Treasury
-
అమెరికా ఖజానాపై సైబర్ దాడి..!
వాషింగ్టన్:అగ్ర దేశం అమెరికా ఖజానాపై చైనా సైబర్ దాడి చేసినట్లు సమాచారం. వర్క్ స్టేషన్లు,కీలక ఫైల్స్పై చైనా ప్రోద్బలంతో జరిగిన సైబర్ దాడిని గుర్తించామని అమెరికా ట్రెజరీ శాఖ కాంగ్రెస్కు లేఖ రాసింది.ఈ లేఖ మీడియా చేతికి చిక్కడంతో అసలు విషయం బయట పడింది.డిసెంబర్ నెల ప్రారంభంలో సైబర్ దాడి ఘటన జరిగినట్లు తెలుస్తోంది.థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సర్వీస ప్రొవైడర్ పాస్వర్డ్ను కనిపెట్టిన హ్యాకర్లు బ్రేక్ చేసి వర్క్ స్టేషన్లు, కొన్ని ఫైల్స్లోని సమాచారాన్ని దొంగిలించారని ట్రెజరీ శాఖ అధికార ప్రతినిధి లేఖలో తెలిపారు.ఈ విషయాన్ని యూఎస్ సైబర్ సెక్యూరిటీ,ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ దృష్టికి ట్రెజరీ శాఖ తీసుకువెళ్లింది.సైబర్ దాడిపై ట్రెజరీ శాఖకు థర్డ్పార్టీ సైబర్ సెక్యూరిటీ సేవలందిస్తున్న బియాండ్ ట్రస్ట్ సంస్థ ఈ వ్యవహారంపై స్పందించలేదు. ఇటీవలి కాలంలో కొన్ని థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడర్ను టార్గెట్ చేసి సైబర్ దాడులకు పాల్పడే ట్రెండ్ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. -
రత్న భాండాగారం రహస్యం ఇదే
-
బీజేపీ సంచలన నిర్ణయం..
-
భారత్కు 100 టన్నుల బంగారం
ముంబై: బ్రిటన్ వాల్టుల్లో భద్రపర్చిన 100 టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ దేశీ ఖజానాకు తరలించింది. 1991లో భారత్ విదేశీ మారక సంక్షోభాన్ని అధిగమించేందుకు పసిడిని తాకట్టు పెట్టిన అనంతరం ఇంత పెద్ద ఎత్తున బంగారాన్ని తరలించడం ఇదే ప్రథమం అని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్రిటన్ నుంచి బంగారం తరలింపు విషయంలో ఆర్థిక శాఖ, ఆర్బీఐ, ఇతరత్రా ఏజెన్సీలు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు, అత్యంత విలువైన లావాదేవీ కావడంతో చాలా గోప్యత పాటించినట్లు వివరించాయి. రవాణా సౌలభ్యం తదితర అంశాలు పసిడి తరలింపునకు కారణమని పేర్కొన్నా యి. ప్రస్తుతం దేశీయంగా ముంబై, నాగ్పూర్లో పటిష్టమైన వాల్టుల్లో బంగారాన్ని నిల్వ చేస్తున్నారు. తాజా పరిణామంతో దేశీయంగా భద్రపర్చిన మొ త్తం పసిడి పరిమాణం 408 టన్నులకు చేరింది. అధికారిక గణాంకాల ప్రకారం 2024 మార్చి ఆఖరు నాటికి భారత్ వద్ద మొత్తం 822 టన్నుల బంగారం ఉంది. ఇందులో సుమారు 413.79 టన్నులు విదేశీ వాల్టుల్లో ఉన్నాయి. గత కొన్నాళ్లుగా గణనీయంగా పసిడి కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో విదేశాల్లో దాన్ని నిల్వ చేయడాన్ని తగ్గించుకోవాలని భారత్ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తగ్గనున్న వ్యయాలు.. ఆర్థిక అస్థిరతలను ఎదుర్కొనడానికి దేశాలు కొన్న బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మొదలైన వాటి వాల్ట్లలో సురక్షితంగా నిల్వ చేస్తుంటాయి. ఇందుకు కొంత చెల్లిస్తుంటాయి. తాజాగా బంగారాన్ని మన దేశానికి తరలించి, ఇక్కడే నిల్వ చేయ డం వల్ల విదేశీ కస్టోడియన్లకు చెల్లించాల్సిన స్టోరేజీ ఫీజుల భారాన్ని ఆర్బీఐ తగ్గించుకోగలుగుతుంది. -
ఏడాదిలోగా రష్యా ఖజానా ఖాళీ.. పుతిన్కు షాకిచ్చిన వ్యాపారవేత్త!
మాస్కో: రష్యా ఖజానా ఏడాదిలోగా ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు ఆ దేశానికి చెందిన దిగ్గజ వ్యాపారవేత్త ఒలెగ్ డెరిపాక్స. సిబేరియాలో గురువారం జరిగిన ఆర్థిక సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలు గతేడాది కఠిన ఆంక్షలు విధించినా రష్యా ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందని అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించిన తర్వాత ఒలెగ్ అందుకు పూర్తి విరుద్ధంగా మాట్లాడటం గమనార్హం. ఉక్రయిన్తో యుద్ధం చేస్తున్న కారణంగా రష్యాపై పశ్చిమ దేశాలు అనేక ఆంక్షలు విధించి ఉక్కిరిబిక్కిరి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యుద్ధం వల్ల రష్యా ప్రభుత్వ ఖజనా ఖాళీ అవుతోందని, ఏడాదిలోగా ఏమీ మిగలని పరిస్థితి వస్తుందని ఒలెగ్ పేర్కొన్నారు. విదెశీ పెట్టుబడిదారుల అవసరం ఇప్పుడు రష్యాకు అత్యంత ముఖ్యం అని చెప్పారు. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం మొదలుపెట్టిన తొలినాళ్లలోనే దీన్ని ఆపేయాలని ఒలెగ్ బహిరంగంగా ప్రకటించారు. పశ్చిమ దేశాల నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యాకు ఇప్పుడు మిత్రదేశాలు ఆపన్నహస్తం అందించి కీలక పాత్ర పోషించాల్సి ఉందని ఒలెగ్ అభిప్రాయపడ్డారు.అయితే విదేశీ ఇన్వెస్టర్లకు రష్యా అనువైన పరిస్థితులు కల్పించి మార్కెట్లను ఆకర్షణీయంగా చేస్తేనే పెట్టుబడిదారులు ముందుక వస్తారని వివరించారు. ఉక్రెయిన్పై రష్యా గతేడాది ఫిబ్రవరిలో దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచి పశ్చిమ దేశాలు ఆ దేశంపై 11,300కు పైగా ఆంక్షలు విధించాయి. 300 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలను ఫ్రీజ్ చేశాయి. యుద్ధాన్ని వెంటనే ఆపాలని హెచ్చరించాయి. కానీ రష్యా మాత్రం వెనక్కి తగ్గకుండా ఏడాదిగా దండయాత్ర కొనసాగిస్తోంది. ఒక్క చైనా మాత్రమే రష్యాకు బాసటగా నిలిచింది. ఇంధనాన్ని భారీగా కొనుగోలు చేసింది. మెషీనరీ, బేస్ మెటల్స్ వంటి ఉత్పత్తులు సరఫారా చేసి పశ్చాత్య దేశాల స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నించింది. కానీ అది ఏమాత్రము రష్యా కోలుకునేందుకు సాయపడలేదు. చదవండి: ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి భారత్తో కలిసి పని చేస్తాం -
ఆధార్తో 58వేల కోట్లు మిగిలాయ్!
వాషింగ్టన్: ఆధార్ కార్డు పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు 900 కోట్ల డాలర్లు (రూ.58.22వేల కోట్లు) మిగిలాయని ఈ పథకం రూపశిల్పి నందన్ నీలేకని వెల్లడించారు. వాషింగ్టన్లో ‘డిజిటల్ ఎకానమీ–అభివృద్ధి’ అంశంపై అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్), ప్రపంచబ్యాంకు నిర్వహించిన ప్యానెల్ చర్చలో ఈయన పాల్గొన్నారు. వందకోట్లకు పైగా భారతీయులు ఆధార్ నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు. ఆధార్ కారణంగా లబ్ధిదారుల గుర్తింపులో అవినీతి గణనీయంగా తగ్గిందని నీలేకని పేర్కొన్నారు. ‘ఆధార్ వల్ల ప్రభుత్వానికి దాదాపు 9 బిలియన్ డాలర్లు మిగిలాయి. విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారా నకిలీలను అరికట్టడంతో సరైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. -
రూ.760 కోట్లు ఇన్పుట్ అప్లోడ్
అనంతపురం అగ్రికల్చర్ : పెట్టుబడిరాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) పంపిణీలో భాగంగా శనివారం నాటికి రూ.760 కోట్ల పరిహారంకు సంబంధించి జాబితాలు అప్లోడ్ చేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. జిల్లాకు మంజూరైన రూ.1,032.42 కోట్లలో రూ.760 కోట్లు బిల్లులు ట్రెజరీకి సమర్పించినట్లు తెలిపారు. ఇందులో రూ.500 కోట్లకు పైగా పరిహారం రైతుల ఖాతాల్లోకి జమ అయినట్లు తెలుస్తోందన్నారు. రెండు మూడు రోజుల్లో అప్లోడ్, పంపిణీ పూర్తీ చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఆ తర్వాత మిస్మ్యాచింగ్ జాబితాలు బ్యాంకుల వారీగా సేకరిస్తామని తెలిపారు. -
అవినీతి నిరోధానికి ట్రెజరీలో కొత్త విధానం
‘ఈ కుభేర్’ ద్వారా చెల్లింపులు సాక్షి, అమరావతి: ట్రెజరీల్లో జరుగుతున్న ఆన్లైన్ మోసాలు, అవినీతిని అరికట్టేందుకు ఆర్థిక శాఖ కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుడుతోంది. రిజర్వు బ్యాంకు పర్యవేక్షణలో నిర్వహించే ‘ఈ కుభేర్’ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకం వల్ల ట్రెజరీల్లో కుంభకోణాలు జరిగే అవకాశం లేకుండా కాంప్రహెన్సివ్ ఫైనాన్సియల్ మానిటరింగ్ సిస్టం (సీఎఫ్ఎమ్ఎస్)ను ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందుకు సంబంధించిన రాష్ట్ర విభాగాన్ని విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్లో ఏర్పాటు చేస్తున్నారు. ట్రెజరీల్లో కోట్లలో అవినీతి జరిగినట్లు తేలడంతో ప్రత్యేక విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్యాంకుల వారు ట్రెజరీలకు పంపిస్తున్న ఈ చెక్ను ఆయా ఖాతాలకు జనరేట్ చేసే సందర్భంలో నిధులు స్వాహా అవుతున్నందున ఈ విధానాన్ని సమగ్రంగా పరిశీలించి ప్రక్షాళన చేసేందుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే సీఎఫ్ఎమ్ఎస్ సిస్టం అమలు చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ట్రెజరీల్లో బిల్స్ జనరేట్ చేసే వారికి ప్రత్యేకంగా బయోమెట్రిక్ ట్రెజరీల్లో ఎవరెవరికి ఎటువంటి బిల్స్ ఇచ్చారో వివరాలు నమోదు చేసిన తరువాత వారు జనరేట్ చేస్తున్న బిల్స్కు సంబంధించి ప్రత్యేకంగా బయోమెట్రిక్ మిషన్లో ఆ ఉద్యోగి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఆన్లైన్లో ఏ ఉద్యోగి, ఏ అధికారి ద్వారా ఏ బిల్లు జనరేట్ అయిందో తెలిసి పోతుంది. దీంతో అక్రమాలు జరిగినప్పుడు బాధ్యులను పట్టుకోవడం సులువు అవుతుంది. సీఎఫ్ఎంఎస్ సిస్టం అమలు చేయడం ద్వారా ఆర్థిక శాఖకు కూడా ఎప్పటికప్పుడు వివరాలు తెలుస్తాయి. నిధులు స్వాహా అయ్యే అవకాశమే లేదని ఆర్థికశాఖ భావిస్తున్నది. -
గాడితప్పిన ‘ట్రెజరీ’ పాలన
►ఆర్నెళ్లుగా పత్తాలేని రెగ్యులర్ డీడీ ►మేడ్చల్ ఏటీఓకు ఇన్చార్జీ బాధ్యతలు ►సక్రమంగా లేని ఇన్చార్జి డీడీ పనితీరు ►అడ్డగోలుగా ఉద్యోగులకు డిప్యూటేషన్లు ►రాష్ట్ర ట్రెజరీ శాఖ డైరెక్టర్కు ఫిర్యాదు చేసిన జిల్లా ఉద్యోగులు ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : ఆర్నెళ్లుగా రెగ్యులర్ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) లేక జిల్లా ట్రెజరీ కార్యాలయ పాలన గాడితప్పింది. ఈ ప్రభావం బిల్లులు పాస్ చేయడం ఎస్టీఓలకు ఇబ్బందిగా మారింది. ఇదిలా ఉండగా శాఖలో ఇద్దరు సీనియర్ ఏటీఓలు ఉండగా.. మేడ్చల్ ట్రెజరీ శాఖ ఏటీఓ మోహన్రావుకు ఇన్చార్జి డీడీగా బాధ్యతలు అప్పగించడం శాఖలోని సీనియర్ ఏటీఓలతోపాటు ఎస్టీఓలను కూడా తీవ్ర నిరాశ పర్చింది. ఇన్చార్జి డీడీగా వచ్చిన మేడ్చల్ ఏటీఓ పనితీరు సక్రమంగా లేకపోవడం.. అడ్డగోలుగా అక్రమ డిప్యూటేషన్లు, అలాగే మహిళా ఉద్యోగులను పని పేరిట వేధిస్తున్నారనే ఆరోపణలతో 25 రోజుల క్రితం జిల్లా ట్రెజరీ శాఖ ఉద్యోగులు రాష్ట్ర ట్రెజరీ శాఖ డైరెక్టర్ కేఎస్ఆర్సీ మూర్తికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఇన్చార్జి డీడీగా ఉన్న మోహన్రావు ప్రస్తుతం అనారోగ్యం పేరిట సెలవులో వెళ్లినట్లు తెలిసింది. ట్రెజరీ ఉద్యోగుల ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర డైరెక్టర్ విచారణకు ఆదేశించగా.. ఇంత వరకు విచారణ జరగలేదు. ఆయన తీరే వేరు.. ట్రెజరీ శాఖకు రెగ్యులర్ డీడీగా గతేడాది ప్రభాకర్రెడ్డి పని చేశారు. ఆయన 2016 సెప్టెంబర్లో బదిలీ అయ్యారు. అప్పటి నుంచి నేటి వరకు జిల్లాకు ఆర్థికంగా కీలక శాఖ అయిన ట్రెజరీకి రెగ్యులర్ డీడీ లేరు. మధ్యలో హైదరాబాద్కు చెందిన యాదగిరికి ఇన్చార్జి డీడీగా బాధ్యతలు అప్పగించగా ఆయన కొద్ది రోజులు మాత్రమే పని చేశారు. తరువాత మేడ్చల్కు చెందిన ఏటీఓ మోహన్రావుకు బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచే శాఖలో విభజించు పాలించు అనే సూత్రాన్ని పాటిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మేడ్చల్ నుంచి జిల్లాకు వచ్చే సరికి మధ్యాహ్నం 3 గంటలు కావడం, తిరిగి సాయంత్రమే విధులు ముగించుకుని వెళ్లడం పరిపాటిగా మారింది. ఆయన వచ్చినప్పుడే రిజిస్టర్లో సంతకాలు చేసేవారు. కాగా.. మహిళ ఉద్యోగినులను రాత్రి తొమ్మిది గంటల వరకు పని చేయించి ఇబ్బందులకు గురి పెడుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. చివరికి రాత్రుల్లో పని చేసే వాచ్మన్తో పగలు కూడా పని చేయిస్తున్నట్లు తెలిసింది. నచ్చినట్లుగా డిప్యూటేషన్లు శాఖలో ఇన్చార్జి డీడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మోహన్రావు తనకు నచ్చిన విధంగా ఉద్యోగులను డిప్యూటేషన్ల పేరిట వివిధ ప్రాంతాలకు బదిలీ చేసినట్లుగా ఆరోపణలున్నాయి. పక్షం రోజుల క్రితం కొంత మంది అటెండర్లను ఇష్టం లేకున్నా ఎస్టీఓ కార్యాలయాలకు డిప్యూటేషన్లతో బదిలీ చేశారు. సీనియర్ అకౌంటెంట్ రవి కిరణ్ను ఇష్టం లేకున్నా బోధన్ నుంచి నిజామాబాద్కు డిప్యూటేషన్పై వేయించారనే ఆరోపణలు ఉండగా, ఎస్టీఓ గంగాకిషన్ను కూడా జిల్లా కార్యాలయం నుంచి భీమ్గల్, మళ్లీ భీమ్గల్ నుంచి నిజామాబాద్కు డిప్యూటేషన్ ఆర్డర్లను తీశారు. నెల రోజుల్లోనే 36 డిప్యూటేషన్లు, బదిలీలకు సంబంధించిన ఆఫీస్ ఆర్డర్లును తీశారు. కాగా తనపై రాష్ట్ర డైరెక్టరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన వారిలో ఉన్న నాల్గవ తరగతి ఉద్యోగిని బిల్లులేవి పాస్ చేయవద్దని సంబంధిత అధికారులకు ఇన్చార్జి డీడీ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. కాగా.. ట్రెజరీ శాఖలో ఇన్చార్జి డీడీగా ఉన్న మోహన్రావు బాటలోనే శాఖలో పని చేస్తున్న ఓ మహిళా ఇన్చార్జి ఏటీఓ కూడా నడుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పలు బిల్లులను పాస్ చేయకుండా తిరిగి పంపుతున్నారని తెలిసింది. ఇబ్బందుల్లో ట్రెజరీ ఉద్యోగులు రెగ్యులర్ డీడీ లేకపోవడం, ఉన్న ఇన్చార్జి డీడీ శాఖను పట్టించుకోకుండా అనారోగ్యం కారణంతో సెలవులో వెళ్లడంతో ట్రెజరీ శాఖ పాలన గాడితప్పుతోంది. ముఖ్యంగా మార్చి నెల ఆర్థిక సంవత్సరానికి ముగింపు కావడంతో జిల్లాలో ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు బిల్లులను పాస్ చేయించుకోవడం కోసం ట్రెజరీ కార్యాలయంలో రోజు బారులు తీరుతున్నారు. కానీ.. డీడీ లేకపోవడంతో పెన్షన్, తదితర ముఖ్యమైన బిల్లులు నిలిచిపోతున్నాయి. సమస్యలు ఎదురైతే ఎవరికి చెప్పుకోవాలో డీడీఓలకు పాలు పోవడం లేదు. ఇటు ఎస్టీలు కూడా డీడీ లేకుండా పని చేయడం ఇబ్బందిగా మారింది. మార్చి నెలాఖరితో ప్రభుత్వానికి బడ్జెట్ను సరెండర్ చేయాల్సి ఉండగా ప్రస్తుతం డీడీ లేక పనులు నిలిచిపోతున్నాయి. ఈ విషయంపై ప్రస్తుతం ట్రెజరీ శాఖకు తాత్కాలికంగా అధికారిగా వ్యవహరిస్తున్న ఏటీఓ పుష్పలతను ‘సాక్షి’ వివరణ కోరగా.. డీడీ అందుబాటులో లేకపోవడంతో కొన్ని ఫైళ్లను మేడ్చల్ వరకు తీసుకెళ్లి ఇన్చార్జి డీడీ మోహన్రావుతో సంతకాలు చేసుకుని వస్తున్నామని, బిల్లులు అన్నింటినీ పాస్ చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. -
గుప్తనిధుల తవ్వకాల ముఠా అరెస్టు...
