Solar Power Station
-
ఇవన్నీ ఉంటేనే ఇల్లు కొంటాం..
నివాస సముదాయాల్లో అన్ని వసతులు ఉండాల్సిందే.. ఆ విషయంలో మాత్రం అస్సలు తగ్గేదే లే అంటున్నారు కొనుగోలుదారులు.. గతంలో కమ్యూనిటీలలో జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి నాలుగైదు వసతులు ఉంటే సరిపోయేది. కానీ.. ప్రస్తుతం భవిష్యత్తు అవసరాలతో పాటు అభిరుచులకు తగ్గట్టుగా వసతులు ఉండాల్సిందే. ఇంటి నుంచి పని కోసం కో–వర్కింగ్ స్పేస్, ఆన్లైన్ క్లాస్ల కోసం డిజిటల్ క్లాస్ రూమ్ నుంచి మొదలుపెడితే.. టెర్రస్, క్లబ్హౌస్పై సౌర విద్యుత్ ఏర్పాట్లు, ఔట్డోర్ జిమ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, హోమ్ థియేటర్, ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు, పెట్పార్క్, గోల్ఫ్కోర్స్ వరకూ అన్ని ఆధునిక వసతులు కావాలని గృహ కొనుగోలుదారులు భావిస్తున్నారు. –సాక్షి, సిటీబ్యూరోపెట్ పార్క్, స్పా..జంతు ప్రేమికుల కోసం కూడా డెవలపర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నివాస సముదాయాల్లో వసతుల జాబితాలో పెట్ పార్కులు కూడా చేరిపోయాయి. గేటెడ్ కమ్యూనిటీలలో కొనుగోలుదారులు పెంచుకునే పెంపుడు జంతువుల కోసం పెట్పార్క్, క్లబ్హౌస్లో పెట్ స్పాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తులు, శిక్షకులు, వ్యాయామ ఉపకరణాలు వంటివి ఆయా ప్రాజెక్ట్లలో అందుబాటులో ఉంటాయి.సోలార్, హోమ్ గార్డెనింగ్ సొంతిల్లు కొనుగోలు చేసే క్రమంలో గేటెడ్ కమ్యూనిటీలో కామన్ ఏరియాలు ఎంత వరకు ఉన్నాయో అడిగి మరీ తెలుసుకుంటున్నారు. గతంలో కామన్ ఎలివేటర్, కామన్ కారిడార్, గ్యారేజ్, స్టేర్కేస్ ఉండేవి ఇప్పుడు వాటిని ప్రైవేట్ కావాలని అడుగుతున్నారు. ఇంట్లో సొంత అవసరాల కోసం కమ్యూనిటీ గార్డెన్ను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నపాటి స్థలంలో ఆకు కూరలు, కూరగాయలు పండించుకునేలా వర్టికల్ గార్డెనింగ్, బాల్కనీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారాంతాల్లో కమ్యూనిటీ వాసులతో ఆహ్లాదంగా గడిపేందుకు ఔట్డోర్ కిచెన్, డైనింగ్ ఏరియా ఏర్పాటు చేస్తున్నారు. టెర్రస్, క్లబ్హౌస్పై సౌర విద్యుత్ ఏర్పాటు చేస్తున్నారు. వీధి దీపాలు, ఇతరత్రా అవసరాల కోసం ఈ విద్యుత్నే వినియోగిస్తున్నారు. దీంతో నివాసిత సంఘానికి కరెంట్ బిల్లు భారం తగ్గుతుంది.ఈవీ చార్జింగ్ స్టేషన్లుపెట్రోల్, డీజిల్ వంటి వాహనాలతో పర్యావరణం కాలుష్యం అవుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వాహన కొనుగోళ్లపై రాయితీలు అందిస్తుండటంతో పాటు చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. డెవలపర్లు కూడా నివాస, వాణిజ్య సముదాయాల నిర్మాణంలో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. నగరానికి చెందిన మైహోమ్, రాజపుష్ప, ప్రణీత్ గ్రూప్, పౌలోమి ఎస్టేట్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వసతులను కల్పిస్తున్నారు.వసతులు ఇలా..నివాస సముదాయంలో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు, ప్రతి పార్కింగ్ ప్లేస్ వద్ద చార్జింగ్ పెట్టుకునేందుకు వీలుగా పాయింట్లను ఇస్తున్నారు. జంతు ప్రేమికుల కోసం నివాస సముదాయంలోనే పెట్పార్క్, క్లబ్హౌస్లో పెట్ స్పాలను ఏర్పాటు చేస్తున్నారు. పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తులు, శిక్షకులు, వ్యాయామ ఉపకరణాలు వంటివి ఆయా ప్రాజెక్ట్లలో అందుబాటులో ఉంటాయి.రిచ్మ్యాన్ గేమ్గా పిలిచే గోల్ఫ్ కూడా వసతుల జాబితాలో చేరిపోయింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో జిమ్ చేయాలని అందరూ భావిస్తున్నారు. దీంతో ఇండోర్ జిమ్లు కాస్త ఔట్డోర్లో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఓజోనైజ్డ్ మెడిటేషన్ హాల్, ఉష్ణోగ్రత నియంత్రణ స్విమ్మింగ్ పూల్స్ వచ్చేశాయి.వైద్య అవసరాల కోసం మినీ ఆస్పత్రి, మెడికల్ షాపు, అంబులెన్స్, పారా మెడికల్ సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.గతంలో మాదిరిగా సినిమాలకు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో నివాస సముదాయంలోనే మల్టీప్లెక్స్ అనుభూతి కలిగేలా స్క్రీన్లు, సౌండ్ సిస్టమ్స్ను డెవలపర్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ క్లాస్ రూమ్స్ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. -
Telangana: దావోస్లో కుదిరిన ఒప్పందం.. రూ. 45,500 కోట్ల పెట్టుబడి
సాక్షి, హైదరాబాద్: దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో తెలంగాణ రూ.45,500 కోట్ల భారీ పెట్టుబడిని సాధించింది. దేశంలో ఇంధన రంగంలో పేరొందిన సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో ఈ మేరకు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. బుధవారం సన్ పెట్రో ఎండీ దిలీప్ సాంఘ్వీతో సీఎం రేవంత్రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు చర్చల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ముఖ్యమంత్రి సమక్షంలో ఈ పెట్టుబడికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంలో భాగంగా సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టులతో పాటు మూడుచోట్ల భారీ పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పుతుంది. నాగర్కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాలో ఏర్పాటయ్యే ఈ మూడు ప్రాజెక్టుల ఇంధన సామర్థ్యం 3400 మెగావాట్లు. ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే సుమారు 7 వేల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. హరిత ఇంధన ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా చేస్తాం: సీఎం హరిత ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయతి్నస్తున్నామని, సుస్థిరమైన ఇంధన వృద్ధి సాధించాలనే లక్ష్య సాధనలో ఈ ఒప్పందం ఓ మైలు రాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. భవిష్యత్తు ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని, నాగర్కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయని ఆకాంక్షించారు. సన్ పెట్రో కెమికల్స్ చేపట్టబోయే ప్రాజెక్టు దేశంలోనే అత్యంత ప్రభావశీలంగా ఉంటుందని దిలీప్ సాంఘ్వీ చెప్పారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో అందరి దృష్టినీ తెలంగాణ ఆకర్షిస్తుందన్నారు. పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి ఇన్వెస్టిమెంట్స్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చర్చల్లో పాల్గొన్నారు. ‘కంట్రోల్ ఎస్’ ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడితో 400 మెగావాట్ల సామర్థ్యంతో అత్యాధునిక ‘ఏఐ డేటా సెంటర్ క్లస్టర్’ ఏర్పాటుకు ‘కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్’ ముందుకు వచ్చింది. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 వేల ఉద్యోగాలు లభిస్తాయని కంట్రోల్ ఎస్ సీఈఓ శ్రీధర్ పిన్నపురెడ్డి ప్రకటించారు. రాష్టంలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఈ డేటా సెంటర్ ఏర్పాటు మరో మైలు రాయిగా నిలుస్తుందని మంత్రి డి.శ్రీధర్బాబు అన్నారు. రూ.800 కోట్లతో ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ రాష్ట్రంలో అధునాతన మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ను రూ.800 కోట్లతో ఏర్పాటు చేసేందుకు జేఎస్డబ్ల్యూ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు జేఎస్డబ్ల్యూ డిఫెన్స్ అనుబంధ సంస్థ ‘జేఎస్డబ్ల్యూ యూఏవీ’తో రాష్ట ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారే అవకాశముంది. -
పెరిగిన పునరుత్పాదక ఇంధన సామర్థ్యం.. ఎంతంటే..
పునరుత్పాదక ఇంధన విద్యుత్ సామర్థ్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) ఏప్రిల్–నవంబర్ కాలంలో 15 మెగావాట్ల మేర అదనంగా సమకూరినట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. క్రితం ఏడాది ఇదే కాలంలో కొత్త ఏర్పాటు చేసిన 7.54 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన విద్యుత్ సామర్థ్యం కంటే రెట్టింపుగా ఉందని పేర్కొన్నారు. గత నెలలోనే 2.3 గిగావాట్ల మేర సామర్థ్యం సమకూరినట్టు మంత్రి తెలిపారు.సీఐఐ నిర్వహించిన ఇంధన సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పదేళ్లలో పునరుత్పాదక ఇంధన రంగంలో అసాధారణమైన బాటలు వేసినట్టు చెప్పారు. ప్రస్తుతం ఇంధన శుద్ధి విభాగంలో భారత్ ప్రపంచంలోనే ప్రముఖ దేశంగా అవతరించినట్టు ప్రకటించారు. శిలాజేతర ఇంధన వనరుల ద్వారా 2030 నాటికి 500 గిగావాట్ల విద్యుత్ తయారీ సాధించాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ 6.1 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) ఆకర్షించినట్టు మంత్రి వెల్లడించారు.ఇదీ చదవండి: నాయకత్వ స్థానాల్లో మహిళలకు ప్రాధాన్యంస్థానికంగానే సోలార్ ప్యానెళ్లు, మాడ్యూళ్ల తయారీని ప్రోత్సహించేందుకు పీఎల్ఐ ద్వారా రూ.24,000 కోట్లు అందించినట్లు మంత్రి గుర్తు చేశారు. 2025–26 నాటికి 38 గిగావాట్ల సామర్థ్యంతో 50 సోలార్ పార్క్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ఎలక్ట్రోలైజర్ల తయారీకి రూ.4,400 కోట్లు, ఇతర ప్రధాన విడిభాగాలకు రూ.13,050 కోట్ల ప్రోత్సాహకాలు ప్రకటించినట్టు చెప్పారు. -
అదే ఉన్మాదం
సాక్షి, అమరావతి: ఏ ప్రభుత్వ హయాంలోనూ.. ఏ ముఖ్యమంత్రి పాలనలోనూ.. ఎప్పుడూ, ఎవరూ చేయని గొప్ప ఆలోచనకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేశారు. రానున్న 30 ఏళ్లల్లో రైతులకు హక్కుగా వ్యవసాయానికి పగటి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) తో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని అత్యంత పారదర్శకంగా గత ప్రభుత్వం కుదుర్చుకుంది. కానీ ఈనాడు మాత్రం ఈ ఒప్పందంపై విషం చిమ్ముతూనే ఉంది. సెకీతో 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై ఇప్పటికే అనేక విధాలుగా వాస్తవాలను ప్రజల ముందు ఉంచినప్పటికీ, టీడీపీ, దాని కరపత్రిక ఈనాడు చేస్తున్న దుష్ప్రచారం కొనసాగుతూనే ఉంది. ఆ క్రమంలోనే అర్ధంలేని ఆరోపణలతో ఆదివారం మరో అబద్దపు కథనాన్ని ఈనాడు వండి వార్చింది. రాష్ట్రంలో 6,400 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనపై సమగ్ర అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖకు చెందిన సాంకేతిక కమిటీ తప్పుడు లెక్కలతో అంకెల గారడీ చేసిందంటూ ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించింది. 6,400 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల స్థాపన ఖర్చులను అంచనా వేసేటప్పుడు ఏపీ పవర్ కో ఆర్డినేషన్ కమిటీ (ఏపీపీసీసీ) తప్పు చేసిందంటూ ఈనాడు నిరాధారంగా ఆరోపణ చేసింది. వాస్తవాలను ఉద్దేశ్యపూర్వకంగా ఆ పత్రిక దాచిపెట్టింది. ‘ఐఎస్టీఎస్’ చార్జీలపై అవే అబద్ధాలుసెకీ ఒప్పందం వల్ల రాష్ట్రానికి అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలు ఉండవని సెకీ లేఖ, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్ (సీఈఆర్సీ), సెకీ ఒప్పందంలో స్పష్టంగా ఉన్నప్పటికీ ఈనాడు మాత్రం కళ్లున్నా కబోదిలా నటిస్తూ పచ్చి అబద్దాలను ప్రచురిస్తోంది.లేఖలోనే ప్రతిపాదించిన సెకీరాష్ట్ర ప్రభుత్వానికి 2021 సెప్టెంబర్ 15న సెకీ ఓ లేఖలో..ప్రాజెక్టు వాణిజ్య కార్యకలాపాలు(కమర్షియల్ ఆపరేషన్ డేట్– సీఓడీ)తో సంబంధం లేకుండా ప్రత్యేక ప్రోత్సాహకంగా ఐఎస్టీఎస్ చార్జీల నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చి0దని స్పష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఐఎస్టీఎస్ ఛార్జీలు వర్తించవని ఆ లేఖలో వివరంగా చెప్పింది.ప్రత్యేక ప్రోత్సాహకం కింద రాష్ట్రానికి ఐఎస్టీఎస్ చార్జీల నుంచి పూర్తిగా మినహాయింపు లభిస్తుందని తెలియజేస్తూ 2021 సెపె్టంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వానికి సెకీ రాసిన లేఖసెకీ ఒప్పందంలోనూ ఉందిసెకీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగిన విద్యుత్ సరఫరా ఒప్పందం(పవర్ సేల్ అగ్రిమెంట్)లోనూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రోత్సాహంగా ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తుందనే అంశం ఉంది.ఒప్పందంలోని నిబంధన 3.2 ప్రకారం..ఐఎస్టీఎస్ ఛార్జీలు, ఓపెన్ యాక్సెస్ ఛార్జీలు, సీటీయూ (సెంట్రల్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ) షెడ్యూలింగ్ ఛార్జీలే కాకుండా ఇంజెక్షన్/డెలివరీ పాయింట్ నుంచి సబ్స్టేషన్ వరకూ ఏ ఇతర చార్జీలు కూడా రాష్ట్ర డిస్కంలు చెల్లించనవసరం లేదని ఒప్పందంలో పొందుపరిచారు. దీనిని బట్టి చట్టపరంగానూ, ఒప్పందం పరంగానూ సెకీతో ఏపీ చేసుకున్న ఒప్పందానికి మాత్రమే ఐఎస్టీఎస్ చార్జీల మాఫీతో పాటు భవిష్యత్తులో జరిగే ఎలాంటి మార్పుల వల్లనైనా ఎలాంటి ఇతర చార్జీలు పడవని స్పష్టమవుతోంది.సీఈఆర్సీ కూడా స్పష్టం చేసింది2023 ఫిబ్రవరి 7న సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్ అంతర్ రాష్ట్ర ప్రసార ఛార్జీలు, నష్టాల భాగస్వామ్యం నిబంధనలపై నోటిఫికేషన్ ఇచ్చింది. ఉత్పత్తి కేంద్రాల నుంచి వచ్చే విద్యుత్కు ఎక్స్ప్రెస్ నిబంధనలను అందులో రూపొందించింది. వాటి ప్రకారం సీఓడీతో సంబంధం లేకుండా రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్ (ఆర్పిఓ) ఉన్న సంస్థలకు ఐఎస్టీఎస్ చార్జీల మినహాయింపు 25 ఏళ్ల పాటు లభిస్తుంది.రాష్ట్రంలో పెడితేనే భారంనిజానికి రాష్ట్రంలో 6,400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తే స్టేట్ నెట్వర్క్ పెంపుదల అనివార్యమని, అందుకు వ్యయం రూ.2,600 కోట్లు అవుతుందని ఏపీపీసీ కమిటీ తేల్చి చెప్పింది. అంతేకాకుండా 6,400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే, అంతర్ రాష్ట్ర గ్రిడ్తో అనుసంధానం చేయడం వల్ల రూ.1,021 కోట్ల అదనపు ఐఎస్టీఎస్ (ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్) ఛార్జీలు ఏటా పడతాయని కమిటీ సూచించింది. అదే 6,400 మెగావాట్ల నుంచి ఉత్పత్తి 10,092 మిలియన్ యూనిట్లకు పెరిగితే అప్పుడు ఐఎస్టీఎస్ చార్జీలు యూనిట్కు దాదాపు రూ.1 చొప్పున చెల్లించాల్సి వస్తుంది. సెకీ నుంచి విద్యుత్ను తీసుకోవడం వల్ల ఇవేవీ ఉండవు. రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు, అంతిమంగా ప్రజలపైనా భారం తగ్గుతుంది. రాష్ట్ర ప్రసార మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి అయ్యే వ్యయాన్ని భరించాల్సిన అవసరం తప్పుతుంది.సెకీతోనే అనేక ప్రయోజనాలురాష్ట్రంలోనే సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసి, రైతులకు ఇవ్వాలని, ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఈసీఎల్) ద్వారా 6400 మెగావాట్ల ప్రాజెక్టుల కోసం టెండర్లు సైతం పిలిచారు. కానీ దానిని రాజకీయ కారణాలతో కొందరు అడ్డుకున్నారు. అదే సమయంలో అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీల భారం లేకుండా యూనిట్ రూ.2.49 చొప్పున అతి చవక ధరకు విద్యుత్ను సరఫరా చేస్తామంటూ కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ పర్యవేక్షణలో ఏర్పాటైన సెకీ తనకు తానుగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన లేఖ పంపింది. దానిపై కమిటీ వేసి మరీ అధ్యయనం చేసిన తరువాత, ఏపీఈఆర్సీ అనుమతితో అత్యంత పారదర్శకంగా ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకుంది. దీనివల్ల రాష్ట్రంలో పెట్టాలనుకున్న ప్రాజెక్టుకు అయ్యే రూ.2,600 కోట్ల వ్యయం ఆదా అయ్యింది. ఆ ప్రాజెక్టుకు కేటాయించాల్సిన భూమి కూడా మిగిలింది. అంతేకాకుండా అతి తక్కువ ధరకు లభిస్తుండటంతో రాష్ట్ర ఖజానాపై సబ్సిడీ భారం కూడా తగ్గుతుంది. అదనంగా ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు సైతం వచి్చంది. సెకీ నుంచి విద్యుత్ను తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలుంటే టీడీపీ, దాని కరపత్రిక ఈనాడుకు మాత్రం ఇవేవీ కనిపించడం లేదు. -
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రానికి లేఖ
-
2050 నాటికి 100 కోట్ల మందికి స్థిర ఆదాయం!
ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరుగుతోంది. 2050 నాటికి సోలార్ ఎనర్జీ తయారీ 20 రెట్లు వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ) నివేదించింది. దాదాపు 100 కోట్ల మందికి ఆ రంగం స్థిర ఆదాయం కల్పించనుందని తెలిపింది. ఈమేరకు బాకులోని కాప్29 సదస్సుకు హాజరైన కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్, సహజ వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి కర్మ షెరింగ్ సమక్షంలో అధికారికంగా ఈ నివేదికను విడుదల చేశారు. ఈ రిపోర్ట్ తయారీకి ఐఎస్ఏ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమీకరించే ఎనర్జీ పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. దేశ స్థిరాభివృద్ధిలో సౌరశక్తి పాత్రను కేంద్రం గుర్తించిందని, అందుకు తగిన విధంగా సోలార్ ఎనర్జీ పరిధిని విస్తరించేందుకు ప్రపంచ వాటాదారులతో కలిసి పని చేస్తోందన్నారు. ఐఎస్ఏ నివేదికలో సూచించిన వినూత్న విధానాల ద్వారా మరింత మెరుగ్గా సౌరశక్తిని వినియోగించుకోవచ్చని చెప్పారు.నివేదికలోని వివరాల ప్రకారం.. సౌరశక్తితో గణనీయమైన సామాజిక, పర్యావరణ, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. 2050 నాటికి ప్రపంచ సౌరశక్తి సామర్థ్యం 20 రెట్లు పెరుగనుంది. స్లో ట్రాన్సిషన్, డైనమిక్ ట్రాన్సిషన్, షైన్ అనే మూడు విధానాలతో నెట్-జీరో(కార్బన్ను విడుదలను పూర్తిగా తగ్గించడం) లక్ష్యాన్ని సాధించవచ్చు.స్లో ట్రాన్సిషన్: సౌరశక్తిని పెంచడానికి అవసరమయ్యే విధానాలను నెమ్మదిగా పెంచాలి. ప్రస్తుతం పరిమిత పెట్టుబడుల వల్ల ఈ విభాగం విస్తరణ కొంత వెనకబడి ఉంది. భవిష్యత్తులో ఈ ఇది పెరగనుంది.డైనమిక్ ట్రాన్సిషన్: స్లో ట్రాన్సిషన్తో పోలిస్తే సౌరశక్తిని పెంచడానికి మరింత చురుకైన, ప్రతిష్టాత్మక విధానాన్ని ఇది సూచిస్తుంది.షైన్: షైన్ (సస్టెయినబుల్ అండ్ హోలిస్టిక్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్) ద్వారా సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన వ్యవస్థను సృష్టించవచ్చు. సోలార్ ఫోటోవోల్టాయిక్(పీవీ) సిస్టమ్ను శక్తి నిల్వ కోసం వినియోగించుకోవచ్చు.స్థిర ఆదాయం: ప్రభుత్వాలు ప్రజలకు సౌరశక్తిపై అవగాహన కల్పిస్తే నిర్ణీత ఖర్చుతో సోలార్ ఎనర్జీను గ్రిడ్కు కనెక్ట్ చేయవచ్చు. దాంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మందికి స్థిర ఆదాయం ఏర్పడుతుంది.ఉపాధి: 2050 నాటికి ఈ విభాగంలో మహిళలు, యువతకు గణనీయమైన అవకాశాలు కల్పించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 2.7 కోట్లకు పైగా ఈ సెక్టార్లో ఉద్యోగాలను సృష్టించవచ్చు.పర్యావరణ ప్రభావం: సౌరశక్తిని పెంచడం వల్ల సంప్రదాయ ఇంధన వనరులను తగ్గించి పారిస్ ఒప్పందం ప్రకారం 1.5°C ఉష్ణోగ్రతను తగ్గించేందుకు వీలవుతుంది. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 శాతం హానికర కర్బన ఉద్గారాలను కట్టడి చేయవచ్చు.తగ్గనున్న వ్యయ సామర్థ్యం: సౌరశక్తి అందించడం ప్రస్తుతం కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినా, 2050 నాటికి వీటి ఖర్చులు 60 శాతం తగ్గుతాయని అంచనా.ఇదీ చదవండి: ‘ఉద్యోగం ఇస్తాం.. జీతం ఉండదు.. పైగా రూ.20 లక్షలు విరాళం’పునరుత్పాదక ఇంధన వనరులతో శిలాజ ఇంధనాల వాడకం తగ్గడంతోపాటు సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రయోజనాలు చేకూరుతాయని ఐఎస్ఏ డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ అన్నారు. భవిష్యత్తులో స్థిరమైన ఎనర్జీ సరఫరాకు సౌరశక్తి కీలకంగా మారనుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనిర్బన్ ముఖర్జీ తెలిపారు. -
నీటిపై తేలాడే సోలార్ వెలుగులు.. దేశంలోని ప్రాజెక్ట్లు ఇవే..
పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధికి దేశంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో సిద్ధం చేసిన ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్కు ఇటీవల ప్రధాన నరేంద్రమోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రూ.800 కోట్లతో 176 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఇందులో 56 మెగావాట్లు ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ద్వారా, మరో 120 మెగావాట్ల పవర్ను గ్రౌండ్మౌంట్ సోలార్ ప్లాంట్ ద్వారా సమకూర్చాలని ప్రతిపాదించారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఎల్ అండ్ టీ సంస్థ కాంట్రాక్ట్ పొందింది.ఇదీ చదవండి: ‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’గ్రౌండ్మౌంట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సాధారణంగా అధిక విస్తీర్ణంలో భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. అదే నీటిపై తేలాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఈ ఇబ్బంది ఉండదు. రెండింటిలో ఏ ప్లాంటైనా మౌలిక సదుపాయాల ఖర్చు ఎలాగూ ఉంటుంది. దాంతో తక్కువ ఖర్చుతో కూడుకున్న ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్లకు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.ఎన్టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ రామగుండం: స్థాపిత సామర్థ్యం-100 మెగావాట్లు, ఇది 500 ఎకరాల్లో విస్తరించి ఉంది.ఎన్టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ కాయంకులం: స్థాపిత సామర్థ్యం-92 మెగావాట్లు. కేరళలో ఉన్న ఈ ప్రాజెక్ట్ 450 ఎకరాల సరస్సుపై ఏర్పాటు చేశారు.రిహాండ్ డ్యామ్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్: స్థాపిత సామర్థ్యం-50 మెగావాట్లు. ఈ ప్రాజెక్ట్ ఉత్తరప్రదేశ్లో ఉంది.సింహాద్రి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్: దీని స్థాపిత సామర్థ్యం-25 మెగావాట్లు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 75 ఏకరాల్లో ఇది విస్తరించి ఉంది.ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్: దీని అంచనా సామర్థ్యం-600 మెగావాట్లు. మధ్యప్రదేశ్లో దీని ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
భూటాన్లో అనిల్ అంబానీ ప్రాజెక్ట్లు అభివృద్ధి
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ భూటాన్లో ప్రాజెక్ట్లను అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో 1,270 మెగావాట్ల సౌర, జలవిద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ప్రకటించింది. పునరుత్పాదక ఇంధన విభాగంలో పెట్టుబడులు పెంచేందుకు భూటాన్ ప్రభుత్వ వాణిజ్య విభాగం డ్రక్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ (డిహెచ్ఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది.రిలయన్స్ ఈ వెంచర్ కోసం రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ అనే కొత్త కంపెనీని ఏర్పాటు చేసింది. దీన్ని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్ సంయుక్తంగా ప్రమోట్ చేస్తాయని కంపెనీ పేర్కొంది. ఇది సోలార్, హైడ్రో ప్రాజెక్టులతో సహా గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెడుతుందని తెలిపింది. భూటాన్తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ గెలెఫు మైండ్ఫుల్నెస్ సిటీలో 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను నిర్మించనుంది. ఇది వచ్చే రెండేళ్లలో పూర్తవుతుంది. 770 మెగావాట్ల సామర్థ్యంలో ‘చమ్ఖర్చు-1’ జలవిద్యుత్ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయనుంది. ఈమేరకు ఇరు సంస్థలకు చెందిన ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ భూటాన్ అంతటా స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్, మీటరింగ్ సిస్టమ్లను కూడా ఏర్పాటు చేయనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: కార్పొరేట్ కంపెనీలు ప్రెషర్ కుక్కర్లు!ఈ ఏడాది సెప్టెంబర్ నెల 18 నుంచి 21 తేదీల మధ్య కేవలం మూడు రోజుల్లోనే అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ తమ అప్పులు దాదాపు తీరిపోయినట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక నిధుల సేకరణ ప్రణాళికలను కూడా అమలు చేస్తోంది. గ్రూప్ సంస్థలు వాటి షేర్ విలువను పెంచుకుంటున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్కు సంబంధించి నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఊరటనిచ్చింది. సంస్థ బకాయిలను క్లెయిమ్ చేయాలని మహారాష్ట్ర రాష్ట్ర పన్నుల శాఖ దాఖలు చేసిన పిటిషన్ను ఎన్సీఎల్ఏటీ పక్కన పెట్టింది. -
పెరుగుతున్న సౌర విద్యుత్ సామర్థ్యం
పునరుత్పాదక ఇందన వనరులను అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా సోలార్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ రంగంలో తయారీ ప్లాంట్లు ఊపందుకుంటున్నాయి. ఫలితంగా సమగ్ర ఎనర్జీ సామర్థ్యం పెరుగుతోంది. 2024 జులై నెలలో 1,733.7 మెగావాట్ల కెపాసిటీ కలిగిన సోలార్ ఎనర్జీను ఉత్పత్తి చేశారు. దాంతో మొత్తం దేశీయంగా తయారయ్యే స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యం 87.2 గిగావాట్లకు చేరింది.2025 ఆర్థిక సంవత్సరం జులైలో 5,394 మెగావాట్ల సోలార్ ఎనర్జీ తయారవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అనుకున్న విధంగానే జరిగితే రానున్న ఏడాది మొత్తంగా రికార్డుస్థాయిలో 30-35 గిగావాట్ల సౌర విద్యుత్ తోడవుతుందని చెబుతున్నారు. 2030 వరకు ఇండియాలో 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికోసం ఏటా సుమారు 44 గిగావాట్లు సామర్థ్యం కలిగిన విద్యుత్ను తయారు చేయాల్సి ఉంటుంది. అందుకోసం 2030 వరకు దాదాపు రూ.16 లక్షల కోట్ల(200 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు అవసరం అవుతాయని అంచనా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024 బడ్జెట్లో ‘సూర్య ఘర్’ పథకంలో భాగంగా కోటి ఇళ్లలో సోలార్ ఎనర్జీ వాడేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దానికోసం ప్రభుత్వం 40 శాతం వరకు సబ్సిడీ ఇస్తుందని ప్రకటించారు.ఇదీ చదవండి: ‘ప్రైమ్ కేటగిరీ’లో రూ.11 లక్షల వరకు జీతం -
Oxford University: అరచేతిలో అపార సౌర శక్తి
ఒకవైపు ఇంధన అవసరాలు నానాటికీ ఊహాతీతంగా పెరిగిపోతున్నాయి. సంప్రదాయ ఇంధన వనరుల ఉత్పత్తి అంతులేని కాలుష్యానికి, గ్లోబల్ వారి్మంగ్ పెనుభూతానికి కారకంగా మారుతోంది. సౌర విద్యుత్ సమర్థ ప్రత్యామ్నాయంగా కని్పస్తున్నా దాని తయారీకి భారీ ఫలకాలు, విశాలమైన స్థలం వంటివెన్నో కావాలి. ఈ సమస్యలకు కూడా చెక్ పెడుతూ, సౌర విద్యుదుత్పత్తిని అత్యంత సులభతరం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎక్కడికక్కడ సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలిగే అతి సూక్ష్మ సౌర ప్యానళ్లు త్వరలో రాబోతున్నాయి. వెంట్రుక మందంలో కేవలం వందో వంతు మాత్రమే ఉండే ఈ బుల్లి సౌర ప్యానళ్లను ఆక్స్ఫర్డ్ వర్సిటీ సైంటిస్టులు తాజాగా అభివృద్ధి చేశారు. వీటిని ప్రయాణాల్లో వీపుకు తగిలించుకునే బ్యాక్ప్యాక్పై, సెల్ ఫోన్ వెనక, కార్ రూఫ్ మీద... ఇలా ఎక్కడైనా సులువుగా అమర్చుకోవచ్చు! అంతేకాదు, ప్రస్తుత సౌర ఫలకాల కంటే రెట్టింపు సౌర విద్యుదుత్పాక సామర్థ్యం ఈ బుల్లి ఫలకాల సొంతం!!ఎలా పని చేస్తుంది? ఈ బుల్లి ప్యానళ్లలో సోలార్ కోటింగ్ను పెరోవ్సై్కట్స్గా పిలిచే పదార్థంతో తయారు చేస్తారు. ప్రస్తుత సిలికాన్ ఆధారిత సౌర ప్యానళ్లతో పోలిస్తే ఇది సూర్యరశి్మని మరింత మెరుగ్గా ఒడిసిపడుతుంది. పైగా ప్రస్తుత ప్యానళ్లు అవి ఒడిసిపడుతున్న సూర్యరశి్మలో 22 శాతాన్ని మాత్రమే ఇంధనంగా మార్చగలుగుతున్నాయి. ఆక్స్ఫర్డ్ సైంటిస్టులు రూపొందించిన బుల్లి ప్యానళ్లు 27 శాతం సామర్థ్యంతో పని చేస్తాయి. దీన్ని మున్ముందు 45 శాతం దాకా పెంచుకోవచ్చని వాళ్లు బల్లగుద్ది చెబుతున్నారు. ‘‘తొలిసారి రూపొందించినప్పుడు వీటి కన్వర్షన్ సామర్థ్యం 6 శాతమే. ఐదేళ్లలోనే దాన్ని 27 శాతానికి పెంచగలిగాం’’ అని వివరించారు. ‘‘ఎలా చూసుకున్నా సౌర విద్యుదుత్పత్తి రంగంలోనే ఇది అతి కీలకమైన ముందడుగు. ఎందుకంటే సిలికాన్ ఆధారిత ప్యానళ్లను బిగించేందుకు ప్రత్యేక సౌర క్షేత్రాలు తప్పనిసరి. అందుకు పంట పొలాలను వాడుతుండటం ప్రపంచవ్యాప్తంగా రైతుల ఆందోళనలు తదితరాలకు దారితీస్తోంది. కానీ పెరోవ్సై్కట్స్ ప్యానళ్లకు ఆ అవసరమే ఉండదు. సిలికాన్ ప్యానళ్లతో పోలిస్తే వీటిని ఎక్కడంటే అక్కడ అతి సులువుగా బిగించుకోవచ్చు. కారుచౌకగా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎలాంటి ఉపరితలం మీదైనా ఇవి సులువుగా ఒదిగిపోతాయి. చివరికి ప్లాస్టిక్, కాగితంపై కూడా!’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న ఆక్స్ఫర్డ్ సైంటిస్టు జుంక్ వాంగ్ వివరించారు. ‘‘పెరోవ్సై్కట్స్ ప్యానళ్లలో కేవలం ఒక మైక్రాన్ మందం కోటింగ్ ఉంటుంది. ప్రస్తుత సౌర ప్యానళ్లలో వాడుతున్న సిలికాన్ కోటింగ్తో పోలిస్తే ఇది ఏకంగా 150 రెట్లు పలుచన’’ అని చెప్పారు. ఆ సమస్యనూ అధిగమిస్తే... సంప్రదాయ సిలికాన్ సౌర ప్యానళ్లతో పోలిస్తే బుల్లి ప్యానళ్లలో ఒక పెద్ద సమస్య లేకపోలేదు. అదే... స్థిరత్వం! పెరోవ్సై్కట్స్ ప్యానళ్లు ప్రయోగశాల పరిస్థితుల్లోనే కరిగిపోతున్నాయి. లేదా కొద్ది రోజుల్లోనే విరిగిపోతున్నాయి. అయితే ఇది సమస్యేమీ కాదని వాంగ్ అన్నారు. ‘‘వాటి జీవితకాలాన్ని పెంచేందుకు జరుగుతున్న పరిశోధనలు కొలిక్కి వస్తున్నాయి’ అని వివరించారు.ఆకాశమే హద్దు...!ప్రపంచవ్యాప్తంగా సౌర ప్యానళ్ల ఏర్పాటు ఒక్క గత ఏడాదిలోనే ఏకంగా 80 శాతం పెరిగినట్టు స్వచ్ఛ ఇంధన గణాంకాలు, విశ్లేషణలో పేరున్న వుడ్ మెకెంజీ సంస్థ వెల్లడించింది. వాటి ఏర్పాటుకు వెచి్చంచాల్సిన ఖర్చు భారీగా తగ్గుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఫలితంగా సౌర విద్యుత్ అతి చౌకైన ఇంధన వనరుగా మారిపోతోంది. అంతేగాక గత 19 ఏళ్లుగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విద్యుత్ వనరుగా నిలుస్తూ వస్తోంది. ‘‘ఈ పరిస్థితుల్లో మేం రూపొందించిన బుల్లి సౌర ప్యానళ్లు గనక ఒక్కసారి సక్సెసైతే వీటి వాణిజ్య విలువ ఆకాశాన్నంటుతుంది. అప్పుడిక ప్రపంచ ఇంధన రంగ ముఖచిత్రమే మారిపోవడం ఖాయం’’ అని పరిశోధక బృందం సారథి హెన్రీ స్నెయిత్ ధీమాగా చెబుతున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
బెడిసి కొట్టిన ఈనాడు స్టోరీ.. రామోజీ షాక్స్!
ఆంధ్రప్రదేశ్లో ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయా? ఇంత అభివృద్దికి అడుగులు పడుతున్నాయా? నిజంగా ఏపీ ప్రజలకు వీటి గురించి పూర్తి వివరాలు తెలియవంటే ఆశ్చర్యం కాదు. కాని ద్వేష భావంతో, ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించడం కోసం ఈనాడు మీడియా రాసిన ఒక స్టోరీ అందరూ చదవవలసిందే. బహుశా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఇంత వివరంగా తన ప్రభుత్వం ఇన్ని కొత్త పరిశ్రమలను తీసుకు వస్తున్న సంగతి ప్రజలకు చెప్పినట్లు అనిపించదు. శుక్రవారం నాడు ఈనాడు దినపత్రికలో "అంతా.. ఆ ఏడు చేపలకే" అంటూ ఒక స్టోరీ ఇచ్చారు. ఈనాడు లక్ష్యం ఏమిటంటే ఏడు పెద్ద కంపెనీలకు జగన్ లబ్ది చేకూర్చే యత్నం చేశారని, ఏపీలో వాటికి పలు భారీ పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశం ఇచ్చారని ప్రజలు అనుకోవాలని వారు ఈ కథనాన్ని ఇచ్చారు. అది చదివిన తర్వాత నాకైతే జగన్పై మరింత గౌరవం పెరిగింది. ఎందుకంటే ఏపీకి ఇన్ని ముఖ్యమైన పరిశ్రమలు తీసుకు రావడానికి జగన్ చేసిన కృషి ఈ కథనం ద్వారా తెలిసింది. మరి ఇంతకాలం ఇదే ఈనాడు మీడియా ఏమని ప్రచారం చేసింది? ఏపీకి అసలు పరిశ్రమలు రావడం లేదని కదా! పారిశ్రామికవేత్తలు రావడం లేదని కదా? పెట్టుబడులు రావడం లేదని కదా! ఈనాడు తాజాగా ఇచ్చిన కథనం ప్రకారం 2.63 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఏడు కంపెనీలవారు చేపట్టారని. ఇది మంచిదే కదా? అసలే పరిశ్రమలే రావడం లేదని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు రావడం, అవన్ని పురోగతిలో ఉండడం స్వాగతించవలసిన విషయం కదా! ఈనాడు మీడియాకు, దాని అధిపతి రామోజీరావుకు ఏపీలో పరిశ్రమలు, కొత్త ప్రాజెక్టులు రావడం ఇష్టం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొన్ని ఎస్ఈజెడ్లు వచ్చాయి. అప్పుడు ఈ మీడియా కాని, తెలుగుదేశం కాని చేయని యాగీ లేదు. విదేశాలకు ఎగుమతులు చేసే ఉత్పత్తులు తయారు చేసే కంపెనీల ఏర్పాటుకు వీటిని కేంద్రం ప్రతిపాదించింది. అందుకోసం భూములు సేకరిస్తుంటే విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేశాయి.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రకరకాలుగా అడ్డంకులు సృష్టించేవారు. సోనియాగాంధీ, చంద్రబాబు, సీబిఐ కుమ్మక్కై వాన్పిక్ రాకుండా చేశారు. చీరాల, రేపల్లె ప్రాంతంలో వాన్పిక్ పారిశ్రామికవాడను ఏర్పాటు చేయాలని పదమూడు వేల ఎకరాల భూములను ఆ సంస్థ కొనుగోలు చేసింది. అందులో ఎక్కువ భాగం వ్యవసాయానికి పనికిరాని భూములే. కొంత ప్రభుత్వ భూమి. కాని ఆ భూమిని సేకరించిన నిమ్మగడ్డ ప్రసాద్ను జగన్పై ఉన్న ద్వేషంతో వీరు కేసులలో ఇరికించి జైలులో పెట్టారు. ఆ భూములలో కొత్త పరిశ్రమలు పెట్టడానికి అడ్డు పడకుండా ఉంటే ఈపాటికి ఆ ప్రాంతం బ్రహ్మాండంగా తయారై ఉండేదేమో! వైఎస్ హయాంలో సూళ్లూరు పేట సమీపంలో శ్రీసిటీ పేరుతో ఒక పారిశ్రామికవాడ నిర్మించాలని తలపెట్టారు. అప్పట్లో ఇదే ఈనాడు మీడియా భూ సేకరణను దోపిడీ కింద అభివర్ణించి పలు కధనాలు రాసేది. సెజ్లలో ఉద్యోగాలు ఏవి అంటూ దిక్కుమాలిన విమర్శలు చేసేది. అయినా వైఎస్ రాజశేఖరరెడ్డి వెనక్కి తగ్గకుండా శ్రీసిటీ ఏర్పాటుకు సహకరించారు. ఆ సంస్థ యజమానులు స్థానిక రైతుల సహకారంతో పారిశ్రామిక వాడను రూపొందించారు.ఇప్పుడు అది నిజంగానే శ్రీసిటీ అయింది. అక్కడి ప్రజలకు ఎంతగానో మేలు చేస్తోంది. 2016లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే ఈనాడు మీడియా ఏమని రాసిందో తెలుసా?బతుకు చిత్రాన్ని మార్చిన సిరుల సీమ శ్రీసిటీ అని రాశారు. అంటే వైఎస్ అధికారంలో ఉంటే వ్యతిరేకించడం, చంద్రబాబు సీఎంగా ఉంటే భజన చేయడం. ఇదే ఈనాడు నైజం. ఇప్పుడు కూడా ఏపీలో కొత్త పరిశ్రమలు వస్తుంటే ఈ మీడియా ఏడ్చిపోతోంది. షిర్డి సాయి ఎలక్ట్రికల్ సంస్థ సుమారు 18 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టడం వీటిలో ఒకటి. కేంద్ర ప్రుభుత్వం చేసిన సూచనల ప్రకారం స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే, దానివల్ల రైతులకు ఏదో నష్టం జరిగిపోతుందని ఇదే మీడియా ప్రచారం చేసింది. చంద్రబాబు నాయుడు అయితే ఈ మీటర్లు రైతులకు ఉరి అంటూ తప్పుడు ప్రచారం చేశారు. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. దానివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని, ప్రభుత్వం సరపరా చేసే విద్యుత్కు లెక్కలు ఉంటాయని, రైతులకు డబ్బు జమ చేస్తామని చెప్పి ముందుకు వెళ్లారు.ఈ ప్రాజెక్టు పై ఎంత అబద్దపు ప్రచారం చేసినా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ శాఖ అధికారులు వివరణలు ఇచ్చినా, ఈనాడు ఆరోపణలను ఖండించినా, వీరి పద్దతి మాత్రం మారలేదు. అదే సమయంలో ఈ మీటర్లు బిగించాలని చెప్పిన బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. ఆయన రెండు నాలుకల ధోరణికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో కనిపిస్తాయి. సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టులో 478 కోట్లతో రెండు అదనపు యూనిట్లు స్థాపిస్తున్నారు. ఇది టెండర్ ఆధారంగానే ప్రాజెక్టుల కేటాయింపు జరుగుతుంది.అయినా ఈనాడుకు ఇష్టం లేదు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా సోమశిల వద్ద 900 మెగావాట్ల, ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు. కంపెనీ వారే పెట్టుబడి పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఇందులో రామోజీకి వచ్చిన బాధ ఏమిటో తెలియదు. రామోజీ ఫిలింసిటీ స్థాపించినప్పుడు వేల ఎకరాలను కొనుగోలు చేశారు. దానికి ఎవరు అనుమతించారు. అసలు ఆ ప్రాజెక్టు స్థాపనకు ఏమైనా టెండర్ పిలిచారా? అయినా స్థాపించలేదా? అందులో తప్పు లేదు.కాని ఇతర కంపెనీలు ఏవైనా పరిశ్రమలు పెడుతుంటే మాత్రం ఈ మీడియా అడ్డం పడుతుంటుంది. ఈనాడు మీడియా అభివృద్ది నిరోధకంగా మారింది. విచిత్రం ఏమిటంటే షిర్డిసాయి ఎలక్టికల్ కంపెనీ తెలుగుదేశం పార్టీకి నలబై కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది. ఈ విషయం మాత్రం గోప్యంగా ఉంచారు. అదే మెఘా కంపెనీ వైఎస్సార్సీపీకి 37 కోట్ల విరాళం ఇచ్చింది. దానిని మాత్రం రాసేశారు. మరి అదే సంస్థ తెలుగుదేశంకు పాతిక కోట్లు ఇచ్చింది. దానిని కప్పిపుచ్చారు. అసలు గుర్తింపేలేని జనసేనకు ఐదు కోట్లు ఇచ్చారు. మరి దీనిని ఏమంటారో రామోజీనే చెప్పాలి. జిందాల్ కంపెనీ 42500 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టడానికి ముందుకు వచ్చింది. కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం వద్ద రెండు కాప్టివ్ బెర్తుల నిర్మాణం, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లా. నంద్యాల ప్రాంతాలలో 2500 మెగావాట్ల సౌర విద్యుత్ పదివేల మెగావాట్ల పవన విద్యుత్, 1500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను ఈ సంస్థ చేపడితే దానిపైన విమర్శలు చేశారు. వీరికి మైనింగ్ లీజులు కేటాయించారన్నది ఈనాడు ఏడుపు. ఖనిజం లేకుండా స్టీల్ ప్లాంట్ ఎలా వస్తుందో వీరే చెప్పాలి.మెఘా కంపెనీ 30445 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపడుతోంది. సీలేరు వద్ద 12264 కోట్లతో పిఎస్పి ప్రాజెక్టును ఈ సంస్థ స్థాపిస్తోంది. అది వీరికి కడుపునొప్పిగా మారింది. జెన్కో టెండర్ ద్వారానే దీనిని కేటాయించినా, తప్పే నట. మచిలీపట్నం పోర్టు పనులు కూడా టెండర్ ద్వారానే ఈ సంస్థ చేస్తోంది. పోలవరం ప్రాజెక్టును, జల విద్యుత్ ప్రాజెక్టును కూడా నిర్మిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా ఈ కంపెనీ అమలు చేస్తోంది. ఇంత అభివృద్ది జరుగుతుంటే, ఈనాడుకు ఇదంతా మింగుడుపడడం లేదు. అందుకే ఇంత బురదచల్లుతూ స్టోరీలు ఇస్తోంది. విశాఖలో అదానికి డేటా సెంటర్ నిర్మాణానికి భూమి ఇవ్వడం కూడా నేరమేనట. అదాని బిజినెస్ పార్క్ ఏర్పాటు చేస్తుంటే వీరు కుళ్ళుతున్నారు. అదే అమరావతి గ్రామాలలో సింగపూర్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములను చంద్రబాబు ఇస్తే మాత్రం గొప్ప విషయం అని రామోజీ ప్రచారం చేశారు. తీరా చూస్తే ఈ కంపెనీలను పట్టుకువచ్చిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అవినీతి ఆరోపణలతో పదవి పోగొట్టుకున్నారు. అలాగే దుబాయికి చెందిన ఒక సంస్థ పేరుతో వంద ఎకరాలు ఆస్పత్రి నిమిత్తం ఇచ్చారు. ఆస్పత్రి రాలేదు కాని, ఆ కంపెనీ యజమాని అక్కడ చేసిన నేరాలకు జైలుకు వెళ్లారు.ఇలాంటి వాళ్లు చంద్రబాబుకు స్నేహితులు. దేశంలోనే పెద్ద కంపెనీలకు వివిధ ప్రాజెక్టులను అప్పగిస్తే నేరం చేసినట్లు ఈనాడు రామోజీ రాయించేస్తున్నారు. అంటే ఈ కంపెనీలు ఏవీ రాకుండా ఉంటే, ఏపీలో ఉద్యోగాలు పెరగకుండా ఉంటే వీరికి సంతోషం అన్నమాట. ఈ ప్రాజెక్టులను కనుక చంద్రబాబు టైమ్లో చేపట్టి ఉంటే అబ్బో అంత గొప్ప, ఇంత గొప్ప అని ప్రచారం చేసేవారు. రామాయపట్నం ఓడరేవు వద్ద ఇండోసోల్ సంస్థ సోలార్పానెల్ ప్రాజెక్టును ఆరంభిస్తే, ఎంత దారుణమైన కథనాలు ఈనాడు మీడియా ఇచ్చిందో గమనిస్తే వీళ్లు అసలు మనుషులేనా అన్న అనుమానం వస్తుంది. 43 వేల కోట్ల పెట్టుబడి పెట్టి ఈ కంపెనీ ఏర్పాటు అవుతుంటే సంతోషించాల్సింది పోయి విషం చిమ్ముతున్నారు. పైగా వారి ఖర్చుతో భూములు కొనుగోలు చేస్తుంటే వీరికి తీటగానే ఉంది.అక్కడ రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి భూములు అమ్ముతున్నారు. అది వీరికి గిట్టడం లేదన్నమాట. అలాగే అరవిందో సంస్థ పలు ప్రాజెక్టులను నిర్మిస్తోంది. వాటిపై కూడా విషం చిమ్మారు. ఈ ప్రాజెక్టులు అన్నీ ప్రజలకు ఉపయోగపడేవి. ప్రభుత్వం ఖర్చు కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేవి. అయినా ఈనాడు మీడియా అదేదో ఘోరం జరిగినట్లు దారుణమైన కథనాలు ప్రచురిస్తోంది. ఈ మొత్తం కధనం చదివితే ఇన్ని వివరాలను నెగిటివ్గా ఇచ్చినా ఈ స్థాయిలో పరిశ్రమలు వస్తున్నాయని తనకు తెలియకుండానే ఈనాడు మీడియా అంగీకరించింది. నిజంగా ఇవన్ని ఆచరణలోకి వస్తే ఏపీకి ఎంతో మేలు జరుగుతుంది. అందుకు ముఖ్యమంత్రి జగన్ను అభినందించాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
సౌర విద్యుత్లో ఏపీ ముందడుగు
సాక్షి, అమరావతి: మన రాష్ట్రం సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ టాప్ 5 రాష్ట్రాల్లో స్థానం సంపాదించే దిశగా సాగుతోంది. సోలార్ వ్యర్థాలపై విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్ర న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ ఈ నివేదిక రూపొందించింది. దేశంలో గతేడాది (2022–23లో) సుమారు 100 కిలో టన్నుల సౌర వ్యర్థాల ఉత్పత్తి జరిగిందని, 2030 నాటికి వీటి ఉత్పత్తి 600 కిలో టన్నులకు చేరుతుందని వెల్లడించింది. సౌర వ్యర్థాల్లో దాదాపు 67 శాతం రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే వస్తున్నట్లు పేర్కొంది. ఈ ఐదు రాష్ట్రాల్లోనే సౌర విద్యుత్ ప్రాజెక్టులు భారీగా పెరుగుతుండటమే ఇందుకు కారణమని తెలిపింది. మన దేశంలో 2070 నాటికి కాలుష్యపూరితమైన కర్బన ఉద్గారాలను పూర్తిగా సున్నా స్థాయికి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. 2030 నాటికి ఒక మిలియన్ టన్నుల కాలుష్యాన్ని వాతావరణం నుంచి పారద్రోలాలని రాష్ట్రాలకు చెప్పింది. ఇందులో భాగంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని పెంచుతోంది. మన దేశం 2040 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకొంది. దీనికి తోడ్పాటునందిస్తున్న మొదటి పది రాష్ట్రాల్లో ఏపీ ఇప్పటికే స్థానం సంపాదించింది. ఇప్పటికే 4.76 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గించి ఆదర్శంగా నిలిచింది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో రాష్ట్రం 42 ఇంధన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటి ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌర విద్యుత్ ఉత్పత్తి కూడా పెంచుతూ రాష్ట్రం టాప్ 5 రాష్ట్రాల్లో నిలిచిందని తాజా నివేదిక వెల్లడించింది. రీసైక్లింగ్ చేస్తే సరి వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం, తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరుల కారణంగా ప్రపంచం మొత్తం పునరుత్పాదక ఇంధనం వైపు దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పదేళ్లలో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 23 రెట్లు పెరిగింది. రానున్న ఆరేళ్లలో (2030 నాటికి) 292 గిగావాట్ల స్థాపిత సౌర సామర్థ్యాన్ని పెంచాలనేది లక్ష్యం. అయితే సోలార్ మాడ్యూల్స్, ఫీల్డ్ నుండి వచ్చే వ్యర్థాలు ఓ సవాలుగా మారనున్నాయి. నిజానికి ఫోటో వాల్టాయిస్ (పీవీ)ల జీవిత కాలం 25 ఏళ్లు. ఆ తర్వాత అవి వ్యర్ధాలుగా మారతాయి. కాకపోతే సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు కొన్ని పీవీలు పగిలిపోవచ్చు. కొంత కాలం తరువాత కొన్ని పనిచేయకపోవచ్చు. కొన్ని నాణ్యత పరీక్షల్లో విఫలమై పక్కన పడవచ్చు. రవాణా సమయంలో కొన్ని దెబ్బతింటాయి. అలాంటివి వ్యర్థాలుగా మారుతుంటాయి. ఈ మాడ్యూల్స్లో సిలికాన్, కాపర్, టెల్లూరియం, కాడ్మియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. దేశంలో ఇప్పుడున్న సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచే 2030 నాటికి సుమారు 340 కిలోటన్నుల వ్యర్ధాలు రావచ్చని అంచనా. ఈ వ్యర్ధాల్లో 10 టన్నుల సిలికాన్, 18 టన్నుల వెండి, 16 టన్నుల కాడ్మియం, టెల్లూరియం ఉంటాయి. కొత్తగా వచ్చే ప్రాజెక్టులతో కలిపి వ్యర్ధాలు 600 కిలోటన్నులకి చేరుకోవచ్చు. 2050 నాటికి దాదాపు 19,000 కిలో టన్నులకి పెరుగుతాయని అంచనా. వ్యర్ధాలను తొలగించడం కోసం రీసైక్లింగ్ వ్యవస్థలను ప్రోత్సహించడమే సరైన మార్గం. అంతేకాదు రసాయన ప్రక్రియల సహాయంతో రీసైక్లింగ్ చేస్తే వెండి, సిలికాన్ను కూడా తిరిగి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
సోలార్ ఇన్స్టలేషన్లు 44 శాతం డౌన్..
