టోర్నీలో తన భాగస్వామి ఆకాంక్ష భాన్తో కలిసి డబుల్స్ టైటిల్ను అందుకుంది. శుక్రవారం జరిగిన బాలికల డబుల్స్ ఫైనల్లో టాప్సీడ్ శివాని–ఆకాంక్ష (భారత్) ద్వయం 3–6, 6–2, 10–3తో సాల్సా అహర్ (భారత్)–షియోరి ఇటో (జపాన్) జంటపై విజయం సాధించింది. సింగిల్స్ విభాగంలో శివాని పోరాటం సెమీస్లో ముగిసింది. సింగిల్స్ సెమీస్ మ్యాచ్లో నాలుగో సీడ్ శివాని 5–7, 0–6తో టాప్ సీడ్ ఆకాంక్ష చేతిలో పరాజయం పాలైంది. -
సెమీస్లో శివాని
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ జూనియర్స్ టోర్నీలో తెలంగాణ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. బాలికల విభాగంలో అమినేని శివాని సింగిల్స్ విభాగంలో సెమీస్కు, డబుల్స్ విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లింది. బాలుర విభాగంలో తీర్థ శశాంక్ పోరాటం క్వార్టర్స్లో ముగిసింది. గురువారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్స్లో శివాని (భారత్) 6–3, 6–3తో షియోరి ఇటో (జపాన్)పై గెలుపొందింది. మరోవైపు బాలికల డబుల్స్ సెమీస్లో టాప్ సీడ్ శివాని– ఆకాంక్ష (భారత్) ద్వయం 4–6, 6–3, 10–8తో చే హ్యూన్ (కొరియా)– డోగా (టర్కీ) జోడీపై గెలుపొందింది. బాలుర సింగిల్స్ క్వార్టర్స్లో తీర్థ శశాంక్ (భారత్) 5–7, 4–6తో సచిత్ శర్మ చేతిలో పరాజయం పాలయ్యాడు. -
రాజశేఖర్ కుమార్తెపై కేసు నమోదు
సాక్షి, బంజారాహిల్స్: సినీనటుడు రాజశేఖర్ కుమార్తె శివానిపై హైదరాబాదు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిలిపి ఉన్న కారును జీవితా రాజశేఖర్ కారు ఢీకొట్టిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నం.73లో జీవితా రాజశేఖర్ కుమార్తె లాండ్ క్రూయిజర్ ఏపీ 13ఈ 1234 కారు నడుపుతూ వస్తూ అదే రోడ్డులో ఓ ఇంటి ముందు నిలిపిన కొత్త జీప్ కారును బలంగా ఢీకొట్టింది. దీంతో జీప్ కారు పక్కనే ఉన్న గోడను బలంగా తాకి స్తంభానికి ఢీకొని నిలిచిపోయింది. ఈ ఘటనలో జీప్ ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న జీవిత అక్కడికి చేరుకొని దెబ్బతిన్న కారు యజమానితో మాట్లాడారు. ఈ ఘటనపై ఎస్పీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ ఆపరేషనల్ మేనేజర్ అశోక్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. శివాని యాక్సిడెంట్ గురించి శనివారం రాత్రే వార్తలు వచ్చినా కేసు నమోదు కాకపోవడంతో అధికారికంగా వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం రాజశేఖర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా 'పిఎస్వి గురుడవేగ' మూవీ విజయోత్సవ సంబరాల్లో ఉన్నారు. 'పిఎస్వి గరుడవేగ' సినిమా విడుదల ముందు రాజశేఖర్ కూడా పీవి ఎక్స్ప్రెస్ వే మీద మరో కారును ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. -
ఫైనల్లో అమినేని శివాని
ఐటీఎఫ్ జూనియర్స్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి శివాని అమినేని టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఎల్బీ స్టేడియం ‘శాట్స్’ కాంప్లెక్స్లో శుక్రవారం జరిగిన బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ శివాని 4–6, 7–5, 6–4తో నాలుగో సీడ్ తనీష కశ్యప్పై విజయం సాధించింది. మరో సెమీస్లో ఆకాంక్ష భాన్ 6–2, 6–1తో శివాని స్వరూప్ ఇంగ్లేపై నెగ్గింది. శనివారం శివాని, ఆకాంక్షల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. బాలుర సింగిల్స్ సెమీఫైనల్లో అభిమన్యు వన్నెం రెడ్డి 6–1, 5–7, 6–1తో భార్గవ్ పటేల్పై, సచిత్ శర్మ 6–3, 6–3తో కరణ్ శ్రీవాస్తవపై గెలిచారు. బాలికల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రావ్య శివాని–తనీష కశ్యప్ జంట 6–4, 6–1తో సోనాషి భట్నాగర్–జాన్వీ పటేల్ జోడీపై, ఆలియా–శివాని స్వరూప్ ద్వయం 6–2, 6–0తో సిమెలి–చంద్రిక జోషి జంటపై, సాయి దేదీప్య–భక్తి పార్వణి జోడీ 7–5, 6–1తో దివ్య వాణి–శ్రేయ ద్వయంపై, శ్రీవల్లి రష్మిక–హుమేరా బేగం జంట 6–2, 6–2తో శివాని అమినేని–సల్సా అహెర్ జోడీపై గెలుపొందాయి. -