ఉదయగిరి : ఉదయగిరి ప్రాంతం చుట్టూపక్కల పరిసర ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం ఇటీవల కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం ఉదయగిరికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లుగా తెలిసింది. కొన్నేళ్ల నుంచి ఉదయగిరి కొండపై ఉన్న పురాతన స్థావరాలపై విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తున్నారు. గత పది పదిహేను రోజుల నుంచి ఉదయగిరి దుర్గంపై కొంత మంది స్థానికులు, స్థానికేతరులు ముఠాగా ఏర్పడి తవ్వకాలు సాగిస్తున్న విషయం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈ వ్యవహారంలో ప్రమేయముందని భావిస్తున్న కొంత మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల ఆత్మకూరు ప్రాంతంలో అనంతసాగరం చెరువును గుప్తనిధుల కోసం తవ్వుతూ పోలీసులకు పట్టుబడిన వారిలో ఉదయగిరి వాసులు ఉన్నారు. -
ఖజానా ఖాళీ
- తలకిందులవుతున్న జెడ్పీ - పెద్ద నోట్ల రద్దుతో తగ్గిపోయిన రిజిస్ట్రేషన్లు - పడిపోయిన స్టాంప్ డ్యూటీ ఆదాయం - ఉచిత ఇసుకతో సీనరేజి ఆదాయానికీ గండి - అందని ఆర్థిక సంఘం నిధులు - గ్రాంటు ఇవ్వని ప్రభుత్వం - వచ్చే నెల నుంచి పెన్షన్లు ఇవ్వలేమంటున్న యంత్రాంగం భానుగుడి (కాకినాడ సిటీ) : పెద్ద నోట్ల రద్దు.. ప్రభుత్వ విధానాల పుణ్యమా అని జిల్లా పరిషత్ నడ్డి విరుగుతోంది. వివిధ రూపాల్లో రావాల్సిన ఆదాయానికి గండి పడడంతో ఖజానా ఖాళీ అవుతోంది. దీంతో అధికారులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ఆర్థిక పరిస్థితి తలకిందులవడంతో.. వచ్చే నెలలో రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడం కష్టమేనని స్వయంగా జెడ్పీ చైర్మనే చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నోటు పోటు పాత రూ.1000, రూ.500 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం, పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపేవారిపై ఆదాయపన్ను శాఖ ఓ కన్ను వేయడంతో.. జిల్లాలో భూముల క్రయవిక్రయాలు 70 శాతం పైగా పడిపోయాయి. జీఓ నంబరు 725/1998 ప్రకారం రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి జెడ్పీకి స్టాంపు డ్యూటీ, సర్చార్జి రూపంలో 1/5వ వంతు సొమ్ము జమ చేయాలి. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ రూపంలో రూ.12,19,39,000 జెడ్పీకి జమ అయ్యింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ ఆదాయం రూ.27 లక్షలకు మించలేదు. స్టాంపుడ్యూటీ, సర్చార్జి రూపంలో ఏడాదికి రూ.24 కోట్లు పైగా రావాల్సి ఉండగా, ఇప్పటివరకూ 50 శాతం మాత్రమే వచ్చింది. సీనరేజి ఆదాయానికి బ్రేక్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం అధికార పార్టీ దళారులకు కాసులు కురిపిస్తుండగా.. జెడ్పీ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండికొట్టింది. ఇసుక వేలం పాటల ద్వారా జెడ్పీకి మినరల్ సెస్సు సీనరేజి వాటా రూపంలో ఏటా రూ.100 కోట్లు పైగా ఆదాయం వచ్చేది. గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి రూ.33.12 లక్షలు వచ్చింది. అనంతరం మారిన ప్రభుత్వ నిబంధనలతో ఈ పద్దు కింద దమ్మిడీ ఆదాయం కూడా రాలేదు. మరోపక్క ప్రభుత్వం నుంచి జెడ్పీకి వివిధ పద్దుల రూపంలో రూ.59 కోట్లు రావాల్సి ఉంది. రెండేళ్ళ నుంచి ఈ నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ఆర్థిక సంఘం నిధులు లేవు.. తలసరి గ్రాంటు రాదు గతంలో గ్రామ పంచాయతీలకు జిల్లా పరిషత్ల నుంచి 14వ ఆర్థిక సం«ఘం నిధులు కేటాయించేవారు. కొద్దికాలంగా ఈ నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకే ఇస్తున్నారు. దీంతో జెడ్పీకి వచ్చే నిధుల శాతం సగానికి పడిపోయింది. అలాగే, జనాభా లెక్కల ప్రకారం 41,76,541 మందికి తలసరి రూ.4 చొప్పున గత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకూ రూ.75 లక్షల గ్రాంటు విడుదల చేశారు. తదనంతర కాలంలో ఈ నిధులు సైతం ప్రభుత్వం నుంచి సకాలంలో రావడంలేదు. ఆదాయం రూ.27 లక్షలు.. పెన్షన్లకు రూ.43 లక్షలు.. జెడ్పీలో పదవీ విరమణ పొందిన 465 మంది మినిస్టీరియల్ సిబ్బందికి ప్రతి నెలా రూ.43 లక్షల పెన్షన్ చెల్లిస్తున్నారు. ఇసుక సీనరేజి, స్టాంపు డ్యూటీ, ఇతర పద్దుల నుంచి వచ్చే ఆదాయాన్ని పెన్షన్లు, ఇతర పనులకు కేటాయించేవారు. ప్రస్తుతం ఖజానాలో రూ.27 లక్షలు మాత్రమే ఉంది. దీంతో వచ్చే నెల నుంచి పెన్షన్లు ఇవ్వలేమని సాక్షాత్తూ జెడ్పీ చైర్మనే చేతులెత్తేస్తున్నారు. ఆదాయం తగ్గిపోవడంతో ఈ ఏడాది రిటైరైన 21 మంది దరఖాస్తులను కూడా జెడ్పీ స్వీకరించలేదు. దీనిపై వారు లోకాయుక్తను కూడా ఆశ్రయించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం వచ్చే నెల నుంచి జెడ్పీ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.59 కోట్లు తక్షణమే ఇచ్చి ఆదుకోవాలని కోరాం. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు. నిధులు రాకుంటే వచ్చే నెలలో పెన్షన్లు ఇవ్వలేం. - నామన రాంబాబు, జెడ్పీ చైర్మన్ -
చెల్లింపులకు బ్రేక్
నిలిచిపోయిన రూ.100 కోట్ల బిల్లులు ఆరో తేదీ నుంచి ఇదే పరిస్థితి ఖాతాలను ఫ్రీజ్ చేసిన ప్రభుత్వం సాంకేతిక సమస్యే కారణమంటున్న అధికారులు ఆందోళన చెందుతున్న ఉద్యోగులు పుష్కరాలు, మహిళా పార్లమెంటేరియన్ సదస్సు వంటి కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి మాత్రం మొండిచేయి చూపుతోంది. ఆర్థిక లోటు ఉందంటూ వారికి సంబంధించిన వివిధ బిల్లులు చెల్లించేందుకు నిరాకరిస్తోంది. పలు ఖాతాలను సర్కారు ఫ్రీజ్ చేయడంతో జిల్లాలో దాదాపు రూ.100 కోట్ల చెల్లింపులు నిలిచిపోయాయి. దీనిపై ఉద్యోగులు మండిపడుతున్నారు. రామచంద్రపురం రూరల్ : జిల్లా ఖజానా కార్యాలయంలో చెల్లింపులకు బ్రేక్ పడింది. ఆర్థిక లోటు పేరుతో వివిధ ఖాతాలను ప్రభుత్వం ఫ్రీజ్ చేయడంతో ఈ నెల 6వ తేదీ నుంచి పలు హెడ్ అకౌంట్ల ద్వారా చెల్లింపులు నిలిచిపోయాయి. ఇప్పటివరకూ జిల్లావ్యాప్తంగా సుమారు రూ.100 కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోయాయి. ఉద్యోగులకు సంబంధిం చిన వివిధ బిల్లులతోపాటు, ఆర్థిక అవసరాల కోసం పెట్టుకున్న బిల్లులను కూడా నిలిపివేశారు. సరెండర్ లీవ్, టీఏ, కార్యాలయ నిర్వహణ, సప్లిమెంటరీ జీతాలు, జీపీఎఫ్, విద్యార్థుల స్కాలర్షిప్, అంగన్వాడీ వేతనా లు తదితర వాటికి సంబంధించిన బిల్లులు నిలిచిపోయిన వాటి లో ఉన్నాయి. దీంతో ఆయా వర్గాలవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ కార్యక్రమాలకు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం తమవరకూ వచ్చేసరికి ఈవిధంగా వ్యవహరించడం సరికాదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినపుడు ఉద్యోగులు తమ ఆర్జిత సెలవులను ప్రభుత్వానికి సరెండర్ చేసి సొమ్ము తీసుకుంటారు. అయితే ప్రభుత్వం ప్రస్తుతం వీటి చెల్లింపులు కూడా నిలిపివేసింది. టీఏ బిల్లుల పరిస్థితి కూడా ఇంతే. ప్రభుత్వ కార్యక్రమాలకు ఉద్యోగులు సొంత ఖర్చుతో హాజరై, ధించిన బిల్లులు పెట్టుకుంటారు. వీటి చెల్లింపులను కూడా నిలిపివేశారు. కార్యాలయ నిర్వహణ బిల్లులను కూడా నిలిపివేయడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారనుందని ఉద్యోగులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. అంగన్వాడీ వేతనాలను కూడా కార్యాలయ నిర్వహణ పద్దు నుంచి ఇస్తారు. వీటిని కూడా నిలిపివేశారు. -
చెల్లింపుల్లేవ్
ట్రెజరీలో బిల్లులు నిలిపివేత వేలల్లో పేరుకుపోతున్న బిల్లులు రూ.150 కోట్ల మేర చెల్లింపులకు బ్రేక్ ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలపై ఆంక్షలు ఖజానా మళ్లీ తెల్లమొహం వేసింది. కాసులు విదల్చను పొమ్మంది. దాంతో చెల్లింపులకు బ్రేక్పడింది. ట్రెజరీ ఉసూరనే పరిస్థితి ఎదురైంది. విస్తృతంగా చెల్లింపులు జరగాల్సిన తరుణంలో ప్రభుత్వం చేతులెత్తేయడంతో జిల్లా వ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఖజానా స్తంభన కారణంగా వందల కోట్ల చెల్లింపులు నిలిచిపోయాయి. వీటిలో రూ. 100 కోట్ల వరకు ఉపకార వేతనాలే ఉన్నట్టు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో తగిలిన షాక్ కారణంగా రాబడి తగ్గడంతో, మార్చి జీతాల కోసం ముందుజాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. విశాఖపట్నం : పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో గడిచిన మూడు నెలలుగా ఖజానాకు వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గింది. రిజిస్ట్రేషన్స్, సేల్, కమర్షియల్ టాక్స్ల వసూళ్లు సగానికి పైగా పడిపోయాయి. నోట్ల రద్దు సమయంలో నిధుల కొరత కారణంగా డిసెంబర్లో ట్రెజరీ చెల్లింపులపై ఆంక్షలు విధించారు. జనవరిలో మాత్రం చెల్లింపులపై ఆంక్షలు ఎత్తివేశారు. గత నెల రోజులుగా చెల్లింపులు సజావుగానే సాగినా మళ్లీ ఫిబ్రవరిలో చెల్లింపులపై ఆంక్షలు విధించారు. ఈ నెల 8 నుంచి ట్రెజరీ ద్వారా జరిగే అన్ని రకాల చెల్లింపులపై ఆంక్షలు విధించారు. మరో నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండడం, ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. వచ్చే నెలలో జీతాల చెల్లింపులకు ఆటంకం తలెత్తకుండా ఈ చర్య తీసుకున్నట్టు చెబుతున్నారు. నెలాఖరులో వెయ్యికిపైగా బిల్లులు జిల్లా ట్రెజరీ కార్యాలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా 13 సబ్ ట్రెజరీ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా ట్రెజరీ కార్యాలయానికి నిత్యం 500కు పైగా బిల్లులొస్తుంటాయి. నెలాఖరులో అయితే ఏకంగా వెయ్యికిపైగా ఉంటాయి. సబ్ ట్రెజరీ కార్యాలయాలకు నిత్యం 50 నుంచి 70 వరకు.. నెలాఖరులో 150 నుంచి 200 వరకు బిల్లులొస్తుంటాయి. రోజువారీ చెల్లింపులకు ఇక్కట్లు ట్రెజరీ ద్వారా వివిధ శాఖల రోజు వారీ ఖర్చులతో పాటు సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం నాలుగైదు కోట్లకు పైగా చెల్లింపులు జరుగుతుంటాయి. కారణాలు కూడా చెప్పకుండా 8 నుంచి ట్రెజరీ ద్వారా చెల్లింపులను అర్థాంతరంగా నిలిపివేశారు. ఇప్పటికే బ్యాంకులకు పంపిన బిల్లులను కూడా పాస్ కాకుండా ఆన్లైన్లో లాక్ చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల వద్ద పెండింగ్లో ఉన్న బిల్లుల విలువే రూ.150 కోట్లకుపైగా ఉంటుందని చెబుతున్నారు. ఇక ట్రెజరీ వద్ద పెండింగ్లో ఉన్న బిల్లుల విలువ మరో రూ.50 కోట్ల వరకు ఉంటుందంటున్నారు. నిధులొచ్చినా.. మోక్షం లేదు ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలకు సంబంధించి జిల్లాకు ఇటీవలే నిధులొచ్చాయి. వీటి కోసం ఆయా విద్యాసంస్థలు ఎదురు చూస్తున్నాయి. తమకు రావాల్సిన ఫీజు బకాయిలకు సంబంధించి అవసరమైన డాక్యుమెంట్స్తో ట్రెజరీకి బిల్లులు పెట్టాయి. ఉపకార వేతనాలకు చెందిన బిల్లులు కూడా దాఖలయ్యాయి. ఈ నెల 8 నుంచి వీటిని నిలిపి వేశారు. ఈ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల కింద చెల్లించాల్సిన రూ.100 కోట్లకు పైగా చెల్లింపులు ఆగిపోయాయని చెబుతున్నారు. ఇతర బిల్లులకు సంబంధించి మరో రూ.50 కోట్ల వరకు చెల్లింపులకు బ్రేకులు పడ్డాయంటున్నారు. జీతాలకు ఇబ్బంది లేకుండా.. శనివారం నుంచి జీతాలకు చెందిన బిల్లులు శాఖల వారీగా ట్రెజరీకి చేరుతున్నాయి. మార్చి 1న జీతాలు చెల్లించేందుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీటిని సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ ఆంక్షలు మార్చి నెలాఖరు వరకు కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. వచ్చే నెల ఆర్థిక సంవత్సరం ముగింపు నెల కావడంతో జీతభత్యాల వరకు చెల్లింపులకు ఇబ్బంది లేకున్నప్పటికి మిగిలిన చెల్లింపులకు అనుమతి నిచ్చే అవకాశం లేదంటున్నారు. దీంతో ప్రభుత్వ శాఖలు రోజువారీ కార్యకలాపాల కోసం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. -
ఖజానా కొర్రీలు
అడిషనల్ హెచ్ఆర్ఏ ఇవ్వకుండా ఇబ్బందులు ప్రభుత్వం స్పష్టత ఇచ్చినా పట్టించుకోని ట్రెజరీ అధికారులు రెండేళ్లుగా పెండింగ్లోనే.. హన్మకొండఅర్బన్ : వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు ప్రతి నెలా వేతనంతో పాటు ఇవ్వాల్సిన అదనపు హెచ్ఆర్ఏను ట్రెజరీ అధికారులు కొత్త నిబంధనలు చెపుతూ నిలిపివేశారు. 2015 ఏప్రిల్ నుంచి ఒక్కో ఉద్యోగి వేతనంతో పొందాల్సి ఉన్న సుమారు రూ.2వేల వరకు నగదు అందడం లేదు. కొర్రీలు పెడుతూ కాలయాపన చేస్తున్న అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. ఇటీవల టీఎన్జీఓస్ నేతలు అర్బన్ జిల్లా డీటీఓను కలిసి వినతిపత్రం కూడా అందజేశారు. ఎందుకు సమస్య.. ప్రస్తుతం అదనపు హెచ్ఆర్ఏ చెల్లింపులు చాలా జిల్లాలో డీటీఓలు విడుదల చేస్తున్నాయి. వరంగల్తోపాటు మరికొన్నిచోట్ల మాత్రమే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. 2015 ఏప్రిల్ నుంచి పీఆర్సీ అమలైన సమయంలో అదనపు హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వం వైద్యారోగ్యశాఖకు సంబందించి క్యాడర్ల వారీగా వివరాలు వెల్లడిచింది. అందులో ఎవరికి ఏహెచ్ఆర్ఏ వర్తిస్తుందో స్పష్టంగా చెప్పింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన వివరాల్లో ఏఎన్ఎంలను మెటర్నటీ అసిస్టెంట్లుగా పేర్కొన్నారు. ఆ క్యాడర్ వారికి ఏహెచ్ఆర్ఏ వర్తిస్తుందని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో మొదట 1960 నుంచి మెటర్నటీ అసిస్టెంట్లుగా ఉన్నవారిని తరువాత క్రమంలో వారి హోదాను1984లో ఏఎన్ఎంలుగా మార్చారు. ఆ తరువాత ఎన్ఎంల హోదాను మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్(ఎంపీహెచ్ఏఎఫ్) అని మార్చారు. దీనివల్ల ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎంపీహెచ్ఏ(ఎఫ్) అని లేనందున వారికి ఏహెచ్ఆర్ఏ ఇవ్వలేమని అందుకు రూల్స్ ఒప్పుకోవని డీటీఓలు బిల్లులు పాస్ చేయలేదు. దీంతో సమస్యను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడంతో ఈ విషయంలో స్పష్టత కూడా వచ్చింది. దీంతో జిల్లాలోని ములుగు, స్టేషన్ఘన్పూర్ తోపాటు ఇతర జిల్లాల్లో ఈ బిల్లులు పాస్ చేసి ఏహెచ్ఆర్ఏ చెల్లింపులు చేస్తున్నారు. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అర్బన్తో పాటు కొన్ని డీటీఓల్లో అధికారులు ససేమిరా అంటున్నారు. ఉద్దేశ పూర్వకంగా వేధిస్తున్నారు. టి.మాధవరెడ్డి టీఎన్జీఓస్(మెడికల్) అధ్యక్షుడు హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరణ వచ్చింది. మెటర్నటీ అసిస్టెంట్, ఎంపీహెచ్ఏ(ఎఫ్) ఒకటే అని చెప్పారు. ఈ విషయంలో కొన్ని డీటీఓల్లో అధికారులు బిల్స్ పాస్ చేశారు. కొన్ని చోట్ల మాత్రమే ఉద్దేశ పూర్వకంగా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అలవెన్సులు ఉద్యోగులు సకాలంలో పొందకుండా చేయడం మంచిదికాదు. ఈ విషయంలో కార్యాలయాల ఎదుట ఆందోళనకు సిద్ధమవుతాం. -
మైనింగ్ ఆదాయమే కీలకం
కొలిమిగుండ్ల: ఏపీకి వచ్చే ఆదాయ వనరుల్లో మైనింగ్ శాఖ కీలకంగా మారిందని భూగర్భ గనుల శాఖా మంత్రి పీతల సుజాత అన్నారు. నాపరాతిపై ఆన్లైన్ రాయల్టీ ధరను ప్రభుత్వం 8 నుంచి 5శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఆదివారం అంకిరెడ్డిపల్లె హైస్కూల్ ఆవరణలో ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి ఆధ్వర్యంలో అభినందనసభ నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి పీతల సుజాత హాజరయ్యారు. చరిత్రలో మొదటి సారిగా డిస్టిక్ మినరల్ ఫండ్(డీఎంఎఫ్)ను ప్రభుత్వం 30 నుంచి 10 శాతానికి తగ్గించినట్లు గుర్తు చేశారు. డీఎంఎఫ్ ద్వారా ఏటా కర్నూలు జిల్లా నుంచి రూ.50 కోట్ల ఆదాయం సమకూరుతోందని.. వాటిని జిల్లా అభివృద్ధికే వెచ్చించేలా సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారన్నారు. కొలిమిగుండ్ల మండలంలో అపార ఖనిజ సంపద విస్తరించినందునా పరిశ్రమల హబ్గా మార్చే దిశగా సీఎం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సిమెంట్ కంపెనీలు సకాలంలో పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే లీజు రద్దు చేస్తామన్నారు. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామి ఇచ్చారు. కార్యక్రమంలో భూగర్భ గనుల శాఖ రాష్ట్ర డైరక్టర్ శ్రీధర్, శిశు సంక్షేమ శాఖ ఆర్జెడీ శారద, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
ట్రెజరీ డీడీగా రాజు
నల్లగొండ నుంచి పదోన్నతిపై జిల్లాకు హన్మకొండ అర్బన్ : జిల్లా ట్రెజరీ డి ప్యూ టీ డైరెక్టర్గా జి.రాజును నియమిస్తూ ప్ర భుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిం ది. రాజు ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఏడీ హోదాలో ఇన్చార్జ్ డీడీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు పదోన్నతిపై జిల్లాకు డీడీ గా వస్తున్నారు. జిల్లాలో ఏడీ హోదాలో ఇన్చార్జ్ డీడీగా పనిచేస్తు న్న సత్యనారాయణ పదోన్నతిపై నల్లగొండ జిల్లాకు డీడీగా బదిలీ అయ్యారు. కాగా రాజు శనివారం విధుల్లో చేరనున్నారు. ఎస్టీఓ రమేష్కు పదోన్నతి.. ప్రస్తుతం డీటీఓలో వైద్య విభాగం ఎస్టీఓగా పనిచేస్తున్న రమేష్ ఏటీఓగా పదోన్నతి పొంది కరీంనగర్ జిల్లా పెద్దపల్లి సబ్ట్రెజరీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. -
కొత్త జిల్లాల్లో తొలి రోజే ట్రెజరీలు
