Tamil Movies
-
మహారాజ సినిమా దుమ్మురేపడానికి రెడీ అవుతుంది
-
అలాంటి సినిమాల్లో నటించను : నిత్యా మీనన్
పాత్ర నచ్చితే చాలు చిన్న పెద్ద సినిమా అనే తేడా చూపకుండా నటిస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నిత్యా మీనన్. హీరో ఎవరైనా సరే నిత్యా మీనన్ పాత్ర మాత్రం చాలా ఆ సినిమాలో కీలకంగా ఉంటుంది. భారీ సినిమా, పారితోషికం ఎక్కువ అని సినిమాలు ఒప్పుకొదు. తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలో నటిస్తుంది. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెబుతూ..తన సినిమాల ఎంపిక గురించి ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది.(చదవండి: అభిమానులకు విజయ్ పిలుపు.. మొదటి సభకు ఏర్పాట్లు)‘70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎంపిక అవుతానని ఊహించలేదు. అవార్డులు, రివార్డుల కోసం సినిమాల్లో నటించను. నేను పోషించిన పాత్ర నాకు సంతోషాన్నిస్తే చాలనుకున్నా. దాన్ని దృష్టిలో పెట్టుకొనే పాత్రలను ఎంపిక చేసుకుంటా. . భారీ బడ్జెట్తో తీసే మసాలా సినిమాల్లో అవకాశం వచ్చినా నటించను. అలాంటి పాత్రలంటే నాకు ఆసక్తి ఉండదు. మంచి పాత్ర అయితే చిన్న సినిమా అయినా అంగీకరిస్తా’ అని నిత్యా మీనన్ అన్నారు. (చదవండి: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్ష సాయి)కాగా, ‘తిరు’ సినిమాకుగాను నిత్యామీనన్కు జాతీయ అవార్డు లభించింది. ఈ చిత్రంలో ధనుష్ హీరోగా నటించగా, రాఖీ ఖన్నా హీరోయిన్గా నటించింది. మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరో స్నేహితురాలిగా నిత్యమీనన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె పాండిరాజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అలాగే ‘గోల్డెన్ వీసా’, ఇడ్లికడై అనే సినిమాల్లోనూ నటిస్తున్నారు. -
ఫాంటసీ చిత్రంలో నిత్యమీనన్
తమిళసినిమా: దక్షిణాది భాషా నటీమణుల్లో తనకంటూ ప్రత్యేకత కలిగిన నటి నిత్యామీనన్. ఈమె ఏ చిత్రంలో ఎలాంటి పాత్రను పోషించినా అందులో తన ముద్ర ఉండేలా చూసుకుంటారు. అలా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తున్న నిత్యామీనన్ ఇటీవల తమిళంలో నటించిన చిత్రం తిరుచిట్రంఫలం. ధనుష్ కథా నాయకుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇందులో నిత్యామీనన్ తన నటనకుగానూ విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. ఇకపోతే నిత్యామీనన్ను తాజాగా మరో హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటించే అవకాశం వరించింది. వినోదంతో కూడిన ఫాంటసీ కథా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని బాస్క్ టైమ్ థియేటర్స్, పాప్టర్ మీడియా సంస్థ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇందులో వినయ్రాయ్, నవదీప్, ప్రతీక్ బబ్బర్, దీపక్ పరంబోల్ ముఖ్యపాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రం ద్వారా కామిని దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఆమె దర్శకుడు విష్ణువర్ధన్ శిష్యురాలు కావడం గమనార్హం. త్వరలో సెట్పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి ప్రీతా జయరా మన్ చాయాగ్రహణం, కళా దర్శకత్వం బాధ్యతలను షణ్ముగరాజా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వర లో వెల్లడించనున్నట్లు నిర్మాతలు శుక్రవారం మీడియా కు విడుదల చేసిన మీడియా ప్రకటనలో పేర్కొన్నారు. -
తన పేరుతో మోసం.. బండారం బయటపెట్టిన సీరియల్ నటి
జనాల్ని మోసం చేయడంలో దొంగలు సరికొత్తగా ఆలోచిస్తున్నారు. అయితే మిగతా విషయాలేమో గానీ సెలబ్రిటీలు పేరు చెప్పి డబ్బులు కాజేసే పనులు చేస్తుంటారు. అలా తాజాగా ఓ సీరియల్ నటి పేరు చెప్పి లక్షలు వెనకేసుకునే పనిలో పడ్డారు. కానీ సదరు నటి స్పందించడంతో బండారం అంతా బయటపడింది. (ఇదీ చదవండి: అందుకే ఇంత లావయ్యాను.. చిన్నప్పుడు ఆ భయం ఉండేది: వైవా హర్ష) ఏం జరిగింది? తమిళంలో పలు సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న అల్య మానస.. సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ సంపాదింంచింది. కొన్నిరోజుల క్రితం 'వణక్కం తమిళగం' అనే షోలో పాల్గొంది. ఆ షోలో ఈమె.. మార్కెటింగ్ స్కీమ్ గురించి చెప్పినట్లు.. దీని ద్వారా లెక్కలేనంతగా డబ్బు సంపాదిస్తున్నానని ఈమె చెప్పినట్లు ఓ వీడియో వైరల్ అయిపోయింది. పలు పత్రికల్లోనూ ఇదే విషయం పబ్లిష్ కాగా.. ఈ విషయం అల్య మానస దృష్టికి వెళ్లింది. 'అల్య మానస బాగా డబ్బు సంపాదిస్తోంది. ఈమెలానే మీరు కూడా కోటీశ్వరులు కావాలనుకుంటే.. దిగువన లింక్ క్లిక్ చేయండి' అని తన పేరు చెప్పి జరుగుత్ను మోసంపై అల్య మానస ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మార్కెటింగ్ స్కీమ్ గురించి షోలో తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదని, కారు-ఇల్లు కొన్న విషయం నిజమే కానీ వాటిని ఈఎంఐ పద్ధతి తీసుకున్నానని చెప్పింది. అన్నింటికీ మించి అడ్డదారిలో కోటీశ్వరురాలిని కావాలనే ఆలోచన తనకు లేదని క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: మెగా హీరో మూవీకి చిక్కులు.. షూటింగ్కి ముందే నోటీసులు) -
సౌత్ ఇండియాలో క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలు ఇవే
తెలుగు అనగానే గుర్తొచ్చేది ఆవకాయ్... తమిళ్ అంటే సాంబార్... మలయాళంకి కూడా సాంబార్ టచ్ ఉంది. ఇప్పుడు ఆవకాయ్ డైరెక్షన్కి సాంబార్ సై అనడంతో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. అదేనండీ.. మన తెలుగు డైరెక్టర్ల డైరెక్షన్లో తమిళ, మలయాళ హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఇటు తెలుగు అటు తమిళ, మలయాళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో ఈ చిత్రాలు విడుదల కానున్నాయి. ఇక తెలుగు డైరెక్టర్లు – పరభాషా హీరోల కాంబో గురించి తెలుసుకుందాం. శేఖర్ కమ్ముల, ధనుష్... డీ 51 వాణిజ్య అంశాల కంటే కథకి, సహజత్వానికి ప్రాధాన్యత ఇచ్చే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ఒక సినిమా తర్వాత మరో సినిమా వెంట వెంటనే చేసేయాలని కాకుండా కొంచెం ఆలస్యమైనా మంచి సినిమాలు తీస్తుంటారు శేఖర్ కమ్ముల. ‘ఫిదా, లవ్స్టోరీ’ వంటి వరుస హిట్లు అందుకున్న ఆయన తన తర్వాతి చిత్రాన్ని తమిళ హీరో ధనుష్తో చేస్తున్నారు. ‘డీ 51’ (వర్కింగ్ టైటిల్) పేరుతో తెలుగు–తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో ఇంతకు ముందు చూడని సరికొత్త పాత్రలో ధనుష్ని చూపించనున్నారట శేఖర్. సోనాలీ నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. కాగా ధనుష్ చేసిన తొలి తెలుగు స్ట్రయిట్ మూవీ ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్ చేస్తున్నది సెకండ్ స్ట్రయిట్ తెలుగు మూవీ అవుతుంది. చందు, సూర్య కాంబో కుదిరిందా? ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్నారు డైరెక్టర్ చందు మొండేటి. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ‘ఎన్సీ 23’ (వర్కింగ్ టైటిల్) సినిమా ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు చందు. ఇప్పటివరకూ తెలుగు హీరోలతోనే సినిమాలు తీసిన ఆయన తమిళ హీరో సూర్యతో ఓ సినిమా చేయనున్నారు. వీరి కాంబినేషన్లో ఓ సినిమా రానుందంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగు తోంది. సూర్య– చందు కాంబినేషన్ దాదాపు కుదిరిందని టాక్. సరైన కథ కుదిరితే డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తానంటూ చెప్పుకొస్తున్న సూర్య.. చందు మొండేటి చెప్పిన కథ తెలుగు ఎంట్రీకి కరెక్ట్ అని భావించారట. మైథాలజీ నేపథ్యంలో సోషియో–ఫ్యాంటసీ జానర్లో ఈ చిత్రకథ ఉంటుందని టాక్. పరశురామ్తో కార్తీ? ‘గీత గోవిందం, సర్కారు వారి పాట’ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నారు డైరెక్టర్ పరశురామ్. ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ–డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో మరో సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా తమిళ హీరో కార్తీతో పరశురామ్ ఓ సినిమా తెరకెక్కించనున్నారనే వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఆ మధ్య చెన్నై వెళ్లి కార్తీకి కథ వినిపించారట ఆయన. ‘ఊపిరి’ (2016) సినిమా తర్వాత తెలుగులో ఓ సరైన స్ట్రయిట్ ఫిల్మ్ చేయాలని ఎంతో ఆసక్తిగా ఉన్న కార్తీకి పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో పచ్చజెండా ఊపారని టాక్. ఈ సినిమాకు ‘రెంచ్ రాజు’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందట. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించాలని భావిస్తున్నారట పరశురామ్. అటు కార్తీ, ఇటు పరశురామ్ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయా చిత్రాలు పూర్తయ్యాకే వీరి సినిమా సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెంకీతో దుల్కర్ లక్కీ భాస్కర్ తమిళ హీరో ధనుష్తో ‘సార్’(తమిళంలో వాత్తి) సినిమాని తెరకెక్కించి, సూపర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ వెంకీ అట్లూరి. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది. తన తాజా చిత్రాన్ని మలయాళ హీరో దుల్కర్ సల్మాన్తో తీస్తున్నారు వెంకీ అట్లూరి. ‘లక్కీ భాస్కర్’ టైటిల్తో ఈ చిత్రం రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో వెంకీ అట్లూరితో ‘సార్’ నిర్మించిన సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘లక్కీ భాస్కర్’ నిర్మిస్తున్నారు. ‘సార్’ సినిమాతో విద్యా వ్యవస్థ నేపథ్యంలో సమాజానికి చక్కని సందేశం ఇచ్చిన వెంకీ అట్లూరి ‘లక్కీ భాస్కర్’ ద్వారా మరో విభిన్న కథాంశంతో ప్రేక్షకులను మెప్పించనున్నారట. ఒక సామాన్యుడు తనకు అడ్డొచ్చిన అసమానతలను దాటుకుని ఉన్నత శిఖరాలను ఎలా చేరుకున్నాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. కాగా ‘మహా నటి’, ‘సీతా రామం’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మరో స్ట్రయిట్ తెలుగు చిత్రం ‘లక్కీ భాస్కర్’. -
కొత్త రూల్స్.. తమిళనాడులోనే షూటింగ్.. తమిళులకే ఛాన్స్!
తమిళ చిత్రాలను అనవసరంగా విదేశాల్లో షూటింగ్ నిర్వహించరాదని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి పేర్కొన్నారు. ఈ సమాఖ్య నిర్వాహకులు, తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులు బుధవారం సాయంత్రం చైన్నెలో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో తీసుకున్న నిర్ణయాలను సెల్వమణి మీడియాకు వెల్లడించారు. అందులో ఒక సినిమాను నిర్మించడానికి ముందు నటీనటులు, సాంకేతికవర్గంతో ఒప్పందం చేసుకున్న తర్వాత ఆ వివరాలను ఫెఫ్సీకి లిఖిత పూర్వక లేఖ రాసి అందజేయాలన్నారు. అన్ని అంశాలు సక్రమంగా ఉన్నాయని చిత్ర నిర్మాత ఫెఫ్సీకి లిఖితపూర్వక లేఖను అందించిన తర్వాతే ఫెప్సీ కార్మికులు ఆ చిత్రాల్లో పనిచేస్తారన్నారు. లేకుంటే 2022, మార్చిలో చేసుకున్న ఒప్పందంలోని నిబంధనల్లో ప్రధానంగా తమిళ చిత్రాల షూటింగ్లలో తమిళ కళాకారులకే పని కల్పించాలని, తమిళ చిత్ర షూటింగ్ లను తమిళనాడులోనే నిర్వహించాలని చెప్పారు. షూటింగ్లో పనిచేసే దినసరి కార్మికులకు అదేరోజు వేతనాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. చిత్ర కథను దర్శకుడే రాసుకుంటే ఆ తర్వాత ఆ కథ గురించి తలెత్తే సమస్యలకు ఆయనే బాధ్యత వహించాలన్నారు. నిర్మాతలను సమస్యల్లోకి లాగకూడదన్నారు. ఇతర రచయిత కథ అయితే దర్శకుడు అందుకు తగిన విధివిధానాలను రూపొందించాలన్నారు. చిత్రాన్ని ముందుగా నిర్ణయించిన బడ్జెట్లో నిర్ణయించిన రోజుల్లో పూర్తిచేయలేకపోతే నిర్మాతల వర్గం అందుకు కారణాలను లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. ఈనిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. FEFSI - Film employee's federation of south India new rules 1. For Tamil films only Tamil artists should be employed. 2. Shooting of films should happen only in Tamil Nadu. 3. Shoot should not take place in outside state or outside country without utmost necessity. 4. If… pic.twitter.com/Drno33OSX5 — Manobala Vijayabalan (@ManobalaV) July 20, 2023 చదవండి: ప్రాజెక్ట్ కె టైటిల్ గ్లింప్స్ రిలీజ్ -
రెస్టారెంట్కు ఓనర్ కాబోతున్న హీరోయిన్
బుల్లితెర నుంచి వెండి తెరకు వచ్చిన నటి ప్రియా భవాని శంకర్. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. పాత్ర చిన్నదో పెద్దదో స్టార్ హీరోల చిత్రాలు కనిపిస్తోంది.. మరోపక్క కథానాయకిగానూ చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఆ మధ్య కార్తీ కథానాయకుడిగా వచ్చిన కడైకుట్టి సింగం చిత్రంలో చిన్న పాత్రలో నటించింది. అయితే ఆ చిత్రం విజయంతో ఈ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది. అదేవిధంగా ఇటీవల ధనుష్ చిత్రం తిరుచిట్ట్రంఫలం చిత్రంలోనూ కనిపించింది. ఇకపోతే తాను డబ్బు వస్తుందనే నటించడానికి వచ్చానని ఓ ఇంటర్వ్యూలో ఆమె పేర్కొంది. తాజాగా తాను అలా అనలేదంటూ ప్లేట్ పిరాయించింది. వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటూ తక్కువ కాలంలోనే డబ్బు బాగానే కురబెట్టింది. ఇందుకు ఉదాహరణ గత డిసెంబర్ నెలలో చెన్నై సముద్ర తీరంలో ఒక కొత్త ఇంటిని కొనుక్కున్నట్లు తనే స్వయంగా వెల్లడించింది. అంతేకాకుండా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే పాలసీని అమలు చేస్తూ తాజాగా వ్యాపారంగంలోకి అడుగుపెడుతోంది. ఈ అమ్మడు ఇప్పుడు ఒక రెస్టారెంట్కు ఓనర్ కాబోతోంది. ఇందు కోసం స్థలాన్ని కొనుగోలు చేసి రెస్టారెంట్ను కట్టిస్తోంది. త్వరలో దీన్ని ప్రారంభించనునట్లు నటి ప్రియా భవాని శంకర్ ఒక వీడియోను విడుదల చేసింది. View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) -
దేనికైనా అదృష్టం ఉండాలి: నిధి అగర్వాల్