సెమీస్లో శివాని
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి శివాని అమినేని సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఎల్బీ స్టేడియంలోని ‘శాట్స్’ కాంప్లెక్స్లో గురువారం జరిగిన అండర్–18 బాలికల సింగిల్స్లో శివాని అమినేని 6–4, 6–1తో శ్రీవల్లి రష్మికపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో శివాని 3–6, 7–5, 6–1తో షేక్ హుమేరాను ఓడించింది. ఇతర క్వార్టర్స్ మ్యాచ్ల్లో తనీషా కశ్యప్ 6–2, 6–2తో శివాని మంజనపై, ఆకాంక్ష 7–5, 6–4తో ప్రింకెల్ సింగ్పై, శివాని స్వరూప్ 6–4, 6–3తో సల్సా అహర్పై గెలుపొందారు. బాలుర క్వార్టర్స్ ఫలితాలు అభిమన్యు 6–0, 3–6, 6–3తో కార్తీక్రెడ్డి గంటాపై, సచిత్ శర్మ 6–1, 6–4తో ఫ్రాన్సెస్కో బొనాసియా (ఇటలీ)పై, మేఘ్ భార్గవ్ పటేల్ 6–2, 6–1తో నిఖిత్ రెడ్డిపై, కరణ్ శ్రీవాస్తవ 6–7 (2), 6–4, 6–2తో దేవ్ జావియాపై నెగ్గారు. -
క్వార్టర్స్లో శివాని
హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి అమినేని శివాని రాణిస్తోంది. ఉజ్బెకిస్తాన్లోని ఫెరంగాలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె క్వార్టర్ఫైనల్కు చేరింది. బుధవారం జరిగిన మ్యాచ్లో శివాని 6–4, 6–4తో దరియా దెట్కోవ్స్కయా (కజకిస్తాన్)పై విజయం సాధించింది. -
ఒకే సినిమాతో స్టార్ వారసుల ఎంట్రీ..?
ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన సీనియర్ నటుడు రాజశేఖర్. ఇటీవల సక్సెస్ లేక కష్టాల్లో పడ్డ ఈ యాంగ్రీ హీరో తన వారసురాలిగా కూతురు శివానీని ఇండస్ట్రీకి పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే ఫోటో షూట్ లతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివాని, సరైన లాంచింగ్ కోసం ఎదురుచూస్తుంది. తెలుగు, తమిళ భాషల దర్శక నిర్మాతలతో చర్చలు జరుపుతోంది. తాజాగా శివాని తొలి చిత్ర హీరోకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. పెళ్లి చూపులు సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించటంతో పాటు జాతీయ అవార్డును సైతం అందుకున్న నిర్మాత రాజ్ కందుకూరి తన తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ సినిమాలో శివానీ రాజశేఖర్ ను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. -
ముందు కోలీవుడ్కే వస్తా!
ముందుగా కోలీవుడ్కే వస్తానంటోంది నట దంపతులు రాజశేఖర్, జీవితల వారసురాలు శివాని. ఈ అమ్మడు తల్లిదండ్రుల బాటలోనే నడవడానికి సిద్ధం అయ్యిందట. రాజశేఖర్, జీవిత తమ సినీ జీవితాన్ని కోలీవుడ్లో ప్రారంభించి ఆ తరువాత టాలీవుడ్లో రాణించారన్నది తెలిసిందే. వారి వారసురాలు శివానీ కూడా తన సినీ జీవితాన్ని కోలీవుడ్ నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించింది. రాజశేఖర్, జీవితలకు శివాని, శివాద్మి కూతుళ్లు. వారిలో పెద్ద కూతురు శివాని. తల్లి జీవిత పోలికలను పుణికిపుచ్చుకున్న ఈ బ్యూటీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో.. అమ్మ, నాన్న సినిమాకు చెందిన వారు కావడంతో నాకూ సినిమా, నటన చిన్నతనం నుంచి పరిచయమే. భరతనాట్యం, కూచిపూడి లో శిక్షణ పొందాను. సంగీతం అంటే చాలా ఆసక్తి. కీబోర్డ్, గిటార్, వీణ వాయిద్యాల్లో పరిచయం ఉంది. చెల్లెలు శివాద్మితో కలిసి యూట్యూబ్లో పాడుకుంటుండడమే మాకు కాలక్షేపం. కిక్బాక్సింగ్ నేర్చుకుంటున్నాను. ఇక ఫిట్నెస్పై శ్రద్ధ ఎక్కువ. దానికి నేను అడిక్ట్ అనే చెప్పాలి. పుట్టింది తమిళనాడులో, పెరిగింది హైదరాబాద్లో. బంధువులందరూ చెన్నైలోనే ఉన్నారు. వారితో తమిళంలోనే మాట్లాడతాను. ఎక్కువగా తమిళ చిత్రాలు చూస్తుంటాను. నటుడు ధనుష్ అంటే ఎంతిష్టమో. ఆయన నటించిన 3 చిత్రం చూసి ఎమోషన్తో ఏడ్చేశాను. నటుడు విశాల్ అంటే చాలా ఇష్టం. ఇక విజయ్సేతుపతి భలే యాక్టర్. అయినా నాకెప్పటికీ నాన్నే హీరో. వైద్య విద్య మూడో సంవత్సం చదువుతున్నాను. డాక్టర్ అయిన తరువాతే యాక్టర్ అవ్వమని అమ్మ, నాన్న అన్నారు అని శివాని చెప్పుకొచ్చింది. -
హీరోయిన్గా మరో వారసురాలు..