జిల్లా కలెక్టర్లకు సీఎస్ రాజీవ్శర్మ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీ, అన్ని శాఖలు తమ కార్యకలాపాలు ప్రారంభించేలా సన్నాహక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆఫీసులకు అవసరమైన భవనాలను గుర్తించి, అవసరమైన ఫర్నీచర్ను సమకూర్చాలని చెప్పారు. కొత్త జిల్లాలు ఏర్పడ్డ తొలిరోజు నుంచే ట్రెజరీ అకౌంట్లను ప్రారంభించి, ట్రెజరీ కార్యాలయాలు పని చేసేలా చూడాలని ఆదేశించారు. కొత్త జిల్లాల్లో ఉద్యోగులను సర్దుబాటు చేసేటప్పుడు పదోన్నతులకు సంబంధించి పాత సీనియారిటీనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. దాని ఆధారంగానే పదోన్నతులు వస్తాయని ప్రకటించారు. జిల్లాలో వివిధ శాఖల్లో పని చేస్తున్న సిబ్బంది వివరాలు, సీనియారిటీ, పోస్టుల సంఖ్య వివరాలను వెంటనే పంపించాలని ఆదేశించారు. కొత్త జిల్లాలకు సంబంధించిన ఫైళ్లను వర్గీకరించి, క్రమ పద్ధతిలో ఆయా జిల్లాలకు అందించాలని చెప్పారు. ఫైళ్ల వివరాలను నమోదు చేయడానికి కొత్త జిల్లాలకు ఏర్పాటు చేసిన సాఫ్ట్వేర్ను ఉపయోగించాలని సూచించారు. కొత్త జిల్లాలకు కావాల్సిన ఉద్యోగులు, ఫర్నీచర్, ఫైళ్లు, వసతి సదుపాయాలు తదితర అంశాలపై సీఎస్ మంగళవారం సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, రాజకీయ ముఖ్య కార్యదర్శి అదర్సిన్హా, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ పాల్గొన్నారు. -
ట్రెజరీకి తాళాలు
సాక్షి, విశాఖపట్నం : ట్రెజరీకి మళ్లీ తాళాలు పడ్డాయి. చరిత్రలో తొలిసారిగా ఆన్లైన్లోనే సర్వర్ను బంద్ చేశారు. దీంతో ట్రెజరీ ద్వారా జరిపే చెల్లింపులన్నింటికి బ్రేకులు పడ్డాయి. రోజుకు రూ.20కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోగా..చివరకు తొలిసారిగా అంత్యక్రియల ఖర్చుల కోసం జరిపే చెల్లింపులపై కూడా ఆంక్షలు విధించారు. జిల్లా ట్రెజరీ కార్యాలయంతో పాటు 13 సబ్ ట్రెజరీ కార్యాలయాలున్నాయి. జిల్లా కార్యాలయంలో రోజుకు 200 నుంచి 500 వరకు బిల్లులు పాస్ చేస్తుంటారు. అదే ఒక్కొ సబ్ ట్రెజరీ కార్యాలయం పరిధిలో రోజుకు 30 నుంచి వంద వరకు ఉంటాయి. జిల్లా ట్రెజరీ కార్యా లయ పరిధిలో రోజుకు ఐదారుకోట్లవరకు చెల్లింపులు జరుగుతుంటాయి.అదే ఒక్కో సబ్ ట్రెజరీ కార్యాలయ పరిధిలో రోజుకు రూ.50 లక్షల నుంచి కోటిన్నర వరకు ఉంటాయి. జీతభత్యాలు కాకుండా జిల్లాలో రోజువారీ చెల్లింపులు రూ.20కోట్ల వరకు ఉంటాయి.ప్రతిరోజు శాఖల వారీగా వచ్చే బిల్లులకు తొలుత ఆయా ట్రెజరీ కార్యాలయాల్లో టోకన్ ఇస్తారు. మూడు దశల్లో వాటిని ఆడిట్ చేసిన తర్వాత పాస్ చేస్తారు. బ్యాంక్లకు లిస్ట్లు పంపిస్తారు. ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఆతర్వాత 25 బిల్లులు ఓ కట్టగా పంపిస్తారు. అలా వచ్చిన బిల్లులు, ఆన్లైన్లో తమ వద్దకు వచ్చిన లిస్టుల్లో ఉన్న బిల్లులను సరి చూసుకుని బ్యాంకులు పేమెంట్స్ చేస్తుంటాయి. సాధార ణంగా ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ప్రతి ఏటా మార్చి నెలాఖరున ట్రెజరీపై ఆంక్షలు విధిస్తుంటారు. ఎవరైనా ఉద్యోగి లేదా రిటైర్డ్ ఉద్యోగి చనిపోతే అంత్యక్రియలకయ్యే ఖర్చుల కోసం ముందస్తుగా జరిపే చెల్లింపులతో పాటు కొన్ని రకాల పేమెంట్స్ వరకు మినహాయింపు నిస్తారు. కానీ ట్రెజరీ చరిత్రలో తొలిసారిగా మొత్తం చెల్లింపులన్నింటిని బంద్ చేసారు. పుష్కరాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ట్రెజరీ ద్వారా జరిపే చెల్లింపులపై ఆంక్షలు విధించినట్టు ట్రెజరీవర్గాలు చెబుతున్నాయి. పుష్కరాల సాకుతో ట్రెజరీపై ఆంక్షలు విధించడంతో సాధారణ చెల్లింపులకు సైతం బ్రేకులు పడ్డాయి. ట్రెజరీ శాఖకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్లోనే ఓప్రత్యేక సర్వర్ ఉంటుంది. ఈసర్వర్ ఆధారంగానే ఆన్లైన్లో చెల్లింపులు జరుపుతుంటారు. ప్రస్తుతం ఈసర్వర్ను ఆపేశారని ట్రñ జరీ అధికారులు చెబుతు న్నారు. దీంతో రోజువారీ వివిధ శాఖలకు సంబంధించి జరిపే చెల్లింపులతోపాటు ఉద్యోగ వర్గాలకు ఇచ్చే లీవ్ ఎన్కేష్మెంట్ పేమెంట్స్, రిటైర్డ్ ఉద్యోగులకు పీఎఫ్, గ్రాట్యుటీ వంటి సెటిల్మెంట్స్ను సైతం నిలిపివేశారు. అలాగే ప్యూనరల్ పేమెంట్స్తోపాటు రోజువారీ ఖర్చు లకు సంబంధించిన బిల్లులకు సైతం బ్రేకులుపడ్డాయి. ఇలా రోజుకు జిల్లా వ్యాప్తంగా రూ.20 కోట్లకు పైగా ఉంటుందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ శాఖ అధికారులను సంప్రదిస్తే ప్రభుత్వాదేశాల మేరకే గురువారం నుంచి సర్వర్ను ఆపేశారని చెబుతున్నారు.పుష్కరాలయ్యే వరకు ఈ సర్వర్ పనిచేయదని ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. నెలాఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు లేకపోలేదని అధికారులంటున్నారు. -
యాహ్యా కేసులో ట్రెజరీ ఉద్యోగుల ప్రమేయంపై విచారణ
కామారెడ్డి: ఉద్యోగం చేయకుండానే ఉద్యోగ విరమణ పేరుతో ప్రభుత్వం నుంచి పింఛన్ పొందే ప్రయత్నంలో చిక్కిన యాహ్యా వ్యవహారంలో ట్రెజరీ ఉద్యోగుల ప్రమేయంపై ఆ శాఖ జిల్లా ఉప సంచాలకులు ప్రభాకర్రెడ్డి శుక్రవారం విచారణ నిర్వహించారు.స్థానిక ట్రెజరీ కార్యాలయానికి వచ్చిన ఆయన అప్పట్లో పనిచేసిన ఉద్యోగులతో మాట్లాడారు. యాహ్యాకు ఎవరు సహకరించారన్న విషయాలను తెలుసుకున్నారు. రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాఖాపరమైన విచారణ జరపడానికి తాను వచ్చానని, నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తానని చెప్పారు. -
సర్కారు ఆర్థిక ఎదురీత!
* ఆదాయ వృద్ధిని మించిన ఖర్చులు * ఇరిగేషన్కు ఈ నెలలో బిల్లుల చెల్లింపు వాయిదా * అత్యవసరమైతేనే మిగతా బిల్లులివ్వాలని ట్రెజరీలకు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: కొత్త ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో గణనీయమైన ఆదాయ వృద్ధిని సాధించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో మాత్రం ఆర్థికంగా ఎదురీదుతోంది. ఖర్చులన్నీ ఒక్కసారిగా ముంచుకురావటంతో గడ్డు కాలాన్ని చవిచూస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఉద్యోగుల జీతాలు మినహా ఇతరత్రా బిల్లుల చెల్లింపులన్నీ నిలిపివేసింది. ఈ మేరకు అన్ని ట్రెజరీ కార్యాలయాలకు ఆర్థికశాఖ మౌఖిక అదేశాలు జారీ చేసింది. జీతాలు మినహా బిల్లులేవీ విడుదల చేయొద్దని ఆంక్షలు విధించింది. రైతుల రుణమాఫీకి సంబంధించి మూడో విడతగా ఇవ్వాల్సిన రూ. 4,040 కోట్లలో రూ. 2,020 కోట్లను ఇటీవలే విడుదల చేసిన ప్రభుత్వం మిగతా సగం నిధులను ఈ నెలాఖరున చెల్లించాల్సి ఉంది. దీంతో రుణమాఫీకి సరిపడా నిధులను సర్దుబాటు చేయడాన్ని ఈ నెలలో ఆర్థికశాఖ మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే నీటిపారుదలశాఖ పరిధిలో ఈ నెలలో ఇవ్వాల్సిన బిల్లులను నిలిపివేసింది. ఈ ఏడాది బడ్జెట్లో నీటిపారుదలశాఖకు రూ. 25 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం...ప్రాజెక్టుల పనులన్నీ వేగంగా చేపట్టేందుకు ఈ శాఖకు ప్రతి నెలా రూ. 2,000 కోట్లు చెల్లిస్తోంది. తొలి మూడు నెలలు నిధులు విడుదల చేసిన ఆర్థికశాఖ ప్రస్తుత ఇక్కట్ల దృష్ట్యా జూలై కోటాను విడుదల చేయలేదు. దీంతో ప్రాజెక్టుల పరిధిలో బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయి. కొన్ని బిల్లుల చెల్లింపు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని, వెంటనే చెల్లించాల్సిన బిల్లులు వారం వాయిదాపడే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఆదాయం పెరిగినా ఖర్చులెక్కువ గతేడాదితో పోలిస్తే రాష్ట్ర ఆదాయం భారీగా పెరిగింది. సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 24 శాతానికిపైగా వృద్ధి చెందింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కమర్షియల్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సేల్స్, ట్రాన్స్పోర్ట్, గనులు తదితర శాఖల ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ. 10 వేల కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. తొలి రెండు నెలల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్శాఖ ద్వారా వచ్చిన ఆదాయం నిరుటి కంటే 64 శాతం పెరిగింది. ఎక్సైజ్ శాఖలో 120 శాతం ఆదాయం పెరిగింది. లగ్జరీ టాక్స్ల ద్వారా వచ్చే ఆదాయం 36 శాతం, అమ్మకపు పన్ను ద్వారా వచ్చిన ఆదాయం 17 శాతం పెరిగింది. అయితే ఈ నెల అంతకుమించి ఖర్చులుండటంతో నిధుల కటకట తలెత్తింది. సగటున ప్రతి నెలా రాష్ట్రంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ. 4,000 కోట్ల నుంచి రూ. 5,000 కోట్లకు మించదు. కానీ రూ. 5,000 కోట్లకు మించి ఈ నెల చెల్లింపులు చేయాల్సి ఉండటంతో సమస్య తలెత్తిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కరువు పరిస్థితుల నేపథ్యంలో చేపట్టిన కార్యక్రమాలతోపాటు రైతుల రుణమాఫీ, ఆసరా పెన్షన్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు చెల్లింపులు, విద్యుత్, బియ్యం సబ్సిడీలు, ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులన్నీ ఏకకాలంలో చుట్టుముట్టాయి. దీనికితోడు ప్రభుత్వ భూములు, ఆస్తుల అమ్మకం ద్వారా వస్తుందనుకున్న ఆదాయం సమకూరకపోవటం ప్రతికూలంగా మారింది. పెండింగ్లోనే ఇన్పుట్ సబ్సిడీ జూన్లోనే మూడో విడత రైతు రుణమాఫీకి రూ. 4,250 కోట్లు సమకూర్చటం అనివార్యం కావటంతో ముందుగా ఈ నిధులను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు పడింది. అందుకే ఖరీఫ్ సమయం ముంచుకొచ్చినా కరువు మండలాల్లో పంట నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని సైతం పెండింగ్లో పెట్టింది. ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 820 కోట్లు విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా మరో రూ. 198 కోట్లు జత చేయాల్సి ఉంది. కానీ నిధుల కటకటతోనే ఇప్పటికీ చెల్లింపులు చేయలేదు. ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు ఈ నెలలో పెంచాల్సిన డీఏ, తొమ్మిది నెలల పీఆర్సీ బకాయిలను ప్రభుత్వం ఇప్పటికీ పెండింగ్లో పెట్టింది. సర్వర్ డౌన్ పేరుతో దాదాపు రూ. 3,000 కోట్లకుపైగా బిల్లులు ఆపేసినట్లు వివిధ శాఖల అధికారులు చెబుతున్నారు. మరోవైపు సెర్ప్ ఉద్యోగుల జీతాలకు ఆసరా పెన్షన్లు, ఎన్ఆర్ఎల్ఎం పథకాలకు వినియోగించే నిధులను దారి మళ్లించి వేతనాలు సర్దుబాటు చేసింది. -
ఖజానా భర్తీకి ‘పంచతంత్రం’
సాక్షి, సిటీబ్యూరో: ఖాళీ అవుతున్న ఖజానాను నింపుకునేందుకు జీహెచ్ఎంసీ శరవేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి రూ.500 కోట్లు డ్రా చేసుకున్న జీహెచ్ఎంసీ.. పరిస్థితి మెరుగపడకుంటే రెండునెలల తర్వాత సిబ్బంది వేతనాల చెల్లింపులు సైతం కష్టంగా మారనుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఐదు రకాల పన్నుల ద్వారా ఆదాయం పెంపునకు పంచతంత్రాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ట్రేడ్ లెసైన్సుల ఫీజులపై దృష్టి సారించింది. ట్రేడ్ లెసైన్సుల కోసం జీహెచ్ఎంసీలో పేర్లు నమోదు చేసుకున్న వ్యాపార సంస్థలు 1.50లక్షల వరకు ఉన్నప్పటికీ వాటిల్లో 48 వేల సంస్థలు కూడా ఫీజులు చెల్లించడం లేదు. వాణిజ్యపన్నుల శాఖ వద్ద ఉన్న వివరాలను చూసినా లక్షా పదివేలకు పైగా వ్యాపారాలున్నాయి. వీటన్నింటినుంచీ రావాల్సిన ట్రేడ్ లెసైన్సు ఫీజు వసూలైతే జీహెచ్ఎంసీకి వంద కోట్ల మేర ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కానీ, గత ఆర్థిక సంవత్సరం రూ. 30 కోట్లు కూడా వసూలు కాలేదు. దీంతో వ్యాపార సంస్థలన్నింటి వివరాలు జల్లెడ పట్టేందుకు జీహెచ్ ఎంసీ సిద్ధమైంది. ఇందులో భాగంగా సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు మొదలు బిల్ కలెక్టర్లు, లెసైన్స్ ఆఫీసర్లు, శానిటేషన్ సిబ్బందితో సహ సమస్త యంత్రాంగం వ్యాపార సంస్థల వివరాలన్నింటినీ సేకరించనుంది. ఆపై ట్రేడ్ లెసైన్సులు లేని వారిని లెసైన్సులు తీసుకునేలా చర్యలు చేపడతారు. లై సెన్సులున్న వారి నుంచి ఫీజులు వసూలు చేస్తారు. ఆన్లైన్ ద్వారా సులభంగా ఫీజు చెల్లించే విధానాన్ని వివరిస్తారు. ఇలా..అతిత్వరలో ట్రేడ్ లెసైన్సుల ఫీజుల కోసం స్పెషల్ డ్రై వ్ నిర్వహించాలని కార్యాచరణ సిద్ధం చేశారు. అంతేకాకుండా లెసైన్సు పరిధిలోకి కొత్త సంస్థలను తేనున్నారు. మొబైల్ కంపెనీలు, వైన్స్ దుకాణాలు, హాస్టళ్లు తదితరమైన వాటికి సంబంధించి ట్రేడ్లెసైన్సు ఫీజులు వసూలు చేసే అంశంలో స్పష్టత లేదు. వీటిపై స్పష్టత నిస్తూ జీవోలను సవరించే అవకాశం ఉంది. -
ట్రెజరీలో కుర్చీలాట
కీలక సెక్షన్ల కోసం కుమ్ములాట ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరు విభేదాలతో బజారుకెక్కుతున్న ఖజానా శాఖ సామాజిక వర్గాలుగా విడిపోయిన వైనం కరీంనగర్/ముకరంపుర: కరీంనగర్ జిల్లా ఖజానా శాఖలో కుర్చీలాట తారాస్థాయికి చేరింది. ఉద్యోగుల మధ్య ఆధిపత్యపోరు, అవినీతి ఆరోపణలు ఆ శాఖను బజారుకీడుస్తున్నాయి. కీలక సెక్షన్లలో తమ వర్గానికి చెందిన ఉద్యోగులే కూర్చోవాలనే పట్టుదలతో ఉన్న కొందరు నాయకులు ఈ గొడవలకు ఆజ్యం పోస్తున్నారు. ఒకరిద్దరు నాయకులైతే ఏకంగా కులం కార్డును కూడా ప్రయోగిస్తుండటంతో ఖజానా శాఖ ఉన్నతాధికారు లు బెంబేలెత్తిపోతున్నారు. ఉన్నతాధికారి మెతకతనంవల్లే ఇదంతా జరుగుతోందని కొందరు ఉద్యోగులు ఆరోపిస్తుంటే... ఒక సామాజికవర్గానికే సదరు ఉన్నతాధికారి వత్తాసు పలుకుతూ తమను పక్కనపెడుతున్నారంటూ మరో సామాజికవర్గ ఉద్యోగులు రుసరుసలాడుతున్నారు. తాజాగా సెక్షన్ల మార్పు వ్యవహారం రెండు ఉద్యోగ సంఘాల మధ్య మరింత చిచ్చురేపింది. ఇరువర్గాల ఉద్యోగులు రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్లారు. ఉద్యోగుల మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరుతో బెంబేలెత్తిపోయిన ఉన్నతాధికారి తాను ఇక్కడ పనిచేయలేనంటూ కలెక్టర్ను కలిసి గోడు వెళ్లబోసుకోవడం గమనార్హం. తప్పులను సరిదిద్దాల్సిందిపోయి... ఖజానా శాఖలో ఓ అధికారి పొరపాటు కారణంగా రూ.4.95 కోట్ల స్కాలర్షిప్ సొమ్ము అదనంగా ఖాతాల్లో జమ చేశారు. ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో అధికారులు సొమ్ము రికవరీకి నానాపాట్లు పడ్డారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ నీతూప్రసాద్ బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సూచించారు. అదే సమయంలో ఈ వ్యవహారంపై ఆ శాఖ డెరైక్టర్ భీమారెడ్డి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెక్కుల చెల్లింపులకు సంబంధించి అథరైజర్-1గా డీడీ, అథరైజర్-2గా ఎస్టీవో ఉండాలని ఆదేశించి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఖజానా శాఖ కార్యాలయంలో రెండేళ్లకుపైగా ఒకే సీటులో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరినీ ఇతర సెక్షన్లకు మార్చాలని ఉప సంచాలకుడు శ్రీనివాస్ నిర్ణయం తీసుకుని గత నెల మూడో వారంలో సర్క్యులర్ జారీ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకుల మధ్య ఈ మేరకు ఒప్పుకున్నటు తెలిసింది. అయితే తాజాగా జరిగిన సెక్షన్ల మార్పులో స్కాలర్షిప్పు సొమ్ము అదనపు చెల్లిం పుల్లో బాధ్యుడిగా పేర్కొన్న అధికారికి ఆయన కోరుకున్న సీటును కట్టబెట్టారని ఆయన ప్రత్యర్థులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారి తీరుపై ప్రత్యర్థి ఉద్యోగులు మండిపడుతున్నారు. స్కాలర్షిప్ అదనపు చెల్లింపుల్లో బాధ్యులపై చర్యలు తీసుకోకుండా కోరుకున్న స్థానాన్ని కట్టబెట్టడమేంటని పేర్కొంటూ సదరు ఉన్నతాధికారిని కలిసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇప్పటికే బజారునపడ్డ ఖాజానా శాఖ వ్యవహారంపై కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. పాలనా సౌలభ్యం కోసమే సెక్షన్ల మార్పులు - ట్రెజరీ డీడీ శ్రీనివాస్ పరిపాలనా సౌలభ్యం కోసమే అంతర్గతంగా అధికారుల సెక్షన్లలో మార్పులు చేశాం. సెక్షన్ల మార్పు విషయంలో సామాజికవర్గ కోణం అంశం లేవనెత్తినందున ఎస్టీవో మల్లేశంకు పాత సెక్షన్ కేటాయించాం. -
పెట్రోల్, మద్యంతోనే ఖజానాకు కిక్కు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వృద్ధి రేటు ప్రధానంగా రెండు అంశాలపైనే ఆధారపడి ఉందని మరోసారి రుజువైంది. ఒకటి మద్యం, రెండోది పెట్రోల్ ఉత్పత్తులు. ఈ రెండింటి కారణంగానే 2015-16 బడ్జెట్ లక్ష్యాలకు అనుగుణంగా 95.4 శాతం పన్ను వసూళ్లు సాధ్యమైంది. రాష్ట్రంలోని 12 డివిజన్లతో పాటు పెట్రో ఉత్పత్తులు, మద్యం, ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్యూస్) నుంచి ఏడాదిలో రూ.31,117. 94 కోట్ల పన్నులను వసూలు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అధికారులతో పని లేకుండానే.. వాణిజ్యపన్నుల శాఖకు మద్యం, పెట్రో ఉత్పత్తులపై విధించే పన్నుల ద్వారానే సగం రెవెన్యూ సమకూరుతుండడం గమనార్హం. 2015-16 ఆర్థిక సంవత్సరంలో మద్యం నుంచి 'ఎక్సైజ్ బై వ్యాట్' ద్వారా రూ.8168.99 కోట్లు, పెట్రోల్, డీజిల్పై విధించే పన్నుల ద్వారా రూ.6485.48 కోట్లు వసూలైంది. సింగరేణి, ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్ వంటి ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రూ.1457.06 కోట్లు పన్నుల రూపంలో వసూలైంది. అంటే ఈ మూడు ప్రధాన పద్దుల ద్వారా వచ్చిన మొత్తం ఏకంగా రూ.16,111.53 కోట్లు కావడం గమనార్హం. ఈ మొత్తం వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సంబంధం లేకుండా సర్కారు ఖజానాకు అందుతుండటం మరో విశేషం. రాష్ట్రంలోని 12 డివిజన్ల నుంచి అధికారులు, సిబ్బంది వసూలు చేసే పన్నులు రెవెన్యూ రూపంలో సమకూరుతున్నాయి. 12 డివిజన్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో రూ. 15,006.40 కోట్లు వసూలైంది. 12 డివిజన్లలో కూడా పంజాగుట్టలో రూ. 2422.30 కోట్లు వసూలు కాగా, అత్యల్పంగా ఆదిలాబాద్ డివిజన్లోరూ. 314.32 కోట్లు మాత్రమే ఖజానాకు చేరింది. -
వెయ్యి కోట్లు తాగేశారు