న్యూఢిల్లీ: స్థల సమీకరణ సమస్యల కారణంగా దేశీయంగా సౌర విద్యుత్ ఇన్స్టలేషన్లు 2023లో 7.5 గిగావాట్ల సామర్ధ్యానికి పరిమితమయ్యాయి. 2022లో నమోదైన 13.4 గిగావాట్ల (జీడబ్ల్యూ)తో పోలిస్తే 44 శాతం తగ్గాయి. అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ మెర్కామ్ క్యాపిటల్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం దేశీయంగా మొత్తం స్థాపిత సౌర విద్యుదుత్పత్తి సామర్ధ్యం 72 జీడబ్ల్యూకి చేరింది. ఇందులో యుటిలిటీ స్థాయి ప్రాజెక్టుల వాటా 85.4 శాతంగా, రూఫ్టాప్ సోలార్ ప్రాజెక్టుల వాటా 14.6 శాతంగా ఉంది. 2022లో భారీ స్థాయి సోలార్ ఇన్స్టాలేషన్లు 11.7 గిగావాట్ల నుంచి 51 శాతం క్షీణించి 5.8 గిగావాట్లకు పరిమితమయ్యాయి. పలు భారీ ప్రాజెక్టులకు గడువు పొడిగించడం, స్థల సమీకరణ..కనెక్టివిటీ సమస్యలు మొదలైనవి ఇందుకు కారణమని నివేదిక వివరిచింది. కొత్తగా జోడించిన సౌర విద్యుదుత్పత్తి సామరŠాధ్యల్లో భారీ ప్రాజెక్టుల వాటా 77.2 శాతంగాను, రూఫ్టాప్ సోలార్ వాటా 22.8 శాతంగాను ఉన్నట్లు పేర్కొంది. భారీ స్థాయి సోలార్ విద్యుత్ సామరŠాధ్యలు అత్యధికంగా రాజస్థాన్కి ఉండగా, కర్ణాటక, గుజరాత్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
మూసిన బొగ్గు గనుల్లో తరగని విద్యుత్..?
సంప్రదాయేతర విధానాల్లో కరెంటును ఉత్పత్తి చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. దేశీయంగా విద్యుత్తులో అధికంగా థర్మల్ కేంద్రాల నుంచే ఉత్పత్తి అవుతోంది. జల, అణు, గ్యాస్, సౌర, పవన తదితర వనరుల నుంచీ కరెంటు అందుతోంది. థర్మల్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కోసం బొగ్గును మండించడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. అందువల్ల సౌర, పవన తదితర సంప్రదాయేతర కరెంటు ఉత్పత్తిని పెంచుతూ, థర్మల్ కేంద్రాలను క్రమంగా తగ్గించాలని కేంద్రం ఆశిస్తోంది. ఇప్పటికే మూసివేసిన బొగ్గు గునులను రెన్యూవబుల్ ఎనర్జీ తయారీకి వాడుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. సోలార్ పార్క్లు, కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా కరెంట్ ఉత్పత్తి పెంచాలని చూస్తోంది. విజన్ 2047 లో భాగంగా గ్రీన్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవ్వాలని చూస్తున్న ప్రభుత్వం ఇందుకోసం వివిధ చర్యలు తీసుకుంటోంది. సుమారు రూ.30 వేల కోట్ల పెట్టుబడులతో వివిధ పనులు నిర్వహించాలని చూస్తోంది. ఇందులో కోల్ ఇండియా రూ.24 వేల కోట్లు సమకూర్చనుందని కొందరు అధికారులు తెలిపారు. మిగిలిన రూ.6 వేల కోట్ల కోసం ప్రైవేట్ సెక్టార్ సహకారం తీసుకోనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్ ధర.. ఎంతంటే.. కోల్ గ్యాసిఫికేషన్ (కోల్ను ఫ్యూయల్ గ్యాస్గా మార్చడం) వంటి సస్టయినబుల్ విధానాలతో పర్యావరణానికి హాని కలిగించకుండా చూస్తామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇటీవల అన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా సేకరించిన ఫ్యూయల్ గ్యాస్ను హైడ్రోజన్, మీథేన్, మిథనాల్, ఇథనాల్ వంటి ఇంధనాల తయారీ కోసం వాడుకోవచ్చని తెలిపారు. కోల్ గ్యాసిఫికేషన్ కోసం రూ.6 వేల కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్కు ప్రభుత్వ అనుమతి రావాల్సి ఉందని చెప్పారు. నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ ప్లాన్ కింద 2030 నాటికి 10 కోట్ల టన్నుల కోల్ను గ్యాస్గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. -
పవర్ ‘ఫుల్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ సామర్థ్యం పెరగడం ద్వారా ప్రజలకు, రైతులకు మరింత నాణ్యమైన విద్యుత్ అందనుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. మంగళవారం రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి ఆయన వర్చువల్ విధానంలో 16 సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన, 12 సబ్స్టేషన్లకు ప్రారంభోత్సవం చేశారు. కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, సత్యసాయి, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలోని 28 ప్రాంతాల్లో 132/33 కేవీ, 220/132 కేవీ, 400/220 కేవీ, 400/132 కేవీ సామర్థ్యాలతో ఈ సబ్స్టేషన్లుఏర్పాటవుతున్నాయి. వీటితో పాటు కడపలో 750 మెగావాట్లు, అనంతపురంలో 100 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో హెచ్పీసీఎల్తో రూ.10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుపై సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్పీసీఎల్) ఎండీ అండ్ సీఈఓ ఎం.కమలాకర్ బాబు, హెచ్పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శువేందు గుప్తా ఒప్పంద పత్రాలను అందుకున్నారు. వీటన్నింటి వల్ల రానున్న రోజుల్లో వేగంగా అడుగులు ముందుకు పడి మరిన్ని ఉద్యోగ అవకాశాలతో పాటు రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సామర్థ్యం మెరుగు పడుతుందని సీఎం అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే.. సరికొత్త అడుగులు.. నాణ్యమైన వెలుగులు ► 19 జిల్లాల్లో విద్యుత్ పంపిణీ సామర్థ్యాన్ని పెంచుతూ రూ.620 కోట్లతో 12 సబ్స్టేషన్లను ప్రారంభిస్తున్నాం. రూ.2,479 కోట్లతో మరో 16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేస్తున్నాం. మొత్తంగా సుమారు రూ.3,099 కోట్ల పెట్టుబడులతో మంచి కార్యక్రమం జరుగుతోంది. కొత్తగా వస్తున్న ఈ 28 సబ్ స్టేషన్లలో 200 మందికి ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. మరోవైపు రూ.3,400 కోట్లతో దాదాపు 850 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నాం. వీటి వల్ల 1,700 ఉద్యోగాలు వస్తున్నాయి. వీటిన్నింటి కోసం దాదాపు రూ.6,500 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. ►ఇటీవల గోదావరి ముంపునకు గురైన చింతూరు, వీఆర్పురం, కూనవరం, ఎటపాక తదితర విలీన మండలాల్లో తిరిగినప్పుడు సబ్స్టేషన్లు లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని అక్కడి ప్రజలు చెప్పారు. ఆ సమస్యను పరిష్కరిస్తూ.. అక్కడ వాటి నిర్మాణాలు ప్రారంభిస్తూ, నిర్మించిన వాటిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తున్నాం. ► ట్రాన్స్మిషన్ కెపాసిటీని విస్తరించుకుంటూ ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకు నాణ్యమైన విద్యుత్ను ఇచ్చే పరిస్థితిని, వ్యవస్థను క్రియేట్ చేస్తున్నాం. రైతులకు 9 గంటల పాటు పగటిపూటే ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టాం. ఇది చేయాలంటే కెపాసిటీ సరిపోదని, ట్రాన్స్మిషన్ కెపాసిటీ అభివృద్ధి చేయాలని అధికారులు చెప్పారు. అందుకోసం రూ.1,700 కోట్లతో ఫీడర్లను ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన విద్యుత్ను పగటిపూటే ఇస్తున్నాం. 25 ఏళ్లపాటు ఢోకా ఉండదు ► రైతులకు ఉచిత విద్యుత్ను స్థిరంగా ఇవ్వడానికి యూనిట్ రూ.2.49తో సోలార్ పవర్ను అందుబాటులోకి తీసుకొచ్చే గొప్ప అడుగు పడింది. దాదాపు 17 వేల మిలియన్ యూనిట్లకు సెకీతో ఒప్పందం చేసుకున్నాం. వ్యవసాయ విద్యుత్కు కావాల్సిన 13 వేల మిలియన్ యూనిట్లు పగటిపూటే, మరో 25 ఏళ్లపాటు ఉండేలా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. ప్రస్తుతం యూనిట్ సగటు ధర రూ.5.30 పడే పరిస్థితులుంటే రూ.2.49కే యూనిట్ ధర వచ్చే పరిస్థితుల్లోకి అడుగులు వేస్తున్నాం. దీనివల్ల 2024 సెప్టెంబర్కు 3 వేల మెగావాట్లు, 2025 సెప్టెంబర్ నాటికి మరో 3 వేల మెగావాట్లు, 2026 సెప్టెంబర్ నాటికి మరో 1000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. ► అవేరా స్కూటర్స్ తయారీ సంస్థ ఇప్పటికే 25 వేల స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభించి విజయవాడలో నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టు లక్ష స్కూటర్ల ఉత్పత్తి దిశగా సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. దీనికి సంబంధించి రూ.100 కోట్లతో విస్తరణ ప్రాజెక్టుకు ఈ రోజు శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఈ కంపెనీలో 100 మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఉన్నాయి. తాజా పెట్టుబడి వల్ల అదనంగా మరో 200 ఉద్యోగాలు వస్తాయి. ► 500 మెగావాట్లు సోలార్ ప్లాంట్, మరో 500 మెగావాట్ల పవన విద్యుత్, 250 మెగావాట్ల పీఎస్పీ, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ (100 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్)తో కలిపి రూ.10 వేల కోట్లకు సంబంధించి హెచ్పీసీఎల్తో ఎంఓయూ కుదుర్చుకున్నాం. దీనివల్ల దాదాపు మరో 1500 మందికి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాజెక్టుల వల్ల కాలుష్య రహిత క్లీన్ ఎనర్జీ అందుబాటులోకి వచ్చి, రాష్ట్ర ప్రగతిని మరింత పెంచే పరిస్థితి రావాలని మనసారా కోరుకుంటున్నాను. ► ఈ కార్యక్రమంలో సీఎస్ డాక్టర్ కెఎస్జవహర్రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, ఏపీ ట్రాన్స్కో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ జేఎండీ బి.మల్లారెడ్డి, హెచ్పీసీఎల్ డైరెక్టర్ అమిత్ గార్గ్, హెచ్పీసీఎల్, ఆయానా, స్ప్రింగ్ అగ్నిత్రా, సోలార్ ఎనర్జీ ఏపీ సిక్స్ ప్రై వేట్ లిమిటెడ్, అవేరా ఏఐ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు గత నాలుగున్నరేళ్లలో రాష్ట్ర విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టాం. అక్టోబర్ ఆఖరు వరకు 39.64 లక్షల మంది లబ్ధిదారులకు (అగ్రికల్చర్, ఆక్వా, పశు సంవర్థక, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఇతరులు) రూ.46,581 కోట్ల సబ్సిడీ అందించాం. జగనన్న హౌసింగ్ కాలనీలకు ఐదు లక్షల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం. చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 1.25 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఈ ఏడాది అదనంగా నిర్ణీత కాలపరిమితిలో మంజూరు చేశాం. వ్యవసాయ విద్యుత్ కోసం ‘సెకీ’తో తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నాం. స్మార్ట్ మీటర్స్ వల్ల రైతులకు మరింత మేలు జరుగుతుంది. విశాఖ పెట్టుబడుల సదస్సులో జరిగిన ఒప్పందాల ప్రకారం రూ.52,015 కోట్లు గ్రౌండ్ అయ్యాయి. వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోంది. 12,586 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. సీఎం చిత్తశుద్ధితోనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంధన శాఖ మంత్రి -
సహజ వెలుగులను ఇలా కొనండి
సాక్షి, అమరావతి: సౌర, పవన, జలవిద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచడంలో భాగంగా పునరుత్పాదక ఇంధన కొనుగోలు బాధ్యత నిబంధనలు–2022ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం గెజిట్ విడుదల చేసింది. ఈ ఏడాది నుంచి 2026–27 వరకు విద్యుత్ సంస్థలు వినియోగించే విద్యుత్లో ఎంతమేర పునరుత్పాదక విద్యుత్ ఉండాలనేది ఈ నిబంధనల్లో సూచించింది. గెజిట్ విడుదలైన నాటినుంచే నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. దీనిప్రకారం సహజ విద్యుత్ను వినియోగించని డిస్కంలు ఎనర్జీ సర్టిఫికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
జలాశయాలపై భారీగా సౌర విద్యుత్ ప్రాజెక్టులు!