సినీరంగానికి మరో నట వారసురాలు సిద్ధం అవుతోంది. హీరో రాజశేఖర్, జీవిత దంపతుల వారసురాలు శివానిని నాయకిగా తెరంగేట్రం చేయించడానికి రంగం సిద్ధం అయ్యిందన్నది తాజా సమాచారం. రాజశేఖర్, జీవిత ఇద్దరు కూతుళ్లలో శివాని పెద్దది. ఈమె చదువుకుంటున్న సమయంలోనే సినీ కార్యక్రమాల్లో చూసిన దర్శక నిర్మాతలు చాలామంది హీరోయిన్గా చేయమని అడిగినా ఇప్పడే కాదు చదువు పూర్తి చేయాలంటూ వాయిదా వేస్తూ వచ్చారు ఆమె తల్లిదండ్రులు. తాజాగా రాజశేఖర్, జీవిత తమ వారసురాలిని రంగంలోకి దింపడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఇటీవల శివానిని వివిధ గెటప్లలో ఫొటో సెషన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు రాజశేఖరే స్వయంగా ఆమె కోసం కథలు వింటున్నారట. మొత్తం మీద శివాని సినీ తెరంగేట్రానికి రంగం సిద్ధం అవుతోందన్నమాట. అయితే ఈ అమ్మడు తొలి చిత్రం తెలుగు అవుతుందా? తమిళం అవుతుందా? అన్నది వేచి చూడాల్సిందే. అదే విధంగా నట వారసురాళ్లు తెరంగేట్రం సులభమే. ఆ తరువాత నిలదొక్కుకోవడం అన్నది వారి ప్రతిభ, అదృష్టం పైనే ఆధారపడి ఉంటుంది. మరి శివాని అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి. -
మరో సినీ వారసురాలు రెడీ!
చెన్నై: సినీ రంగానికి మరో నట వారసురాలు పరిచయం కానుంది. కోలీవుడ్లో నటుడిగా పరిచయం అయినా టాలీవుడ్లో రాణిస్తున్నారు సీనియర్ నటుడు రాజశేఖర్. నటి జీవిత, రాజశేఖర్ దంపతుల వారసురాలిగా శివానిని తెరంగేట్రం చేయించడానికి రంగం సిద్ధమైందన్నది తాజా సమాచారం. రాజశేఖర్, జీవిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు కాగా శివాని పెద్దమ్మాయి. ఈమె చదువుకుంటున్న సమయంలోనే సినీ కార్యక్రమాల్లో చూసిన దర్శక నిర్మాతలు చాలామంది హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చినా 'ఇప్పడే కాదు.. అమ్మాయి చదువు పూర్తి కానీయండి' అంటూ బదులిచ్చేవారు ఈ దంపతులు. అయితే తాజాగా రాజశేఖర్, జీవితలు తమ వారసురాలిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల శివానితో ఫొటో సెషన్ చేపించారని.. అంతేకాదు ఆమె తండ్రి, సీనియర్ హీరో రాజశేఖర్ స్వయంగా కథలు వింటున్నారట. అంతా కుదిరితే త్వరలోనే మరో సినీ వారసురాలిని తెరపై చూడవచ్చనని అభిమానులు ఉత్సహంగా ఉన్నారు. కాగా, శివాని ఫస్ట్ మూవీ తెలుగులోనా? లేక తమిళంలోనా? అన్న దానిపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతుంది. తల్లిదండ్రుల నట వారసత్వాన్ని శివాని మరో మెట్టు ఎక్కిస్తుందా.. లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
తెరంగేట్రానికి సిద్ధం..!
ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన యాంగ్రీ హీరో రాజశేఖర్, ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నా.. సక్సెస్ మాత్రం దక్కటం లేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకొని.. త్వరలో గరడువేగ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అదే సమయంలో తాను హీరోగా ఉండగానే తన వారసురాలిగా కూతుర్ని ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్లాన్లో ఉన్నాడు రాజశేఖర్. ఇప్పటికే పలువురు టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు శివానిని ఇంట్రడ్య్సూ చేసేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. చాలా కాలంగా రాజశేఖర్ కూతురు శివాని తెరంగేట్రంపై వార్తలు వినిపిస్తున్నాయి. జీవితా రాజశేఖర్లు కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తామని కన్ఫామ్ చేసినా.. అది ఎప్పుడన్నది చెప్పలేదు. అయితే ఇటీవల శివానితో చేయించిన ఓ ఫోటో షూట్ ఆమె మూవీ ఎంట్రీపై చర్చకు కారణమైంది. గ్లామరస్ లుక్లో హీరోయిన్కు కావాల్సిన అన్ని ఫిచర్స్తో అదరగొడుతుంది శివాని. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటోలను చూసి టాలీవుడ్ ప్రియాంక చోప్రా అంటున్నారు సినీ జనాలు. లుక్స్ పరంగా సూపర్బ్ అనిపించుకున్న శివానీ నటిగానూ ఆకట్టుకుంటే స్టార్ స్టేటస్ అందుకోవటం పెద్ద కష్టమేమీకాదు. -
శివానికి నిరాశ
చండీగఢ్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్ సర్క్యూట్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి అమినేని శివాని పోరాటం ముగిసింది. గురువారం జరిగిన సింగిల్స్, డబుల్స్ మ్యాచ్ల్లో శివాని పరాజయం పాలైంది. స్థానిక సీఎల్టీఏ టెన్నిస్ స్టేడియంలో గురువారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్లో రియా వర్మ (భారత్) 6-3, 7-6 (5)తో శివానిపై గెలుపొందింది. డబుల్స్ సెమీస్ మ్యాచ్లో శివాని- వైదేహి చౌదరీ (భారత్) జంట 3-6, 3-6తో కున్ రుు లీ- మనంచయ సావంగ్ జోడీ చేతిలో ఓడిపోరుుంది. ఇతర బాలికల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్ల్లో మెహక్ జైన్ (భారత్) 6-0, 6-0తో వైదేహి చౌదరీపై, అక్సానా మరీన్ (బెల్జియం) 6-3, 6-1తో ఆకాంక్ష భాను (భారత్)పై, థసపోర్న్ (థారుులాండ్) 6-1, 6-1తో తనీషా కశ్యప్ (భారత్)పై విజయం సాధించారు. ఇతర మ్యాచ్ల ఫలితాలు బాలుర సింగిల్స్ క్వార్టర్స్: సిద్ధాంత్ బాంటియా (భారత్) 6-2, 7-5తో టోంక్లా ములదా (థారుులాండ్)పై, ధ్రువ్ సునీశ్ (భారత్) 6-2, 6-2తో దోస్టాన్బెక్ తశ్బులటోవ్ (కజకిస్థాన్)పై గెలుపొందారు. బాలుర డబుల్స్ సెమీస్: వశిష్ట్ చెరకు- జాక్ జోడీ 6-2, 6-4తో సిద్ధాంత్ బాంటియా- పరీక్షిత్ సోమని జంటపై నెగ్గింది. -
శివాని శుభారంభం
చండీగఢ్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్ సర్క్యూట్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి అమినేని శివాని శుభారంభం చేసింది. బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో రెండో రౌండ్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన బాలికల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్లో శివాని 6-1, 6-4తో ప్రిన్సి పాంచల్పై విజయం సాధించింది. డబుల్స్ విభాగంలో శివాని-వైదేహి చౌదరీ జోడీ 6-0, 6-2తో దాదాసాహెబ్ చౌగులే-సృష్టి ధీర్ జంటపై గెలుపొందింది. మరో మ్యాచ్లో హైదరాబాద్కే చెందిన షేక్ హుమేరా జోడీకి తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. హుమేరా-ప్రింకిల్ సింగ్ జోడీ 4-6, 6-4, 9-11తో ఎస్తర్-హేత్ గమ్మ జంట చేతిలో పరాజయం పాలైంది. బాలుర సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్ల్లో పరీక్షిత్ 6-3, 6-3తో శ్రీవత్స రాచకొండపై గెలుపొందగా... తీర్థ శశాంక్ 2-6, 2-6తో దోస్టాన్బెక్ చేతిలో ఓడిపోయాడు. డబుల్స్ విభాగంలో వశిష్ట్- జాక్ డ్రాపర్ జోడీ 6-2, 6-1తో శ్రీవత్స రాచకొండ-అథర్వ శర్మ జంటపై, బొల్లిపల్లి రిత్విక్-మాచెర జోడీ 6-3, 6-2తో నబీవ్ ఓలిజన్-సచిత్ శర్మ జంటపై గెలుపొందాయి. -
రెండోరౌండ్లో శివాని, రిషిక
సాక్షి, హైదరాబాద్: ఆసియా టెన్నిస్ టూర్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో అమినేని శివాని, సుంకర రిషిక శుభారంభం చేశారు. తెలంగాణ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో శాట్స్ టెన్నిస్ కాంప్లెక్స్లో సోమవారం జరిగిన మహిళల తొలిరౌండ్లో శివాని 6-3, 6-2తో మౌళిక రామ్పై గెలుపొందగా... సుంకర రిషిక 6-1, 6-1తో శ్వేతను ఓడించి రెండోరౌండ్లోకి ప్రవేశించారు. ఇతర మ్యాచ్ల్లో సౌజన్య భవిశెట్టి 6-0, 6-0తో అమ్రిత ముఖర్జీపై, సింధు జనగాం 6-0, 6-0తో గుల్స్ ్రబేగంపై, సంహిత 6-2, 6-3తో శ్రీయపై, భువన 6-2, 6-1తో హర్షితపై, లలిత 6-3, 6-3తో శ్రీ సాయి శివానిపై, నిధి 6-4, 6-4 తీర్థపై విజయం సాధించారు. -
పోరాడి ఓడిన శివాని
సాక్షి, హైదరాబాద్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఫ్యూచర్స్టార్స్ ఫైనల్స్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మారుు అమినేని శివాని రన్నరప్గా నిలిచింది. సింగపూర్లో ఆదివారం జరిగిన అండర్-16 బాలికల సింగిల్స్ ఫైనల్లో శివాని పోరాడి ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఆస్ట్రే లియా అమ్మాయి వయోలెట్ అపిసా 7-5, 6-4తో శివానిపై విజయం సాధించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ ఫిత్రియాని సబటిని (ఇండోనేసియా)పై 6-2, 6-1తో సంచలన విజయం సాధించిన శివాని ఫైనల్లో విజయం కోసం తీవ్రంగా పోరాడినా చివరకు రన్నరప్గా నిలిచింది. అండర్-14 బాలికల విభాగంలో భారత్కే చెందిన తనిషా కశ్యప్ సెమీఫైనల్లో ఓడిపోయింది. గత ఏడాది ఇదే టోర్నీలో అండర్-16 సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల విజేతగా నిలిచింది. -
తుదిపోరుకు శివాని
సాక్షి, హైదరాబాద్: డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి శివాని అమినేని టైటిల్కు మరో అడుగు దూరంలో నిలిచింది. సింగపూర్లో జరుగుతోన్న ఈ టోర్నీలో శివాని ఫైనల్కు చేరుకుంది. సెమీఫైనల్లో శివాని 6-1, 6-2తో ఫిత్రినా సబటిని (ఇండోనేసియా)పై గెలుపొంది తుదిపోరుకు అర్హత సాధించింది. -
తుదిపోరుకు శివాని
టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్-4 టెన్నిస్ టోర్నమెంట్లో అమినేని శివాని ఫైనల్లోకి ప్రవేశించింది. ఎల్బీ స్టేడియంలోని శాట్స్ టెన్నిస్ కాంప్లెక్స్లో శుక్రవారం జరిగిన సెమీస్లో అమినేని శివాని 6-3, 1-6, 6-0తో సామ సాత్వికపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్ల్లో శివాని 6-1, 4-6, 6-3తో హెచ్. షేక్పై, సామ సాత్విక 6-4, 6-1తో వి.చౌదరీపై, భాను 6-3, 6-2తో ఏ. చక్రవర్తిపై గెలుపొందారు. బాలుర క్వార్టర్స్ మ్యాచ్ల్లో ఎన్. సిన్హా 6-2, 6-3తో సోలెంకి అలెక్స్పై, ఉనిష్ 6-4, 7-4 (4)తో వశిష్ట్పై, ఎస్. బాంతియా 6-2, 6-1తో వన్నెం రెడ్డిపై, పి. సోమని 6-3, 6-3తో ఎస్. జగ్త్యానిపై నెగ్గారు. -
కారు-లారీ ఢీ: ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
చేవెళ్ల రూరల్(రంగారెడ్డి జిల్లా): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రూరల్ మండలం దామరగిద్ద గ్రామ శివారులో ఆదివారం ఉదయం కారు-లారీ ఢీకొన్న సంఘటనలో శివాని(25) అనే యువతి మృతిచెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్కు చెందిన నలుగురు బీటెక్ విద్యార్థులు వికారాబాద్ నుంచి కారులో హైదరాబాద్ వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. కారు అతివేగంగా వస్తూ అదుపు తప్పి లారీని ఢీకొందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. క్షతగాత్రులు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శివానికి సింగిల్స్ టైటిల్
జాతీయ సిరీస్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: తెలుగమ్మాయి శివాని అమినేని జాతీయ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో సింగిల్స్ టైటిల్ సాధించింది. చెన్నైలో జరిగిన ఈ టోర్నీలో ఆమె బాలికల సింగిల్స్ ఫైనల్లో 6-3, 4-6, 6-3తో శివాని ఇంగ్లే (మహారాష్ట్ర)పై చెమటోడ్చి నెగ్గింది. వారం రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన శ్రావ్య శివాని, సాయి దేదీప్య, షేక్ హుమేరా, సైదా షాజిహా బేగం పాల్గొన్నారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన శ్రీమాన్(21), శివాణి (20) ఆదివారం ఉదయం 11గంటలకు గుట్ట పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో బస చేశారు. సాయంత్రం యాదాద్రి కొండపైకి వెళ్లి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వారు ఉన్న గదిలో రాత్రి నిద్ర చేశారు. సోమవారం తెల్లవారుజామున ఆ ప్రేమికులు ఫినాయిల్ను తాగి అపస్మారకస్థితిలో పడి ఉన్నారు. గమనించిన లాడ్జి నిర్వహకులు పోలీసులకు, 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే శ్రీమాన్, శివాణిలను చికిత్స నిమిత్తం తొలుత భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నట్టు తెలిసింది. ఈ విషయమై ఇరు కుటుంబాల సభ్యులకు చెప్పి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్రెడ్డి తెలిపారు. -
అగ్నిప్రమాదంలో చిన్నారి సజీవదహనం
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని హరిజన పేటలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా జరిగిన అగ్నిప్రమాదంలో నాలుగు నెలల చిన్నారి సజీవ దహనం అయింది. వివరాలు శుక్రవారం తెల్లవారుజామున విద్యుద్ఘాతంతో మంటలు చెలరేగి రెండు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగిన సమయంలో ఇంట్లో ఉన్నవారంతా బయటకు పరుగు తీసినా దురదృష్టవశాత్తూ నాలుగు నెలల శివానీ అనే పసిపాపను మాత్రం బయటకు తీసుకురాలేక పోయారు. దట్టంగా మంటలు విస్తరించడంతో కాసేపటికే చిన్నారి సజీవ దహనమైంది. పసిపాప మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. -
కూతురికి విలన్గా రాజశేఖర్
-
బాలిక కళ్లలోంచి కట్టెపుల్లలు!
-
కూతురికి విలన్గా మారుతున్న హీరో రాజశేఖర్
హీరోగా సూపర్ సక్సెస్ సాధించి విలన్గా మారుతున్నవాళ్ల లిస్ట్లో మరో హీరో చేరిపోయాడు. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంగ్రీ హీరో రాజశేఖర్, ఇటీవల ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఎవడైతే నాకేంటి సినిమా తరువాత ఒక్క హిట్ కూడా సాధించలేకపోయిన రాజశేఖర్.. ఇప్పుడు జగపతిబాబు బాటలోనే విలన్గా టర్స్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. రాజశేఖర్ కూతురు శివాని 'వందకు వంద' పేరుతో తెరకెక్కుతున్న సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ సినిమాతోనే తను కూడా విలన్గా మారాలని ప్లాన్ చేసుకుంటున్నాడు రాజశేఖర్. ఇటీవల రవితేజ హీరోగా తెరకెక్కుతున్న 'ఎవడో ఒకడు' సినిమాలో నెగెటివ్ పాత్ర చేయాలంటూ దిల్ రాజు అడిగినా, కాదన్న రాజశేఖర్.. తన కూతురి సినిమాతో విలన్గా ఎంట్రీ ఇస్తే ఇద్దరికీ ప్లస్ అవుతుందని భావిస్తున్నాడట. మరి రాజశేఖర్ కూడా జగపతిబాబు తరహాలో ప్రతినాయక పాత్రలో కూడా సక్సెస్ అవుతాడేమో చూడాలి. -
బాలిక కళ్లలోంచి కట్టెపుల్లలు!
తిమ్మాపూర్: పదమూడేళ్ల బాలిక కళ్లల్లో నుంచి చిన్న, చిన్న కట్టెపుల్లలు రోజంతా వస్తూనే ఉన్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మం డలం రామకృష్ణకాలనీకి చెందిన దుర్శేటి రవి-లత కూతురు శివాని స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. గత మంగళవారం రాత్రి శివాని ఒక్కసారిగా తనకు కళ్లు నొప్పి పెడుతున్నాయని ఏడ్చింది. కంట్లో నుంచి చిన్నచిన్న కట్టెపుల్లలు బయటకు వచ్చాయి. కాసేపటికి ఆగి పోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. తిరిగి ఆదివారం రాత్రి 10 గంటలకు రెండు కళ్లు మళ్లీ నొప్పి పెడుతున్నాయని శివాని విలపించింది. కాసేపటికే రెండు కళ్ల నుంచి కట్టెపుల్లలు బయటకు వచ్చాయి. ఇలా రాత్రి నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు 32 పుల్లలు బయటకు వచ్చాయి. ఎడమ కన్ను నుంచి ఎక్కువగా వచ్చాయి. గ్రామస్తులు, మీడియా ప్రతినిధు ల సమక్షంలో సైతం బాలిక కళ్లలోంచి పుల్లలు బయటకు వచ్చాయి. కుటుంబసభ్యులు ఆం దోళనతో శివానిని సోమవారం సాయంత్రం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ కంటి ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుడు శ్రీధర్ పరీక్షించారు. కళ్ల నుం చి రాళ్లు రావడం సహజమేనని, కానీ, పుల్లలు రావడం అరుదైన సంఘటన అని చెప్పారు. -
ఆర్టీడబ్ల్యూ కోసం శివాని, హుమేర
సాక్షి, హైదరాబాద్: ఇంగ్లండ్లో జరిగే ‘రోడ్ టు వింబుల్డన్’ (ఆర్టీడబ్ల్యూ) జాతీయ టోర్నీ కోసం భారత్లో నిర్వహించే క్వాలిఫయింగ్ టోర్నీలో తెలంగాణ, ఏపీలకు చెందిన 12 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఇందులో హైదరాబాద్ అమ్మాయిలు శివాని అమినేని, షేక్ హుమేరా బేగం చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు బాలికల జట్టులో సాయి దేదీప్య, ధరణ ఆనంద్, శ్రీవల్లి రష్మిక, రచనా రెడ్డి ఉన్నారు. బాలుర జట్టులో రిత్విక్ చౌదరి, తీర్థ శశాంక్, మెంగా రోహిత్, ఆశిష్ నంద్, ఆకాశ్ రెడ్డి, శ్రీహర్షిత్ ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన బాలబాలికల జట్లు అలిండియా టెన్నిస్ సంఘం (ఐటా) నిర్వహించే క్వాలిఫయింగ్ ఈవెంట్లలో పోటీపడతాయి. మొత్తం నాలుగు నగరాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఈనెల 12న కోల్కతాలో, 19న చండీగఢ్లో, ఫిబ్రవరి 2న ఢిల్లీలో, 9న ముంబైలో ఈ పోటీలు జరుగుతాయి. అనంతరం ఢిల్లీలో ఏప్రిల్ 6న జరిగే ఫైనల్ ఈవెంట్లో గెలుపొందిన విజేతలను రోడ్ టు వింబుల్డన్ జాతీయ మాస్టర్స్ టోర్నీకి ఎంపిక చేస్తారు. ఈ ఈవెంట్ ఇంగ్లండ్లో ఆగస్టులో జరగనుంది. -