11 నెలల్లోనే రూ. 11,450 కోట్ల ‘మద్యం’ విక్రయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మందుబాబుల జోరుతో మద్యం విక్రయాలకు కిక్కొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పది జిల్లాల్లో సగటున నెలకు రూ. వెయ్యి కోట్లకుపైగా విలువైన ‘సుక్క’ అమ్ముడైంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు నెల ముందే (ఫిబ్రవరి నెలాఖరు వరకు) సుమారు రూ. 11,450 కోట్ల ఆదాయంతో ప్రభుత్వ ఖజానా గలగలలాడుతోంది. గత ఆర్థిక ఏడాది (2014-15) తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ (టీఎస్బీసీఎల్) రూ. 10,888 కోట్ల మద్యం అమ్మకాలు సాగించగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే ఆ విక్రయాలను సంస్థ అధిగమించింది. ఈ నెలలో సాగే అమ్మకాలతో ఆదాయం రూ. 13 వేల కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు టీఎస్బీసీఎల్ అధికార వర్గాలు తెలిపాయి. వేసవి ప్రభావం నేపథ్యంలో బీర్ల అమ్మకాలు ఈనెలలో పెరుగుతాయని భావిస్తున్నారు. మద్యం అమ్మకాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా, అనూహ్యంగా ఆదిలాబాద్ రెండో స్థానంలో ఉండడం గమనార్హం. హైదరాబాద్ జిల్లా పరిధిలో రూ. 2,656 కోట్ల మద్యం అమ్మకాలు సాగగా ఆదిలాబాద్లో రూ. 1,629 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. గుడుంబా విక్రయాలపై ఉక్కుపాదం మోపడం, మహారాష్ట్ర నుంచి దిగుమతి అయ్యే దేశీదారుకు అడ్డుకట్ట వేయడం వల్లే ఆదిలాబాద్లో మద్యం అమ్మకాలు భారీగా పెరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. రంగారెడ్డి, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఖమ్మం జిల్లాలో సుంకం చెల్లించని మద్యం (ఎన్డీపీఎల్) అమ్మకాలు పెరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అక్కడ అతితక్కువగా 553 కోట్ల మద్యమే అమ్ముడైంది. రెవెన్యూ రూ. 3,484 కోట్లే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో ఎక్సైజ్శాఖకు మద్యం విక్రయాల ద్వారా రూ. 11,450 కోట్లు, లెసైన్సు ఫీజుల రూపంలో రూ. 1,752 కోట్లు, ప్రివిలేజ్ ఫీజు ద్వారా రూ. 351 కోట్లు వసూలైనా నికర ఆదాయం మాత్రం తక్కువగానే లభించింది. మద్యం విక్రయాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం నుంచి ‘వ్యాట్ బై ఎక్సైజ్’ రూపంలో రూ. 7,269 కోట్లు వాణిజ్యపన్నులశాఖ ఖాతాకు బదిలీకాగా ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్)కి రూ. 204 కోట్లు జమయ్యాయి. ఇతర ఖర్చులు, చెల్లింపులుపోగా ఆబ్కారీశాఖకు నికరంగా రూ. 3,484 కోట్ల ఆదాయమే లభించింది. గత 11 నెలల్లో జిల్లాలవారీగా మద్యం విక్రయాలు (రూ. కోట్లలో) జిల్లా మద్యం అమ్మకాలు హైదరాబాద్ 2,656 ఆదిలాబాద్ 1,629 కరీంనగర్ 654 ఖమ్మం 553 మెదక్ 773 మహబూబ్నగర్ 1,197 నల్లగొండ 841 నిజామాబాద్ 1,176 రంగారెడ్డి 1,261 వరంగల్ 709 -
ట్రెజరీలో ఇక ఈ-పాలన
అన్ని ప్రభుత్వ శాఖల బిల్లులను ఆన్లైన్లోనే ట్రెజరీకి సమర్పించాలి ఏప్రిల్ నుంచి పేపర్లెస్ వర్క్ ఉద్యోగులకు అందనున్న పారదర్శక సేవలు ఒంగోలు టూటౌన్: ట్రెజరీలో ఇక పూర్తి స్థాయి ఆన్లైన్ సేవలు ప్రారంభం కానున్నాయి. పేపరు కట్టలు (ఉద్యోగుల జీత భత్యాల బిల్లులు) కనపడని పరిస్థితి రాబోతోంది. కాగిత రహిత పాలనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వ శాఖల నుంచి వచ్చే బిల్లులతో పాటు ఇతరత్రా బిల్లులన్నీ ఆన్లైన్ ద్వారానే ట్రెజరీకి వచ్చేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది. నూతన ఆన్లైన్ వ్యవస్థ వలన జీపీఎఫ్ అమలులో పొరపాట్లకు తావులేకుండా ఉంటుందని ట్రెజరీ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి పేపరు కట్టలు (బిల్లులు) లేకుండా ఈ కొత్త విధానం అమలు చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు ట్రెజరీకి పేపరు బిల్లులు, ఆన్లైన్ సేవలు రెండూ అందిస్తూ వస్తున్నారు. ఈ రెండింటిలో పేపరు పనికి స్వస్తి చెప్పి.. ఏప్రిల్ నుంచి ఆన్లైన్ సేవలు పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. అందులో భాగంగానే గత నెల 25న కృష్ణా జిల్లా నూజివీడులో రాష్ట్రంలోని అన్ని ట్రెజరీ అధికారులకు, ఉద్యోగులకు ఆన్లైన్ సేవలపై ఒక రోజు వర్క్షాపు నిర్వహించారు. ఈ వర్క్షాపులో ట్రెజరీశాఖ స్టేట్ డెరైక్టర్ కనకవల్లి, అడిషనల్ డెరైక్టర్ హనుమంతరావు, జాయింట్ డెరైక్టర్ శివప్రసాద్ పాల్గొన్నారు. పే-రోల్ ప్యాకేజి, పెన్షన్స్ అకౌంట్స్, ఆన్లైన్ సేవలపై సమీక్షించినట్లు వర్క్ షాపునకు వెళ్లిన ట్రెజరీ ఉద్యోగులు తెలిపారు. మన జిల్లా నుంచి డిప్యూటీ డెరైక్టర్ ఎ.లక్ష్మికుమారి, 10 మంది సబ్ ట్రెజరీ ఉద్యోగులు వర్క్ షాపునకు వెళ్లారు. జిల్లాలో మొత్తం 12 ఉపఖజానా కార్యాలయాలున్నాయి. మొత్తం 24 వేల మందికిపైగా ఉద్యోగులు, 21,398 మంది పెన్షనర్స్ ఉన్నారు. వీరందరూ ఖజానా శాఖ ద్వారా వేతనాలు, పెన్షన్లను ప్రతి నెలా పొందుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఏప్రిల్ నుంచి ఉద్యోగులకు సమర్ధవంతంగా పొరపాట్లు లేని సేవలను ట్రెజరీ శాఖ ద్వారా అందిస్తామని ట్రెజరీ ఉద్యోగులు చెబుతున్నారు. -
ఏసీబీ దాడితో అధికారికి గుండెపోటు
ఖమ్మం: ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ట్రెజరీలో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సీనియర్ అసిస్టెంట్ తోటకూర శ్రీనివాస్ రూ. 2500 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఏసీడీ ఆకస్మిక దాడులతో ఊహించిన శ్రీనివాస్ గుండెపోటుకు గురైయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ట్రెజరీకి మళ్లీ తాళాలు
నిలిచిన 3,500 బిల్లులు స్తంభించిన రూ.250కోట్ల చెల్లింపులు ఆగిన రూ.50కోట్ల సామాజిక పింఛన్లు విశాఖపట్నం: ఖజానాకు మళ్లీ తాళాలు పడ్డాయి. వేలాది బిల్లులు నిలిచిపోయాయి. వందల కోట్ల చెల్లింపులు ఆగిపోయాయి. ఎక్కడికక్కడ కొర్రీలు వేయడంతో వేలాది మంది చిరుద్యోగులు ఇళ్లల్లో పండగ సందడి లేకుండా పోయింది. ఒకవైపు ఉత్సవాలు..సంబరాలు అంటూ మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేస్తున్న సర్కార్ ఆర్ధిక లోటు సాకుతో చెల్లింపులను నిలిపివేసింది. గత నెల 25వ తేదీ నుంచి చెల్లింపులకు బ్రేకులు పడ్డాయి. సెప్టంబర్ నెలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు,కొద్దిమంది రిటైర్డు ఉద్యోగులకు మాత్రమే పింఛ న్లను చెల్లించారు. ఇతర బిల్లులను పూర్తిగా నిలిపి వేసింది. ట్రెజరీలో బిల్లులు పాసవుతున్నా...బ్యాంకులకు చేరకుండానే హైదరా బాద్ స్థాయిలో బ్రేకులేస్తున్నారు. కొన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన రిటైర్డు ఉద్యోగులకు సామాజిక పింఛన్లతో పాటు అంగన్వాడీ టీచర్లు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలనుకూడా నిలిపివేసింది. సామాజిక పింఛన్ల కింద వివిధ శాఖలకు చెందిన రిటైర్డు ఉద్యోగులకు రూ.50కోట్ల మేర చెల్లింపులునిలిచిపోయాయి. ఇక గత రెండు మూడు నెలల్లో రిటైర్ అయిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ను నిలిపివేశారు. లీవ్ ఎన్క్యాష్ మెంట్, సరండర్ లీవ్ బిల్లులు ఆపేశారు. అంగన్వాడీ టీచర్లు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీతభత్యాల చెల్లింపులను నిలిపివేశారు. వీరికి వేతనాల రూపంలో చెల్లించాల్సిన రూ.25కోట్ల వరకు నిలిపివేశారు. 13వ, 14వ ఆర్ధిక సంఘానికి చెందిన నిధుల చెల్లింపులు కూడా ఆపేశారు. ట్రెజరీ పరిధిలో 3,500 బిల్లులకు సంబంధించి రూ.250కోట్లకు పైగా చెల్లింపులు నిలిచిపోయినట్టు అంచనా. -
అర్చకుల కంటతడి ప్రభుత్వానికి మంచిది కాదు
హైదరాబాద్: ఇంట్లో భార్య, రైతు ఇంట్లో ఎద్దు ఏడిస్తే మంచిది కాదని, అర్చక వర్గం కంటతడి పెడుతూ రోడ్డెక్కితే రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. అర్చకులు, ఉద్యోగులకు 010 కింద ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరుతూ తెలంగాణ దేవాలయాల అర్చకులు, ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులుగా జరుగుతున్న సమ్మెలో భాగంగా అర్చకులు, ఉద్యోగులు హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద రెండో రోజు నిరాహారదీక్షలు చేశారు. ఈ దీక్షా శిబిరానికి వచ్చిన పొంగులేటి వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గుడికి వచ్చే రాజకీయ నాయకులు, వారి కుటుంబాలను బాగుండాలని దీవించే అర్చకులను రోడ్డుపై ఆందోళనలు చేసే విధంగా చేయడం దుర్మార్గమని ప్రభుత్వాన్ని విమర్శించారు. త్రిసభ్య కమిటీతో ఆగస్టు 1 లోపు సమస్యలను పరిష్కారం చేస్తానని చెప్పిన సీఎం ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదన్నారు. తెలంగాణ యాసలో ప్రజలను మభ్య పెట్టినట్లే అర్చకుల విషయంలోనూ చేస్తే భగవంతుడే తగిన తీర్పు చెపుతారన్నారు. అర్చకులు, ఉద్యోగుల వేతనాలను 010 కింద ట్రెజరీల ద్వారా చెల్లించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకుని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని విద్యార్థులు, యువకులు, రైతులు ఉద్యమించారని, ఉడతాభక్తిగా అర్చకులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, ఢిల్లీలోనూ తమ గొంతు వినిపించారని గుర్తు చేశారు. అర్చకులు, ఉద్యోగుల డిమాండ్లు తీర్చడం ప్రభుత్వానికి ఆర్థికంగా పెద్ద ఇబ్బంది కాదని, దేవాలయాలు, చర్చీలు, మసీదులకు వందల కోట్ల రూపాయలను ప్రకటిస్తున్నారని, దేవాలయాలు అభివృద్ది చెందితే అందులో పనిచేసే అర్చకులు, ఉద్యోగుల జీవితాలు బాగుపడాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. అర్చకులు, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు జరిగే ఆందోళనకు తమ పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు. బీజేపీ శాసనసభా పక్షనేత కె.లక్ష్మణ్ మాట్లాడుతూ అర్చకులు, ఉద్యోగులు తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఈ నెల 3వ వారంలో జరిగే శాసనసభ సమావేశాల్లో అర్చకులు, ఉద్యోగుల సమస్యలపై చర్చించి ప్రభుత్వంపైఒత్తిడి తెస్తామన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్, వైఎస్సార్ సీపీ ప్రధానకార్యదర్శి శివకుమార్, పార్టీ నాయకులు కొండా రాఘవరెడ్డి, మహేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్రావు, లోక్సత్తా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పాండురంగారావు, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కుసుం కుమార్, సీపీఐ నాయకుడు సుధాకర్, తెలంగాణ దేవాలయాల అర్చకుల, ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ గంగు భానుమూర్తి, ప్రధానకార్యదర్శి రంగారెడ్డి పాల్గొని మాట్లాడారు. -
అర్చకుల సమ్మెతో ఉద్రిక్తత
హైదరాబాద్: ఆలయ అర్చక, ఉద్యోగులు చేపట్టిన సమ్మె తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించేలా ముఖ్యమంత్రికి బుద్ధి ప్రసాదించాలని అర్చకులు ఆదివారం హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ఎదుట నిర్వహించ తలపెట్టిన సుదర్శన హోమం ఉద్రిక్తంగా మారింది. సమ్మెలో పాల్గొనేందుకు అర్చకులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నారు. అయితే హోమం నిర్వహించేందుకు అనుమతి లేదంటూ ఆలయ కార్య నిర్వహణా అధికారి వినోద్రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. హోమానికి అనుమతించకపోవడంతో అర్చకులు ఆలయం ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు అర్చకులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగింది. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సమయంలో భరత్నగర్ ఆలయానికి చెందిన అర్చకులు శ్రీనివాస్, లక్ష్మణ్ ఆలయం గోపురంపైకి ఎక్కి తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. అర్చకుల అసోసియేషన్ నాయకులు మాట్లాడి కిందకు దిగాలని కోరడంతో వారు దిగారు. సుమారు 3 గంటల పాటు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వద్ద హైడ్రామా జరగడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ కన్వీనర్ గంగు భానుమూర్తి, అర్చక అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రంగారెడ్డి, వెంటేశ్వర్రావు, నర్సింగరావు, రవీంద్రా చార్యులు తదితరులు పాల్గొన్నారు. కాగా అర్చకుల సమ్మెకు కాంగ్రెస్, టీడీపీ మద్దతు తెలిపాయి. ప్రభుత్వం మొండి వైఖరి వీడి సమస్యను పరిష్కరించాలని సనత్నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్రెడ్డి, పీసీసీ సభ్యుడు శ్రావణ్, సనత్నగర్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కూన వెంకటేశ్గౌడ్లు పేర్కొన్నారు. -
అర్చకుల సంక్షేమ నిధి ఏర్పాటు
అర్చకుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్: అర్చకుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేవాదాయ శాఖ ఉద్యోగులు, అర్చకుల కుటుంబ అవసరాలకు రుణం పొందేందుకు మోక్షం లభించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ట్రస్టు ఉండేది. అయితే రాష్ట్రం విడిపోయాక జనాభా దామాషా 52:48 పద్ధతిలో రెండు రాష్ట్రాలు విడివిడిగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో దేవాలయ ఉద్యోగులు, అర్చకులు తమ కుటుంబ అవసరాలకు రుణం పొందే వీలు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ట్రెజరీ నుంచి వేతనాలు డిమాండ్ చేస్తూ గత ఐదు రోజులుగా అర్చకులు, దేవాలయ ఉద్యోగులు ఉధృతంగా సమ్మె చేస్తున్నారు. స్పందించిన ప్రభుత్వం ట్రస్టు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.71.72 కోట్లతో నిధి ఆంధ్రప్రదేశ్ విభజనతో ఉమ్మడి ట్రస్టు నుంచి రాష్ట్ర వాటాగా వచ్చిన సొమ్ముతోపాటు గత ఏడాదిగా దేవాలయాల నుంచి వసూలవుతున్న కాంట్రిబ్యూషన్ కలిపి రూ.71.72 కోట్లతో ప్రభుత్వం నిధిని ఏర్పాటు చేసింది. రూ.20 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉండే ఆలయాలు మొత్తం ఆదాయంలో 3 శాతాన్ని అర్చక, ఉద్యోగుల సంక్షేమ నిధికి విరాళంగా చెల్లించాల్సి ఉంటుంది. 1996లో సుప్రీం కోర్టు వెలువరించిన ఆదేశాల మేరకు దీన్ని ఏర్పాటు చేశారు. -
కేసీఆర్ కుటుంబం ఖజానాను దోచుకుంటోంది :భట్టి
కాజీపేట రూరల్: తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియూగాంధీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎల్పీ ఉపనేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. గురువారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్మెట వెంకటరమణ గౌడ్ అధ్యక్షతన జరిగిన వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.కేసీఆర్ కొడుకు మంత్రి కేటీఆర్, ప్రైవేట్ పైపుల కంపెనీలు, కాంట్రాక్టర్లు లాభం పొందేందుకు మాత్రమే వాటర్ గ్రిడ్ చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ ఆటలు ఇకా సాగవని వరంగల్ ఎంపీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అధిక మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని అన్నారు. రానున్న 2019 ఎన్నికల్లో కాబోయే సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయూలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కోరారు. -
పంచాయతీలకు రూ.24.94 కోట్లు
విజయనగరం మున్సిపాలిటీ: అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామ పంచాయతీలకు ఇది తీపి కబురు. గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరయ్యాయి. 14వ ఆర్ధిక సంఘం కింద రూ24 కోట్ల 94 లక్షల 37వేలను ఈనెల 1వ తేదీన విడుదల చేసింది. 2015-16 ఆర్థిక సం వత్సరంలో తొలి విడతగా కింద ఈ నిధులు మంజూరైనట్లు జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులు తెలిపా రు. జిల్లాలో 920 గ్రామ పంచాయతీలుండగా... ఆ యా పంచాయతీల్లో ఉన్న జనాభా ప్రాతిపదికన ఈ నిధు లు కేటాయించనున్నారు. జిల్లా ట్రెజరీ కార్యాలయం ద్వారా మండల ట్రెజరీలకు సోమవారం జమ చేశారు. జమ చేసిన నిధులు నాలుగు, ఐదు రోజుల్లో పంచాయతీల ఖాతాల్లో పడనున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర ఆర్ధిక సంఘం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. జిల్లాలో 920 గ్రామ పంచాయతీలు ఉండగా.. 14వ ఆర్ధిక సంఘం కింద కేటాయించిన రూ 24.94 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పనకు వినియోగించేందుకు అనుమతిచ్చింది. ఈ నిధులను సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, విధీ దీపాలకు వినియోగిం చే విద్యుత్బిల్లులు చెల్లింపులకు వినియోగించవచ్చు. రక్షిత మంచి నీటి పథకాల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, డంపింగ్ యార్డుల ఏర్పాటుకు ఈ నిధులు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. గత ఏడాది జిల్లాలోని 203 గ్రామ పంచాయతీ క్లస్టర్లకు కేటాయించిన కంప్యూటర్లకు వినియోగించే ఇంటర్నెట్ల బిల్లుల చెల్లింపులు చేసుకోవచ్చు. -
ఏసీబీ వలలో సబ్ ట్రెజరీ అధికారి
పెనుగొండ: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ సబ్ ట్రెజరీ అధికారి ముద్రగడ వెంకట శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. శనివారం సబ్ ట్రెజరీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన్నుంచి రూ.6,400 స్వాధీనం చేసుకున్నారు. 16 మంది టీచర్లకు రావాల్సిన బకాయిలను మంజూరు చేసేందుకు ఒక్కొక్కరు రూ.400 లంచం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసినట్టు సమాచారం. దాంతో టీచర్లు ఏసీబీకి సమాచారం అందించగా, శనివారం దాడులు నిర్వహించి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. -
చెల్లింపులన్నీ ఆపేయండి!
ట్రెజరీలకు ఆర్థికశాఖ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా నిధుల విడుదలపై ఫ్రీజింగ్ విధించింది. ప్రస్తుతమున్న ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ముందుజాగ్రత్తగా బిల్లుల చెల్లింపులు నిలిపేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల ట్రెజరీ కార్యాలయాలకు మౌఖిక ఆదేశాలిచ్చింది. జీతాలు, పెన్షన్లు తప్ప జరుగుతున్న పనులకు సంబంధించిన బిల్లులన్నీ నిలిపివేయాలని సూచించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ. 2,500 కోట్ల ఖజానా లోటుతో రాష్ట్రం సతమతమవుతుండగా ఇటీవల ఐటీ శాఖ అనూహ్యంగా రూ.1,274 కోట్లు సీజ్ చేయటంతో ఆర్థికశాఖ చిక్కుల్లో పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణావసరాలైన రుణమాఫీ, రీయింబర్స్మెంట్, జీతాలు, పెన్షన్లకు నిధుల సర్దుబాటు చేసేందుకు ఫ్రీజింగ్ తప్పనిసరని భావిస్తోంది. రాష్ట్రంలో తొలి ఆర్థిక సంవత్సరంలో చివరి రోజు వరకు బడ్జెట్ నిర్వహణ సాఫీగా సాగింది. నిధులు ఫ్రీజింగ్ అనే మాటెత్తకుండానే ఏ రోజుకారోజు బిల్లులు చెల్లించి ఆర్థికశాఖ ప్రత్యేకతను చాటుకుంది. రెండో ఆర్థిక సంవత్సరంలో ఎంచుకున్న భారీ లక్ష్యాలకుతోడు ఆశించిన స్థాయిలో ఆదాయం లేకపోవటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే ఆర్బీఐ నుంచి తొలి విడతగా రూ.2,000 కోట్లకుపైగా అప్పులు తెచ్చిన సర్కారు జూలైలో మంజూరయ్యే రెండో విడత రుణం కోసం ఎదురుచూస్తోంది. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా, సీఎస్టీ బకాయిలు విడుదలైతే ఇప్పుడున్న చిక్కులు తొలిగిపోతాయని అధికారులు భావిస్తున్నారు. నెలాఖరుకల్లా పరిస్థితి గాడిలో పడుతుందని అంచనా వస్తున్నారు. -
సమ్మెపై అర్చకుల్లో అయోమయం
అర్చక సంఘం సభ్యులతో చర్చించినట్టు ప్రభుత్వ ప్రకటన తమను చర్చలకే పిలవలేదంటున్న సమాఖ్య నేతలు సమ్మెను నిర్వీర్యం చేసే కుట్ర.. సమ్మె యథాతథం అని ప్రకటన హైదరాబాద్: ప్రభుత్వం చర్చలకు పిలిచి తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిందని ఓ సంఘం చెపుతుంటే.. సమ్మె నోటీసు ఇచ్చిన తమను అసలు చర్చలకే పిలవలేదని, సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఇంకో సంఘం చెపుతోంది. దీంతో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకుల్లో అయోమయం నెలకొంది. ట్రెజరీ నుంచి అర్చకులకు, దేవాలయ ఉద్యోగులకు వేతనాలు చెల్లించటంతోపాటు ధూపదీపనైవేద్యాలకు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.2,500ను రూ.6 వేలకు పెంచాలనే డిమాండ్తో గత నెల 19న తెలంగాణ అర్చక, దేవాలయ ఉద్యోగుల సమాఖ్య దేవాదాయ శాఖ కమిషనర్కు సమ్మె నోటీసు ఇచ్చింది. జూన్ 4 నుంచి సమ్మె చేస్తామని ప్రకటించింది. నిత్య కైంకర్యాలు మాత్రమే జరిపి ఆర్జిత సేవలను నిర్వహించకుండా సమ్మె చేయాలని నిర్ణయించారు. అయితే అర్చక సమాఖ్యలోని గంగు ఉపేంద్రశర్మ నేతృత్వంలోని ఓ వర్గం సమ్మెను వ్యతిరేకిస్తోంది. అదేసమయంలో గంగు భానుమూర్తి వర్గం సమ్మె చేసి తీరాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రభుత్వ సలహాదారు రమణాచారి దేవాదాయ శాఖ కార్యదర్శి సమక్షంలో ఉపేంద్రశర్మ వర్గంతో చర్చించారు. అర్చకులు, దేవాలయ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్టు అనంతరం ఒక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. ట్రెజరీ వేతనాలు, ధూపదీప నైవేద్యాల మొత్తం పెంపుతో పాటు ఆగస్టులోగా ధార్మిక పరిషత్తు ఏర్పాటు చేసేలా సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్టు అందులో పేర్కొంది. ఇక్కడే వివాదం మొదలైంది. భానుమూర్తి వర్గం సమ్మె నోటీసు ఇవ్వగా, వారితో చర్చించకుండా.. ఉపేంద్రశర్మ వర్గంతో చర్చించడమేమిటని అర్చకులు మండిపడుతున్నారు. సమ్మెను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొంతమందితో చర్చించి.. సమ్మె లేదనే సంకేతాన్ని అర్చకులు, ఉద్యోగుల్లోకి పంపేందుకు ఇలా చేస్తున్నారని భానుమూర్తి వర్గం ఆరోపిస్తోంది. 4వ తేదీ నుంచి సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ప్రకటించింది. -
గ్రీన్ చానల్ కింద షాదీ ముబారక్!
ట్రెజరీ ఆంక్షలు లేకుండా నిధులు హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం షాదీ ముబారక్ పథకానికి గ్రీన్ చానల్ను వ ర్తింపజేసింది. ట్రెజరీ ఆంక్షలను లేకుండా నిధుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిరుపేద ముస్లిం యువతుల వివాహాలకు ఆర్థిక తోడ్పాటు కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. పట్టణ లబ్ధిదారుల వార్షిక ఆదా య పరిమితి రూ. 2 లక్షలు, గ్రామీణ లబ్ధిదారుల వార్షిక ఆదాయ పరిమితిని రూ. 2 లక్షల నుంచి 1.50 లక్షకు తగ్గించింది. జనన ధ్రువీకరణపత్రం తప్పనిసరి అనే నిబంధనను సడలించి రేషన్, ఓటరు ఐడీ, ఆధార్ కార్డులను వయస్సు ధ్రువీకరణ కోసం సమర్పించవచ్చని స్పష్టం చేసింది. గత ఏడాది పథకం ఆరంభంలో ఎదురైన అవరోధాలను అధిగమించేందుకు చర్య లు చేపట్టడంతో షాదీ ముబారక్ పథకానికి గ్ర హణం వీడినట్లయింది. లబ్ధిదారులకు నిధులు మంజూరైనా ట్రెజరీ శాఖ ప్రతినెల 5 నుంచి 18 తేదీ వరకు మాత్రమే బిల్లులను ఆమోదించడంతో సకాలంలో లబ్ధి అందడంలేదు. తాజాగా ట్రెజరీల ద్వారా నిధులు విడుద లై బ్యాంకు ఖాతాల్లో జమా అవుతాయి. పెళ్లి తర్వాత కూడా.. షాదీ ముబారక్ పథకం కోసం పెళ్లి తర్వాత కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసలుబాటు కల్పించింది. వివాహానికి సంబంధిం చిన ఫొటోను ఆన్లైన్లో దాఖలు చేయాల్సి ఉంటుంది. 2014 అక్టోబర్ 2 తర్వాత ఆడబిడ్డల పెళ్లి చేసిన నిరుపేద కుటుంబాలు ఈ ఆర్థిక సహాయానికి అర్హులు. పెళ్లికి ముందు దరఖాస్తు చేసుకుంటే మాత్రం వివాహ ఆహ్వానపత్రం, ఇతర పత్రాలను సమర్పించాలి. 2015-16 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన కేవలం 40 రోజుల్లో షాదీ ముబారక్ పథకం కింద 6,913 నిరుపేద కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే 2,335 మందికి, గత ఆర్థిక సంవత్సరం 5,839 కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే 5,414 మందికి లబ్ధిఅందించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దళారులను నమ్మవద్దు షాదీ ముబారక్ పథకం కింద రూ.51 వేల ఆర్థిక సహాయం కోసం ఆన్లైన్లో నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. వివాహానికి ముందు కానీ, తర్వాత కానీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. దళారులను నమ్మవద్దు. మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. హెల్ప్లైన్ నంబర్ 040-24760452 కు ఫోన్చేసి సహకారం పొందవచ్చు. -మహ్మద్ జలాలోద్దీన్ అక్బర్, డెరైక్టర్, మైనార్టీ సంక్షేమ శాఖ -
రానున్న నెలా అరకొరే..
రూ.100కోట్లే చెల్లింపులు మరో రూ.90 కోట్లకు బ్రేకులు హుద్హుద్ సాయంపై ప్రభావం అడ్వాన్స్ జీతభత్యాలకు నో పేరుకుపోయిన వెయ్యికి పైగా బిల్లులు.. ట్రెజరీలో కొనసాగుతున్న ఆంక్షలు ఆర్థికలోటు సాకుగా చూపి ట్రెజరీ ద్వారా చెల్లింపులపై విధించిన నిషేధం అభివృద్ధి పనులతో పాటు ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. చెల్లింపులపై ఫ్రీజింగ్ ఉంది ఏం చేయలేం అంటూ ట్రెజరీ అధికారుల చేతులెత్తేస్తుండడంతో వందల్లో బిల్లులు పేరుకు పోతున్నాయి.. వందల కోట్ల చెల్లింపు లకు బ్రేకులు పడుతున్నాయి. విశాఖపట్నం: ట్రెజరీ ద్వారా చెల్లింపులపై గతనెల 26న ప్రభుత్వం నిషేధం విధించింది. ఫిబ్రవరి మొదటి వారంలో జీతభత్యాలు, ఫింఛన్ల చెల్లింపులకు మినహాయింపు ఇచ్చినా.. వచ్చిన ప్రతీ బిల్లుకూ ఏదో ఒక సాకుతో చె ల్లింపులకు బ్రేకులేస్తూనే ఉన్నారు. జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యా యులు 40వేలమంది ఉండగా, 12వేల మంది వరకు అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. సుమారు 25వేల మంది పింఛన్ దారులున్నారు. జీతభత్యాల రూపంలో ఉద్యోగులకు రూ.115కోట్లు, అవుట్సోర్సింగ్/కాంట్రాక్టు సిబ్బందికి రూ.15కోట్లు చెల్లిస్తుండగా, పింఛన్ దారులకు రూ.60కోట్ల వరకు చెల్లింపులు జరుగుతుంటాయి. అంటే సుమారు రూ.190కోట్ల మేర చెల్లింపులు జరగాల్సి ఉండగా, నిషేధం సడలించినప్పటికీ జనవరి నెలకు సంబంధించి ఫిబ్రవరిలో జరిగిన జీతభత్యాలు, పింఛన్ల చెల్లింపులు కేవలం రూ.100కోట్ల లోపే. మరో 90కోట్ల చెల్లింపులకు బ్రేకులుపడ్డాయి. ఇక హుద్హుద్ సాయం కింద రూ.320కోట్ల మేర పరిహారం విడుదల కాగా, ఇప్పటి వరకు 80శాతం వరకు బ్యాంకులకు జమయ్యాయి. రూ.30కోట్ల వరకు చెల్లింపులు జరగాల్సి ఉంది. వీటిలో గృహాల డామేజ్ కింద మంజూరైన సొమ్ములో రూ.17కోట్లు, మత్స్యశాఖ పరిధిలో రూ.3.50కోట్లు, పశుసంవర్ధకశాఖ పరిధిలో మరో రూ.10కోట్ల వరకు చెల్లింపులు జరగాల్సి ఉంది. పంపిణీ సమయంలోనే నిషేధం అమలులోకి రావడంతో ఈ చెల్లింపులన్నీ నిలిచిపోయాయి. 13వ ఆర్థిక సంఘ నిధులతో పాటు వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రతీనెలా రూ.150కోట్ల మేర చెల్లింపులు జరుగుతుంటాయి. వీటి విషయంలోనూ నిషేధం ఆంక్షలు ప్రతిబంధకంగా మారాయి. ఇక ఇవన్నీ ఒక ఎత్తయితే హుద్హుద్ సమయంలో రేయింబవళ్లు శ్రమించిన జిల్లా పరిధిలోని వివిధశాఖల ఉద్యోగులకు అడ్వాన్స్ బేసిక్పే ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నెల్ ఇచ్చింది. ఈమేరకు జీవో కూడా జారీ చేసింది. దీంతో ఉద్యోగుల బేసిక్ ప్రకారం రూ.27కోట్ల మేర చెల్లింపుల కోసం ప్రతిపాదనలు తయారు చేసి నివేదించగా జీవో జారీ చేసిన ప్రభుత్వం నిర్ద్వందంగా తోసిపుచ్చింది. డబ్బులున్నప్పుడు చూద్దాంలే అంటూ పక్కన పెట్టేసిందని అధికార వర్గాలే చెబుతున్నాయి. జీతభత్యాలు, పింఛన్లు, పే అలవెన్సెస్, గ్రాట్యుటీ, పింఛన్దారుల మెడికల్ రీయింబర్సుమెంట్,ఎ్ఫ్టీఏ కన్వీనియన్స్, కాస్మోటిక్స్, సీక్రెట్ సర్వీసెస్ ఖర్చులు(పోలీస్), ప్యూనరల్ చెల్లింపులకు నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ ఏదో ఒక వంకతో చెల్లింపులకు బ్రేకులేస్తూనేఉన్నారు. జిల్లా ట్రెజరీలోనే ఏకంగా 300కుపైగా బిల్లులు పెండింగ్లో ఉండగా, ఇక సబ్ ట్రెజరీకార్యాలయాల్లో పేరుకుపోయిన చెల్లింపులన్నీ కలుపుకుంటే వెయ్యికిపైగానే ఉంటాయని అంచనా. ఆర్థిక సంవత్సరం ముగిశాక చెల్లింపులపై విధించిన నిషేధం ఎత్తివేసే అవకాశం ఉందా అంటే అదే డౌటేనని అధికారులంటున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్కనుగుణంగా జరిపే చెల్లింపులను బట్టీ నిషేధం ఎత్తివేత ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా మార్చిలో కూడా ఇదే రీతిలో నిషేధం కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో వచ్చే ఏడాది కూడా అరకొర గానే జీతాల చెల్లింపులు జరుగుతాయన్న వాదన వ్యక్తమవుతోంది. -
లెక్క తప్పిందా?
క్రమబద్ధీకరణ దరఖాస్తులపై అధికారుల ఆశలు అడియాసలు జంట జిల్లాల్లో మొత్తం 1,43,863 దరఖాస్తులు ఆదాయం రూ.31 కోట్లు మాత్రమే ఫిబ్రవరి 28 వరకు గడువు పొడిగింపు ప్రభుత్వ స్థలాల్లో అభ్యంతరకర ఇళ్ల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రజల స్పందన అంతంతమాత్రంగానే ఉంది. దీంతో ప్రభుత్వం ఆశించినంత మేర ఖజానాకు ఆదాయం సమకూరలేదు. ఈ విషయంలో అధికారుల లెక్కలు పూర్తిగా తప్పినట్లేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క్రమబద్ధీకరణ గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సొమ్ము చెల్లించే దరఖాస్తులకు మాత్రం గడువును ఫిబ్రవరి 28 వరకు విధించింది. ఈ మేరకు జంట జిల్లాల కలెక్టర్లు సంబంధిత తహసీల్దార్లకు ఆదేశాలిచ్చారు. అదనపు కౌం టర్లు ఏర్పాటు చేయడం ద్వారా క్రమబద్ధీకరణకు ప్రజల నుంచి స్పందన పెరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. హైదరాబాద్ జిల్లాలో తక్కువ... హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో క్రమబద్ధీకరణకు ఇప్పటి వరకు 1,43,863 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో సొమ్ము చెల్లించిన దరఖాస్తులు 3,036 రాగా, రూ. 31 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. ఇక ఉచిత దరఖాస్తులు మాత్రం అధికంగానే వచ్చాయి. జిల్లాల వారీగా గమనిస్తే రంగారెడ్డి కంటే హైదరాబాద్ జిల్లాలో దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. మొత్తం 29,863 దరఖాస్తులు రాగా, సొమ్ము చెల్లించే కేటగిరికి సంబంధించినవి 136 మాతమే ఉన్నాయి. ప్రాథమిక విలువలో 25 శాతం చెల్లింపుల్లో భాగంగా రూ. 8.01 కోట్లు ఆదాయం మాత్రమే సమకూరినట్లు అధికారులు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1.14 లక్షల దరఖాస్తులు రాగా.. సొమ్ము చెల్లించిన దరఖాస్తులు 2900 ఉన్నాయి. వీటి ద్వారా రూ.23 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో రాబడి రూ.57.17 కోట్లు 2008లో ఇళ్ల క్రమబద్ధీకరణకు పూనుకున్న ప్రభుత్వం.. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో వందలాది ఇళ్లను క్రమబద్ధీకరించి రూ.57.19 కోట్లను రాబట్టగలిగింది. ఇందులో హైదరాబాద్ జిల్లా వాటా రూ.40 కోట్లు. క్రమబద్ధీకరణ ద్వారా కాసుల వర్షం కురుస్తుందని అంచనావేసిన సర్కారు లెక్క తప్పిందన్న అభిప్రాయాలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఇక ప్రస్తుత పరిస్థితి గతంలోకంటే దారుణంగా ఉండడంతో గత అనుభవాల గురించి తెలుసుకోకుండానే తెలంగాణ ప్రభుత్వం క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టిందనే విమర్శలు విన్పిస్తున్నాయి. అప్పట్లో 80 గజాలున్నవే ఎక్కువ.. గతంలో క్రమబద్ధీకరించినవాటిలో 80 చదరపు గజాల్లోపు ఉన్న స్థలాలే అధికం. ప్రస్తుతం కూడా సొమ్ము చెల్లించే కేటగిరి కంటే ఉచిత దరఖాస్తులే అధికంగా వస్తున్నాయి. గతంలో హైదరాబాద్ జిల్లాలో 2,342 , రంగారెడ్డి జిల్లాలో 3,811 ఇళ్లను క్రమబద్ధీకరించారు. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు ఉచితంగా ఇళ్లపట్టాలివ్వాలని నిర్ణయించడంతో నయాపైసా రాలేదు. జంట జిల్లాల్లో 81-250 చదరపు గజాలకు సంబంధించి 5,170 ఇళ్లు, 251 నుంచి 500 చ.గజాలలోని 1415కి మోక్షం లభించింది. ఆపై విస్తీర్ణం కలిగిన మిగతా వాటిని తిరస్కరించగా, 453 దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్ దరఖాస్తుల పరిశీలనకు జీవో 60 జారీ.. పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి...అర్హత కలిగిన వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం గత నెల 31న జీవో 60ని జారీ చేసింది. ఈ జీవో ప్రకారం గత ప్రభుత్వాలు (2002 నుంచి 2014 వరకు) జారీ చేసిన జీవో నంబర్లు 455,456,615,747,58,59 ల ద్వారా ఇళ్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు పెట్టుకుని, డబ్బులు చెల్లించినవి పెండింగ్లో ఉన్నట్లయితే వాటిని పరిశీలించటానికి వీలు కల్పించారు. -
కేంద్ర నిర్ణయంతో తెలంగాణ ఖజానాకు దెబ్బ!
-
తెలంగాణ ఆర్థిక మూలాలపై జీఎస్టీ దెబ్బ.. ఖజానా ఖల్లాస!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మూలాలపై దెబ్బపడబోతోందా..? రాష్ట్ర ఖజానాకు కాసుల గలగలలు దూరం కాబోతున్నాయా? పన్నుల రూపంలో వచ్చే ఆదాయానికి భారీ గండి తప్పదా..? కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వస్తు సేవల పన్ను(జీఎస్టీ)తో భవిష్యత్తులో అదే జరుగుతుందంటున్నారు విశ్లేషకులు! రాష్ట్రాల ఆర్థిక స్వావలంబనకు ప్రధానమైన పన్నుల విధానం మరో ఏడాదిలో కేంద్రం చేతుల్లోకి వెళ్లబోతోంది. ఏకీకృత పన్నుల విధానం పేరుతో కేంద్రం తీసుకురాబోతున్న జీఎస్టీ దెబ్బకు తెలంగాణ పెద్దమొత్తంలో ఆదాయం కోల్పోనుంది. రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూస్తామని కేంద్రం చెబుతున్నా... చివరికి ఆ హామీలేవీ నిలబడే అవకాశాలు లేవని గత అనుభవాలు చెబుతున్నాయి. ఏతావాతా జీఎస్టీతో పన్నుల పెత్తనం అంతా కేంద్రం చేతిలోకి వెళ్లడం.. కేంద్రం ముందు రాష్ట్రాలు చేతులు చాచే పరిస్థితి రావడం తప్పేలా కనిపించడం లేదు. కొత్త రాష్ట్రంగా అవతరించి, కోటి ఆశలతో అడుగులు వేస్తున్న తెలంగాణ సర్కారు.. వాటర్గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ, రోడ్ల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ విధానం రాష్ట్ర ఆదాయానికి గండి కొడితే దాని ప్రభావం ఈ పనులపై పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నష్టాలు భరిస్తామని చెబుతున్నా... తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా జీఎస్టీ విధానాన్ని 2016, ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెచ్చేందుకు కేంద్రం వేగంగా కదులుతోంది. ఈ బిల్లును శుక్రవారమే పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టింది. జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని తొలి మూడేళ్లలో వందశాతం భరిస్తామని, నాలుగు, ఐదు సంవత్సరాల్లో వరుసగా 75 శాతం, 50 శాతం భరిస్తామని బిల్లు ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అంటే ఈ విధానం అమల్లోకి వస్తే రాష్ట్రాలు నష్టపోతాయనే విషయాన్ని ఆయన పరోక్షంగా ఒప్పుకున్నట్టు స్పష్టమైంది. ఐదు సంవత్సరాలు దాటినా నష్టమని భావిస్తే రెండేళ్లపాటు జీఎస్టీ మీద అదనంగా ఒక శాతం పన్ను విధించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఇస్తామని కేంద్రం చెబుతోంది. ఇవన్నీ భవిష్యత్తులో రాష్ట్రాల ఖజానాకు గండి తప్పదనే సంకేతాలు పంపుతున్నాయి. కేంద్రంపై ఆధారపడే పరిస్థితికి: ఉమ్మడి రాష్ట్రంలో 2013-14 బడ్జెట్ దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలపైనే! ఇందులో వాణిజ్య పన్నుల శాఖ నుంచి వచ్చిన రెవెన్యూ ఆదాయం ఏకంగా రూ.50,542 కోట్లు. అంటే మూడో వంతు రాబడి ఈ శాఖ నుంచే వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 2014-15 సంవత్సరానికి వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రూ.30 వేల కోట్ల ఆదాయం వస్తుందని సర్కారు అంచనా వేస్తోంది. రాష్ట్ర ఆదాయంలో 65 శాతం ఈ శాఖ నుంచే రానుంది. కానీ జీఎస్టీ అమలైతే ప్రత్యక్షంగా వాణిజ్య పన్నుల శాఖకు ఇందులో మూడో వంతు కూడా రాదని అంటున్నారు. కేంద్రం ఇచ్చే వాటా ప్రకారం వసూలైన పన్ను నుంచి కొంత మేర రాష్ట్రానికి వస్తుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెబుతున్నారు. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రాష్ట్రం వసూలు చేస్తున్న వ్యాట్, సీఎస్టీ, వినోదపు పన్ను, ఆక్ట్రాయ్, వాహన ప్రవేశ పన్ను, కొనుగోలు పన్ను, గుర్రపు పందేలు, బెట్టింగ్ పన్నులన్నీ కేంద్రం పరిధిలోకి వెళతాయి. జీఎస్టీ ద్వారా పన్నులు విధించే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఇచ్చినా... పెత్తనం మాత్రం కేంద్రం చేతిలోనే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పన్నుల విధానం ద్వారా కేంద్రం, రాష్ట్రాలు ఎవరికి వారు వస్తువులపై, సేవలపై పన్నులు వేస్తున్నాయని, జీఎస్టీ అమలులోకి వస్తే పన్నుల మీద పన్ను ఉండదని కేంద్రం చెబుతోంది. తద్వారా రాష్ట్రం నష్టపోయే విలువకు సమానంగా నష్టపరిహారం ఇస్తామని కేంద్రం చెప్పే మాటలు మున్ముందు అమలయ్యే అవకాశం లేదు. వ్యాట్ అమలులోకి వచ్చిన 2005లో కూడా కూడా కేంద్రం ఇలాగే చెప్పింది. రాష్ట్రాలు నష్టపోయే వాటాను తామే చెల్లిస్తామని చెప్పినా.. ఆ తర్వాత పట్టించుకోలేదు. అలా ఇప్పటికి కేంద్రం నుంచి వ్యాట్ వాటా కింద తెలంగాణకు రూ.5,000 కోట్లు రావలసి ఉండడం గమనార్హం. తెలంగాణ వాదన పట్టించుకోని కేంద్రం రాష్ట్రాల రెవెన్యూ హక్కులకు భంగం కలగకుండా జీఎస్టీ అమల్లోకి తెస్తే తమకేం అభ్యంతరం లేదని తెలంగాణ ఇప్పటికే రెండుసార్లు కేంద్రానికి స్పష్టం చేసింది. అదే సమయంలో మద్యం, పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు వేసే హక్కును రాష్ట్రాలకే ఇవ్వాలని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కేంద్రానికి విన్నవించారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ... మద్యంపై పన్ను హక్కులను రాష్ట్రానికే ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే పెట్రోలు, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో మెలిక పెట్టారు. వాటిని జీఎస్టీలో పొందుపరిచే తేదీని జీఎస్టీ మండలికి వదిలేసింది. ఈ మండలిలో మూడింట రెండొంతుల మంది సభ్యులు వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నా.. బీజేపీ పాలిత రాష్ట్రాల నిర్ణయం కేంద్రానికే అనుకూలంగా ఉండనుంది. 42 శాతం రెవెన్యూ మూడింటి నుంచే తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖ 2014-15లో రూ.30 వేల కోట్ల రెవెన్యూ అంచనా వేశారు. అందులో మద్యం, పెట్రోలు ఉత్పత్తులు, పొగాకు ఉత్పత్తులపై వేసే పన్నుల ద్వారా 42 శాతం రెవెన్యూ వస్తుందని అంచనా. తెలంగాణలో మద ్యంపై విధించే పన్ను(వ్యాట్) 70 శాతం నుంచి 160 శాతం వరకు ఉంది. పెట్రోలియం ఉత్పత్తుల మీద 14.5 శాతం నుంచి 23.5 శాతం వరకు పన్ను విధిస్తున్నారు. ఇక పొగాకు ఉత్పత్తుల మీద 20 శాతం పన్ను ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో లెక్కలేస్తే రాష్ట్రానికి ఈ మూడింటి ద్వారా దాదాపు రూ.20 వేల కోట్లకు పైగా ఆదాయం రానుంది. తెలంగాణ విడిపోయాక జూన్ నుంచి నవంబర్ వరకు వాణిజ్య పన్నుల శాఖకు రూ.14,008 కోట్ల ఆదాయం వస్తే అందులో మద్యం ద్వారా రూ. 3,359, పెట్రోలియం ఉత్పత్తుల మీద రూ.3,233 కోట్లు ఆదాయం సమకూరింది. పొగాకుతో పాటు ఇతర వస్తువులపై పన్నుల ద్వారా రూ.7,386 కోట్లు వచ్చింది. జీఎస్టీ అమల్లోకి వస్తే మద్యం మినహా మిగతా వస్తువులపై పన్నులు వేసే అధికారం కేంద్రం పరిధిలోకి వెళుతుంది. ఆర్ఎన్ఆర్ అమలైతే..? జీఎస్టీ అమలైతే రాష్ట్రాలకు నష్టం కలగకుండా రెవెన్యూ న్యూట్రల్ రేట్ (ఆర్ఎన్ఆర్)ను కేంద్రం అమలు చేసే అవకాశం ఉందని వాణిజ్య పన్నుల శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. దీనివల్ల రాష్ట్రాల ఆర్థిక ప్రయోజనాలను రక్షిస్తారని చెప్పారు. అంటే జీఎస్టీ ద్వారా కేంద్రం ఆయా వస్తువులు, సేవలపై విధించే పన్నుల్లో రాష్ట్ర వాటాను ముందుగానే నిర్ణయిస్తారన్నమాట. దీంతో రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్రం చెపుతున్నా... అది సాధ్యం కాదన్నది నిపుణుల మాట. అలాగే జీఎస్టీ అమలయ్యే తొలి రెండేళ్లలో రాష్ట్రం తనకు నష్టం వస్తుందని భావించినప్పుడు సరకుల ఉత్పత్తి స్థానంలో ఒక శాతం అదనంగా పన్ను విధించుకునే అవకాశం కేంద్రం కల్పిస్తుంది. దీనివల్ల ప్రజలపైనే భారం పడనుంది. అలాగే జీఎస్టీ అమలైతే ప్రస్తుతం వ్యాట్ కింద ఉన్న 1.5-14.5 శాతం పన్నుల విధానం 20-22 శాతానికి పెరిగే అవకాశం ఉంది. 2000లోనే బీజాలు.. జీఎస్టీకి 2000లోనే బీజాలు పడ్డాయి. వాజ్పేయి హయాంలో తొలిసారి దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అదే సంవత్సరం కేంద్రం జీఎస్టీపై ఓ సాధికారిక కమిటీని ఏర్పాటు చేసింది. యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2007 మే 10న అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం సాధికారిక కమిటీతో పాటు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జాయింట్ వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూపు అదే సంవత్సరం నవంబర్ 19న నివేదిక ఇచ్చింది. దీనిపై విస్తృత స్థాయిలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో 2009 జూలై 6న అప్పటి ఆర్థికమంత్రిప్రణబ్ముఖర్జీ కేంద్రం తరపున ప్రకటన చేస్తూ 2010, ఏప్రిల్ నుంచి జీఎస్టీని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్తోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వ్యతిరేకించడంతో నిర్ణయం అమలు కాలేదు. -
ఖజానా ఖాళీ
జీవీఎంసీకి హుద్హుద్ దెబ్బ వెంటాడుతున్న కాసుల కష్టాలు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి తుపానుకు వెచ్చించిన నిధులొస్తే తప్ప తీరని వెతలు విశాఖపట్నం సిటీ: హుద్హుద్ తుపాను మహా నగర పాలక సంస్థ ఖజానాను ఖాళీ చేయించింది. దీంతో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఉన్న కొద్దిపాటి మొ త్తాన్ని తుపానుకు ఖర్చు చేసింది. ఇప్పుడా నిధులు సర్కారు నుంచి వెనక్కు వచ్చినా కొంత తేరుకుంటామని సంస్థ భావిస్తోంది. తుపాను సందర్భంగా మున్సిపల్ కమిషనర్లు, కొందరు ఐఏఎస్ అధికారులు వచ్చారు. వారి బస, రవాణా, ఆహార పానీయాల కోసం జీవీఎంసీ రూ. 7.5 కోట్లు ఖర్చు చేసింది. ఈ బిల్లుల మొత్తం రాబట్టేందుకు సర్కారు ఈ బిల్లులను పంపింది. అయితే ఇందులో రూ. 5 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. తాజాగా ఆ ఫైల్ను ఆర్ధిక శాఖకు పంపింది. నెలనెలా డే అండ్ నైట్ శానిటేషన్ సిబ్బందికి రూ.4.5 కోట్లు వేతనాలుగా చెల్లించాల్సి వుంది. ఈ నెల జీతాలు చెల్లించాలంటే జీవీఎంసీకి చెమటలు పడుతున్నాయి. జీవీఎంసీ అకౌంట్లో కొద్దిపాటి మొత్తమే ఉన్నట్లు భోగట్టా. బుల్డోజర్లు, క్రేన్లు, ప్రొక్లైనర్లు, ట్రాన్స్పోర్ట్ చేసే లారీలకు డీజిల్, పెట్రోల్ అవసరాలకే ఈ మొత్తం సరిపోతుంది. వీటికి చెల్లిస్తే అత్యవసర పరిస్థితి వస్తే నిధులెక్కడ నుంచి తేవాలో తెలియక అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. జోన్ 1, 2, 4, 5 కార్యాలయాల్లో పని చేసే కొందరు రెగ్యులర్ సిబ్బందికి మాత్రం శుక్రవారం అందజేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, శానిటేషన్, ప్రజా ఆరోగ్య సిబ్బందికి చెల్లించాల్సి వుంది. ఈ నెల 20వ తేదీ వరకూ మిగిలిన ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొందరు అధికారుల కార్లు, ప్రభుత్వం ఇచ్చిన వాహనాలకు సైతం డీజిల్ లేక కదలడం లేదు. నీటి సరఫరా విభాగంలోని ఉద్యోగులకు దాదాపు రూ. 80 లక్షలు జీతాలు చెల్లించాల్సి వుంది. మలేరియా సిబ్బందికి కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. తుఫాన్ సాయం కింద ప్రభుత్వం నుంచి బకాయిలొస్తే తప్ప వీరి వేతనాలకు మోక్షం కలగదు. -
రాబడిలో నెం.1
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి ఆయువుపట్టు రంగారెడ్డి జిల్లా. రెవెన్యూ పరంగా రాష్ట్ర ఖజానాకు జిల్లా ప్రధాన ఆదాయవనరుగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్ర ప్రణాళిక శాఖ పది జిల్లాల వివరాలతో ప్రణాళిక సూచికలు విడుదల చేసింది. 2012-13 ఆర్థిక సంవత్సరం చివరితో ఈ గణాంకాలున్నాయి. వరుసగా పదేళ్ల వృద్ధిని పోల్చుతూ రూపొందించిన ఈ వివరాల్లో రంగారెడ్డి జిల్లా పలు అంశాల్లో ముందు వరుసలో నిలిచింది. ఆ వివరాల్లో ప్రధాన అంశాలను పరిశీలిస్తే. అపార ఖనిజ సంపదలున్న తెలంగాణ రాష్ట్రంలో జిల్లా నుంచి కోట్ల రూపాయల ఆదాయం ఏటా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. 2012-13 సంవత్సరంలో జిల్లాలో ఏకంగా రూ.5,210.42 కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలు వెలికితీశారు. దీంతో రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూరింది. ఇందులో రూ.34కోట్ల విలువైన ఫెల్స్పార్, రూ.65 కోట్ల విలువైన లాటరైట్, రూ.611 కోట్ల విలువైన లైమ్స్టోన్ రూ. 28 కోట్ల విలువైన క్వార్ట్జ్రాయి... రూ. 3,217కోట్ల విలువైన గ్రానైట్, రూ.312.64కోట్ల విలువైన కంకర, రూ.942.78 కోట్ల విలువైన పెద్దసైజు కంకర విక్రయాలు జరిగాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో 23,352 పరిశ్రమలున్నాయి. వీటిలో 500 భారీ పరిశ్రమలే. దీంతో అత్యధికంగా విద్యుత్ వినియోగిస్తూన్న జిల్లాలో రెండోస్థానంలో ఉన్నాం. వాహనాల సంఖ్యలోనూ జిల్లా తొలి మూడుస్థానాల్లో ఉంది. జిల్లాలో త్రీవీలర్, ఫోర్ వీలర్ ఆపై కేటగిరీలకు సంబంధించి 1,54,446 వాహనాలున్నాయి. ఇవి కాకుండా 15.16 లక్షల మోటర్ సైకిళ్లున్నాయి. ఆర్థిక అంశాల పరంగా జిల్లా లో భారీలావాదేవీలు జరుగుతున్నాయి. జిల్లాలో 1314 బ్యాంకులున్నాయి. ఇందులో స్టేట్బ్యాంకు గ్రూపునకు సంబంధించినవి 190, జాతీయ బ్యాంకులు 282, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 51, ప్రైవేటు బ్యాంకులు 134, ఇతర షెడ్యూల్డ్ బ్యాంకులు 657 ఉన్నాయి. వీటి పరిధిలో రూ. 1523.39 కోట్ల పంటరుణాలు, రూ. 3143.37కోట్ల పరిశ్రమల రుణాలు, రూ. 134.52 కోట్ల వాహన రుణాలు, రూ.561.2 కోట్ల ఉపాధి రుణాలు, రూ.3,489.44 కోట్ల వ్యక్తిగత రుణాలిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలతో పోలిస్తే రంగారెడ్డి జిల్లాలో బియ్యం, కందిపప్పు, వంటనూనె సరుకుల ధరలు ఎక్కువగా ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతుండడం గమనార్హం. 2012-13 ఆర్థిక సంవత్సరం చివరినాటికి జిల్లా కోర్టుల పరిధిలో 23,660 అపరిష్కృత కేసులున్నట్లు ప్రణాళిక శాఖ గణాంకాలు వివరిస్తున్నాయి. ఈ అంశంలో తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలతో పోలిస్తే ఈ సంఖ్య అధికం. హైదరాబాద్ చుట్టూ జిల్లా విస్తరించి ఉండడం, మహానగరంలో అంతర్భాగం కావడంతో అటు టూరిజం పరంగా జిల్లా రెండోస్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్న హైదరాబాద్కు వెళ్లాలంటే జిల్లాలో ఎంట్రీ తప్పనిసరి. అంతేకాకుండా హైటెక్సిటీ, చిలుకూరు బాలాజీ, అనంతగిరి, శిల్పారామం తదితర టూరిజం స్పాట్లు జిల్లాలో ఉండడంతో పర్యటకుల తాకిడి అధికంగానే ఉంది. 2012-13సంవత్సరంలో జీహెచ్ఎంసీ, జిల్లా గ్రామీణ ప్రాంతాన్ని కలుపుకుంటే 97.77లక్షల భారతీయులు, 2.23లక్షల విదేశీ పర్యాటకులు జిల్లాలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. అయితే అంతకుముందు ఏడాదితో పోలిస్తే విదేశీ పర్యటకుల తాడికి కొంత తగ్గింది. -
పంచాయతీలు విలవిల
రోజురోజుకూ కునారిల్లుతున్న పంచాయతీల దుస్థితికి పాలకులే కారణం. ఈ పాపంలో అధికారుల నిర్లక్ష్యానికి ప్రభుత్వ బాధ్యతారాహిత్యం తోడవడం మరీ ఘోరం. గ్రామాభివృద్ధికి పన్నుల వసూళ్లే కీలకం. వాటిని వసూలు చేయకపోవడంతో బకాయిలు ఏటేటా కొండలా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోంది. ఫలితంగా సమస్యలతో అల్లాడుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఒంగోలు టూటౌన్ : జిల్లాలో 1028 పంచాయతీలున్నాయి. గ్రామాల్లో పంచాయతీ అధికారులు ఏటా పన్నులు వసూలు చేసుకుంటూ సమస్యలు పరిష్కరించాలి. జిల్లా పంచాయతీ అధికారి తరచూ తనిఖీలు నిర్వహిస్తూ గ్రామాభివృద్ధికి సూచనలివ్వాలి. పన్ను వసూళ్లకు చర్యలు తీసుకోవాలి. కానీ అలాంటిదేమీ ఈ జిల్లాలో కనిపించడం లేదు. ఒక్కసారి 2013-14 సంవత్సరంలో పన్నుల వసూళ్లను పరిశీలిస్తే అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమవుతుంది. మొత్తం రూ.13,24,29,898లకు గాను ఇప్పటి వరకు రూ.8,82,78,081 మాత్రమే వసూలు చేశారు. ఇవికాక పాత బకాయిలు దాదాపు రూ.22,05,48,490 ఉండగా, ఇప్పటి వరకు రూ.12,20,75, 054 వసూలు చేసినట్లు సమాచారం. ఇంకా దాదాపు రూ.10 కోట్ల వరకు బకాయిలున్నాయి. చాలినన్ని నిధులు లేకపోవడంతో పంచాయతీల్లో సమస్యలు తిష్టవేశాయి. జీతాలు లేక అవస్థలు = పంచాయతీల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలిచ్చే పరిస్థితి లేదు. = పారిశుద్ధ్య కార్మికులతో పాటు టైమ్ స్కేల్ కార్మికులు, పర్మనెంట్, టెండర్.. ఎన్ఎంఆర్ విధానంలో కార్మికులు పనిచేస్తున్నారు. = జిల్లాలో పర్మనెంట్, టైమ్ స్కేల్ కార్మికులు దాదాపు 125 మంది వరకు ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికులు వెయ్యి మందికి పైగా పనిచేస్తున్నారు. = పర్మనెంట్ కార్మికులకు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని 2011లో అప్పటి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. = దీనికి జిల్లా స్థాయి కమిటీ కూడా ఉంది. కమిటీ నిర్లక్ష్యం కారణంగా వారు ట్రెజరీ ద్వారా జీతాలకు నోచుకోవడంలేదు. పారిశుద్ధ్య కార్మికులకు చాలాచోట్ల నేటికీ నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబంతో సహా తల్లడిల్లుతున్నారు. విద్యుత్ బిల్లుల బకాయిలు = విద్యుత్ బకాయిలు పంచాయతీలకు గుదిబండగా మారాయి. = గత ప్రభుత్వాలు మైనర్ పంచాయతీలు కరెంట్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని అప్పట్లో సర్పంచ్ల సంఘానికి హామీ ఇచ్చాయి. = జిల్లాలో దాదాపు 106 పంచాయతీలకు విద్యుత్ బిల్లుల బకాయిలు సుమారు రూ.12 కోట్ల వరకు ఉన్నాయి. = కొన్ని పంచాయతీల్లో బిల్లులు చెల్లించ కపోవడంతో రెండు నెలల క్రితం ఫీజులు తొలగించారు. దీంతో పల్లెల్లో అంధకారం అలుముకుంది. శాశ్వత భవనాల సమస్య = పంచాయతీ భవనాలు లేని గ్రామాలకు మూడేళ్ల కిందట 350 కొత్త భవనాలు మంజూరయ్యాయి. ఒక్కోదానికి రూ.10 లక్షలు విడుదలయ్యాయి. = పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖకు పనులు అప్పగించారు. ఇప్పటికి కనీసం 100 కూడా పూర్తి స్థాయిలో నిర్మించలేదు. ఇక తాగునీటి సమస్య ఉండనే ఉంది. = పంచాయతీల అభివృద్ధికి కీలకమైన పన్నుల వసూళ్లలో అధికారులు, సిబ్బంది అలవిమాలిన నిర్లక్ష్యం వహిస్తున్నారు. = {పభుత్వం విడుదల చేయాల్సిన సెస్లు, కొత్తపన్నులు దాదాపు రూ.200 కోట్ల వరకు బకాయి పడినట్లు సర్పంచుల సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. = నిధుల లభ్యత లేకపోతే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
షట్డౌన్
కలెక్టరేట్/మంచిర్యాల, న్యూస్లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని పలు శాఖల్లో సాంకేతికపరంగా సేవలు నిలిచిపోనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు నేపథ్యంలో రెండు రోజులపాటు మీసేవ, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్, ఖజానా, రవాఖ శాఖల్లో కార్యకలాపాలు స్తంభించనున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి జూన్ ఒకటో తేదీ అర్ధరాత్రి వరకు అంటే సరిగ్గా 48 గంటలు సేవలు ఆగిపోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ప్రక్రియతో జిల్లాలో పాలనపై ప్రభావం పడే అవకాశాలున్నాయి. ఏర్పాట్లే కారణం ఉమ్మడి రాష్ట్రంలో ఒకే ‘సర్వర్’ కింద ఆయా విభాగాలు సేవలు అందించాయి. తెలంగాణ అపాయింటెడ్ డే(జూన్ 2) నుంచి శాఖలు రెండు రాష్ట్రాలకు వేర్వేరు కానున్నాయి. దీంతో తెలంగాణకు సంబంధించిన సర్వర్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సర్వర్లను అ క్కడి సర్కారు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. సాంకేతి క పరమైన ఏర్పాట్లలో భాగంగా దాదాపు 48 గంటలపా టు సేవలు నిలిపివేయడం తప్పనిసరి అయింది. ఈ నిర్ణయంతో మీ సేవ కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలు, విద్యు త్ బిల్లులు చెల్లించేవారికి తిప్పలు తప్పేలా లేవు. మరోవై పు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలోనూ భూక్రయ విక్రయాలు నిలిచిపోనున్నాయి. ఉద్యోగుల వేతన భత్యాలు, వారికి అందాల్సిన సొమ్ముల విషయమై కార్యకలాపాల న్ని జరగే ఖజానా శాఖలో సేవల నిలిపివేత వల్ల ఇబ్బంది తలెత్తే అవకాశాలున్నాయి. ఇప్పటికే దాదాపు ఉద్యోగులకు ఖజానా శాఖ వేతనాల చెల్లింపు అనుమతుల ప్రక్రి య పూర్తిచేసింది. సేవలకు విరామం రిజిస్ట్రేషన్, రవాణా, మీసేవ, ఖజానా ప్రభుత్వ శాఖలకు రూ.కోట్లు గండిపడే అవకాశం ఉంది. జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన సర్వర్లు శుక్రవారం సాయంత్రం ఆగిపోయాయి.రిజిస్ట్రేషన్కు సంబంధించి అకౌంట్లు, డా క్యూమెంట్లు సాయంత్రమే పూర్తి చేసుకోవాలని సబ్ రిజి స్ట్రార్లకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. రోజుకు సుమారు 250వరకు డాక్యూమెంట్లు రిజిస్టర్ అ య్యేవి. ఒక్క రోజులో రూ. 50 లక్షల వరకు ప్రభుత్వాదా యం వచ్చేది. సర్వర్ల డౌన్తో మూడు రోజుల రిజిస్ట్రేష న్లు సుమారు రూ.1.50కోట్ల వరకు ఆదాయం ఆగిపోనుంది. మీ సేవ ద్వారా అందిస్తున్న సుమారు 323రకాల సేవలు నిలిచిపోయాయి. జిల్లాలో సుమారు 1,000 నుంచి 1,200 వరకు ధ్రువీ కరణ పత్రాలు జారీకి సుమారు రూ. 6 నుంచి 8 లక్షల వరకు ఆదాయానికి గండిపడింది. -
ఖజానాకు తాళం!
జూన్ 2 తరువాతే లావాదేవీలు సాక్షి, అనంతపురం : బిల్లులు, ఇతరత్రా పనులపై వచ్చే వారితో నిత్యం కిటకిటలాడే జిల్లా ట్రెజరీ (ఖజానా) కార్యాలయానికి తాళం పడింది. ఈ నెలాఖరుకు రిటైర్డ్ అయ్యే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గ్రాట్యుటీ, ఈపీఎఫ్ బిల్లులు మినహా ఏ బిల్లులూ పాస్ చేయడానికి వీలులేకుండా ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర ఆర్థిక లావాదేవీల ముగింపు రాష్ట్ర అపాయింటెడ్ ‘డే’ తేదీతో ముడిపడి ఉండడమే ఇందుకు కారణం. మే 21తోనే ఉద్యోగులు తమ జీతభత్యాల బిల్లులు సమర్పించే గడువు ముగిసింది. జిల్లాలోని 17 సబ్ట్రెజరీ కార్యాలయాల నుంచి బిల్లుల చెల్లింపులకు తొలుత 24 చివరి తేదీగా నిర్ణయించినా... ఉద్యోగ సంఘాల వినతి మేరకు 26 వరకు పొడిగించారు. మొత్తం మీద ఐదు రోజుల ముందే జిల్లాలోని ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లింపులు చేయాల్సి రావడంతో ట్రెజరీ ఉద్యోగులు ఒత్తిడికి లోనయ్యారు. రాష్ట్ర విభజనలో భాగంగా జూన్ 2వ తేదీని సీమాంధ్ర, తెలంగాణ (రెండు రాష్ట్రాలు) రాష్ట్రాలకు అవిర్భావ దినంగా కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఆ రోజు నుంచి ఏ రాష్ట్రానికి సంబంధించిన లెక్కలు ఆ రాష్ట్రానివే. పాలనా వ్యవహారాలన్నీ ఆరోజు నుంచి వేర్వేరుగా జరగనున్నాయి. ఆ తేదీని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు, డీఏ బకాయిలు తదితర బిల్లులను మే 26లోగా పూర్తి చేయాలంటూ ఆర్థిక శాఖ నుంచి జిల్లా ఖజానా కార్యాలయానికి ఆదేశాలు వచ్చాయి. జిల్లాలోని దాదాపు 40,300 మంది ఉద్యోగులు, 22,352 మంది పెన్షనర్లకు సంబంధించి బిల్లుల చెల్లింపులకు వారం రోజులుగా ట్రెజరీ ఉద్యోగులు కుస్తీపడ్డారు. మొత్తం మీద చివరి రోజైన సోమవారం నాటికి (26వ తేదీ) జిల్లాలోని ఉద్యోగులకు రూ.133 కోట్లు, పెన్షనర్లకు రూ.47.50 కోట్లు చెల్లింపులు చేశారు. అయితే గత నెల ఉద్యోగస్తుల జీతాలు, చెక్కులకు రూ.286 కోట్ల బిల్లుల చెల్లింపులు చేయగా ఈ నెల రూ.133 కోట్లు మాత్రమే చేశారు. మరో విశేషమేమిటంటే ఈ ఏడాది ఉద్యోగులకు పెరిగిన డీఏ అరియర్స్ ఈ నెల చెల్లించాల్సి రావడంతో ఈ నెల ఉద్యోగులకు దాదాపు రూ.300 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. అయితే రూ.133 కోట్లు మాత్రమే చెల్లింపులు చేయగా రూ.164 కోట్లు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొంత మంది ఉద్యోగులు గడువు నాటికి బిల్లులు ట్రెజరీకి సమర్పించకపోవడవం వల్లే చెల్లింపులు చేయలేకపోయినట్లు ట్రెజరీ అధికారులు చెబుతున్నారు. ఇక డీఏ పెరగడంతో గత నెల పెన్షనర్లకు రూ.37.50 కోట్లు చెల్లింపులు చేయగా ఈ నెల రూ.47.50 కోట్లు చెల్లింపులు జరిగాయి. ముందుగానే జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగా ప్రతి నెలా మూడో తేదీలోపు వేతనాలు అందుతాయి. మే నెలలో నిర్వర్తించిన విధులకు సంబంధించి జూన్ 3వ తేదీలోగా వేతనాలు అందాలి. ఈ సారి ఇందుకు భిన్నంగా మే 31 నాటికి విధులు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉంటే ఆ వేతనాన్ని కూడా కలిపి మొత్తం వేతనం ఈనెల 26 నాటికే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశారు. -
నేటితో ఖజానా చెల్లింపులకు బ్రేక్
- ప్రభుత్వ ఆదేశాలు జారీ విభజన నేపథ్యంలో చెల్లింపులపై కొరవడిన స్పష్టత - పింఛన్ల పంపిణీకి ముందస్తు ఏర్పాట్లు అభివృద్ధి పనుల బిల్లుల మంజూరుకు ఆటంకాలు సాక్షి, గుంటూరు, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఖజానా శాఖ నుంచి చెల్లింపులకు నేటితో బ్రేకులు పడనున్నాయి. శనివారం సాయంత్రం తర్వాత ఎలాంటి బిల్లులకు చెల్లింపులు జరపరాదని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఉద్యోగులకు జీతాలు, డీఏలు, పెన్షన్దారులకు పింఛన్లు ముందస్తుగానే చెల్లించేందుకు ట్రెజరీ అధికారులు ఏర్పాట్లు చేశారు. శనివారం గడువు కావడంతో ట్రెజరీ అధికారులు నానా హైరానా పడుతున్నారు. ఉద్యోగులు,పన్షన్దారులకు చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వడంతో జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లుల మంజూరుకు ఆటంకాలు ఏర్పడనున్నాయి. ఈ నెల 19 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో జిల్లాలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. రోడ్లు, మంచినీటి పథకాలు, గోడౌన్లు, స్త్రీ శక్తి భవనాలు, అంగన్వాడీ, పాఠశాల భవనాలు తదితరాలకు సంబంధించి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. మెడికల్, హాస్టల్ డైట్స్కు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. జూన్ 2 రాష్ట్ర విభజనకు అపాయింటెడ్ డేట్ కావడంతో ఆ తర్వాతైనా బిల్లుల చెల్లింపులు చేస్తారా అన్న అంశంపై ఖజానా అధికారులకు స్పష్టత లేదు. ఆర్నెల్ల నుంచి జిల్లా అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నమైంది. అభివృద్ధి పూర్తిగా పడకేసింది. ఈ సమయంలో ట్రెజరీ నుంచి విడుదల కావాల్సిన నిధులు అందకపోవడంతో జిల్లాలో ముఖ్యంగా తాగునీటికి సమస్యలు ఏర్పడనున్నాయి. ప్రతి నెలా ట్రెజరీ ద్వారా రూ.536 కోట్ల చెల్లింపులు.. జిల్లాలో ప్రతి నెలా ట్రెజరీ ద్వారా రూ.536 కోట్లు చెల్లింపులు జరుగుతున్నాయి. రూ.236 కోట్లు ట్రెజరీకి ఆదాయం జమ అవుతోంది. జిల్లాలో 42 వేల మంది ప్రభుత్వోద్యోగులు, 40 వేల మంది పెన్షన్దారులున్నాయి. వీరికి ప్రతి నెలా రూ.252 కోట్ల మేర జీతాలు, డీఏ, పింఛన్లు చెల్లింపులు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రంతో ఖజానాకు తాళం పడనుండటంతో ట్రెజరీ అధికారులు బిజీగా మారారు. జూన్ 2 తర్వాత యథావిధిగా చెల్లింపులు జరిపేందుకు ఆదేశాలు వెలువడే అవకాశం ఉందని ట్రెజరీ అధికారులు పేర్కొంటున్నారు. -
రాజభవనమేంటీ, ఇదీ సత్రమే
జెన్ పథం ఆ రాజుకి భవనాలు కట్టించడంలో మక్కువెక్కువ. ఆయన ఎన్నో భవనాలు కట్టించాడు. అవన్నీ విలాసవంతమైనవీ, విశాలమైనవీనూ. కానీ మరోవైపు ఈ కట్టడాల వల్లఖజానా ఖాళీ అవుతూ వచ్చింది. దాంతో ఆయన ఖజానా నింపడం కోసం ప్రజలపై కొత్త కొత్త పన్నులు వేయడం మొదలుపెట్టాడు. జనం వాటిని కట్టలేక అవస్థలు పడుతూ వచ్చారు. ఆకలి బాధలు ఎక్కువయ్యాయి. కడుపునిండా తిండి లేక ప్రజలు మాడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ తరుణంలో రాజ్యంలోని ఒక వీధి గుండా ఒక సాధువు నడుచుకుంటూ పోతున్నాడు. అక్కడక్కడ ప్రజలు తమ ఇక్కట్ల గురించి మాట్లాడుకోవడం ఆయన చెవిన పడింది. ఆయన మనసులో ఏ ఆలోచన వచ్చిందో గానీ ఆయన ప్రయాణ దిశ మారింది. పొరుగూరుకు వెళ్లాలనుకున్న ఆయన తిన్నగా రాజుగారి ఆస్థానానికి అడుగులు వేశారు. సాధువు రూపం చూసీచూడగానే గౌరవించేటట్టు ఉంది. ఆయన రాజుగారి భవంతికి చేరుకున్నారు. ప్రవేశద్వారం వద్ద ఉన్న భటులు ఆయనను లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుపడలేదు. ఆయన ఎవరని కూడా అడగలేదు. సాధువు సరాసరి రాజుగారి భవనంలోకి అడుగుపెట్టారు. ఆయన వెళ్లేసరికి అక్కడ సభ జరుగుతోంది. ఇరవై మెట్లు పైన ఉన్న సింహాసనంలో రాజుగారు కూర్చుని ఉన్నారు. ఈ మెట్లకు అటూ ఇటూ ఉన్న ఆసనాలలో మంత్రులు, పండితులు కూర్చున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా నేరుగా సభలోకి వచ్చి నిల్చున్న సాధువును చూసి రాజు సహా అందరూ ఆశ్చర్యపోయారు. సాధువును చూసిన రాజు ‘‘మీరెవరు? మీకు ఏం కావాలి? మిమ్మల్ని లోపలకు పంపింది ఎవరు?’’ అని ప్రశ్నలవర్షం కురిపించాడు. కానీ సాధువు రాజుగారి మాటలేవీ పట్టించుకోకుండా ‘‘ఈ రోజు రాత్రి నిద్రపోవడానికి నాకు కాస్తంత చోటు కావాలి’’ అని అన్నారు. రాజుకుగానీ మరెవ్వరికీ గానీ ఆయన మాట అర్థం కాలేదు. ‘‘ఏంటీ? నిద్రపోవడానికా’’ అని రాజు అడిగాడు. ‘‘ఈ రోజు రాత్రి ఈ సత్రంలో నిద్రపోవాలనుకుంటున్నాను. రేపు ఉదయం లేచీలేవగానే నా పనులు కానిచ్చుకుని వెళ్లిపోతాను’’ అని సాధువు తాపీగా జవాబిచ్చారు. ‘‘చూడ్డానికి పెద్దవారిలా ఉన్నారు. మీ మాట విచిత్రంగా ఉంది. ఇది మీరనుకుంటున్నట్లు సత్రం కాదు. ఇది నా రాజభవనం’’ అని రాజు మీసాలు దువ్వాడు. ‘‘అలాగా?’’ అంటూ ‘‘మీ ముందు ఇక్కడ ఎవరున్నారు?’’ అని అడిగారు సాధువు. ‘‘మా నాన్నగారు’’ ‘‘ఆయన ఎక్కడున్నారు?’’ ‘‘ఆయన ఇప్పుడు లేరు. గతించారు’’ ‘‘ఆయనకన్నా ముందు...’’ ‘‘మా తాతగారు’’ ‘‘ఆయన ఏమయ్యారు?’’ ‘‘ఆయనా చనిపోయారు’’ - ఇలా మరో రెండు తరాల వారి గురించి వారి మధ్య మాటలు సాగాయి. ఆ తర్వాత సాధువు ‘‘బాటసారులు కొంతకాలం బసచేసి వెళ్లిపోయే చోటును సత్రమనేగా అంటారు. మీరంటున్న ఈ రాజభవనంలో ఇప్పుడు మీరున్నారు. మీ కన్నా ముందు మీ నాన్నగారు. అంతకన్నా ముందు మీ తాతగారు, ఆయన కన్నా ముందు మీ ముత్తాత ఇలా ఎవరో ఒకరు ఉండిపోయే ఈ చోటుని కూడా సత్రమనే నేనంటాను. ఏమీ అనుకోకపోతే ఒక మాటంటాను. ఇప్పుడు మీరున్నారు. మీ తర్వాత మీ కుమారుడు ఉంటాడిక్కడ. అతని తర్వాత అతని కుమారుడు... ఇలా ఉండిపోతుంటారు. ఎవరూ శాశ్వతంగా ఉండడం లేదు. అటువంటప్పుడు ఇది ఎలా రాజప్రాసాదం అవుతుంది. ఇదీ ఒక సత్రమే అనుకోవడంలో తప్పేముంది?’’ అని ప్రశ్నించడంతో రాజు ఆ సాధువు సామాన్యులు కాదని, ఓ జ్ఞాని అని గ్రహించాడు. ఆయన ఏం చెప్పదలచుకున్నారో అర్థమైంది. ఆయన తన కళ్లు తెరిపించారని తెలుసుకుని అప్పటి నుంచి విలాసవంతమైన భవనాలు కట్టించడం మానేశాడు. ఖజానాలో డబ్బులు మిగుల్తూ వచ్చాయి. దాంతో ప్రజలపై పన్నులు విధించే అవసరమూ కలగలేదు. అప్పటి దాకా ఉన్న పన్నులే కాకుండా పన్ను బకాయిలను సైతం కట్టక్కర్లేదని దండోరా వేయించాడు. ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రజల ప్రశంసలు పొందుతూ రాజు మిగిలిన శేషజీవితం ఆనందంగా గడిపాడు. - యామిజాల జగదీశ్ -
ట్రెజరీ పనుల్లో స్తంభన
రెండు రోజులుగా సర్వర్ సమస్య జీతాల చెల్లింపులకు అంతరాయం బిల్లుల సమర్పణకు ముగిసిన గడువు పొడిగింపు ఉత్తర్వులు ఇంతవరకు అందలేదు విభజన నేపథ్యంలో స్పష్టతలేని వైనం సాక్షి,చిత్తూరు : జిల్లా ట్రెజరీతో పాటు, మదనపల్లె, తిరుపతి, పుత్తూరు, చిత్తూరు సబ్ ట్రెజరీల్లో సర్వర్లో ఏర్పడిన సాంకేతిక సమస్యతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సేవలు స్తంభించాయి. సర్వర్ కనెక్టు కావడం, తిరిగి ఆగిపోతుండటంతో పనులకు అంతరాయం ఏర్పడింది. ఈ సమస్య రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉందని ట్రెజరీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ట్రెజరీ బిల్లుల మంజూరు, ఇతర లావాదేవీలకు అనుమతి ఇవ్వాలన్నా, ఆర్థిక శాఖ సైట్లో వివరాలు పొందుపరచాలన్నా, అనుమతులు పొందాలన్నా, వివిధ హెడ్ అకౌంట్ల వివరాలు తెలుసుకోవాలన్నా అంతరాయం కలుగుతోంది. ప్రభుత్వ కార్యకలాపాలకు, వివిధ శాఖల ఆర్థిక అవసరాలు తీర్చేందుకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏర్పడుతోంది. జీతాలకు ఇబ్బందే..... మే నేల జీతాలకు సర్వర్ సాంకేతిక సమస్యతో పాటు, రాష్ట్ర విభజన ఎఫెక్ట్ పడనుంది. జిల్లాలో 40 వేల మందికిపైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల జీతాల చెల్లింపులో జాప్యం ఏర్పడే పరిస్థితి. బిల్లుల సమర్పణకు 19వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. ఇంకా కొన్ని శాఖల నుంచి జీతాల బిల్లులు ట్రెజరీలకు అందలేదు. అదే సమయంలో సర్వర్డౌన్ కావటంతో వివిధ శాఖలు ఇచ్చిన జీతాల బిల్లులను ట్రెజరీల్లో వివరాలు అప్లోడ్చేసి పాస్ చేసే పరిస్థితి లేదు. బిల్లు పాస్ చేసేందుకు గడువు పొడిగింపునకు సంబంధించి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ క్రమంలో ట్రెజరీ అధికారులు ఎలా చేయాలి, ఏం చేయాలని తర్జనభర్జన పడుతున్నారు. జూన్ 2వ తేదీ అపాయింటెడ్ డేకు ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అకౌంట్లతో కార్యకలాపాలు నిర్వహించేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు కసరత్తు చేశారు. అందులో భాగంగా ఈ నెల 24వ తేదీనే ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించేసి కార్యకలాపాలు ముగించాలని నిర్ణయించారు. ఆ తరువాత తెలంగాణ వేరుగా, సీమాంధ్ర(ఆంధ్రప్రదేశ్) వేరుగా ఆర్థికశాఖ కార్యకలాపాలు నిర్వహించుకుంటాయి. అప్పటి నుంచి కొత్తరాష్ట్ర ట్రెజరీ కార్యకలాపాలు ఒక వారం ముందు నుంచే మే 25వ తేదీ నుంచే ప్రారంభించి నిర్వహణాపరమైన సమస్యలు ఏవైనా తలెత్తితే గమనించి సరిదిద్దేలా ప్రణాళిక రూపొందించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సర్వర్ సక్రమంగా పనిచేయని కారణంగా ఈ నెల 24వ తేదీకి జీతభత్యాల చెల్లింపులు చెల్లించే పరిస్థితి కనపడటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి..... చిత్తూరు జిల్లాతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్ డౌన్కావటం మూలంగా అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని జిల్లా ట్రెజరీ అధికారి పాలేశ్వర్రావు తెలిపారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో సమస్య కనుక ప్రభుత్వ స్థాయిలో చర్యలుచేపట్టాల్సి ఉందన్నారు. జీతాల బిల్లులు పాస్ చేసేందుకు గడువు పొడగింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఇంకా అందలేదన్నారు. -
24 గంటలూ ఖజానా కార్యాలయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో మే వరకు ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలతో పాటు డీఏ బకాయిలు, ఇతర బిల్లులన్నీ ఈ నెల 24లోగా చెల్లించేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిత్యం వేల సంఖ్యలో ఖజానా, ఉప ఖజానా కార్యాలయాలకు బిల్లులు వస్తున్నాయి. ఆన్లైన్లో బిల్లుల సమర్పణ ఒక్కసారిగా పెరిగిపోవడంతో సర్వర్స్ డౌన్ అయి మొరాయిస్తున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన ఆర్థిక శాఖ ఇక నుంచి 24గంటలూ ఖజానా, ఉప ఖజానా కార్యాలయాలు పనిచేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జిల్లాల వారీ బిల్లుల సమర్పణ గడువును ఈ నెల 19 నుంచి 21 వరకు పొడిగించింది. జిల్లాల వారీగా బిల్లుల సమర్పణ సమయం ఈ విధంగా ఉంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల బిల్లులను ఆన్లైన్లో సమర్పించాలి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాలతో పాటు హైదరాబాద్ పీఏవో కార్యాలయం బిల్లులను ఆన్లైన్లో సమర్పించాలి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్ జిల్లాల బిల్లులను ఆన్లైన్లో సమర్పించాలి. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల బిల్లులను ఆన్లైన్లో సమర్పించాలి. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు అన్ని జిల్లాల బిల్లులను ఆన్లైన్లో సమర్పించాలి. -
విదేశీ నాణేలకు తుప్పు
=మార్చడంలో టీటీడీ అధికారుల నిర్లక్ష్యం =పరకామణి నుంచి ట్రెజరీకి చేరుతున్న కాయిన్లు సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారికి విదేశీ భక్తులు సమర్పించిన నాణేలు నాలుగేళ్లుగా ట్రెజరీలో మగ్గుతున్నాయి. టీటీడీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి పూర్తిగా తుప్పుపట్టే పరిస్థితి నెలకొంది. తిరుమలకు వేలాదిమంది విదేశీ భక్తులు, ప్రవాసభారతీయులు వస్తుం టారు. వారు ఆయా దేశాలకు చెందిన నాణేలను శ్రీవారికి కానుకలుగా సమర్పిస్తుంటారు. వీటిని పరకామణి సిబ్బంది లెక్కించే సమయంలో వేరు చేస్తారు. స్వదేశీ నాణేలను బ్యాంకుల్లో జమ చేస్తారు. విదేశీ నాణేలను తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ట్రెజరీకి పంపుతారు. ట్రెజరీ నుంచి వాటిని విదేశీ బ్యాంకుల్లో మార్చుకుని, తిరిగి టీటీడీ బ్యాంకుల్లో జమచేయాల్సి ఉంది. ఈ పద్ధతి 2009 వరకు బాగానే జరిగింది. ఆ తర్వాత విదేశీ బ్యాంకులను సంప్రదించడం మానేశారు. ఈ నాణేలను ట్రెజరీలోనే భద్రపరుస్తున్నారు. తిరుమలలో జరిగే హుండీ లెక్కింపుల ద్వారా వచ్చిన ఈ మొత్తాన్ని, తిరుపతిలోని ట్రెజరీకి అప్పగిస్తారు. ఇలా అప్పగించిన నాణేలు నాలుగు సంవత్సరాలుగా పరిపాలనా భవనంలోని ట్రెజరీలోనే మగ్గుతున్నాయి. వీటిని మార్చడానికి టీటీడీ అధికారులకు సమయం లేదో, లేక ఆ డబ్బు అక్కరలేదని అనుకుంటున్నారో తెలియడం లేదని టీటీడీ ఉద్యోగులు అంటున్నారు. 2009 నుంచి 2011 వరకు వచ్చిన విదేశీ కరెన్సీ దాదాపు 600 బ్యాగుల్లో నిక్షి ప్తమై ఉ న్నాయి. ఒక్కో బ్యాగు 30 నుంచి 40 కిలోల వరకు బ రువు ఉంటుందని సంబంధిత అధికారులు తెలి పారు. వీటిలో పది లక్షలకు పైగా నాణేలు ఉండవచ్చని అంచనా. స్వదేశీ కరెన్సీతో ఈ నాణేలను మారిస్తే దాదాపు 60 నుంచి 70 కోట్ల రూపాయల వరకు టీ టీడీ పేరిట జమ అవుతుంది. ఇది కాకుండా 2011 నుంచి 2013 వరకు వచ్చిన నాణేలు మరో పది టన్నుల వరకు ఉన్నట్టు సమాచారం. ఇది కూడా కోట్ల రూపాయల్లోనే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇన్నాళ్లూ వీటిని మార్చక పోవడం వల్ల ఎంతో వడ్డీని పోగొట్టుకోవాల్సి వస్తోంది. వారానికొక సారి కట్నోట్ల మార్పిడి విదేశీ నాణేలను మార్చకుండా అలాగే దాచి పెడు తుండగా, కట్ నోట్లను మాత్రం వారానికి ఒకసారి మారుస్తున్నారు. దీనికి బాం్యకు అధికారులు ముం దుకు వచ్చి, ఎన్ని కట్ నోట్లు ఉన్నాయో తీసుకుని, వాటిని టీటీడీ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంటారు. అయితే విదేశీ నాణేల మార్పిడిలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. టీటీడీ ట్రెజరీలోని గదులు ఈ బ్యాగులతో నిండిపోతున్నాయి. కొన్ని నాణేల రూపురేఖలు మారిపోతున్నాయి. కొన్ని తుప్పు పట్టే స్థితికి చేరుకుంటున్నాయి. దీనిపై టీటీడీ అధికారి ఒకరు మాట్లాడుతూ పురాతన నాణేలను మ్యూజియంలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. మిగిలిన నాణేలను త్వరలోనే మారుస్తామని తెలిపారు. నాణేలు ఎక్కువగా ఉండడంతో వాటిని ఏ బ్యాంకుకు ఇవ్వాలనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
వైఎస్కు ఆజన్మాంతం రుణపడి ఉండాలి
ధర్మవరం టౌన్, న్యూస్లైన్ : ట్రెజరీ ద్వారా సకాలంలో జీతాలు అందేలా ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి మునిసిపల్ ఉద్యోగులు ఆజన్మాంతం రుణపడి ఉండాలని మునిసిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమోహన్ అన్నారు. బుధవారం స్థానిక పాత మునిసిపల్ కార్యాలయం వద్ద మునిసిపల్ ఉద్యోగ సంఘం నాయకులతో సమైక్య ఉద్యమ కార్యాచరణ కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ.. నిర్వీర్యమైన మునిసిపల్ వ్యవస్థకు చక్కదిద్ది.. అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత వైఎస్దేనన్నారు. ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా జీతాలు అందించడమే కాకుండా ఫ్రీ ఆడిట్, మెడికల్ రీ యింబర్స్మెంట్ అందించి వారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు. మునిసిపల్ శాఖ ఉద్యోగులు సమైక్య ఉద్యమంలో కీలకపాత్ర వహిస్తున్నారన్నారు. ప్రజా జీవనానికి ఆటంకం కలగకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అసమర్థ సీమాంధ్ర ఎంపీల వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టిందన్నారు. వీరంతా ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నారని, విభజన వద్దని కోరడం లేదన్నారు. సమైక్య రాష్ట్ర ప్రకటన వెలువడే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ ఉద్యోగుల సంఘం పట్టణ అధ్యక్షులు చిన్న రాజు, ఉపాధ్యక్షులు సాయి ప్రకాష్, నాయకులు వెంకటరామయ్య, శివాజి, నర్సింహులు, రవి, రామాంజినేయులు, సత్యం, పుల్లయ్య తదిత రులు పాల్గొన్నారు. -
సీమాంధ్రలో స్తంభించిన ట్రెజరీ
* వారంలో రూ.1,000 కోట్ల రాబడి బంద్ * 13 జిల్లా ట్రెజరీ, 194 ఉప ట్రెజరీలకు తాళం సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర జిల్లాల్లో ఈనెల 13 నుంచి ట్రెజరీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. 13 జిల్లాల ఖజానా కార్యాలయాలతోపాటు 194 ఉప కార్యాలయాలు గత వారం రోజులుగా తెరవడం లేదు. ఉద్యోగులు సమ్మెకు దిగడంతో కార్యాలయాలకు తాళాలు వేశారు. దీని ప్రభావం సర్కారు రాబడిపై తీవ్రంగా పడింది. ఈ 13 జిల్లాల నుంచి రోజూ రాష్ట్ర సర్కారుకు రూ.140 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు రాబడి వస్తుంది. సమ్మె కారణంగా వారం రోజులుగా సుమారు రూ.వెయ్యి కోట్ల మేర రాబడి నిలిచిపోయింది. ట్రెజరీ కార్యాలయాలు పనిచేయకపోవడంతో సుమారు రూ. 1,200 కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రస్తుతానికి రాబడులు, చెల్లింపులు నిలిచిపోయినప్పటికీ ఉద్యోగుల సమ్మె విరమించిన తర్వాత రాబడులు వస్తాయి. చెల్లింపులు కూడా సాగుతాయి. అయితే ఇప్పుడు రాబడులు లేకపోవటం ప్రభుత్వ వ్యయంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థికశాఖ ఉన్నతాధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభావం వచ్చేనెల ఉద్యోగులకు జీతాల చెల్లింపు, ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ చెల్లింపుపై పడుతుందని వివరించారు. ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల విక్రయం ద్వారా రూ. 1,800 కోట్ల రుణాన్ని సేకరించిందని, అత్యవసరాలకు ఆ నిధులను వినియోగించుకుంటామని, వచ్చేనెలలో కూడా ఇదే పరిస్థితులు కొనసాగితే కష్టమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.