సినిమా రంగంలో అదృష్టం చాలా ముఖ్యమని అంటోంది నటి నిధి అగర్వాల్. ఆకర్షణీయమైన అందం ఈమె సొంతం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయకిగా నటిస్తున్నా ఆ స్థాయిలో పెద్ద హిట్లు సాధించలేకపోతోంది. తమిళంలో జయం రవికి జంటగా భూమి, శింబు సరసన ఈశ్వరన్, ఉదయనిధి స్టాలిన్తో కలగతలైవన్ చిత్రాలు చేసింది. వీటిల్లో ఏది ఈ అమ్మడి కెరీర్కు ప్లస్ కాలేదనే చెప్పాలి. ఇటీవల నిధి అగర్వాల్ ఒక కార్యక్రమంలో తన అనుభవాలను పంచుకున్నారు. తాను అదృష్టాన్ని నమ్ముతానని చెప్పింది. అది లేకపోతే ఎవరికి ఏదీ కుదరదని పేర్కొంది. ముఖ్యంగా సినిమా రంగంలో అదృష్టం చాలా అవసరమని చెప్పింది. ఉదాహరణకు కొన్ని కథలు వినడానికి అద్భుతంగా ఉంటాయని.. అయితే చివరికి చిత్రం వేరే విధంగా వస్తుందని పేర్కొంది. అదే విధంగా పేపర్పై సుమారుగా ఉన్న కథలు తెరపై చూస్తే బ్రహ్మాండంగా ఉండి ఆశ్చర్యపరుస్తాయని తెలిపింది. అందుకు కారణం 90 శాతం అదృష్టమే అని తాను భావిస్తానంది. ఇకపోతే కథలను ఆశతో ఎంపిక చేసుకునే స్థాయికి తాను చేరుకున్నానని భావించడం లేదని చెప్పింది. అయితే వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నానని, ముఖ్యంగా నాట్యానికి ప్రముఖ్యత ఉన్న కథా చిత్రంలో నటించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్నా నటన పరంగా ఎలాంటి వ్యత్యాసం లేదని అయితే వ్యాపారపరంగా చాలా తేడా ఉంటుందని నటి నిధి అగర్వాల్ పేర్కొంది. -
ఆ దర్శకుడి సినిమాలో నటించాలని ఉంది: జాన్వీ కపూర్
దివంగత నటి శ్రీదేవి సాధించిన పేరు ప్రఖ్యాతలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దక్షిణాది నుంచి బాలీవుడ్కి వెళ్లిన ఆమెను అక్కడ కూడా సక్సెస్ వరించింది. తాజాగా ఆమె వారసురాలు జాన్వీ కపూర్ బాలీవుడ్లో మంచి కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనలోని నటనకు పదును పెడుతున్నారు. తమిళం, మలయాళం భాషల్లో హిట్ అయిన చిత్రాలను హిందీ రీమేక్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా ఆమె మలయాళంలో మంచి విజయం సాధించిన హెలెన్ హిందీ రీమేక్లో నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా తమిళంలో నయనతార ప్రధాన పాత్రలో నటించిన కోలమావు కోకిల చిత్రం హిందీ రీమేక్లో జాన్వీ కపూర్ నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాది చిత్రాల్లో నటించాలన్న కోరిక చాలాకాలంగా ఉందని చెప్పారు. ముఖ్యంగా మలయాళ దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రన్ చిత్రాలంటే చాలా ఇష్టం అన్నారు. అలాగే తమిళంలో వెట్రిమారన్ దర్శకత్వంలో నటించాలన్న కోరిక ఉందన్నారు. కాగా ఈ బ్యూటీని దక్షిణాది చిత్రంలో నటింపజేయాలన్న ప్రయత్నాలు చాలాకాలంగానే జరుగుతున్నాయన్నది వాస్తవం. ఆ మధ్య తెలుగులో విజయ్ దేవరకొండకు జంటగా నటించడానికి సిద్ధమైందనే ప్రచారం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. -
Viranica Manchu: చెన్నైలో మంచు విష్ణు సతీమణి సందడి
తమిళసినిమా: టాలీవుడ్ స్టార్ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త మంచు విష్ణు సతీమణి వెరోనికా పాప్ అప్ షోతో సందడి చేశారు. అమెరికాలో పుట్టి పెరిగిన ఈమె న్యూయార్క్లో జ్యువెలరీ డిజైనింగ్ చేశారు. వివాహానంతరం ఫ్యాషన్ మార్కెటింగ్ రంగంలోకి ప్రవేశించి హైదరాబాదులో ఫ్యాషన్ డిజైనింగ్ షాప్ను కూడా ఏర్పాటు చేశారు. తాజాగా చెన్నైలో తన ఫ్యాషన్ మార్కెటింగ్ విస్తరించేందుకు లేబుల్ విడా పేరుతో పాప్ అప్ షో నిర్వహించారు. నటులు జయం రవి భార్య ఆర్తి, సినీ ప్రముఖులు, మహిళలు ఇందులో పాల్గొన్నారు. చదవండి: ('కేజీఎఫ్' అభిమానులకు గుడ్ న్యూస్.. పార్ట్-3 కూడా?) -
మరో నెగెటివ్ రోల్లో సమంత !.. ప్రేమకు అడ్డుగా
Samantha Negative Role In Kaathu Vaakula Rendu Kadhal Movie: స్టార్ హీరోయిన్ సమంత అందం, అభినయంతో సినీ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. 'ఫ్యామిలీ మ్యాన్ 2' హిందీ వెబ్ సిరీస్కు ముందు గ్లామర్ పాత్రలతో అలరించిన సామ్ ఈ సిరీస్తో తన నటనేంటో నిరూపించింది. ఈ సిరీస్తో జాతీయ స్థాయిలో వినపడిన సమంత పేరు ఇంటర్నేషనల్ రేంజ్కు పాకింది. ఇక నుంచి తాను నటనకు ప్రాధాన్యమున్న ఛాలేంజింగ్ రోల్స్ చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అందుకు తగినట్లుగానే పాత్రలను సెలెక్ట్ చేసుకుంటుంది సామ్. హాలీవుడ్ మూవీ 'అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్' సినిమాలో తాను బై-సెక్సువల్ యువతి పాత్ర పోషిస్తున్న విషయాన్ని తానే ప్రకటించింది. ఇదీ చదవండి: ఏం చేయగలను.. వారిని ఇంతవరకూ చూడలేదు: సమంత అయితే తాజాగా తాను మరో ఛాలేంజింగ్ పాత్ర చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమంత మరో నెగెటివ్ పాత్రలో అలరించనుందట. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, అందాల అభినయం నయన తారతో కలిసి సమంత నటిస్తున్న చిత్రం 'కాత్తువాక్కుల రెండు కాదల్'. ఇందులో నయన తారకు సమానమైన పాత్రలో సామ్ నటించనుందట. విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఊహించని రీతిలో 'ఖతిజా'గా సామ్ నెగెటివ్ షేడ్స్లో ఆకట్టుకోనుందని సమాచారం. ఈ పాత్రలో సమంత యాక్టింగ్ సూపర్గా ఉందని కోలీవుడ్ సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయట. విజయ్ సేతుపతి, నయన తార ప్రేమాయణానికి అడ్డుపడి సమంత తన విలనిజంతో కథను మలుపు తిప్పనుందట. అయితే ఈ వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇప్పటికే 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో రాజీగా ఆకట్టుకున్న సామ్ ఈ సినిమాలో ఎలాంటి విలనిజం చూపెట్టనుందో వేచి చూడాలి. ఇదీ చదవండి: 'ఊ అంటావా' సాంగ్ పూర్తి వీడియో వచ్చేసింది.. చూశారా ! -
వందల సినిమాల్లో నటించిన ఈ ‘ఎమోషనల్ యాక్ట్రెస్’ గుర్తుందా?
సినిమా అంటే జనాలకు మాత్రమే రంగుల ప్రపంచమే కాదు.. అవతల నటించే వాళ్లకు కూడా. ‘ఎంత బలవంతులనైనా ఏదో ఒక టైంలో మానసికంగా కుంగుబాటుకు కచ్ఛితంగా గురిచేసేదే సినిమా’ అంటూ స్పీల్బర్గ్లాంటి దిగ్గజాలు చెప్పడం చూస్తుంటాం. అలా ఎన్నో కలలతో సినిమాల్లోకి అడుగుపెట్టిన సీనియర్ నటి శ్రీవిద్య జీవితం..విషాదంగా ముగియడం మీలో ఎంత మందికి గుర్తుంది?. ఇవాళ ఆమె జయంతి.. మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ.. ఇలా సుమారు 800కు పైగా సినిమాల్లో నటించారు శ్రీవిద్య. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్గా.. అటుపై సపోర్టింగ్ రోల్స్, అక్కా-చెల్లి, అమ్మ, అత్త క్యారెక్టర్లతో అలరించారు. ముఖ్యంగా ఆమె పండించే భావోద్వేగాలు ఇప్పటికీ జనాలకు గురుతు. అందుకే ఎమోషనల్ యాక్ట్రెస్గా ఆమెకు ఓ పేరు ముద్రపడింది. కేవలం నటనతోనే కాదు.. తన మధుర గాత్రంతో ఎన్నో పాటలు, డబ్బింగ్తోనూ దక్షిణాది ప్రేక్షకుల్ని రంజింపచేశారామె. ‘నటన’ కుటుంబంలో జననం 1953, జులై 24న మద్రాస్లో పుట్టారామె. తండ్రి కృష్ణమూర్తి సినిమాల్లో కమెడియన్గా స్థిరపడగా, తల్లి వసంతకుమారి కర్ణాటక క్లాసిక్ సింగర్(ఎంఎస్ సుబ్బలక్క్క్ష్మి, డీకే పట్టమ్మస్ సమకాలికురాలు). అయితే శ్రీవిద్య పుట్టిన కొన్నాళ్లకే తండ్రి పక్షవాతం బారినపడడంతో కుటుంబానికి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. దీంతో వసంతకుమారి నానాకష్టాలు పడి సంపాదించింది. ఒకానొక టైంలో తనకు పాలు ఇచ్చే సమయం ఉండేది కాదన్న తల్లి మాటల్ని శ్రీవిద్య పలు ఇంటర్వ్యూలో సైతం గుర్తు చేసుకునేవాళ్లు. ‘బొటాబొటీ’ చదువు కొనసాగించిన శ్రీవిద్య అందగత్తె కావడంతో అమెరికా నుంచి ఓ సైంటిస్ట్ సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. అయితే డబ్బు లేదన్న కారణంతో ఆ సంబంధం అంతే స్పీడ్గా వెనక్కి వెళ్లిపోయింది. దీంతో కుటుంబానికి భారం కాకూడదన్న ఉద్దేశంతో తండ్రి పరిచయాలతో ఆమె నటనలోకి అడుగుపెట్టారు. చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలై.. 1967 తమిళ సినిమా శివాజీ గణేషన్ హీరోగా ‘తిరువరుల్చెల్వర్’లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారామె. ఆ తర్వాత మలయాళ సినిమా ‘కుమార సంభవం’తో, తెలుగులో దాసరి ‘తాతా మనవడు’తో అరంగ్రేటం చేసింది శ్రీవిద్య. దర్శకదిగ్గజం కే బాలచందర్ డైరెక్షన్లో వచ్చిన ‘నూట్రుక్కు నూరు’(1971) నటిగా ఆమెకంటూ ఓ గుర్తింపు తెచ్చిపెట్టింది. హీరోయిన్గా ‘ఢిల్లీ టు మద్రాస్’(1972) ఆమె మొదటి సినిమా. ఆ తర్వాత బాలచందర్ డైరెక్షన్లో వచ్చిన సినిమాల ద్వారా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ వచ్చారామె. మల్టీటాలెంటెడ్ అల్లరి క్యారెక్టర్లతో అలరించినా.. మెచ్యూర్డ్రోల్స్ చేసినా.. ఆ క్యారెక్టర్తో ఎమోషనల్గా ట్రావెల్ కావడం ఆమెకు ఉన్న నైజం. అందుకే హీరోయిన్గా ఫేడ్అవుట్ అయ్యాక ఆమెకు హుందా పాత్రలెన్నో వచ్చాయి. నటిగానే కాదు.. ప్లేబ్యాక్ సింగర్గానూ ఆమె అలరించారు. స్వతహాగా క్లాసికల్ సింగర్ కావడంతో ఆమె గాత్రం పాటలకు మరింత అందాన్ని తెచ్చిపెట్టేవి. అంతేకాదు పదుల సంఖ్యలో సినిమాలకు ఆమె డబ్బింగ్ కూడా చెప్పారు. ‘ప్రేమ’ మోసం కెరీర్ తొలినాళ్లలో కమల్ హాసన్తో ఆమె నటించింది. ఆ టైంలో ఇద్దరి మధ్య ఎటాచ్మెంట్ ఎక్కువగా ఉండేది. ఒకానొక టైంలో కమల్తో పీకలలోతు ప్రేమలో కూరుకుపోయిందామె. అయితే అప్పటికే కమల్ వాణీ గణపతితో ప్రేమలో ఉండడంతో ఆమె పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి మలయాళంలో అసిస్టెంట్ డైరెక్టర్ అయిన జార్జ్ థామస్తో ప్రేమలో పడి.. తల్లిదండ్రుల మాట వినకుండా వివాహం చేసుకుంది. మతం మార్చుకుని నటనకు దూరమైంది. డబ్బు కోసం తిరిగి నటించాలన్న భర్త ఒత్తిడితో తిరిగి మేకప్ వేసుకుంది. ఆపై భర్త తీరును అర్థం చేసుకుని.. విడాకులిచ్చేసింది. నటన కొనసాగిస్తున్న టైంలో మలయాళ దర్శకుడు భరతన్తో కొన్నాళ్లపాటు ప్రేమాయణం కొనసాగించింది. అయితే భరతన్ మరొకరిని వివాహం చేసుకున్నాడు. దీంతో భరతన్ తన ఆస్తులు లాగేసుకుని తనను మోసం చేశాడంటూ శ్రీవిద్య కోర్టుకెక్కింది. చివరికి సుప్రీం కోర్టు తీర్పుతో విజయం సాధించి తన ఆస్తుల్ని దక్కించుకున్న ఆమె.. చెన్నై నుంచి తిరువంతపురానికి మకాం మార్చేసింది. అపూర్వ రాగంగల్-అపూర్వ సగోదరర్గల్ చనిపోయే ముందు దాకా.. 2003లో అనారోగ్యం పాలైన ఆమెకు.. క్యాన్సర్ అని తేలింది. ఆటైంలో మూడేళ్లపాటు ఆమె చికిత్స తీసుకుంది. ఆ టైంలోనూ ఆమెను వదల్లేదు. అంతేకాదు ఫోర్త్ స్టేజ్లో ఉన్న తాను బతకడం కష్టమనే విషయం అర్థమైయ్యింది ఆమెకు. అందుకే తన పేరు మీద ఒక్క పైసా కూడా ఉండొద్దన్నది నిర్ణయించుకుంది. మొత్తం ఆస్తిని సేవాకార్యక్రమాలకు ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. అప్పటికే కేరళ ప్రభుత్వం స్కాలర్షిప్ ఆపేయడంతో పేద సంగీత, నృత్య కళాకారులైన విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. అందుకని మలయాళ నటుడుని రిజిస్టర్గా నియమిస్తూ.. తన ఆస్తులను అప్పజెప్పింది. తద్వారా ఓ ఛారిటబుల్ సొసైటీ ఏర్పాటు చేయించి అర్హులైనవాళ్లకు స్కాలర్షిప్ అందించే ఏర్పాటు చేయించింది. మిగిలిన ఆస్తిని బంధువుల పేరిట రాసేసింది. తన అన్నల పిల్లలకు ఒక్కొక్కరి ఐదు లక్షలు, చివరికి తన ఇంట్లో పని వాళ్లు.. వాళ్ల ఇంటి సభ్యులకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున జమ చేయించింది. మరికొంత ఆస్తిని సొంత వూరికి, ఇంకొంత సొమ్మును రెండో ఇల్లు తిరువనంతపురానికి దానం చేసింది. ఆ తర్వాత కీమో థెరపీకి వెళ్లిన ఆమె.. ఆ ట్రీట్మెంట్ టైంలోనే 2006, ఆగస్టు 17న యాభై మూడేళ్ల వయసులో ఆమె కన్నుమూసింది. ఆమె సేవానీరతికి గుర్తుగా తిరువనంతపురం ప్రజలు లాంఛనంగా ఆమె అంత్యక్రియల్ని ఘనంగా జరిపించారు. తల్లిగా ప్రత్యేకం నలభై ఏళ్లపాటు మలయాళం, తమిళంలో వందలకొద్దీ, తెలుగులో నలభై దాకా, కన్నడలో డజను, హిందీలో రెండు.. మొత్తం 800 దాకా సినిమాల్లో నటించారామె. ఇక సౌత్ సూపర్స్టార్ రజినీకాంత్ తొలి హీరోయిన్ శ్రీవిద్యే. ఆయన మొదటి సినిమా అపూర్వ రాగంగల్(1975) రజినీ జోడిగా. అయితే రజినీతో హీరోయిన్గానే కాదు.. అక్కగా, చెల్లిగా, తల్లిగా, అత్తగా.. ఇలా దాదాపు అన్ని క్యారెక్టర్లలో ఆమె నటించడం విశేషం. తల్లి క్యారెక్టర్లో శ్రీవిద్య అద్భుతమైన నటన కనబరిచేవారామె. ముగ్గురు మొనగాళ్లు, గాండీవం, చిన్నబ్బాయ్, వెంకటేష్కు తల్లిగా ‘బ్రహ్మపుత్రుడు’, ‘ధర్మచక్రం’ ఆమె మరిచిపోలేని నటనను అందించారు. సుమంత్ హీరోగా వచ్చిన ‘విజయ్ ఐపీఎస్’ తెలుగులో శ్రీవిద్య నటించిన చిట్టచివరి చిత్రం. -సాక్షి వెబ్డెస్క్ -
మాట తప్పిన ప్రముఖ కమెడియన్
హాస్యనటుడు వడివేలు మరోసారి హీరోగా నటించడానికి రెడీ అవుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. తమిళంలో మరుదమలై, తలైనగరం సినిమాలను డైరెక్ట్ చేసిన సూరజ్ దర్శకత్వంలో వడివేలు హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్లో స్టార్ట్ కానుందని కోలీవుడ్ సమాచారం. సూరజ్ డైరెక్ట్ చేసిన ‘మరుదమలై, తలై నగరం’ ఈ రెండు సినిమాల్లోనూ వడివేలు కీలక పాత్రల్లో నటించారు. సో... ఇప్పుడు వడివేలు హీరోగా సూరజ్ సినిమా సెట్స్పైకి వెళ్తుందని ఉహించవచ్చు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఇంతకుముందు ‘ఇమ్సై అరసన్ 23ఆమ్ పులికేసి’, ‘తెనాలిరామన్ ’ వంటి సినిమాల్లో వడివేలు హీరోగా నటించారు. అయితే తాను మరోసారి హీరోగా నటించనని కమెడియన్ వడివేలు గతేడాది ప్రకటించారు. అయినప్పటికీ ఆయనకు సినిమా అవకాశాలు వస్తుండటంతో మరోసారి హీరోగా నటించడానికి ఓకే చెప్పారు. -
చిక్కుల్లో షాలినీ పాండే.. నిర్మాత ఫిర్యాదు
సాక్షి, చెన్నై: ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండే చిక్కుల్లో పడ్డారు. ఆమెపై తమిళ నిర్మాత ఒకరు ఫిర్యాదు చేశారు. అమ్మ క్రియేషన్ పతాకంపై తెరకెక్కిస్తున్న ‘అగ్ని సిరగుగల్’ చిత్రాన్ని నిర్మాత శివ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అరుణ్ విజయ్, విజయ్ ఆంటోని, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 29శాతం పూర్తయింది. మిగతా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఈ క్రమంలో హీరోయిన్ షాలినీకి రణ్బీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బాలీవుడ్ చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ భారీ అవకాశం రావడంతో షాలినీ పాండే యూటర్న్ తీసుకున్నారని, ఇక నుంచి దక్షిణాది సినిమాల్లో నటించలేదని ఆమె తేల్చిచెప్పారని నిర్మాత శివ వాపోతున్నారు. ఆమె అకస్మాత్తు నిర్ణయం వల్ల తాము తీవ్రస్థాయిలో నష్టపోయామని, ఎన్నిసార్లు పిలిచినా ఆమె షూటింగ్స్ రావడం లేదని, ఆకస్మికంగా సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ఆమెపై చర్యలు తీసుకోవాలని శివ నిర్మాతల మండలి, ఫిలిం చాంబర్, నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేశారు. తెలుగు, హిందీ చిత్రపరిశ్రమలకు చెందిన నిర్మాతల మండలిలోనూ, ఆర్టిస్టుల సంఘాల్లోనూ ఫిర్యాదు చేయనున్నట్టు శివ తెలిపారు. షాలినీ పాండేపై చట్టరీత్యా కూడా చర్యలు తీసుకోవాలని నిర్మాత శివ భావిస్తున్నారు. -