సాక్షి, హైదరాబాద్: ‘తప్పనిసరి పునరుత్పాదక విద్యుత్ (ఆర్పీవో) కొనుగోళ్ల’ విషయంగా కేంద్రం భారీ లక్ష్యాలు పెట్టిన నేపథ్యంలో.. సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని వివిధ రిజర్వాయర్లపై ఐదు వేల మెగావాట్ల సామర్థ్యంతో ‘ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల’ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు, లోయర్ మానేరు వంటి జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్రెడ్కో), నీటిపారుదల శాఖ చర్చలు జరుపుతున్నాయి. అయితే ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని నీటిపారుదల శాఖ అధికారవర్గాలు తెలిపాయి. రామగుండంలో ఫ్లోటింగ్ ప్రాజెక్టు రాష్ట్రంలో ఇప్పటికే రామగుండంలో ఎన్టీపీసీ, జైపూర్లో సింగరేణి సంస్థలు తమ థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు నీటిని సరఫరా చేసే జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్లను నిర్మించాయి. రామగుండంలోని 500 ఎకరాల జలాశయంపై ఎన్టీపీసీ 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను నిర్మించింది. అదే మల్లన్నసాగర్ జలాశయం 22 వేల ఎకరాల్లో ఉంటుంది. మిగతా జలాశయాలూ భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని రిజర్వాయర్లపై 5 వేల మెగావాట్ల మేర సౌర విద్యుత్ ప్లాంట్లను స్థాపించవచ్చని నీటి పారుదల శాఖ వర్గాలు భావిస్తున్నాయి. వీటి ఏర్పాటుతో స్థలం అద్దె రూపంలో నీటి పారుదల శాఖకు ఆదాయం కూడా వస్తుందని పేర్కొంటున్నాయి. మరోవైపు కాళేశ్వరం వంటి భారీ లిఫ్టులకు చౌకగా విద్యుత్ లభిస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. భూసేకరణ సమస్య తప్పుతుంది! భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు వేల ఎకరాల భూములు అవసరం. రాష్ట్రంలో భూముల కొరత తీవ్రంగా ఉంది. ధరలూ భారీగా పెరిగిపోయాయి. సౌర విద్యుత్ ప్రాజెక్టులకు భారీగా భూసేకరణ జరపడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమయ్యే పనికాదు. భారీ వ్యయంతో భూములు కొని సోలార్ ప్లాంట్లు పెట్టినా దానివల్ల పెట్టుబడి వ్యయం పెరిగి.. విద్యుత్ ధరలు భారీగా పెరిగిపోతాయి. అదే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లతో భూసేకరణ సమస్య తప్పుతుందని, విద్యుత్ ధర తక్కువగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో టెండర్లు ఆహ్వానించి ప్లాంట్ల ఏర్పాటు బాధ్యతను ప్రైవేటు డెవలపర్లకు అప్పగించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. -
విచిత్రమైన తలపాగ.. ఫ్యాన్ హెల్మెట్ ధరించిన వ్యక్తి: వీడియో వైరల్
సృజనాత్మకతకు కాసింత మేథస్సును జోడించి కొత్త కొత్త ఆవిష్కరణలను సృష్టించిన వారెందరో ఉన్నారు. ఇలాంటి ఆవిష్కరణలు తాము ఎదర్కొంటున్న సమస్యల నుంచి పుట్టుకొచ్చినవే. అచ్చం అలానే ఇక్కడొక సామాన్య వ్యక్తి తన సమస్యకు చెక్పెట్టే ఒక వినూత్న ఆవిష్కరణకు నాంది పలికాడు. వివరాల్లోకెళ్తే....ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక బాబాజీ ఫ్యాన్తో కూడిన హెల్మట్ని ధరించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంతకీ ఎందుకలాగా అంటే..ఆయన ఎండలో వెళ్లినప్పడూ ఉక్కపోతను భరించలేక ఇబ్బందులు పడేవారు. అదీగాక సాధువులు, బాబాజీలు పాదాచారులగా బిక్షటన చేసి జీవిస్తుంటారు. అలా వారికి నచ్చిన ప్రాంతాలకు తరలిపోతూ...ఇక అక్కడే ఏ ఆశ్రమాలకో వెళ్లి జపాలు, ధ్యానాలు వంటివి చేస్తుంటారు. అందరికి తెలిసిందే. ఆ క్రమంలో ఆ బాబాజీ పాదాచారిగా వెళ్తుంటే బయట ఎండ ధాటికి తట్టుకోలేక ఒక వినూత్న ఆవిష్కరణకు తెరలేపారు. అదే సోలార్ శక్తితో పనిచేసే ప్యాన్ హెల్మట్. ఆ వ్యక్తి ఒక హెల్మట్కి ఫ్యాన్, సోలార్ ప్లేట్ అమర్చి హెల్మట్ మాదిరిగా ధరించాడు. చూసేందుకు తలపాగ మాదిరిగా ఉంది. ఎంతటి ఎండలోనైనా హాయిగా చల్లటి గాలిని ఆశ్వాదిస్తూ వెళ్లేలా రూపొందించాడు. జనాలు కూడా ఆ బాబా తెలివికి మంత్రముగ్దులయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. देख रहे हो बिनोद सोलर एनर्जी का सही प्रयोग सर पे सोलर प्लेट और पंखा लगा के ये बाबा जी कैसे धूप में ठंढी हवा का आनंद ले रहे है ! pic.twitter.com/oIvsthC4JS — Dharmendra Rajpoot (@dharmendra_lmp) September 20, 2022 (చదవండి: ట్రాఫిక్లో చిక్కుకుపోవడం వల్లే లవ్లో పడ్డా: లవ్ స్టోరీ వైరల్) -
దేశంలో రికార్డ్ స్థాయిలో సౌర వెలుగులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో రికార్డు స్థాయిలో 7.2 గిగావాట్ల సౌర విద్యుత్ తోడైంది. 2021 సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 59 శాతం వృద్ధి అని మెర్కామ్ ఇండియా రిసర్చ్ తెలిపింది. భారత సౌర విద్యుత్ మొత్తం సామర్థ్యం ప్రస్తుతం 57 గిగావాట్లకు చేరుకుంది. ‘గతేడాది జనవరి–జూన్లో 4.5 గిగావాట్ల సౌర విద్యుత్ కొత్తగా జతకూడింది. 2022 ఏప్రిల్–జూన్లో 59 శాతం అధికమై 3.9 గిగావాట్లు తోడైంది. 2022 జనవరి–జూన్లో, అలాగే జూన్ త్రైమాసికంలో ఈ రంగంలో అత్యధిక సామర్థ్యం జతకూడింది. సరఫరా పరిమితులు, పెరుగుతున్న ఖర్చులతో అధిక సవాళ్లు ఉన్నప్పటికీ సౌరశక్తి విషయంలో భారత్ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని మెర్కామ్ క్యాపిటల్ గ్రూప్ సీఈవో రాజ్ ప్రభు తెలిపారు. ఏప్రిల్–జూన్లో 9 గిగావాట్ల ప్రాజెక్టుల కోసం వివిధ ప్రభుత్వ సంస్థలు టెండర్లను పిలిచాయి. 2021తో పోలిస్తే ఇది 8 శాతం వృద్ధి. 2022 ఏప్రిల్ 1 నుంచి సోలార్ మాడ్యూల్స్పై 40, సోలార్ సెల్స్పై 25 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అమలవుతోంది. దీంతో వీటి ధరలు గణనీయంగా పెరిగాయని ఆయన చెప్పారు. చదవండి: మా రేంజ్ అంతే.. డాక్టర్లకు వల-వెయ్యి కోట్ల తాయిలాలపై డోలో 650 తయారీ కంపెనీ స్పందన -
సౌరశక్తి ఉత్పాదనలో మెట్రో రైల్ సూపర్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు సౌరశక్తి ఉత్పాదనలో ఆదర్శంగా నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణకు బాటలు వేస్తోంది. కర్భన ఉద్గారాలను తగ్గించే కృషిలో ముందుంటోంది. ప్రస్తుతం 28 మెట్రో స్టేషన్ల పైకప్పులు, ఉప్పల్, మియాపూర్ డిపోల్లోని ఖాళీ ప్రదేశాల్లో 8.35 మెగావాట్ల క్యాప్టివ్ సోలార్ పవర్ను ఉత్పత్తి చేస్తుండడం విశేషం. మెట్రో స్టేషన్లు, కార్యాలయాల్లో ఉపయోగించే విద్యుత్ అవసరాల్లో సుమారు 15 శాతం సౌరశక్తి ద్వారానే పొందుతున్నట్లు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ వర్గాలు తెలిపాయి. ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి.. ► సంప్రదాయేతర ఇంధన వనరులపై మెట్రో దృష్టి సారించింది. ఇప్పటికే మెట్రో రైళ్లలో బ్రేకులు వేసినపుడు ఉత్పన్నమయ్యే బలంతో విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థను ఉపయోగిస్తుండడం విశేషం. సౌరశక్తి, రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థలను ఉపయోగిస్తున్నందుకు 20 మెట్రో స్టేషన్లకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందాయి. ► లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ ప్లాటినం సర్టిఫికెట్ను కూడా మెట్రో సాధించింది. మెట్రో స్టేషన్లలో 100 శాతం సౌరవెలుగును ఉపయోగించుకోవడం,క్రాస్ వెంటిలేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇంధన వినియోగాన్ని పరిమిత మోతాదులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఉప్పల్, మియాపూర్ డిపోల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు 150 భారీ ఇంకుడు గుంతలను నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసింది. ఆయా ప్రాంగణాల్లో వర్షపునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టింది. పలు అవార్డుల పంట.. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం కారణంగా నగర మెట్రోకు పలు అవార్డులు వరించాయి. గతేడాది తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీ అవార్డ్(2021) దక్కింది. ఇక తాజాగా ఎక్సలెన్స్ ఇన్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ మెట్రో సిస్టం బై రైల్ అనాలిసిస్ ఇండియా(2022) అవార్డు వరించింది. (క్లిక్: ఇక వీకెండ్ షీ టీమ్స్.. ఈ ప్రాంతాల్లో ఫోకస్) మూడు లక్షల మార్కును దాటిన ప్రయాణికుల సంఖ్య.. ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్– ఎంజీబీఎస్, నాగోల్– రాయదుర్గం మార్గాల్లో నిత్యం మూడు లక్షల మంది జర్నీ చేస్తున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. మే నెలలో అధిక ఎండల కారణంగా చాలా మంది ప్రయాణికులు మెట్రో జర్నీకి మొగ్గు చూపడం విశేషం. -
ఒక్కోమెట్టు ఎక్కుదాం.. గమ్యాన్ని చేరుకుందాం
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు ఆనంద్ మహీంద్రా. దేశవ్యాప్తంగా మరుగన పడిపోయిన ప్రతిభావంతులు, స్ఫూర్తిని అందించే ఘటనలు చోటు చేసుకునప్పుడు ట్విటర్ వేదికగా వాటికి మరింత ప్రచారం కల్పిస్తుంటారు. ఈ క్రమంలో కల్లోల కశ్మీరానికి సంబంధించిన ఆసక్తికర అంశాలను మనతో పంచుకున్నారు. జమ్ము కశ్మీర్లోని పల్లి పంచాయితీ దేశంలోనే తొలి సోలార్ విద్యుత్ గ్రామ పంచాయితీగా మారి రికార్డు సృష్టించింది. ఇక్కడ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సోలార్ పలకలు ఏర్పాటు చేసుకున్నారు. వీటి ద్వారా గ్రామానికి అవసరమైన విద్యుత్ని సమకూర్చుకుంటున్నారు. ఈ విషయాన్ని ట్విటర్లో గమనించిన ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. పల్లి గ్రామ పంచాయతీ తరహాలో పంచాయతీ తర్వాత పంచాయతీ లక్ష్యంగా పని చేసుకుంటూ పోతే కాలుష్య రహితంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. That’s how to battle climate change and become carbon neutral: Step by step, Panchayat by Panchayat…👏🏼👏🏼👏🏼 https://t.co/vjDcMQ0p2U — anand mahindra (@anandmahindra) April 27, 2022 చదవండి: నేను తర్వాత కొనేది అదే.. ఎలన్ మస్క్ మరో సంచలన ప్రకటన -
సౌర వెలుగులు.!
మదనపల్లె సిటీ: రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ దృష్ట్యా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం సౌరవిద్యుత్పై దృష్టి సారించింది. ప్రధానంగా ప్రభుత్వ సంస్థల్లో సౌర విద్యుత్ను వినియోగించేలా అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో మదనపల్లె ఆర్టీసీ –1, 2 డిపోలు, గ్యారేజీలు, బస్స్టేషన్, జెడ్పీహైస్కూల్ ప్రాంగణాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. వీటిద్వారా వస్తున్న విద్యుత్ను ఆ సంస్థలు సమర్థవంతంగా వినియోగించుకుంటూ నెలనెలా వస్తున్న కరెంటు బిల్లుల నుంచి ఉపశమనం పొందాయి. మదనపల్లెలో సౌర వెలుగులపై ప్రత్యేక కథనం. మదనపల్లె ఆర్టీసీ డిపోలు.. తన ఆస్తులను మరింత సమర్థవంతంగా సద్వి నియోగం చేసుకునే వ్యూహంలో భాగంగాఆర్టీసీ సౌర విద్యుత్ బాట పట్టింది. బస్ స్టేషన్, డిపోలు, గ్యారేజీ భవనాలపై సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పారు. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో నాలుగు డిపోలను ఎంపిక చేశారు. అందులో భాగంగా 2018లో మదనపల్లె ఆర్టీసీ డిపోలో సోలార్ ప్లాంటును ఏర్పాటు చేశారు. 100 కిలో వాట్ల సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేశారు. ఇందు కోసం రూ.37 లక్షల వరకు వెచ్చించారు. ప్లాంటు ద్వారా నెలకు 10 వేల యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. సుమిత్ సంస్థ టెండర్ ద్వారా ఆర్టీసీకి 25 ఏళ్లపాటు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తోంది. వీటి ద్వారా బస్స్టేషన్, రెండు డిపో కార్యాలయాలు, గ్యారేజీలో సోలార్ విద్యుత్ను వినియోగిస్తున్నారు. 1, 2 డిపో కార్యాలయాలపై 326 పలకలను ఏర్పా టు చేశారు. గతంలో విద్యుత్ బిల్లు నెలకు రూ.1.50 లక్ష వరకు వచ్చేది. సోలార్ ప్లాంటు ఏర్పాటు చేసిన తరువాత నెలకు సరాసరి రూ.40–50 వేలు బిల్లు వస్తోంది. సగటున నెలకు రూ.లక్ష వరకు ఆదా అవుతోంది. గత 5 సంత్సరాలుగా సోలార్ ప్లాంటు విజయవంతంగా నడుస్తోంది. ఇతర డిపోల్లో ఏర్పాటుకు సన్నాహాలు మదనపల్లె ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంటు సక్సెస్ కావడంతో రాష్ట్రంలోని అన్ని డిపోల్లో ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. త్వరలో అన్ని డిపోల్లో ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టారు. పూర్వ విద్యార్థి సహకారం.. జెడ్పీ పాఠశాలకు వరం పలమనేరు మండలం మొరం గ్రామానికి చెందిన రవిసుబ్రమణ్యం ఖతర్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన చిన్నప్పుడు మదనపల్లెలో చదువుకున్నాడు. ఆయనకు విద్యబోధించిన ఉపాధ్యాయుడు ఫణీంద్ర ప్రస్తుతం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. గత ఏడాది మదనపల్లెకు వచ్చినప్పుడు తన గురువును కలిసి సన్మానం చేయాలనుకున్నాడు. దీనికి ఉపాధ్యాయుడు నిరాకరించి పాఠశాలలో సోలార్ ప్లాంటు ఏర్పాటు చేయాలని కోరాడు. ఆయన అభ్యర్థన మేరకు రూ.4.50 లక్షల వ్యయంతో సోలార్ ప్లాంట్ను గత ఏడాది మార్చి నెలలో ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ 60 యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేలా 50 సోలార్ పలకలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా సరఫరా అయ్యే విద్యుత్ను పాఠశాలలోని 55 గదుల్లో ఫ్యాన్లు, లైట్లకు వినియోగించేలా వైరింగ్ చేశారు. పాఠశాల ఆవరణంలో తాగునీటి కోసం బోరు కూడా వినియోగిస్తున్నారు. గతంలో నెలకు రూ. 15 వేలు నుంచి 18 వేలు వరకు వచ్చే బిల్లు ప్రస్తుతం రూ.2 వేలు లోపే వస్తోంది. పాఠశాలలోని తరగతి గదులు, ల్యాబ్లు, గ్రంథాలయం, కార్యాలయంతో పాటు అవసరం ఉన్నచోట్ల సౌర విద్యుత్నే వినియోగిస్తున్నారు. సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రోత్సాహం సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ప్రణాళికల్లో భాగంగా మదనపల్లె డిపోలోని బస్స్టేషన్పై సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేశారు. దీని వల్ల ఆర్టీసీకి నెలకు రూ. లక్ష వరకు ఆదా అవుతోంది. –వెంకటరమణారెడ్డి, వన్ డిపో మేనేజర్.మదనపల్లె దాతలు ముందుకు రావాలి మా పాఠశాలలో 2,138 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఖతర్లో పని చేసే రవిసుబ్రమణ్యం సోలార్ప్లాంటు ఏర్పాటు చేయడం అభినందనీయం. దాతలు ముందుకు వస్తే మరింత అభివృద్ధి చెందుతుంది. –రెడ్డె్డన్నశెట్టి, హెచ్ఎం, జెడ్పీ ఉన్నత పాఠశాల, మదనపల్లె -
కలియుగ వైకుంఠంలో సౌరకాంతులు
సాక్షి, అమరావతి: కలియుగ వైకుంఠంగా పిలిచే ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో సౌరకాంతులు వెలుగులు విరజిమ్మనున్నాయి. తిరుపతి దేవాలయం కోసం సౌర ఫొటోవోల్టాయిక్ పవర్ ప్రాజెక్టులను స్థాపించడానికి ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్ (ఎన్వీవీఎన్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. తిరుపతి, తిరుమల కొండలపై అనేక ప్రదేశాల్లో సోలార్ పవర్ ప్లాంట్లను ఎన్వీవీఎన్ నిర్మిస్తుంది. వీటినుంచి ఉత్పత్తయ్యే సౌరశక్తిని టీటీడీ కొనుగోలు చేస్తుంది. 25 ఏళ్లకు ఎన్టీపీసీకి భూమి ఇవ్వనున్న టీటీడీ ఎన్వీవీఎన్ ఇప్పటికే టీటీడీ అధికారులతో అనేక సమావేశాలు నిర్వహించింది. ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలాలను పరిశీలించింది. అనంతరం తమ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపిందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టుల స్థాపనకు కావాల్సిన భూమిని 25 ఏళ్లకు టీటీడీ సమకూరుస్తుంది. తిరుమల ఆలయానికి విద్యుత్ అవసరాలను గ్రీన్ ఎనర్జీ ద్వారా తీర్చాలని టీటీడీ భావిస్తోంది. శేషాచలం కొండ శ్రేణుల్లోని ధర్మగిరిపై 25 ఎకరాల్లో సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి దాని నుంచి ఐదు మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి ఆలయ నిర్వాహకులు గతేడాది ప్రణాళిక రూపొందించారు. ఒప్పందం అనంతరం ఈ ప్రాజెక్టుకు అయ్యే మూలధన వ్యయాన్ని ఎన్వీవీఎన్ భరిస్తుంది. సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను 25 ఏళ్లపాటు టీటీడీ కొనుగోలు చేస్తుంది. కొనుగోలు ధర యూనిట్కు రూ.3 కంటే తక్కువ ఉండే అవకాశం ఉంది. అయితే ఉత్పత్తి చేసిన విద్యుత్కు చెల్లించాల్సిన ధరను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) నిర్ణయిస్తుంది. మొదలైన ఇంధన సామర్థ్య చర్యలు తిరుమల ఆలయాన్ని ఇంధన సామర్థ్య కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తామని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) గతేడాది ప్రకటిం చింది. ఇప్పటికే ఉన్న పంపుసెట్లు, ఎయిర్ కండిషనర్లు, సీలింగ్ ఫ్యాన్లను మార్చాల్సిన అవసరాన్ని ప్రాథమిక ఆడిట్ ద్వారా గుర్తించింది. దీనివల్ల ఆలయానికి ఏటా రూ.4.5 కోట్లు ఆదా అవనుంది. న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ)తో కలిసి పలు ఏజెన్సీలు తమ పరిధిలోని కళాశాలలు, పాఠశాలలు, ఆలయ భవనాల్లో రూఫ్టాప్ సోలార్ సిస్టంలను ఏర్పాటు చేయాలని టీటీడీ ప్రయత్నిస్తోంది. -
పీపీఏ ధరలను సవరించే అధికారం ఈఆర్సీకి లేదు
సాక్షి, అమరావతి: అత్యంత పారదర్శకంగా, చట్ట నిబంధనలకు అనుగుణంగా జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏలను) సమీక్షించి, వాటి ధరలను సవరించే అధికారం విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి లేదని సౌరవిద్యుత్ సంస్థల న్యాయవాదులు హైకోర్టులో చెప్పారు. ప్రభుత్వం మారినప్పుడల్లా పీపీఏలను సమీక్షిస్తూ పోతుంటే పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వాలపై విశ్వాసం సన్నగిల్లుతుందని, దీని ప్రభావం పెట్టుబడులపై ఉంటుందని పేర్కొన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన సౌరవిద్యుత్కు యూనిట్కు రూ.2.44 చెల్లించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సౌరవిద్యుత్ ఉత్పత్తి కంపెనీలు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అప్పీళ్లపై ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. సౌరవిద్యుత్ సంస్థల న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ.. పీపీఏల కింద ధరలను ఖరారు చేసేది ఈఆర్సీయేనని, ఆ సంస్థ ఖరారు చేసిన ధరలను తిరిగి ఆ సంస్థే సవరించడానికి అవకాశంలేదని చెప్పారు. పీపీఏ నిబంధనల ప్రకారం ధరలను సవరించే అధికారం విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కం) లేదని, దీంతో అవి ఈఆర్సీ ముందు పిటిషన్ వేసి దాని ద్వారా ధరలను సవరించాలని చూస్తున్నాయని తెలిపారు. ఈ వాదనలను డిస్కంల తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ తోసిపుచ్చారు. ధరలను సవరించే అధికారం ఈఆర్సీకి ఉందన్నారు. అందుకే పీపీఏ ధరలను ఈఆర్సీ వద్దే తేల్చుకోవాలని సింగిల్ జడ్జి స్పష్టం చేశారని చెప్పారు. కోర్టు సమయం ముగియడంతో పూర్తిస్థాయి వాదనల నిమిత్తం ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. -
విశాఖలో హైడ్రోజన్ ఎనర్జీ ప్రాజెక్టు
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అతి పెద్దదైన, దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టు మన రాష్ట్రంలో ఏర్పాటుకానుంది. విశాఖపట్నంలోని సింహాద్రి పవర్ ప్లాంట్లో స్టాండలోన్ ఫ్యూయల్–సెల్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ మైక్రోగ్రిడ్ ప్రాజెక్టును నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) లిమిటెడ్ స్థాపించబోతోంది. విద్యుదుత్పత్తికి అవసరమైన చమురులో 85 శాతం, గ్యాస్లో 53 శాతం దిగుమతి చేసుకునే మన దేశంలో ఈ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఓ గేమ్చేంజర్ కానుందని ఎన్టీపీసీ వర్గాలు చెబుతున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ కొనుగోలు తప్పనిసరి? స్వచ్ఛమైన ఇంధనాలను ప్రోత్సహించడానికి.. ఎరువుల కర్మాగారాలు, చమురు శుద్ధి కర్మాగారాలు గ్రీన్ హైడ్రోజన్ను కొనుగోలు చేయడాన్ని తప్పనిసరి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా పవన, సౌర వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా శక్తినిచ్చే ఎలక్ట్రోలైజర్ను ఉపయోగించి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్గా విభజించడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే ప్రాజెక్టును రాష్ట్రంలో ఎన్టీపీసీ ద్వారా స్థాపించనుంది. దేశంలో ఇంధన భద్రతా చర్యల్లో భాగంగా నాలుగు గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ సామర్థ్యాన్ని సాధించడానికి త్వరలో కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలవనుంది. సింహాద్రి థర్మల్ కేంద్రం సమీపంలో ఉన్న ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు (నీటిలో తేలియాడే సౌర ఫలకలు) నుండి ఇన్పుట్ పవర్ తీసుకోవడం ద్వారా 240 కిలోవాట్ల సాలిడ్ ఆక్సైడ్ ఎలక్ట్రోలైజర్ ఉపయోగించి హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తారు. సూర్యరశ్మి సమయంలో ఉత్పత్తి చేసిన ఈ హైడ్రోజన్ను అధిక పీడనం వద్ద నిల్వచేస్తారు. 50 కిలోవాట్ల సాలిడ్ ఆక్సైడ్ ఇంధన కణాన్ని ఉపయోగించి విద్యుదీకరిస్తారు. ఇది సా.5 నుండి ఉ.7 వరకు స్వతంత్రంగా పనిచేస్తుంది. ఇక దేశంలో మరికొన్ని హైడ్రోజన్ శక్తి నిల్వ ప్రాజెక్టులను స్థాపించడానికి అవసరమైన అధ్యయనానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది. లద్దాఖ్తో ఒప్పందం గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కోసం కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్తో ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (ఆర్ఈఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు డీజిల్ జనరేటర్లపై ఆధారపడిన లద్దాఖ్, జమ్మూ–కశ్మీర్ వంటి దేశంలోని సుదూర ప్రాంతాలను డీకార్బోనైజ్ చేయడానికి ఈ ప్రాజెక్టు నమూనా కానుంది. 2070 నాటికి లద్దాఖ్ను కార్బన్ రహిత భూభాగంగా మార్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే మన రాష్ట్రంలో హైడ్రోజన్ ప్రాజెక్టును ఎన్టీపీసీ పైలెట్ ప్రాజెక్టుగా స్థాపిస్తోంది. -
అప్పుడేమో ఘనం! ఇప్పుడేమో ఇలా..
ధరణి.. బిహార్ రాష్ట్రంలో ఓ కుగ్రామం. అయితేనేం అరుదైన ఘనత ద్వారా వార్తల్లోకి ఎక్కింది. సోలార్ మినీ గ్రిడ్స్లో బిహార్లోనే తొలి సోలార్ గ్రామం ఘనతను ధరణి సాధించింది. కానీ, ఆ ముచ్చట కొన్నాళ్లు మాత్రమే కొనసాగింది. 2014 ఆగష్టులో బిహార్ సీఎం నితీశ్ కుమార్ జెహానాబాద్ జిల్లా ధరణి గ్రామం ఈ సోలార్ ప్రాజెక్టును లాంఛ్ చేశారు. ముప్ఫై ఏళ్లపాటు అంధకారంలో ఉన్న గ్రామంలో సోలార్ వెలుగులు సొగసులబ్బాయి. కానీ, కేవలం మూడేళ్లపాటే సోలార్ విలేజ్గా కొనసాగింది. ఆ తర్వాత మెయింటెన్స్ లేకపోవడంతో సోలార్ గ్రిడ్ పని చేయకుండా పోయింది. అప్పటి నుంచి ఆ సెటప్ అంతా మూలన పడిపోయింది. ఇప్పుడా ప్రాజెక్టు పశువుల పాకగా మారింది. భారంగా.. ►ఈ నేపథ్యంలో సంప్రదాయ థర్మల్ పవర్కే ప్రాధాన్యం ఇచ్చారు ఆ గ్రామస్తులు. ►ఆ ఒక్క గ్రామమే కాదు.. దేశంలో ప్రభుత్వాలు చేపట్టిన సోలార్ ప్రాజెక్టుల తీరు ఇలాగే ఉంది. ►సోలార్ పవర్ను చాలా చోట్ల నకిలీ కరెంట్గా భావించడం కూడా ఒక కారణం. ప్రభుత్వాలు సోలార్ కరెంట్పై సరైన అవగాహన కల్పించడంలో విఫలం అయ్యింది. ►సోలార్తో అధిక టారిఫ్లు భారంగా మారుతున్నాయి. దీనికంటే సంప్రదాయ విద్యుత్కే టారిఫ్ రేట్లు తక్కువగా ఉండడంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ►సబ్సిడీల విషయంలో ప్రభుత్వాలు సైతం వెనుకంజ వేస్తున్నాయి. ►ప్రభుత్వాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 14 వేలకు పైగా మైక్రో, మినీ గ్రిడ్స్.. 20 లక్షల సోలార్ హోం సిస్టమ్స్కు ప్రాధాన్యత లేకుండా పోతోంది. ►ఇంటింటికి కనెక్షన్లు ఇవ్వడం మరో సమస్యగా మారుతోంది. ►చాలావరకు గ్రామపంచాయితీల్లో సోలార్ వెలుగులు కేవలం వీధి దీపాల వరకే పరిమితం అవుతున్నాయి. ► ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే సోలార్ ప్లాంట్లు సైతం నిర్వహాణ భారంగా మారడం.. పలు కారణాలతో ఈ వ్యవస్థ విఫలం వైపు అడుగులేసింది. చదవండి: రూ.15,519 కోట్ల చెల్లించిన ఎయిర్టెల్.. కారణం ఇదే -
బుందేల్ఖండ్ను నాశనం చేశారు: మోదీ
మహోబా(యూపీ): ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతాన్ని గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం చెలాయించిన నాయకులు నాశనం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఇక్కడి వనరులను, అటవీ సంపదను మాఫియాల చేతికి అప్పగించాయని దుయ్యబట్టారు. ఆయన శుక్రవారం బుందేల్ఖండ్లో రూ.3,425 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఝాన్సీలో 600 మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్కు నిర్మాణానికి పునాదిరాయి వేశారు. అలాగే స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన లైట్ కంబాట్ హెలికాప్టర్లు, మానవరహిత ఏరియల్ వెహికిల్స్ (యూఏవీలు), యుద్ధనౌకల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ను ఝాన్సీలో భారత సైనికదళాలకు అందించారు. -
సోలార్ పవరే... సో బెటరు!
ముంబై: ‘వాన రాకడ, ప్రాణం పోకడ’ జాబితాలో ‘కరెంట్’ను కూడా చేర్చారు మహారాష్ట్ర సతార జిల్లాలోని మన్యచివాడి గ్రామస్థులు. ఆ ఊళ్లో కరెంటు అనేది ఉన్నప్పటికీ ఎప్పుడు ఉంటుందో మాత్రం ఎవరికీ తెలియదు. చీకటే చీకటి! రైతుల పొలాలు దెబ్బతింటున్నాయి. వ్యాపారుల వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి. సుదీర్ఘమైన కరెంటు కోతలు భరించలేక గ్రామప్రజలు ఎక్కే గడప, దిగేగడపలా ఎన్నో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారు. ‘చూద్దాం, చేద్దాం’ అనే మాటలు తప్ప సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఇక ఇలా కాదనుకొని మహిళలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ‘ఎవరో ఇవ్వడం ఏమిటీ, కరెంట్ మనమే తయారు చేసుకుందాం’ అని ఒకరు ప్రతిపాదించినప్పుడు– ‘అవేమైనా రొట్టెలా మనమే తయారు చేసుకోవడానికి’ అని అనుకునేంత అమాయకులు కూడా ఉన్నారు. వారు సోలార్ పవర్ గురించి వినింది లేదు! రకరకాల మాటల తరువాత అందరూ సోలార్ పవర్కే ఓటు వేశారు. ఆ తరువాత సోలార్ పవర్ నిపుణులతో చర్చించారు. ఒక కార్యచరణ ప్రణాళిక రూపొందించుకున్నారు. మొదట గ్రామ వీధుల్లోకి సోలార్ పవర్ లైట్లు వచ్చాయి. ఆ తరువాత ప్రతి ఇంటికి ‘సోలార్ యూనిట్’ ఆలోచన చేశారు. అయితే ఒక్కో యూనిట్కి సుమారు ఆరువేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఊళ్లో బీదాబిక్కీ ఉంటారు కాబట్టి అంత మొత్తాన్ని అందరూ భరించే పరిస్థితి లేదు. దీంతో మహిళా స్వయం సహాయక బృందాలు ఆ ఖర్చులో ఎక్కువ భాగాన్ని భరించాయి. గ్రామపంచాయితీ, దాతలు తమ వంతుగా సహాయపడ్డారు. ఎట్టకేలకు ఊరు చీకటి నుంచి విముక్తి అయింది...‘సోలార్ గ్రామ్’గా మారింది. ఇప్పుడు ఆ ఊళ్లో కరెంటు కోత అనే మాట వినబడదు. ‘ఒకప్పుడు మా ఊరికి కోడలుగా రావడానికి భయపడేవారు. కరెంటులాంటి మౌలిక సదుపాయాలు లేని ఊరు అనే పేరు ఉండేది. గ్రామ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండేది. అయితే పవర్ అనేది గ్రామ అభివృద్ధికి ఎంత కీలకం అనే విషయం అర్ధమైంది’ అంటుంది సంగీత అనే మహిళ. ‘చీకటిని తిట్టుకుంటూ కూర్చోకు...చిరుదీపమైనా వెలిగించు’ అనే మంచిమాట ఉంది. చిరుదీపం ఏమి ఖర్మ....శక్తిమంతమైన సోలార్ దీపాన్నే వెలిగించారు గ్రామ మహిళలు. ఆ వెలుగులు ఊరకే పోలేదు. ఊరి అభివృద్ధికి గట్టి ఇంధనం అవుతున్నాయి. మన్యచివాడి ఇప్పుడు ఆదర్శ గ్రామం అయింది. ఈ చిన్న గ్రామం గురించి ఎప్పుడూ వినని వాళ్లు కూడా ఇప్పుడు గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఈ విజయానికి ప్రధాన కారణం...చిన్నా,పెద్దా తేడా లేకుండా ఊళ్లో ప్రతి ఒక్కరూ సోలార్ ప్రాజెక్ట్లో భాగం కావడం. చదవండి: ఎవరీ రాణి కమలాపతి.. ఈమె పేరును ఆ రైల్వేస్టేషన్కు ఎందుకు పెట్టారు..? -
ఒకే ప్రపంచం.. ఒకే సౌర గ్రిడ్
గ్లాస్గో: సకల జగత్తుకు సూర్యుడే మూలాధారమని... సౌర విద్యుత్తును మానవాళి విజయవంతంగా వాడుకొని మనుగడ సాధించాలంటే ప్రపంచ సౌర గ్రిడ్ను ఏర్పాటు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘ఒకే భానుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్’ అని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులపై కాప్–26 సదస్సులో ‘స్వచ్ఛ సాంకేతికల ఆవిష్కరణలను వేగవంతం చేయడం– వినియోగంలో పెట్టడం’ అనే అంశంపై మోదీ మంగళవారం గ్లాస్గోలో ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోని ఏమూలలోనైనా సౌర విద్యుత్తు ఉత్పత్తికి గల అవకాశాలను లెక్కించే కాలిక్యులేటర్ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) త్వరలో ప్రపంచానికి అందించనుందని వెల్లడించారు. ఉపగ్రహాలు అందించే డాటా ఆధారంగా ఇది పనిచేస్తుందని తెలిపారు. పారిశ్రామిక విప్లవకాలంలో శిలాజ ఇంధనాల శక్తి మూలంగా పలు దేశాలు ఆర్థికంగా బలమైన దేశాలుగా అవతరించాయని... అయితే అదే సమయంలో పర్యావరణం బలహీనపడిందని పేర్కొన్నారు. శిలాజ ఇంధనాలతో నెలకొన్న పోటీ మూలంగా ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయని, కానీ ఈ రోజు సాంకేతిక మనకు మెరుగైన ప్రత్యామ్నాయాన్ని చూపుతోందని అన్నారు. ‘సకల జగత్తుకు సూర్యుడే ఆధారమని సూర్యోపనిషత్తు చెబుతోంది. శక్తికి మూలం భానుడే. సౌరశక్తి ప్రతి ఒక్కరి అవసరాలను తీరుస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు. ప్రకృతి సమతౌల్యతను కాపాడినంత కాలం భూగోళం సురక్షితంగానే ఉందని, ఎప్పుడైతే ఆధునికయుగంలో ముందుకెళ్లాలనే పోటీ మొదలైందో... అప్పుడే విధ్వంసం ఆరంభమైందని అభిప్రాయపడ్డారు. సౌరవిద్యుత్తును అందుబాటులో ఉంచాలంటే ప్రపంచ సౌరగ్రిడ్ను ఏర్పాటు చేయడమే మార్గమన్నారు. ద్వీపాలకు భారత్ అండ ప్రకృతి విపత్తులతో అల్లాడిపోయే చిన్న దేశాలకు భారత్ అండగా నిలిచింది. వాతావరణ మార్పుల కారణంగా నష్టపోతున్న చిన్న చిన్న ద్వీపసమూహాల్లాంటి దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలియెంట్ ఐలాండ్ స్టేట్స్ (ఐరిస్) అనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. కాప్26 వాతావరణ సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ దేశాలు ఇప్పటికే తీసుకువచ్చిన కొయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ)లో భాగంగానే తాము కూడా పని చేస్తామన్నారు. -
సోలార్ పవర్ ప్రాజెక్టులో దూసుకెళ్తున్న టాటా పవర్
సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ పరంగా టాటా పవర్ దూసుకెళ్తుంది. టాటా పవర్ ఆర్మ్ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్(టీపీఆర్ఈఎల్) రాజస్థాన్లోని లోహర్కి గ్రామంలో 150 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును నిర్మించింది. రాజస్థాన్లోని ఈ ప్రాజెక్టుతో టాటా పవర్ మొత్తం పునరుత్పాదక వ్యవస్థాపన సామర్థ్యం 2,947 మెగావాట్ల(2,015 మెగావాట్ల సోలార్, 932 మెగావాట్ల విండ్ పవర్)కు చేరుకుంది. ఇంకా 1,084 మెగావాట్ల పునరుత్పాదక టాటా పవర్ ప్రాజెక్టు పనులు ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. 756 ఎకరాల భూమిలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు ద్వారా సంవత్సరానికి 350 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రతి ఏడాది 3.34 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారం తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 6.5 లక్షల మాడ్యూల్స్, 48 ఇన్వర్టర్లు, 720 కిలోమీటర్ల డీసీ కేబుల్, 550 మ్యాన్ పవర్ ఉపయోగించారు. "రాజస్థాన్లోని లోహర్కిలో నిర్మించిన 150 మెగావాట్ల ప్రాజెక్టు, సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోని ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థలో ఒకటిగా మా స్థానాన్ని సుస్థిరం చేసింది. భారతదేశంలో పునరుత్పాదక శక్తి వృద్ధిని ఇదేవిధంగా మేము కొనసాగిస్తాము" అని టాటా పవర్ సీఈఓ, ఎండి డాక్టర్ ప్రవీర్ సాహా తెలిపారు. టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ ద్వారా టీపీఆర్ఈఎల్ ఈ ప్రాజెక్టును నిర్ణీత సమయంలోనే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.(చదవండి: డిసెంబరే టార్గెట్.. ఎయిరిండియాను అమ్మేయడానికే) -
Space Solar Plant: ఆకాశం నుంచి కరెంట్!
ఒక్క నిమిషం కరెంటు పోతే.. ఆగమాగం అయిపోతాం. పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరం విద్యుత్ కావాల్సిందే. ఓ వైపు బొగ్గు వంటి సహజ వనరులు తరిగిపోతున్నాయి. ప్రత్యామ్నాయ విద్యుత్కు మరెన్నో కష్టాలు.. ఇలాంటి సమయంలోనే ఆకాశం నుంచే కరెంటు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ భూమ్మీద బొగ్గు తరిగిపోతోంది.. జల విద్యుత్ సరిపోదు.. సౌర విద్యుత్ ఉన్నా.. పగలు మాత్రమే కరెంటు ఉత్ప త్తి అవుతుంది. మబ్బు పట్టినా, ఫలకాలపై దు మ్ముపడినా ఉత్పత్తి తగ్గిపోతుంది. పవన విద్యు త్ వంటి ఇతర మార్గాలు ఉన్నా ఖర్చెక్కువ. నిరంతరంగా ఉత్పత్తి సాధ్యంకాదు. మరె లా అన్న ఆలోచన చేసిన శాస్త్రవేత్తలు.. అంతరిక్షం లో ఉపగ్రహాల తరహాలో భారీ సోలార్ ప్యానె ల్స్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేయవచ్చని ప్రతిపాదించారు. జపాన్, యూరోపియన్ యూ నియన్ ఆ దిశగా పరిశోధనలు చేస్తుండగా.. చైనా నేరుగా రంగంలోకి దిగింది. అంతరిక్షంలో అత్యంత భారీ సోలార్ ప్రాజెక్టు చేపట్టే పనిలో పడింది. మరో 14 ఏళ్లలో అంటే 2035 కల్లా ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. చదవండి: తాలిబన్ల దమనకాండ అంతరిక్షంలో సోలార్ ప్రాజెక్టు పనిచేసేదిలా.. చైనా ప్రాజెక్టు ఇదీ.. ►భూమికి 23 వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ ఏర్పాటుకు చైనా ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. అంటే ఆ ప్లాంట్ భూమి తిరిగే వేగంతోనే కదులుతూ.. ఎప్పుడూ ఒకే ప్రాంతంపై ఉంటుంది. ►ప్రాజెక్టులో భాగంగా 2035 సంవత్సరం నా టికి సుమారు 1.6 కిలోమీటర్ల మేరసోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తారు. ముందు ఒక మెగావాట్ సామర్థ్యంతో మొదలుపెట్టి.. తర్వాత మరింతగా విస్తరిస్తూ వెళతారు. ►2050నాటికి ఒక అణువిద్యుత్ ప్లాంటు స్థాయిలో ఏకంగావెయ్యి మెగావాట్లు ఉత్పత్తి చేసేలా ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ను అభివృద్ధి చేస్తారు. ►ప్రస్తుతం చైనాలోని చోంగ్కింగ్ పట్టణం శి వార్లలో ‘బిషన్ స్పేస్ సోలార్ ఎనర్జీ స్టేషన్’ను నిర్మిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా ప్రయోగాన్ని మొదలుపెట్టాలని భావిస్తోంది. ►అయితే ఈ భారీ ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాలేమీ వెల్లడించలేదు. చదవండి: అఫ్గన్ పౌరులకు ఇప్పుడు అదే ఆశాదీపం..! ఖర్చు తక్కువే.. 2039 నాటికి ‘స్పేస్ ప్లాంట్’ ఏర్పాటు చేయాలని బ్రిటన్ను ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా సాధ్యాసాధ్యాలు, ఖర్చుపై ఓ నివేదికను రూపొందించింది. అంతరిక్షంలో ఒక కిలోమీటర్ వెడల్పున ప్లాంట్ ఏర్పాటుకు.. 2 వేల టన్నుల పరికరాలు అవసరమని లెక్కించింది. భూమిపై రిసీవింగ్ స్టేషన్ను 95 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని అంచనా వేసింది. ళీ ప్రస్తుతం వెయ్యి యూనిట్ల కరెంటు ఉత్పత్తి కోసం.. అణువిద్యుత్ ప్లాంట్లలో రూ.5 వేలకుపైగా.. భూమ్మీది సౌర, పవన విద్యుత్ ప్లాంట్లలో రూ.3,750 వరకు ఖర్చవుతోందని తెలిపింది. అదే ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ కేవలం రూ.385 మాత్రమే ఖర్చవుతాయని అంచనా వేసింది. ఓ ఫిక్షన్ నవల నుంచి.. ఐజాక్ అసిమోవ్ రష్యన్ రచయిత 1941లో రాసిన సైన్స్ ఫిక్షన్ నవలలో ‘స్పేస్ సోలార్ పవర్ స్టేషన్ల’ గురించి రాశారు. ఆ ప్లాంట్లు సూర్యరశ్మిని మైక్రోవేవ్ల రూపంలో వివిధ గ్రహాలపైకి పంపుకొంటారని పేర్కొన్నారు. సోలార్ పవర్ వినియోగం కొత్తగా మొదలైన 1970 దశకంలో కొందరు శాస్త్రవేత్తలు ‘స్పేస్ సోలార్ పవర్’ ప్రతిపాదనలు చేశారు. కానీ అప్పటి పరిస్థితి, భారీ ఖర్చుతో ఏదీ ముందుకుపడలేదు. ఇటీవలి కాలంలో పలు కొత్త టెక్నాలజీలు రావడంతో మళ్లీ పరిశోధనలు మొదలయ్యాయి. ఇప్పటికే బ్రిటన్, జపాన్, రష్యా, అమెరికా, చైనా దేశాలు ప్రయోగాలకు సిద్ధమయ్యాయి. లాభాలు ఎన్నో? ►సూర్యుడి కిరణాల తీవ్రత, రేడియేషన్ ఎ క్కువగా ఉంటాయి.పైగా దుమ్ముపడి సోలార్ ప్యానెళ్ల సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు ఉండవు. పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ►భూమ్మీద రోజూ 9–10 గంటల పాటు మాత్రమే సౌర విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అది కూడా సోలార్ ప్యానెళ్లపై సూర్యరశ్మి నేరుగా పడే ఐదారు గంటలు మాత్రమే పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అదే అంతరిక్షంలో సోలార్ ప్యానెళ్లు పూర్తిగా సూర్యుడివైపే ఉండేలా ఏర్పాట్లు ఉంటాయి. దీనితో రాత్రి, పగలు తేడా లేకుండా నిరంతరంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ►ఈ ప్రత్యామ్నాయ విద్యుత్ కారణంగా.. బొగ్గు, పెట్రోలియం, ఇతర శిలాజ ఇంధనాల వినియోగం నిలిచిపోయి భూమ్మీద కాలుష్యం తగ్గుతుంది. ఆయుధంగా మారుతుందా? జేమ్స్బాండ్ సినిమాలో ఓ ప్రైవేటు సంస్థ అంతరిక్షంలో సోలార్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. రాత్రిపూట అవసరమైన చోట వెలుగు ఇవ్వొచ్చని చెప్తుంది. కానీ ఆ వ్యవస్థతో సౌరశక్తిని లేజర్ కిరణాల తరహాలో ఒక దగ్గర కేంద్రీకరించి.. విధ్వంసం సృష్టిస్తుంది. ఇది సినిమాని సీన్ అయినా.. స్పేస్ సోలార్ స్టేషన్లతో అలాంటి ప్రమాదమూ ఉండొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతుండటం గమనార్హం. ►కావాలని చేయకపోయినా.. స్పేస్ సోలార్ స్టేషన్లో సమస్య వచ్చి.. అది భూమిపైకి పంపే మైక్రోవేవ్లు/లేజర్ కిరణాలు ప్రజలు ఉండే ప్రాంతాలపై పడితే ఎలాగన్న ప్రశ్నలూ వస్తున్నాయి. మైక్రోవేవ్ల వల్ల రేడియేషన్ ఉంటుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ►అయితే ఇలాంటి ప్రమాదాలు ఉండకుండా.. కచ్చితమైన వ్యవస్థలను ఏర్పాటు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కిరణాలు రిసీవింగ్ స్టేషన్ పరిధి దాటి బయట ప్రసరించే పరిస్థితి ఉంటే.. ప్లాంట్ ఆటోమేటిగ్గా ఆగిపోయే ఏర్పాట్లు ఉంటాయని భరోసా ఇస్తున్నారు. -
అత్యంత ఎత్తులో పవర్ స్టేషన్... టాటా వరల్డ్ రికార్డు
సాక్షి, వెబ్డెస్క్: ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న టాటా మరో రికార్డుపై కన్నేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సిద్ధమైంది. దీంతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ని ఏర్పాటు చేయనుంది. సోలార్లోకి టాటా కాలుష్య రహిత గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి కేంద్రం ప్రోత్సహకాలు అందిస్తోంది. దీంతో కార్పోరేటు కంపెనీలు సౌర విద్యుత్తుపై దృష్టి సారించాయి. అందులో భాగంగా టాటా సంస్థ సైతం దేశంలో వివిధ ప్రాంతాల్లో సోలార్ పవర్ స్టేషన్లు నిర్మాణం చేపడుతోంది. మన అనంతపురంలో 150 మెగావాట్ల పవర్ ప్లాంటుతో పాటు కేరళలోని కాసర్గోడ్లో 50 మెగావాట్లు, ఒడిషాలోని లపంగాపలో 30 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం టాటా పవర్ చేపట్టింది. అయితే వీటి లేని ప్రత్యేకత తాజాగా చేపట్టబోయే ప్రాజెక్టులో చోటు చేసుకోనుంది. వరల్డ్ రికార్డు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూముల్లో ఒకటైన లదాఖ్లో కొత్తగా సోలార్ పవర్ ప్లాంటును నిర్మించనుంది టాటా పవర్ సంస్థ, లదాఖ్ ప్రధాన పట్టణమైన లేహ్ సమీపంలో లైంగ్ అనే గ్రామం సమీపంలో భూమి నుంచి 3,600 మీటర్ల ఎత్తులో ఈ సోలార్ పవర్ స్టేషన్ను నిర్మించనుంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో నెలకొల్పిన సోలార్ పవర్ స్టేషన్గా స్విట్జర్లాండ్లోని జుంగ్ఫ్రాజోక్ గుర్తింపు ఉంది. 1991లో ఈ పవర్ స్టేషన్ని భూమి నుంచి 3,454 మీటర్ల ఎత్తులో నెలకొల్పారు. ముప్పై ఏళ్లుగా ఇదే రికార్డుగా కొనసాగుతోంది. 2023 మార్చికి పూర్తి లేహ్ సమీపంలో నిర్మించే సోలార్ పవర్ స్టేషన్ నిర్మాణం 2023 మార్చి నాటికి పూర్తి కానుంది. పవర్ స్టేషన్కు అనుసంధానంగా 50 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ని సైతం టాటా పవర్ నెలకొల్పనుంది. దీని కోసం రూ.386 కోట్లు వెచ్చించనుంది. ఇండియా వేగంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తోందని అనడానికి లేహ్లో చేపడుతున్న కొత్త సోలార్ పవర్ ప్రాజెక్టు ఉదాహరణ అని టాటా పవర్ సీఈవో ప్రవీర్ సిన్హా అన్నారు. -
అత్యధిక సోలార్ ఉత్పాదక స్టేషన్గా విజయవాడ
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విద్యుత్ ఆదాలో విజయవాడ రైల్వే డివిజన్ మరో అడుగు ముందుకేసింది. విజయవాడ రైల్వే స్టేషన్లో అదనంగా రూ.62 లక్షలతో మరో 65 కిలో వాట్స్ సామర్థ్యం గల బీఐపీవీ సోలార్ ప్యానల్స్తో ప్లాట్ ఫారాల పైకప్పులు ఏర్పాటు చేయడం ద్వారా భారతీయ రైల్వేలోనే తొలిసారిగా 130 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుదుత్పత్తి గల స్టేషన్గా విజయవాడ రికార్డు సృష్టించింది. బుధవారం డీఆర్ఎం శ్రీనివాస్ స్టేషన్లోని సోలార్ విద్యుదుత్పత్తి యూనిట్ను ప్రారంభించారు. 2019 డిసెంబర్లో 4, 5 ప్లాట్ఫారాలపై 65 కిలోవాట్స్ సామర్థ్యం గల బీఐపీవీ సోలార్ ప్యానల్స్ను ఏర్పాటు చేశారు. వాటికి అదనంగా మరో 54 కిలోవాట్స్ సోలార్ ప్యానల్స్ను 4, 5 ప్లాట్ఫారాలలో, 11 కిలోవాట్స్ సోలార్ ప్యానల్స్ను 8, 9 ప్లాట్ఫారాలలో ఏర్పాటు చేశారు. దీని ద్వారా స్టేషన్ అవసరాలకు వినియోగించే విద్యుత్ సరఫరాలో ఏడాదికి 2.12 లక్షల యూనిట్లను తగ్గించడం ద్వారా ఏడాదికి రూ.16.36 లక్షలు ఆదా అవుతుంది. -
సీమ జిల్లాల్లో సోలార్ పవర్ భేష్!
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాలైన వైఎస్సార్, కర్నూలు, అనంతపురంలలో సౌర విద్యుత్ ఉత్పత్తి లాభసాటని ఉత్పత్తిదారులు భావిస్తున్నారు. ఈ జిల్లాల్లో ప్లాంట్లు నెలకొల్పేందుకు పోటీ పడుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘ఇంధన ఎగుమతి విధానం’ (ఎక్స్పోర్ట్ పాలసీ) వారిని మరింత ఆకర్షిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు.. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ), సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తోపాటు పలు దేశీయ, విదేశీ కంపెనీలు సీమ జిల్లాలపై దృష్టి పెట్టాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే పై మూడు జిల్లాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా జరిగే వీలుంది. ఇటీవల అధ్యయనాలను బట్టి ఆ జిల్లాల్లో సోలార్ రేడియేషన్ ఉదయం త్వరగా వస్తుందని, సాయంత్రం పొద్దుపోయే వరకూ ఉంటోందని తేలింది. ట్రాకింగ్ (సూర్యుడు ఎటువైపు తిరిగితే అటు ప్యానల్ తిరిగేలా) సిస్టమ్ అమర్చుకుంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువ విద్యుత్ను ఉత్పత్తి చేసే అవకాశం.. రాయలసీమ జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకున్నవి కొన్నే. ఇప్పుడు ట్రాకింగ్తోపాటు తేలికగా రేడియేషన్ను తెచ్చే మాడ్యూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఎక్కువ వాట్స్ (దాదాపు 350 వాట్స్) ఉండే ప్యానల్స్ ఉన్నాయి. తక్కువ ప్రదేశంలోనే వీటిని ఎక్కువగా అమర్చుకోవచ్చు. తద్వారా గతంలో కంటే ఎక్కువ విద్యుత్ను ఉత్పత్తి చేయొచ్చు. సాధారణంగా ఒక మెగావాట్కు 5 ఎకరాల భూమి అవసరం ఉంటుంది. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తే కేవలం 4 ఎకరాల భూమితో సరిపెట్టే వీలుందని అధికారులు అంటున్నారు. పైగా ప్రస్తుతం వస్తున్న 22 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ను 25కు తీసుకెళ్లే వీలుందని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సోలార్ పవర్ ప్లాంట్ల కోసం గుర్తించిన భూముల వివరాలు.. ఎక్స్పోర్ట్ పాలసీతో అపార అవకాశాలు.. ► ఎక్స్పోర్ట్ పాలసీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సౌర, పవన విద్యుత్ ప్లాంట్ల కోసం దాదాపు లక్ష ఎకరాలను గుర్తించింది. ఇందులో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఉత్పత్తిదారులకు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. ► రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను ఆయా సంస్థలు మరే ఇతర రాష్ట్రాల్లోనైనా అమ్ముకోవచ్చు. దీన్నే ఎక్స్పోర్ట్ పాలసీ అంటారు. విద్యుత్ను చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం తమ పరిధిలోని పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) లైన్లు వాడుకునే ఏర్పాట్లు చేస్తోంది. ► రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తిదారులకు 25 ఏళ్ల పాటు భూమిని లీజుకు ఇవ్వనుంది. ప్రతి ఎకరాకు రూ.31 వేలు లీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేటు భూమి అయితే ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలి. ఏటా లీజు మొత్తాన్ని 5 శాతం పెంచుతారు. మెగావాట్కు రూ.లక్ష చొప్పున ప్రభుత్వానికి చెల్లించాలి. -
నేడో రేపో భృతి
సాక్షి, హైదరాబాద్ : నిరుద్యోగభృతి, ఉద్యోగాల భర్తీపై ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారకరామారావు సూచనప్రాయంగా సంకేతాలిచ్చారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రేపో మాపో నిరుద్యోగ భృతిపైనా ప్రకటన చేస్తారని కేటీఆర్ వెల్లడించారు. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల్లో 50 వేల ఉద్యోగాల భర్తీకి కూడా త్వరలో నోటిఫి3 కేషన్ వెలువడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్వీకేఎస్)లో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం (టీఎన్వీకేఎస్) విలీనమైన సందర్భంగా గురువారం ఇక్కడ తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో విద్యుత్శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డితో కలసి కేటీఆర్ పాల్గొ న్నారు. ‘ఆరున్నరేండ్లలో టీఎస్పీఎస్సీ ద్వారా 36 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయడంతోపాటు ప్రభుత్వశాఖల్లో అదనంగా మరో 45 వేల ఉద్యో గాలు ఇచ్చాం. జెన్కో, సింగరేణి లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇచ్చిన ఉద్యోగాలను కలుపుకుంటే రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొత్తం 1.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. పారిశ్రామిక విధానం ద్వారా రూ.2.05 లక్షల కోట్ల పెట్టుబడులతో కూడిన 14 వేలకుపైగా పరిశ్రమలకు అనుమతులివ్వగా, సుమారు 14.50 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించింది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘కొత్తగా మతం పుచ్చుకున్నోడు ఒళ్లంత బూడిద పూసు కున్నట్లు.. నిన్న, ఇవాళ కండ్లు తెరచిన కొందరు నేతలు రెచ్చిపోయి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. సీఎం వయసును, తెలంగాణ తెచ్చిన విషయాన్ని మరచిపోయి విమర్శిస్తున్నారు. కేసీఆర్ లేకపోతే వీళ్ల బతుక్కి పదవులు కూడా లేవు. ఒకాయన టీపీసీసీ అధ్యక్షుడు.. ఇంకొకాయన టీబీజేపీ అధ్యక్షుడు. ఎగిరి పడు తున్న నాయకులారా.. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది. ఆయన వల్ల మీకు పదవులు వచ్చాయి. ప్రతిదానికి హద్దు ఉంటుంది’ అని కేటీఆర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. విద్యుత్ రంగంలో తెలంగాణ ఘనవిజయం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 450 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రాకు అప్పగించినా, విద్యుత్ సమస్యను సవాలుగా తీసుకుని సీఎం కేసీఆర్ పరిష్కరించారని కేఆటీర్ వ్యాఖ్యానించారు. 2014కు ముందు తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7 వేల మెగావాట్లు కాగా, సీఎం దూరదృష్టితో ప్రస్తుతం అది 16 వేల మెగావాట్లకు చేరిందన్నారు. దామరచర్ల, ఎన్టీపీసీలో అల్ట్రా మెగావపర్ ప్రాజెక్టుల నిర్మాణం జరుగతోందని, గ్రీన్, రెన్యూవల్ ఎనర్జీ ఉత్పాదనలో 4 వేలకుపై చిలుకు మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణ దేశంలో రెండోస్థానంలో ఉందని చెప్పారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని, కరోనా మూలంగా ఆర్థికాభివృద్ధి మందగించినా ఉద్యోగులకు ఇచ్చిన ప్రతిమాటను నిలబెట్టుకుంటామని చెప్పారు. ఆరేండ్ల వ్యవధిలోనే విద్యుత్ సంస్థల్లో 9 వేలకుపైగా కొత్త ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు, 23 వేలకుపైగా తాత్కాలిక ఉద్యోగులను పర్మనెంట్ చేసిన విషయాన్ని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి గుర్తుచేశారు. సమావేశంలో మాజీమంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నేతలు తక్కళ్లపల్లి రవీందర్రావు, బండి రమేశ్, టీఆర్వీకేఎస్ నేతలు జాన్సన్, రమేశ్, ప్రకాశ్, టీఎన్వీకేఎస్ నాయకులు మహేందర్, రాంబాబు, టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతకు నాణ్యమైన విద్యుత్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకాన్ని శాశ్వతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న మెగా సోలార్ ప్రాజెక్టుల నిర్మాణ టెండర్ల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. అత్యంత పారదర్శకంగా చేపట్టిన యీ ప్రక్రియ ఫిబ్రవరి నాటికి ముగియనుంది. 10 వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు నవంబర్ 30న గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ టెండర్లు ఆహ్వానించింది. తుది గడువు ముగిసిన డిసెంబర్ 28 నాటికి ఐదు సంస్థలు 24 బిడ్లు దాఖలు చేశాయి. గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా ఏ విధమైన అవినీతి ఆరోపణలకు తావివ్వకుండా టెండర్ డాక్యుమెంట్ను న్యాయ సమీక్షకు పంపారు. మరోవైపు ప్రజల నుంచి అందిన 150 సలహాలు, సూచనలనూ పరిగణనలోనికి తీసుకున్నారు. కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ మార్గదర్శకాల ప్రకారమే టెండర్ నిబంధనలు పొందుపర్చారు. రివర్స్ టెండరింగ్ ద్వారా మరింత చౌకగా టెండర్ ఖరారు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఢోకాలేని విద్యుత్ సరఫరా దిశగా సర్కారు అడుగులు రైతన్నకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికి అనుగుణంగానే ఫీడర్లను బలోపేతం చేశారు. ఫలితంగా వ్యవసాయ విద్యుత్ వాడకం క్రమంగా పెరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 18.37 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. ఏటా 12,221 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. దీంతో ప్రభుత్వంపై సబ్సిడీ భారం ఎక్కువవుతోంది. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ అరకొరగానే ఉండేది. 2015–16లో రూ.3,186 కోట్లు ఉంటే, 2018–19 నాటికి రూ.4 వేల కోట్లకు చేరింది. అయితే కేటాయించిన సబ్సిడీని కూడా గత ప్రభుత్వం పూర్తిగా చెల్లించకపోవడంతో డిస్కమ్లు అప్పుల పాలయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2020–21లో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని రూ.8,354 కోట్లకు పెంచడమే కాదు... పాత బకాయిలూ చెల్లించి డిస్కమ్లను ఆదుకుంది. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లు ఏడాదికి 50 వేలు చొప్పున పెరుగుతున్నాయి. ఫలితంగా భవిష్యత్లో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. డిమాండ్కు తగిన సరఫరా చేయాలంటే సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటే ఏకైక మార్గమని భావించిన ప్రభుత్వం ఈ దిశగా అడుగులేసింది. ప్రభుత్వ పెట్టుబడి లేకుండా .. తక్కువ ధరకే సౌర విద్యుత్ ఈ ప్లాంట్ల ఏర్పాటును రాష్ట్ర గ్రీన్ ఎనర్జీ సోలార్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వ పెట్టుబడి లేకుండా చేపట్టే ఈ ప్రాజెక్టు 30 ఏళ్ల తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్కో సొంతమవుతుంది. ప్లాంట్ నిర్మాణం చేపట్టే సంస్థలతో డిస్కమ్లు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రస్తుతం యూనిట్ రూ.4.68 చొప్పున సౌర విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. గత ప్రభుత్వ ఒప్పందాల వల్ల ఈ ధర చెల్లించడం అనివార్యమవుతోంది. నిజానికి ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో సోలార్ విద్యుత్ ధరలు కనిష్టంగా యూనిట్ రూ.1.99, గరిష్టంగా రూ. 2.43 మాత్రమే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే మెగా సోలార్ ప్రాజెక్టు నుంచి తీసుకునే విద్యుత్ కూడా ఇంచుమించు ఇదే స్థాయిలో ఉండొచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల ప్రస్తుత ధరలతో పోలిస్తే 30 ఏళ్లలో రూ.48,800 కోట్ల మేర ప్రజాధనాన్ని ఆదా చేయవచ్చని పేర్కొంటున్నాయి. భవిష్యత్లో ప్రభుత్వంపై ఉచిత విద్యుత్ సబ్సిడీ భారమూ తగ్గుతుందని చెబుతున్నాయి. ప్రభుత్వ, బీడు భూముల్లో ప్లాంట్లు అనంతపురం, కర్నూలు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో ఉన్న బంజరు భూములు సోలార్ ప్రాజెక్టులకు అత్యంత అనుకూలమైనవిగా గుర్తించారు. అందులోనూ 50 శాతం ప్రభుత్వ భూములే ఉండటం మరింత కలిసొచ్చే అంశం. మిగిలిన 50 శాతం పంటలు పండని ప్రైవేట్, అసైన్డ్ భూములను సేకరించారు. వీటికి ఏడాదికి ఎకరాకు రూ.25 వేల చొప్పున లీజు చెల్లిస్తారు. సాగులేని భూములను వినియోగంలోకి తేవడం, 30 ఏళ్ల పాటు ప్రైవేట్ భూములకు ఆదాయం చెల్లించడం ద్వారా ఆర్థిక, పర్యావరణ, సామాజిక ప్రయోజనాలే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు చేపడుతున్నారు. సోలార్ విద్యుత్ వల్ల థర్మల్ విద్యుత్ వాడకం తగి, 14 మిలియన్ టన్నుల మేర కార్బన్ డై ఆక్సైడ్ గాలిలో కలిసే అవకాశం ఉండదని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇదిలావుండగా రాష్ట్రంలో ఇప్పటికే 10 సోలార్ పార్కులకు ఏర్పాట్లు జరిగాయి. వైఎస్సార్, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనే ఇవి ఏర్పాటు కానున్నాయి. -
కుళ్లిన కూరగాయలతో సౌర విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: పాడైపోయిన కూరగాయలు.. వ్యవసాయ వ్యర్థాలకూ... సౌరశక్తికీ మధ్య సంబంధం ఏమిటి? మామూలుగా ఆలోచిస్తే అసలేం కనిపించదు. కానీ... కార్వే మైగుయి అనే 27 ఏళ్ల ఫిలిప్పీన్స్ ఇంజనీర్ మాత్రం... ఈ రెండింటి సాయంతో కొత్త రకం సోలార్ ప్యానెల్స్ తయారు చేశాడు! ఫలితం... ఇంటి కిటికీలు మొదలుకొని భవనాలకు బిగించే అద్దాల వరకూ..అన్నీ సౌరశక్తి ఘటకాలే.. విద్యుదుత్పత్తి కేంద్రాలే! వ్యవసాయ వ్యర్థాలను, కుళ్లిపోయిన కూరగాయలను బయోగ్యాస్ ప్లాంట్లో వేస్తే వంటకు వాడుకోగల బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుందని మనకు తెలుసు. కానీ ఈ వ్యర్థాల్లోంచి వేరు చేసిన ఓ వినూత్న పదార్థం.. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను పీల్చేసుకొని విద్యుత్ను ఉత్పత్తి చేయగలవని కార్వే మైగుయికి మాత్రమే తట్టింది. సాధారణ సోలార్ ప్యానెల్స్ కేవలం కంటికి కనిపించే దృశ్యకాంతిని మాత్రమే ఒడిసిపడతాయన్నది తెలిసిందే. మైగుయి తయారు చేసిన పదార్థపు పొరను గాజు కిటికీలకు బిగిస్తే చాలు.. ఎక్కడ కావాలంటే అక్కడ ఎంచక్కా విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవచ్చునన్నమాట. నీడ ఉన్నా సరే.. భవనాల గోడను తాకి ప్రతిఫలించే అతినీలలోహిత కిరణాలను ఈ పదార్థం ఉపయోగించుకుంటుంది. అద్భుతమైన ఈ ఆలోచనకు ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయి పోటీ జేమ్స్ డైసన్ అవార్డు దక్కింది. వెలుగునిచ్చే పదార్థం... భూమి అయస్కాంత ధ్రువ ప్రాంతాల్లో రాత్రివేళ చిత్ర విచిత్రమైన రంగులు కొన్ని కనిపిస్తుంటాయి. అరోరా అని పిలిచే ఈ దృగ్విషయమే అతినీలలోహిత కిరణాలను ఒడిసిపట్టే వ్యవస్థ తయారీకి స్ఫూర్తి అని కార్వే మైగుయి తెలిపారు. సేంద్రియ పదార్థాల్లో ఉండే వెలుగునిచ్చే పదార్థం (బయోల్యూమినిసెన్స్)ను వేరు చేయడం ద్వారా తాను అరోరా రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ యూవీ సీక్వెస్ట్రేషన్ (ఔరియస్)ను తయారు చేశానని డైసన్ అవార్డు అందుకున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్వే వివరించారు. మిణుగురు పురుగులు కూడా ఈ బయో ల్యూమినిసెన్స్ కారణంగానే చీకట్లో వెలుగులు చిమ్ముతాయి. వ్యవసాయ వ్యర్థాలు, పాడైపోయిన కాయగూరల్లోంచి ఈ బయోల్యూమినిసెన్స్ పదార్థపు పొర అతినీలలోహిత కిరణాల శక్తిని మాత్రమే శోషించుకుంటాయి. ఆ శక్తిని దృశ్యకాంతిగా మార్చి విడుదల చేస్తాయి. పొర లోపల ఈ కాంతి వెనక్కు, ముందుకు ప్రతిఫలిస్తూ.. ఒక చివరకు చేరతాయి. ఆ ప్రాంతంలో సోలార్ సెల్స్ ఏర్పాటు చేస్తే ఆ కాంతి డీసీ విద్యుత్గా మారుతుంది. రెగ్యులేటరీ సర్క్యూట్ల సాయంతో వోల్టేజిని నియంత్రించుకుంటూ ఈ విద్యుత్ను బ్యాటరీల్లో నిల్వ చేసుకోవచ్చు లేదా నేరుగా వాడుకోవచ్చు. ఎన్నో లాభాలు... నగరాల్లో అతినీలలోహిత కిరణాల తాకిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. చర్మ సంబంధిత సమస్యలకూ కారణమైన ఈ కిరణాలను సద్వినియోగం చేసుకొనేందుకు ఈ ఔరియస్ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది. వ్యవసాయ వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రైతులకు ఎంతో కొంత అదనపు ఆదాయం లభించేలా చేయవచ్చు. సాధారణ సోలార్ ప్యానెల్స్ను ఎప్పుడూ సూర్యుడికి అభిముఖంగా ఉంచాల్సి ఉండగా.. ఈ కొత్త వ్యవస్థలో ఆ అవసరం ఉండదు. కాంక్రీట్ గోడలు, ఫుట్పాత్లపై పడ్డ సూర్యరశ్మి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను కూడా ఔరియస్ వాడుకోగలగడం దీనికి కారణం. దాదాపు తొమ్మిది రకాల పంటల నుంచి బయోల్యూమినిసెన్స్ పదార్థాన్ని వేరు చేయవచ్చని కార్వే గుర్తించారు. ఉపయోగించే పదార్థాలన్నీ చౌకగానే లభ్యమవుతున్న కారణంగా ఔరియస్ కూడా తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం తాము ఎరుపు, నారింజ, పసుపు, పచ్చ, నీలి రంగులతో కూడిన పదార్థాన్ని వెలికితీస్తున్నామని, నీలి రంగుకు ప్రత్యామ్నాయాన్ని కనుక్కోగలిగితే మరింత ప్రయోజనం ఉంటుందని కార్వే మైగుయి వివరించారు. వాహనాలపై కూడా ఔరియస్ను వాడుకోవచ్చని తెలిపారు. -
సౌర విద్యుత్తో వెలుగు రేఖలు
సాక్షి, న్యూఢిల్లీ : 21వ శతాబ్ధంలో ఇంధన అవసరాలు తీర్చడంలో సౌర విద్యుత్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సౌర విద్యుత్ నాణ్యతతో పాటు భద్రతతో కూడినదని చెప్పారు. మధ్యప్రదేశ్లోని రెవాలో 750 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రధానమంత్రి మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు. ఏటా 15 లక్షల టన్నుల విలువైన కార్బన్ డయాక్సైడ్తో సమానమైన వాయువుల విడుదలను ఈ ప్లాంట్ తగ్గిస్తుందని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. రెవాలో సౌర విద్యుత్ ప్లాంట్ రాకతో ఈ ప్రాంత పరిశ్రమలకు విద్యుత్ సరఫరాతో పాటు ఢిల్లీ మెట్రో రైల్కు కూడా ఈ ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. షాజపూర్, నీముచ్, చత్తార్పూర్లో కూడా సోలార్ విద్యుత్ ప్లాంట్ల పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ దశాబ్ధంలోనే రెవాలో సోలార్ ప్లాంట్ ద్వారా ఈ ప్రాంతం శభారీ ఇంధన హబ్గా ఎదుగుతుందని ఆయన ఆకాంక్షించారు. చదవండి : భారత్లో ఇన్వెస్ట్ చేయండి -
అదానీకి మెగా ‘సౌర’భం
న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుదుత్పత్తి సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ తాజాగా ప్రపంచంలోనే అత్యంత భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకుంది. ఇందులో భాగంగా 8 గిగావాట్స్ ఫొటోవోల్టెయిక్ (పీవీ) విద్యుత్ ప్లాంటుతో పాటు దేశీయంగా సోలార్ ప్యానెళ్ల తయారీ యూనిట్ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కంపెనీ రూ. 45,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ప్రభుత్వ రంగ ఎస్ఈసీఐ (గతంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నుంచి దక్కించుకున్న ఈ కాంట్రాక్టు కింద 2 గి.వా. (2,000 మె.వా) సామర్థ్యంతో దేశీయంగా సోలార్ పయానెల్ తయారీ ప్లాంటు ఏర్పాటు చేయాలి. అలాగే 8 గి.వా. విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు నిర్మించాలి. ‘ఎస్ఈసీఐతో తయారీ ఆధారిత సౌర విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ తరహా ఒప్పందాల్లో ఇదే మొదటిది‘ అని అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) తెలిపింది. ఈ ప్రాజెక్టుతో కలిపి అదానీ గ్రీన్ వద్ద ప్రస్తుతం 15 గి.వా. పునరుత్పాదక విద్యుదుత్పత్తి అసెట్స్ ఉన్నట్లవుతుంది. రూ. 2.92 టారిఫ్..: కాంట్రాక్టు ప్రకారం 25 ఏళ్ల పాటు యూనిట్కు స్థిరంగా రూ. 2.92 చొప్పున కంపెనీకి టారిఫ్ లభిస్తుంది. ఇంత భారీ సామర్థ్యం గల ప్రాజెక్టు కాంట్రాక్టు ఇదేనని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ వెల్లడించారు. ‘ప్రపంచంలోనే అతి పెద్ద పునరుత్పాదక విద్యుత్ కంపెనీగా ఎదగాలన్న లక్ష్యానికి మరింత చేరువయ్యేందుకు ఈ కాంట్రాక్టు ఉపయోగపడుతుంది. ఈ ఏడాదే మరో 10 గి.వా. సామర్థ్యంగల ప్రాజెక్టులను దక్కించుకోవడం ద్వారా 25 గి.వా. సామర్థ్యం లక్ష్యాన్ని చేరుకోగలం‘ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజస్తాన్, గుజరాత్లో ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజస్తాన్లోని జైసల్మేర్, బికనీర్, జోధ్పూర్లో అటు గుజరాత్లోని కచ్ ప్రాంతంలో నెలకొల్పవచ్చని వివరించాయి. సుమారు 4,00,000 దాకా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించవచ్చని పేర్కొన్నాయి. 2025 నాటికి పూర్తి.. ముందుగా 2022 నాటికి తొలి 2 గి.వా. ఉత్పత్తి సామర్థ్యం ప్రాజెక్టు మొదలవుతుందని, మిగతాది 2 గి.వా. చొప్పున 2025 నాటికి పూర్తవుతుందని అదానీ తెలిపారు. ప్రాజెక్టులను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్మించనున్నట్లు, 2022 నాటికి సోలార్ తయారీ కేంద్రం సిద్ధం కానున్నట్లు చెప్పారు. ఏకంగా 25 ఏళ్ల పాటు స్థిరంగా రూ. 2.92 మాత్రమే టారిఫ్ ఉండనుండటంపై స్పందిస్తూ ‘మాకు తగినంత మార్జిన్ ఉంటుంది. అంతేగాక ప్రాజెక్టు పూర్తి చేయడానికి 3–5 ఏళ్ల వ్యవధి ఉంటుంది. తగినంత మార్జిన్ ఉండటం వల్ల టారిఫ్ విషయంలో సమస్యేమీ లేదు‘ అని అదానీ తెలిపారు. ఇక, ఆగ్నేయాసియా దేశాలు.. ముఖ్యంగా చైనా నుంచి చౌకగా దిగుమతుల వల్ల దేశీ సంస్థలు నష్టపోకుండా తగు రక్షణాత్మక సుంకాలు అమలవుతుండటం కూడా ఊరటనిచ్చే అంశమని ఆయన వివరించారు. 900 మిలియన్ టన్నుల మేర కర్బన ఉద్గారాలను ఈ భారీ ప్రాజెక్టు తగ్గిస్తుందని, తద్వారా కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించుకోవాలన్న భారత లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు ఉపయోగపడగలదని పేర్కొన్నారు. మొత్తం మీద వచ్చే అయిదేళ్లలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో తమ సంస్థ రూ. 1,12,000 కోట్ల మేర (దాదాపు 15 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేసేందుకు ఈ కాంట్రాక్టు ఊతమివ్వగలదని అదానీ చెప్పారు. -
సోలార్ వెలుగులు
జిల్లాలో సోలార్ వెలుగులను అందించేందుకు ప్రభుత్వం పథక రచన చేసింది..సోలార్ పవర్ను ఉత్పత్తి చేసి స్థానికంగానే వ్యవసాయ పంపుసెట్లకు వినియోగించాలని సర్కార్ భావిస్తోంది.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో అవసరమైన భూమిని సేకరిస్తున్నారు. సోలార్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నారు.ఇక్కడ ఉత్పత్తి చేసిన పవర్ను కూడా అవసరమైన మేరకు వినియోగించి మిగిలిన పవర్ను విద్యుత్ సంస్దలకు అందిచాలని ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచిస్తోంది. సాక్షి కడప : ప్రభుత్వం పవర్కు వినియోగించే సొమ్ములను మిగులుబాటుగా మార్చుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు వ్యవసాయ పంపుసెట్లకు సంబంధించి పవర్ను కొనుగోలు చేస్తోంది. అయితే కొనుగోలు కాకుండా సొంతంగా ప్లాంట్లను పెట్టి తద్వారా ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్ను వ్యవసాయ పంపుసెట్లకు మళ్లించడం ద్వారా ఖర్చును తగ్గించుకోవడంతోపాటు అదనంగా కొంత మిగులుబాటు ఉంటుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా సూర్యరశ్మితో ప్రత్యేక కాంతులు విరజిమ్మేలా అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సోలార్ వెలుగులను విద్యా సంస్థలతోపాటు పరిశ్రమలు, రైతుల పంపుసెట్లకు అందిస్తున్నారు. సబ్సిడీతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సూర్యకాంతితో....తక్కువ ఖర్చుతో ఎక్కువ పవర్ను అందించేలా నెడ్క్యాప్ సంస్థ ముందుకు వెళుతోంది. సోలార్ పవర్ ప్యానల్స్ ఏర్పాటు చేసేందుకు అనుకూలమైన వసతులున్న ప్రాంతాలను అన్వేషిస్తున్నారు. జిల్లాలో భూముల భూసేకరణ జిల్లాలోని నెడ్క్యాప్ సంస్థ ద్వారా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు అవసరమైన భూములను అధికారులు పరిశీలిస్తున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే జిల్లాలోని పెండ్లిమర్రి, మైలవరం, బ్రహ్మంగారిమఠం, గండికోట, పులివెందుల ఇలా అనేక ప్రాంతాల్లో భూములను పరిశీలించారు. ప్రస్తుతానికి పెండ్లిమర్రి మండలంలోని పెద్దదాసరిపల్లె ప్రాంతంలో సుమారు 10 వేల ఎకరాలను సర్వే చేసి సిద్ధం చేశారు. అంతేకాకుండా మైలవరంలో మండలంలోని కంబాలదిన్నె పరిసర ప్రాంతాల్లోని రెండు, మూడు గ్రామాలను కలుపుకుని దాదాపు 4 వేల ఎకరాలు సర్వే చేసి సిద్ధం చేస్తున్నారు. ఆ ప్రాంతంలోనే మరో ఆరువేల ఎకరాల భూమిని కూడా పరిశీలిస్తున్నారు. సోలార్ ప్రాజెక్టుకు సంబం«ధించి పరిస్థితి అనుకూలంగా ఉండడంతో అన్ని రికార్డులను పరిశీలించి అనుమతులకు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 2800 మెగా వాట్ల ఉత్పత్తికి చర్యలు జిల్లాలో ప్రస్తుతానికి 20 వేల ఎకరాల వరకు భూమి సోలార్ పవర్కు సిద్ధంగా ఉన్నట్లు తెలియవచ్చింది. అయితే నెడ్క్యాప్ యంత్రాంగంతోపాటు రెవెన్యూ, ఇతర అధికారులు భూములపై పూర్తి స్థాయిలో సర్వే చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ను ఉత్పత్తి చేయాలని సంకల్పించిన నేపథ్యంలో రాయలసీమలోని అనంతపురం, కడప జిల్లాల్లో కూడా అనువైన భూముల కోసం అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం సేకరించిన భూమిని పరిశీలిస్తే దాదాపు 2800 నుంచి 3000 మెగా వాట్ల సోలార్ పవర్ను ఉత్పత్తి చేసేందుకు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కో మెగావాట్కు దాదాపు రూ. 4 నుంచి 4.50 కోట్ల మేర ఖర్చు వస్తుందని అధికారులద్వారా తెలుస్తోంది. ఏది ఏమైనా గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా సోలార్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. సోలార్ పవర్ ద్వారా వ్యవసాయ పంపుసెట్లకు వినియోగం రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ సంస్థల ద్వారా ప్రభుత్వం పవర్ను కొనుగోలు చేసి వ్యవసాయ పంపుసెట్లకు అందిస్తోంది. అయితే భారీ వ్యయం అవుతున్న నేపథ్యంలో దాన్ని తగ్గించి.....ప్రభుత్వమే ఉత్పత్తి చేస్తే ఖర్చు తగ్గుతుందని భావించి మందుకె ళుతున్నారు.వ్యవసాయ పంపుసెట్లపై ఐదేళ్లకు అవుతున్న ఖర్చును ప్రభుత్వం సోలార్పై పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఏది ఏమైనా పెద్ద ఎత్తున సూర్యరశ్మి ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు అడుగులు ముందుకు పడుతుండడం హర్షించదగ్గ పరిణామం. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం జిల్లాలో సోలార్ వెలుగులకు సంబంధించి అవసరమైన భూములను పరిశీలించడంతోపాటు సేకరిస్తున్నాం.పెండ్లిమర్రి, మైలవరం ప్రాంతాల్లో 20 వేల ఎకరాల వరకు భూమి ఉంది. సోలార్ పవర్ ఉత్పత్తికి అనువైన పరిస్థితులను పరిశీలిస్తున్నాం. రానున్న కాలంలో సోలార్కు మంచి డిమాండ్ ఉంది. ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా ఎక్కడికక్కడ సోలార్ పవర్ను ఉత్పత్తి చేసి వ్యవసాయ పంపుసెట్లకు వినియోగించాలని ఆలోచిస్తోంది.దీనికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.– ఎం.కోదండరాం, నెడ్క్యాప్ జిల్లా మేనేజర్, కడప -
సౌర వెలుగుల్లో అవినీతి చీకటి
సాక్షి, మంచిర్యాల: సౌర వెలుగుల్లోని అవినీతి చీకట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో గోబర్గ్యాస్ నిర్మాణాల్లో బయటపడిన అవినీతి తరహాలోనే సోలార్ యూనిట్లలోనూ రూ. లక్షల సబ్సిడీ సొమ్ము మధ్యవర్తుల జేబుల్లోకి వెళ్లింది. 2014–15 మధ్యకాలంలో పంపిణీ చేసిన సౌర యూనిట్లలో చోటుచేసుకున్న ఈ అవినీతిపై సీఐడీ, సంబంధిత అధికారులు విచారణ చేపడుతుండటంతో జరిగిన అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ వార్షిక ఆడిట్లో ఈ తతంగం బయటపడగా.. ఇప్పటికే కొంతమంది అధికారులు, డీలర్లపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో సీఐడీ, తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (టీఎస్ఆర్ఈడీసీవో) అధికారులు లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి జరిగిన అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పక్కదారి పట్టిన సబ్సిడీ సొమ్ము ప్రతి ఇంటా సౌర విద్యుత్ వినియోగం పెంపొందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సోలార్ ప్లాంటును సబ్సిడీపై లబ్ధిదారులకు అందజేశాయి. ఒక్కో సౌర యూనిట్ ధర రూ. 1.50 లక్షలుగా నిర్ణయించాయి. మొదట్లో లబ్ధిదారుడు మొత్తం యూనిట్ విలువ చెల్లిస్తే ఆ తర్వాత సబ్సిడీ అందించేలా నిబంధన ఉండేది. ఆ తర్వాత సబ్సిడీ పోను రూ. 60 వేలు చెల్లిస్తే చాలని కేంద్రం నిబంధన సడలించడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపారు. అయితే ఇక్కడే కొందరు ఏజెన్సీదారులు తమ చేతివాటం చూపించారు. ఫొటోలు, వివరాలు మార్చి.. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరి ఇళ్లలో సోలార్ యూనిట్లు అందజేయకున్నా.. తప్పుడు వివరాలతో డబ్బులు స్వాహా చేశారు. కొంతమంది ఏజెన్సీదారులు అనేకమంది వివరాలు సేకరించి ఒకే యూనిట్ను ఫొటోలు తీసి.. వేర్వేరుగా కనిపించేలా పెట్టి లబ్ధిదారుల పేర్లను వాడుకుని సబ్సిడీని పక్కదారి పట్టించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని నిర్మల్, కొమురంభీం జిల్లాల పరిధిలో మొత్తం 91 యూనిట్లు మంజూరు కాగా ఇందులో సగానికి సగం బోగస్ ఉన్నట్లు, మంచిర్యాల పట్టణ పరిధిలో 19 యూనిట్లకు పదింటిలో అవకతవకలు జరిగినట్లు తేలింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 40 యూనిట్లలో 20 యూనిట్ల సబ్సిడీ సొమ్మును 2 ఏజెన్సీలు కాజేసినట్లు గుర్తించారు. మరో రెండు మూడు రోజుల్లో విచారణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు కూడా చేయలేదు. నేను సోలార్ ప్లాంట్ కోసం దరఖాస్తు చేయలేదు. ఎక్కడా డబ్బులు చెల్లించలేదు. నాకు సోలార్ పరికరాలు కూడా రాలేదు. నా పేరు మీద సబ్సిడీ వచ్చినట్లు అధికారులు చెప్పేదాకా నాకు తెలియదు. – పి.రాజేశ్వర్, సర్వాయిపేట, కోటపల్లి మండలం, మంచిర్యాల జిల్లా -
మీ ‘పవర్’.. కాస్త ఆపండి!
నగరంలోని హైడెర్ష్కోఠ్ పీరం చెరువులోని గిరిధారి గేటెడ్ కమ్యూనిటీ నుంచి డిస్కంకు గతంలో నెలకు రూ.12 నుంచి 13 లక్షల వరకు విద్యుత్ బిల్లు వసూలయ్యేది. ఇటీవల ఆ గెటేడ్ కమ్యూనిటీ భవనంపై సోలార్ రూఫ్టాఫ్ ప్యానళ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నెలవారి విద్యుత్ బిల్లు రూ.6 లక్షలకు తగ్గింది. రాజేంద్రనగర్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి గతంలో ఏడాదికి రూ.కోటికి పైగా విద్యుత్ బిల్లు రాగా.. సోలార్ పలకల ఏర్పాటుతో ప్రస్తుతం రూ.40 లక్షలు తగ్గింది. నిథిమ్ క్యాంపస్ నుంచి నెలకు రూ.2.50 లక్షలు తగ్గింది. వాణిజ్య సంస్థలు, వ్యక్తిగత గృహ వినియోగదారులు తమ నెలవారి విద్యులు బిల్లులను తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయంగా సోలార్ నెట్ మీటరింగ్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకుంటుండటంతో విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థల పవర్ సేల్స్ భారీగా పడిపోతున్నాయి. ఆయా వినియోగదారుల నుంచి డిస్కంకు రావాల్సిన రెవెన్యూ తగ్గిపోయి... భవిష్యత్లో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రానుండటంతో ఇప్పటి నుంచే రెడ్కో దూకుడుకు కళ్లెం వేయాలని డిస్కంలు భావించాయి. ఆ మేరకు మీ ‘పవర్’కాస్తా ఆపండి అంటూ అనధికారిక ఆంక్షలు కొనసాగిస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: సోలార్ విద్యుత్ ఉత్పత్తితో డిస్కంల సేల్స్ తగ్గిపోయాయా..? సోలార్ నెట్ మీటరింగ్ కనెక్షన్లకు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు బ్రేకులు వేస్తున్నాయా...? అంటే అవువనే అంటున్నారు విద్యుత్ అధికారులు. సంప్రదాయ విద్యుత్తో పోలిస్తే హైడల్, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి భారీ ఖర్చుతో కూడుకుని ఉండటం, ఆ ఉత్పత్తికి అవసరమైన వనరులు కూడా పరిమితంగా ఉండటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ అంశాలపై దృష్టి సారించింది. సంప్రదాయ ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ఆలోచనతో ప్రభుత్వం విండ్, సోలార్ ఎనర్జీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. మూడు కిలోవాట్ల సామర్థ్యమున్న ప్యానళ్లపై 40 శాతం, పది కిలో వాట్ల సామర్థ్యమున్న ప్యానళ్లకు 20 శాతం రాయితీ ఇస్తుండటంతో నెలకు సగటున 300పైగా యూనిట్ల విద్యుత్ వాడే వినియోగదారులు సోలార్ రూఫ్టాప్ నెట్ మీటరింగ్పై దృష్టి సారించారు. పవర్ సేల్స్ పడిపోతుండటంతో... విద్యుత్ సంస్థలు ఏటా కరెంట్ చార్జీలు పెంచుతుండటం, నిర్ధేశిత సమయానికి ఆలస్యంగా రీడింగ్ నమోదు చేస్తుండటం వల్ల స్లాబ్రేట్ మారిపోతోంది. అధిక మొత్తంలో బిల్లులు వస్తుండటంతో దీని నుంచి బయటపడేందుకు చాలా మంది రూఫ్టాప్ సోలార్ నెట్ మీటరింగ్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సోలార్ ద్వారా 90 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా, గ్రేటర్లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 3,186 మంది తమ బహుళ అంతస్తుల నిర్మాణాలపై సోలార్ పలకను ఏర్పాటు చేసుకుని 60.9 మెగావాట్లకుపైగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. వ్యక్తిగతంగా విద్యుత్ బిల్లులు తగ్గించుకోవడమే కాదు.. విద్యుత్ను పంపిణీ సంస్థకు విక్రయిస్తున్నాయి. ఇలాగే నెట్ మీటరింగ్ కనెక్షన్లు ఇచ్చుకుంటూ పోతే డిస్కం పవర్ సేల్స్ భారీగా పడిపోయి వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదని ఇంజనీర్లు భావిస్తున్నారు. దీంతో రెడ్కో దూకుడుకు కళ్లెం వేయాలని నిర్ణయించింది. సోలార్ రూఫ్ టాప్నెట్ మీటరింగ్పై అనధికారిక ఆంక్షలు కొనసాగిస్తోంది. డిస్కంలకే విక్రయం... వంద ఎస్ఎఫ్టీ స్థలంలో ఒక కేవీఏ ప్యానల్ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక కేవీఏ ప్యానల్ రోజుకు సగటున ఐదు యూనిట్ల చొప్పున ఉత్పత్తి చేస్తుంది. ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే 25 ఏళ్ల వరకు పని చేస్తుంది. ఒక కేవీఏ ప్యానల్కు రూ.52 వేలు అవుతుండగా, ఈ మొత్తంలో కేంద్రం 40 శాతం సబ్సిడీ ఇస్తుంది. అపార్ట్మెంట్లకు రూఫ్ టాప్ ప్యానల్కు 20 శాతం సబ్సిడీ వస్తుంది. సోలార్ ప్యానళ్ల ధరలు కూడా ఇప్పుడు తగ్గాయి. సీపీడీసీఎల్ పరిధిలో రోజుకు సగటున 90 మెగావాట్ల (అంటే 45,000 యూనిట్ల) సోలార్ విద్యుత్ను ఉత్పత్తి అవుతుంది. డిస్కం ఆయా జనరేషన్ సంస్థల నుంచి అవసరాన్ని బట్టి యూనిట్కు రూ.6 నుంచి రూ.11 వరకు వెచ్చించి కొనుగోలు చేసి గృహ వినియోగదారులకు సబ్సిడీపై సరఫరా చేస్తుంది. ఈ క్రమంలో ఆదాయం తగ్గి డిస్కం సేల్స్ పడిపోయి, సంస్థ ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుండటంతో అనధికారిక ఆంక్షలు కొనసాగించాల్సి వస్తున్నట్లు డిస్కంలు ప్రకటిస్తున్నాయి. ఆంక్షలు పెట్టడం అన్యాయం ఇంటిపై ఒకసారి సోలార్ రూఫ్టాప్ నెట్ మీటరింగ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా 25 ఏళ్ల వరకు విద్యుత్ బిల్లులను ఆదా చేసుకునే అవకాశం ఉంది. వినియోగదారులకు లబ్ధిచేకూర్చే ఈ పథకాన్ని మరింత ప్రోత్సహించాల్సిన డిస్కంలు తమ రెవెన్యూ పడిపోతుందనే ఆలోచనతో సోలార్ నెట్ మీటరింగ్పై అనధికారిక ఆంక్షలు కొనసాగి స్తుండటం అన్యాయం. – బి.అశోక్కుమార్గౌడ్, అధ్యక్షుడు, తెలంగాణ సోలార్ అసోసియేషన్ మీ ‘పవర్’తగ్గించండి... ‘సోలార్ నెట్ మీటరింగ్ కనెక్షన్ల జారీతో డిస్కం పవర్ సేల్స్ పడిపోతున్నాయి. సంస్థకు అంతో ఇంతో రెవెన్యూఇచ్చే వినియోగదారులే నెట్ మీటరింగ్కు వెళ్లిపోయి.. నెలవారి బిల్లులను తగ్గించుకుంటున్నారు. ఇది డిస్కంల నష్టాలకు ఓ కారణమవుతోంది. సోలార్ ఎనర్జీ దూకుడు తగ్గించాలని కోరుతూ ఇప్పటికే టీఎస్ రెడ్కోకు విజ్ఞప్తి చేశాం.’ (శనివారం రాత్రి ఖైరతాబాద్ ఇంజనీర్స్ భవన్లో జరిగిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణలో రఘుమారెడ్డి చేసిన వాఖ్యలుఇవి) – రఘుమారెడ్డి, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ -
అవసరానికి మించి కొనుగోలు చేశారు
సాక్షి, అమరావతి: అవసరానికి మించి పవన, సౌర విద్యుత్ కొనుగోళ్ల వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టపోతాయని గతంలోనే డిస్కమ్లు స్పష్టంగా చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి విద్యుత్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ భారం వినియోగదారులపైనే పడుతుందని తొలిదశలోనే అభ్యంతరం వ్యక్తం చేసినట్టు, అయినప్పటికీ వీటిని అనుమతించడం వల్లే పంపిణీ సంస్థలు ఈ ఐదేళ్లలో భారీగా నష్టాన్ని మూటగట్టుకున్నాయని వివరించారు. రాష్ట్ర విద్యుత్రంగ పరిస్థితిపై ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి బుధవారం హైదరాబాద్లో ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితి, ఉత్పత్తి, విద్యుత్ డిమాండ్, విద్యుత్ కొనుగోళ్ల గురించి ఆయనకు విద్యుత్ అధికారులు వివరించారు. కేంద్రం పెట్టిన లక్ష్యానికి మించి పవన, సౌర విద్యుత్ కొనుగోళ్లు జరిగాయంటూ.. 2015–16లో 5 శాతం లక్ష్యమైతే 5.59 శాతం, 2016–17లో 8.6 శాతం కొనుగోలు చేశారని, 2017–18లో 9 శాతం తీసుకోవాల్సి ఉంటే 19 శాతం తీసుకున్నారని, 2018–19లో 11 శాతం లక్ష్యానికిగాను ఏకంగా 23.4 శాతం ప్రైవేటు పవన, సౌర విద్యుత్ తీసుకున్నారని తెలిపారు. దీనివల్ల 2015–16 నుంచి 2018–19 నాటికి విద్యుత్ సంస్థలపై రూ.5,497 కోట్ల అధిక భారం పడిందన్నారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలు(ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్లు) రూ.65 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయన్నారు. 2016–17లో అధిక రేట్లకు 10,478 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేశారని, చౌకగా లభించే థర్మల్ విద్యుదుత్పత్తిని 2017–18లో 12,014 మిలియన్ యూనిట్లు, 2018–19లో 7,628 మిలియన్ యూనిట్ల మేరకు తగ్గించినందువల్ల విద్యుత్ సంస్థలకు నష్టం వాటిల్లిందంటూ.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాన్ని ఏపీఈఆర్సీ ముందు పెట్టారు. గడచిన ఐదేళ్లలో కమిషన్ అనుమతించిన దానికన్నా అధికంగా విద్యుత్ కొనుగోళ్లు జరిగాయని, ఆ మొత్తాన్ని(ట్రూ–అప్) కమిషన్కు సమర్పించలేదని, ఈ లోటును పూడ్చడానికి అడ్డగోలుగా అప్పులు చేసిన విషయాన్ని వారు వివరించారు. పవన, సౌర విద్యుత్ కొనుగోళ్లపై సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని కమిషన్ చైర్మన్ ఆదేశించినట్టు అధికారవర్గాలు చెప్పాయి. అవినీతిని అరికట్టాలి ఏపీఈఆర్సీ చైర్మన్ నాగార్జునరెడ్డి విద్యుత్ పంపిణీ సంస్థల్లో అవినీతికి కళ్లెం వేయాలని డిస్కమ్ల సీఎండీలకు ఏపీఈఆర్సీ చైర్మన్ నాగార్జునరెడ్డి సూచించారు. గ్రీవెన్స్ సెల్కు వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, పురోగతిని వివరించాలని కోరారు. విద్యుత్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నారు. కమిషన్ పెట్టిన పరిమితికి మించి అయ్యే ఖర్చు(ట్రూ ఆప్)ను ఎప్పటికప్పుడు ఏపీఈఆర్సీకి సమర్పించాలన్నారు. విద్యుత్రంగ వాస్తవ పరిస్థితిని ఏపీఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లామని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి తెలిపారు. రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీ సమావేశాన్ని జనవరిలో నిర్వహించాలని, ఇకపై ప్రతీ మూడు నెలలకోసారి ఈ భేటీని ఏర్పాటు చేయాలని కమిషన్ చైర్మన్ సూచించినట్టు చెప్పారు. రబీ సీజన్, వేసవిలో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ను చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారన్నారు. సమావేశంలో ఏపీఈఆర్సీ సభ్యులు రఘు, రామ్మోహన్, ట్రాన్స్కో జేఎండీ చక్రధర్బాబు, తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థల సీఎండీలు నాగలక్ష్మి, హరినాథ్ పాల్గొన్నారు. -
ప్రయివేట్ మోత నుంచి విముక్తి
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ చార్జీల భారాన్ని డిస్కమ్లు భరించాల్సిన అవసరం లేదు. ఉత్పత్తి సంస్థలే దీన్ని భరించేలా పవన, సౌర విద్యుత్ విధానం – 2018కి ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ మేరకు ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి సోమవారం జీవో జారీ చేశారు. వినియోగదారులకు పెనుభారంగా మారుతున్న అనవసర వ్యయాన్ని తగ్గించడమే సవరణ ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. ట్రాన్స్మిషన్ చార్జీలతో ఏటా రూ.450 కోట్ల భారం ప్రయివేట్ విద్యుత్ సంస్థలకు ఇప్పటివరకు చెల్లిస్తున్న విద్యుత్ పంపిణీ చార్జీల నుంచి డిస్కమ్లకు కొత్త విధానంలో పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. నూతనంగా ఏర్పాటయ్యే పవన, సౌర విద్యుత్ ప్లాంట్లకు ఇది వర్తిస్తుందని ఇంధనశాఖ పేర్కొంది. సమగ్ర అధ్యయనం అనంతరం విద్యుత్శాఖ అధికారులు సూచించిన సవరణ లకు మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం తెచ్చిన సోలార్, విండ్ పాలసీ కారణంగా డిస్కమ్లు యూనిట్కు 25 పైసల చొప్పున ట్రాన్స్మిషన్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ భారం ఏటా దాదాపు రూ.450 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. మిగతా సవరణలు ఇవీ.. - నాన్ పీక్ అవర్లో (డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు) విద్యుత్ను గ్రిడ్కు అందిస్తూ పీక్ టైంలో (డిమాండ్ ఉన్నప్పుడు) ప్రైవేట్ సంస్థలు గ్రిడ్ నుంచి విద్యుత్ తీసుకుంటున్నాయి. ఈ సమయంలో విద్యుత్ పంపిణీ సంస్థలు అధిక రేటుతో మార్కెట్లో విద్యుత్ తీసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా యూనిట్కు రూ. 2 వరకు నష్టం కలుగుతోంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా మార్చేశారు. విద్యుత్ను గ్రిడ్కు అందించిన సమయంలోనే సంబంధిత సంస్థ విద్యుత్ను తన అవసరాలకు తీసుకోవాల్సి ఉంటుంది. - డిస్కమ్లను ఆర్థికంగా బాగా దెబ్బతీస్తున్న విధానం ‘ఫీడ్ అండ్ టారిఫ్’. ప్రకృతి సహకరించినప్పుడు మాత్రమే పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ సమయంలో థర్మల్ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తారు. సామర్థ్యాన్ని తగ్గించినప్పటికీ పూర్తిస్థాయి ఉత్పత్తికి అవసరమయ్యే బొగ్గును వాడాల్సి ఉంటుంది. ఫలితంగా యూనిట్కు 30 పైసల వరకు నష్టం వస్తోంది. ఇది నెలకు రూ.10 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా. థర్మల్ విద్యుత్ చర వ్యయం (వేరియబుల్ కాస్ట్) యూనిట్కు రూ. 3.10 వరకు ఉంటుంది. కాబట్టి సోలార్, విండ్ పవర్ యూనిట్ రూ. 2.80కి లభిస్తేనే విద్యుత్ సంస్థలు నష్టపోకుండా ఉంటాయి. ఈ తరహా సమతుల్యాన్ని పాటించాలని మంత్రివర్గం తీర్మానించింది. పవన, సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసే ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ భూమిని లీజు కిందే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
ముగిసిన గడువు..నెరవేరని లక్ష్యం
నల్లగొండ: గడువు ముగిసింది... కానీ లక్ష్యం నెరవేరలేదు. ఓ పక్క నిధుల కోసం ఆరాటపడుతుంటే.. మరోపక్క వచ్చిన నిధులను కూడా సవ్యంగా ఖర్చు చేయలేని పరిస్థితుల్లో జిల్లా విద్యుత్శాఖ ఉంది. కేంద్రప్రభుత్వం గత ఏప్రిల్ మాసంలో జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో లోఓల్టేజీ సమస్యతోపాటు పట్టణ విస్తరణకు అనుగుణంగా కొత్త లైన్ల ఏర్పాటు, పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఐపీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీం) కింద రూ. 32కోట్లను మంజూరు చేసింది. గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో నిధులు మంజూరు చేసి వాటిని అదే ఏడాది 2018 నాటికి పూర్తి చేయాలని గడువు విధించింది. గడువు ముగిసినా పనులు పూర్తి కాలేదు. పట్టణీకరణ పెరుగుతుండడంతో అందుకనుగుణంగా విద్యుత్పనులు మెరుగుపర్చడం, లోఓల్టేజీ సమస్య తీర్చేందుకు కొత్త సబ్ స్టేషన్లు, పెరిగిన కాలనీల్లో కొత్త లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఐపీడీ పథకాన్ని చేపట్టింది. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ మున్సిపాలిటీల్లో వివిధ పనులు చేపట్టేందుకు రూ. 32 కోట్లు మంజూరు చేసింది. గత ఏప్రిల్ నుంచి నవంబర్ నాటికే పూర్తి చేయాల్సి ఉన్నా అవి నేటికీ పూర్తి కాలేదు. నల్లగొండ టౌన్లో... నల్లగొండ పట్టణంలో మొత్తం 13 పనులు మంజూరయ్యాయి. అందుకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్ ఒకటి మంజూరు కాగా దాన్ని పూర్తి చేశారు. 33 కేవీ లైన్లు పట్టణంలో మూడు మంజూరైతే అవి ఇంకా పురోగతిలోనే ఉన్నాయి. మూడు లైన్లు, 33 కేవీ బ్రేకర్లు ఒకటి మంజూరు కాగా, వాటిని నేటి వరకు పూర్తి చేయలేదు. బైఫరికేషన్ ఆఫ్ 11 కేవీ ఫీడర్స్ ఆరు పనులు మంజూరు కాగా, ఇప్పటికి రెండు మాత్రమే పూర్తయ్యాయి. మరో 4 పనులు కొనసాగుతున్నాయి. ఎక్స్టెన్షన్ 11 కేవీ బ్రేకర్ 1, 11 కేవీ ఫీడర్స్ ఆగ్మెంటేషన్ పనులు కొనసాగుతున్నాయి. 160 కేవీ పనులు 10లో సగం పూర్తయి, సగం కొనసాగుతున్నాయి. డీ 100 కేవీఏ పనులు 80 పూర్తి కాగా, 100 నుంచి 160 కేవీ మార్పు పనులు పూర్తయ్యాయి. డీ63 నుంచి 100 కేవీఏ పనులు 20 మంజూరు కాగా, 3 మాత్రమే పూర్తయ్యాయి. ఎల్టీ లైన్లకు సంబంధించి 3ఫేస్ 5 వాల్ట్లైన్లు 50 మంజూరైతే 15 మాత్రమే పూర్తయ్యాయి. ఎల్టీ లైన్ల బైఫరికేషన్ 15 మంజూరు కాగా 5 పూర్తయ్యాయి. ఎల్టీ లైన్ల ఆగ్మెంటేషన్ 5 పనులకు 5 ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎల్టీ లైన్లు 1ఫేజ్ 2వాల్ట్స్ నుంచి 3ఫేజ్ 5వాల్ట్స్ పనులు 15 పనులకు 15 పనులు పూర్తి చేశారు. కెపాసిటర్ బ్యాంకులు 5, 11 కేవీ ఎక్ఎల్పీఈ ఏరియల్ బంచ్డ్ కేబుల్ 10, ఎల్టీఎల్పీఈ ఏరియల్ బంచ్డ్ కేబుల్ 70 ఎస్క్యూఎంఎం, 150 రూఫ్ సోలార్ ప్రాజెక్టులు, మీటరింగ్ ఫీడర్స్ 10, మీటరింగ్ డీటీఆర్ఎస్ 200, మీటరింగ్ కంజ్యూమర్స్ 2వేలు మంజూరు కాగా ఒక్కటి కూడా పూర్తి కాలేదు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు 265 మంజూరు కాగా వాటిని కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో బిగించని పరిస్థితి. దేవరకొండలో... దేవరకొండ పట్టణంలో పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 33 కేవీ బ్రేకర్లు, కొత్తగా 33 కేవీ లైన్లు 5, 11కొత్తగా 11 కేవీ ఫీడర్లతో పాటు 11 కేవీ బ్రేకర్లను ఎక్స్టెన్షన్ చేసేందుకు మరో రెండు మంజూరు చేసినా అవి పురోగతిలోనే ఉన్నాయి. 11 కేవీ ఫీడర్స్ ఆగ్మెంటేషన్ పనులు ఐదు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్తగా ఎల్టీ లైన్లు 30 మంజూరు కాగా 22 పూర్తయి 8 పురోగతిలో ఉన్నాయి. 20ఎల్టీ లైన్ల బైఫరికేషన్లో 5 పనులు మాత్రమే పూర్తి కాగా ఆగ్మెంటేషన్ ఆఫ్ ఎల్టీ లైన్ 5, కన్వర్షన్ ఆఫ్ ఎల్టీలైన్ ఫేజ్ 2 నుంచి 5ఫేజ్ 5వాల్ట్స్ పనులకు మార్పు పనులు పురోగతిలో ఉన్నాయి. ఎల్టీఎస్పీఈ ఏరియల్ బంచ్డ్ కేబుల్ 70ఎస్క్యూఎంఎం పనులు 5, 11 కేవీ అండర్గ్రౌండ్ పనులు రూఫ్టాప్ సోలార్ ప్రాజెక్టులు 40 ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మిగిలిన పనులు 80 శాతం పూర్తయ్యాయి. మిర్యాలగూడలో.. మిర్యాలగూడ పట్టణంలో 33/11 కేవీ సబ్ స్టేషన్లు 2 మంజూరు కాగా ఒక్కటి కూడా పూర్తి కాలేదు. 33 కేవీ లైన్లు 10 మంజూరైతే మూడే పూర్తయ్యాయి. 10 బైఫరికేషన్ ఆఫ్ 11 కేవీ ఫీడర్స్ మంజూరు కాగా ఒక్కటి కూడా పూర్తి కాలేదు. అదే విధంగా ఎక్స్టెన్షన్ విత్ 11 కేవీ బ్రేకర్లు 2, 11 కేవీ ఫీడర్స్ ఆగ్మెంటేషన్ పనులు 5 ఏవీ కూడా పూర్తి కాలేదు. డీ100 కేవీఏ పనులు 30, ఎ100 నుంచి 160 కేవీఏ పనులు 90 శాతం పూర్తయ్యా యి. అందులోని మరికొన్ని పనులు 20శాతం కూ డా పూర్తి కాలేదు. ఎల్టీ లైన్లకు సంబంధించి కొత్త ఎల్టీ లైన్లు, బైఫరికేషన్ ఎల్టీ లైన్లు, ఆగ్మెంటేషన్ ఆఫ్ ఎల్టీ లైన్లు, కన్వర్షన్ ఆఫ్ ఎల్టీ లైన్లు, 1 ఫేజ్ 2వాల్ట్స్ నుంచి 3ఫేజ్ 5వాల్ట్స్కు సంబంధించిన 10 పనులు ఇంకా పురోగతిలోనే ఉన్నాయి. కెపాసిటర్ బ్యాంక్ పనులు 5, 11 కేవీ ఎక్స్ఎల్పీఈ ఏరియల్ బంచ్డ్ కేబుల్ 10, అందులోనే బంచ్డ్ కేబుల్ 70 ఎస్క్యూ ఎంఎం పనులు 10, 11 కేవీ అండర్గ్రౌండ్ కేబుల్ పనులు 2, రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టులు 30, 89 ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల బిగింపు పనులు కూడా కాలేదు. కొన్ని ప్రారంభమై పనులు కొనసాగుతుండగా, మరికొ న్ని నేటికీ ప్రారంభంకాని పరిస్థితి నెలకొంది. ఇచ్చిన నిధులు ఖర్చు చేస్తేనే... కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాల అభివృద్ధికి అయితే నిధులు కేటాయిస్తుందో వాటిని గడువులోగా పూర్తి చేయాలి. అప్పుడే తిరిగి ఆ రాష్ట్రాలకు కొత్తగా వచ్చే స్కీములను ఇచ్చేందుకు సుముఖత చూపుతారు. అధికారులు జిల్లాకు మంజూరైన వాటిని త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అసంపూర్తిగా ఉన్న పనులు మార్చి నాటికి పూర్తి చేయాలని కేంద్రం గడువు విధించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ గడువులోపు పూర్తవుతాయో..లేవో చూడాలి. -
సోలార్ ‘పవర్’
సాక్షి, సిటీబ్యూరో: మహానగర తాగునీటి సరఫరా వ్యవస్థ నిర్వహణకు సౌర విద్యుత్ (సోలార్ పవర్) వినియోగించే అంశంపై జలమండలి దృష్టిసారించింది. ప్రస్తుతం పరిశ్రమల విభాగం కింద కరెంట్ చార్జీలతో బోర్డు ఆర్థికంగా కుదేలవుతోన్న నేపథ్యంలో సోలార్ పవర్తో కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్రెడ్కో) సౌజన్యంతో ప్రయోగాత్మకంగా 30 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను సైతం రూపొందించింది. ప్రభుత్వం ఆమోదం తెలిపితే జలమండలికి సంబంధించిన 50 రిజర్వాయర్లు, పంప్హౌస్ల వద్ద సౌర పలకలు ఏర్పాటు చేసి విద్యుత్ను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని టీఎస్రెడ్కో సొంతంగా సమకూర్చుకోనుంది. ఈ సంస్థ ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్ను జలమండలి యూనిట్కు రూ.3 చొప్పున కొనుగోలు చేస్తుందని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ప్రస్తుతం జలమండలికి యూనిట్కు రూ.5.60 చొప్పున విద్యుత్ సరఫరా అవుతున్న విషయం విదితమే. కరెంట్ కష్టాలు దూరం... ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా ఉన్న పెండింగ్ విద్యుత్ బిల్లులు చెల్లించలేక వాటర్ బోర్డు ఆపసోపాలు పడుతోంది. దీనికి తోడు ప్రతినెల సుమారు రూ.75 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించడం గుదిబండగా మారింది. వందల కిలోమీటర్ల దూరం నుంచి గ్రేటర్కు తరలిస్తోన్న కృష్ణా, గోదావరి జలాల పంపింగ్, స్టోరేజీ రిజర్వాయర్ల నుంచి 9.65 లక్షల నల్లా కనెక్షన్లకు నీటి సరఫరా చేసేందుకు నెలకు దాదాపు 120 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోంది. ఈ స్థాయిలో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పేందుకు ఏక మొత్తంలో సుమారు రూ.600 కోట్లు అవసరమవుతాయి. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రైవేట్ ఆర్థిక సంస్థల నుంచి రుణంగా సేకరిస్తేనే ప్రాజెక్టు సాకారమయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తొలి విడతగా 30 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్రాజెక్టును పట్టాలెక్కించే దిశగా ముందడుగు వేయడం విశేషం. బిల్లులతో షాక్... జలమండలికి నెలవారీగా నీటి బిల్లుల వసూలు, ట్యాంకర్ నీళ్ల సరఫరా, నూతన నల్లా కనెక్షన్ల జారీతో రెవెన్యూ ఆదాయం కనాకష్టంగా రూ.95 కోట్ల మేర సమకూరుతోంది. కానీ నెలవారీ వ్యయం రూ.112 కోట్లు మించుతోంది. ప్రధానంగా నెలవారీగా విద్యుత్ బిల్లుల రూపేణా రూ.75 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. మిగతా మొత్తంలో ఉద్యోగుల జీతభత్యాలు, గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించిన వాయిదాలు, వడ్డీ చెల్లింపులు, నిర్వహణ వ్యయాలు, మరమ్మతులు, నీటి శుద్ధి తదితర ప్రక్రియలకు సుమారు రూ.37 కోట్లు వ్యయమవుతోంది. ప్రతినెలా బోర్డు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల లోటుతో నెట్టుకొస్తోంది. దీనికి తోడు గత కొన్ని నెలలుగా రూ.100 కోట్లకు పైగా విద్యుత్ బిల్లులు కొండలా పేరుకుపోవడంతో బోర్డు ఖజానాకు షాక్లా పరిణమిస్తోంది. -
మార్స్పై ‘ఇన్సైట్’ తొలి అడుగు
వాషింగ్టన్: మానవ ఆవాసానికి అనుకూలమైనదిగా భావిస్తున్న అంగారక గ్రహ లోగుట్టు కనిపెట్టేందుకు మరో ముందడుగు పడింది. ఆ గ్రహం అంతర్భాగాన్ని అధ్యయనం చేయడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తొలిసారిగా ప్రయోగించిన రోబో ఆధారిత ల్యాండర్ ‘ఇన్సైట్’ విజయవంతంగా గ్రహంపై దిగింది. ఇన్సైట్ సుమారు ఆరు నెలల సుదీర్ఘ ప్రయాణం చేసి అంగారకుడి మధ్యరేఖ ‘ఎలీసియమ్ ప్లానీషియా’కు దగ్గర్లో దిగింది. ల్యాండర్లో అమర్చిన సౌర పలకలు తెరుచుకుని, సౌర శక్తిని గ్రహిస్తున్నట్లు ఛాయాచిత్రాలు వెలువడ్డాయి. అంగారక ఉపరితలంపై ఇన్సైట్ దిగుతున్న చిత్రాలు మంగళవారం ఉదయమే భూమికి చేరాయని నాసా తెలిపింది. ప్రయోగం అంతా సవ్యంగా సాగిందని, ఎలాంటి సమస్యలు లేకుండా ఇన్సైట్ పని ప్రారంభించిందని తెలిపింది. కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ ఎయిర్ఫోర్స్ బేస్ నుంచి మే 5న ఈ ప్రయోగం చేపట్టారు. ఇన్సైట్ వెంట రెండు చిన్న ఉపగ్రహాల(మార్కో క్యూబ్శాట్స్)ను పంపారు. మార్స్ అంతర్భాగాన్ని అధ్యయనం చేసి రెండు, మూడు నెలల తరువాతి నుంచి విలువైన సమాచారం, ఫొటోల్ని పంపనుంది. ఈ ల్యాండర్ 2020, నవంబర్ 24 వరకు సేవలందిస్తుంది. ఈ సమయం అంగారకుడిపై సుమారు 405 రోజులకు సమానం. తాజా ప్రయోగంతో అంగారక గ్రహంపైకి నాసా చేపట్టిన 8వ మిషన్ విజయవంతమైనట్లయింది. ప్రయోగం విశేషాలు ►ఇన్సైట్ గంటకు 19,800 కి.మీ వేగంతో ప్రయాణించి అంగారకుడిని చేరింది. ►అంగారకుడిపై ఇన్సైట్ ల్యాండింగ్ ప్రక్రియ కేవలం ఆరున్నర నిమిషాల్లోనే ముగిసింది. ►ఆ వెంటనే ఇన్సైట్ పని ప్రారంభించడంతో..16 నిమిషాల్లో దాని సోలార్ పలకలు విచ్చుకుని సౌర శక్తిని గ్రహించడం మొదలుపెట్టాయి. ►వారం రోజుల తరువాత ఇన్సైట్ సైన్స్ డేటా సేకరణను ప్రారంభిస్తుంది. ►ఇన్సైట్లో అమర్చిన రోబోను పరిశోధకులు రెండు రోజుల తరువాత రంగంలోకి దింపుతారు. ►రెండు, మూడు నెలల్లో రోబో..ఈ మిషన్లో అంతర్భాగమైన సీస్మిక్ ఎక్స్పరిమెంట్ ఇంటీరియర్ స్ట్రక్చర్(సీస్), హీట్ ఫ్లో అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ప్యాకేజ్(హెచ్పీ3) పరికరాల్ని మోహరిస్తుంది. వీటితోనే ►అంగారకుడి సమాచారం పొందడానికి వీలవుతుంది. ►ఆ తరువాత రోబో పాత్ర క్రమంగా కనుమరుగవుతుంది. ►అంతకు ముందు, మిషన్లో అమర్చిన కెమెరాలు పంపే అంగారక ఉపరితల చిత్రాల ఆధారంగా ఆ పరికరాల్ని ఎక్కడ అమర్చాలో పరిశోధకులు నిర్ణయిస్తారు. ►ఆలోపు, వాతావరణ సెన్సార్లు, మాగ్నెటో మీటర్ ఉపయోగించుకుని ఇన్సైట్ తన కొత్త ఆవాసం అయిన ’ఎలీసియమ్ ప్లానీషియా’లోని పరిస్థితుల గురించి సమాచారం అందజేస్తుంది. ►అంగారకుడిపై ఇన్సైట్ కదలికల్ని మార్కో క్యూబ్శాట్స్ పరిశీలించి ఆ చిత్రాల్ని భూమికి పంపుతాయి. -
గాలివీడులో సోలార్ పవర్ స్టేషన్
కడప అగ్రికల్చర్ : జిల్లాలో సోలార్ వెలుగులు జిగేల్ మనిపించేందుకు జాతీయ సంప్రదాయేతర ఇందనవనరుల శాఖ పవర్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అందుకు కావాల్సిన స్థలాన్ని ఇది వరకే జిల్లా యంత్రాంగం సేకరించి పెట్టింది. గాలివీడు మండలం తూముకుంట, వెలిగల్లు వద్ద ఉన్న 3600 ఎకరాలను దీని కోసం జిల్లా యంత్రాంగం ఎంపిక చేసింది. ఆ స్థలాన్ని పరిశీలించి పవర్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు సాధ్యా సాధ్యాలను పరిశీలించడానికి ఈనెల 27,28 తేదీలలో హైదరాబాద్ నుంచి రాష్ట్ర సంప్రదాయేతర ఇందనవనరుల శాఖ ఉన్నతాధికారులు జిల్లాకు వస్తున్నట్లు సమాచారం అందింది. తూముకుంట, వెలిగల్లు వద్ద బంజరు భూమి, డీకేటీ భూమితోపాటు మరికొంత విస్తీర్ణంలో రైతుల నుంచి పట్టా భూములను కూడా సేకరించారు. 500 మెగావాట్ల సామర్థ్యం ఉండే ఈ పవర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే జిల్లాలో ఉన్న విద్యుత్ కొరత చాలా వరకు తీరుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. గ్రామాల్లో ఉండే విద్యుత్ లోఓల్టేజి చాలా వరకు తీరుతుందని అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజులన్నీ సోలార్కే ప్రాధాన్యం రాబోయే రోజులన్నీ సోలార్కే ప్రాధాన్యత ఉంటుందని సంప్రదాయేతర ఇందన వనరుల శాఖ జిల్లా మేనేజరు సత్యనారాయణరావు (పోన్ 9000550973) శుక్రవారం కడప నగరంలోని చిన్నచౌక్లోని తన కార్యాలయంలో సాక్షికి తెలిపారు. సోలార్ పంపుసెట్లకు కూడా తమశాఖ, విద్యుత్ సంస్థ రాయితీలు ఇస్తోందని తెలిపారు. 0-200 అడుగుల లోతులో నీటి వనరులు ఉండే ప్రాంతాల రైతులకే ఈ పంపుసెట్లు ఏర్పాటు చేసుకోవడానికి వీలుంటుందన్నారు. 5 హార్స్ పవర్ సామర్థ్యం ఉండే పంపుసెట్టుకు సోలార్ యూనిట్ అసలు ధర రూ.4.90 లక్షలు అవుతుందని, దీంట్లో లబ్ధిదారులు చెల్లించాల్సిన వాటా రూ. 55 వేలే అన్నారు. మిగతా మొత్తాన్ని విద్యుత్శాఖ, నెడ్క్యాప్ భరిస్తాయన్నారు. ఈ పంపుసెట్లకు 5 సంవత్సరాల వారంటీ, 5 సంవత్సరాల నిర్వహణ (రిపేర్లు ఇతర సమస్యలు) విద్యుత్ సంస్థ చేపడుతుందన్నారు. సోలార్ ఒక కిలో వాట్ పవర్ప్యాక్ కొత్తగా వచ్చిందన్నారు. నెలకు 100 నుంచి 120 యూనిట్ల కరెంటు వినియోగించే గృహ వినియోగదారులకు మాత్రమేనని తెలిపారు. ఈ యూనిట్ ఖరీదు రూ.1.60 లక్షలు అవుతుందన్నారు. అన్ని వర్గాలకు రూ. 50 వేలు సబ్సిడీ ఇస్తున్నామన్నారు. మిగతా రూ.1.10 లక్షలు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. జిల్లాకు ఈ యూనిట్లు 400లు వచ్చాయన్నారు. బయోగ్యాస్ యూనిట్లు 140 వచ్చాయన్నారు. సోలార్ ఎల్ఈడి ల్యాంపులు 450 యూనిట్లు వచ్చాయన్నారు. ఈ ల్యాంప్ అసలు ధర రూ.1870లు కాగా సబ్సిడీ రూ.1000లు, మిగిలిన మొత్తం రూ. 870లు లబ్ధిదారులు భరించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో నీటి యాజమాన్య సంస్థ సహకారంతో 120 గ్రామాల్లో 750 వీధి దీపాలు ఏర్పాటు చేశామన్నారు. -
టిబెట్లో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం!
భారత సరిహద్దుకు సమీపంలో నిర్మించిన చైనా బీజింగ్: ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం(ఫొటో ఓల్టాయిక్ పవర్ స్టేషన్)ను టిబెట్లో చైనా నిర్మించింది. భారత సరిహద్దు(వాస్తవాధీన రేఖ)కు సమీపంలో టిబెట్లోని ఎన్గరీ ప్రిఫెక్ఛర్లో ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని చైనా పూర్తిచేసినట్లు ఈ మేరకు గురువారం ఆ దేశ జాతీయ వార్తా సంస్థ ‘జిన్హువా’ వెల్లడించింది. ఈ 10-ఎంవీ పీవీ పవర్ స్టేషన్ను కేంద్ర ప్రభుత్వం, గ్వాడియన్ లాంగ్వాన్ టిబెట్ న్యూ ఎనర్జీ కంపెనీ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించాయని తెలిపింది. 23.8 హెక్టార్లలో ఏర్పాటుచేసిన పది మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంటును ప్రస్తుతం ప్రయోగాత్మకంగా నడపనున్నారని, ఈ ప్లాంటు 25 ఏళ్లపాటు పనిచేస్తుందని పేర్కొంది.