తనయ కష్టం చూడలేక తండ్రి ఆత్మహత్య
అతనికి కూతురంటే ప్రాణం. భారీగా కట్నకానుకలు ఇచ్చి ఆమెకు పెళ్లి చేశాడు. పెళ్లరుున ఏడాదిన్నరకే ఆమెను అల్లుడు వేధిస్తుండడాన్ని తట్టుకోలేకపోయూడు. భర్త దగ్గర ఉండలేకపోతున్నానంటూ పుట్టింటికొచ్చి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కూతురిని చూసి ఆ తండ్రి గుండె చెరువైంది. ఆమె ఏదైనా అఘారుుత్యం చేసుకుంటుందేమోనని అతడు నిత్యం భయపడుతుండేవాడు. తీవ్రంగా మదనపడుతుండేవాడు. ఎంతో ప్రేమగా పెంచుకున్న తన చిట్టి తల్లికి వచ్చిన కష్టాన్ని చూసి తట్టుకోలేక, ఆమె కన్నీళ్లను తుడవలేక తనువు చాలించాడు. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వందనం (ఖమ్మం అర్బన్): తన కూతురిని అల్లుడు వేధిస్తుండడాన్ని తట్టుకోలేని ఓ వ్యక్తి పురుగు మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబీకులు తెలిపిన ప్రకారం...వందనం గ్రామస్తుడు పున్నం నరసింహా రావు(43) తన చిన్న కూతురు శివాణిని, గోపాలపురం గ్రామానికి చెందిన దొండపాటి సురేష్కు ఇచ్చి 18 నెలల క్రితం వివాహం చేశాడు. హైదరాబాదులోగల ప్రైవేటుబ్యాంక్లో ఉద్యో గం చేస్తున్న సురేష్కు వివాహ సమయంలో నాలుగు ఎకరాల భూమి, కొంత బంగారం, సుమారు 60లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చాడు. శివాణి-సురేష్ దాంపత్యం జీవితం కొన్నాళ్లపాటు బాగానే సాగింది. వారు హైదరాబాద్లో కాపురం పెట్టారు. అప్పటికే సురేష్కు తన సహోద్యోగితో వివాహేతర సంబంధం ఉంది. శివాణిని వదిలించుకోవాలని నిర్ణరుుంచుకున్న సురేష్.. ఆమెను రకారకాలుగా హింసించసాగాడు. ఈ విషయం తన తల్లిదండ్రులకు చెబితే తట్టుకోలేరనే భయంతో ఆమె కొంతకాలం ఈ హింసను భరించించింది. చివరికి ఆమె రెండు నెలల కిందట పుట్టింటికి వచ్చి తన తల్లిదండ్రులకు మొత్తం విషయం చెప్పి విలపించింది. ఆమె ఇక్కడకు వచ్చిన తరువాత కూడా సురేష్ వేధించడం మానలేదు. ఆమెను బెదిరిస్తూ సెల్ఫోన్కు మెసేజ్లు పంపించసాగాడు. తన కూతురు ఏదైనా అఘా యత్యం చేసుకుంటుందేమోనని నరసింహారావు నిత్యం భయపడుతుండేవాడు. ఈ వేదనతోనే అతడు గత మంగళవారం తన ఇంటి వద్ద పురుగు మందు తాగాడు. అప్పటి నుంచి హైదరాబాదులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు గురువారం రాత్రి మృతిచెందాడు. కూతురు శివాణిని అల్లుడు సురేష్తోపా టు అతని తమ్ముడు, తండ్రి వేధిస్తుండడాన్ని తట్టుకోలేకనే నరసింహారావు ఆత్మహత్య చేసుకున్నట్టుగా అతని కుటుంబీకులు చింతకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతదేహంతో రాస్తారోకో నరసింహారావు మృతదేహాన్ని అతని కుటుంబీ కులు, బంధువులు శుక్రవారం గోపాలపురం తీసుకొచ్చారు. సురేష్ ఇంటి ఎదుట ఖమ్మం- వైరా ప్రధాన రహదారిపై మృతదేహాన్ని ఉంచి రెండు గంటలపాటు ఆందోళనకు దిగారు. రెండు వైపులా ట్రాఫిక్ నిలిచిపోవడంతో అర్బన్ సీఐ శ్రీధర్ వెళ్లి, డీఎస్పీతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని ఆందోళనకారులకు నచ్చచెప్పి శాంతింపచేశారు. అదే సమయంలో అటువైపు వచ్చిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆగారు. శివాణితో మాట్లాడారు. మృతుని కుటుంబానికి తగిన న్యాయం చేయాలని సీఐని కోరారు. -
వెండితెర పైకి రాజశేఖర్ కూతురు
ఇన్నాళ్లూ సినిమా హీరోల కొడుకులు మాత్రమే వెండితెర మీదకు వస్తుండేవారు. ఇప్పుడు సీజన్ మారింది. శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి, కమల్ కూతురు శ్రుతి హాసన్ లాంటి వాళ్లు బాగా క్లిక్ కావడంతో ఇప్పుడు మరో హీరో రాజశేఖర్ కూడా తన కూతురు శివానిని హీరోయిన్గా తీసుకొస్తున్నారు. 'వందకి వంద' అనే సినిమాలో ఆమె హీరోయిన్గా చేయబోతోంది. తన కూతురికి ఇంతకంటే మంచి మొదటిసినిమా ఏమీ ఇవ్వలేనని రాజశేఖర్ అంటున్నారు. శివానికి లాంచ్ చేసేందుకు మంచి ప్రాజెక్టు కోసం చాలా రోజులుగా వేచి చూస్తున్నామని, ఇన్నాళ్లకు మంచి ప్రాజెక్టు వచ్చిందని జీవిత, రాజశేఖర్ అన్నారు. 'వందకి వంద' సినిమాలో ఆమెది చాలా ముఖ్యమైన పాత్ర అని, తన 'గడ్డం గ్యాంగ్' సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టు ప్రారంభం అవుతుందని రాజశేఖర్ అన్నారు. ఈ సినిమాలో ఆయన కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. -
అండర్-14 విజేత శివాని
ఏఐటీఏ సూపర్ సిరీస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) టాలెంట్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ అండర్-14 విభాగంలో అమినేని శివాని విజేతగా నిలిచింది. మొయినాబాద్లోని సానియామీర్జా టెన్నిస్ అకాడమీలో శుక్రవారం ముగిసిన ఈ టోర్నీ బాలికల ఫైనల్లో శివాని 6-2, 6-1 స్కోరుతో ధారణ ముదలియార్పై విజయం సాధించింది. బాలుర విభాగంలో టాప్ సీడ్ శ్రీవత్స రాతకొండ టైటిల్ నెగ్గాడు. ఫైనల్లో అతను 7-5, 7-6 తేడాతో మూడో సీడ్ యెడ్ల కుశాల్పై నెగ్గాడు. అండర్-12 విభాగంలో రిచా చౌగ్లే, మహేశ్ మహాపాత్ర విజేతలుగా నిలిచారు. ఫైనల్లో రిచా 6-4, 6-0తో రేష్మ మరూరిపై, మహేశ్ 7-5, 2-6, 6-2తో వి. దేవ్పై గెలుపొందారు. డబుల్స్ ఫైనల్లో శివాని-సాయిదేదీప్య జోడి 6-2, 4-6, 10-8తో శ్రీవల్లి రష్మిక-ఈశ్వరి మాత్రేపై గెలిచి టైటిల్ను చేజిక్కించుకున్నారు. బాలుర డబుల్స్ ఫైనల్లో రిత్విక్ చౌదరి-ప్రలోక్ ఈకూర్తి ద్వయం 6-1, 7-6(3)తో యెడ్ల కుశాల్-నేమ హేమంత్ జంటపై నెగ్గింది. -
తుది పోరుకు సాత్విక, శివాని
జింఖానా, న్యూస్లైన్: న్యూట్రిలైట్ ఆసియా అండర్-14 జూనియర్ టెన్నిస్ చాంపియన్షిప్లో బాలికల సింగిల్స్లో టాప్ సీడ్ సామ సాత్విక ఫైనల్లోకి దూసుకె ళ్లింది. ఎల్బీ స్టేడియంలోని శాప్ టెన్నిస్ కాంప్లెక్స్లో గురువారం జరిగిన సెమీఫైనల్లో సాత్విక 3-6, 6-0, 6-1తో ఎనిమిదో సీడ్ ప్రింకిల్ సింగ్పై విజయం సాధించింది. తనతో పాటు రెండో సీడ్ శివాని 7-5, 6-1తో ఏడో సీడ్ శివానుజపై నెగ్గి ఫైనల్స్కు అర్హత సాధించింది. బాలుర సింగిల్స్లో ఆదిల్ కళ్యాణ్పూర్, శ్రీవత్స రాతకొండ ఫైనల్స్లోకి ప్రవేశించారు. సెమీస్లో ఆదిల్ 6-3, 6-1తో ప్రాకృత్ కార్తీక్ పటేల్పై, శ్రీవత్స 6-2, 6-4తో రెండో సీడ్ యావిన్ సాల్మన్పై గెలుపొందారు. మిగిలిన ఫలితాలు బాలుర డబుల్స్ క్వార్టర్ఫైనల్స్: ఆదిల్-కార్తీక్ జోడి 6-0, 6-0తో రిషిల్ గుప్తా-యశోధన్ జోడిపై, ప్రలోక్ ఇక్కుర్తి-గౌరవ్ కుర్వ జోడి 6-2, 6-1తో అరవింద్ కళ్యాణ్-తుషార్ శర్మ జోడిపై, నీల్ గరుడ్-ఆతిఫ్ షేక్ 4-6, 7-5, 10-5తో దేవ్-రోనిత్ రాణా జోడిపై, ఆయనంపూడి-గౌరవ్ జోడి 6-2, 6-1తో సుందర్-కేల్ జోడిపై, బొల్లిపల్లి-సాయి కార్తీక్ రెడ్డి 6-0, 6-3తో ఆశిష్ ఆనంద్- సాయి ప్రతీక్ జోడిపై, రాతకొండ-సాకినేని జోడి 6-0, 6-1తో తరుణ్-తేజస్వి జోడిపై, నితిన్-అమన్ జోడి 6-4, 6-4తో రుచిత్ గౌడ్-ప్రీతమ్ జోడిపై, ఆదిత్య-యావిన్ సాల్మన్ జోడి 6-4, 6-4తో ఆదిత్య కల్లేపల్లి-టి.మాచెర్ల జోడిపై గెలిచారు. బాలికల డబుల్స్ క్వార్టర్ఫైనల్స్: జువేరా ఫాతిమా-సాన్యా సిన్హా జోడి 6-2, 6-1తో షాలిక-నిఖిత జోడిపై, ప్రత్యూష-శివాని జోడి 6-3, 6-2తో అన న్య-రైనా జాఫీ జోడిపై, శివాని-సాత్విక 6-2, 6-1తో భక్తి-మాన్య విశ్వనాథ్ జోడిపై, పాన్య- ఎస్.భమిడిపాటి జోడి 1-6, 6-4, 10-6తో అక్షయ-షాజిహా బేగం జోడిపై, ఎస్.చిలకలపూడి-శివానుజ జోడి 3-6, 7-5, 10-7తో ఎ.చక్రబొర్తి-హర్ష సాయి జోడిపై, భవ్య-భూమిక జోడి 6-2, 6-1తో బిపాషా-సాహితీ రెడ్డి జోడిపై, మెహక్ జైన్-షేక్ హుమేరా జోడి 6-3, 6-2 ధరణి-నేహ జోడిపై నెగ్గారు.