తమన్నాతో కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది
తమిళసినియా : యాక్షన్ సన్నివేశాల్లో నటి తమన్నాతో కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని నటుడు విశాల్ పేర్కొన్నారు. ఈ జంట నటించిన తాజా చిత్రం యాక్షన్. సుందర్.సీ దర్శకత్వంలో ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై రవీంద్రన్ నిర్మించిన ఈ చిత్రానికి హిప్హాప్ తమిళా సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర యూనిట్ స్థానిక ప్రసాద్ల్యాబ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు విశాల్ మాట్లాడుతూ సామాజిక ఆలోచనలు ఉన్నా సంపాదన కూడా ముఖ్యం అని తనకు తెలియజేసింది దర్శకుడు సుందర్.సీ అని పేర్కొన్నారు. తాము ఈ వేదికపై నిలబడడానికి, తాము యూనిట్ అవడం సాధారణ విషయం కాదన్నారు. దాన్ని ట్రైడెంట్ ఆర్ట్స్ రవీంద్రన్ సాధ్యం చేశారని పేర్కొన్నారు. సంఘమిత్ర సుందర్.సీ డ్రీమ్ చిత్రం అన్నారు. దాని నిర్మాణం ఆలస్యం కావడంతో మధ్యలో ఈ చిత్రం చేసినట్లు తెలిపారు. తన కెరీర్లోనే అధిక ఫైట్స్ కలిగిన చిత్రం, అధికంగా దెబ్బలు తిన్న చిత్రం ఇదేనన్నారు. ఒక సమయంలో తన చావును తాను కళ్లారా చూశానని చెప్పారు. ఒక సన్నివేశంలో నటిస్తుండగా కాళ్లు, చేతులకు గాయాలు కావడంతో 5 నెలలు షూటింగ్ చేయలేని పరిస్థితి అని తెలిపారు. అయినా దర్శక నిర్మాతలు తన కోసం వేచి ఉన్నారని చెప్పారు. ఏడాదికి ఒక చిత్రాన్ని సుందర్.సీ దర్శకత్వంలో నటిస్తే ఆరోగ్యం బాగుంటుందన్నారు. తన గురువు అర్జున్ అయినా, ప్రతి ఒక్కరూ ఈగో ఫీలవకుండా సుందర్.సీ వద్ద అసిస్టెంట్గా పనిచేయాలన్నారు. ఆయన ఒక సాధారణ ప్రాంతాన్ని కూడా బ్రహ్మాండంగా చూపించగలరని అన్నారు. 90 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయడం సవాల్తో కూడిన విషయంగా పేర్కొన్నారు. ఒక సహాయ దర్శకుడిగా తానాయననుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. ఆయన నుంచి నేర్చుకున్న విషయాలను ఇకపై తన చిత్రాలకు ఉపయోగించుకుంటానని చెప్పారు. సంగీదర్శకుడు ఆది లాంటి టాలెంటెడ్ యువకులు పలువురు రావాలన్నారు. తాను గాయాలపాలయిన తరువాత స్టంట్మాస్టర్ అన్బరివు, దర్శకుడు సుందర్.సీ ఫైట్స్ సన్నివేశాలకు డూప్ను వాడదామని చెప్పారని, అయితే అందుకు తాను అంగీకరించలేదని తెలిపారు. ఫైట్స్ సన్నివేశాల్లో తనకు నటి తమన్నాకు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందని చెప్పారు. ఇక నటి ఆకాంక్షపురి గురించి చెప్పే తీరాలని, తాను ఇంతకు ముందెప్పుడూ మహిళలను కొట్టిందేలేదన్నారు.అలాంటిది ఈ చిత్రంలో సన్నివేశాల కోసం నటి ఆకాంక్షపురిని పలుమార్లు కొట్టాల్సి వచ్చిందని చెప్పారు. యాక్షన్ చిత్రాన్ని అందరూ సినిమా థియేటర్లలో చూడాలని నటుడు విశాల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తమన్నా, దర్శకుడు సుందర్.సీ, సంగీతదర్శకుడు హిప్హాప్ తమిళా చిత్ర యూనిట్ పాల్గొన్నారు. -
రజనీకాంత్ ‘వ్యూహం’ ఫలించేనా!?
తమిళసినిమా: రజనీకాంత్ ఈ ఐదక్షరాల పేరు ఆలిండియా లెవల్లోనే ఒక అద్భుతం. రజనీ సినిమాలు వస్తున్నాయంటే బాక్సాఫీస్ షేక్ అవుతోంది. ఫ్యాన్స్ సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్లిపోతారు. అలాంటి రజనీ త్వరలోనే మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చాలాకాలం తరువాత ఆయన పోలీసు ఆఫీసర్గా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న చిత్రం దర్బార్.. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ అదుర్స్ అనిపించింది. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తనదైన స్టైల్లో చెక్కుతున్నారు. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, రజనీకాంత్ నటించబోయే మరో కొత్త సినిమాకు కూడా రంగం సిద్ధమైంది. దర్శకుడు శివ డైరెక్షన్లో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మింస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి ప్రస్తుతం పలు ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్స్టార్ రజనీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కానుందని, ఈ సినిమా కోసం ఒక టైటిల్ కూడా పరిశీలనలో ఉందని టాక్ స్ప్రెడ్ అయ్యింది. దర్శకుడు శివకు ‘వీ’ సెంటిమెంట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు అజిత్ హీరోగా చేసిన నాలుగు చిత్రాల టైటిల్స్ వీతోనే మొదలయ్యాయి. వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం ఇలా శివ ‘వీ’ టైటిల్ చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్తో చేసే చిత్రానికి ‘వీ’ సెంటిమెంట్ కలిసివచ్చేలా.. ‘వ్యూహం’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ‘వ్యూహం’ సినిమా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి కూడా పనికొచ్చేలా ఉంటుందని అంటున్నారు. ఇందులో నటి జ్యోతిక, కీర్తీసురేశ్ హీరోయిన్లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. నటుడు సూరి, వివేక్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. రజనీకాంత్ 168వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి 2020లో సమ్మర్స్పెషల్గా తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారు. -
ఔనా.. తమన్నా మారిపోయిందా..!
తమిళసినిమా: నటి తమన్నా మారిపోయిందట. ఏమిటా మార్పు? ఏమా కథ అంటే.. గ్లామర్కు మారుపేరైన ఈ అమ్మడు.. ఆదిలో అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకాడలేదు. ఇక ఐటమ్ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదేమంటే డాన్స్ అంటే నాకిష్టం అనే సమాధానం ఈ జాణ నుంచి వస్తుంది. అయితే తమన్నాలోనూ మంచి నటి ఉంది. ఆ విషయం తమిళంలో నటించిన కల్లూరి చిత్రంలోనే ఆమె నిరూపించుకున్నా.. ఎందుకనో దర్శక, నిర్మాతలు తమన్నాను గ్లామర్ కోసం ఎక్కువగా ఫోకస్ చేశారు. అయితే ప్రతి నటికీ, నటుడికీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోయే చిత్రం ఉంటుంది. అలా తమన్నా సినీ కెరీర్లో ‘బాహుబలి’ మెమరబుల్ సినిమాగా నిలిచిపోయింది. ఆ తరువాత ఈ అమ్మడికి సరైన పాత్ర లభించలేదు. మళ్లీ షరా మామూలుగా గ్లామర్ పాత్రలకే ఆమె మొగ్గు చూపుతూ వచ్చింది. హర్రర్ కథా చిత్రాలూ ఆమెకు వరుస కడుతున్నాయి. ఇలాంటి సమయంలో చిరంజీవి ‘సైరా’తో మరోసారి తనలోని నటిని బయటకు తీసే అవకాశం వచ్చింది. పాత్రలో సత్తా ఉండాలేగాని, ఎంతటి పాత్రనైనా చేస్తాననేవిధంగా ‘సైరా’లో లక్ష్మీ పాత్రకు తమన్నా జీవం పోసింది. ఈ సినిమాలో నయనతార కంటే తమన్నా పాత్రకే ఎక్కువ పేరు వచ్చింది. ఈ క్రమంలో తాజాగా తెరపైకి వచ్చిన తమిళ చిత్రం ‘పెట్రోమ్యాక్స్’ తమన్నాకు మరోసారి సక్సెస్ను అందించింది. బాహుబలి, సైరా, పెట్రోమ్యాక్స్ వంటి నట ప్రాధాన్యమున్న సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న నేపథ్యంలో తమన్నా ఇకపై గ్లామర్ పాత్రలకు ఒకింత దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకోవాలని ఈ అమ్మడు అనుకుంటోందని కోలీవుడ్ టాక్. మంచి కుటుంబ కథా చిత్రాల్లో ప్రాధాన్యమున్న పాత్ర చేయాలని తమన్నా కోరికను ఆహ్వానించాల్సిందే గానీ, ఈ బ్యూటీ తన మాటపై నిలబడుతుందా? ఎందుకంటే ప్రస్తుతం విశాల్తో నటిస్తున్న ‘యాక్షన్’ చిత్రంలో తమన్నా గ్లామరస్ పాత్రనే పోషించింది. పెళ్లి సంగతేమిటి? ఇక, పెళ్లి సంగతేమిటన్న ప్రశ్నకు ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చింది. తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరుగుతోందని, అందులో ఒక్క శాతం కూడా నిజం లేదని చెప్పింది. కొందరు ఈ విషయంలో కావాలనే కల్పిత రాతలు రాస్తున్నారని, అలాంటి కథనాలను తన వద్దకు తీసుకొస్తే, వాటిని తానే ఒక చిత్రంగా నిర్మించడానికి సిద్ధమని కొంచెం ఘాటుగానే బదులిచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో గోపీచంద్కు జంటగా నటిస్తోంది. అదే విధంగా హిందీ చిత్రం క్వీన్ తెలుగు రీమేక్ దటీజ్ మహాలక్ష్మీ చిత్రంలోనూ కనిపించనుంది. -
జయలలిత.. నేనూ సేమ్ : హీరోయిన్
తమిళసినిమా: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు తనకు సారూప్యత ఉందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అంటున్నారు. సంచలన నటిగా తరచూ వార్తల్లో ఉండే కంగనా చాలాకాలం తరువాత కోలీవుడ్లో రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. మొదట్లో జయంరవికి జంటగా ‘ధామ్ ధూమ్’ చిత్రంలో నటించిన ఈ అమ్మడు ఆ తరువాత బాలీవుడ్లో బిజీ అయి.. అక్కడ టాప్ హీరోయిన్గా రాణిస్తున్నారు. ఇటీవల చారిత్రాత్మిక చిత్రం ‘మణికర్ణిక’లో ఝాన్సీరాణిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. త్వరలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్లో ఆమె నటించబోతున్నారు. ‘తలైవి’ అనే పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందనుంది. విజయ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంపై ప్రారంభానికి ముందే నుంచే బోలెడంత హైప్ క్రియేట్ అయింది. కారణం జయలలిత పాత్రలో కంగనా నటించనుండటమే. ఈ చిత్రంలో ‘అమ్మ’గా మారడానికి కంగనా కూడా బగానే కష్టపడుతున్నారు. జయ పాత్ర కోసం ఇటీవల అమెరికాలో మేకప్ టెస్ట్ చేయించుకున్న ఆమె భరతనాట్యంలో శిక్షణ కూడా పొందుతున్నారు. జయలలితలా తెరమీద కనిపించేందుకు ప్రత్యేకంగా తర్ఫీదు కూడా తీసుకుంటున్నారు. మా మధ్య స్వారూప్యం చాలానే ఉంది ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి కోవై వచ్చిన కంగనా మీడియాతో కాసేపు ముచ్చటించారు. తాను నటిస్తున్న జయలలిత బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కనుందని ఆమె తెలిపారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, యుక్త వయసులోనే సినీరంగప్రవేశం చేసిన జయలలిత.. సిని ఇండస్ట్రీలో పురుషాధిక్యతను ఎదుర్కొని పలు విజయాలను అందుకున్నారని చెప్పారు. తానూ ఆమె మాదిరేనని, కాబట్టి తమ మధ్య స్వారూప్యం చాలానే ఉందని తెలిపారు. జయలలిత విజయవంతమైన రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాకుండా చాలా శక్తిమంతమైన మహిళగా జీవించారని ప్రశంసించారు. భాషలో పరిణితి, భరతనాట్యం వంటి పలు విషయాల్లో ప్రతిభావంతురాలైన జయలలిత పాత్రలో నిజాయితీగా నటించాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. అందుకోసం తమిళ భాషను కూడా నేర్చుకుంటున్నట్లు కంగనా వెల్లడించారు. రాజకీయ నేపథ్యంతో ఉన్న చిత్రాల్లో నటిస్తున్నా.. నిజజీవితంలో రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి లేదని కంగనా రనౌత్ స్పష్టం చేశారు. -
సక్సెస్ బాంబ్ ఎవరిది?
ఈ ఏడాది దీపావళికి జోరుగా పేలడానికి మూడు బాంబు ( తమిళ సినిమా)లు రెడీ అవుతున్నాయి. ఫుట్బాల్ ప్లేయర్గా విజయ్, ఖైదీగా కార్తీ, రాజకీయ నాయకుడిగా విజయ్ సేతుపతి.. ఈ ముగ్గురు హీరోలు దీపావళి బరిలో నిలిచారు. వీరి చిత్రాలతో పాలు పండక్కి ఇంకెన్ని చిత్రాలు వస్తాయో చూడాలి. ప్రస్తుతం ఈ మూడు చిత్రాల వివరాల్లోకి వెళితే... గత రెండేళ్లుగా దీపావళికి తన సినిమా విడుదలయ్యేలా చూసుకున్నారు విజయ్. 2017లో ‘మెర్సెల్’ (తెలుగులో ‘అదిరింది’), 2018లో ‘సర్కార్ చిత్రాలతో దీపావళికి తెరపై సందడి చేశారు. ఈ దీపావళిని కూడా ఆయన మిస్ కావడంలేదు. ప్రస్తుతం నటిస్తున్న ‘బిగిల్’ సినిమాను దీపావళి విడుదలకు రెడీ చేశారు. విజయ్తో ఇదివరకు ‘తేరి, మెర్సెల్’ వంటి హిట్ సినిమాలను తీసిన అట్లీ ఈ ‘బిగిల్’ సినిమాకు దర్శకుడు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఫుట్బాల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది. ఈ సినిమాకు విజయ్ సుమారు 150 రోజులు కాల్షీట్స్ ఇవ్వగా ఆల్రెడీ ఈ సంఖ్య 200 దగ్గరకు చేరుకుంది. దీన్నిబట్టి రాజీ అనేది లేకుండా కాకుండా ఎంత శ్రమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఇక ఇటీవలి కాలంలో కోలీవుడ్లో మంచి స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యారు విజయ్ సేతుపతి. కేవలం హీరోగానే కాదు వీలు చిక్కినప్పుడల్లా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం కూడా ఎత్తి ఆడియన్స్ మనసు దోచుకునే పాత్రలు చేస్తున్నారు. విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం ‘సంగ తమిళన్’. ‘స్కెచ్’ ఫేమ్ విజయ్ చందర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి రాజకీయ నాయకుడి పాత్రలో నటించారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కూడా దీపావళికే విడదుల కానుంది. ‘బిగిల్’లో విజయ్ రెండు పాత్రలు చేశారనే ప్రచారం జరుగుతున్నట్లుగానే ‘సంగ తమిళన్’లో విజయ్ సేతుపతి కూడా డ్యూయల్ రోల్ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇక దీపావళికి వస్తున్న మరో హీరో కార్తీ. ‘ఖైదీ’ చిత్రంతో ఆయన పండక్కి తెరపై కనిపించబోతున్నారు. ‘మానగరం’ సినిమాతో ఆడియన్స్ను మెప్పించిన లోకేష్ కనగరాజన్ ఈ సినిమాకు దర్శకుడు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనింగ్ చిత్రం ఇది. ఈ సినిమాలో హీరోయిన్ లేకపోవడం విశేషం. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్లుక్, టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి. ఇలా మూడు సినిమాలు ఈ ఏడాది దీపావళికి విడుదల కానున్నాయి. మరి.. మూడు బాంబుల్లో మూడూ దిగ్విజయంగా పేలి, వసూళ్ల సౌండ్ బలంగా వినిపిస్తే ఇండస్ట్రీకి మంచిదే. మరి ఎవరిది సక్సెస్ బాంబ్ అవుతుందో వేచి చూడాలి. -
రాజకీయాల్లో ఈజీ.. సినిమాల్లోనే కష్టమబ్బా!
తమిళసినిమా: రాజకీయాల్లో వారసులు రాత్రికి రాత్రే ఎదుగుతున్నారని, సినిమాల్లో మాత్రం అలా కుదరడం లేదని సీనియర్ దర్శకుడు, నటుడు కే భాగ్యరాజ్ వ్యాఖ్యానించారు. నటుడు విక్రమ్ప్రభు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘అసురగురు’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ల్యాబ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న కే భాగ్యరాజ్ మాట్లాడుతూ.. సినీరంగంలో వారసులకు విజయాలు సులభంగా రావడం లేదని, పోరాడి సాధించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అయితే రాజకీయాల్లో మాత్రం వారసులు రాత్రికిరాత్రే ఎదుగుతున్నారని, ముఖ్యమైన పదవులు వారిని వరిస్తున్నాయి అన్నారు. కే భాగ్యరాజ్ కొడుకు శంతను హీరోగా పరిచయమై చాలాకాలమైనా మంచి హిట్ కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్న విషయం ఇక్కడ గమనార్మం. మరోవైపు సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న నటుడు, స్టాలిన్ తనయుడు ఉదయనిధి ఇటీవల డీఎంకే యువజన కార్యదర్శి పదవిని చేపట్టిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో కే భాగ్యరాజ్ చేసిన వ్యాఖ్యలు చర్ఛనీయాంశంగా మారాయి. విక్రమ్ప్రభుకు జోడీగా నటి మహిమా నంబియార్ నటించిన ‘అసురగురు’ చిత్రంలో యోగిబాబు, జగన్, మనోబాల ముఖ్యపాత్రలను పోషించారు. జేఎస్బీ ఫిలిం స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్దీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన దర్శకుడు మోహన్రాజా శిష్యుడు. గణేశ్రాఘవేంద్ర సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నటుడు విక్రమ్ప్రభు, నటి మహిమా నంబియార్, నిర్మాత కలైపులి థాను, ఎడిటర్ మోహన్ అతిథులుగా పాల్గొన్నారు. -
సైలెన్స్ అంటున్న స్వీటీ
తమిళసినిమా: నటి అనుష్కను సన్నిహిత వర్గాలు అభిమానంగా స్వీటీ అని పిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. అనుష్క నటించిన చివరి చిత్రం తెరపైకి వచ్చి సుమారు రెండేళ్లు దాటింది. భాగమతి తరువాత ఈ అమ్మడు మరో చిత్రం చేయలేదు. మధ్యలో దర్శకుడు గౌతమ్మీనన్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్లు అనుష్క బహిరంగంగా వెల్లడించినా, ఆ చిత్రం సెట్పైకి వెళ్లలేదు. మరో విషయం ఇంజి ఇడుప్పళగి చిత్రంలోని పాత్ర కోసం తన బరువును కనీసం 100 కిలోలకు పెంచుకున్న అనుష్క ఆ తరువాత దాన్ని తగ్గించుకోవడానికి నానా తంటాలు పడిందనే చెప్పాలి. మొత్తం మీద సుదీర్ఘ శ్రమ తరువాత బరువు తగ్గి కొత్త అందాలను సంతరించుకుంది. తాను ఎలా బరువు తగ్గానన్న విషయాలను ఒక బుక్కుగా రాసి ఇటీవల విడుదల చేసింది కూడా. కాగా మళ్లీ ముఖానికి రంగేసుకోవడానికి రెడీ అయిన అనుష్క సైలెన్స్ అనే సైంటిఫిక్ థ్రిల్లర్ కథా చిత్రంలో నటించడానికి అంగీకరించింది. తెలుగు, తమిళం, హింది భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెలుగులో నిశబ్దం అనే టైటిల్ను నిర్ణయించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కేఎఫ్సీ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇందులో నటుడు మాధవన్, హాలీవుడ్ నటుడు మైఖేల్ మెడ్సన్, నటి అంజలి, శాలినీపాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం అమెరికాలో సైలెంట్గా షూటింగ్ను ప్రారంభించింది. నటి అనుష్క ఇంతకుముందు పలు విభిన్నమైన కథా పాత్రల్లో నటించినా, ఈ సైలెన్స్ చిత్రంలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే కథా పాత్రలో కనిపించనుందట. దీంతో సైలెన్స్ చిత్రంపై సినీవర్గాలు, ప్రేక్షకుల్లో ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది. -
భర్తపై హీరోయిన్ ప్రశంసల జల్లు..!
సాక్షి, తమిళ సినిమా: పెళ్లి తరువాత భార్య నుంచి ప్రశంసలు లభిస్తే.. ఆ ఆనందమే వేరు. ఇప్పుడు నటుడు ఆర్య అలాంటి ఆనందాన్నే ఆస్వాదిస్తున్నాడు. ఈ సంచలన నటుడు ఇటీవల అనూహ్యంగా నటి సాయేషా సైగల్ను ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. ‘నాన్ కడవుల్’ చిత్రంతో నటుడిగా తానేమిటో నిరూపించుకున్న ఆర్య.. ఆ తరువాత బాస్ ఎన్గిర భాస్కరన్, రాజారాణి వంటి విజయవంతమైన చిత్రాలతో కోలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆయన నటించిన కంబన్, గజనీకాంత్ వంటి చిత్రాలు కొంత నిరాశపరిచాయి. దీంతో ఆర్యకు ఇప్పుడు అర్జెంట్గా ఒక హిట్ కావాలి. ఈ క్రమంలో సూర్య హీరోగా నటిస్తున్న ‘కాప్పాన్’ చిత్రంలో ఆర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. కేవీ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఆర్య హీరో కాకపోయినా, ఆయన పాత్ర కీలకంగా ఉంటుందని సమాచారం. ఇకపోతే ఆర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మహాగురు. ఇంతకుముందు మౌనగురు చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు శాంతకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆర్యకు జంటగా ఇందుజా, మహిమా నంబియార్ నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని, నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా టీజర్ను గురువారం విడుదల చేశారు. ఈ టీజర్ భార్య సాయేషా సైగల్తోపాటు ఆమె అమ్మను కూడా ఫిదా చేసిందట. ఈ చిత్ర టీజర్ గురించి నటి సాయేషా సైగల్ ట్విట్టర్లో స్పందిస్తూ.. ఎంతో శ్రమించి.. ఆర్య ఈ సినిమాలో కొత్త గెటప్తో సరికొత్తగా కనిపించబోతున్నారని, ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆసక్తి కలుగుతోందని పేర్కొన్నారు. ఆమె తల్లి కూడా టీజర్పై ప్రశంసల జల్లు కురిపించారు. -
శరత్కుమార్, రాధారవి అరెస్టుకు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు
-
శరత్కుమార్, రాధారవిని అరెస్టు చేయండి: హైకోర్టు
సాక్షి, చెన్నై: ప్రముఖ నటులు శరత్కుమార్, రాధారవి అరెస్టుకు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. గతంలో సినీ నటీనటుల సంఘానికి శరత్కుమార్ అధ్యక్షుడిగా, రాధారవి కార్యదర్శిగా ఉన్నారు. ఆ కాలంలో కాంచీపురం జిల్లా పరిధిలోని వెంకటామంగళంలో ఉన్న నడిగర్ సంఘానికి చెందిన స్థలాన్ని వీరిద్దరు అక్రమంగా అమ్మారని 2017లో ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను కోర్టు శనివారం విచారించింది. సంఘం అనుమతి లేకుండా స్థలాన్ని విక్రయించిన ఈ కేసును 3నెలల్లో తేల్చి చర్యలు తీసుకోవాలని, శరత్, రవిలను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. -
వదినతో తొలిసారి నటిస్తున్నా..
తమిళసినిమా: ‘వదిన జ్యోతికతో కలిసి తొలిసారిగా సినిమాలో నటిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది’ అని నటుడు కార్తీ ట్విటర్లో పేర్కొన్నారు. గతంలో అగ్ర కథానాయికగా వెలుగొందిన జ్యోతిక.. నటుడు సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత నటనకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ‘36 వయదినిలే’ చిత్రంతో మళ్లీ నటిగా ఎంట్రీ ఇచ్చి ఆమె.. వరుసగా వుమెన్ ఒరియంటెడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె తన మరిది, నటుడు కార్తీతో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రంలోనూ వీరు వదినా మరిదిగా నటించడనుండడం విశేషం. మలయాళ దర్శకుడు జిత్తు జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైకం 18 స్టూడియోస్ సమర్పణలో పారలల్ మైండ్స్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రం గురించి నటుడు కార్తీ తన ట్విటర్లో స్పందిస్తూ.. ‘వదినతో కలిసి తొలిసారి నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. చాలా థ్రిల్లింగ్గా ఉంది. జిత్తు జోసెఫ్ దర్శకత్వంలో నటించనుండటం ఆనందకరం. ఈ చిత్రంలో నటుడు సత్యరాజ్ కీలక పాత్ర పోషించబోతున్నారు. మీ ఆశీస్సులతో చిత్రం ఈ రోజు ప్రారంభమైంది’ అని పేర్కొన్నాడు. నటుడు సూర్య కూడా కార్తీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో సూర్య, కార్తీ తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి గోవింద వసంత్ సంగీతాన్ని, ఆర్డీ.రాజశేఖర్ ఛాయాగ్రహణను అందిస్తున్నారు. -
ప్రముఖ దర్శకుడిపై జూనియర్ నటి తీవ్ర ఆరోపణలు
సాక్షి, చెన్నై : కోలివుడ్కు చెందిన ప్రముఖ దర్శకుడు అట్లీపై ఒక జూనియర్ నటి సంచలన ఆరోపణలు చేశారు. దళపతి విజయ్ 63వ సినిమాను అట్లీ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా దర్శకుడు అట్లీ తనను దారుణంగా దూషించారని, అసభ్యంగా, అశ్లీలంగా ఆయన దూషణలు ఉన్నాయని ఆమె తాజాగా చెన్నై పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అట్లీ తనను కుక్క కంటే హీనంగా చూసేవాడని ఆమె విమర్శించారు. రాజా-రాణి, తెరి, మెర్సల్ లాంటి విజయవంతమైన సినిమాలతో ప్రముఖ దర్శకుడిగా పేరొందిన అట్లీపై ఈరకమైన ఆరోపణలు రావడం తమిళ చిత్రసీమలో సంచలనం రేపుతోంది. ఏప్రిల్ 13న షూటింగ్ సెట్లో తనను అట్లీ ఘోరంగా దూషించాడని, అయినా ఎన్నికలు ఉండటం, ప్రభుత్వ సెలవులు ఉండటంతో ఈ విషయాన్ని ఇప్పటివరకు వెల్లడించలేదని ఆమె చెప్పుకొచ్చారు. ‘ఆహారం, సరైన టాయ్లెట్లు కావాలని మాత్రమే మేం సహాయ దర్శకులను అడిగేవాళ్లం. కానీ, అట్లీ, అతని సహాయ దర్శకులు మా విజ్ఞప్తిని పట్టించుకోకపోగా, మమ్మల్ని దూషించారు. అంతేకాదు, నన్ను షూటింగ్ స్పాట్ నుంచి బలవంతంగా తరిమేశారు’ అని ఆమె పేర్కొన్నారు. ఫుట్బాల్ నేపథ్యంతో తెరకెక్కుతున్న అట్లీ తాజా సినిమాలో విజయ్ సరసన నయనతార నటిస్తుండగా.. జాకీ ష్రఫ్, కదిర్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. -
మణిరత్నం చిత్రంలో బొమ్మాళి?
సాక్షి, తమిళ సినిమా : మణిరత్నం చిత్రంలో అనుష్క నటించనుందా? అంటే అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు కోలీవుడ్లో వినిపిస్తోంది. ఎన్నో భారీ చిత్రాలను, వైవిధ్యభరిత ప్రేమకథా చిత్రాలను వెండితెరపై తనదైన శైలిలో ఆవిష్కరించి సంచలన విజయాలను అందుకున్న దర్శకుడు మణిరత్నం. ప్రస్తుతం ఆయన ఒక మహాయజ్ఞానికి సిద్ధం అవుతున్నారు. ఎంజీఆర్, కమలహాసన్ వంటి దిగ్గజాలు నటించాలని ఆశపడ్డ ‘పొన్నియన్ సెల్వన్’ కథను తెరకెక్కించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇది మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. గతంలోనే ఈ ప్రాజెక్టును చేపట్టినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ముందుకు సాగించలేకపోయారు. ఇప్పుడు పట్టువీడని విక్రమార్కుడిలా పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని తెరకెక్కించడానికి మణి సిద్ధమయ్యారు. ఈసారి మరింత భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. కోలీవుడ్ నుంచి కార్తీ, జయంరవి, విక్రమ్, టాలీవుడ్ నుంచి మోహన్బాబు, మాలీవుడ్ నుంచి కీర్తీ సురేశ్, బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ వంటి వారు నటించనున్నారు. వీరిలో పొన్నియన్ సెల్వన్గా టైటిల్ పాత్రలో నటుడు జయంరవి, వందియ దేవన్గా కార్తీ, ఆదిత్య కరికాలన్గా విక్రమ్, కందవైగా కీర్తీసురేశ్ నటించనున్నారు. సుందరచోళన్గా అమితాబ్బచ్చన్, పళవేట్టరైయర్గా మోహన్బాబు నటించనున్నారు. నటుడు సత్యరాజ్ కూడా ఇందులో నటించబోతున్నట్లు సమాచారం. ఇక కుట్రలు చేసే మాయామోహిని నందినిగా నటి ఐశ్యర్యరాయ్ నెగిటివ్ పాత్రల్లో నటించబోతున్నట్లు తెలిసింది. మరో కీలక పూంగుళలి పాత్రలో అగ్రనటి నయనతార నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం విజయ్ చిత్రంతోపాటు రజనీకాంత్తో దర్బార్ చిత్రంలో ఆమె నటిస్తుండటంతో.. మణిరత్నం చిత్రానికి కాల్షీట్స్ కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమెకి బదులు మరో అగ్రనటి అనుష్కను ఆ పాత్రలో నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. భాగమతి తరువాత చాలా విరామం తీసుకుని ‘సైలెన్స్’ అనే చిత్రంలో నటిస్తోంది అనుష్క. ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఆగస్ట్లో సెట్పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీనికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
బరువు తగ్గే ప్రయత్నంలో నటి!
తమిళసినిమా: దక్షిణాదిలో నటిగా పేరు సంపాదించుకున్న వారిలో చాలా మంది తదుపరి స్టెప్గా బాలీవుడ్పై గురి పెడుతున్నారు. అలా అతిలోకసుందరి శ్రీదేవి, జయప్రదల నుంచి ఇటీవల అశిన్, శ్రియ, తాప్సీ, ఇలియానా వరకూ పలువురు నటీమణులు ఇక్కడ రాణించి బాలీవుడ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇక పలువురు బాలీవుడ్ బ్యూటీస్ దక్షిణాదిలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అది వేరే సంగతి. అలా తాజాగా దక్షిణాది నుంచి బాలీవుడ్ ఆఫర్ను అందుకున్న నటి నిత్యామీనన్. మాలీవుడ్కు చెందిన ఈ అమ్మడు కోలీవుడ్, టాలీవుడ్ల్లోనూ తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. అయితే వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించే నటి మాత్రం కాదీ జాణ. తనకు నచ్చితే ఎలాంటి పాత్రనైనా చేయడానికి వెనుకాడదు. ఇటీవల కాస్త బరువెక్కిన నిత్యామీనన్ ప్రస్తుతం బరువు తగ్గే ప్రయత్నంలో ఉంది. అందుకు కారణం బాలీవుడ్లో అవకాశం రావడమేననే ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్లో స్లిమ్గా ఉండే హీరోయిన్లనే లైక్ చేస్తారు. అందుకే నిత్యామీనన్ కసరత్తులతో కొత్త అందాలను సంతరించుకునే ప్రయత్నంలో ఉందట. ఇంతకీ ఈ బ్యూటీకి బాలీవుడ్ ఆఫర్ ఇచ్చిందెవరో తెలుసా? జగన్శక్తి. ఈయన అక్షయ్కుమార్ హీరోగా తెరకెక్కిస్తున్న హిందీ చిత్రంతో నిత్యామీనన్ బాలీవుడ్కు ఎంట్రీ ఇస్తోంది. ఇంకా పేరు ఖరారు చేయని ఈ చిత్రంలో నిత్యతోపాటు నటి విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ నటించనున్నారట. ఇది మంగళ్యాన్ పథకం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రం అని తెలిసింది. నిత్యామీనన్ ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్లో సావిత్రిగా నటిస్తోంది. అదేవిధంగా తమిళంలో సైకో చిత్రంతో పాటు, తెరకెక్కిడానికి సిద్ధం అవుతున్న జయలలిత బయోపిక్ ‘ది ఐరన్ లేడీ’ చిత్రంలో జయలలితగా నటించడానికి రెడీ అవుతోంది. -
పుట్టినరోజు సందర్భంగా అనుష్క తీపికబురు!
సాక్షి, తమిళ సినిమా : అందాల ముద్దుగుమ్మ అనుష్క గురించి ఇప్పుడో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్నేహితులంతా ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్క ప్రేమ, పెళ్లి గురించి ఇప్పటికే చాలాసార్లు ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్టు ఈ బ్యూటీ కూడా భాగమతి చిత్రం తరువాత ఒక్క చిత్రంలోనూ నటించలేదు. కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు. మధ్యలో గుళ్లూ.. గోపురాలూ తిరిగి పూజలు, దోష నివారణ పరిహారాలు చేసింది. దీంతో అనుష్క పెళ్లిపై దృష్టి సారించిందనే ప్రచారం జరిగింది. 38 ఏళ్ల అనుష్క పెళ్లి గురించి ఆమె అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సైజ్ జీరో’ చిత్రంలోని పాత్ర కోసం అమాంతం బరువు పెరిగిపోయిన ఈ అమ్మడు.. వెయిట్ను తగ్గించుకోవడానికి చాలానే కష్టపడుతోంది. యోగాలు, కసరత్తులతో ప్రయోజనం లేకపోవడంతో పూర్వ అందాల కోసం ఆస్ట్రేలియా పరిగెత్తింది. నాజూగ్గా తయారై తరువాత ఇండియాకు తిగిగొచ్చిన తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లో నటిస్తారని ప్రచారం జరిగినా.. అనుష్క మాత్రం కొత్త సినిమాలేవీ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే అనుష్క త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందనే కథనాలు వైరల్గా మారాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల ఈ బ్యూటీ కాలివేలుకు మెట్టెలు ధరించినట్టు కనిపిస్తున్న ఒక ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అంతేకాదు ఈ ఫొటోకు క్యాప్షన్ అక్కర్లేదు అంటూ కామెంట్ పెట్టింది. దీంతో నవంబర్ 7న తన పుట్టినరోజు సందర్భంగా అనుష్క తీపికబురు చెప్పబోతున్నారని, పెళ్లి గురించి ఆమె ప్రకటించే అవకాశముందని ప్రచారం ఊపందుకుంది. ఈ కథనాల్లో వాస్తవమెంతో తేలాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.. View this post on Instagram No caption required 😍 A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on Oct 27, 2018 at 4:41am PDT -
నటనలో మేనత్తను మించాలి!
తమిళ సినిమా: నటి ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తమ నటి అన్న పదానికి చిరునామా ఆమె. తెలుగులో కథానాయికగా పలు చిత్రాల్లో నటించి జాతీయ అవార్డులను గెలుచుకున్న నటీమణి.. తెలుగుతోపాటు తమిళంలోనూ నటించిన ఆమె.. తమిళ నిర్మాత కాజామైదీన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత నటనకు దూరంగా ఉన్న ఆమని ఇటీవల మళ్లీ నటించడం మొదలెట్టారు. ఆమె భర్త కాజామైదీన్ రోజా కంబైన్స్ పతాకంపై చుట్టికుళందై, గోపాలా గోపాలా గొపాలా, పోర్కాలం, పూందోట్టం, వాంజినాథన్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు ఆమని మేనకోడలు, ఆమె సోదరుడి కుమార్తె హృతిక కథానాయికగా సినీ రంగంలోకి అడుగుపెడుతోంది. కరుప్పయ్య మురుగన్ దర్శకత్వంలో అశోక్ కథానాయకుడిగా నటిస్తున్న ‘విడయాద ఇరవొండ్రు వేండుం’ అనే చిత్రం ద్వారా ఆమె కోలీవుడ్కు పరిచయం అవుతోంది. ఎన్నో కలలు, ఆశలతో రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ.. ఆమనిని మించి మంచిపేరును చిత్రసీమలో తెచ్చుకోవాలని భావిస్తున్నట్టు తెలిపింది. ‘మా అత్త ఆమనికి నటిగా తెలుగులో మంచి పేరు ఉంది. ఆమె అవార్డులను సైతం గెలుపొందారు. అలాంటి అత్తను చూస్తూ పెరిగిన నేను నటనలో ఆమెలా పేరు తెచ్చుకోవాలన్నది చిన్నప్పటి నుంచే ఆశించా’ అని హృతిక తెలిపింది. తన మామ కాజామైదీన్ నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారని, పాఠశాల విద్యను పూర్తిచేసిన తరువాత సినిమాల్లోకి రమ్మని వారిద్దరూ తనకు సూచించారని, వారి ఆశీస్సులతో ఈ రంగంలోకి వచ్చానని పేర్కొంది. సినిమాల కోసం భరతనాట్యంతోపాటు డాన్స్ను నేర్చుకున్నానని చెప్పింది. తన పూర్వీకులు ఆంధ్రావారేనని, కానీ, పెరిగింది తమిళనాడులో, ప్రస్తుతం చదువుతోంది బెంగళూర్లో అని తెలిపింది. నటుడు అశోక్కు జంటగా నటించే అవకాశం రావడంతో ఓకే చెప్పేశానని, చిత్ర నిర్మాణం పూర్తి కావచ్చిందని తెలిపింది. ఇకపై వరుసగా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నానని, తన మేనత్త కంటే అధిక చిత్రాల్లో నటించి, ఆమె కంటే అధిక అవార్డులు పొంది వాటిని అత్తకు కానుకగా సమర్పించాలని ఆశిస్తున్నానని హృతిక తన మనసులోని మాటను తెలిపింది. -
వరూ... వచ్చేసింది!
బెంగళూరులో పుట్టి చెన్నైలో పెరిగిన వరలక్ష్మి మైక్రోబయాలజీ, బిజినెస్మేనేజ్మెంట్ చదువుకుంది. తమిళంలో తన తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన వరలక్ష్మి హీరో శరత్కుమార్ ముద్దుల తనయ. విశాల్ ‘పందెంకోడి–2’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన వరలక్ష్మి శరత్కుమార్ గురించి కొన్ని ముచ్చట్లు... లాటిన్ అమెరికా డ్యాన్సర్ నటన మీద ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది. ముంబైలోని ‘అనుపమ్ఖేర్స్ యాక్టింగ్ స్కూల్’లో నటనలో మెళకువలు నేర్చుకున్న వరలక్ష్మికి డ్యాన్స్లో మాంచి టాలెంట్ ఉంది. తొలి సినిమా ‘పోడా, పొడి’లో శింబుతో పోటీ పడి డ్యాన్స్ చేసింది. శింబు హిప్ హప్లో టాప్ అయితే, వరూ లాటిన్ అమెరికన్ డ్యాన్స్లో టాప్. సామాజికంగా... సెంటిమెంట్లు, విధిరాత మీద వరలక్ష్మికి పెద్దగా నమ్మకం లేదు. సామాజిక విషయాలపై స్పందించడంలో ముందుండటానికి ఇష్టపడుతుంది. తానేదో తన ప్రపంచమేదో అన్నట్లు కాకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలను పట్టించుకోవడంతో పాటు ఉద్యమాలతో మమేకమవుతుంటుంది. ‘మీ టూ’ ఉద్యమానికి ఆమె పూర్తి మద్దతుగా నిలిచింది. పురుషాధిక్యభావజాలాన్ని వ్యతిరేకిస్తుంది. కాస్త భిన్నంగా... కొత్త భాషలను నేర్చుకోవడంలో వరూ మంచి నేర్పరి. తెలుగు, తమిళ, మలయాళి, ఫ్రెంచ్ భాషలలో ప్రవేశం ఉంది. గ్లామర్ పాత్రలు మాత్రమే చేయాలనుకోవడం లేదు. నెగటివ్ రోల్ అయినా సరే, మూసపోసిన పాత్రల్లో కాకుండా భిన్నమైన, సవాలుగా నిలిచే పాత్రల్లో నటించాలనుకుంటుంది వరలక్ష్మి. తెగ నచ్చేసింది కొందరు నటిస్తే వాళ్లు మాత్రమే కనిపిస్తారు. కొందరు నటిస్తే పాత్ర మాత్రమే కనిపించి ‘శబ్భాష్’ అనిపించుకుంటారు. వరలక్ష్మికి కూడా ఇలాంటి ప్రశంస దక్కింది. ‘పందెంకోడి–2’లో ఆమె నటన డైరెక్టర్ లింగుస్వామికి తెగనచ్చేసిందట. ‘నేను అనుకున్నదానికంటే చాలా గొప్పగా నటించావు’ అని ప్రశంసించి నూటికి నూరు మార్కులు వేశాడు. అవును... ఏదో ఒకరోజు ఎప్పటికైనా డైరెక్టర్ కావాలనేది వరలక్ష్మి కల. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో తప్పనిసరిగా డైరెక్షన్ చేస్తాను అంటుంది. హార్డ్కోర్ థ్రిల్లర్స్, గ్యాంగ్స్టర్ సినిమాలు చేయడం అంటే ఇష్టమట. ఇప్పటికే ఆమె దగ్గర కొన్ని ఐడియాలు రెడీగా ఉన్నాయి. వరూ మెగాఫోన్ పట్టడమే ఆలస్యం అవి వెండితెర మీదికి వస్తాయన్నమాట. అమ్మ అంటే ఉక్కుమహిళ జయలలిత బయోపిక్లో శశికళ పాత్రను తిరస్కరించడం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు... ‘ఒకవేళ సినిమా చేయాల్సివస్తే అమ్మ పాత్రే చేస్తాను. మహిళాలోకానికి ఆమె స్ఫూర్తి. జ్ఞానం, ధైర్యం, తెలివితేటలు ఆమెను ఉక్కుమహిళగా నిలిపాయి’ అంటుంది వరూ. ఏదో సినిమా కార్యక్రమంలో వరూ చేసిన డ్యాన్స్ అమ్మ జయకు నచ్చేసి మెచ్చుకుందట. ఇదొక మధురజ్ఞాపకం అంటుంది వరూ. కవర్ ఫొటో: శివ మల్లాల -
నయనతార ఇటు ‘సైరా’.. అటు ‘ఐరా’!
సాక్షి, తమిళ సినిమా: తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జంటగా సైరా చిత్రంలో నటిస్తున్న నయనతార.. తమిళంలో ఐరా చిత్రంలో నటిస్తుండటం విశేషం. దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఏకైక కథానాయిక నయనతార. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఆమె ఇటీవల నటించిన మాయ, ఆరం వంటి చిత్రాలు సక్సెస్ కావడంతో వుమెన్ సెంట్రిక్ కథలతో దర్శకనిర్మాతల నయనతార కోసం క్యూ కడుతున్నారు. ఆమె తాజా చిత్రాలు కోలమావు కోకిల, ఇమైకా నొడిగళ్ కూడా వరుసగా విజయం సాధించడంతో నయనతార క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాతో తెరపైకి రావడానికి నయనతార సిద్ధం అవుతున్నారు. ఇంతకుముందు అరమ్, గులేభకావళి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కేజేఆర్ స్టూడియోస్ సంస్థ నిర్మాణంలో సర్జిన్ దర్శకత్వంలో నయన ‘ఐరా’ చిత్రం చేస్తున్నారు. సర్జిన్ ఇంతకుముందు ‘హెచ్చరికై ఇదు మణిదర్గళ్ నడమాడుం ఇదం’ అనే సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజా ‘ఐరా’ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. దీని ఫస్ట్లుక్, టైటిల్ను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సినిమాలో నయనతార తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని, హర్రర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమె పాత్రలు విభిన్నంగా ఉంటాయని దర్శకుడు సర్జిన్ తెలిపారు. ఇందులో రెండు పాత్రలు ఒక దానికి, ఒకటి సంబంధం లేకుండా కాంట్రస్ట్గా ఉంటాయని చెప్పారు. ఐరా అంటే ఇంద్రుడి వాహనం ఐరావతమని, ఇందులో ఏనుగు లాంటి బలమైన పాత్రలో నయనతార నటించారని చెప్పారు. డిసెంబర్లో క్రిస్మస్ పండగ సందర్భంగా ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. Wishing the best for the Aram team @kjr_studios , @tridentartsoffl & #Nayanthara in her first dual role film directed by the super talented @sarjun34 & his promising team ! #Airaa #ChristmasHolidays #Decemeber #AiraFirsTLook pic.twitter.com/nCaklReeep — Vignesh ShivN (@VigneshShivN) 9 October 2018 -
పెళ్లి వార్తలపై ఫైర్ అయిన వరలక్ష్మీ!
సాక్షి, తమిళసినిమా: వారు అనుకున్నది జరగదు అంటున్నారు నటి వరలక్ష్మీశరత్కుమార్.. కోలీవుడ్లో బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ లేడీగా పేరొందిన వరూ.. హీరోయిన్ పాత్రలనే చేస్తానని మడికట్టుకుని కూర్చోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కోలీవుడ్లో దూసుకుపోతున్నారు. మరో పక్క సేవ్ శక్తి పేరుతో సంస్థను నెలకొల్పి స్త్రీల సమస్యల గురించి పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం వరలక్ష్మీ గురించి ఓ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వరలక్ష్మి పెళ్లికి సిద్ధమైందని, ఇటీవల ఆమె వివాహ నిశ్చితార్థం కూడా జరిగిందని కథనాలు వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన వరలక్ష్మీశరత్కుమార్ అవన్నీ వదంతులు లేని కొట్టిపారేశారు. ఈ మేరకు ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చారు. ‘ నాకు వివాహ నిశ్సితార్థం జరగలేదు. పెళ్లి చేసుకోవడం లేదు. అలాంటి ఏ ఆధారాలు లేకుండా కొందరు పనికట్టుకుని వదంతులు ప్రచారం చేస్తున్నారు. నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. నేను ఈ రంగంలోకి పనిచేయడానికే వచ్చాను. పనీపాటా లేనివారే ఇలాంటి వదంతులు ప్రచారం చేస్తుంటారు’ అని ఆమె మండిపడ్డారు. ‘నా కఠిన శ్రమ ఎప్పటికీ అపజయాన్ని ఇవ్వదు. నా పని నేను చేసుకుపోతున్నాను. మీరు అనుకున్నది జరగదు’ అని గాసిప్ రాయుళ్లపై ఆమె ఫైర్ అయ్యారు. వరలక్ష్మీ విశాల్తో కలిసి నటించిన సండైకోళి-2 చిత్రం ఈ నెల 19న, విజయ్తో కలిసి నటించిన సర్కార్ చిత్రం వచ్చే నెల దీపావళి సందర్భంగా తెరపైకి రానున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం కన్నిరాశి, వెల్వెట్ నగరం, అమ్మాయి, నీయా-2 తదితర చిత్రాల్లో వరూ నటిస్తున్నారు. తాజాగా బుల్లితెరపైనా ప్రత్యక్షం కానున్నారు. జయటీవీలో సామాజిక ఇతివృత్తంతో ప్రసారం కానున్న ‘ఉన్నై అరిందాళ్’ అనే కార్యక్రమానికి ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. -
ప్రియతో జోడీ కడుతున్న యువహీరో!
సాక్షి, తమిళసినిమా: ఒకవైపు సీనియర్ తారలు తెరమరుగవుతుంటే, కొత్త భామలు సత్తా చాటుతున్నారు. కోలీవుడ్లో యువ నటీమణుల జోరు కొనసాగుతోంది. ఈ కోవలోకి తాజాగా వర్ధమాన నటి ప్రియాభవానీశంకర్ చేరారు. ఆమెను వరుసగా విజయాలతోపాటు అవకాశాలు పలుకరిస్తున్నాయి. బుల్లితెర ద్వారా వెండితెరకు ప్రమోట్ అయిన ఈ బ్యూటీకి రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. ‘మేయాదమాన్’ తో వెండితెరకు పరిచయమైన ప్రియ భవానీశంకర్.. ఆ చిత్రం విజయవంతం కావడంతో కోలీవుడ్లో అందరి దృష్టిలో పడ్డారు. ఆ తరువాత హీరో కార్తీకి జోడీగా నటించిన ‘కడైకుట్టిసింగం’ చిత్రం కూడా సంచలన విజయం సాధించింది. దీంతో ప్రియకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా యువ నటుడు అధర్వకు జంటగా నటించే లక్కీఛాన్స్ను ఆమె సొంతం చేసుకున్నారు. ‘కురుధి ఆట్టం’ చిత్రం కోసం వీరు జోడీ కట్టబోతున్నారు. దీనికి శ్రీగణేశ్ దర్శకత్వం వహించనున్నారు. ఈయనకిది రెండో సినిమా. అందరూ కొత్తవారితో శ్రీగణేశ్ తెరకెక్కించిన ‘8 తొట్టాగళ్’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మధురై నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్స్ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా గ్యాఫ్ తరువాత నటుడు రాధారవి, ఆయన సోదరి, నటి రాధికాశరత్కుమార్ నటించబోతున్నారు. రాక్ ఫోర్ట్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ అధినేత టీ మురగానందం, బిగ్ ప్రింట్ పిక్చర్స్ ఐబీ కార్తీకేయన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
ఎందుకంటే లైఫ్లో బిగ్ ఛేంజ్ కోసం.. : నటి
సాక్షి, తమిళసినిమా: గత 12 ఏళ్లుగా త్రిష నట జీవితాన్ని చూస్తూనే ఉన్నాం. ఆది నుంచి ఇప్పటి వరకూ సంచలనాల పంథాను ఆమె కొనసాగిస్తున్నారు. ఈ అమ్మడు ప్రేమలో పడిందని చాలాసార్లు సామాజిక మాధ్యమాల్లో కథనాలు వచ్చాయి. 2014లో నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్తో ప్రేమపెళ్లికి సిద్ధమైందంటూ కథనాలు వచ్చాయి. పెళ్లికి ముందే ప్రేమికుల చిహ్నమైన తాజ్మహల్ను ప్రియుడితో కలిసి ఆమె చుట్టివచ్చారు. దీంతో పెళ్లి పీటలెక్కడమే తరువాయి అనుకున్నారు. కానీ అనూహ్యంగా వీరు బ్రేకప్ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు త్రిష పెళ్లి గురించి కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. హీరోయిన్ ఒరియేంటెడ్ సినిమాలు చేసే స్థాయికి త్రిష ఎదిగారు. అయితే, సక్సెస్ మాత్రం దోబూచులాడుతోంది. ధనుష్తో జతకట్టిన ‘కొడి’ చిత్రం తరువాత ఈ అమ్మడు హిట్ చూసిన పాపాన పోలేదు. అయినా ఈ బ్యూటీని లక్కు వెతుక్కుంటూ వచ్చింది. ఎంతోకాలంగా రజనీకాంత్తో కలిసి ఒక్క సన్నివేశంలోనైనా నటించాలని భావిస్తున్న త్రిషకు.. ఇప్పుడు ఆయన సరసన కథానాయకిగా నటించే అవకాశం దక్కింది. ‘ పేట’ చిత్రంలో సూపర్స్టార్తో త్రిష రొమాన్స్ చేయబోతోంది. ఈ నేపథ్యంలో త్రిష ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన ఫొటో పెద్ద చర్చకు దారితీసింది. అందులో తన జుత్తును షార్ట్గా కట్ చేసుకుని త్రిష చాలా స్టైలిష్గా కనిపించింది. రజనీ చిత్రం కోసమే ఈ గెటఫ్ అని అంతా అనుకున్నారు. కానీ, త్రిష మాత్రం అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. ఒక అమ్మాయి తన జుత్తును కత్తిరించుకుందంటే ఆమె జీవితంలో పెద్ద మార్పును రాబోతున్నదని అంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఇంతకు ఆ పెద్ద మార్పు ఏమిటబ్బా అంటూ అభిమానులు ఆలోచనలో పడ్డారు. త్రిష చిరకాల కోరిక అయిన రజనీకాంత్తో జత కట్టడం సారమైంది. ఇక, మిగిలింది పెళ్లే.. ఈ అమ్మడు పెళ్లికి రెడీ అవుతోందా? అన్న సందేహం మొదలైంది. ఈ క్రమంలో త్రిషకు పెళ్లి అంటూ మళ్లీ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. త్రిష రియాక్ట్ అవ్వలేదు కానీ, ఆమె తల్లి ఉమా కృష్టన్ వెంటనే స్పందించారు. పెళ్లి ప్రచారం ఉట్టి వదంతులేనని, వాటిని నమ్మవద్దనీ, జస్ట్ ఫ్యాషన్ కోసమే ఆమె వెంట్రుకలు కట్ చేసుకున్నారని వివరణ ఇచ్చారు. త్రిష న్యూ స్టైల్ వెనుక ప్రత్యేకత ఏమీ లేదని తెలిపారు. కాగా ప్రస్తుతం త్రిష విజయసేతుపతితో రొమాన్స్ చేసిని ‘96’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
అయ్యో: టాప్ దర్శకుడు భిక్షాటన చేస్తూ జీవనం!
సాక్షి, పెరంబూరు : పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కంచి ఆలయంలో భిక్షాటన చేస్తూ.. దుర్భర పరిస్థితుల్లో జీవిస్తుండటం సినీ పరిశ్రమను కలిచివేస్తోంది. అలనాటి మహానటుడు ఎంజీఆర్ హీరోగా ‘నమ్మనాడు’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు జంబులింగం కొడుకు సెంథిల్నాథన్. దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖరన్ వద్ద సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సెంథిల్ నాథన్.. ఆ తరువాత విజయకాంత్ నటించిన ‘పూందోట్ట కావల్క్కాన్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. దీంతో వరుసగా పాలైవన్ రాజాక్కళ్, ఇళవరసన్ తదితర 20 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన స్వీయ దర్శకత్వంలో 2009లో ‘ఉన్నై నాన్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఆయన ఎన్నో ఆర్థిక సమస్యలు, కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. దీంతో ఈ చిత్రం విడుదల కాలేదు. ఆ తరువాత సెంథిల్నాథన్ బుల్లితెరపై దృష్టి సారించినా.. అక్కడ విజయం సాధించలేకపోయారు. స్వీయ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సీరియల్ నుంచి ఆయనను ఇటీవల తొలగించారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన సెంథిల్నాథన్.. ఇంటిని వదిలి కంచికి వెళ్లిపోయారు. అక్కడి ఆలయం వద్ద భిక్షాటన చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. ఈ విషయం తెలిసిన కొందరు నిర్మాతలు ఆయన్ని సంప్రదించి చెన్నైకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో వారు వెనుదిరిగారు. దీనిపై కాంచీపురం పోలీసులకు సమాచారం అందించారు. వారి సాయంతో సెంథిల్నాథన్ను చెన్నైకి తీసుకొచ్చారు. -
అందుకే ఆమె లేడీ సూపర్స్టార్ అయ్యారు!
సాక్షి, తమిళసినిమా: అగ్రనటి నయనతార మరోసారి కోలీవుడ్ హెడ్లైన్స్లో మారుమోగిపోతున్నారు. ఈ మధ్య విడుదలైన ‘కోలమావు కోకిల’ సైలెంట్గా సక్సెస్ బాటలో పయనిస్తూ మరోసారి నయన్ స్టామినాను నిరూపించింది. ఈ చిత్రాన్ని నయన్ ఒంటి చేత్తో విజయ పథంలోకి తీసుకెళ్లారు. ఇక, తాజాగా విడుదలైన ‘ఇమైకా నొడిగళ్’ చిత్రం కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. ఇందులో హీరోగా అధర్వ, విలన్గా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, అతిథి పాత్రలో విజయ్సేతుపతి నటించినా, నయనతార ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడు పారితోషికం తారాస్థాయికి చేరుకుందనే వార్తలు హోరెత్తుతున్నాయి. దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం డిమాండ్ చేస్తున్న హీరోయిన్గా నయన్ పేరు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఇమైకా నొడిగళ్’ చిత్రానికి భారీ పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం విడుదల సమయంలో ఆర్థికంగానూ పలు సమస్యలను ఎదుర్కొంది. చివరినిమిషంలో చిత్ర విడుదల ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అభిరామి రామనాథన్ లాంటి వారు చివరిసమయంలో చిత్రానికి మద్దతిచ్చి.. విడుదలయ్యేలా చూశారు. అప్పటికీ నయనతార పారితోషికంలో ఇంకా రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉంది. సాధారణంగా అన్ని శాఖల వారికి ఫుల్ పేమెంట్ చేసిన తర్వాతే చిత్రం విడుదల అవుతుంది. తన సినిమా ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల్ని అర్థం చేసుకొని.. నయనతార తనకు రావలసిన మొత్తాన్ని వదులుకుందట. ఈ విషయం తెలియడంతో నయన్ కోలీవుడ్లో, సామాజిక మాధ్యమాల్లో హాట్టాపిక్గా మారారు. ఈ పెద్ద మనస్సు వల్లే నయనతార లేడీ సూపర్స్టార్గా రాణిస్తున్నారని అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార పాత్రకు మొదట మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టిని తీసుకోవాలనుకున్నారు. కానీ ఆ పాత్రను ఫీమేల్గా మార్చి నయనతారను ఎంచుకున్నారు. ఇప్పుడు ఆమె పాత్రే ‘ఇమైకా నొడిగళ్’ చిత్రానికి భారీ కాసులు కురిపిస్తోంది. -
సినిమా దర్శకుడిగా మారిన రిటైర్డ్ న్యాయమూర్తి!
సాక్షి, తమిళసినిమా: ఇతర రంగాల్లో పేరు, ప్రఖ్యాతలు గండించిన ప్రముఖులు సైతం సినిమారంగంలోకి అడుగుపెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ కోవలో విశ్రాంత న్యాయమూర్తి చేరబోతున్నారు. విశ్రాంత న్యాయమూర్తి అయిన ఎం. పుహళేంది త్వరలో మెగాఫోన్ పట్టనున్నారు. కథ, కథనం, మాటలు, పాటలు, దర్శకత్వంతోపాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టి.. సెల్లమ్ అన్కో క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘వేదమానవన్’ .. మనోజయంత్ అనే నూతన నటుడు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మధ్యప్రదేశ్ మోడల్ ఊర్వశీ జోషీ హీరోయిన్గా కోలీవుడ్కు పరిచయం అవుతోంది. ఢిల్లీగణేశ్, బెంజిమిన్, బోండామణి, ములైయూర్ సోనై ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం ఎస్.కన్నన్... సంగీతం సౌందర్యన్ అందిస్తున్నారు. ‘ఒక ఉరి శిక్ష ఖైదీ విడుదలై వస్తే అతన్ని ఊరు ప్రజలు తమతో కలుపుకుంటారా లేదా అన్న ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రం వేదమానవన్’అని దర్శకుడు పుహళేంది తెలిపారు. ఇందులో ప్రేమ, శోకం, వీరం, హాస్యం తదితర అంశాలుంటాయని, సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించాలన్న ఉద్దేశంతో తాను తీర్పులిచ్చిన అంశాలను తీసుకుని ఈ చిత్రకథను తయారు చేసుకున్నానని తెలిపారు. తాను ఇప్పటివరకూ తమిళం, ఇంగ్లిష్ భాషల్లో 22 నవలలు రాశానని తెలిపారు. అదేవిధంగా 2015లో చెన్నైని ముంచెత్తిన వరద ఘోరాన్ని యథాతథంగా పుస్తకంగా రాసినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎస్.మోహన్ సలహాతో తాను సాహితీరంగం నుంచి సినీ రంగంలోకి వచ్చినట్లు తెలిపారు. -
అందుకు ఎంతోమంది ఉన్నారు.. టోన్ మార్చిన తాప్సీ!
సాక్షి, తమిళ సినిమా: కమర్షియల్ హీరోయిన్ పాత్రలు పోషించేందుకు చాలామంది ఉన్నారంటోంది తాప్సీ.. ఇంతకుముందు దక్షిణాదిలో అలాంటి గ్లామర్ పాత్రల కోసమే వెంపర్లాడిన ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్లో పింక్, నామ్ షబనా వంటి కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాల్లో నటించడంతో టోన్ మార్చేసింది. బాలీవుడ్లో కాస్త గుర్తింపు రావడం, చేతిలో చిత్రాలు ఉండడంతో ఈ అమ్మడు ధోరణి మారిపోయిందని సినీ జనాలు అంటున్నారు. ఇంతకు తాప్సీ ఏమన్నారంటే.. ‘కొన్ని సందర్భాల్లో నేను కాస్త భయపడతాను. అయితే అది మంచికే అనుకుంటాను. భయం లేదంటే ఏదో తప్పు జరుగుతుందనే అర్థం. నేను కొత్త చిత్రాల ఎంపిక సమయంలో భయపడతాను. అయితే ఆ భయం చిత్రాల విడుదల సమయంలో ఉండదు. నా నుంచి ఎలాంటి నటనను ఆశిస్తున్నారన్న విషయం గురించి ఎక్కువగా ఆసక్తి చూపుతాను. శ్రమతోనే నేనీ స్థాయికి చేరుకున్నాను. ఈ రంగంలో అగ్రస్థానంలో ఉన్నామా అన్నదే ముఖ్యం. మనం విజయపథంలో ఉంటే చాలు. వైవిధ్యభరితమైన కథాచిత్రాల్లో నటిస్తున్నప్పుడు ఎలాంటి విమర్శలు వస్తున్నాయన్నది ఆసక్తిగా చదువుతాను. అయితే కమర్షియల్ పాత్రల్లో నటించినప్పుడు వచ్చే విమర్శల గురించి పట్టించుకోను. నెటిజన్ల విమర్శలనూ పెద్దగా కేర్ చేయను. తొలిరోజుల్లో నన్ను విమర్శించే వారికి బదులిచ్చేదాన్ని. అయితే ఆ తరువాత మా నాన్న సలహాతో విమర్శలకు బదులివ్వడం మానేశాను. స్థాయి పెరిగినప్పుడు నిన్ను కిందకు పడేయడానికి కొందరు ప్రయత్నిస్తారు అని సన్నిహితులు చెప్పారు. అది నిజం అని గ్రహించాను. నిజం చెప్పాలంటే విమర్శల కారణంగా నాకెలాంటి బాధ లేదు. నన్ను నిజాయితీగా ఫాలో అయ్యేవారి కోసమే ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నాను. వారిలో ఒకరిద్దరి ప్రశ్నలకు సరదాగా బదులిస్తుంటాను. మరో విషయం ఏమిటంటే నన్ను విమర్శించడం వల్ల నాకే మంచి పబ్లిసిటీ వస్తుందని వారు గ్రహించడంలేదు. ఇకపోతే కమర్షియల్ చిత్రాల్లో నటించడం నచ్చిందా? సామాజిక సందేశమున్న చిత్రాల్లో నటించడం నచ్చిందా? అని అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే ఈ రెండు విషయాలు కలిసిన కథా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నాను. సామాజికపరమైన పాత్రల్లో నటించే అవకాశాలే నాకు ఎక్కువగా వస్తున్నాయి. కమర్శియల్ కథా చిత్రాల్లో నటించడానికి చాలామంది నటీమణులు ఉన్నారు. అలాంటి పాత్రలకు వారు ఉన్నప్పుడు నన్నెందుకు దర్శక నిర్మాతలు ఎంచుకుంటారు. నిజం చెప్పాలంటే ఆ విషయంలో నాకూ బాధ లేదు’ అని తాప్సీ చెప్పుకొచ్చారు. -
ఫుల్ ఫ్యామిలీ మూవీ: కీర్తి సురేశ్ ఆశ నెరవేరానా?
సాక్షి, తమిళసినిమా: మనిషి కలలు కనడం ఎంత సహజమో, ఆశపడటం అంతకంటే సహాజం. ఇంతకీ ఈ కహానీ ఎందుకంటారా? యువ నటి కీర్తీసురేశ్ అలాంటి అరుదైన కార్యం కోసం ఆశపడుతోంది. నటిగా ఈ బ్యూటీ కేరీర్ మహానటి చిత్రానికి ముందు ఆ తరువాత అన్నట్టుగా మారిపోయింది. అప్పటి వరకూ కమర్షియల్ చిత్రాలతో విజయపథంలో దూసుకుపోతున్న కీర్తి.. మహానటి చిత్రంతో అభినేత్రి అనేంతగా పేరు తెచ్చుకుంది. ఆ చిత్రంలో నటి సావిత్రి పాత్రలో అవలీలగా ఒదిగిపోయిన కీర్తీసురేశ్ తాజాగా కమర్షియల్ హీరోయిన్ బాణీకి మారిపోయింది. ప్రస్తుతం తను విజయ్కు జంటగా సర్కార్, విశాల్ సరసన సండైకోళి-2, విక్రమ్తో సామి స్క్వేర్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వీటిలో విశాల్తో రొమాన్స్ చేసిన సండైకోళి-2 చిత్రం వచ్చే నెల తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఆ తరువాత సామీ స్క్వేర్, ఆపై సర్కార్ అంటూ ఈ అమ్మడు నటించిన చిత్రాలు అభిమానులను ఎంటర్టెయిన్ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇవి కాకుండా కొత్త చిత్రాలను ఇప్పటివరకు అంగీకరించని కీర్తీసురేశ్ సినిమా కుటుంబం నుంచి వచ్చిన నటి అన్న విషయం తెలిసిందే. తండ్రి సురేశ్ మాలీవుడ్లో ప్రముఖ చిత్ర నిర్మాత, తల్లి మేనక ఒకప్పటి నటి. ఈమె రజనీకాంత్ సరసన పుదుకవితై అనే చిత్రంలో నటించారన్నది గమనార్హం. ఇక కీర్తీ అమ్మమ్మ నటినే. ఆమె ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. ఇటీవల కార్తీ హీరోగా నటించిన ‘కడైకుట్టి సింగం’ చిత్రంలోనూ కీర్తి అమ్మమ్మ నటించారు. తాజాగా చారుహాసన్తో కలిసి నటించిన ‘దాదా 87’ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. అదే విధంగా కీర్తీసురేశ్ సోదరి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. ఇంతకీ కీర్తీసురేశ్ ఆశ పడే విషయం ఏమిటంటే.. నాన్న నిర్మాతగా తన అక్క దర్శకత్వంలో రూపొందించే సినిమాలో తానూ, అమ్మా, బామ్మ కలిసి నటించాలనుందని ఉందని కీర్తి పేర్కొంది. కీర్తీకి తన ఆశను నెరవేర్చుకోవడం పెద్ద పనేమీ కాదు. కాబట్టి తన కుటుంబం చేసే చిత్రాన్ని మనం చూసే అవకాశం లేకపోలేదు. అయినా రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా! దర్శకులూ ఇంకెందుకు ఆలస్యం కీర్తీ కుటుంబం కోసం కథకు పదును పెట్టే పనిలో పడిపోతే పోలా! -
రీ–ఎంట్రీకి రెడీ
‘సినిమాలు మానేసే ఆలోచన అస్సలు లేదు’... వీరేంద్రని పెళ్లాడినప్పుడు నమిత ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. గతేడాది నవంబర్లో నమిత పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మంచి కథల కోసం ఎదురు చూస్తున్నారు. ఫైనల్లీ తన ఆలోచనలకు తగ్గట్టుగా ఓ సినిమా కుదిరిందట. ప్రముఖ తమిళ దర్శకుడు–నటుడు టి. రాజేందర్ సినిమాలో ఆమె కథానాయికగా నటించనున్నారట. విశేషం ఏంటంటే దాదాపు 11 ఏళ్ల తర్వాత టి.రాజేందర్ దర్శకత్వం వహించనున్న చిత్రమిది. ఇటీవల నమితను కలసి కథ చెప్పారట. ఇక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. నిజానికి తమిళంలో ఫేమస్ అయ్యే ముందు నమిత తెలుగులోనే స్టార్ హీరోయిన్ అయ్యారు. అందుకే తెలుగు ఇండస్ట్రీ అంటే అభిమానం. తెలుగులో మంచి ఆఫర్స్ వస్తే చేయాలనుందనీ, ముఖ్యంగా చాలెంజింగ్ రోల్స్ కోసం వెయిట్ చేస్తున్నానని నమిత పేర్కొన్నారు. అన్నట్లు.. నమిత సిల్వర్ స్క్రీన్పై కనిపించి రెండేళ్లయింది. 2016లో చేసిన ‘పులి మురుగన్’ ఆమె చివరి సినిమా. -
విడుదలకు సిద్ధంగా ముప్ఫై సినిమాలు
చెన్నై: సినీ పరిశ్రమ సమ్మెతో ముప్పైకి పైగా చిత్రాలు 48 రోజులుగా ఎదురు చూపులతో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో రజనీకాంత్ కాలా, కమలహాసన్ విశ్వరూపం–2 చిత్రాలు చోటు చేసుకున్నాయి. ఇవి తెరపైకి వచ్చేది ఎప్పుడన్న ఆసక్తి కోలీవుడ్లో నెలకొంది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు, థియేటర్ల సంఘాలతో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిర్మాతల సంఘం జరిపిన చర్చలు ఫలించకపోవడంతో గత మార్చి 1 నుంచి కొత్త చిత్రాల విడుదలను, 16వ తేదీ నుంచి షూటింగ్లను నిలిపివేసి సమ్మెకు దిగారు. 48 రోజుల సమ్మె అనంతరం రాష్ట్ర సమచార, ప్రసారాల శాఖ మంత్రి కడంబూర్ రాజు నేతృత్వంలో మంగళవారం సినీ సంఘాల నేతలు నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు ఫలించాయి. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ తమ రేట్లను 50శాతం తగ్గించుకోవడానికి అంగీకరించారు. అదేవిధంగా టిక్కెట్ బుక్కింగ్ విధానం కంప్యూటర్లో పొందుపరచడం లాంటి డిమాండ్లకు థియేటర్ల యాజమాన్యం అంగీకరించింది. దీంతో చిత్ర షూటింగ్లు ప్రారంభోత్సవం, కొత్త చిత్రాల విడుదల విషయంలో నిర్మాతల మండలి బుధవారం సమావేశమై నిర్ణయం వెల్లడించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే చిత్రా విడుదల సెన్సార్ అయిన తేదీల ప్రకారం ఉంటుందని నిర్మాతల మండలి ప్రకటించింది. విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాల్లో కాలా, విశ్వరూపం– 2, మెర్క్యూరీ, మిస్టర్ చంద్రమౌళి, మోహిని, కరు, టిక్ టిక్ టిక్, నరకాసురన్, ఇరుట్టు అరైయిల్ మొరట్టు కుత్తు, గజినీకాంత్, ఇరుంబుతిరై, అసురవధం, పరియేరుమ్ పెరుమాళ్, ఆణ్దేవదై, అభియుమ్ అనువుమ్, భాస్కర్ ఒరు రాస్కెల్, సర్వర్సుందరమ్, కుప్పత్తురాజా, ఆర్కే.నగర్, పార్టీ, కడైకుట్టిసింగం, ఇమైకా నోడిగళ్ అంటూ 30 చిత్రాలకు పైగా రెడీగా ఉన్నాయి. సెన్సార్ అయిన తేదీ ప్రకారం చూస్తే కాలా చిత్రం ఈ నెల 27న విడుదలయ్యే అవకాశం లేదనిపిస్తోంది. కాలా కంటే ముందే విశ్వరూపం–2 సెన్సార్ను పూర్తి చేసుకుని ఉండడంతో ఆ చిత్రమే ముందుగా తెరపైకి రావాల్సి ఉంది. ఈ విషయంలో నిర్మాతల మండలి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. -
మార్చి1 నుంచి సినీ పరిశ్రమ బంద్
సాక్షి, చెన్నై: డిజిటల్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మార్చి1 నుంచి చిత్ర పరిశ్రమ బంద్ చేపడుతున్నట్టు తమిళ నిర్మాతల మండలి ప్రకటించింది. ఈ నేపథ్యంలో షూటింగ్లు, సినిమాల విడుదలను నిలిపి వేయాలని నిర్ణయం తీసుకుంది. డిజిటల్ విధానానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోమవారం మండలి సభ్యులు ప్రటించారు. కాగా, డిజిటల్ ప్రొవైడర్ల విధానాల కారణంగా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని వారు మండిపడ్డారు. కేవలం తమ లాభాలనే దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న ఏక పక్ష నిర్ణయాలు సినీ పరిశ్రమలో అందరికీ నష్టాలను మిగులుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన చార్జీలను వసూలు చేయాలని దక్షిణాది ఫిల్మ్ ఛాంబర్స్ పలుసార్లు డిజిటల్ ప్రొవైడర్లను కోరినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో చిత్ర పరిశ్రమ బంద్కు పిలుపునిచ్చారు. -
ఇక తమిళ సినిమాలు చూస్తా: రాహుల్
తమిళనాడు ప్రజలన్నా, వాళ్ల భాష, సంస్కృతి అంటే తనకు ఎంతో ఇష్టమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. ఇకమీదట తాను తమిళ సినిమాలు చూస్తానని, తమిళ ప్రజల సంస్కృతి గురించి తెలుసుకోడానికి పుస్తకాలు చదువుతానని కూడా చెప్పారు. తమిళనాడు కాంగ్రెస్ నేతలతో జరిగిన సమావేశం సందర్భంగా ఆయనీ విషయాలు తెలిపారు. తాను తన సోదరి ప్రియాంకకు ఒక ఎస్ఎంఎస్ చేశానని, తమిళనాడు వెళ్లడమంటే తనకెంతో ఇష్టమని అందులో చెప్పానని అన్నారు. ఎందుకో తెలియదు గానీ, తమిళ ప్రజలతో తనకు చాలా అనుబంధం ఉన్నట్లు అనిపిస్తోందని చెప్పారు. తమిళం అన్నా, తమిళులన్నా తనకెంతో ప్రేమ ఉందని చెప్పినప్పుడు ప్రియాంక కూడా తనదీ అదే ఫీలింగ్ అని చెప్పారన్నారు. ఈ సమావేశంలో తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు తిరునావక్కరసర్, సీఎల్పీ నేత కేఆర్ రామస్వామి తదితర నాయకులు పాల్గొన్నారు. ఉపనిషత్తులు చదువుకుంటున్నా చదువుకోడానికి వయసుతో పనిలేదంటారు. అందుకే.. రాహుల్ గాంధీ ఇప్పుడు మళ్లీ పుస్తకాలు తీశారు. అయితే ఇవి క్లాసు పుస్తకాలు కాదట, ఉపనిషత్తులు, భగవద్గీత అని స్వయానా ఆయనే చెబుతున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి వీటిని ఎందుకు చదువుతున్నారంటే... ఆర్ఎస్ఎస్, బీజేపీల మీద ఎదురుదాడి చేయడానికట!! ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ గాంధీయే వెల్లడించారు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతున్న సందర్భంగా ఆయనీ విషయం తెలిపారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలతో తలపడేందుకు తాను ఈ మధ్య ఉపనిషత్తులు, భగవద్గీత చదువుతున్నానని అన్నారు. ఉపనిషత్తులలో ప్రజలంతా సమానమేనని చెబుతున్నా వాళ్లు మాత్రం కొంతమందిని అణగదొక్కుతున్నారని, తద్వారా మీ సొంత మతం చెప్పేదానికి భన్నంగా ప్రవర్తిస్తున్నారని తాను ఆర్ఎస్ఎస్ వాళ్లను అడుగుతానన్నారు. అసలు బీజేపీవాళ్లకు భారతదేశం అంటే అర్థం కావట్లేదని, వాళ్లకు కేవలం ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న 'నాగ్పూర్' మాత్రమే అర్థమవుతుందంటూ చురకలు వేశారు. ప్రపంచంలో ఉన్న విజ్ఞానం అంతా కేవలం ప్రధాని మోదీ నుంచే వచ్చిందని వాళ్లు అపోహ పడుతున్నట్లు చెప్పారు. -
బాపుగారి బొమ్మ కొత్త అవతారం !
నటి ప్రణీతను బహుభాషా నటి అనే అనాలి. మాతృభాష కన్నడంతో పాటు తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్ అనిపించుకున్నా, అంతగా మార్కెట్ను పెంచుకోలేకపోయింది. చక్కని శరీరాకృతి, ఆకర్షణీమైన అందం వంటి ప్లస్ పాయింట్స్ ఉన్నా పాపం ఎందుకో రెండో హీరోయిన్ పాత్రలకే పరిమితం అవుతోంది ప్రణీత. తమిళంలో కార్తీ వంటి స్టార్ హీరోతో శకుని చిత్రంలో నటించినా ఆ చిత్రం నిరాశనే మిగిల్చింది. ఆ తరువాత కూడా కోలీవుడ్లో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తెలుగు చిత్రపరిశ్రమలో అడుగిడినా అత్తారింటికి దారేది లాంటి భారీ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ పాత్రతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. నటిగా అవకాశాలను నమ్ముకుంటే లాభం లేదనుకుందో ఏమో ఇటీవల బెంగుళూర్లో ఒక రెస్టారెంట్ను ప్రారంభించి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. తాజాగా ప్రణీతకు నిర్మాతగా మారాలనే కోరిక పుట్టిందట. త్వరలోనే చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దీని గురించి ప్రణీత తెలుపుతూ నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్న విషయం నిజమేనంది. ఇతర కథానాయికల కంటే భిన్నంగా ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఈ భామ ఏ భాషలో చిత్రాన్ని నిర్మించేది క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్లో అధర్వతో నటించిన జెమినీగణేశనుం సురుళీరాజావుం చిత్రం త్వరలో తెరపైకి రానుంది. -
సరైన అవకాశాలు రాలేదు
చెన్నై : తమిళంలో నాకు సరైన అవకాశాలు రాలేదు అంటోంది నటి భావన. 2002లోనే మలయాళంలో నటిగా రంగప్రవేశం చేసిన ఈ కేరళకుట్టి ఆ తరువాత తమిళం, కన్నడం, తెలుగు తదితర దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. తమిళంలో 2006లో చిత్తిరం పేసేదడి చిత్రంతో అడుగు పెట్టింది. ఆ చిత్రం విజయం సాధించడంతో ఇక్కడ భావన ఒక రౌండ్ చుట్టేస్తుందని కోడంబాక్కం వర్గాలు భావించాయి. అలాగే జయం రవితో దీపావళి, యువ నటులతో నటించే అవకాశాలను దక్కించుకుంది. అజిత్తో అసల్ చిత్రంలో కూడా నటించింది. అయితే అధిక అవకాశాలను కోలీవుడ్లో ఈ కేరళ కుట్టి రాబట్టుకోవడంలో ఫెయిలైందని అన్నవారూ లేక పోలేదు. ఇక్కడ విజయాలు ఈమెకు అంతంత మాత్రమే. దీంతో ఈ అమ్మడు టాలీవుడ్పై దృష్టి సారించింది. అక్కడ వరుసగా అవకాశాలను రాబట్టుకున్నా ఎక్కువ కాలం నిలబడలేక పోయింది. తమిళంలో భావన నటించిన చివరి చిత్రం అసల్. అది 2010లో విడుదలైంది. ప్రస్తుతం మాతృభాష అయిన మలయాళంలోనే నటిస్తోంది. అయితే ఇటీవల తమిళ చిత్ర అవకాశాలను భావన అంగీకరించడం లేదనే ఆరోపణలు తెరపైకి రావడం గమనార్హం. అందుకు కారణం లేక పోలేదు. విజయ్ సరసన పులి చిత్రంలో నటించే అవకాశాన్ని భావన అందుకోలేదనే ప్రచారం జరిగింది. దీనికి స్పందించిన భావన తాను తమిళంలో నటించి ఐదేళ్లయిందని గుర్తు చేసుకుంది. అయితే మలయాళం, కన్నడం చిత్రాలలో నటిస్తూ ఇప్పటికీ బిజీగానే ఉన్నానని అంది. అసల్ చిత్రం తరువాత తమిళంలో కొన్ని కథలు విన్నాననీ, తనకు సరైన పాత్రలు అమరక పోవడంతో నటించలేదని వివరించింది. అయితే తమిళ చిత్రాలలో నటించనని ఎప్పుడూ చెప్పలేదని అంది. ఇకపోతే పులి చిత్రంలో విజయ్ సరసన నటించే అవకాశం వచ్చిన మాట నిజమేనని అంది. ఆ సమయంలో ఇతర చిత్రాలతో బిజీగా ఉండడంతో ఆ అవకాశాన్ని అంగీకరించలేక పోయానని, తనకు నప్పే పాత్రలో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని భావన అంటోంది. -
తీరిక దొరికితే ఏడ్చి ఉండేదాన్ని!
సమంతకు ఓ విచిత్రమైన అలవాటు ఉందట. అదేంటంటే, స్క్రీన్ మీద తనను తాను చూసుకోవడం ఇష్టం ఉండదట. అలాగని చేసిన సినిమా చూడకుండా ఉండలేను కదా అంటున్నారు. పైగా, తాజా తమిళ చిత్రం ‘10 ఎన్రదుకుళ్ల’లో భిన్న కోణాలున్న పాత్ర చేశారట. అందుకని, ఇష్టం చేసుకుని మరీ ఈ చిత్రం చూడటానికి ట్రై చేస్తానని ఈ బ్యూటీ అంటున్నారు. ప్రస్తుతం తమిళంలో ఎక్కువ చిత్రాలు చేస్తున్నారు కానీ, ‘ఏ మాయ చేశావె’ విజయంతోతెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయారామె. కొన్నాళ్ల పాటు తమిళ సినిమాలు చేసే తీరిక సమంతకు చిక్కలేదు. తెలుగులో సక్సెస్ఫుల్గా మొదలైన ఆమె కెరీర్ తమిళంలో మాత్రం ఫెయిల్యూర్తో మొదలైంది. సమంత నటించిన తొలి తమిళ చిత్రం ‘బాణా కాత్తాడి’ ప్రేక్షకాదరణ పొందలేదు. ఆ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా, పెద్దగా బాధపడలేదని ఇటీవల ఓ సందర్భంలో సమంత పేర్కొన్నారు. ఎందుకు బాధపడలేదో చెబుతూ - ‘‘తెలుగులో ‘ఏ మాయ చేశావె’ సూపర్ హిట్ కావడంతో, ఈ తమిళ సినిమా ఫెయిల్యూర్ గురించి ఆలోచించే తీరిక చిక్కలేదు. ఒకవేళ తీరిక చిక్కి ఉంటే, అప్పుడు బాగా ఏడ్చేదాన్ని. బహుశా నా ఏడుపుని కంట్రోల్ చేయడం ఎవరి వల్లా కాకపోయి ఉండేది’’ అన్నారు. -
రెండోసారి కాదందట?
ప్రస్తుతం నయనతార ఫుల్ బిజీ. ఆమె చేతిలో నాలుగైదు తమిళ సినిమాలున్నాయి. మరి కొన్ని అవకాశాలు కూడా వరిస్తున్నాయట. కథాకథనాలు బాగుంటే చాలు...ఎంత చిన్నహీరో సరసన నటించడానికి సై అంటున్నారు. దీనికి తాజా ఉదాహరణ ‘మాయ’ అనే చిత్రం. ఇందులో ఓ నూతన హీరో సరసన ఆమె నటిస్తున్నారు. ఈ చిత్ర దర్శకునికి ఇది తొలి చిత్రం కావడం విశేషం. ఇదిలా ఉంటే..ప్రస్తుతం నయనతారకు వచ్చిన అవకాశాల్లో విక్రమ్ సినిమా ఒకటి. ఇందులో నయనతారను కథానాయికగా తీసుకోవాలనుకున్నారట. కానీ దర్శక, నిర్మాతలు అడిగితే నయనతార తిరస్కరించడం చర్చనీయాంశమైంది. ఎందుకంటే గతంలో విక్రమ్ సరసన ఓ సినిమాకు అవకాశం వస్తే నయనతార గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. మళ్లీ విక్రమ్ సినిమా ఆఫర్ను ఆమె తిరస్కరించడంతో ఈ హీరోగారి సరసన నటించడం ఇష్టం లేకే ఇలా చేస్తున్నారా..లేక డేట్స్ అడ్జెస్ట్ చేయలేక కాదంటున్నారా అని కోలీవుడ్లో చర్చించుకుంటున్నారు. మరి అసలు రీజన్ ఏంటో నయనతారకే తెలియాలి! -
కోలీవుడ్లో శర్వానంద్ దూకుడు
-
తెలుగులో గ్యాప్ తమిళంతో భర్తీ
ఓ లుక్కేస్తారా! సమంతకు టాలీవుడ్ కొంత విరామాన్ని ఇచ్చిందనే చెప్పాలి. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం తెలిసిన స్టార్లు ఈ విరామాన్ని మరోలా మలుచుకుంటు న్నారు. సమంత మాత్రం తమిళరంగం వైపు ఓ చూపు విసిరింది. ఇప్పుడామె చేతిలో తమిళ సినిమాలు దండిగానే ఉన్నట్లు సమాచారం. అయితే అవేవీ తెలుగు సినీరంగం ఇచ్చినంత రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదు. ఇక్కడ తీసుకుంటున్న రెమ్యూనరేషన్లో సగానికే తమిళ సినిమాలు చేస్తోందట. -
అప్పట్లో ఏమీ తెలిసేది కాదు!
‘‘నేను డెరైక్టర్స్ ఆర్టిస్ట్ని. దర్శకుడు ఎలా కోరుకుంటే అలా నటిస్తా. అలాగని నా శైలిని వదలుకోను. ఓ పాత్ర తీరుతెన్నులను దర్శకుడు చెప్పిన తర్వాత, ఒకవేళ నేనే ఆ పాత్ర అయితే ఎలా ఉంటానో.. ఊహిం చుకుని నటిస్తా’’ అంటున్నారు అనుష్క. ‘బాహుబలి, రుద్రమదేవి, లింగా, ఎన్నయ్ అరిందాల్’.. ఇలా తెలుగు, తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారీ బ్యూటీ. ఇటీవల ఓ సందర్భంలో నటిగా రంగప్రవేశం చేసిన తొలినాళ్లను అనుష్క గుర్తు చేసుకున్నారు. సినిమా నిర్మాణం ఎలా ఉంటుందనే విషయంపై తనకు కనీస అవగాహన ఉండేది కాదని అనుష్క చెబుతూ -‘‘సినిమాల్లోకి రాక ముందు నేను సాదా సీదా అమ్మాయిని. చాలా నిరాడంబరంగా ఉండేదాన్ని. అప్పట్లో మేకప్ వేసుకోవడం కూడా తెలియదు. ఇక కెమెరా యాంగిల్స్ గురించి ఏం తెలుస్తుంది! కానీ, ఓ నాలుగైదు సినిమాలు చేసిన తర్వాత ఫిలిం మేకింగ్ గురించి ఒక అవగాహన వచ్చింది. అలాగే, కెమెరా యాంగిల్స్ కూడా తెలుసుకున్నాను. అప్పట్నుంచీ నాదైన శైలిలో నటించడం మొదలుపెట్టాను. తెరపై చూస్తున్న రెండున్నర గంటల సినిమా కోసం పడే కష్టం ఏ స్థాయిలో ఉంటుందో స్వయంగా తెలుసుకున్నాను’’ అని చెప్పారు. ‘పోటీలో ఉన్న ఇతర నాయికలు హిందీ సినిమాలు చేస్తున్నారు కదా! మీరెందుకు చేయడంలేదు?’ అనే ప్రశ్న అనుష్క ముందుంచితే -‘‘హిందీ సినిమా చేయాలి కాబట్టి అని చేస్తే బాగుండదు. బాలీవుడ్ నుంచి కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ, ఏదీ కొత్తగా అనిపించలేదు. అందుకే ఒప్పుకోలేదు’’ అన్నారామె. -
న్యూ లుక్తో అదరగొట్టిన అంజలి
తమిళ రీమేక్ 'జర్నీ' సినిమాతో టాలీవుడ్లో వరుస అవకాశాలు అందిపుచ్చుకున్న అచ్చ తెలుగు హీరోయిన్ అంజలి... తనకు లైఫ్నిచ్చిన కోలివుడ్పై మళ్లీ దృష్టి పెట్టినట్లు ఉంది. అందుకే దాదాపు రెండేళ్ల విరామం తర్వాత అక్కడ ఓ రేంజ్లో దర్శనమిచ్చింది. ఇటీవల తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన 'కయల్' సినిమా ఆడియో వేడుకలో అంజలి పాల్గొంది. అలా ఇలా కాకుండా ఓ రేంజ్లో ఈ వేడుకకు హాజరయ్యింది. నల్లటి పొట్టి గౌను ధరించి వచ్చిన అంజలి తమిళ తంబీల మతి పొగొట్టింది. కోలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పుడు పొందికగా కనపడ్డ ఆమె...మరీ కురస దుస్తుల్లో అందాలు ఆరబోసే సరికే అందరూ షాక్ తిన్నారు. దాంతో ఆడియో వేడుక కార్యక్రమంలో అందరి కళ్లు అంజలిపైనే పడ్డాయట. బహుశా కోలివుడ్లో మళ్లీ ఆఫర్ల కోసమే ఇలా కన్పించేదేమోనని తమిళ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఒకప్పుడు కోలివుడ్లో హాట్ ఫేవరేట్గా నిలిచిన ఈ తెలుగింటి బ్యూటీ.... పిన్నితో విబేధాలు, తమిళ దర్శకుడు కళాంజీయమ్తో కోర్టు వివాదం కారణంగా రెండేళ్ల నుంచి తమిళ చిత్రపరిశ్రమకు దూరంగా ఉంటుంది . ఏదీ ఏమైనా మరోసారి తమిళ చిత్ర పరిశ్రమలో అంజలి సెంట్రాఫ్ అట్రాక్షన్గా నిలిచింది. -
తమిళ చిత్రాలే హాయి
మలయాళ చిత్రాల కంటే తమిళ చిత్రాలలో నటించడమే హారుఅంటోంది కేరళ భామ పూర్ణ. మలయాళ చిత్రాలతో నటిగా తన కెరీర్ను ప్రారంభించిన ఈ అమ్మడిలో మంచి డ్యాన్సర్, మోడల్ ఉన్నారు. తొలుత డ్యాన్స్ కార్యక్రమాలతో జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత మోడలింగ్, సినిమా అంటూ ఎదిగింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ తమిళం, తెలుగు, కన్నడం, మలయాళంలో నటించి బహుభాషా హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఇన్ని భాషల్లో నటించినా తమిళ చిత్రాల్లో నటించడమే సౌకర్యం అంటున్న పూర్ణ తన మనోభావాన్ని క్లుప్తంగా ఆవిష్కరించింది. అవేంటో చూద్దమా? నేను మలయాళ నటి నయినా తమిళంలోనే చక్కని కథాబలం ఉన్న పాత్రలో నటించాను. అలాగే మలయాళంలో కంటే తమిళ చిత్రాల్లో నటించడమే నాకు చాలా సౌకర్యం అనిపిస్తుంది. నన్ను ఒక స్టార్ నటిగా ట్రీట్ చేసింది కోలీవుడ్నే. అయితే లక్కీగా తెలుగు, కన్నడ భాషల్లో నటించిన చిత్రాలు ఎక్కువగా విజయం సాధించాయి. ప్రస్తుతం మలయాళం, తెలుగు భాషల్లో పలు అవకాశాలు వస్తున్నాయి. అలాగని వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించడంలేదు. నటిగా సత్తా చాటే పాత్ర కోసం ఎదురు చూస్తున్నాను. మలయాళంలో మంచి పాత్రలన్న నమ్మకం కుదిరితేనే అంగీకరించాలని నిర్ణరుుంచుకున్నాను. నాకు డాన్సర్గా మంచి పేరుంది. టీవీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంటాను. హీరోయిన్గా మంచి అవకాశాలొస్తుండగా టీవీ కార్యక్రమాలకు ప్రాముఖ్యతనివ్వడం దేనికని చాలా మంది అడుగుతుంటారు. వారికి నేను చెప్పే సమాధానం ఒక్కటే. వెండితెరకంటే బుల్లితెరపై నటించడం నా కిష్టం. ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ప్రస్తుతం తెలుగులో అవును చిత్రానికి సీక్వెల్లో చేస్తున్నాను. ఒక కన్నడ చిత్రం, తమిళ చిత్రం అంగీకరించాను. అని అంటున్న పూర్ణా మలయాళంలో జూలీ చిత్రం రీమేక్లో నటిస్తోంది. 1974లో సేతుమాధవన్ తెరకెక్కించిన జూలీ చిత్ర రీమేక్లో పూర్ణా టైటిల్ పాత్ర పోషించడం విశేషం. -
సినిమా డిస్ట్రిబ్యూషన్ పై నిర్మాతల్లో ఆందోళన!
చెన్నై:సినిమా తీయడం ఒక ఎత్తైతే.. దాన్ని మార్కెట్ చేయడం మరో ఎత్తు. సినిమా తీసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సినిమాలు తీస్తున్నా.. వాటిని విజయవంతంగా పంపిణీ చేయడంపై తమిళ నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు తమిళనాడులో ప్రముఖ నిర్మాతాలైన కేఈ గ్నణవేల్ రాజా, ఎస్, శశికాంత్, సీవీ కుమార్, ఎల్రెడ్ కుమార్, అభినేష్ ఎలన్ గోవన్, లక్ష్మణ్ కుమార్ లు ఒక కంపెనీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 'మేము ఎప్పట్నుంచో సినిమా డిస్ట్రిబ్యూషన్ పై పలు రకాలైన సమస్యలను ఎదుర్కొంటున్నాం. అసలు తమిళనాడులో సినిమాను ఎలా మార్కెట్ చేయాలో తెలియడం లేదు. దీన్ని వ్యవస్థీకరించే మార్గం కనబడటం లేదు. ఇందుకు గాను ఒక కంపెనీని ఏర్పాటు చేస్తున్నాం' అని వారు స్పష్టం చేశారు. ఈ డ్రీమ్ ఫ్యాక్టరీతో నిర్మాతలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సినిమా రూపుదిద్దుకున్నాక డిస్ట్రిబ్యూషన్-మార్కెటింగ్ కు మధ్య చోటుచేసుకునే సమస్యలకు తాము ఏర్పాటు చేసే కంపెనీ తగిన పరిష్కారం చూపిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న సరభమ్, మద్రాసు, యాన్, కావియా తలైయ్ వాన్, లుసియా చిత్రాలతో ఆ కంపెనీ సేవలు అందుబాటులోకి వస్తాయని నిర్మాతలు స్పష్టం చేశారు. -
తిరుమలలో రజనీకాంత్ ఫ్యాన్స్ హల్చల్
తిరుమల: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు బుధవారం పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో హల్చల్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలకు విరుద్ధంగా రజనీకాంత్ ఫొటోలతో కూడిన టీ షర్టులు ధరించి వచ్చారు. అభిమానులు రజనీ బ్యానర్లతో నడక దారి గుండా తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఎవరూ ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీసింది. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కోచడయాన్ విజయవంతం కావాలని కాంక్షిస్తూ అభిమానులు తిరుమల యాత్రకు వచ్చారు. -
లక్ష్మీరాయ్కి లక్కీచాన్స్?
నటి లక్ష్మీరాయ్కు లక్కీచాన్స్ వచ్చినట్లు సమాచారం. ఈ భామను తమిళ తెరపై చూసి చాలాకాలం అయ్యింది. కాంచన చిత్రం తరువాత లక్ష్మీరాయ్ను కోలీవుడ్ మరచిపోయిందనే చెప్పాలి. కన్నడం, మలయాళం చిత్రాలపై దృష్టి సారించిన ఈ బ్యూటీ కాంచన చిత్రం సీక్వెల్లో అవకాశం వస్తుందని ఆశించి భంగపడింది. తాజాగా ఈ అమ్మడికో మంచి అవకాశం కోలీవుడ్లో రానుందని సమాచారం. హిందీలో ఇటీవల మంచి హిట్ సాధించిన చిత్రాల్లో ఇష్కియా ఒకటి. విద్యాబాలన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఇప్పుడు తమిళంలో రీమేక్కు సిద్ధం అవుతోంది. విద్యాబాలన్ పాత్ర తమిళంలో నటి లక్ష్మీరాయ్ను వరించినట్లు కోడంబాక్కం టాక్. ఈ విషయం గురించి లక్ష్మీరాయ్ వద్ద ప్రస్తావించగా ఇష్కియా చిత్రం తమిళ రీమేక్లో నటించే విషయమై దర్శకుడు తనను సంప్రదించిన మాట నిజమేనని తెలిపింది. అయితే ఈ చిత్ర ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉంది. అందువలన దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సమయం వచ్చినప్పుడు చెబుతానని అంది. అయితే హిందీ చిత్రం ఇష్కియాను తాను చూశానని చెప్పింది. ఇందులో మూడు పాత్రలు ప్రధానంగా ఉంటాయని పేర్కొంది. విద్యాబాలన్ తన పాత్రను సమర్థవంతంగా పోషించిందని చెప్పింది. ఆ పాత్ర తనకు చాలా బాగా నచ్చిందని తెలిపింది. అలాంటి పాత్రను తానిప్పటి వరకు పోషించలేదని, నిజంగా తనకిది మంచి అవకాశమేనని చెప్పింది. ఈ చిత్రం తమిళం, మలయాళం భాషల్లో తెరకెక్కనుందని లక్ష్మీరాయ్ వెల్లడించింది. -
అప్పుడే పెళ్లా?
నటి అసిన్ పెళ్లి చేసుకున్నారా? ప్రస్తుతం బాలీవుడ్లో జరుగుతున్న వేడివేడి చర్చ ఇదే. కేరళ రాష్ట్రానికి చెందిన ముద్దుగుమ్మ అసిన్. తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్గా ఒక రౌండ్ కొట్టి గజని చిత్రంతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది. అక్కడ కూడా కొంత కాలం హవా కొనసాగించింది. ప్రస్తుతం అవకాశాలు ముఖం చాటేస్తున్నాయి. దీంతో అసిన్ పెళ్లి చేసుకుని సంసార జీవితానికి శ్రీకారం చుట్టినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సందర్భంగా ఆమెతో ప్రత్యేక ఇంటర్వ్యూ. మీకు పెళ్లి అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజంగానే ఓ ఇంటి వారయ్యారా? నేను నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకోవడానికి అమెరికా వెళ్లినప్పుడు ఇలాంటి ప్రచారం నా వరకు వచ్చింది. వివాహ నిశ్చితార్థం జరిగిందని, పెళ్లి కొడుకుది అమెరికా అని, పెళ్లి కూడా అయిపోయిందని బాలీవుడ్ ప్రచారం చేసింది. హిందీ చిత్ర పరిశ్రమ సంస్కృతి చాలా భిన్నమైంది. అక్కడ డేటింగ్ల సంస్కృతి ఎక్కువ. పెళ్లి కాకుండానే బాయ్ఫ్రెండ్తో విదేశాలు చుట్టి వస్తారు. నూతన సంవత్సరాన్ని ఎంజాయ్ చేస్తారు. నేను అమెరికా వెళ్లడం వల్ల నిశ్చితార్థం, పెళ్లి అంటూ ప్రచారం చేశారు. ఏదేమైనా మీకు పెళ్లి విషయం గురించి నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందిగా? నిజమే. నా జీవితంలో తదుపరి అంశం వివాహమే. అలాగని నేను పెళ్లికి తొందర పడను. హిందీ తారల్లో చాలా మంది పెళ్లే వద్దని కాలం గడిపేస్తున్నారు. పలువురు వివాహం చేసుకోకుండానే లివింగ్ రిలేషన్షిప్ పేరుతో సహజీవనం చేస్తున్నారు. నా వరకు వస్తే పెళ్లి చేసుకోమని ఇంటిలో ఒత్తిడి చేస్తున్నారు. మంచి వరుడి కోసం అన్వేషణ జరుగుతోంది. మరో ఏడాది వరకు పెళ్లి చేసుకోను. మీ జీవితంలో జరుగుతున్న మార్పులు? ముందుకంటే బరువు తగ్గి బాగా స్లిమ్గా తయారయ్యాను. మంచి చిత్రాల్లో నటించాను. నిజం చెప్పాలంటే నాకిప్పుడు కాస్త విశ్రాంతి అవసరం. చదువుకునే రోజుల్లోనే నటించడానికి వచ్చా ను. కుటుంబం, నటన మినహా నా మనసులో వేరే ఆలోచన లేదు. సన్నిహిత స్నేహితురాళ్ల పెళ్లిళ్లకు కూడా వెళ్లలేని పరిస్థితి. ఈ మధ్య విదేశాలు చుట్టొచ్చారట? గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు సుదీర్ఘ విదేశీయానం చేశాను. గ్రీస్ దేశంలో మొదలెట్టి రోమ్, వెని స్ వరకు వెళ్లాను. అమెరికా, కెనడా దేశాల్లోనూ కొన్ని రోజులు గడిపాను. ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్లోని అందాలను ఆస్వాదించాను. సినిమా అవకాశాలు లేకపోతే తారలకు నిద్ర పట్టదుగా? అలాంటి సందర్భం నా కెప్పుడు ఎదురుకాలేదు. నేనెప్పుడూ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటాను. డబ్బు కోసం నేనెప్పుడూ నటించలేదు. డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడను. షూటింగ్ అంటే సంతోషంగా వెళ్లాలి. ఇప్పుడు కూడా అలాంటి మంచి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను.