tenth
-
త్వరలోనే విద్యా కమిషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యా రంగ సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించి, పరిష్కరించేందుకు త్వరలోనే విద్యా కమిషన్ను ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి తెలిపారు. పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పా రు. టెన్త్లో పదికి పది జీపీఏ వచ్చిన విద్యార్థుల కు ఇంటర్లో ఫీజుల్లేకుండా అడ్మిషన్లు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. సోమవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో వందేమాతరం ఫౌండేషన్ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది.సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరై.. టెన్త్లో పది జీపీఏ సాధించిన విద్యార్థులకు వందేమాతరం ఫౌండేషన్ తరపున ప్రతిభా పురస్కారాలు అందించారు. అనంతరం రేవంత్ మాట్లాడారు. మౌలిక వసతులు తక్కువగా ఉన్నా.. కార్పొరేట్ స్కూళ్లతో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు పోటీపడటం అభినందనీయమని చెప్పారు. ఇప్పుడున్న సివిల్ సర్విస్ అధికారుల్లో చాలా మంది ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని.. తనతోపాటు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా సర్కారీ స్కూల్లోనే చదివామని రేవంత్ చెప్పారు.విద్యార్థులు లేరని స్కూళ్లు మూసేయబోం..రాష్ట్రంలో ప్రతీ గ్రామం, తండాకు విద్యను తీసుకెళ్లాలన్నదే తమ లక్ష్యమని, అందుకోసమే మెగా డీఎస్సీ నిర్వహించబోతున్నామని రేవంత్ చెప్పారు. విద్యార్థులు లేరంటూ స్కూళ్లు మూసేసే పరిస్థితి ఉండబోదని పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న సర్కారీ స్కూల్ భవనాల మరమ్మతుల కోసం రూ.2 వేల కోట్లు వెచ్చించనున్నట్టు చెప్పారు. రెసిడెన్షియల్ పాఠశాలలతో తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చిందన్నారు. ఈ క్రమంలో ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తూ.. సెమీ రెసిడెన్షియల్గా మార్చాలన్న ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు.ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీలకే ఇస్తున్నామన్నారు. సరికొత్త రీతిలో బడిబాట చేపట్టి స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు. విద్య మీద వెచి్చంచేది ఖర్చు కాదని, పెట్టుబడి అని పేర్కొన్నారు. టెన్త్లో ప్రతిభ చూపిన విద్యార్థులు ఇంటర్లోనూ మంచి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్య కమిషనర్ దేవసేన, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, యశోద ఫౌండేషన్ చైర్మన్ రవీందర్రావు, వందేమాతరం ఫౌండేషన్ అధ్యక్షుడు టి.రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
సాక్షి, అమరావతి: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2023–24 విద్యా సంవత్సరంలో ఫెయిలైన మొత్తం 1,61,877 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నట్టు పదో తరగతి పరీక్షల విభాగం ప్రకటించింది. వీరిలో 96,938 మంది బాలురు కాగా.. 64,939 మంది బాలికలు ఉన్నారు. శుక్రవారం నుంచి జూన్ 3వ తేదీ వరకు మొత్తం 9 రోజులపాటు జరిగే పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 685 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. రెగ్యులర్ పరీక్షల మాదిరగానే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు.పర్యవేక్షణకు 685 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 685 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 6,900 మంది ఇని్వజిలేటర్లతో పాటు 86 ఫ్లయింగ్ స్క్వాడ్స్ను నియమించామన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలను ‘నో ఫోన్ జోన్’గా ప్రకటించామని, ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని ప్రకటించారు. డీఈవోల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షలు ముగిసేవరకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షల డైరెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, పరీక్షలపై ఎలాంటి సందేహాలున్నా 0866–2974540 నంబర్లో సంప్రదించాలని దేవానందరెడ్డి సూచించారు.పరీక్షల షెడ్యూల్ ఇదీ.. 24–5–2024 తెలుగు 25–5–2024 హిందీ 27–5–2024 ఇంగ్లిష్ 28–5–2024 లెక్కలు 29–5–2024 ఫిజికల్ సైన్స్ 30–5–2024 బయలాజికల్ సైన్స్ 31–5–2024 సోషల్ స్టడీస్ 01–6–2024 ఓఎస్ఎస్సీ పేపర్–1 03–6–2024 ఓఎస్ఎస్సీ పేపర్–2 -
టెన్త్, ఇంటర్లో భారీగా ‘రీ అడ్మిషన్లు’
సాక్షి, అమరావతి: గత విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫెయిలైన విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన ‘రీ అడ్మిషన్’ అవకాశాన్ని భారీ సంఖ్యలో వినియోగించుకున్నారు. సుమారు 1,93,251 మంది తిరిగి ఆయా తరగతుల్లో ప్రవేశాలు పొందారు. వీరికి ఈ విద్యా సంవత్సరంలో చేరిన రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పించనున్నారు. రాష్ట్రంలో నూరు శాతం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) సాధనలో భాగంగా 10వ తరగతి, ఇంటర్ తప్పినవారికి రాష్ట్ర ప్రభుత్వం పునర్ ప్రవేశ అవకాశం కల్పించింది. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా సర్వే చేసి, ఆయా విద్యార్థులను తిరిగి ఎన్రోల్ చేశారు. దాంతో 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి తప్పిన 1,23,680 మందిలో 1,03,000 మంది, ఇంటర్లో 90,251 మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. సాధారణంగా పరీక్ష తప్పినవారు తిరిగి ఫీజు కట్టి పరీక్షలు రాస్తే (సప్లిమెంటరీ) వారిని ‘ప్రైవేటు’ విద్యార్థులుగా పరిగిణిస్తారు. కానీ.. రీ అడ్మిషన్ తీసున్న వారిని ‘రెగ్యులర్’ విద్యార్థులుగానే పరిగణిస్తారు. ఎక్కువ మార్కులే పరిగణనలోకి.. ఆయా తరగతుల్లో రీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఫెయిలైన సబ్జెక్టులు మాత్రమే కాకుండా రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా పబ్లిక్ పరీక్షల్లో అన్ని పేపర్లు రాయాల్సి ఉంటుంది. అయితే, విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో సాధించిన మార్కులు, ప్రస్తుత విద్యా సంవత్సరంలో మార్కులను పరిశీలించి, ఆయా సబ్జెక్టుల్లో ఏ విద్యా సంవత్సరంలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే అంతిమంగా లెక్కలోనికి తీసుకుంటారు. ఉదాహరణకు ఓ విద్యార్థి 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫెయిలై, ఇప్పుడు రీ అడ్మిషన్ తీసుకుంటే.. గతేడాది మ్యాథ్స్ పేపర్లో 70 మార్కులు వచ్చాయనుకుంటే.. ఈ ఏడాది పరీక్షల్లో అదే పేపర్ 30 మార్కులే వస్తే.. గత ఏడాది వచ్చిన 70 మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే.. అన్ని సబ్జెక్టులు పాసైన రీ అడ్మిషన్ విద్యార్థుల సర్టీఫికెట్లపై ప్రైవేట్/కంపార్ట్మెంటల్/స్టార్ గుర్తు వంటివి లేకుండా ‘రెగ్యులర్’ అని గుర్తింపు ఇస్తారు. వీరికి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే జగనన్న విద్యాకానుక, అమ్మ ఒడి వంటి అన్ని పథకాలు వర్తింపజేశారు. ఒక్కసారే అవకాశం ఓ విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫెయిలైన వారికి మరుసటి సంవత్సరం మాత్రమే రీ అడ్మిషన్తో పాటు అన్ని రెగ్యులర్ ప్రభుత్వ పథకాలు పొందే అవకాశం కల్పిస్తారు. ఈ విద్యార్థులు రెండో ఏడాదీ ఫెయిలైతే వారికి మరో అవకాశం ఉండదు. వారు ప్రైవేటుగానే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. 2022–23లో ఇంటర్మీడియెట్, పదో తరగతి ఫెయిలై తిరిగి రెగ్యులర్ గుర్తింపు పొందిన 1,93,251 మంది విద్యార్థులు 2023–24 విద్యా సంవత్సరానికి గాను వచ్చే మార్చిలో పరీక్షలు రాయనున్నారు. వీరు ఈ విద్యా సంత్సరంలో అన్ని సబ్జెక్టులు పాసైతే ‘రెగ్యులర్’ సర్టీఫికెట్ అందుకుంటారు. ఫెయిలైతే తిరిగి సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సిందే. -
ఏపీలో మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు
-
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్, పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల..ఇంకా ఇతర అప్డేట్స్
-
శతశాతమే 'లక్ష్యం'
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పరీక్షల్లో వందశాతం ఫలి తాలు సాధించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. పాఠ శాల విద్య డైరెక్టరేట్ కార్యా లయం ఈ మేరకు జిల్లా అధికారులకు దిశానిర్దేం చేస్తూ..‘లక్ష్య’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని కార్యాచరణలోకి తెచ్చింది. ప్రతీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యేలా చూడటం దీని ఉద్దేశం. ఎన్నిక లు కూడా ముగియడంతో ఉన్నత పాఠశాలల ఉపా ధ్యాయులు టెన్త్ విద్యార్థులపై శ్రద్ధ పెట్టాలని డీఎస్ ఈ సూచించింది. వెనుకబడ్డ సబ్జెక్టులపై ప్రత్యేక బోధన చేపట్టాలని ఆదేశించింది. వీలైనంత త్వర గా సిల బస్ పూర్తి చేసి, జనవరిలో పునశ్చరణకు వెళ్లాలని పేర్కొంది. లక్ష్యం సాధించిన పాఠశాలల కు అవార్డు లిచ్చే అంశాన్ని కూడా ఉన్నతాధికారులు పరిశీలిస్తు న్నారు. టెన్త్ పరీక్షలు మార్చి, ఏప్రిల్ నెల లో జరుగుతాయి. ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే సిలబస్ పూర్తి చేసి, పరీక్షలకు సన్నద్ధమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలపై మరింత దృష్టి పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లపైనే..: రాష్ట్ర ప్రభుత్వ పాఠశా లలు, స్థానిక సంస్థల పాఠశాలల్లో టెన్త్ ఫలితాలు తక్కువగా నమోదవుతున్నాయి. 2023లో జెడ్పీ పా ఠశాలల నుంచి 1,39,922 మంది టెన్త్ పరీక్షకు హా జరైతే, 1,10,738 మంది మాత్రమే ఉత్తీర్ణుల య్యా రు. అంటే 79.14 శాతం రిజల్ట్ నమోదైంది. ప్రభు త్వ స్కూళ్లలో 21,495 మంది పరీక్ష రాస్తే, 15,561 (72.39 శాతం) మంది పాసయ్యారు. ప్రభుత్వ రెసి డెన్షియల్ స్కూళ్లలో 98 శాతం, గురుకు లాల్లో 95 శాతం ఫలితాలొచ్చాయి. ఇది ప్రైవేటు పాఠశాలక న్నా ఎక్కువ. అయితే ప్రభుత్వ, జెడ్పీ స్కూళ్లల్లో ఫలితాలపై ఈసారి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆ సబ్జెక్టులపైనే దృష్టి: ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎక్కు వగా మేథ్స్, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ఎక్కువగా ఫెయిల్ అవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ సబ్జెక్టులపై ప్రత్యేక బోధనకు ప్లాన్ చేశారు. టెన్త్ విద్యార్థులకు ఉదయం గంట అదనంగా క్లాసులు తీసుకుంటారు. వారంలో 3 సబ్జెక్టులు రోజుకు ఒకటి చొప్పున చేపట్టాలని నిర్ణయించారు. ఇది కూడా సంబంధిత సబ్జెక్టులో కఠినంగా ఉండే చాప్టర్లను ఎంపిక చేసుకోవాలని పాఠశాలలకు సూచిస్తున్నారు. జనవరి ఆఖరివారం లేదా ఫిబ్రవరి నుంచి సాయంత్రం కూడా అదనంగా మరో గంట ప్రత్యేక బోధన చేపట్టాలని నిర్ణ యించారు. దీనివల్ల టెన్త్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించడం సాధ్యమనేది అధికారుల ఆలోచన. -
కుటుంబం దుఃఖంలో ఉంటే ఇంత నీచ రాజకీయం చేస్తావా
-
టెన్త్ టాపర్లకు సీఎం వైఎస్ జగన్ బొనాంజా..
సాక్షి, అమరావతి: టెన్త్ టాపర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బొనాంజా ప్రకటించారు. నియోజకవర్గాల్లోని టాపర్లకూ ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. గవర్నమెంటు స్కూళ్లలో టెన్త్లో టాప్ విద్యార్థులకు ప్రోత్సాహకాలను విస్తరించనున్నారు. రాష్ట్ర, జిల్లాస్థాయి టాపర్లకే కాకుండా నియోజకవర్గాల వారీ టాపర్లరూ ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. నియోజకవర్గంలో 1,2,3 స్థానాల్లోని విద్యార్థులకు వరుసగా రూ.15వేలు, రూ.10వేలు, రూ.5వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందించనున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయి. టెన్త్, ఇంటర్ ఫలితాలే అందుకు నిదర్శనం. ఈ విద్యా సంవత్సరం పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను సన్మానించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: గేరు మార్చి.. స్పీడ్ పెంచి.. సీఎం జగన్ బలం అదే.. ఇదీ లెక్క..! నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులను అవార్డులు, నగదు పురస్కారాలతో సత్కరించనున్నారు. జడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, జీటీడబ్ల్యూ ఆశ్రమ స్కూళ్లు, కేజీబీవీ విద్యార్థులకు ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. మార్కుల ఆధారంగా టెన్త్, ఇంటర్లో 2,831 మంది విద్యార్థులను సత్కరించనున్నట్లు మంత్రి చెప్పారు. -
ఏపీలో ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు
-
టెన్త్ పరీక్ష ఫీజు 125 రూపాయలే
సాక్షి, కదిరి: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం నెల క్రితమే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల10లోగా చెల్లించవచ్చు. అన్ని సబ్జెక్టులకు కలిపి కేవలం రూ.125 చెల్లిస్తే సరిపోతుంది. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా పరీక్ష ఫీజు పెంచలేదు. ఇదే మొత్తాన్ని వసూలు చేస్తోంది. అపరాధ రుసుంతో... రూ.50 అపరాధ రుసుంతో డిసెంబర్ 20 వరకూ పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. డిసెంబర్ 25 వరకూ అపరాధ రుసుం రూ.200తో , ఆ తర్వాత అంటే డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 30లోగా రూ.500 అపరాధ రుసుంతో పరీక్ష ఫీజు చెల్లించే వెసులుబాటు ఉంది. వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే వారు రూ.125తో పాటు ప్రాక్టికల్స్ కోసం అదనంగా మరో రూ.60 చెల్లించాలి. గతంలో టెన్త్ ఫెయిలైన విద్యార్థులు మూడు లేదా అంతకన్నా తక్కువ సబ్జెక్టులకు రూ.110, అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులుంటే రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా రూ.125 చెల్లిస్తే సరిపోతుంది. హెచ్ఎంలదే కీలక బాధ్యత.. 10వ తరగతి పరీక్షల ఫీజు విషయంలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులదే కీలక బాధ్యత ఉంటుంది. విద్యార్థుల పరీక్ష ఫీజుకు సంబంధించిన నామినల్ రోల్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే విద్యార్థులు నష్టపోతారు. పూర్తి చేసిన నామినల్ రోల్స్కు పాఠశాల లాగిన్లోని లింక్ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చలానా లేదా సీఎఫ్ఎంఎస్ ద్వారా ఫీజు చెల్లిస్తే ఉపయోగం ఉండదు. 10 పరీక్షలకు సంబంధించిన మ్యానివల్ నామినల్ రోల్స్ (ఎంఎన్ఆర్)ను డిసెంబర్ 21 నుండి 31 లోగా డీఈఓ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. 23,758 మంది రెగ్యులర్ విద్యార్థులు.. జిల్లాలో 2022–23 విద్యా సంవత్సరంలో జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 11,782 మంది, మున్సిపల్ స్కూల్స్లో 1,803, కస్తూర్బా స్కూల్స్లో 1,115 మంది, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 783 మంది, సోషల్ వేల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 540 మంది, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో 220 మంది ఉన్నారు. అలాగే ఏపీఆర్ఈఐ సొసైటీ స్కూల్స్లో 88 మంది, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్లో 35 మంది, మోడల్ స్కూల్స్లో 796 మంది, నవోదయ విద్యాలయాల్లో 83 మంది, ప్రైవేటు/కార్పొరేట్ స్కూల్స్లో 5,603 మంది, సీబీఎస్సీ వారు 178 మంది, బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో 724 మందితో పాటు గవర్నమెంట్ స్కూల్స్లో మరో 8 మంది అంధ విద్యార్థులతో కలిపి బాలురు 12,450 మంది, బాలికలు 11,308 మంది మొత్తం 23,758 మంది రెగ్యులర్ విద్యార్థులు ఈసారి పది పరీక్షకు హాజరు కానున్నారు. ఈసారి ఆరు పేపర్లే.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి.. నాణ్యమైన విద్యా బోధనే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చింది. పది పబ్లిక్ పరీక్షల్లో 11 పేపర్లకు బదులు 6 పేపర్లు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. కోవిడ్ కారణంగా గత ఏడాది పది పబ్లిక్ పరీక్షల్లో 7 పేపర్లు నిర్వహించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో 2019–20 అలాగే 2020–21 విద్యాసంవత్సరాల్లో 10 పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేదు. సమ్మేటివ్ పరీక్షల్లో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకొని టెన్త్ పాస్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి సీబీఎస్ఈ తరహాలోనే టెన్త్లో ఆరు పేపర్లే ఉంటాయి. ప్రైవేటు స్కూళ్లలో ఫీ‘జులుం’.. 10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నాయి. స్కూల్ఫీజు, ట్యూషన్ ఫీజు, ట్రాన్స్పోర్టు ఫీజు ఇలా బకాయి ఉన్న ఫీజులన్నీ చెల్లిస్తే గానీ పరీక్ష ఫీజు తీసుకునేది లేదని మెలిక పెడుతున్నారు. ఇంకొన్ని చోట్ల కోవిడ్ సమయంలోని పెండింగ్లో ఉన్న ఫీజులు కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఫలానా తేదీకి ఫీజు మొత్తం క్లియర్ చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులతో హామీ పత్రాలు తీసుకుంటున్నారు. వాస్తవంగా పరీక్ష ఫీజు అన్ని సబ్జెక్టుకు కలిపి ప్రభుత్వం కేవలం 125 మాత్రమే నిర్దేశించింది. కానీ చాలా కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో రూ.500 నుంచి రూ.1500 దాకా వసూలు చేస్తున్నట్లు సమాచారం. అధిక ఫీజు వసూలు చేస్తే చర్యలు 10వ తరగతి పరీక్ష ఫీజు కన్నా అధిక మొత్తంలో వసూలు చేసిన పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తాం. అలాగే పరీక్ష ఫీజుకు పాఠశాల ఫీజులకు మెలిక పెడితే శాఖాపరమైన చర్యలు తప్పవు. నామినల్ రోల్స్ విషయంలో అజాగ్రత్త వహిస్తే సంబంధిత హెచ్ఎంలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. – మీనాక్షి, డీఈఓ -
టెన్త్ పరీక్షలు రాస్తున్నారా? సక్సెస్బాట పట్టించే సూచనలు తెలుసుకోండి
పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థులు ఓ వైపు ఒత్తిడి, మరోవైపు వారిలో ఆందోళనను నివృత్తి చేసేందుకు వారికి ఉపాధ్యాయులు, అధికారులు పలు సూచనలు చేశారు. మైలార్దేవ్పల్లి (హైదరాబాద్): ఏకాగ్రత, ప్రణాళిక బద్ధంగా చదివితేనే విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఒత్తిడికి గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. పలు సూచనలు.. ► పరీక్షా సమయంలో సెల్ఫోన్, టీవీ, కంప్యూటర్ల వైపు దృష్టి మరలకుండా చూసుకోవాలి. ప్రతి రోజు విద్యార్థి నిర్ధేశించుకున్న టైమ్ టేబుల్ ప్రకారం చదువుకోవాల్సి ఉంటుంది. ► ఉపాధ్యాయులు, స్నేహితులు, సీనియర్ల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి. ఆత్మ విశ్వాసంతో పరీక్షలకు సిద్ధమైతేనే విజయం మరింత సులభమవుతుంది. ► ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ముఖ్యంగా విద్యార్థులకు పరీక్ష సమాయాల్లో ఇంట్లో చక్కటి వాతావరణం కల్పించాలి. ► విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేయడంతో పాటు అవసరమైన ధైర్యాన్ని అందించాలి. ► ఒత్తిడిని తగ్గించేందుకు వారికి సహకారం అందిస్తే అధిక సమయం చదువుకే కేటాయిస్తారు. ► తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానుకూలంగా విద్యార్థికి తగిన ఆహారం అందించాలి. ► విద్యార్థులు సమయానికి తగినట్లుగా నిద్రపోయేలా కుటుంబసభ్యులు చూసుకోవాలి. రెండు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదోతరగతి విద్యార్థులను పరీక్షలకు పూర్తి సన్నద్ధం చేశాం. ఇప్పటికే రెండు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించి వారికి మనోధైర్యాన్ని కల్పించాం. గణితం, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులలో మంచి మార్కులు వచ్చేలా ఎప్పటికప్పుడు తరగతులు నిర్వహిస్తున్నాం. మే 23 నుంచి జూన్ 1 వరకు పరీక్షలను నిర్వహిస్తున్నాం. –రామిరెడ్డి, ఎంఈఓ రాజేంద్రనగర్ సొంతంగా రాసిన జవాబులకే అధిక మార్కులు ఉపాధ్యాయులు ఇచ్చిన మెటీరియల్ను విద్యార్థులు చదువుకుని పాఠ్య పుస్తకాలపైనే దృష్టిసారించాలి. సమయాన్ని వృధా చేయకుండా పరీక్షలకు సిద్ధం కావాలి. సొంతంగా రా సిన జవాబులకే అధిక మార్కులు వేసే అవకాశం ఉంటుంది. –ఎన్.మాణిక్యంరెడ్డి, ఉపాధ్యాయుడు ఖాళీ కడుపుతో వెళ్లకూడదు విద్యార్థులు పరీక్షలకు వెళ్లే సమయంలో మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. పరీక్షలకు వెళ్లే ముందు తప్పనిసరిగా బ్రేక్ఫాస్ట్ చేయాలి. ప్రశ్నా పత్రాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాతే జవాబులు రాయాలి. –డాక్టర్ సుభాష్, మైలార్దేవ్పల్లి 10 జీపీ సాధిస్తామనే నమ్మకం ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేదు. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వింటూ ఉపాధ్యాయులు ఇచ్చిన నోట్స్ను ఇప్పటికే చదివేశాం. పదికి పది జీపీ సాధిస్తామన్న విశ్వాసం ఉంది. –స్వాతి, పదో తరగతి విద్యార్థిని -
టెన్త్, ఇంటర్ ఫలితాలపై దృష్టి సారించాలి: మంత్రి సురేష్
సాక్షి, అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు నేపథ్యంలో ఇక ఫలితాల వెల్లడిపై దృష్టి సారించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. త్వరితగతిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వారం రోజుల్లో ఫలితాలు ప్రకటించేలా చూడాలన్నారు. ఇక పాఠశాలలు తెరిచే అంశాన్ని పరిశీలించాలన్నారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సూచనల మేరకు తేదీ నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. 2021-22 అకడమిక్ క్యాలెండర్ తయారు చేసి విద్యాబోధన దిశగా తరగతులు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశాలన్నింటిపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి సురేష్ ఆదేశించారు. చదవండి: విద్యాభివృద్ధికి ‘సాల్ట్’ పథకం: మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపీ: పంటల రవాణాపై ఆంక్షలు లేవు.. -
ఏపీ: టెన్త్, ఇంటర్ పరీక్షలపై విద్యాశాఖ కీలక ప్రతిపాదనలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. కరోనా అదుపులోకి వస్తుండటంతో పరీక్షల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. నేడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు ప్రతిపాదనలు తీసుకెళ్లనుంది. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ముఖ్యమంత్రి నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. జులై 7 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇంటర్బోర్డ్ కొన్ని ప్రతిపాదనలు చేసింది. రోజు విడిచి రోజు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి.11 పేపర్లకు బదులు 7 పేపర్లకు పరీక్షలు నిర్వహించనుంది. సెప్టెంబర్ 2 లోపు టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. -
సమ్మేటివ్–1 పరీక్షలు ప్రారంభం
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని అన్ని యాజమాన్యాల కింద పని చేస్తున్న ఉన్నత పాఠశాలల్లో 6–10వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్–1 (సంగ్రహణాత్మక మదింపు) పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఏ) విధానం అమలు చేస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ప్రశ్నపత్రం ఉంటుంది. గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈసారి విద్యాశాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెబుతోంది. అన్ని మండలాల్లోనూ ఎమ్మార్సీ కేంద్రాల్లో ప్రశ్నపత్రాలు భద్రపరిచారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందు అక్కడి నుంచి పాఠశాల కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. దూరప్రాంతాల్లో ఉన్న స్కూళ్లకు సీఆర్పీల ద్వారా పంపుతున్నారు. దీంతో కాస్త దూరంగా ఉన్న స్కూళ్లకైతే కేవలం 5 నిముషాల ముందు ప్రశ్నపత్రాలు చేరాయి. డీఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యంగా ప్రశ్నపత్రాలు తరలింపు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. కొన్ని స్కూళ్లకు ప్రశ్నపత్రాలు కొరత వచ్చిన సంగతి వాస్తవమేననీ, అయితే బఫర్ స్టాకు నుంచి సర్దామన్నారు. ఇక ఈనెల 18న పరీక్షలు ముగుస్తాయనీ, 19 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉంటాయని ఆయన వెల్లడించారు. -
డబుల్ ధమాకా!
– టెన్త్, సీసీఈ రెండు పాయింట్లూ వినియోగించుకున్న అయ్యవార్లు – డీఈఓ కార్యాలయ సిబ్బంది సహకారంతోనే అక్రమాలు – ఉపాధ్యాయుల బదిలీల్లో కొనసాగుతున్న లీలలు అనంతపురం ఎడ్యుకేషన్: బదిలీ కౌన్సెలింగ్లో ఒక పాయింటు అదనంగా వచ్చినా సీనియారిటీ జాబితాలో 50–60 మంది కంటే ముందుకు వెళ్లొచ్చు. అదే నాలుగైదు పాయింట్లు అప్పనంగా వచ్చి పడితే వారికి అన్ని విధాలా సౌకర్యవంతమైన స్థానాలు ఖచ్చితంగా దక్కుతాయి. పాయింట్లు ఎలాగొచ్చాయనేది కాదు.. ఎంత మంచి స్థానం వచ్చిందనేది ముఖ్యం అనే ధోరణిలో కొందరు ఉపాధ్యాయులు వెళ్తున్నారు. ఈ క్రమంలో అడ్డదారుల్లో పాయింట్లు పొందేందుకు వెనుకాడడం లేదు. సమాజానికి మార్గదర్శకంగా నిలవాల్సిన గురువులే అక్రమాలకు పాల్పడుతుండడం సిగ్గుచేటు. అర్హత లేదని తెలిసికూడా పాయింట్లు పొందేందుకు వక్రమార్గం ఎన్నుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు టీచర్లు పదో తరగతి, సీసీఈ పాయింట్లు రెండు వేసుకుంటూ ‘డబుల్ ధమాకా’ కొడుతున్నారు. ‘దొరికితే దొంగ దొరక్కపోతే దొర’ అనే ధోరణిలో పాయింట్లు వేసుకుంటున్నారు. అధికారులు గుర్తిస్తే రద్దు చేసుకుందాం లేదంటే పాయింట్లు వస్తాయనే దురాలోచనతో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఒకటికే పాయింట్లు వేసుకోవాలి ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు పదో తరగతి బోధించిన పాయింట్లు కాని, సీసీఈ పాయింట్లు కాని ఏవైనా ఒక్కటే వేసుకోవాలి. పదో తరగతి పాయింట్లు ఉత్తీర్ణత శాతాన్ని బట్టి 2–5 వరకు వస్తాయి. అదే సీసీఈ పాయింట్లు కూడా ఆ స్కూల్ విద్యార్థులకు నిర్వహించిన వివిధ పరీక్షల్లో వచ్చిన ఉత్తీర్ణత శాతం ఆధారంగా 2–5 పాయింట్లు వస్తాయి. అయితే టీచరు వారి సౌలభ్యాన్ని పట్టి ఎక్కువ పాయింట్లు వచ్చే వాటిని ఉపయోగించుకుంటారు. అయితే కొందరు టీచర్లు రెండిటిలోనూ పాయింట్లు వేసుకున్నారు. గణితం ‘లెక్క’ తప్పింది గణితం టీచర్లకు సంబంధించిన ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాను ఆన్లైన్లో ఉంచారు. జిల్లాలో 827 మంది గణితం టీచర్లతో జాబితాను రూపొందించారు. అయితే జాబితాను ఒకసారి పరిశీస్తే లీలలు కనిపిస్తున్నాయి. 32వ సీరియల్ నంబర్ టీచరుకు పదో తరగతి పాయింట్లు 5, సీసీఈ పాయింట్లు 4 పాయింట్లు నమోదయ్యాయి. 34వ నంబర్ టీచరుకు పదోతరగతి పాయింట్లు 5, సీసీఈ పాయింట్లు 3 వచ్చాయి. 61వ సీరియల్ నంబర్ టీచరుకు పదో తరగతికి 2, సీసీఈకి 2 పాయింట్లు వచ్చాయి. 85వ నంబర్ టీచరుకు పదో తరగతి 1 పాయింటు, సీసీఈకి 3 పాయింట్లు వేశారు. 147, 479, 560 సీరియల్ నంబర్ టీచర్లు పదో తరగతి 3, సీసీఈకి 3 పాయింట్లు వేసుకున్నారు. 544 నంబర్ టీచరు పదో తరగతికి 2.5, సీసీఈకి 2 పాయింట్లు వేసుకున్నారు. ఇవి ఉదాహరణకు మాత్రమే. ప్రతి సబ్జెక్టు, ప్రతి కేడరులోనూ ఇదే పరిస్థితి. డీఈఓ కార్యాలయ సిబ్బంది సహకారంతోనే అక్రమాలు పాయింట్లు ఇష్టానుసారంగా నమోదు చేయడంలో కొందరు డీఈఓ కార్యాలయ సిబ్బంది చక్రం తిప్పుతున్నారు. కొందరు ఒక గ్రూపుగా ఏర్పడి వారికి అనుకూలమైన టీచర్లందరికీ ఇలా అక్రమార్గాన పాయింట్లు వచ్చేలా సహకారం అందిస్తున్నట్లు తెలిసింది. కౌన్సెలింగ్ ప్రక్రియలో ‘మిడిల్ బాస్’గా వ్యవహరిస్తున్న ఓ అధికారి నేతృత్వంలోనే అక్రమాల తంతు జరుగుతున్నట్లు సమాచారం. లబోదిబోమంటున్న టీచర్లు నిజాయితీగా రావాల్సిన పాయింట్లు మాత్రమే వేసుకుని బదిలీకి దరఖాస్తు చేసుకున్న టీచర్లు అడ్డదారుల్లో పాయింట్లు పొందుతున్న అయ్యవార్లతో బెంబేలెత్తుతున్నారు. తమకు అన్యాయం జరుగుతోందంటూ అబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అర్హత లేకుండా పాయింట్లు వేసుకున్న టీచర్లకు ఆ పాయింట్లు తొలిగించి తమకు న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు. -
నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
- జిల్లాలో 22 కేంద్రాలు - పరీక్షలకు 4260 మంది విద్యార్థులు కర్నూలు సిటీ: పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా విద్యాధికారి తరఫున ఏడీ కె.సరోజినిదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 28 వరకు జరిగే పరీక్షలకు జిల్లాలో 22 కేంద్రాలు ఎంపిక చేశామన్నారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. హాల్టికెట్ లేని పక్షంలో అనుమతించబోమని తెలిపారు. పరీక్షలకు జిల్లా నుంచి 4260 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. -
ప్రభుత్వ బడి.. ఫలితాల జడి!
- పదిలో ప్రతిభ చూపిన ప్రభుత్వ పాఠశాలలు – 149 ప్రభుత్వ స్కూళ్ళలో 100 శాతం ఫలితాలు – సీసీఈ విధానం వల్లే ఉత్తమ ఫలితాలు కర్నూలు సిటీ: సాధారణంగా ప్రభుత్వ స్కూళ్లు అంటే అందరికీ చిన్నచూపు ఉంటుంది. అక్కడ సరైన వసతులు ఉండవు, టీచర్లు సక్రమంగా చదువు చెప్పరని చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రుల భావన. ఈ కారణంతోనే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య ఏడాకేడాది తగ్గుతూ వస్తుంది. అయితే పరీక్షల ఫలితాల్లో కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రాణిస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్లకు చెందిన విద్యార్థులకు సైతం మంచి గ్రేడ్లు వస్తున్నాయి. నిరంతర సమగ్ర ముల్యాంకనం (సీసీఈ) విధానంతో ఈ ఏడాది మంచి ఫలితాలు వచ్చాయి. కలిసొచ్చిన సీసీఈ విధానం! జిల్లాలో మొత్తం 898 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 2016–17 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షలు సీసీఈ విధానంలో నిర్వహించారు. ఈ విధానంలో మొదటిసారి పరీక్షలు రాస్తుండడంతో ఫలితాలపై ప్రభావం పడుతుందనే ఆందోళన నెలకొంది. ఈ ఆందోళనకు కారణం ప్రభుత్వ స్కూళ్లలో ప్రయోగాత్మకమైన భోధనకు అవసరమయిన సదుపాయలు లేకపోవడమే. అయితే ఎస్సీఈఆర్టీ సూచనలు, సలహాలతో సీసీఈ విధానంపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, డీసీఈబీలు ముందస్తుగా నమూనా ప్రశ్న పత్రాలను తయారు చేసి అన్ని ఉన్నత పాఠశాలలకు ఇవ్వడంతో మెరుగైన ఫలితాలు సాధించారు. జిల్లాలో 149 వివిధ ప్రభుత్వ యాజమాన్యా స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. జెడ్పీ పాఠశాల్లో 91.20 శాతం ఉత్తీర్ణత...! జిల్లా పరిషత్ యాజమన్యా పరిధిలోని స్కూళ్లకు చెందిన విద్యార్థులు 20,763 మంది విద్యార్థులు పరీక్షలు హాజరుకాగా, 18,936 మంది ఉత్తీర్ణలు అయ్యారు. మొత్తంగా 91.20 ఉతీతర్ణ శాతం నమోదైంది. అలాగే 94 సూళ్లు 100 శాతం సాధించాయి. 8.5 నుంచి 9.5 పాయింట్ల మధ్య అత్యధిక మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. జిల్లాలో మొత్తం 80 ప్రభుత్వ యజమాన్య స్కూల్స్ ఉన్నాయి. వీటిలో 2,865 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవ్వగా, 2381 మంది ఉత్తీర్ణత సాధించారు. వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన 1470 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 1403 మంది ఉత్తీర్ణులై..95.44 శాతం ఉత్తీర్ణత శాతం నమోదు చేశారు. సీసీఈ విధానం వల్లే ఉత్తమ ఫలితాలు – ఎస్.తాహెరా సుల్తానా, డీఈఓ పదో తరగతి పరీక్షలు ఈ ఏడాది నిరంతర సమగ్ర ముల్యాంకనం(సీసీఈ)లో జరిగాయి. ఈ విధానం వల్లే ప్రభుత్వ యాజమన్యాల కింద ఉన్న పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యధిక మంది ఉత్తీర్ణులు అయ్యారు. టీచర్లు సైతం మెరుగైన ఫలితాల కోసం కష్టపడ్డారు. వచ్చే ఏడాది ఇంకా మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేస్తాం. -
బాలికలదే హవా
పది ఫలితాల్లో జిల్లాకు 7వ స్థానం – జీపీఏ పాయింట్లలో 5వ స్థానం – స్వల్పంగా తగ్గిన ఫలితాల శాతం – సీసీఈ విధానంలోనూ మెరుగైన ప్రతిభ – అభినందనలు తెలిపిన కలెక్టర్ కర్నూలు(సిటీ): పదవ తరగతి ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. మొట్టమొదటి సారిగా నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానంలో నిర్వహించిన పరీక్షల్లోనూ జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. జిల్లాలో మొత్తం 870 ఉన్నత పాఠశాలలకు చెందిన 49,604 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 46,329 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 93.4 శాతం ఉత్తీర్ణత సాధించగా.. గత ఏడాది 94.20 శాతం కంటే 0.80 శాతం తగ్గింది. అయితే గత ఏడాది రాష్ట్రస్థాయిలో 8వ స్థానంలో ఉన్న జిల్లా ఈ ఏడాది ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని 7వ స్థానంలో నిలిచింది. ఫలితాల్లో బాలికల హవా జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపాలిటీ, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఏపీ మోడల్ స్కూల్, ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్, కస్తూర్బా, బీసీ వెల్ఫేర్ యాజమాన్యాల కింద జిల్లాలో 870 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 49,604 మంది విద్యార్థులు ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలురు 27,204 మందికి గాను 25,241 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2015–16 విద్యా సంవత్సరంలో బాలురు 90 శాతం ఉత్తీర్ణత సాధించగా, 2016–17 విద్యా సంవత్సరంలో 92.71 శాతానికి పెరిగింది. బాలికలు 22,400 మంది పరీక్షలకు హాజరు కాగా 21,080 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2015–16 విద్యా సంవత్సరంలో బాలికలు 94.43 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, 2016–17 విద్యా సంవత్సరంలో 94.14 శాతం ఉత్తీర్ణులై స్వల్పంగా తగ్గింది. అయితే మొత్తంగా ఈ ఏడాది పరీక్షలకు హాజరైన విద్యార్థుల ఉత్తీర్ణత శాతంలో బాలికలదే పైచేయిగా కనిపిస్తోంది. జీపీఏ పాయింట్లలో మెరుగైన ఫలితాలు పదవ తరగతి పరీక్షల్లో గ్రేస్ పాయింట్ల విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత అత్యధికంగా జీపీఏ పాయింట్లు సాధించిన విద్యార్థులు ఈ ఏడాది గత రెండేళ్ల కంటే మూడింతలు పెరిగారు. 2014–15 విద్యా సంవత్సరంలో 429 మంది విద్యార్థులు 10/10 పాయింట్లు సాధించగా, 2015–16 విద్యా సంవత్సరంలో జీపీఏ పాయింట్ల సంఖ్య తగ్గింది. 379 మంది విద్యార్థులు మాత్రమే 10/10 పాయింట్లు సాధించారు. అయితే ఈ ఏడాది నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానంలో పరీక్షలు నిర్వహించినా 1,372 మంది విద్యార్థులు 10/10 పాయింట్లు సాధించగా.. రాష్ట్రంలోనే జిల్లా 5వ స్థానంలో నిలిచింది. అయితే ఈ స్థాయిలో జీపీ పాయింట్లు సాధించడానికి సీసీఈ విధానంలో నిర్వహించిన ఇంటర్నల్ పరీక్షల్లోని మార్కులు కూడా ఒక కారణమని తెలుస్తోంది. విద్యాశాఖ అధికారులకు కలెక్టర్ అభినందన పదవ తరగతి ఫలితాల్లో గత ఏడాది కంటే స్వల్పంగా ఉత్తీర్ణత శాతం తగ్గినా స్థానాన్ని మెరుగుపరచుకోవడం పట్ల విద్యా శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అభినందించారు. ఇక ముందు మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. -
టెన్త్ స్పాట్ కేంద్రం పరిశీలన
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మాంటిస్సోరి పాఠశాలలోని పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాన్ని శనివారం గుంటూరు ఆర్జేడీ, స్పాట్ ప్రత్యేక పరిశీలకుడు శ్రీనివాసరెడ్డి పరిశీలించాడు. ఉపాధ్యాయులకు మూల్యాంకనంలో సలహాలు, సూచనలు ఇస్తూ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఆదివారంతో(16వతేదీ) స్పాట్ వాల్యుయేషన్ ముగుస్తుందన్నారు. మే మొదటి వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ఆయన వెంట డీఈఓ తహెర సుల్తానా, పలువురు డీవైఈఓలు ఉన్నారు. -
కదం తొక్కిన ఉపాధ్యాయులు
సమస్యలపై పోరుబాట పదోతరగతి మూల్యాంకనం బహిష్కరణ పలువురి అరెస్టు, విడుదల భానుగుడి (కాకినాడ) : దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలు సంఘటితంగా పోరుబాటపట్టాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఒకే గొంతుతో నినదించిన ప్రతినిధులు తమ సమస్యల పరిష్కారం కోసం మళ్లీ గళమెత్తారు. ఉపాధ్యాయ సంఘాలు ఫ్యాప్టో, జాక్టోల ఆధ్వర్యంలో వందలాది మంది ఉపాధ్యాయులు కాకినాడ పీఆర్జీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదోతరగతి మూల్యాంకన కేంద్రాన్ని మంగళవారం ముట్టడించి, విధులను అడ్డుకున్నారు. గంట పాటు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ సీపీఎస్ విధానం, బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్ విధానం, ఫెర్ఫార్మెన్స్ పాయింట్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 8, 9 తరగతుల బాహ్య మూల్యాంకన రద్దు చేయాలని, ప్రధానోపాధ్యాయులకు డీవైఈఓలుగా పదోన్నతులు కల్పించాలని, 100 నెలల పీఆర్సీ అరియర్స్, బకాయి పడిన డీఏలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. విధులకు ఆటంకం కల్పిస్తున్నరన్న కారణంతో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులను త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు స్టేషన్లో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులను జేఏసీ అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం పరామర్శించారు. అరెస్టు చేసిన నాయకులను పూచీకత్తుపై విడుదల చేశారు. పోలీసులు తమను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ వారు పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో ఎస్టీయూ అ«ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేవీ శేఖర్, డీ వెంకట్రావు, యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే రాఘ«వులు, కామేశ్వరరావు, పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీఎన్వీవీ ప్రసాద్, చింతాడ ప్రదీప్కుమార్, ఏపీటీఎఫ్ నాయకులు వెంకట్రాజు, సుబ్రహ్మణ్యం, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ సత్యనారాయణ, చెవ్వూరి రవి, పీఈటీల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లంక జార్జి తదితరులు పాల్గొన్నారు. -
నేడు టెన్త్ స్పాట్ బహిష్కరణ
కర్నూలు సిటీ: ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలకు నిరసనగా నేడు ఫ్యాప్టో, జాక్టో సంఘాల ఆధ్వర్యంలో టెన్త్ స్పాట్ను బహిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు పాయింట్లు, వెబ్ కౌన్సెలింగ్ ద్వారా చేపడుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పాయింట్ల ఆధారిత విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్లపై ఉపాధ్యాయ సంఘాలు నిరసన తెలుపనున్నాయి. -
పది స్పాట్ ప్రారంభం
- సోషల్ టీచర్ల కొరత కర్నూలు సిటీ: పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 16వ తేది వరకు నిర్వహించే స్పాట్కు 1,987 మంది టీచర్లును కేటాయించారు. అయితే సోషల్ సబ్జెక్టుకు సంబంధించిన టీచర్లు తక్కువగా ఉన్నారు. ఉన్న వారు కూడా వయస్సు భారం, అనారోగ్య కారణాల వల్ల రాలేమని డీఈఓకు విన్నివించారు. అయితే స్పాట్కు ఆర్డరు ఇచ్చిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా మంగళవారం నాటికి విధుల్లో చేరాలని డీఈఓ తాహెరా సుల్తానా ఆదేశించారు. స్పాట్ జరుగుతున్న మాంటిస్సోరి స్కూల్లోని కేంద్రాన్ని డీఈఓ తనిఖీ చేశారు. ముల్యాంకనంలో పొరపాట్లకు తావు లేకుండా వ్యవహరించాలని సూచించారు. -
టెన్త్ స్పాట్ వాల్యుయేషన్కు ఏర్పాట్లు
- నేటి నుంచి 16 వరకు మూల్యాంకనం - స్పాట్ అధికారులతో డీఈఓ సమావేశం కర్నూలు సిటీ: పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ సోమవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గత నెల17వ తేదీన మొదలైన పరీక్షలు 30తో ముగిశాయి. ఈ క్రమంలో వెంటనే స్పాట్ వాల్యుయేషన్ మొదలెట్టి వీలైనంత తొందరగానే ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం ఇప్పటీకే అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు ఇచ్చింది. స్కూల్ విద్యార్థులకు సవరణాత్మకమైన బోధన జరుగుతోంది. ఇందుకు ఇబ్బందులు లేకుండా స్పాట్కు సిబ్బందిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆదే అంశంపై ఆదివారం డీఈఓ తాహెరా సుల్తానా తన ఛాంబర్లో స్పాట్ అధికారులతో సమావేశమయ్యారు. మూల్యాంకనానికి మొత్తం 1987 మందిని నియమించామని తెలిపారు. 19 మంది ఏసీఓలు, 236 మంది సీఈలు, 1651 మంది ఏఈలు, 336 మంది స్పెషల్ అసిస్టెంట్లు పని చేస్తారన్నారు. ముల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకోకుండా పగద్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు రెమ్యునరేషన్ ఇస్తామన్నారు. ఈనెల16వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుందన్నారు. సమావేశంలో డీసీఈబీ సెక్రటరీ ఓంకార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన పది పరీక్షలు
– చివరి రోజున 233 మంది విద్యార్థులు గైర్హాజరు – వచ్చే నెల 3నుంచి స్పాట్ మొదలు అయ్యే అవకాశం కర్నూలు సిటీ: పదో తరగతి పరీక్షలు ఈ నెల 17 నుంచి మొదలై.. గురువారం సోషల్ పేపర్–2తో ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఏడాది సీసీఈ విధానంలో పరీక్షలు జరిగాయి. కొత్త విధానం అయినా.. ఎక్కడా పెద్దగా ఆందోళనలు జరగక పోవడంతో విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రెగ్యులర్ డీఈఓ లేకపోవడంతో ఏవిధంగా పరీక్షలు నిర్వహిస్తారోననే ఆందోళన ఉన్నా ఇంచార్జీ డీఈఓ, డిప్యూటీ ,ఈఓలు, సీనియర్ హెచ్ఎంల సహకారంతో ప్రశాంతంగా నిర్వహించారు. చివరి రోజున 50,079 మంది విద్యార్థులకుగాను 49,846 మంది విద్యార్థులు హాజరు కాగా.. 233 మంది గైర్హాజరైయ్యారు. డీఈఓ తాహెరా సుల్తానా ఐదు కేంద్రాలు, ఎస్సీఈఆర్టీ నుంచి జిల్లా అబ్జర్వర్గా వచ్చిన లక్ష్మీవాట్స్ ఏడు కేంద్రాలను తనిఖీ చేశారు. వచ్చే నెల 3నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. -
పారదర్శకంగా పదో తరగతి పరీక్షలు
-మాస్ కాపీయింగ్ నిరోధానికి పటిష్ట చర్యలు -డీఈఓ అబ్రహం మామిడికుదురు : జిల్లాలో పదో తరగతి పరీక్షలు పారదర్శకంగా జరుగుతున్నాయని డీఈఓ ఎస్.అబ్రహం తెలిపారు. ఆయన సోమవారం మామిడికుదురు, మొగలికుదురు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. మొగలికుదురు పరీక్షా కేంద్రంపై పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ కేంద్రాన్ని స్వయంగా పరిశీలించానని, అక్కడ ఏవిధమైన మాస్ కాపీయింగ్ జరగడం లేదని చెప్పారు. నిరంతర సమగ్ర మూల్యాంకన వి«ధానం వల్ల విద్యార్థులు ఏ విధమైన ఇబ్బందులూ పడడం లేదన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం పెరిగేందుకు పలు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ప్రత్యేక తరగతుల నిర్వహణ, వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదివించామన్నారు. ఈ ఏడాది జిల్లాలో ఉత్తీర్ణత శాతం కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇంత వరకు ముగ్గురు విద్యార్థులను డీబార్ చేశామని, ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డీఓ, ఆరుగురు ఇన్విజిలేటర్లపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. -
డబ్బు కొట్టు.. బుక్కు పెట్టు.. గ్రేడ్ కొట్టు!
- పదో తరగతి పరీక్షల్లో ప్రైవేటు స్కూళ్ల దందా - గ్రేడ్ల కోసం కొంతమంది విద్యార్థులతో మాస్ కాపీయింగ్ - పరీక్ష కేంద్రాల సీఎస్లతో కుమ్మక్కు - దానవాయిపేట పాఠశాలలో ఇదే తంతు - సబ్ కలెక్టర్ ఆదేశాలతో తనిఖీలు - గేటు వద్దే ఆర్ఐ, వీఆర్ఓల నిలిపివేత - 10 నిమిషాల తర్వాత ఆర్ఐకి మాత్రమే అనుమతి - ఆలోగా అంతా సర్దేశారంటూ ఆరోపణలు పదో తరగతి పరీక్షల్లో అధిక సంఖ్యలో గ్రేడులు సాధించుకునేందుకు కొన్ని ప్రైవేటు పాఠశాలలు రకరకాల పైరవీలు చేస్తున్నాయి. పుస్తకాలు పెట్టి విద్యార్థులతో పరీక్షలు రాయించేందుకు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్(సీఎస్)లతో కుమ్మక్కవుతున్నాయి. అధిక మొత్తం ఆశ చూపడంతో కొన్ని పరీక్ష కేంద్రాల సీఎస్లు వారు చెప్పినట్టే నడచుకుంటున్నారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎంపిక చేసిన విద్యార్థులతో పుస్తకాలు పెట్టి రాయిస్తున్నారు. ఇటువంటి దందాకు నగరంలోని ఓ పాఠశాల కేంద్రంగా నిలిచినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సాక్షి, రాజమహేంద్రవరం : నగరంలోని ఓ ప్రముఖ పాఠశాలలో పదో తరగతి చదివే విద్యార్థిని నగరంలోని ఓ పాఠశాల కేంద్రంగా పరీక్షలు రాస్తోంది. ఆ విద్యార్థిని స్నేహితులు దానవాయిపేట నగరపాలక సంస్థ పాఠశాలలో పరీక్షలు రాస్తున్నారు. శనివారం తెలుగు పేపర్-2 పరీక్ష రాసిన తర్వాత ఇంటికొచ్చిన ఆ విద్యార్థిని బోరున ఏడవసాగింది. విషయం ఏమిటని తల్లిదండ్రులు ఆరా తీయగా ‘‘నేను ఏడాదంతా కష్టపడి చదివి రాస్తుంటే నా స్నేహితులు కొందరు పుస్తకాలు పెట్టి రాస్తున్నారు. ఇప్పటివరకూ క్లాస్లో నేను ఫస్ట్. రేపు ఫలితాల్లో వారికి నాకన్నా మంచి గ్రేడులు వస్తాయి’’ అంటూ విలపించింది. దీంతో ఈ విషయాన్ని ఆ విద్యార్థిని తల్లిదండ్రులు ‘సాక్షి’ దృష్టి తీసుకొచ్చారు. సోమవారం హిందీ పరీక్ష జరుగుతుండగా దానవాయిపేట నగరపాలక సంస్థ పాఠశాలలో జరుగుతున్న దందాను ‘సాక్షి’ సబ్కలెక్టర్ విజయ్కృష్ణన్ దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం పాఠశాల వద్దకు ‘సాక్షి’ బృందం వెళ్లింది. ఇతరులు రాకూడదని చెప్పిన అక్కడి సిబ్బంది ‘సాక్షి’ని లోపలికి అనుమతించలేదు. ఈలోగా సబ్కలెక్టర్ విజయ్కృష్ణన్ ఆదేశాల మేరకు అర్బన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాయుడు, వీఆర్ఓలు వాసు, దోసలరావు పాఠశాల వద్దకు తనిఖీ చేసేందుకు వచ్చారు. గేటుకు తాళం వేసి ఉండడంతో అక్కడి వాచ్మన్ను పిలిచి, తమ గుర్తింపు కార్డులు చూపించి తాళం తీయాలని చెప్పారు. అలా తీయడం కుదరదని అంటూ విషయాన్ని పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్కు చెప్పారు. చీఫ్ సూపరింటెండెంట్, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజా ప్రశాంత్ వచ్చి తమ శాఖ ఉన్నతాధికారుల అనుమతి లేనిదే అనుమతించబోమని ఆర్ఐ, వీఆర్ఓలకు చెప్పారు. తాను రెవెన్యూ ఇన్స్పెక్టర్నంటూ నాయుడు తన గుర్తింపు కార్డు చూపించినా కూడా అనుమతించలేదు. ఈలోగా సీఎస్ రాజా ప్రశాంత్ ఫోనులో మాట్లాడుతూ పది నిమిషాల పాటు తాత్సారం చేశారు. అనంతరం ఆర్ఐ నాయుడును మాత్రమే లోనికి అనుమతించారు. వీఆర్ఓలు వాసు, దోసలరావులను గేటు బయటే నిలిపివేశారు. ఆర్ఐని, వీఆర్ఓలను పది నిమిషాలపాటు గేటు బయట నిలిపివేసిన సమయంలోనే లోపల ఏమీ దొరకకుండా సర్దేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాఠశాల వద్దకు వచ్చిన పది నిమిషాల తర్వాత లోపలికి వెళ్లిన ఆర్ఐకి అక్కడ ఏమీ దొరకలేదు. ఈలోగా నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ శ్రీనివాసరావు తన సిబ్బందితో వచ్చి తనిఖీ చేశారు. అంతా సవ్యంగా ఉందంటూ విలేకర్లకు చెప్పారు. ఆర్ఐ, వీఆర్ఓలను పది నిమిషాల పాటు ఎందుకు అనుమతించలేదన్న విలేకర్ల ప్రశ్నకు సమాధానం దాటవేశారు. ఈ విషయంపై డీఈఓ అబ్రహం వివరణ కోరగా.. తహసీల్దార్ క్యాడర్ వరకు నేరుగా అనుమతిస్తామని చెప్పారు. అంతకన్నా దిగువ క్యాడర్ అధికారులు తనిఖీకి వస్తే వారి పై అధికారులు ఫలానా అధికారులు తనిఖీకి వస్తున్నారంటూ సంబంధిత పరీక్ష కేంద్రానికి ముందుగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అధికారులు ముందుగానే సమాచారం ఇస్తే ఇక తనిఖీ అన్న పదానికి అర్థం ఏముంటుందని ‘సాక్షి’ ప్రశ్నించగా ‘‘మీరు చెబుతున్నది నిజమే. కానీ నిబంధనలు అలా ఉన్నాయి’’ అని డీఈఓ అన్నారు. పది నిమిషాల తర్వాత పంపారు సబ్కలెక్టర్ ఆదేశాల మేరకు దానవాయిపేట నగరపాలక సంస్థ పాఠశాలలో పదో తరగతి పరీక్ష తనిఖీకి వచ్చాం. నాతోపాటు వీఆర్ఓలు వాసు, దోసలరావు వచ్చారు. తనిఖీ చేయాలన్న సబ్కలెక్టర్గారి ఆదేశాల మేరకు వచ్చామని చెప్పినా సీఎస్ రాజా ప్రశాంత్ మమ్మల్ని అనుమతించలేదు. మా గుర్తింపు కార్డులు చూపించినా ససేమిరా అన్నారు. చివరకు పది నిమిషాల తర్వాత నన్ను ఒక్కడినే లోపలికి అనుమతించారు. మా వీఆర్ఓలు బయటే ఉన్నారు. - నాయుడు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ -
పది పరీక్షలు ప్రారంభం
99.7 శాతం హాజరు భానుగుడి (కాకినాడ): తమ జీవితంలో తొలి పబ్లిక్ పరీక్షను పదో తరగతి విద్యార్థులు ఎదుర్కొన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సన్నిహితులు తోడురాగా ఆత్మస్థైర్యంతో పరీక్షా కేంద్రాలవైపు అడుగులు వేశారు.జిల్లాలో 304 కేంద్రాల్లో శుక్రవారం నుంచి ప్రారభమైన ఈ పరీక్షలకు 67,148 మంది విద్యార్థులకు 66,929 మంది హాజరయ్యారు. 219 మంది గైర్హాజరయ్యారు. తొలి పరీక్షలో 99.7 శాతం విద్యార్థులు హాజరైనట్టు డీఈవో అబ్రహం తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో అబ్రహం, అబ్జర్వర్ వవజాక్షి జిల్లాలో పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 15 స్క్వాడ్ బృందాలు ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించాయి. -
ఇంటర్నల్ మార్కులు తారుమారు
- టెన్త్ ఇంటర్నల్ మార్కుల అప్లోడింగ్లో దొర్లిన తప్పు - ఇద్దరూ ఒకే పేరుతో ఉండడంతో సిబ్బంది తప్పిదం - సవరణకు ఏపీ ఆన్లైన్లో లేని ఆప్షన్ వెల్దుర్తి రూరల్ : ఒకే సెక్షన్.. ఒకే తరగతి.. ఒకే పేరు.. తేడా ఉన్నదంతా తండ్రి పేరు మాత్రమే. ఇలాంటి వారి మార్కుల నమోదు విషయంలో స్కూల్ సిబ్బంది చేసిన పొరపాటు మెరిట్ విద్యార్థికి గ్రహపాటుగా మారింది. టెన్త్ ఇంటర్నల్ మార్కుల నమోదులో తారుమారు కావడం ఇందుకు కారణం. ఇందుకు వెల్దుర్తి జెడ్పీ హైస్కూల్ వేదికగా మారింది. జి. రాజేశ్ పేరుతో ఇద్దరు విద్యార్థులు ఇదే స్కూల్లో చదువుతున్నారు. ఇందులో ఒకరు బొమ్మిరెడ్డిపల్లెకు చెందిన గిడ్డయ్య కుమారుడు(ఐడీ నెంబరు 6261504) పట్టణంలోని బాలుర హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. అన్నింటా ఏ1 గ్రేడ్ మార్కులు సాధించాడు. మరొకరు వెల్దుర్తికే చెందిన జి. దేవేంద్రుడి కుమారుడు జి.రాజేశ్(ఐడీ నెంబరు 6267823). ఈ విద్యార్థి మార్కుల సాధనలో పూర్. వీరి మార్కుల ఆన్లైన్ నమోదులో ఉపాధ్యాయులు, సిబ్బంది చేసిన తప్పిదం కారణంగా ఒకరి మార్కులు ఒకరికి పడ్డాయి. హాస్టల్ వార్డెన్ దొరస్వామి విజ్ఞప్తి మేరకు హెచ్ఎం మధు.. విద్యార్థుల మార్కుల సవరణకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఎంఈఓ రామ్మోహన్ను కోరారు. అయితే సవరణ గడువు శుక్రవారంతో ముగియడంతో ఆయన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తన మార్కులు తనకు వేసి న్యాయం చేయాలని బాధిత విద్యార్థి కోరుతున్నాడు. -
చేతిరాత..భవితకు బాట
పరీక్షల్లో ఆకట్టుకునే అక్షరాలు మార్కులు పెరిగే అవకాశం రాయవరం : అక్షరాలు కంటికి ఇంపుగా కనిపించేలా ఉండాలి. అందమైన దస్తూరి చూసేవారిని ఆకట్టుకుంటుంది. జవాబు పత్రాలు మూల్యాంకనం చేసే వారి మనస్సును హత్తుకునేలా ఉంటే మార్కులు వేసేలా ప్రేరేపిస్తుంది. అదే పరీక్షల్లో విజేతగా నిలుపుతుంది. మరో రెండు రోజుల్లో పది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల్లో అక్షరాలను ముత్యాల్లా రాసే వారు పరీక్షల్లో 20 శాతం అధిక మార్కుల సాధనతో పాటు వారి జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటారని వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమాధానాలు రాయడంపై సూచనలు పాటిస్తే మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. అక్షరాలను రాయాలిలా.. పేజీకి పై భాగంలో ఒక అంగుళం, ఎడమవైపు అదే స్థాయిలో మార్జిన్ విడిచి పెట్టి రాయాలి. పేజీకి కుడివైపు అర అంగుళం ఖాళీ విడిచి పెట్టి రాయవాలి. ఇలా ఉంటే మూల్యాంకన సమయంలో ఉపాధ్యాయునికి జవాబులు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని స్కూళ్లలో విద్యార్థులు గీతల పేజీల నోట్బుక్లో జవాబులు రాస్తుంటారు. పరీక్షల్లో మాత్రం గీతల్లేని పేపర్లపై రాయాల్సి ఉంటుంది. అలాంటి విద్యార్థులు తెలుపు కాగితాలపై సాధన చేయాలి. జవాబుల్లో ఏదైనా ముఖ్యమైన పదాలు ఉంటే వాటి కింద నల్లటి పెన్సిల్తో గీతగీయాలి. విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం అచ్చు పుస్తకాలు ఇవ్వకుండా ముఖ్యమైన సమాధానాలను చేతితో రాయించాలి. జవాబు పత్రంలో వేసే బొమ్మల్లోని భాగాన్ని ఒకవైపు సరళరేఖలను గీసి భాగాల పేర్లు రాస్తే మేలు. లేదా వాటి నంబర్లు ఇచ్చి ఒకవైపు రాయాలి. పరీక్ష పత్రంతో ప్రశ్నలు సెక్షన్ల వారీగా ఉంటాయి. ఇచ్చిన సమయాన్ని భాగాలుగా విడగొట్టి ఆ సమయంలోనే జవాబులు రాయడం పూర్తిచేయాలి. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సినవి.. జవాబు రాసే తీరు పరీక్ష పేపరు దిద్దడానికి ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. సమాధానాలు టీచరుకు తెలుసునని గుర్తించాలి. జవాబు పత్రం ఆకట్టుకోవాలంటే పేజీకి 18–19లైన్లకు మించకూడదు. జవాబు పత్రంలోని తొలి లైన్ రాసే సమయంలో మార్జిన్ లైన్ను చూస్తూ సమాంతరంగా రాయకపోతే మిగిలిన లైన్లు వంకర్లు తిరుగుతాయి. గీత చివరి వరకు రాస్తూ చివరికి వెళ్లగానే అక్కడ సగం పదంగానీ, మరో సగాన్ని కిందలైన్లో రాస్తుంటారు. దీంతో దిద్దే వారికి ఆ పూర్తి పదం ఏమిటో అర్థం కాదు. పదం పూర్తిగా రాయాలి. ప్రశ్నపత్రంలో బాగా ఒత్తిపట్టి మరీ రాస్తే రెండో వైపు అక్షరాలు కన్పిస్తూ గందరగోళం మారుతుంది. కొద్ది సేపు రాయగానే వేళ్లు నొప్పి పుడతాయి. అందుకే తేలికగా అందంగా రాయాలి. అంకెలు రాసేటప్పుడు స్పష్టత లేకపోతే ఉపాధ్యాయుడు అర్థం చేసుకోలేక మార్కులు వేయరు. సామాన్యశాస్త్రంలో బొమ్మల్ని గీస్తే ఆ చిత్రంలోని భాగాన్ని గుర్తించడంలో ఒక క్రమపద్ధతి పాటించాలి. పాయింట్ల వారీగా... పరీక్షల్లో రాసే అక్షరాలు అర్థమయ్యేలా ఉంటే మూల్యాంకనం చేసే ఉపాధ్యాయుడు ముగ్దుడై మార్కులు వేస్తాడు. లేదంటే వెనకడుతారు. సమాధానాల్లో దోషాలు లేకుండా జాగ్రత్త పడాలి. సంగ్రహ ప్రశ్నలకు సమాధానాలు సులభంగా రాయాలి. ఇచ్చి ప్రశ్నలను పూర్తిగా అర్థం చేసుకుని రాయాలి. స్టోరీ రైటప్లో మంచి మార్కులు సాధించాలంటే ఇచ్చిన హింట్ను బాగా చదివి అర్థం చేసుకుని రాయాలి. ప్రశ్నలకు జవాబులు పాయింట్ల వారీగా రాస్తే మార్కులు బాగా వస్తాయి. జవాబులకు మధ్యలో ఉప శీర్షికలు పెట్టాలి. ముఖ్య విషయాలను అండర్లైన్ వేసుకోవాలి. బిట్పేపరు రాసే సమయంలో కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి. -
సత్యదేవా! సత్ఫలితమివ్వు!
-రత్నగిరికి వెల్లువెత్తుతున్న టెన్త్ విద్యార్థులు -వివాహాలతో ఆలయ ప్రాంగణంలో పెరిగిన రద్దీ అన్నవరం : పౌర్ణమి పర్వదినం, ఆదివారం కలిసి రావడంతో రత్నగిరిపై సత్యదేవుని ఆలయం వేల సంఖ్యలో వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. వివాహాలు జోరుగా జరుగుతుండడంతో నవదంపతులు, వారి బంధుమిత్రులు, సత్యదేవుని దర్శించేందుకు వచ్చిన భక్తులతో ఆలయప్రాంగణంతో పాటు వ్రతమండపాలు, సత్రాలు నిండిపోయాయి. కాగా ఈ నెల 17 నుంచి çపరీక్షలు రాయనున్న పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని కోరుకుంటూ పెద్దసంఖ్యలో స్వామి సన్నిధికి వస్తున్నారు. వీరంతా స్వామివారి వ్రతాలాచరించి దర్శనం చేసుకుంటున్నారు. వీరందరితో ఆలయప్రాంగణంలో సందడికి తెరిపి ఉండడం లేదు. స్థానిక శ్రీసత్యసాయి విద్యావిహార్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం సత్యదేవుని వ్రతాలాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవాలని వారిని పండితులు ఆశీర్వదించారు. సత్యదేవుని దర్శించిన 20 వేలమంది భక్తులు ఆదివారం సత్యదేవుని 20 వేలమంది దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించిన భక్తులు గోకులంలో సప్తగోప్రదక్షణ అనంతరం రావి చెట్టుకు పూజలు చేశారు. స్వామివారి వ్రతాలు 2,619 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
పది వరకు ఆంగ్లం..ఆపై తెలుగు
ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు సక్సెస్ పాఠశాలలకు పెరుగుతున్న ఆధరణ ఇంటర్ కళాశాలలు లేక అవస్థలు ప్రైవేటుకు పంపలేకపోతున్న తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా, ఆంగ్ల మాద్యమాన్ని బోధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన సక్సెస్ పాఠశాలలకు మంచి ఆధరణ ఉంది. ప్రైవేటు పాఠశాలల్లో వేలాది రూపాయలు రుసుములు చెల్లించి చదివించలేని తల్లిదండ్రులు తమ చిన్నారులను ఈ పాఠశాలలకు పంపిస్తున్నారు. జిల్లాలో ఆంగ్లమాధ్యమంలో బోధించే కళాశాలలు సక్సెస్ పాఠశాలల సంఖ్యకు అనుగుణంగా లేవు. దీంతో ఆరు నుంచి పదో తరగతి వరకు ఇక్కడ చదువుతున్న వారికి ఇంటర్లో చేరాలంటే తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక ఇంగ్లిష్ మీడియం కళాశాల ఉండేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తల్లిదండ్రుల నుంచి విన్పిస్తోంది. - రాయవరం సక్సెస్ పాఠశాలల ద్వారా.. ఆంగ్లంలో వెనకబడి పోవడంతో సర్కారు పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ఉన్నత విద్య, ఉద్యోగాల్లో వెనకబడి పోతున్నారని గుర్తించిన ప్రభుత్వం ప్రైవేటు ధీటుగా ఆంగ్ల మాద్యమ బోధన చేపట్టాలని నిర్ణయించింది. 2008-09 విద్యా సంవత్సరంలో సక్సెస్ పాఠశాలల పథకానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 312 ఉన్నత పాఠశాలల్లో సక్సెస్ పాఠశాలలను ఏర్పాటు చేశారు. 2008లో ఆరో తరగతి నుంచి ఆంగ్ల మాద్యమం ప్రవేశ పెట్టగా 2013లో మొదటి బ్యాచ్ విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో తెలుగు మీడియంతో పాటుగా ఆంగ్ల మాద్యమంలోను తరగతులు బోధిస్తారు. ఎవరికి ఏ మీడియంలో ఆసక్తి ఉంటే ఆ మీడియంలో చేరే వెసులుబాటు ఉంది. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా సక్సెస్ పాఠశాలలు ఏర్పాటు చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో సుమారు 25 వేల మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాయనున్నారు. ఇంటర్లో ఇబ్బందులు.. సక్సెస్ పాఠశాలల్లో పదో తరగతి ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్న విద్యార్థులు ఇంటర్లో చేరే సమయంలో ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సక్సెస్ పాఠశాలల్లో చదువుతున్న ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల్లో 85 శాతం వరకు ఉత్తీర్ణత ఉంటుంది. కొన్ని పాఠశాలల్లో నూటికి నూరు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఆంగ్ల మీడియంలో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ఇంటర్కు వచ్చే సరికి ప్రైవేటు కళాశాలలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు వేలాది రూపాయలు చెల్లించి ప్రైవేటు కళాశాలల్లో ఆంగ్ల మీడియంలో చేర్పించడానికి ఆర్థికంగా వెనుకంజ వేయాల్సి వస్తోంది. ప్రైవేటు కళాశాలల్లో చదివించే స్తోమత లేని వారు ప్రభుత్వ కళాశాలల్లోని తెలుగు మీడియం కళాశాలల్లో చేరిపోతున్నారు. నియోజకవర్గానికి ఒక కళాశాల.. కనీసం నియోజకవర్గంలో ఒక ఇంగ్లిష్ మీడియం కళాశాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ తల్లిదండ్రుల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాల రాజమండ్రి, ధవళేశ్వరం, గోకవరం, కోరుకొండ, తుని తదితర పది కళాశాలల్లో మాత్రమే ఇంగ్లిష్ మీడియం ఉంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన అధిక కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియం లేదు. ఇంగ్లిష్ మీడియంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వ కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టాలని, నియోజకవర్గానికి ఒక ఇంగ్లిష్ మీడియం కళాశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్ విన్పిస్తోంది. అనుమతినిస్తాం.. ప్రభుత్వ కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశానికి అనుమతిస్తున్నాం. డిమాండ్ను బట్టి ఇంగ్లిష్ మీడియం కోరితే ఆలస్యం లేకుండా అనుమతినిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. - ఎ.వెంకటేష్, ఆర్ఐఓ, ఇంటర్ బోర్డు, రాజమండ్రి -
‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
- జిల్లా కలెక్టర్ విజయమోహన్ కర్నూలు సిటీ: పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ ఆదేశించారు. శుక్రవారం పది పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మాస్ కాపీయింగ్కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. విద్యార్థులు.. పరీక్ష కేంద్రాలకు సరైన సమయానికి చేరుకునేందుకు అవసరమైన బస్సులు నడపాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. 144 సెక్షన్ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. తాగు నీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగనున్న పరీక్షలకు జిల్లాలో 240 కేంద్రాలను ఎంపిక చేశామని, మొత్తం 51,462 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ఇన్చార్జీ డీఈఓ తాహెరా సుల్తానా.. కలెక్టర్కు వివరించారు. ఉత్తమ ఫలితాలు సాధించకుంటే సంబంధిత స్కూల్ ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫిర్యాదులు చేసేందుకు కలెక్టరేట్లో హెల్ప్లైన్ ఏర్పాటు చేశామన్నారు. 08518–277309కు ఫోన్ చేయవచ్చన్నారు. సమావేశంలో చీఫ్ సూపరెండెంట్స్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
భయం వీడితే..‘పది’లమే
సమయం చాలా కీలకం విద్యార్థులు ఆహార నియమాలు పాటించాలి తల్లితండ్రుల పాత్ర కీలకమే విజయం..పరాజయం రెండింటిదీ దగ్గరి సంబంధమే. ఒకటి దూరమైతే ఇంకోటి దరిచేరుతుంది. దీనికి సంబంధించి మరొకటుంది..అదే భయం..! దీని చుట్టూ జయాపజయాలుంటాయి. భయపడితే పరాజయం పలకరిస్తుంది. భయం వీడితే విజయం వరిస్తుంది. విజేతలుగా నిలుపుతుంది. తొమ్మిదేళ్ల పాటు వార్షిక పరీక్షలకు హాజరై.. తొలిసారి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న పదో తరగతి విద్యార్థుల్లో కాస్త భయం..ఇంకాస్త ఆందోళన ఉండడం సహజం. అయితే ఈ భయం..ఆందోళనలను వీడడం చాలా సులభం. అలా చేస్తే మంచి ప్రతిభ చూపడం సులువే. విద్యార్థి ప్రగతికి పదో తరగతి తొలి మెట్టు వంటిది. ఇక్కడ రాణిస్తే భవిష్యత్లో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి ఉండదు. మరో 16 రోజుల్లో (ఈ నెల 17 నుంచి) పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు తీసుకునే జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. - రాయవరం టెన్షన్ వదలాలి.. విద్యార్థులు టెన్షన్ వదిలి అటెన్షన్గా ఉండాలి. సరైన రీతిలో పరీక్షలకు ప్రిపేరవ్వడం ఎంత కీలకమో అదే సమయంలో చదివిన ప్రశ్నలను గుర్తుంచుకుని రాయడం కూడా అంతే ముఖ్యం. చదువుతో పాటు పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి. మానసిక ప్రశాంతతను అలవర్చుకోవాలి. పరీక్షలు సమీపించిన ఈ సమయంలో కేవలం రివిజన్కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. గతంలో చదివిన ప్రశ్న, జవాబులను మరోసారి పునఃశ్చరణ చేసుకోవాలే కాని కొత్త పాఠ్యాంశాల జోలికి వెళ్లకూడదు. పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ముఖ్యంగా ఐదు ‘సి’లు విడనాడాలి. సినిమా, కేబుల్టీవీ, క్రికెట్, సెల్ఫోన్తో పాటుగా ఛాటింగ్ను విడనాడాలి. అదే సమయంలో పోజిటివ్ థింకింగ్, ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రివ్యూ, ప్రజంటేషన్ను అలవర్చుకోవాలి. వీటితో పాటు పరీక్ష ముందు రోజు తగినంత నిద్ర పోవాలి. నిద్ర మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. నేను బాగానే రాయగలను అనే ఆత్మవిశ్వాసంతో పరీక్షా కేంద్రానికి వెళ్లాలి. ముందుగా బాగా వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాసిన అనంతరం కష్టతరమైన ప్రశ్నలకు జవాబులు రాసే ప్రణాళిక అలవర్చుకోవాలి. రేపటి పరీక్షను చక్కగా రాస్తున్నట్లుగా ఊహను మనస్సులో పొందుపర్చుకుంటూ సంసిద్ధంగా ఉండాలి. కొత్త వాతావరణంలో పరీక్షలు రాస్తున్నామనే భయాన్ని విడనాడాలి. జవాబు పత్రంలో ఎక్కువుగా కొట్టివేతలు, దిద్దివేతలు లేకుండా చక్కటి దస్తూరీతో సమాధానాలు రాస్తే మంచిది. తల్లితండ్రుల పాత్ర కూడా కీలకమే.. పరీక్షల్లో తల్లితండ్రుల పాత్ర కూడా కీలకమే. పరీక్షల సమయంలో వారికి తరచుగా మార్కులు ఎక్కువుగా తెచ్చుకోవాలంటూ ఒత్తిడి తేవద్దు. ఇతర పిల్లలతో పోలుస్తూ సరిగ్గా చదవడం లేదనడం, గత పరీక్షల్లో మార్కులు సరిగ్గా రాలేదనడం, ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడడం చేయకూడదు. చదవడం కలిగే ఉపయోగాలు..సమాజంలో లభించే గౌరవాన్ని అర్ధమయ్యేలా..సున్నితంగా తెలియజెప్పాలి. పరీక్షలకు వెళ్లే ముందు ఐదు నుంచి పది నిమిషాలు టీవీ చూడడం మంచిదే. కామెడీ, సినిమా పాటల ఛానల్స్ను చూస్తే మనస్సు రిలాక్స్ అవుతుంది. విద్యార్థులు ఇవి పాటిస్తే మంచిది... జవాబు పత్రంలో ఒక్కో పేజీపై 16 నుంచి 18 లైన్లకు మించకుండా సమాధానాలు రాయాలి. ముఖ్యమైన అంశాల కింద గీత ఉండేటట్లు(అండర్లైన్) చూసుకోవాలి. గణితంలో అంకెలు స్పష్టంగా వేసుకోవాలి. తెలుగులో అక్షరాల తలలపై తలకట్టు, ఒత్తులు, దీర్ఘాలు స్పష్టంగా కనబడేటట్లుగా రాయాలి. బ్లూపెన్ను, బ్లాక్ పెన్ను మాత్రమే వినియోగించాలి. రెడ్ పెన్ను వాడకూడదు. ఆత్మవిశ్వాశాన్ని కోల్పోవద్దు విద్యార్థులు ఆత్మవిశ్వాశాన్ని కోల్పోకూడదు. పరీక్ష ముగిసిన తర్వాత సమాధానాలు సరిపోల్చుకోకూడదు. అలా చేస్తే మరుసటి రోజు పరీక్షపై దాని ప్రభావం ఉంటుంది. - డాక్టర్ కర్రి రామారెడ్డి, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, రాజమహేంద్రవరం ఏడు గంటల నిద్ర తప్పనిసరి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రోజుకు కనీసం ఏడు గంటల నిద్ర అవసరం. విద్యార్థులు పరీక్షలను సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే ముందుగా ఆరోగ్యంగా ఉండాలి. - డాక్టర్ తేతలి నవీన్రెడ్డి, కేవీఆర్ హాస్పిటల్స్, రాయవరం -
పటిష్ట ఏర్పాట్లతో పారదర్శకంగా నిర్వహించాలి
-కేంద్రాల వద్ద సదుపాయాలు కల్పించాలి -పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ ఆదేశం కాకినాడ సిటీ : పదోతరగతి పబ్లిక్ పరీక్షలను పటిష్ట ఏర్పాట్లతో పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్ అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్ కోర్టు హాలులో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. జిల్లాలో 304 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 68,853 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు. డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారులను ఫ్లైయింగ్ స్క్వాడ్లుగా ఏర్పాటు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు. పరీక్షా పత్రాల పంపిణీలో పోలీస్ ఎస్కార్ట్, అర్మ్డ్ గార్డ్స్, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని కాకినాడ, రాజమహేంద్రవరం పోలీస్ సూపరింటెండెంట్లకు సూచించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ షాపులను మూసివేయించాలని ఆదేశించారు. సబ్ ట్రెజరీల్లో ప్రశ్నాపత్రాల డిపాజిట్కు, తీసుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఖజానాశాఖాధికారిని ఆదేశించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స కిట్లు, మందులు అందుబాటులో ఉంచాలని, పరీక్ష కేంద్రాల వద్దకు చేర్చేందుకు బస్సులు అందుబాటులో ఉంచాలని, జవాబు పత్రాలను ఎప్పటికప్పుడు స్పీడ్ పోస్ట్లో పంపించడానికి పరీక్ష జరిగే అన్ని రోజులలో తోడ్పాటునందించాలని వైద్యారోగ్య, ఆర్టీసీ, పోస్టల్ అధికారులకు సూచించారు. జేసీ ఎస్.సత్యనారాయణ, జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, డీఆర్ఓ చెన్నకేశవరావు, డీఈఓ ఎస్.అబ్రహం, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి
- పరీక్ష కేంద్రాల్లో వసతులు కల్పించాలి - 144 సెక్షన్ అమలు చేయాలి - పది పరీక్షల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష కర్నూలు సిటీ: వచ్చేనెల 17వ తేదీ నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం పది పరీక్షల ఏర్పాట్లపై కలెక్టర్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పరీక్ష కేంద్రంలో కూడా అన్ని వసతులు కల్పించాలన్నారు. విద్యార్థులు కేంద్రాలకు సరైన సమయానికి చేరుకునేందుకు అవసరమైన బస్సు సదుపాయాలు కల్పించాలని, రవాణా విషయంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రాల దగ్గర మెడికల్ కిట్లు ఏర్పాటు చేసి, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రశ్న పత్రాలను ఆయా కేంద్రాలకు సమీపంలో ఉన్న పోలీస్స్టేషన్ నుంచి స్కూళ్లకు చేర్చే సమయంలో బందోబస్త్తో వెళ్లాలన్నారు. ఎక్కడ కూడా విద్యార్థులకు వసతులు లేవనే ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమలు చేయాలని, మాస్కాపింగ్కు అవకాశమే లేకుండా చూడాలన్నారు. పరీక్ష జరుగుతున్నంత సేపు నిరంతరంగా కరెంట్ సరఫరా ఉండేలా చూడాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. సమస్యాత్మకమైన కేంద్రాల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖకు సూచించారు. వచ్చే నెల17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలకు జిల్లాలో 240 కేంద్రాలను ఎంపిక చేశామని, మొత్తం 51462 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ఇన్చార్జ్ డీఈఓ తాహెరా సుల్తానా కలెక్టర్కు వివరించారు. అన్ని రకాల సదుపాయలు ఉండే స్కూళ్లనే కేంద్రాలుగా ఎంపిక చేశామన్నారు. సమావేశంలో డీఆర్ఓ గంగాధర్గౌడ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కాపీయింగ్ నిరోధంలో ‘పాస్’ అవుతారా?
-చూసిరాతలకు చెక్ పెట్టేందుకు యాక్ట్-25 -నిఘా నీడలో పదో తరగతి పరీక్షలు..! -చర్చనీయాంశమైన హైకోర్టు ఆదేశాలు రాయవరం : వచ్చే నెల 17 నుంచి జరగనున్న పదోతరగతి పరీక్షల్లో చూసిరాతలను (కాపీయింగ్) నివారించేందుకు గట్టి చర్యలు తీసుకోనున్నారు. మాస్ కాపీయింగ్ను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని హైకోర్టు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు విద్యాశాఖలో సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఇంతవరకూ ఏం జరుగుతోందంటే.. పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అయితే ఖాళీగా ఉంటున్నారని, దీంతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని కొందరు భావిస్తున్న నేపథ్యంలో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు అనధికారికంగా చూసిరాతలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్నేళ్లుగా పబ్లిక్ పరీక్షల్లో చూచి రాతల సంస్కృతి పెరిగి పోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయులే చూసిరాతలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పక్క విద్యార్థి జవాబు పత్రంలో చూసి రాయడం, స్లిప్పులు తెచ్చుకుని రాయడం ద్వారా ఉత్తమ గ్రేడులు పొందేందుకు పక్కదారులు పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యాక్ట్ -25 అంటే.. పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ను అరికట్టేందుకు యాక్ట్ -25ను రూపొందించారు. దశాబ్దాల క్రితమే ఈ యాక్ట్ అమల్లో ఉంది. మాస్ కాపీయింగ్ నిరోధానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటూ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ను నిరోధించేందుకు ఏమి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని రెండు రాష్ట్రాలను హైకోర్టు ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడకుండా నిరోధించేందుకు అమలు చేసే యాక్ట్ -25కు విద్యాశాఖ అధికారులు పదును పెడుతున్నారు. మాల్ ప్రాక్టీస్ చేసి పట్టుబడిన సందర్భాల్లో ఈసారి ఇన్విజిలేటర్ను కూడా ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉంటుందని సమాచారం. మాస్ కాపీయింగ్ను నిరోధించాలంటే.. గతేడాది జిల్లాలో మాస్ కాపీయింగ్ నిరోధక చర్యల్లో భాగంగా 15 చోట్ల సీసీ కెమెరాలను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా జిల్లా, రాష్ట్ర అధికారులు ప్రత్యక్ష్యంగా పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది. బయో మెట్రిక్ హాజరు, ఆన్లైన్ మానిటరింగ్ ద్వారా చూసిరాతలకు ఫుల్స్టాప్ పెట్టే అవకాశం ఉంది. తనిఖీ బృందాల్లో ఏసీబీ, విజిలెన్స్ విభాగాల నుంచి ఒక్కొక్కరిని నియమిస్తే మాస్ కాపీయింగ్ను పక్కాగా నిరోధించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదో తరగతి విద్యార్థులకు కూడా జవాబులు రాయడానికి సింగిల్ బుక్లెట్లు ఇవ్వడం ద్వారా మాస్ కాపీయింగ్కు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. ఈ ఏడాది జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతుంది. పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఇది ఎంతవరకు సాధ్యమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 67,740 మంది రెగ్యులర్ విద్యార్థులు.. ఈ ఏడాది జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 67,740 మంది రెగ్యులర్ విద్యార్థులుగా హాజరు కానున్నారు. వీరికి 297 రెగ్యులర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది పబ్లిక్ పరీక్షల్లో సబ్జెక్ట్స్ ఫెయిలైన వారికి ఏడు ప్రైవేటు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. పకడ్బందీగా యాక్ట్-25 అమలు పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మాల్ప్రాక్టీస్కు అవకాశం లేకుండా యాక్ట్ 25ను కచ్చితంగా అమలు చేస్తాం. ఎక్కడా అక్రమాలకు తావీయకుండా చర్యలు తీసుకుంటాం. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దీనిపై కచ్చితమైన గైడ్లైన్స్ రావాల్సి ఉంది. –ఎస్.అబ్రహాం, ఇన్చార్జ్ జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ -
విద్యార్థులకు పరీక్ష
గాడితప్పిన సాంఘిక సంక్షేమం - పదవ తరగతి విద్యార్థులకు మోటివేషన్ క్లాసుల నిర్వహణలో నిర్లక్ష్యం - ఒక్క డివిజన్లోనూ మొదలు కాని ప్రక్రియ - మరో నెల రోజుల్లో పరీక్షలు - పలు వసతిగృహాల్లో పనిచేయని బోర్లు - మెరుగుపడని బయోమెట్రిక్ హాజరు కర్నూలు(అర్బన్): పదవ తరగతి పరీక్షలు పట్టుమని నెల రోజులు లేవు. ఇప్పటి వరకు విద్యార్థులకు మోటివేషన్ తరగతులూ నిర్వహించని పరిస్థితి. యేటా డిసెంబర్లోనే డివిజన్ల వారీగా క్లాసులు నిర్వహిస్తున్నా ఈసారి ఆ ఊసే కరువయింది. ఇందుకు ప్రధాన కారణం సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారి దీర్ఘకాలిక సెలవులో వెల్లడమే. మొత్తంగా అధికారి లేని లోటుతో ఈ శాఖలో పాలన గాడితప్పింది. పక్క జిల్లాలో ఇప్పటికే తరగతులు ఒకటికి రెండుసార్లు నిర్వహించి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయగా.. ఇక్కడి విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మారింది. సైకాలజీలో నిష్ణాతులైన వారిని పిలిపించి వసతి గృహాల్లోని విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టాలనేది ఈ క్లాసుల ముఖ్య ఉద్దేశం. అయితే ఈ విద్యా సంవత్సరం ఒక్క డివిజన్లోనూ క్లాసులు నిర్వహించలేదు. అదేవిధంగా పరీక్షలకు అవసరమయ్యే ప్యాడ్, పెన్ను, పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్ను కూడా అందివ్వకపోవడం గమనార్హం. ఆయా వసతిగృహాల్లో సంబంధిత అధికారులు రాత్రి బస చేస్తూ విద్యార్థులను చదివించాల్సి ఉంది. అలాగే ప్రతి వసతిగృహంలోని పదో తరగతి విద్యార్థులను గ్రేడ్లుగా విభజించి గ్రూప్ డిస్కషన్ నిర్వహించాలి. సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో ఈ ప్రక్రియ కూడా చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. పలు వసతి గృహాల్లో తీరని దాహం వేసవి సమీపిస్తుండడంతో ఇప్పటికే పలు వసతి గృహాల్లోని మంచినీటి బోర్లలో నీరు ఇంకిపోవడంతో ఆయా వసతి గృహాల్లోని విద్యార్థులు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ వసతి గృహంలో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని సంక్షేమాధికారులు వినతి పత్రాలు అందజేస్తున్నా ఫలితం లేకపోతోంది. ముఖ్యంగా ఓర్వకల్లు(బాలికలు), ఆలూరు(ఐడబ్ల్యూహెచ్), మద్దికెర (బాలురు), తెర్నేకల్(బాలురు), నందవరం(బాలురు), ఎమ్మిగనూరు (కళాశాల బాలురు) తదితర వసతి గృహాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికే పలు వసతి గృహాలకు చెందిన సంక్షేమాధికారులు స్వయంగా డబ్బులు వెచ్చించి తాగునీటిని ట్యాంకర్ల ద్వారా తెప్పించుకుంటున్నారు. రెగ్యులర్ అధికారి లేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఇన్చార్జి డీడీగా బాధ్యతలు నిర్వహిస్తున్నా, ఆయనకున్న పని ఒత్తిడి కారణంగా సమస్యలపై దృష్టి సారించలేక పోతున్నట్లు తెలుస్తోంది. నామమాత్రంగానే బయోమెట్రిక్ హాజరు జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో బోగస్ హాజరును అరికట్టేందుకు బయోమెట్రిక్ మిషన్లు, ట్యాబ్లను అందించారు. అయితే పలు సాంకేతిక కారణాల వల్ల పలు వసతి గృహాల్లో బయోమెట్రిక్ హాజరు అంతంతమాత్రంగానే నమోదు అవుతోంది. సాంకేతిక కారణాలను తెలుసుకొని వాటిని సరిచేసి అన్ని వసతి గృహాల్లో బయో మెట్రిక్ హాజరు నమోదయ్యేలా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పలు వసతి గృహాలకు సంబంధించి సిగ్నల్స్ లేకపోవడంతో ఆయా వసతి గృహాల్లో మాన్యువల్గానే హాజరును నమోదు చేస్తున్నారు. మోటివేషన్ క్లాసుల నిర్వహణకు చర్యలు డివిజన్ల వారీగా పదో తరగతి విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే సంబంధిత సహాయ సంక్షేమాధికారులకు ఆదేశాలు జారీ చేశాం. తాగునీటి సమస్య ఉన్న వసతి గృహాల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. స్పెషల్ హాస్టళ్లపై సంబంధిత హెచ్డబ్ల్యూఓలు ప్రత్యేక దృష్టి సారించి ఈ విద్యా సంవత్సరంలో వంద శాతం ఫలితాలు సాధించేలా చర్యలు చేపడతాం. - ప్రకాష్రాజు, ఇన్చార్జి డీడీ -
విద్యార్థిని ఆత్మహత్య
గుడిపాడు(గూడూరు రూరల్): తల్లీదండ్రి గొడవ పడటంతో మనస్థాపం చెందిన ఓ విద్యార్థిని బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు పూర్తి వివరాలు.. మండల పరిధిలోని గుడిపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన హరిజన రాజమ్మ, రోగెన్న దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమార్తె రాధ(15) గూడూరు హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. తాగుడుకు బానిసైన తండ్రి రోగెన్న నిత్యం భార్య రాజమ్మతో గొడవపడుతుండేవాడు. కంటి ముందు తల్లిదండ్రులు గొడవ పడుతుండటాన్ని చూసిన రాధ పలుమార్లు చెప్పినా తండ్రి వినిపించుకోకపోవడంతో తీవ్ర మనస్థానికి గురైంది. దీంతో తెల్లవారుజామున ఇంటిలో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా ఫ్యానుకు ఉరి వేసుకుంది. తల్లిదండ్రులు గమనించి చూడగా అప్పటికే విగత జీవిగా మారింది. చేతికొచ్చిన కూతురు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. -
పదిలో వంద శాతం ఫలితాలు సాధించాలి
–హెచ్ఎంలతో డీఈఓ రవీంద్రనాథరెడ్డి గూడూరు: పదోతరగతిలో వంద శాతం ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.రవీంద్రనా«ద్రెడ్డి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో గూడూరు, సి.బెళగల్ మండలాల జెడ్పీ, మోడల్, కస్తూర్బా పాఠశాలల హెచ్ఎంలతో ఆయన సమావేశం నిర్వహించారు. పాఠశాలల వారీగా హెచ్ఎంతో పదోతరగతి విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను గ్రేడ్లుగా విభజించి తక్కువ గ్రేడ్ ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఫలితాలు తక్కువ వస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. సమావేశంలో విదా్యశాఖ డిప్యూటీ ఈఓ తాహెరాసుల్తాన, డీసీఈబీ ఓంకార్యాదవ్, ఇన్చార్జి ఎంఈఓ నాగభూపాల్నాయుడు పాల్గొన్నారు. -
ఎంఈఓ కార్యాలయాల్లో ప్రశ్నపత్రాలు
కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని యాజమాన్యాల చెందిన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పదో తరగతి గ్రాండ్ టెస్ట్–1,–2, ప్రీఫైనల్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఎంఈఓ కార్యాలయాల నుంచి తీసుకోవాలని కె.రవీంద్రనాథ్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టైటేబుల్, సిలబస్కు సంబంధించిన వివరాలు డీఈఓ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని డీఈఓ పేర్కొన్నారు. -
పదిలో ‘ప్రయివేట్ స్టడీ’ ఆవుట్
– సీసీఈ పద్ధతిలో ఇంటర్నల్ మార్కుల ఫలితం – ఇకపై ప్రయివేట్ విద్యార్థులకు ఓపెన్ స్కూల్ విధానమొక్కటే మార్గం – ఈ నెల 30వరకు ఓపెన్ స్కూల్కు దరఖాస్తుల స్వీకరణ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): నిరంతర సమగ్ర మూల్యాంకనం (కాంప్రహెన్సివ్ కంటిన్యూవస్ ఎవాల్యూషన్(సీసీఈ)) ఫలితంగా పదో తరగతిలో ప్రయివేట్ స్టడీకి పులిస్టాప్ పడింది. ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నుంచే నూతన విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు ఇటీవలే ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసినట్లు విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయివేట్ స్టడీ చేద్దామనుకున్న విద్యార్థులకు ఇకపై ఓపెన్ స్కూల్ విధానం ఒక్కటే మార్గం. సీసీఈ ఎఫెక్ట్.. ఈ ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం 6 నుంచి 10వ తరగతి వరకు నిర్వహించే పరీక్షల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో అంతర్గత, బహిర్గత మూల్యాంకనాలున్నాయి. బహిర్గత మూల్యాంకనంలో ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అంతర్గత మూల్యాంకనానికి 20 మార్కులుంటాయి. విద్యార్థికి ఏడాది పొడవునా నిర్వహించే ఫార్మెటీవ్, సమ్మేటీవ్ పరీక్షలు, రికార్డులు, ప్రాజెక్టులు, ఇతర బోధనంశాల నుంచి అంతర్గత మూల్యాంకనంలో 20 మార్కులు కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో ప్రయివేట్ స్టడీ అభ్యర్థులకు ఇంటర్నల్ మార్కులు వేసేందుకు వీలు పడదు. వీరు ఏకంగా పబ్లిక్ పరీక్షలకు హాజరవుతుండడంతో ఇబ్బందులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఏకంగా పదో తరగతిలో ప్రయివేట్ స్టడీ విధానాన్ని రద్దు చేసింది. ఓపెన్ స్కూలే దిక్కు.. జిల్లాలో ఏటా 3500 నుంచి 4000 మంది విద్యార్థులు పదో తరగతిని ప్రయివేట్ స్టడీ విధానంలో పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో ఇలాంటి విద్యార్థులకు ఓపెన్ స్కూల్ ఒక్కటే దిక్కుగా మారింది. లేదంటే రెగ్యులర్గా చదవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాదికి సంబంధించి ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతిని చదివేందుకు ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు సమీప అధ్యయన కేంద్రాలు, డీఈఓ కార్యాలయంలో సంప్రదించవచ్చు. అవును ఆ విధానం రద్దయింది: రవీంద్రనాథ్రెడ్డి, డీఈఓ ఈ ఏడాది నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రయివేట్ స్టడీ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. సీసీఈ పద్ధతిలో ఇంటర్నల్ మార్కుల కేటాయింపు తలెత్తిన ఇబ్బందుల కారణంగా సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయివేటు విద్యార్థులంతా ఇకపై ఓపెన్ స్కూల్ విధానంలో టెన్త్ పూర్తి చేసుకోవాల్సిందే. రెగ్యులర్, ఓపెన్స్కూల్ సర్టిఫికెట్కు ఎలాంటి తేడా ఉండదు. -
టెన్త్లో శతశాతం ఉత్తీర్ణతకు కృషి
అరకులోయ: జిల్లాలో ఈఏడాది పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కషి చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి కష్ణారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, పానిరంగిని, పెదలబుడు, లిట్టిగుడ ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. దసరా సెలవుల అనంతరం టె¯Œæ్త విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. గత ఏడాది జిల్లాలో 10వ తరగతిలో 94 శాతం ఉత్తీర్ణత సాధించామని, ఈ ఏడాది శతశాతం ఉత్తీర్ణత సాధిస్తామని చెప్పారు. ఏజెన్సీలో 45 ప్రాథమిక పాఠశాలలు వివిధకారణాల వల్ల మూసివేశామని, వీటిలో 30 పాఠశాలలు పునః ప్రారంభించామన్నారు. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మిస్తున్నామని, రన్నింగ్ వాటర్ లేని పాఠశాలల్లో పాఠశాల యాజమన్యం ద్వారా బకెట్లతో నీరు తెచ్చెలే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రహరీలేని పాఠశాలలకు బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. శిథిలమైన భవనాల్లో తరగతులు నిర్వహించరాదని ఇప్పటికే ఉపాధ్యాయులకు సూచించామని చెప్పారు. విధులు సక్రమంగా నిర్వహించకుండా సమయపాలన పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ డిప్యూటీ డీఈవో కొర్రా సువర్ణ, ఎంఈవో శెట్టి సుందరరావు, ఉపాధ్యాయులు కన్నబాబు, శంకర్ పాల్గొన్నారు. -
టెన్త్, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షల ఫీజు గడువు 13వ తేదీ
విద్యారణ్యపురి : జిల్లాలో టెన్త్, ఇంటర్ ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించే గ డువు ఈనెల 13వ తేదీ వరకు ఉందని డీఈఓ పి.రాజీవ్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఎం.శంకర్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఒక్క పేపర్కు రూ. 25 అపరాధ రుసుముతో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు , ఒక్క పేపర్కు రూ.50 అపరాధ రుసుముతో ఈనెల 21 నుంచి 26వ తేదీ వరకు పరీక్ష ఫీజు లు చెల్లించవచ్చన్నారు. ఇంటర్ విద్యార్థులు థియరీ సబ్జెక్టుకు రూ.150 చొప్పున, ప్రాక్టికల్స్కు పేపర్కు రూ.100 చొప్పున చెల్లించాలన్నారు. టెన్త్ విద్యార్థులు ఒక్క థియరీ సబ్జెక్టుకు రూ.100 చొప్పున, ప్రాక్టికల్స్ పేపర్కు ఒక్క దానికి రూ.50 చొప్పున మీసేవా, ఏపీ ఆ న్లైన్లో ఫీజు చెల్లించాలన్నారు. కాగా, ఓపెన్ సప్లిమెంటరీ పరీక్షలు ఈఏడాది అక్టోబర్ 1 నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయన్నారు. -
‘పది’ ఫెయిలైన విద్యార్థులకు రేపటి నుంచి శిక్షణ
- డీఈవోలను ఆదేశించిన విద్యాశాఖ - జూన్ 17వరకు తరగతులు హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈనెల 27 నుంచి వచ్చే 17 వరకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహించాలని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని డీఈవోలకు సూచించారు. వచ్చే నెల 18వ తేదీ నుంచి జరుగనున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. గణితం, సైన్స్, ఇంగ్లిషు, సోషల్ తదితర సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినవారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. కాగా, శిక్షణ తరగతుల్లో పాల్గొనే టీచర్లకు గౌరవ వేతనం ఇచ్చేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షల్లో దాదాపు 1.40 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. -
'మ్యాథ్స్, సైన్స్లో గ్రేస్ మార్కులు కలపాలి'
హైదరాబాద్ : ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే పదో తరగతి ఫలితాల్లో లక్షలాది మంది విద్యార్థులు ఫెయిల్ కావడానికి తెలంగాణ సర్కారే కారణమని టీడీపీ ఎమ్మెల్యే వివేక్ మండిపడ్డారు. సీసీఈ విధానంపై అధ్యాపకులకు అవగాహన లేకపోవటం వల్లే టెన్త్లో మ్యాథ్య్, ఫిజిక్స్లో ఫెయిల్ అయ్యారని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. సీసీఈ విధానం మంచిదే అని, అయితే విద్యా సంవత్సరం మధ్యలో ప్రవేశపెట్టడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. మ్యాథ్స్, సైన్స్లో గ్రేస్ మార్కులు కలిపి విద్యార్థులకు న్యాయం చేయాలని వివేక్ డిమాండ్ చేశారు. సప్లిమెంటరీలోగా కొత్త విధానంపై అవగాహన కల్పించి విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేలా చూడాలని ఆయన కోరారు. పరీక్ష లోపాల అన్నింటితో టీడీపీఎల్పీ తెలంగాణ సర్కార్కు లేఖ రాస్తుందని వివేక్ తెలిపారు. విద్యారంగం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన లేదని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. కేజీ టు పీజీపై రెండో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నా ఇంకా స్పష్టత లేదన్నారు. తెలంగాణలో 10 యూనివర్శిటీలకు ఒక్క వైస్ ఛాన్సులర్ లేరని సండ్ర విమర్శించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా యూనివర్శిటీలపై గవర్నర్ అధికారాలను సీఎం లాక్కోవాలని చూస్తున్నారని, అటామస్ బాడీలా ఉండే యూనివర్సిటీలపై సీఎం ఎలా పెత్తనం చేయాలని చూస్తారని ప్రశ్నించారు. స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టివ్వాలని, యూనివర్సిటీ భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని సండ్ర వెంకట వీరయ్య హెచ్చరించారు. -
తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభం
హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైయ్యాయి. ప్రతి రోజూ ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమై 12:15 గంటలకు ముగుస్తాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2,614 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 5.65 లక్షల మంది విద్యార్థులు హాజరు అవుతున్నారు. పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యార్థుల సౌలభ్యం కోసం పరీక్ష సమయానికి అరగంట ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇచ్చారు. మరోవైపు అన్ని సబ్జెక్టులకు రెండు పేపర్ల చొప్పున ఉండగా ద్వితీయ భాషకు ఒకే పేపర్ ఉన్నందున, ఆ పరీక్ష రోజున మాత్రం విద్యార్థులకు 3:15 గంటల సమయం (ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు) ఇవ్వనున్నారు. కాగా పరీక్ష ప్రారంభమయ్యాక గరిష్టంగా 10 నిమిషాల వరకు మాత్రమే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. అంతకు మించి ఆలస్యమైతే వెనక్కి వెళ్లాల్సిందే. మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. ఏమైనా సమస్యలు తలెత్తితే హెల్ప్లైన్కు (040-23230941, 040-23230942) ఫోన్ చేయాలని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. -
వాట్ నెక్ట్స్
టెన్త్ తరువాత ఇంటర్... ఆపై ఇంజనీరింగో... డిగ్రీనో... ఎడ్యుకేషనల్ ప్రాసెస్లో రొటీన్గా జరిగిపోతాయి. కానీ... డిగ్రీ తరువాత! పీజీ... అని ఠక్కున చెప్పలేం. తేల్చుకోవడం కష్టం. విజ్ఞానంతో పాటు వయసు, ఆలోచన, అన్నింటికీ మించి పరిస్థితుల ప్రభావం మన కెరీర్ను, ఇంకా చెప్పాలంటే లైఫ్ లైన్ను డిసైడ్ చేసే సందర్భం ఇదే. ఏ బాదరబందీ లేకుండా సరదాగా సాగిపోయే కాలేజీ డేస్ నుంచి ఒక్కసారిగా డైవర్షన్ తీసుకోవడం ఎవరికైనా ఇబ్బందే. సనత్నగర్ ‘హిందూ కాలేజ్ ఫర్ ఉమెన్’ ఫైనలియర్ డిగ్రీ విద్యార్థినులను ఇదే ప్రశ్న వేస్తే... కొందరిలో ఎటూ తేల్చుకోలేక కన్ఫ్యూజన్... ఇంకొందరిలో భవిష్యత్పై భయం... మరికొందరిలో ఏంచేయాలనే స్పష్టత... మొత్తానికి అంతా కలసి ‘వాట్ నెక్ట్స్’ అన్నదానికి ఓ కన్క్లూజన్ కోసం ప్రయత్నించారు. మనీష: డిగ్రీ తర్వాత పీజీ అనేది టెన్త్ తర్వాత కాలేజ్ అన్నంత ఈజీకాదు. శ్రీలత: అమ్మాయిలం కదా! డిగ్రీ తర్వాత జాబ్ చెయ్యాలా.. ఫర్దర్ స్టడీస్కి వెళ్లాలా.. లేదంటే ఇంట్లోవాళ్లు పెళ్లంటే.. మీ ఇష్టం అనాలా... డిసైడ్ చేసుకునే సమయం. రాజశ్రీ: అందరికీ ఫర్దర్ స్టడీస్కి వెళ్లాలని, లేదంటే జాబ్ చేయాలని ఉంటుంది. కానీ చాయిస్లన్నీ మాచేతుల్లో ఉండే వయసు కాదు కదా! ఇంట్లోవాళ్లు పెళ్లి తప్పదంటే! తేజ: ఏముంది... కుదరదు చదువుకుంటామనో, జాబ్ చేస్తామనో గట్టిగా చెప్పేయడమే. రాజశ్రీ: అందరి పరిస్థితులు ఒక్కలా ఉండవు కదా! నేను మాత్రం ఇంకా చదవాలనుకుంటున్నాను. మౌనిక: నేను మాత్రం జాబ్ చేయాలనుకుంటున్నాను. నేనే కాదు... ఇక్కడున్న నా స్నేహితురాళ్లు చాలామంది చాయిస్ కూడా అదే. నావరకూ నేను అప్పుడే జాబ్ సెర్చ్ మొదలుపెట్టేశాను. తేజ: మా ప్రియాంక అయితే ఆల్రెడీ మంచి జాబ్ కొట్టేసింది. ప్రియాంక: అవును... ఈ మధ్యనే నాకు టీసీఎస్లో జాబ్ వచ్చింది. ధారాపటేల్: నేను మాత్రం ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ చదువుదామనుకుంటున్నా మాధురి: డిగ్రీ వరకూ అంటే పూర్తిగా తల్లిదండ్రులు మీద ఆధారపడి చదువుకుంటాం. ఆ తర్వాత కూడా అంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. నేను పార్ట్టైం జాబ్ చేసుకుంటూ చదువుకుందాం అనుకుంటున్నా. నందినిగాయిత్రి: నేను నేషనల్ లెవల్ వాలీబాల్ ప్లేయర్ని. ఇంట్లోవాళ్లు చదువు, జాబ్, పెళ్లి ఏదైనా నా నిర్ణయమే తమదంటారు. శ్రీలత: నా చాయిస్ కూడా జాబే. దీక్షిత: ఏం జాబ్లో ఏమోనండి. బయట చాలా కాంపిటీషన్ ఉంది. చాలామంది అమ్మాయిలు డిగ్రీ అవ్వగానే సర్టిఫికెట్స్ పట్టుకుని ఇంటర్వ్యూలకు రెడీ అయిపోతున్నారు. అబ్బాయిలు కూడా ఉంటారు కదా! మయూరి: ఇప్పుడు కాలేజీలో కూర్చుని ఇలా ఎన్ని కబుర్లయినా చెప్పుకోవచ్చు. ఇంటికెళ్లాక మన పెద్దవాళ్ల మాటలు విన్నాక చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా పెద్ద చదువులా... పెళ్లా అన్నదగ్గర! మౌనిక: కాంప్రమైజ్ అనే పదం మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. బదర్ సుల్తానా: అమ్మాయి అంటేనే కాంప్రమైజ్ అని అర్థం కదా! స్కూల్లో ఉన్న ఆలోచనలు కాలేజీకి వచ్చాక మారిపోతాయి. కాలేజీలో ఉన్న ప్లానింగ్ డిగ్రీకొచ్చాక ఉండదు. డిగ్రీ పూర్తయ్యాక అప్పటి పరిస్థితులను బట్టి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అమ్మానాన్నల ప్లానింగ్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. కరిష్మా: ఆ మాట అనాల్సింది అమ్మాయిలు కదా! మనకెందుకు ఇలాంటి ఫీలింగ్ కలుగుతోంది! (నవ్వుతూ) మౌనిక: అఫ్కోస్... మా ఉమెన్ కాలేజీలో మాతో కలిసి చదువుతున్న ఒకే ఒక అబ్బాయి తేజ. (నవ్వుతూ) మల్లీశ్వరి: కాలం మారిందండి. పేరెంట్స్ చాలావరకు మాకే చాయిస్ ఇస్తున్నారు. సౌమ్య: ఎంత చాయిస్ ఇచ్చినా ఒక వయసొచ్చాక.. చాలావరకూ ఇంటి పరిస్థితులను బట్టే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. -
కాళ్లతో పరీక్షలు రాసి టెన్త్లో 54%
ఠాణే: అన్ని అవయవాలు సక్రమంగానే ఉన్నా పనులు చేసుకోవడానికి మరొకరి సాయం అవసరమవుతున్న ఈ రోజుల్లో పుట్టుకతోనే చేతులు లేని ఆ బాలుడు కాళ్లతో పరీక్షలు రాసి టెన్త్లో 54 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. జిల్లాలోని నందోరి గ్రామంలో ఉన్న గిరిజన కుటుంబంలో పుట్టిన వసంత్ రావుత్ ఈ ఫీట్ సాధించి అందరి మన్ననలను పొందుతున్నాడు. ఈ సందర్భంగా స్థానిక జీవన్ వికాస్ పాఠశాల విద్యార్థి అయిన రావుత్ మీడియాతో మాట్లాడుతూ..‘ ఎంఎఫ్ హుస్సేన్ సాబ్ అంత పెద్ద ఆర్టిస్ట్ను కావాలనేది నా జీవితాశయం. ఇంటర్ పూర్తికాగానే ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో సీటు సంపాదించేందుకు కృషిచేస్తా. పుట్టుకనుంచి చేతులు లేకపోవడంతో కాళ్లతోనే రాయడం నేర్చుకున్నా. టెన్త్లోనూ నా పరీక్షలు రాయడానికి వేరే ఎవరినైనా పెట్టుకోమని మా సార్లు నాకు సలహాఇచ్చారు. అయితే నాపై నాకున్న నమ్మకమే నేను టెన్త్ 54 శాతంతో పాసయ్యేలా చేసింది. నిజానికి ఈసారి టెన్త్ పాసవ్వనేమోననే అనుమానముండేది. కంప్యూటర్ సబ్జెక్ట్ అంటే నాకు చాలా భయముండేది. అయితే మా కంప్యూటర్ సార్ నాకు సబ్జెక్ట్పై భయం పోగొట్టడంతో పరీక్ష బాగా రాశాను. అలాగే చిత్రలేఖనంపై నా ఆసక్తిని గమనించి మా ఆర్ట్స్ టీచర్ నాపై ప్రత్యేక శ్రద్ధ చూపించి కాలితో బొమ్మలు ఎలా వేయాలో నేర్పించారు. రోజూ నేను స్కూలుకు వచ్చేందుకు నా స్నేహితుడు జయంత్ దుమాడే చాలా సహకరించాడు. మేం ఇద్దరం పాఠశాల మంజూరు చేసిన ఆటో రిక్షాలో రోజూ స్కూల్కు వస్తుండేవాళ్లమ’ని చెప్పాడు.ఎంఎఫ్ హుస్సేన్ అంతటి చిత్రకారుడిని కావాలనేది తన చిరకాల వాంఛ అని ముక్తాయించాడు. -
కలల సాకారానికి ‘సాక్షి’ కెరీర్ ఫెయిర్
సాక్షి, సిటీబ్యూరో: టెన్త్, ఇంటర్ తర్వాత ఉజ్వల భవితను కోరుకునే విద్యార్థులకు వివిధ కోర్సులపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘సాక్షి’ కెరీర్ ఫెయిర్ను నిర్వహించిందని సాక్షి టీవీ మార్కెటింగ్ డెరైక్టర్ రాణిరెడ్డి అన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులు ఈ కెరీర్ ఫెయిర్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తారని ఆమె చెప్పారు. బంజారాహిల్స్లోని సుల్తాన్ ఉలుమ్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం సాక్షి టీవీ నిర్వహించిన కెరీర్ ఫెయిర్కు నగరవాసుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా సుల్తాన్ ఉలుమ్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి జాఫర్ జావెద్ మాట్లాడుతూ.. సంప్రదాయ కోర్సులకు భిన్నంగా ఉపాధి అవకాశాలున్న కోర్సులపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని, ఈ దిశగా సాక్షి టీవీ యాజమాన్యం చేసిన ప్రయత్నం అభినందనీయమన్నారు. ఓయూ కెమిస్ట్రీ విభాగాధిపతి పార్థసారథి మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే కెరీర్కు దోహదపడే అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న సమాచారాన్ని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. గాయత్రి అకాడ మీ చైర్మన్ పీవీఆర్కే మూర్తి మాట్లాడుతూ.. టెన్త్, ఇంటర్, గ్రాడ్యుయేషన్ స్థాయిల్లో కెరీర్ ఫెయిర్లు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఎంపీసీ కోర్సు కన్నా, బైపీసీ కోర్సు చదివిన విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఐసీఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ వాసుదేవరావు మాట్లాడుతూ.. పరిశ్రమ అవసరాలకు తగిన విధంగా విద్యార్థులు తయారు కావాలని, వారిని ఆ దిశగా నడిపించాల్సిన బాధ్యత అధ్యాపకులదేనన్నారు. కెరీర్లో ఉన్నత స్థాయికి చేరేందుకు కామర్స్ కోర్సులు ఎంతగానో దోహద పడతాయన్నారు. ఉద్యోగి స్థాయి నుంచి యజమాని స్థాయికి ఎదిగేందుకు కంపెనీ సెక్రటరీ కోర్సు చక్కని సోపానమన్నారు. కార్యక్రమంలో బటర్ ఫ్లై ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కె.శరత్చంద్ర, రిషీకేశ్ హంబే తదితరులు పాల్గొన్నారు. నేడు కూడా... సాక్షి కెరీర్ ఫెయిర్ను ఆదివారం కూడా కొనసాగించనున్నారు. ఇందులో దక్కన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, లకోటియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, నియో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ, ఈ మార్గ్ అబ్రాడ్ ఎడ్యుకేషన్, ఇక్ఫయ్ హయ్యర్ ఎడ్యుకేషన్, షైన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, రేవ్ ఇనిస్టిట్యూట్ , ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కంప్యూటర్ డిజైన్స్, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్స్ తదితర సంస్థలు పాల్గొన్నాయి. ‘సాక్షి భవిత’ నిర్వహించిన కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్కు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. రెగ్యులర్కు భిన్నంగా ఇంటర్మీడియేట్ పూర్తయింది. సాక్షి కెరీర్ ప్రోగ్రామ్ ద్వారా రెగ్యులర్గా చదివే వాటికి భిన్నమైన కోర్సుల గురించి తెలుసుకోగలిగా. ఇలాంటి ఉపయోగకర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సాక్షికి కృతజ్ఞతలు. - అభినవ్, ఇంటర్ అవగాహన పెరిగింది ఇంటర్ తర్వాత వేసే అడుగే కెరీర్కు ముందడుగు. ఇంజనీరింగ్, మెడిసిన్ కాకుండా ఇంకా అనేక రకాల కోర్సులు ఉన్నాయని తెలిసింది. వాటిలో చేరితే ఎలాం టి అవకాశాలు వస్తాయో ఇక్కడ వివరించారు. - ఈశ్వర్, ఇంటర్ విభిన్న కోర్సులు తెలిశాయి ఇటీవలే టెన్త్ పూర్తయింది. తరువాత ఇంటర్ కాకుండా ఏంచేయాలన్నదానిపై అవగాహన కోసం ఇక్కడకు వచ్చా. విభిన్న కోర్సుల గురించి తెలుసుకోగలిగా. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సాక్షికి ధన్యవాదాలు. - నారాయణ, టెన్త్ -
సిలబస్ మారినా శిక్షణ కరువు
టెన్త్లో మారిన సిలబస్పై అయోమయం శిక్షణ లేకుంటే బోధన కష్టమేనంటున్న టీచర్లు ఇప్పటి వరకు శిక్షణపై స్పష్టతనివ్వని విద్యాశాఖ సాక్షి, విశాఖపట్నం : సిలబస్ మారిన ప్రతిసారీ ఉపాధ్యాయులకు వాటిపై శిక్షణ తప్పనిసరి. కానీ ఈ విషయాన్ని విద్యాశాఖ మూడేళ్లుగా పట్టించుకోవడం లేదు. మారిన సిలబస్పై శిక్షణ లేకపోవడంతో ఉపాధ్యాయుల్లో నిర్లిప్తత చోటుచేసుకుంటోందన్న వాదన వినిపిస్తోంది. తాజాగా పదో తరగతి సిలబస్ సమూలంగా మారింది. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు 70 శాతానికిపైగా జిల్లాకు, అక్కడి నుంచి మండల కేంద్రాలకు చే రాయి. కానీ వీటిని బోధించే ఉపాధ్యాయులకు శిక్షణపై మాత్రం ఇప్పటి వరకు స్పష్టత లేదు. టెన్త్ సిలబస్ కష్టమే! పదో తరగతి మారిన సిలబస్పై శిక్షణ లేకుండా పాఠ్యాంశాల బోధన కష్టమేనని ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఏటా ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్ఎంఎస్ఏ) నిబంధనలు చెప్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. సీబీఎస్ఈ తరహాలో సిలబస్ను మార్చారు. ప్రాక్టికల్స్, ప్రాజెక్ట్ వర్క్ల ఆధారంగా పాఠ్యాంశాలు బోధించేలా పాఠ్యపుస్తకాల్ని రూపొందించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగశాలలు, అవసరమైన పరికరాల కొరత చాలా వరకు వేధిస్తోంది. దీనికితోడు మారిన సిలబస్పై కనీస శిక్షణ ఇవ్వకుంటే విద్యార్థులకు మెరుగైన బోధన చేసేదెలా.. అంటూ ఉపాధ్యాయులు తలపట్టుకుంటున్నారు. గణితం, భౌతిక-రసాయన శాస్త్రాల్లోనైతే ఈ పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు. పరీక్షా విధానంలోనూ మార్పులు? వచ్చే విద్యాసంవత్సరం నుంచి పదో తరగతి పాఠ్యాంశాలతోపాటు, పరీక్ష విధానంలో కూడా సమూల మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. మార్పుల ప్రతిపాదనలిలా ఉన్నాయి. ఇప్పటి వరకు ద్వితీయ భాష హిందీ మినహా మిగిలిన అన్ని సబ్టెక్టులకు రెండేసి పేపర్లుగా మొత్తం 11 పేపర్లుగా ప్రధాన పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రానున్న విద్యా సంవత్సరం నుంచి రెండేసి పేపర్ల స్థానంలో సీబీఎస్ఈ తరహాలో ఒక్కో పేపర్కు మాత్రమే పరీక్షలు నిర్వహించేందుకు ప్రతిపాదనలున్నాయి. ఫిజికల్ సైన్స్(పీఎస్), బయలాజికల్ సైన్స్(బీఎస్)కు మాత్రం 50 మార్కుల చొప్పున వేర్వేరు పేపర్లుగా పరీక్షలు నిర్వహిస్తారు. అలా అయితే ఏడు పేపర్లు మాత్రమే ఉండనున్నాయి. ఒక్కో సబ్జెక్టుకు 80 మార్కులకే రాత పరీక్ష ఉంటుంది. నిర్మాణాత్మక మూల్యాంకనం ఆధారంగా మిగిలిన 20 మార్కులు కేటాయిస్తారు. ఒక విద్యాసంవత్సరంలో నిర్వహించిన నాలుగు నిర్మాణాత్మక మూల్యాంకనాల సగటు ఆధారంగా ఈ 20 మార్కులు కేటాయిస్తారు. శిక్షణ లేకుంటే బోధన కష్టం సీబీఎస్ఈ తరహాలో పదో తరగతి సిలబస్ను మార్చారు. దీని వల్ల విద్యార్థుల్లో ప్రతి పాఠ్యాంశంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు అవకాశముంటుంది. ఆ మేరకు ప్రతి సబ్జెక్టులో ముందస్తు శిక్షణ తప్పనిసరి. చాలా వరకు ప్రాక్టికల్స్పైనే ఆధారపడి బోధన జరగాల్సి ఉంది. శిక్షణ లేకుండా విద్యార్థులకు బోధన కష్టంతోపాటు, విద్యార్థుల ప్రగతిని నిరోధించినవారమవుతాం. - ఇమంది పైడిరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ శిక్షణపై ఉత్తర్వులు రాలేదు టెన్త్ మారిన సిలబస్పై ఉపాధ్యాయుల శిక్షణ కోసం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదు. పాఠ్యపుస్తకాలను మాత్రం వచ్చిన మేరకు వెంటనే ఆయా మండలాలకు చేరవేసే పనులు యుద్ధప్రాతిపదికన చేస్తున్నాం. పాఠశాలలు తెరిచేనాటికే ప్రతి విద్యార్థి చేతికి పాఠ్యపుస్తకాలుండేలా చర్యలు తీసుకుంటున్నాం. శిక్షణ తరగతులపై ఉత్తర్వులందిన వెంటనే ఏర్పాట్లు చేస్తాం. - బి.లింగేశ్వరరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి