troubles
-
తప్పని తిప్పలు: జాబొచ్చినా జాయినింగ్ లేదు!
గత ఏడాదే కోర్సులు పూర్తి చేసుకున్న ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు క్యాంపస్ రిక్రూట్మెంట్లలో ఎంపికైనా ఉద్యోగాలు మాత్రం ఇంకా చేతికి అందలేదు. ఏడాది కింద కాలేజీలకే వెళ్లి, మెరిట్ విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి రిక్రూట్ చేసుకున్న కొన్ని కంపెనీలు ఇప్పటికీ ‘ఆన్ బోర్డింగ్ (ఉద్యోగాల్లో చేర్చుకోవడం)’ప్రక్రియను మొదలుపెట్టలే దు. పైగా మళ్లీ కొత్తవారి కోసమంటూ పలు కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేపడుతుండటం.. చిన్న కంపెనీలే కాకుండా బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ)లు కూడా ఇలాగే వ్యవహరిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఉద్యోగం వస్తుందా, రాదా? భవిష్యత్తు ఎలా ఉంటుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్/డిగ్రీ చదువు ముగియగానే క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఎంపిక కావడంతో.. తమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే ఊహలు తలకిందులు అవుతున్నాయని వాపోతున్నారు. – సాక్షి, హైదరాబాద్ నిరుద్యోగుల వెతలెన్నో.. ఇటీవల ‘ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ (ఫైట్)’చేసిన అధ్యయనంలో ‘ఆఫర్ లెటర్ల’తో అభ్యర్థు లు ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి. భారీ సంఖ్యలో ఐటీ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేస్తూ ఆఫర్ లెటర్లు (లెటర్ ఇంటెంట్) ఇచ్చిఏడాది దాటుతున్నా ఆన్ బోర్డింగ్ సమాచారం ఇవ్వడం లేదు. దీనితో చాలా మంది ఆందోళనలో పడిపోతున్నారు. ఇక కొన్ని కంపెనీలు ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నా యి. మరికొన్ని కంపెనీలు ఉద్యోగంలో చేరేందుకు నిర్ణీతకాలానికి బాండ్లు సమర్పించాలని, ఒరిజి నల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కొర్రీలు పెడుతు న్నా యి. అభ్యర్థులు ఇతర కంపెనీల్లో మంచి ఉద్యో గాలు, ఆఫర్లు వచ్చినా వెళ్లలేని పరిస్థితిని కల్పిస్తున్నాయి. కొన్ని కంపెనీలు తాము శిక్షణ, ఇతరాల కోసం వెచ్చించిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లిస్తే ఇతర కంపెనీలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నాయి. ఫైట్ నిర్వహించిన సర్వేలో వేయి మందికి పైగా ఆఫర్ లెటర్ల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇన్ఫోసిస్, ఎంఫసిస్, విప్రో, క్యాప్జెమిని వంటి ప్రధాన కంపెనీలు కూడా ఇందులో ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఆందోళన వద్దు.. ఐటీరంగంలో ఒడిదుడుకులు సహజమేనని, యువత తమ నైపుణ్యాలు, నాలెడ్జ్ను పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగాల కోసం కొన్నినెలల నిరీక్షణ ఫరవాలేదని, అది ఎక్కువ కాలమైతేనే సమస్యగా మారుతుందని చెప్తున్నారు. రెండు, మూడేళ్లకోసారి కరెక్షన్ వస్తుందని, అది ఆయా రంగాలకు మంచిదే తప్ప హానికరం కాదని పేర్కొంటున్నారు. ముందే స్పష్టత తీసుకోవాలి.. ఎంఎన్సీలు సహా వివిధ ఐటీ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్కు వచ్చినప్పుడే ఏ తేదీ లోగా ‘ఆన్ బోర్డింగ్’చేస్తారనే దానిపై కాలేజీ యాజమాన్యాలు స్పష్టత తీసుకోవాలి. లేకుంటే కంపెనీలు తమకు నచ్చినట్టు చేస్తూ.. అవసరముంటే నెలలోనే జాయినింగ్ ఇస్తూ, లేకుంటే నెలల తరబడి జాప్యం చేస్తూ వెళుతున్నాయి. ఈ విషయంలో అటు కాలేజీలు, ఇటు కంపెనీల తప్పిదాలు ఉన్నాయి. ఐటీ కంపెనీ లు వెంటనే ఉద్యోగం ఇవ్వకపోయినా శిక్షణ ఇవ్వొ చ్చు. ఇంటర్న్షిప్, ట్రైనింగ్ ప్రాసెస్తో నడిపించవచ్చు. ఫ్రెషర్స్ కూడా ఒక కంపెనీ ఆఫర్కే పరిమి తం కాకుండా మరో కంపెనీలో ప్రయత్నించొచ్చు. ఆన్బోర్డింగ్ వచ్చేలోగా చిన్న కంపెనీలు, స్టార్టప్లలో చేరి నైపుణ్యాలు మెరుగుపరుచుకోవచ్చు. – రమణ భూపతి, క్వాలిటీ థాట్ గ్రూప్ చైర్మన్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఆఫర్ లెటర్లు ఇచ్చినా జాయినింగ్ తేదీపై కంపెనీలు స్పష్టత ఇవ్వకపోవడంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కార్మిక శాఖ ద్వారా సర్వే నిర్వహించాలి. ఆఫర్ లెటర్లను గౌరవించని సంస్థలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వపరంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఇటీవల మా సంస్థ సర్వేలో వెల్లడైన అంశాలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్లకు అందజేశాం.. – సి.వినోద్కుమార్, కన్వీనర్, ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ ఆర్థిక మాంద్యం తొలగితే చక్కబడొచ్చు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య పరిస్థితి నెలకొంది. మార్కెట్ వాస్తవ పరిస్థితి ఏమిటనేది మరో మూడు నెలల్లో స్పష్టత వస్తుంది. కంపెనీలు మంచి ఉద్ధేశంతోనే ఫ్రెష్ రిక్రూట్మెంట్ చేపట్టాయి. కంపెనీ బిజినెస్ అవసరాలను బట్టి ఆఫర్ లెటర్లు ఇచ్చిన వారిని ఆన్బోర్డింగ్కు పిలుస్తుంటాయి. ఆఫర్ లెటర్లు ఇచ్చి పిలవనంత మాత్రాన అది నేరమేమీ కాదు. ఎకానమీ వృద్ధి చెంది పరిశ్రమకు సానుకూల పరిస్థితులు ఏర్పడితే అన్నీ సర్దుకుంటాయి. గత వందేళ్లలో ప్రతి ఏడెనిమిదేళ్లకోసారి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా విస్తృతి పెరిగి ఎక్కువ ప్రచారం జరగడం తప్ప ఇది కొత్తగా వచ్చిన సమస్యేమీ కాదు. యువత సమయాన్ని సద్వినియోగం చేసుకుని స్కిల్స్ పెంచుకోవాలి. – కోఫోర్జ్ వెంకా రెడ్డి, సీనియర్ హెచ్ఆర్ లీడర్ -
గూడు చెదిరి.. గుండె పగిలె.. ఎటు వెళ్లాలో తెలియని అయోమయం, ఆందోళన
సాక్షి, యాదాద్రి: బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న భూములు, ఇళ్లకు పూర్తి పరిహారం ఇవ్వకుండానే అధికార యంత్రాంగం అక్కడి ప్రజలను ఖాళీ చేయిస్తోంది. దీంతో ఎటు వెళ్లాలో తెలియని అయోమయం, ఆందోళన కారణంగా మనస్తాపం చెందిన నిర్వాసితుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీఎన్ తిమ్మాపూర్ గ్రామంలో నెలకొన్న దయనీయపరిస్థితి ఇది. వ్యవసాయ భూములు, ఇళ్లు పోయి.. పరిహారం రాక భవిష్యత్తుపై భయంతో పాటు రకరకాల కారణాలతో దాదాపు ఐదేళ్లలో గ్రామంలో 50 మందికి పైగా చనిపోయారు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేయలేకపోతున్నామని తల్లిదండ్రులు.., తమకు పిల్లను ఇవ్వడంలేదని మనోవేదనతో కొందరు యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరికొందరు అనారోగ్యంతో మంచంపట్టారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో గత 57 రోజులుగా బస్వాపూర్ ప్రాజెక్టు కట్టపై నిర్వాసితులు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. బుధవారం కూడా ఓ నిర్వాసితుడు బెంగతో చనిపోయాడు. ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు.. కాళేశ్వరం ప్రాజెక్టులో చివరిదైన నృసింహసాగర్ రిజర్వాయర్ (బస్వాపూర్ రిజర్వాయర్)ను 11.39 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు 1,724 ఎకరాల భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీచేశారు. ఇందులో 700 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. కాగా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా బీఎన్ తిమ్మాపూర్, లక్ష్మీనాయకుని తండా, చోకల్నాయకుని తండాలు పూర్తిగా మునిగిపోతున్నాయి. ప్రభుత్వం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ముంపు గ్రామాల వాసులకు ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో జాప్యం అవుతోంది. బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్తుల వ్యవసాయ భూములకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు అందరికీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 23న గ్రామంలోని 655 నివాస గృహాలను ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ముంపు భూములకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ డబ్బులను మరింత పెంచి ఇవ్వాలని గ్రామస్తులు తీర్మానం చేసి నోటీసులు తీసుకోకుండా అధికారులను తిప్పిపంపారు. 655 మందికే పరిహారం.. బీఎన్ తిమ్మాపూర్లో గ్రామకంఠంతోపాటు పరిసరాల్లోని 36.11 ఎకరాల భూమి మునుగుతోంది. ఇంతవరకు ఈ భూమికి సంబంధించి అవార్డు ప్రక్రియ మొదలుకాలేదు. దీంతో ఎంత పరిహారం వస్తుందో తెలియని పరిస్థితి. అలాగే భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో 90 ఎకరాల్లో లేఅవుట్ను అభివృద్ధి చేస్తున్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద గ్రామంలో 1,086 మంది నిర్వాసితులు తేలారు. వీరిలో 655 మందికి పరిహారం చెల్లించారు. ఒక్కొక్కరికి రూ.7.61 లక్షల చొప్పున రూ.50 కోట్లు పంపిణీ చేశారు. మిగతా వారికి రూ.34 కోట్లు రావాల్సి ఉంది. డబ్బులు ఒకేసారి ఇవ్వకపోవడంతో విడతలుగా వచ్చిన డబ్బులు వృథాగా ఖర్చవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. డబ్బులు చేతికి వచ్చిన వారిలో సగం మందికిపైగా చేతిలో చిల్లిగవ్వకూడా లేకుండా ఖర్చు అయ్యాయని చెపుతున్నారు. పరిహారం రాని వారు ఎప్పుడిస్తారో.. అని ఎదురుచూస్తున్నారు. గ్రామస్తుల ప్రధాన డిమాండ్లు.. ►2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. ►2019లో ప్రకటించిన అవార్డును రద్దు చేసి కొత్తగా భూసేకరణ అవార్డును ప్రకటించాలి. ►ప్రాజెక్టు ముంపులో కోల్పోతున్న వ్యవసాయ భూములు, ఇళ్లకు పరిహారం ఒకేసారి చెల్లించాలి. ►గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీని ప్రకటించాలి ►భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని హుస్నాబాద్ వద్ద 107 సర్వే నంబర్లో చేపట్టిన లేఅవుట్ ప్లాట్లను వెంటనే బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్తులకు కేటాయించాలి. ఒక్కో ఇంటినిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేయాలి. పరిహారం డబ్బులన్నీ పప్పు పుట్నాలకే.. ప్రభుత్వం తీసుకున్న భూములకు పరిహారం డబ్బులన్నీ ఒకేసారి ఇవ్వకపోవడంతో నిర్వాసితులకు ఇంతవరకు ఇచ్చిన డబ్బులన్నీ ఇతర అవసరాలకే ఖర్చయ్యాయి. అప్పుడప్పుడు ఇచ్చిన పరిహారం డబ్బులు ఇలా ఖర్చు కావడంతో రైతుల చేతులు ఖాళీ అయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు తొలుత ఎకరానికి రూ.6 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. బస్వాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు ఆ తర్వాత రిజర్వాయర్ సామర్థ్యాన్ని 0.87 టీఎంసీలనుంచి 11.39 టీఎంసీలకు పెంచిన ప్రభుత్వం.. నిర్వాసితులకు 123 జీవో ప్రకారం పరస్పర అంగీకారం ద్వారా ఎకరానికి రూ.15.60 లక్షల చొప్పున 400 ఎకరాలకు పరిహారం ఇచ్చింది. కానీ, ఆ తర్వాత 2019 డిసెంబర్ 11న జారీచేసిన అవార్డు ప్రకారం దానిని సవరించి ఎకరానికి రూ.15.30 లక్షలు నిర్ణయించింది. అయితే, పరిహారం మరింత ఎక్కువగా ఇవ్వాలని రైతులు కోరుతూ వస్తుండగా.. రూ.30 వేలు తగ్గడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎక్కువ పరిహారం వస్తుందని భావించిన రైతులకు పరిహారం ఇలా తక్కువగా రావడంతో తీవ్ర మనో వేదన చెందుతున్నారు. మా భూమికి డబ్బులు రాలేదు బస్వాపురం రిజర్వాయర్లో మా భూమి 12 ఎకరాలు పోయింది. ఇందులో 5 గుంటల భూమి పైసలు మాత్రమే పడ్డాయి. మిగతా డబ్బులు నేటికీ ఇవ్వలేదు. పునరావాసం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు కానీ నేటికీ లేదు. రెవెన్యూ అధికారులు ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా గ్రామంలో ఉన్న ఇళ్లకు నోటీసులు ఇవ్వడానికి వచ్చారు. ముంపు భూములు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ డబ్బులు మొత్తం అందరికీ ఇస్తే తప్ప నోటీసులు తీసుకోబోమని చెప్పాం. – ఎండీ సాబేర్, బీఎన్ తిమ్మాపురం అనారోగ్యం పాలవుతున్నాం ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం ఎదురుచూస్తూ, ఎంత వస్తుందో.. ఎప్పుడు ఇస్తా రో అని ఆలోచిస్తూ అనారోగ్యం పాలు అవుతున్నాం. గ్రామంలో ఇలా ఆలోచించి కొందరు చనిపోగా, మరికొందరు ఆస్పత్రుల పాలయ్యారు. నాకున్న అర ఎకరం వ్యవసాయ భూమి బస్వాపురం రిజర్వాయర్ కట్ట కోసం పోయింది. అప్పుడు ఎకరానికి రూ.6 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఆ డబ్బులతో ఎక్కడా భూమి కొనుగోలు చేయలేకపోయాం. ఇంటి కోసం ఇచ్చే ఆర్అండ్ఆర్ ప్యాకెజీ కోసం ఎదురు చూస్తున్నాం. – జంగిటి సుగుణ, బీఎన్ తిమ్మాపూర్ రూ. 46.35 కోట్లు విడుదల బస్వాపూర్ ప్రాజెక్టు ముంపు బాధిత కుటుంబాల పరిహారం, లే అవుట్ అభివృద్ధికి ప్రభుత్వం బుధవారం రూ.46.35 కోట్లను విడుదల చేసింది. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలసి బా«ధితులకు పరిహారం ఇవ్వాలని కోరడంతో వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చారు. ఇందులో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం రూ.33.45 కోట్లు, పునరావాస లేఅవుట్ అభివృద్ధికి రూ.12.90 కోట్లు ఉన్నాయి. రెండురోజుల్లో బాధితులకు పరిహారం అందుతుంది. – ఫైళ్ల శేఖర్రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి -
నిధుల ‘పంచాయితీ’.. బిల్లులు పెండింగ్తో సర్పంచ్ల గగ్గోలు..
ఇటీవల నల్లగొండ జిల్లా మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సిబ్బందితో కలిసి భిక్షమెత్తారు. సర్పంచ్ నయ్యా ‘దానం చేయండి’అంటూ బ్యానర్ పట్టుకుని, డప్పు కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని పడగల్ వడ్డెర కాలనీ సర్పంచ్ ముత్తెమ్మ భర్త మల్లేష్ పంచాయతీ అభివృద్ధి కోసం అప్పులు చేశాడు. బిల్లులు రాకపోవడంతో, తెచ్చిన అప్పులు కట్టలేక ఈ మధ్యనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సాక్షి, హైదరాబాద్ / నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో సర్పంచ్ల పరిస్థితి అటు చెంపదెబ్బ, ఇటు గోడ దెబ్బ అన్నట్టుగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన ఆర్థిక సంఘాల నిధులు రూ.వందల కోట్లు పెండింగ్లో ఉన్నాయి. నిధుల్లేకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. సిబ్బంది వేతనాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపు, పారిశుధ్య పనుల నిర్వహణ కష్టంగా మారుతోంది. కొన్నిచోట్ల రక్షిత మంచినీటి సరఫరా చేసే విద్యుత్ మోటార్లు పాడైతే మరమ్మతు చేసే పరిస్థితి కూడా లేదు. మరికొన్ని చోట్ల లక్షల్లో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచ్లు.. బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకంతో వడ్డీలు కట్టలేక, కుటుంబ పోషణ కూడా భారమై దినసరి కూలీలుగా మారుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 1,692 గ్రామ పంచాయతీలున్నాయి. ఎస్ఎఫ్సీ నుంచి రూ.89.63 కోట్ల నిధులు రావాలి. 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.45 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా.. ఖమ్మం జిల్లాలోని 20 మండలాల్లో 589 గ్రామ పంచాయతీలున్నాయి. కేంద్రం, రాష్ట్రం నుంచి నెలకు రూ.13 కోట్లు వస్తున్నాయి. ఏప్రిల్ నుంచి కేంద్రం నిధులు, గత రెండు నెలలుగా రాష్ట్ర నిధులు రాలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 481 పంచాయతీలున్నాయి. ప్రతినెలా విడుదలయ్యే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.10.30 కోట్లు రావాలి. కానీ ఈ మార్చి నుంచి నిధులు రాలేదు. ఇక చేపట్టిన పనులకు సర్పంచులకు ఏడాదిన్నరగా బిల్లులు రాలేదు. చిన్న జీపీలకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల దాకా, పెద్ద జీపీలకు రూ.12 నుంచి రూ.18 లక్షల దాకా పెండింగులో ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.. మొత్తం జీపీలు 1,507. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కేంద్ర, రాష్ట్రాల నుంచి రూ.203.39 కోట్ల నిధులు పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా బేల మండల సర్పంచ్లు నిధుల విడుదలలో జాప్యానికి నిరసనగా ధర్నాకు దిగారు. సూర్యాపేట జిల్లా.. సూర్యాపేట జిల్లాలో 475 జీపీలున్నాయి. నెలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.8.75 కోట్లు, ఎస్ఎఫ్సీ నిధులు రూ.8.25 కోట్లు రావాల్సి ఉంది. కానీ కొన్ని నెలలుగా నిధులు రావడం లేదు. అయితే ఇటీవలే ఎస్ఎఫ్సీ ఒక నెల నిధులు రూ.8.25 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా 15 ఆర్థిక సంఘం నిధులు రూ.70 కోట్లు, ఎస్ఎఫ్సీ నిధులు రూ. 24.75 కోట్లు పెండింగులో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర నిధులు రూ.2 వేల కోట్లు పెండింగ్! నిధుల విడుదల, బిల్లుల చెల్లింపులో జాప్యానికి తాము కారణం కాదంటే తాము కారణం కాదని అంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. తాము ఇచి్చన డబ్బుల వల్లే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని చెప్పుకుంటున్నాయి. కేంద్రం 15వ ఆర్థిక సంఘం ద్వారా ఇస్తున్న నిధులకు సమానంగా తాము కూడా రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్ఎఫ్సీ) ద్వారా ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్నామని రాష్ట్ర సర్కార్ చెబుతోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఆదాయం అంతగా లేని కొన్ని చిన్న పంచాయతీల్లో ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి (గత ఏప్రిల్ నుంచి) 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేదు. మరోవైపు పలు గ్రామ పంచాయతీలకు దాదాపు 3, 4 నెలలుగా రాష్ట్ర ఆర్థిక కమిషన్ నిధులు ఆగిపోయాయి. కేంద్రం నుంచి వచి్చన నిధులకు సంబంధించిన వినియోగ సరి్టఫికెట్లు (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీలు) రాష్ట్రం సమర్పించలేదని, అందుకే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 12,769 గ్రామ పంచాయతీల్లో (జీపీలు) 7,100కు పైగా మైనర్ పంచాయతీలు, వాటిలో కొత్తగా ఏర్పాటైన జీపీలు 4,383 ఉన్నాయి. ఈ పంచాయతీల్లో ఐదారు వందల లోపు జనాభా ఉన్న పంచాయతీలే ఎక్కువగా ఉండగా, సొంత ఆదాయ వనరులు లేక ఈ పంచాయతీలన్నీ పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే నిధులపైనే ఆధారపడి ఉన్నాయి. కాగా 15వ ఆరి్ధకసంఘం నిధులు గత ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు రూ.1,000 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంది. అలాగే నాలుగు నెలల కాలానికి సంబంధించిన రాష్ట్ర ఆర్థిక కమిషన్ నిధులు పంచాయతీలకు విడుదల కాలేదు. అవి కూడా దాదాపుగా అంతే మొత్తంలో ఉన్నట్టుగా సర్పంచ్లు చెబుతున్నారు. ఇక జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు పెండింగ్ కూలి రూ.160 కోట్లతో పాటు, మెటీరియల్ కాంపోనెంట్ కూడా ఆరేడు వందల కోట్లు కేంద్రం నుంచి రాలేదు. వీటితో పాటు దాదాపు రూ.1,000 కోట్లకు పైగా ఉపాధి బకాయిల కోసం కూడా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే నిబంధలను విరుద్ధంగా ఇతర పనులకు ఉపయోగించిన ఉపాధి హామీ పథకం నిధులు రూ.152 కోట్లు తమకు తిరిగి చెల్లించాలంటూ రాష్ట్రానికి కేంద్రం నోటీసులిచి్చంది. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్ల గొండ, మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాల్లో ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నిధులతో పాటు పల్లెప్రగతి నిధులు కూడా ఇవ్వడం లేదు. జిల్లాలో దాదాపు 80% దాకా చేసిన పనుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల ఉమ్మడి కరీంనగర్లో సర్పంచ్ల సమస్యలపై ఇటీవల ధర్నాచేశాం. – ఉప్పల అంజనీప్రసాద్, రాష్ట్ర సర్పంచ్ల సంఘం గౌరవ అధ్యక్షుడు, పంచాయతీరాజ్ చాంబర్ జనరల్ సెక్రటరీ రూ.4.50 లక్షల బిల్లులు రావాలి ఈ ఏడాది మా గ్రామంలో రూ.2.50 లక్షలతో సీసీ రోడ్డు, రూ.2.80 లక్షలతో డ్రైనేజీ నిర్మించాం. రూ.1.50 లక్షలతో లైట్లు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం పంచాయతీకి రూ.4.50 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. మలీ్టపర్పస్ వర్కర్ల వేతనాలు, విద్యుత్ బిల్లు, పారిశుధ్య పనుల నిర్వహణ కష్టంగా ఉంది. – కిష్ట్యానాయక్, పల్లెగడ్డతండా సర్పంచ్, నారాయణపేట జిల్లా ట్రాక్టర్ డీజిల్కూ అప్పు! నిధులు రాకపోవడంతో పంచాయతీ ట్రాక్టర్ రోజువారీ డీజిల్ ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సి వస్తోంది. ఇక గతంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లుల జాడే లేదు. అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టి మరీ పనులు చేస్తే ఇదీ పరిస్థితి. – కాశీ విశ్వనాథ్, 4 ఇంక్లైన్ సర్పంచ్, భద్రాద్రి జిల్లా ప్రభుత్వం ఆదుకోవాలి.. 8 నెలల క్రితం రూ.4 లక్షలు అప్పు తెచ్చి మురుగు కాల్వలను నిర్మించాం. ఇప్పటివరకు బిల్లులు రాలేదు. జీపీకి ప్రభు త్వం ఇచ్చే నిధులు ట్రాక్టర్ కిస్తీకి, గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుల జీతాలకు కూడా సరిపోని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదుకోవాలి. నిధుల విడుదలపై దృష్టి సారించాలి. – తూముల శ్వేత, పెన్ పహాడ్ మండల కేంద్ర సర్పంచ్, సూర్యాపేట జిల్లా -
వరదొచ్చి నెల.. బతికేదెలా? రూ.10 వేల తక్షణ సాయానికి సాంకేతిక చిక్కులు
తాండ్ర కృష్ణగోవింద్ ఉవ్వెత్తున ఎగిసిన గోదావరి వరద తీరప్రాంతాలను ముంచెత్తింది. ఉగ్ర గోదావరి ధాటికి వేలాది మంది ఇల్లూవాకిలి వదిలి సహాయక శిబిరాలకు వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. నెల రోజులు గడిచినా ఇప్పటికీ బాధితుల్లో సగం మంది సొంతింటికి దూరంగానే ఉన్నారు. ఓ వైపు ఆస్తులు కోల్పోయి, మరోవైపు పనుల్లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ తోడ్పాటు, దాతలు అందించే సాయంతోనే ఇంకా బతుకు బండి నెట్టుకొస్తున్నారు. జూలైలోనే వచ్చింది.. సాధారణంగా గోదావరికి ఆగస్టులో వరదలు వస్తుంటాయి. కానీ ఈసారి జూలై ఆరంభంలోనే ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగాయి. గత నెల 11న భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరింది. దీంతో పాత రికార్డులు చెరిపేస్తూ జూలైలోనే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను శిబిరాలకు తరలించడం మొదలెట్టారు. ఆ తర్వాత జూలై 16 వరకు గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతూ 71.35 అడుగులకు చేరింది. ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే సుమారు 25 వేల కుటుంబాలను శిబిరాలకు తరలించారు. జూలై 17 నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో క్రమంగా బాధితులు ఇళ్లకు చేరుకున్నారు. కానీ వరద విలయంతో వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. పక్కా ఇళ్లు సైతం ముగినిపోవడంతో అందులో ఉన్న మంచాలు, బీరువాలు, ఫ్రిడ్జ్, వాషింగ్ మెíషీన్, టీవీలు, పరుపులు, బట్టలు ఇలా సమస్తం పనికి రాకుండా పోయాయి. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు మండలాల్లో 17 వేలకు పైగా కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. కట్టుబట్టలతోనే మిగిలాయి. డబ్బులకు కటకట వరదలు ముగిసినా వరుసగా వర్షాలు కురుస్తుండటంతో కూలీలకు పనులు దొరకడం లేదు. పాడైన ఇళ్లను మరమ్మతు చేయించుకునేందుకూ డబ్బుల్లేక చాలామంది అలాగే వదిలేస్తున్నారు. వరద సాయంగా ప్రభుత్వం అందించిన రేషన్ బియ్యం, పప్పు, నూనెలతోపాటు దాతలు ఇస్తున్న సరుకులతోనే కుటుంబాలను నెట్టుకొçÜ్తున్నారు. మరికొన్ని రోజులు వర్షాలు ఇలాగే కొనసాగితే ముంపు ప్రాంత ప్రజలకు ఆకలి బాధలు తప్పేలా లేవు. 1986, 1991లో గోదావరికి భీకరంగా వరదలు వచ్చినా.. ఆ రోజుల్లో అభివృద్ధి, ప్రజల జీవనశైలి సాధారణమే కాబట్టి కట్టుబట్టలతో ప్రాణాలు నిలుపుకున్నా ఆస్తినష్టం పెద్దగా లేదు. కానీ తాజా వరదలు ఇళ్లను, అందులోని సామగ్రిని నాశనం చేయడంతో భారీ ఎత్తున నష్టపోయారు. ఎప్పుడూ మోకాళ్లలోతు మించని వరద ఈసారి ఇంటి పైకప్పులను సైతం ముంచే స్థాయిలో రావడం, స్థానికులకు పీడకలగా మారింది. అందని సాయం వరదల్లో నష్టపోయిన వారికి తక్షణ సాయంగా సీఎం కేసీఆర్ రూ.10 వేల చొప్పున ప్రకటించారు. వరద తగ్గుముఖం పట్టగానే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి 17వేలకుపైగా కుటుంబాలను గుర్తించారు. వీరి ఖాతాల్లో ఇటీవల రూ.10 వేలు జమ అవుతున్నాయి. అయితే బా«ధితుల గుర్తింపు సందర్భంగా చేపట్టిన సర్వేలో జరిగిన తప్పులతో ఇప్పటికీ వేలాది మందికి సాయం అందలేదు. దీంతో బా«దితులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతు న్నారు. బ్యాంకుల విలీనం కారణంగా ఐఎఫ్ ఎస్సీ కోడ్ మారడంతో చాలామందికి ఆర్థిక సాయం అందలేదు. సత్వరమే చర్యలు తీసు కుని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈయన కొక్కిరేణి సాంబశివరావు. బూర్గంపాడు నివాసి. కూలి చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతను నిల్చున్న చోట ఓ ఇల్లు ఉండేది. అందులో భార్య, ఇద్దరు పిల్లలతో జీవించేవాడు. జూలైలో వచ్చిన వరదలకు ఇల్లు నామరూపాల్లేకుండా పోవడంతో కుటుంబానికి గూడు కరువైంది. బంధువుల ఇళ్లలో భార్యాపిల్లలను ఉంచాడు. కూలిపోయిన ఇంటిని ఎలా నిర్మించుకో వాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఈమె పేరు ముదిగొండ చంద్రమ్మ. గోదావరి వరదలు ఊరిని చుట్టేసిన సమయంలో ఆమె ఇల్లు నాలుగు రోజులపాటు వరద నీటిలో నానింది. ఇప్పుడు పనికిరాకుండా పోయింది. ఎప్పుడు కూలుతుందో తెలియని ఇంట్లో ఉండలేక కూతురు వద్ద తలదాచుకుంటోంది. 1986, 1991లో వచ్చిన వాటి కన్నా మొన్న వచ్చిన వరదలే చాలా ప్రమాదకరంగా ఉన్నాయని అంటోంది. డబ్బులు రాలేదు వరదల సమయంలో మా ఇల్లు పూర్తిగా మునిగి పాడైపోయింది. రిపేరు చేయించుకుందామంటే డబ్బుల్లేవు. సర్వేలో అ«ధికారులు మా పేరు రాసుకున్నారు. కానీ ఇంకా డబ్బులు రాలేదు. నాలుగు రోజుల నుంచి తహసీల్దార్ ఆఫీసుకు వస్తున్నా. ఎవరూ సరైన వివరాలు చెప్పడం లేదు. – రమణయ్య, భాస్కర్నగర్, బూర్గంపాడు మండలం పని మానుకుని వచ్చా.. వరదలకు ఇల్లు కొట్టుకుపోయింది. వర్షాలతో అసలు పనులే దొరకడం లేదు. రెండు రోజుల నుంచే కూలికి పోతున్నా. సీఎం ఇస్తానన్న రూ.ç³ది వేలు మాకు రాలేదు. ఆ డబ్బు వస్తే కష్టకాలంలో కొంత ఆసరా ఉంటది. దాని కోసమే పని వదిలి తహసీల్దార్ ఆఫీసుకు వచ్చాను. –పేట్ల కుమారి, బూర్గంపాడు -
వరుస ఎదురుదెబ్బలు.. తలపట్టుకుంటున్న కమల్హాసన్
సాక్షి, చెన్నై: వరుస ఎదురుదెబ్బలు మక్కల్నీది మయ్యం వర్గాల్ని డీలా పడేలా చేశాయి. ఆ పార్టీకి ఏకంగా కొన్ని జిల్లాల్లో కార్యదర్శులే కరువయ్యారు. దీంతో ఈ పదవుల భర్తీ కోసం పార్టీ పరంగా ప్రకటన ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విశ్వ నటుడు కమలహాసన్ మక్కల్ నీది మయ్యంతో రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. పార్టీ ఆవిర్భావంతో ఎదుర్కొన్న తొలి లోక్సభ ఎన్నికల్లో దక్కిన ఓటు బ్యాంక్ ఆ పార్టీలో కొంత మేరకు ఉత్సాహాన్ని నింపాయి. ఆ తదుపరి స్థానిక సంస్థల ఎన్నికల్లో చతికిల పడ్డారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదు. పార్టీ అధ్యక్షుడు కమల్ సైతం ఓటమి పాలయ్యారు. దీంతో పార్టీలోని ముఖ్యులందరూ గుడ్ బై చెప్పడం మొదలెట్టేశారు. అనేకమంది జిల్లాల పార్టీకార్యదర్శులు ఇతరపార్టీల్లోకి వెళ్లి పోయారు. ఇటీవల జరిగిన నగర పాలక సంస్థల ఎన్నికల్లోనూ కమల్ పార్టీకి ఓటమి తప్పలేదు. ప్రస్తుతం పార్టీ బలోపేతం దిశగా కమల్ మళ్లీ అడుగులు వేస్తున్నారు. ప్రజలు ఏదో ఒక రోజు తమకు పట్టం కడుతారనే ఆశాభావంతో ముందుకు సాగుతున్నారు. దరఖాస్తుల ఆహ్వానం అనేక జిల్లాల్లో పార్టీ కార్యదర్శులుగా వ్యవహరించేందుకు స్థానికంగా ఉండే ముఖ్యులు ఎవ్వరు ముందుకు రావడం లేదు. ఇప్పటికే జేబులకు పడ్డ చిల్లుతో సతమతం అవుతున్న నేతలకు తమకు పదవులు వద్దు బాబోయ్ అని దాట వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీకి సేవల్ని అందిస్తున్న కార్యకర్తల్ని ఆ పదవులకు ఎంపిక చేయడానికి సిద్ధమయ్యారు. ఇందుకు కోసం దరఖాస్తులు చేసుకోవాలని మక్కల్ నీది మయ్య పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ప్రస్తుతం కాంచీపురం, చెంగల్పట్టు, దిండుగల్, తంజావూరు, తిరువారూర్, తెన్కాశి, విరుదునగర్, తూత్తుకుడి, తదితర 15 జిల్లాలకు కార్యదర్శులు కావాలంటూ.. ప్రకటన ఇచ్చుకో వాల్సిన దుస్థితి ఏర్పడడం గమనార్హం. పార్టీకి సేవల్ని అందించే కార్యకర్తలు, కమల్ మీద నమ్మకం కల్గిన వాళ్లు దరఖాస్తులు చేసుకోవచ్చంటూ ఓ వెబ్సైట్ను కూడా ప్రకటించడం విశేషం. చదవండి: Roja Selvamani: ఆ రోజున రోజాకు అభినందన సభ.. ఎందుకంటే ? -
వణుకుతున్న ప్రాణాలు.. బాంబుల మోతలు.. ఎముకలు కొరికే చలి
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని ఖార్కీవ్ నగరంలో గడ్డకట్టే చలితో పాటు బాంబుల మోత తెలుగు విద్యార్థులను వణికిస్తోంది. గురువారం ఉష్ణోగ్రత మైనస్ 2 డిగ్రీలు ఉండగా శుక్రవారం ఒక్కసారిగా మైనస్ 6 డిగ్రీలకు పడిపోయింది. ఒకవైపు దట్టమైన మంచు కురుస్తుంటే.. మరోవైపు మిసైల్ దాడులతో నగరం అగ్నిగుండంగా మారింది. కళ్లముందు పేలుతున్న బాంబులను చూస్తూ.. ఎముకలు కొరికే చలికి వణుకుతూ తెలుగు విద్యార్థులు కట్టుబట్టలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బంకర్లు, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. కనీసం కప్పుకోవడానికి బ్లాంకెట్స్ లేని దయనీయ స్థితిలో రెండు రోజులుగా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తెచ్చుకున్న ఆహారం అయిపోతే ఆకలితో చావడం తప్ప వేరే గత్యంతరం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: రష్యా చర్యలపై ఐరాసా భద్రతా మండలిలో ఓటింగ్.. భారత్ దూరం.. తమ క్షేమ సమాచారాన్ని కన్న వాళ్లకు అందించేందుకు సెల్ ఫోన్ల చార్జింగ్ కోసం, కనీస అవసరాలు తీర్చుకోవడానికి ప్రాణాలకు తెగించి బంకర్ల నుంచి బయటకు వచ్చి సమీపంలోని హోటళ్లకు పరుగులు తీస్తున్నారు. ఖార్కీవ్ నేషనల్ మెడికల్ వర్సిటీలో చదువుతున్న తెలుగు విద్యార్థులు శుక్రవారం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. ఖార్కీవ్లో సుమారు 50 మెట్రో స్టేషన్లు ఉంటే ఒక్కో స్టేషన్లో సుమారు 600 మంది (అన్ని దేశాల వాళ్లు) తలదాచుకుంటున్నట్టు తెలిపారు. బంకర్లు మొత్తం నిండిపోయాయని వాపోయారు. ధ్వంసమైన భవనాలు.. రోడ్లపై మిసైళ్ల దాడుల నడుమ భయంతో సాయం కోసం ఎదురు చూస్తున్నామని వాపోయారు. గూగుల్ ఫామ్స్లో తమ సమాచారం పంపినా ఇప్పటివరకు ఇండియన్ ఎంబసీ నుంచి ఎవరూ సంప్రదించలేదని చెప్పారు. కాల్ సెంటర్లకు ఫోన్ చేసినప్పటికీ నెట్వర్క్ సమస్యతో పాటు బిజీ వస్తోందని చెప్పారు. రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయిందని, ఎంబసీ అధికారులు మాత్రం బోర్డర్ వరకు వస్తే ఇండియాకి చేరుస్తామని చెబుతున్నారని.. అడుగు బయట పెట్టలేని స్థితిలో బోర్డర్కు ఎలా చేరుకోగలమని వాపోతున్నారు. స్థానిక పరిస్థితులను బయట వారికి చేరవేయకూడదంటూ నిత్యం అనౌన్స్మెంట్లు ఇస్తున్నారని, బయటకు ఎప్పుడు తీసుకెళ్తారో చెప్పకుండా సేఫ్టీ మెజర్స్ పాటించండి అంటూ సూచనలు చేస్తున్నారన్నారు. ఖార్కీవ్ నగరంలో తణుకు, అమలాపురం, కాకినాడ, ఖమ్మం, హైదరాబాద్, గుంటూరు, రాజమండ్రి, విజయవాడకు చెందిన విద్యార్థులు ఉన్నట్టు తెలిపారు. అమ్మా.. కంగారు పడొద్దు! నేను ఖార్కీవ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ నాల్గవ సంవత్సరం చదువుతున్నాను. ప్రస్తుతం మేం బంకర్లలో సేఫ్గా ఉన్నాం. శుక్రవారం చాలాసేపు బాంబులు పేలాయి. ఉష్ణోగ్రత పడిపోయింది. మేం ఇండియాకి వెళ్లిపోతామంటే వర్సిటీ వాళ్లు అకడమిక్స్ పోతాయని భయపెట్టేశారు. ఇక్కడి విషయాలను ఎవ్వరికీ చెప్పొద్దని అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. వీడియోలు.. ఫొటోలు తీయకుండా అడ్డుకుంటున్నారు. అమ్మా.. నాన్నా మీరు కంగారుపడొద్దు. త్వరలోనే పరిస్థితి నార్మల్ అవుతుందని చెబుతున్నారు. – తమలం అభిజ్ఞ, తణుకు, పశ్చిమ గోదావరి -
ఉప్పొంగుతున్న వరద.. టీచర్ల సాహసం
గూడెంకొత్తవీధి: వరదల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ఆయా గ్రామాలకు వెళ్లేందుకు ఉపాధ్యాయులు ఒక రకంగా సాహసాలు చేయాల్సి వస్తోంది. విశాఖ ఏజెన్సీ జీకే వీధి మండలం పెదవలసకు చెందిన ఉపాధ్యాయులు రోజూ బూదరాళ్ల మీదుగా కొయ్యూరు బాలుర పాఠశాలకు వెళ్లి వస్తుంటారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలువ ఉధృతంగా ప్రవహిస్తూ నీరు కల్వర్టు మీదికి రావడంతో అతికష్టం మీద బైక్ను ఒడ్డుకు చేర్చి పాఠశాలకు చేరుకున్నారు. ఇవీ చదవండి: Facebook Whatsapp: దొంగచాటుగా మెసేజ్లు చదువుతూ.. అందగత్తెకు మత్తు మరక.. మళ్లీ తెరపైకి ప్రముఖ యాంకర్ -
జీమెయిల్ డౌన్ కలకలం : యూజర్లు గగ్గోలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా జీమెయిల్ సేవలకు తీవ్ర అంతరాయం కలగడం కలకలం రేపింది. జీమెయిల్ సేవల్లో మరోసారి సమస్యలు తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది, ప్రధానంగా భారతీయ యూజర్లు ఇబ్బందులు పాలయ్యారు. కొంతమంది వినియోగదారులు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. జీమెయిల్ డౌన్ అన్న హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మీమ్స్తో హోరెత్తిస్తున్నారు. జీమెయిల్తోపాటు గూగుల్ డ్రైవ్ కూడా పనిచేయడం మానేశాయి. జీమెయిల్ లాగిన్ కాలేకపోవడంతోపాటు, లాగిన్ అయినా, ఫైల్స్ అప్లోడ్, డౌన్లోడ్ నిలిచిపోవడం లాంటి సమస్యలను నివేదించారు. భారత్ సహా జపాన్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లోని యూజర్లు జీమెయిల్లో సమస్యలను ఎదుర్కొంటున్నారని డౌన్ డిటెక్టర్ సంస్థ తెలిపింది. గూగుల్ మీట్, గూగుల్ వాయిస్, గూగుల్ డాక్స్తో కూడా సమస్యలు తలెత్తడంతో గూగుల్ స్పందించింది. ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. కాగా రెండు నెలల్లో జీమెయిల్ షట్డౌన్ అవ్వడం ఇది రెండోసారి. జూలై నెలలో సాంకేతిక సమస్యకారణంగా జీమెయిల్ సేవలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. User reports indicate Gmail is having problems since 1:12 AM EDT. https://t.co/pTPsDoNKxQ RT if you're also having problems #Gmaildown — Downdetector Canada (@downdetectorca) August 20, 2020 Gmail is down for more than an hour. Can't send attachments. Aaaaaaaaaaaahhhhhh#Gmail #gmaildown pic.twitter.com/hQSMNizX3K — Sourav Bhunia (@souravbhunia415) August 20, 2020 How long before its set right @gmail? #GmailDown pic.twitter.com/j1OQ8lz7AZ — Prashanth ಪ್ರಶಾಂತ್ 🇮🇳 (@pvaidyaraj) August 20, 2020 After 1 Hour #Gmail Down all employment person 😤😖😫😭😬 But, Unemployment Persons to cooooooolllll✌️🤞✌️ pic.twitter.com/1tumoosd8B — Karthi Durai (@akkmrc12) August 20, 2020 -
కువైట్లో విలవిల.. మూడు నెలలుగా పనుల్లేక
సంతబొమ్మాళి: బతుకు తెరువు కోసం విదేశాల కు వెళ్లిన వారు కరోనా ప్రభావంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడుతున్నారు. తమ సమస్యలు ఎవరికి ఎప్పుకోవాలో తెలీక, బాధలు వినేవారు లేక ఆందోళన చెందుతున్నారు. సంతబొమ్మాళి మండలంలోని గెద్దలపాడు, పిట్టవానిపేట, గొలుగువానిపేట, ఎం.సున్నాపల్లి, వజ్రపుకొత్తురు మండలం దేవునల్తాడ, పోలా కి మండలం గప్పెడుపేటకు చెందిన సుమారు 200 మంది యువకులు 2018లో కువైట్ వెళ్లారు. వెల్డింగ్, రిగ్గర్ పనులు చేసుకుంటూ నాలుగు రా ళ్లు వెనకేసుకుంటున్న సమయంలో కరోనా వీరి ఉపాధిని ధ్వంసం చేసింది. కోవిడ్ ప్రభావంతో కువైట్లో ప్రైవేటు కంపెనీలు పనులు ఆపేశాయి. దీంతో మూడు నెలలుగా పనుల్లేక, జీతాలు రాక వీరు అల్లాడిపోతున్నారు. పనులు నిలుపుదల చేసిన మొదటిలో కంపెనీ భోజనాలు పెట్టి నా ఆ తర్వాత చేతులెత్తేసింది. దీంతో దాచుకున్న డబ్బులను వీరంతా ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తుంటే వాటితోనే కడుపు నింపుకుంటున్నారు. కుటుంబాలను పోషించడానికి ఇంత దూరం వస్తే.. మళ్లీ ఆ కుటుంబాలపైనే ఆధార పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వదేశానికి పంపేయండి అని కంపెనీ యాజమాన్యానికి చెప్పినా వారు తమ వల్ల కాదంటూ తెగే సి చెప్పేశారు. దీంతో తల్లిదండ్రులు ఏజెంట్లను సంప్రదించారు. వారిది కూడా అదే మాట. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి తమను స్వదేశానికి రప్పించాలని బాధితులు ఎరుపల్లి లక్షుమయ్య, చింతలబాలకృష్ణ, చెక్క వేణునాథం, రట్టి చిన్నారావు, చెక్క రాజయ్య తదితరులు కోరుతున్నారు. కరోనా భయం ఓ వైపు తీవ్రంగా ఉందని, అదే సమయంలో ఉపాధి లేక మరోవైపు నలిగిపోతున్నామని, అధికారులు, ప్రభుత్వమే తమపై దయ చూపాలని కోరుతున్నారు. ఇబ్బందులు పడుతున్నాం బతుకు తెరువు కోసం కువైట్ వచ్చాను. కరోనా ప్రభావంతో కంపెనీ పనులను ఆపేసింది. దీంతో జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. యాజమాన్యం కూడా ఏమీ చేయలేక చేతులెత్తే సింది. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. – ఎరుపల్లి అప్పయ్య, గెద్దలపాడు, సంతబొమ్మాళి మండలం స్వదేశానికి రప్పించండి నాలుగు డబ్బులు సంపాదించడానికి దేశం కాని దేశం వచ్చాను. డ్యూటీ బాగానే ఉన్నా కరోనా ప్రభావంతో అతలాకుతలం అయ్యాము. పనులు సాగక షెడ్డులోనే ఉన్నాము. మూడు నెలలుగా జీతాలు లేవు. స్వదేశానికి పంపించాలని బతిమలాడినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి స్వదేశానికి రప్పించాలని వేడు కుంటున్నాను. – రట్టి చిన్నారావు, పిట్టవానిపేట, సంతబొమ్మాళి మండలం ఇంటి నుంచి డబ్బులు పంపుతున్నాం కువైట్లో పనిచేయడానికి మా అబ్బాయి లక్ష్మయ్య వెళ్లాడు. మూడు నెలలుగా అక్కడ పనులు లేకపోవడంతో జీతాలు ఇవ్వడం లేదని, ఇ బ్బంది పడతున్నామని ఫోన్లో చెప్పాడు. దీంతో ఇంటి నుంచి డబ్బులు పంపాను, ఫ్లయిట్ టిక్కెట్ కోసం ఏజెంట్కు డబ్బులు ఇస్తే, రెండు వారాల తర్వాత మావల్ల కాదని డబ్బులు తిరిగి ఇచ్చేశారు. ప్రభుత్వమే అదుకోవాలి. – వై.కుంతెమ్మ, బాదితుడు తల్లి, గెద్దలపాడు -
‘అది మనిషి సృష్టించిన అతిపెద్ద విషాదం’
న్యూఢిల్లీ: లాక్డౌన్ వల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం... దేశ విభజన తర్వాత మనిషి సృష్టించిన అతిపెద్ద విషాదమని ప్రముఖ చరిత్రకారుడు, ఆర్థికవేత్త రామచంద్ర గుహ అభివర్ణించారు. ప్రధానమంత్రి మోదీ ఒక వారం సమయం ఇచ్చి లాక్డౌన్ ప్రకటిస్తే వలస కార్మికుల ఇక్కట్లు తగ్గేవని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దేశ విభజన సమయంలో భయంకరమైన మత కలహాలు చెలరేగాయని, లక్షలాది మంది వలస వెళ్లారని గుర్తుచేశారు. హింస జరగకపోయినా ఇప్పటి పరిస్థితి మాత్రం దేశ విభజన తర్వాత మనిషి సృష్టించిన అతిపెద్ద విషాదమని పేర్కొన్నారు. దీని దుష్పరిణామాలు సమాజంపై తప్పకుండా ఉంటాయన్నారు. కూలీలు ఇప్పట్లో మళ్లీ పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపబోరని అన్నారు. -
అంతా వాళ్లే చేశారు..!
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ గవర్నర్ రఘురామ్రాజన్ హయాంలోనే ప్రభుత్వరంగ బ్యాంకులు దుర్భర పరిస్థితులను చవిచూశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. దెబ్బతిన్న ప్రభుత్వరంగ బ్యాంకులను బాగు చేయడమే తన ప్రాథమిక కర్తవ్యంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. అమెరికాలోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్లో.. ‘భారత ఆర్థిక వ్యవస్థ: సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై ఆమె మాట్లాడారు. యూపీఏ–2 పాలనలో 2013 సెప్టెంబర్ 4 నుంచి 2016 సెప్టెంబర్ 4 వరకు ఆర్బీఐ గవర్నర్గా, 2012 ఆగస్ట్ 10 నుంచి 2013లో ఆర్బీఐ గవర్నర్ అయ్యే నాటి వరకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా రఘురామ్రాజన్ పనిచేశారు. గత ప్రభుత్వ అసమర్థ విధానాలను మంత్రి సీతారామన్ తన ప్రసంగంలో ఎండగట్టారు. ‘‘ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రాణవాయువు అందించడమే భారత ఆర్థిక మంత్రి ప్రాథమిక విధి. ఈ ప్రాణవాయువు అన్నది రాత్రికి రాత్రి రాదు’’ అని మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇటీవల బ్రౌన్ యూనివర్సిటీలో రాజన్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఆర్థిక రంగానికి సంబంధించి చెప్పుకోతగ్గది ఏదీ చేయలేదంటూ విమర్శించారు. ప్రభుత్వం పూర్తిగా కేంద్రీకృతమైందని, ఆర్థి క వృద్ధికి సంబంధించి నాయకత్వానికి స్పష్టమైన విధానం లోపించిందన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎదురైన ప్రశ్నకు సీతారామన్ గట్టిగానే బదులిచ్చారు. ఫోన్ కాల్స్తో రుణాలు ‘‘ఆర్బీఐ గవర్నర్గా రాజన్ హయాంలో సన్నిహిత నేతల నుంచి వచ్చిన ఫోన్కాల్స్తో రుణాలు మంజూరు చేశారు. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకులు నాటి ఊబి నుంచి బయటకు వచ్చేందుకు నేటికీ ప్రభుత్వం అందించే నిధులపై ఆధారపడుతున్నాయి. ఎంతో ప్రజాస్వామ్యంతో కూడిన నాయకత్వం (మన్మోహన్సింగ్) కారణంగా భారీ స్థాయి అవినీతి చోటుచేసుకుంది. భారత్ వంటి వైవిధ్య దేశానికి గట్టి నాయకత్వం కావాలి. మరీ ప్రజాస్వామ్యంతో కూడిన నాయకత్వం అంటే నాకు భయమే. ఎందుకంటే అవినీతి తాలూకూ దుర్గంధాన్ని అది విడిచి వెళ్లింది. దాన్ని ఈ రోజూకీ శుద్ధి చేస్తున్నాం’’ అంటూ యూపీఏ పాలనను నిర్మలా సీతారామన్ విమర్శించారు. రాజన్ను తాను ఎగతాళి చేయడం లేదని, విద్యావంతుడైన ఆయన్ను గౌరవిస్తానంటూనే, వాస్తవాలను తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. బ్యాంకుల ఆస్తుల నాణ్యతను సమీక్షించినందుకు రాజన్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, బ్యాంకులు నేడు ఏ స్థితిలో ఉన్నాయో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్పీఏలు రూ.8,06,412 కోట్లుగా ఉన్నాయి. గత మార్చి నాటికి ఉన్న రూ.8,95,601 కోట్లతో పోలిస్తే రూ.89,189 కోట్లు తగ్గాయి. -
ఆజం ఖాన్కు మరో షాక్
రాంపూర్: వివాదాస్పద సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆజం ఖాన్కు భారీ ఎదురు దెబ్బ. భూకబ్జా, ల్యాండ్ మాఫియా ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నఆజం ఖాన్కు తాజాగా మరో షాక్ తగలింది. రాంపూర్లోని ఖాన్కు చెందిన లగ్జరీ రిసార్ట్ 'హంసఫర్' గోడనుఅధికారులు కూల్చివేశారు. కబ్జా ఆరోపణలతో బుల్డోజర్లు, జేసీబీ యంత్రాల సాయంతో కూల్చివేశారు. ఉత్తరప్రదశ్ నీటిపారుదల శాఖ ఆజం ఖాన్కు నోటీసులు కూడా జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ భూమిని ఆక్రమించి దీన్ని నిర్మించారని ఆరోపణలతో అధికారులు ఈ చర్య చేపట్టారు. ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినట్లు జిల్లా యంత్రాంగం నుంచి కూడా ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి. పేద రైతులనుంచి వ్యవసాయ భూమిని, ప్రభుత్వ భూములను స్వాహా చేశాడన్న కేసులో అతనిపై వరుస కేసులు నమోదైనాయి. ఈ నేపథ్యంలోనే జూలై 29న ఆజం ఖాన్ను ల్యాండ్ మాఫియాగా ప్రకటించారు. అలాగే ఖాన్కు చెంది మహమ్మద్ అలీ జౌహార్యూనివర్శిటీకి విదేశీ విరాళాలకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ విభాగం (ఈడీ) కూడా విచారణ చేపట్టింది. ఆయనపై నమోదైన కేసుల (30 దాకా) వివరాలపై స్థానిక అధికారులను ఆరా తీస్తోంది. మరోవైపు ఆజం ఖాన్ కొనుగోళ్లకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు, చెల్లింపు రశీదులు, ఇతర ఒప్పందాల వివరాలను రెవన్యూ శాఖను కోరామని రాంపూర్ ఎస్పీ అజయ్ పాల్ శర్మ తెలిపారు. అనేక వందల కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని, వీటిపై దర్యాప్తు చేయాల్సి వుందన్నారు. -
కష్టాల్లో ఒక స్నేహితుడుండాలి
సంజయ్ దత్ను జైల్లో పడేశారు. పెద్ద స్టార్. పైగా టాడా కేసులో ఉన్నాడు. అతడిని ఎవరైనా చంపితే అదొక గొడవ అని ఒంటరి గదిలో ఉంచారు. చీకటి... మాట్లాడే దిక్కు లేదు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. కేసు నడిచింది. ఏకె 56 రైఫిల్ ఉన్నందుకు ఆరేళ్ల జైలు శిక్ష విధించారు. అప్పటికే మూడేళ్లు జైల్లో ఉన్నాడు కనుక ఇంకో మూడేళ్లు ఎరవాడ జైల్లో గడపాలి. ముంబై బ్లాస్ట్స్తో కాని టెర్రిరిస్ట్ చర్యతో కాని సంజయ్ దత్కు ఏం సంబంధం లేదనీ కాని ప్రాణభయంతో అనుమతి లేకుండా ఏకె 56 దగ్గర ఉంచుకున్నందుకు మాత్రమే జైలు శిక్ష అని కోర్టు ప్రకటించింది. సంజయ్ దత్ ఎరవాడ జైలుకు చేరుకున్నాడు.ఈసారి నలుగురులో తిరిగేంత స్వేచ్ఛ ఉంది.కొంచెం ఊపిరి సలుపుకునే వీలు ఉంది.కాని అక్కడ సంజయ్కు ఏ జ్ఞాపకం వెంటాడింది.తల్లి ఏనాడో మరణించింది. తండ్రి కూడా గతించాడు.తోబుట్టువుల దగ్గర అన్ని రహస్యాలు మాట్లాడలేము.ఇక మిగిలిందల్లా స్నేహితులు.ఆ స్నేహితులే సంజయ్ దత్కు జైల్లో పదే పదే గుర్తుకొచ్చారు. దగ్గర కూర్చునే స్నేహితులు, ధైర్యం చెప్పే స్నేహితులు, గట్టిగా హగ్ చేసుకునే స్నేహితులు... మనిషి ఆస్తి ఐశ్వర్యాలు కోల్పోయి ఒంటరి కాడు. స్నేహితులను కోల్పోయినప్పుడే ఒంటరి అవుతాడు.జైల్లో ఉన్నప్పుడు అసలైన శిక్ష స్నేహితులను కలవకపోవడమే.‘సంజు’ సినిమాలో ఒక స్నేహితుడి పాత్ర ఉంటుంది. తెర మీద ఆ పాత్ర పేరు ‘కమలేష్ కన్హయ్యలాల్ కపాసి’. నటుడు వికీ కౌశల్ దానిని పోషించాడు.విక్కీ కౌశల్ గతంలో ‘మసాన్’ సినిమాతో ప్రేక్షకులకు తెలుసు. కాని ‘సంజు’ సినిమాతో ఎక్కువమందికి తెలిసి పెద్ద స్టార్ అయ్యాడు. ‘సంజు’ సినిమాలో ఈ పాత్ర చివరికంటా సంజయ్దత పాత్ర పోషించిన రణబీర్ కపూర్కు తోడుగా ఉంటుంది. అమెరికాలో డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్లో చేరినప్పుడు అతనికి బాసటగా నిలుస్తుంది. అతడి కష్టంలో అండగా నిలుస్తుంది. అలాంటి స్నేహితుడు లేకపోతే సంజయ్దత్ ఏమైపోయి ఉండేవాడా అనిపిస్తుంది. సినిమా చూసిన ప్రేక్షకులకు నిజ జీవితంలో ఈ పాత్ర ఎవరా అనే కుతూహలం కలుగుతుంది. అతని పేరు ‘పరేష్ ఘెలాని’. అమెరికాలో స్థిరపడ్డ ఇండియన్. ఇతనిది సంజయ్ దత్ది ఒకే వయసు. సంజయ్ తల్లి నర్గిస్ వైద్యం కోసం ఆమెను అమెరికాలోని హాస్పిటల్లో ఉంచినప్పుడు ఆమె కోలుకోవడం కోసం ఒక ఫ్యాన్గా అక్కడి వస్తాడు. అప్పుడే సంజయ్దత్కు పరిచయం అవుతాడు. ఆ పరిచయం చాలా మంచి స్నేహంగా మారుతుంది. అప్పటికే సంజయ్దత్ డ్రగ్స్కు బానిస అయి ఉంటాడు. అతణ్ణి ఆ మత్తు నుంచి బయటపడేయడానికి పరేష్ ఘెలాని చాలా ప్రయత్నించాడు. రిహాబిలేషన్ సెంటర్ నుంచి సంజయ్ పారిపోయి పరేష్ దగ్గరకు చేరుకున్నప్పుడు అతడే తిరిగి సెంటర్కు పంపాడు. ఏకే 56 ఉందన్న కారణంగా అరెస్టయినప్పుడు కూడా అమెరికా నుంచి ఇండియాకు వచ్చి సంజయ్ కోసం తిప్పలు పడ్డాడు. అయితే మీడియా ఏకంగా ముంబై పేలుళ్లకు సంజయే సూత్రధారి అన్నంతగా కథనాలు వెలువరించడంతో అమెరికాలో ఎఫ్బిఐ తనను కూడా విచారిస్తుందన్న భయంతో సంజయ్కు దూరం అయ్యాడు. ఎరవాడ జైలులో సంజయ్కు ఎక్కువగా గుర్తొచ్చిన స్నేహితుడు అతడే. ఇన్నాళ్లకు మళ్లీ ‘సంజు’ సినిమాతో పరేష్ వార్తలలోకి ఎక్కాడు.ఈ సినిమా ఆ ఇద్దరి స్నేహాన్ని మళ్లీ బలపరిచింది.ప్రేక్షకులు ప్రతి మనిషికి ఇలాంటి స్నేహితుడుండాలి అని మెచ్చుకుంటున్నారు.ఆమిర్ ఖాన్ సినిమా చూసి పరేష్ పాత్ర పోషించిన విక్కీ కౌశల్కు ప్రశంసలు కురిపించాడు. అన్నట్టు విక్కీ కౌశల్ సినిమా ఇండస్ట్రీలో ఒక సాధారణ స్టంట్ మేన్ కుమారుడు. కొంతకాలం అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసి ‘సంజు’ సినిమాతో పెద్ద పేరు సంపాదించుకున్నాడు. ఇంతకీ సంజు చూశారా? ఇంకా లే....దా! -
మైనర్కు ముద్దు.. చిక్కుల్లో సింగర్
ముంబై : సింగర్ కమ్ కంపోజర్ పాపోన్ చిక్కుల్లో పడ్డాడు. ఓ మ్యూజిక్ రియాల్టీ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న అతను.. ఓ బాలికను ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాపోన్గా పేరుపొందిన అన్గరాగ్ మహంతా ఓ ఛానెల్ లో ప్రసారమవుతున్న వాయిస్ ఇండియా కిడ్స్ ప్రోగ్రాంకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షోకి షాన్, హిమేష్ రేష్మియాలు కూడా జడ్జిలు. మంగళవారం ఈ షోకి హోలీ ప్రత్యేక ఎపిసోడ్ను చిత్రీకరించారు. ఈ సందర్భంగా హోలీ ఆడుతూ పాపోన్ ఓ బాలిక ముఖానికి రంగు పూసి పెదాలపై ముద్దాడాడు. ఆ వ్యవహారమంతా ఫేస్ బుక్ లైవ్లో టెలీకాస్ట్ అయ్యింది. ఈ వీడియోపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు న్యాయవాది రునా భుయాన్.. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘంలో ఫిర్యాదు చేశాడు. పోక్సో(POCSO) యాక్ట్ కింద పాపోన్పై లైంగిక దాడి కేసు నమోదు చేయాలని భుయాన్ కోరుతున్నాడు. ఇలాంటి ఘటనలు చూశాక రియాల్టీ షోలలో పాల్గొనే పిల్లల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. కాగా, విమర్శలపై పాపోన్ ఇంతవరకు స్పందించలేదు. అస్సామీ సింగర్ అయిన పాపోన్ బర్ఫీ, సుల్తాన్, దమ్ లగా కే హైసా.. తదితర చిత్రాలతో పాపులర్ అయ్యాడు. -
బిల్లులకు నిరీక్షణ
ఊట్కూర్ : మండలంలో మరుగుదొడ్లు నిర్మించుకొని రెండేళ్లైయినా బిల్లులు మంజూరు కాలేదు. దీంతో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలో నిర్మల్ భారత్ అభియాన్ పథకంలో భాగంగా ఆర్డబ్లూఎస్, ఈజీఎస్ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల క్రితం మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. 638 మరుగుదొడ్లు మంజూరు మండలంలో 638 మరుగుదొడ్లు మంజూరు కాగా వాటిలో 508 మరుగుదొడ్లు నిర్మించారు. వివిధ కారణాలతో 130 పెండింగ్లో వున్నాయి. ఊట్కూర్లో 102, పెద్దపొర్లలో 42, చిన్నపొర్లలో 22, అవుసలోనిపల్లిలో 44, ఎడివెళ్లిలో 20 తదితర గ్రామాలలో లబ్ధిదారులు మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. నిర్మించుకున్న లబ్ధిదారులకు విడతల వారీగా ఉపాధిహామీ పథకం ద్వారా రూ.9 వేలు వారి ఖాతాలో జమచేయాల్సివుంది. 200 మందికి అందని బిల్లులు రెండేళ్లు గడిచినా బిల్లులు రాలేదు. మం డలంలో దాదాపు 200 మంది లబ్ధిదారులకు బిల్లులు రావాల్సివుందని, అధికారులకు అడిగితే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయని సమాధానం ఇస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నా రు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పం దించి బిల్లులు మంజూరు చేయాలని వివిధ గ్రామల ప్రజలు కోరుతున్నారు. నిధులొస్తే ఇస్తాం లబ్ధిదారులు మా దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఎంతమందికి బిల్లులు రావాల్సి ఉందో ఆన్లైన్లో ఖచ్చితంగా చూపడంలేదు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. బిల్లులు ఇప్పటికీ అందలేదు. విడుదలైతే లబ్ధిదారులు ఎందరో తెలుసుకొని వారి ఖాతాల్లో జమ చేస్తాం. – జయమ్మ, ఏపీఓ, ఊట్కూర్ 18నెలలు గడిచింది మరుగుదొడ్డి నిర్మించి 18 నెలల అవుతుంది. బిల్లులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ రాలేదు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా ఉంది. సంబంధత అధికారులూ పట్టించుకోవడంలేదు. మా గ్రామంలో 20మందికి రావాల్సి ఉంది. అధికారులు వెంటనే బిల్లులు మంజూరుచేయాలి. – డీలర్ వెంకటయ్య, పెద్దపొర్ల, , ఊట్కూర్ -
ప‘రేషాన్’!
మన్ననూర్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–పోస్ విధానంతో లబ్ధిదారులకు సరుకులు అందక ఇబ్బందులు పడుతున్నారు. రేష న్ షాపుల్లో అక్రమాలకు చెక్పెట్టేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తీ సుకొచ్చింది. అయితే సిగ్నల్స్ అందక, లబ్ధిదారులు వేలిముద్రలు పడకపోవడంతో సరుకులు తీసుకెళ్లలేని పరిస్థితి నె లకొంది. దీంతో ఎవరికీ చెప్పుకోవాలో అయోమయంలో ఉన్నా రు. ముఖ్యంగా బియ్యం రాకపోవడంతో పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. అయోమయంలో నిరక్షరాస్యులు కొంత మంది నిరక్షరాస్యులు సరుకుల విషయమై తెలిసిన వారిని అడిగితే మండలంలో దరఖాస్తు చేసుకోవాలని అంటున్నారని, తీరా మండల అధికారులు సిబ్బంది అందుకు సంబంధించి మాకెలాంటి ఆదేశాలు రాలేదని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రామంలో డీలర్లు, సేల్స్మెన్లు రేషన్ కార్డు చూసి సరుకులు ఇచ్చేవారని కొత్తగా వచ్చిన పద్ధతితో సరుకులు ఇవ్వడం లేదంటున్నారు. 50శాతం సరుకుల పంపిణీ ఇప్పటివరకు లబ్ధిదారులకు 50శాతం సరుకులు పంపిణీ చేశారు. ఈనెల 26లోగా సరుకులు పంపిణీ చేయాలని అధికారుల ఆదేశాలు ఉన్నాయి. ఆ తర్వాత పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు పలు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వేలి ముద్రలు సరిపోవడం లేదు మిషన్లో వేలి ముద్ర సరిపోవడం లేదు. దాంతో బి య్యం, కిరోసిన్ ఇవ్వడం లేదు. ఏమి చేయాలో పాలుపోవడం లేదు. అధికారులు సరుకులు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలి. – చందాజీ, లబ్ధిదారుడు, మన్ననూర్ ఆందోళన అవసరం లేదు ఈ–పోస్ విధానంతో సమస్య ఉందని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇం దుకు సంబంధించి వీ ఆర్ఓకు అధికారం ఇ చ్చారు. వందలో ఒకరిద్దరికీ సొంత నిర్ణయంతో సరుకులు ఇప్పించే అధికారం ఉం ది. వచ్చేనెల నుంచి ఈ సమస్య రా కుండా జాగ్రత్తలు తీసుకుంటాం. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – కృష్ణయ్య, తహసీల్దార్, అమ్రాబాద్ -
తాగునీటి కటకట
నేరడిగొండ : అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వం ప్రజల పాలిట శాపంగా మారుతోంది. నేరడిగొండ మండలంలోని రాజు గ్రామపంచాయతీ పరిధిలో గల ఇస్పూర్ చిన్నగోండుగూడలో సమస్యలు తిష్ట వేయడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. 50 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో తాగునీటి సమస్య, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వ్యవస్థ అధ్వానంగా మారడంతో ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక్కట్లు గ్రామంలో శీతాకాలంలోనే తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామస్తులు గ్రామ సమీపంలో ఉన్న చెలిమెల నీటిని తాగునీటి కోసం ఉపయోగిస్తున్నారు. అయినా మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించిన దాఖలాలు లేవని వారు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన చేతిపంపు పనిచేయకపోవడంతో అదే గ్రామానికి చెందిన సిడాం రాము రూ.3లక్షలు వెచ్చించి ఐదు బోర్లు వేయించినా తాగునీటి సమస్య తీరలేదని వారు వాపోతున్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో గ్రామ సమీపంలో చెలిమె ఏర్పాటు చేసుకొని కలుషిత నీటినే తాగాల్సి దుస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి విద్యుత్ సమకూర్చినా ఇంటికి విద్యుత్ తీసుకోవడానికి అనువుగా లేకపోవడంతో గ్రామస్తులందరు ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ తీసుకోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో అధ్వానంగా వీధులు గ్రామంలో పలు వీధులు అధ్వానంగా మారడంతో ఉండడానికి అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. వేసవికాలం వచ్చిందంటే తాగునీటి సమస్య జఠిలమవుతుందని, అధికారులకు విన్నవించినా మా గ్రామానికి ఇప్పటివరకు ఏ అధికారి వచ్చిన దాఖలాలు లేవని వారు వాపోతున్నారు. వేసవి ప్రారంభానికి ముందే గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించాలి గ్రామంలో తాగునీటి సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. గ్రామ సమీపంలో ఉన్న చెలిమెల నీరే దిక్కవుతుంది. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయంగా తాగునీటిని అందించి ఆదుకోవాలి. – సిడాం జయవంత్రావు, గ్రామస్తుడు దినమంతా చెలిమెల వద్దే ఉదయం నుంచి సాయంత్రం వ రకు చెలిమెల వద్దే ఉంటున్నాం. గత్యంతరంలేక కలుషితమైన నీటినే తాగుతున్నాం. ఫలితంగా అనారోగ్యం బారిన పడుతున్నాం. అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలి. – సిడాం కవిత, గ్రామస్తురాలు సమస్య మా దృష్టికి రాలేదు ఇస్పూర్ చిన్నగోండుగూడలో ఉన్న తాగునీటి సమస్య మా దృష్టికి రాలేదు. ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తాం. ఇతర సమస్యలు ఉంటే సంబంధిత అధికారులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. – ప్రభాకర్, ఈవోపీఆర్డీ, నేరడిగొండ -
రావత్ మెడకు ఎన్నికల కమిషన్ ఉచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు సన్నిహిత మిత్రుడు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్కు భారత ఎన్నికల కమిషన్ నుంచి ముప్పు ముంచుకొచ్చే అవకాశం ఉంది. ఆయన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో స్థిరాస్తుల విలువను అతి తక్కువ చేసి చూపించారనే ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ స్పందించడమే అందుకు కారణం. ఎన్నికల అఫిడవిట్లో తన స్థిరాస్తుల విలువను తక్కువ చేపి చూపినట్లు రావత్పై డెహ్రాడూన్కు చెందిన ఎస్హెచ్ రఘునాథ్ సింగ్ నేగి ఫిర్యాదు అందిందని, ఇందులోని వాస్తవాస్తవాలను తెలుసుకునేందుకు అధికారులను పంపించి క్షేత్రస్థాయిలో ఆయన స్థిరాస్తుల విలువను అంచనా వేసి ఓ నివేదికను పంపించండంటూ ‘కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు’ చైర్మన్కు ఎన్నికల కమిషన్ లేఖ రాసింది. అక్టోబర్ 20వ తేదీనే తనకు ఫిర్యాదు అందినప్పటికీ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున ప్రత్యక్ష పన్నుల బోర్డుకు ఎన్నికల కమిషన్ లేఖ రాసినట్లు తెల్సింది. రావత్ తన వయస్సును కూడా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారని మాజీ బీజేపీ సభ్యుడైన రఘునాథ్ సింగ్ నేగి ఫిర్యాదు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో అభ్యర్థులు తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా 1951 నాటి ఎన్నికల ప్రాతినిథ్య చట్టంలోని 125 (ఏ) సెక్షన్ కింద జరిమానా విధిస్తారు. 2002 వరకు ఆరెస్సెస్లో ప్రచారక్గా పనిచేసిన రావత్, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు అత్యంత సన్నిహితుడని, ఆ కారణంగానే సరైన అర్హతలు లేకుండానే ఆయన్ని ఉత్తరాఖండ్ సీఎంను చేశారని పార్టీ వర్గాలే ఆరోపిస్తున్నాయి. 2014లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్లో పార్టీ ఇంచార్జిగా అమిత్ షా ఉన్నప్పుడు ఆయనకు సహకరించిన నలుగురు నాయకుల్లో రావత్ ఒకరు. 2010లోనే రావత్పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఆయన ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా రైతులకు పంపిణీ చేసే జీలుగు విత్తణాల్లో అవినీతికి పాల్పడ్డరంటూ ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవికి రావత్ పేరు మొదటిసారి బయటకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన అవినీతి ఆరోపణల గురించి గట్టిగా నిలదీసింది. రావత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏర్పాటైన దర్యాప్తు కమిటీ ఆయనపై రాష్ట్ర అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో క్లీన్చిట్ ఇచ్చింది. -
కష్టాల్లో ‘పద్మావతి’!
మన చలనచిత్రాలనూ, డాక్యుమెంటరీలనూ చూసి అవి ఆమోదయోగ్యమో కాదో తేల్చడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) ఉంది. అది గీసే సవాలక్ష ‘లక్ష్మణరేఖల’పైనా, కత్తిరింపులపైనా విమర్శలు వెల్లువెత్తుతున్న తరు ణంలో ఆ పనుల్ని అంతకంటే మూర్ఖంగా, మొరటుగా చేయడానికి దేశంలో ఎక్కడి కక్కడ మూకలు పుట్టుకొస్తున్నాయి. సినిమాల్లో కథలెలా ఉండాలో, సంభాషణలెలా సాగాలో, పాటల్లో ఏం పదాలుండాలో ఇవి నిర్ణయిస్తున్నాయి. వాటిని అమలు చేస్తారా చస్తారా అని బెదిరింపులకు దిగుతున్నాయి. ‘పద్మావతి’ చిత్రం ఇప్పుడు అలాంటి మూకల బారిన పడింది. సృజనాత్మకత కలిగిన దర్శకుడిగా పేరు ప్రఖ్యా తులున్న సంజయ్లీలా భన్సాలీ నిర్మించిన ‘పద్మావతి’కి షూటింగ్ మొదలైనప్పటి నుంచే కష్టాలు చుట్టుముట్టాయి. రాజస్థాన్లోని జైపూర్లో వేసిన సెట్లోకి చొరబడి ఆ సెట్నూ, విలువైన పరికరాలనూ ధ్వంసం చేయడంతోపాటు భన్సాలీపై దౌర్జన్యం చేశారు. ఆ తర్వాత షూటింగ్ను మహారాష్ట్రలోని కొల్హాపూర్కు మార్చు కుంటే అక్కడ సైతం సెట్కు నిప్పు పెట్టారు. షూటింగ్ ప్రారంభించడానికి చాలా ముందే నిరుడు నవంబర్లోనే భన్సాలీ తన సినిమా ఇతివృత్తం గురించి వచ్చిన కథనాల తర్వాత ఏర్పడ్డ అపోహలను తొలగించడానికి ప్రయత్నించారు. పద్మావతి పాత్రను కించపరిచే ఉద్దేశం తనకు లేదని, ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రకూ, ఆ పాత్రకూ మధ్య ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలూ ఉండబోవని ఆయన వివరించాడు. చిత్రం పేరు సైతం ముందనుకున్నట్టు ‘రాణి పద్మిని’ అనికాక ‘పద్మా వతి’ అని మార్చాడు. కానీ నిరసనలకు దిగేవారికి ఇదంతా పట్టలేదు. వారి బాణీలో బెదిరింపులు, హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. చిత్ర హీరోయిన్ దీపికా పదుకొనే ముక్కు కోస్తామని ఒకరు... భన్సాలీ, దీపికల తలలు తెచ్చిస్తే రూ. 5 కోట్ల బహు మతి ఇస్తామని మరొకరు రెచ్చిపోయి ప్రకటనలు చేస్తున్నారు. కావాలంటే క్షత్రి యుల శౌర్యపరాక్రమాలు చూపుతూ సినిమాలు తీసుకోమని సలహాలిస్తున్నారు. వచ్చే నెల 1న చిత్రం విడుదల చేయాలని సన్నాహాలు చేసుకుంటుంటే దాన్ని అడ్డు కోవడానికి ఈ బృందాలు సర్వవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఇంత వివాదానికి కారణమైన చిత్రం ఇతివృత్తానికి ఆధారం చరిత్రలో చోటు చేసుకున్న ఒక ఉదంతాన్ని ఆధారం చేసుకుని పుట్టుకొచ్చిన కాల్పనిక గాథేనని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. 1250లో బెంగాల్లోని బీర్భూం జిల్లాలో పుట్టి 1316లో మరణించిన ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ రాజస్థాన్లోని చిత్తోర్ రాజ్యంపై దండెత్తడం, దాని పాలకుడు రాణా రతన్సింగ్ ఓటమిపాలవడం, రాజ్యం ఖిల్జీ వశం కావడం చరిత్ర. కాలగర్భంలో కలిసిపోయిన ఆ చరిత్రకు జవ జీవాలు పోసిందీ... దాని చుట్టూ కమనీయమైన కాల్పనికతను అల్లి మహత్తర కావ్యంగా తీర్చిదిద్దిందీ మాలిక్ మహమ్మద్ జయాసి అనే ఒక ముస్లిం సూఫీ కవి. 1540లో... అంటే యుద్ధం జరిగిన 224 ఏళ్లకు ఆయన ఈ కావ్య రచనకు ఉప క్రమించాడు. మొదటిసారిగా అందులో రాణా రతన్సింగ్ భార్య పద్మావతి ప్రస్తా వన వచ్చింది. అంతకుముందు లిఖిత, అలిఖిత చరిత్రలో ఎక్కడా పద్మావతికి సంబంధించిన ఆధారాలు లేవు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థాన కవి అమీర్ఖుస్రో చిత్తోర్ కోట ముట్టడి గురించిన రాసిన పత్రాల్లో ఎక్కడా పద్మావతి గురించిన ప్రస్తావన లేదు. రాజస్థాన్ నుంచి బెంగాల్ వరకూ దాదాపు అయిదువందల సంవత్సరాల వ్యవధిలో మాలిక్ కావ్యానికి ఉర్దూ, పర్షియన్ భాషల్లో అనేక అనువాదాలొచ్చాయి. అనువదించే కవుల సృజనాత్మక శక్తి మేరకు ఆ కావ్యంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదేమీ కొత్తగాదు. రామాయణ గాథ ఎన్ని దేశాల్లో ఎన్నెన్ని విధా లుగా ఉన్నదో... అందులోని పాత్రలు, వాటి మధ్య సంబంధాలు ఎలా మార్పు చెందాయో వివరిస్తూ సుప్రసిద్ధ కవి ఆరుద్ర ‘రాముడికి సీత ఏమవుతుంది?’ పేరుతో చాన్నాళ్లక్రితం పుస్తకం రాశారు. ఇప్పుడు ‘పద్మావతి’ సినిమాపై నిప్పులు చెరుగుతున్న సంఘ్ పరివార్ పెద్దలు, రాజ్పుట్ కులానికి చెందిన కర్ణి సేన సభ్యులు పద్మావతి సృష్టికర్త ఒక ముస్లిం సూఫీ కవి అన్న సంగతిని మరుస్తున్నారు. రాజస్థాన్ ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు మంత్రులు చేసిన ప్రకటనల సంగతలా ఉంచి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ సైతం బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. తమ రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతినే అవకాశం ఉన్నందున చిత్రం విడుదలను వాయిదా వేయాలని యోగి కేంద్రాన్ని కోరు తున్నారు. గడ్కరి అయితే సినిమాలు నిర్మించేవారు స్వేచ్ఛ నిరపేక్షమైనదేమీ కాదని, దానికి కూడా హద్దులుంటాయని తెలుసుకోవాలని హితవు చెబుతున్నారు. అకారణంగా నోరు పారేసుకోవడానికి, బెదిరింపులకు దిగడానికి ఎలాంటి హద్దులూ ఉండవు కాబోలు! ‘పద్మావతి’పై ఇంత పెద్దయెత్తున వివాదం చెల రేగుతున్న వేళ సుప్రీంకోర్టు వేరే కేసులో చేసిన వ్యాఖ్యలు గమనించదగ్గవి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై నిర్మించిన ‘యాన్ ఇన్సిగ్నిఫికెంట్ మాన్’ పేరిట నిర్మించిన డాక్యుమెంటరీ విడుదల కాకుండా స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ను కొట్టేస్తూ ఏ రకమైన సృజనాత్మక వ్యక్తీకరణలకైనా అడ్డుతగిలే ప్రయత్నం చేయరాదని సుప్రీంకోర్టు కింది కోర్టులకు సూచించింది. భావప్రకటనా స్వేచ్ఛ అత్యంత పవిత్రమైనదని, ఆ హక్కులో ఆషామాషీ జోక్యం తగదని పిటిష నర్కు స్పష్టం చేసింది. చట్టపరిధిలో ఏ కళాకారుడైనా తనకు నచ్చిన రూపంలో తన భావాలను వ్యక్తపరచవచ్చునని తెలిపింది. సుప్రీంకోర్టు, కొన్ని హైకోర్టులు ఇంత స్పష్టంగా చెప్పడం ఇది మొదటిసారేమీ కాదు. అయినా వీధుల్లో ఛోటా నేతల వీరంగం ఆగడం లేదు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న నాయకులకు జ్ఞానోద యమూ కలగటం లేదు. ఇప్పుడు ‘పద్మావతి’ విషయంలో కేంద్రం స్పందన ఎలా ఉంటుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది. విజ్ఞతతో వ్యవహరించి ఈ అనవసర వివాదానికి ముగింపు పలకాల్సిన బాధ్యత తమపై ఉన్నదని పాలకులు గ్రహించాలి. -
దా‘రుణ’ స్థితి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాలో కౌలు రైతులు కష్టాల్లో చిక్కుకున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సాధారణ రైతు లాగానే అన్ని పనులూ చేస్తున్నా ఆ అన్నదాతకు వచ్చే రాయితీలు, సంక్షేమ పథకాలు పొందలేక చతికిలపడుతున్నారు. ప్రభుత్వ సాయం మాట పక్కన పెడితే కనీస గుర్తింపు లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కౌలు రైతులు దాదాపుగా 2లక్షలకు పైబడి ఉన్నట్లు రైతు సంఘాలు చెబుతుంటే అధికారులు మాత్రం యాభై వేల మందే ఉన్నట్లు లెక్కలు చూ పుతున్నారు. అయితే ఇందులో ఇప్పటివరకు లోన్ ఎలిజిబులిటీ (ఎల్ఈసీ) కార్డులు 18వేల మందికి,సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్ (సీఓసీ) కార్డులు 12,500 మందితో కలిపి మొత్తం 30,500 మం దికి కార్డులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా సుమారు 1.70 లక్షల కౌలుదారులు గుర్తింపు కార్డులకు నోచుకోక రాయితీలు పొందలేకపోతున్నారు. కౌలు రైతుల చట్టం 2011 ప్రకారం ఎలాంటి కార్డులు లేకున్నా భూ యజమాని రుణంతో సంబంధం లేకుండా రు ణం ఇవ్వాలి. కానీ అలాంటి చట్టాలను ప్రభుత్వం తుంగలో తొక్కేసి గుర్తింపు కార్డులు ఉన్నవారికి మాత్రమే రుణం మంజూరు చేయాలని నిబంధన పెట్టడంతో ఏ ఒక్క కౌలు రైతు రుణం తీసుకోలేకపోతున్నారు. సరిపోని రుణం భూ యజమానుల మాదిరిగానే కౌలు రైతులకు పంట పండించేందుకు అయ్యే ఖర్చు రూ.30వేలు ఉంటుంది. ప్రభుత్వం అలా రుణం మంజూ రు చేయకుండా ఐదుగురు నుంచి ఏడుగురు కౌ లు రైతులు కలిపి ఒక ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి గ్రూప్కి రూ.70వేలు చొప్పున ఇస్తున్నారు. దీని ప్రకారం ఒక్కొక్కరికీ రూ.10వేలు మాత్ర మే అందుతోంది. అది దేనికీ సరిపోవడం లేదు. అప్పివ్వని బ్యాంకులు కౌలు రైతులకు రుణం మంజూరు చేయాలని క లెక్టర్ చెప్పినా కో ఆపరేటివ్ బ్యాంకులు తప్పితే మరే ఇతర జాతీయ బ్యాంకులు రుణం ఇవ్వ డం లేదు. రైతులు రుణాలు చెల్లించకుంటే బ్యాంకు అధికారుల పదోన్నతులు, ఇంక్రిమెం ట్ల మీద దాని ప్రభావం పడుతుందని పూర్తిగా రుణాల ఇచ్చేందుకే ఎగనామం పెట్టేశారు. దీం తో అప్పుల కోసం బయట వ్యక్తులను ఆశ్రయిం చడంతో ఇదే అదనుగా రూ.2కి పైగా వడ్డీ వసూలు చేస్తున్నారు. ఓ పక్క కౌలు చెల్లించాలి, మరో పక్క వడ్డీ చెల్లించాలి పంట బాగా పండితే సరే లేకుంటే మరణమే శరణ్యమవుతోంది. ప్రదక్షిణ చేయాల్సిందే నాకు సెంటు భూమి లేదు. ఏటా రెండు మూడు ఎకరాలు కౌలుకి తీసుకుని పండిస్తాను. దాదాపుగా పదేళ్లుగా ఇలాగే చేస్తున్నాను. ఇప్పటివరకు ప్రభుత్వం కౌలు రైతుగా గుర్తింపు కార్డు ఇవ్వలేదు. కార్డు కావాలని ప్రతి రోజు రెవెన్యూ కార్యాలయం, వ్యవసాయశాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకున్న వారే కరువయ్యారు. కార్డు లేకపోవడంతో ఇప్పటివరకు ఒక్క రూపాయి రుణం తీసుకోలేపోయాను. – లబ్బ జగ్గారావు, కౌలు రైతు, కోమర్తి గ్రామం, నరసన్నపేట మండలం -
హాజరు ఒత్తిడి
తణుకు టౌన్: బయోమెట్రిక్ హాజరు పలు ప్రభుత్వ శాఖల్లోని క్షేత్ర స్థాయి ఉద్యోగులకు సంకటంగా మారింది. వైద్య ఆరోగ్య శాఖలో క్షేత్ర స్థాయిలో పని చేసే ఏఎన్ఎంలకు ఈవిధానం అమలు చేయవద్దని ఆశాఖ కమిషనర్ ఆదేశించినా జిల్లా అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో పని చేసే ఏఎన్ఎంలు, సూపర్వైజర్లుగా పనిచేసే మహిళా ఉద్యోగులకు ఇది తీవ్ర ఇబ్బందిగా మారింది. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటి పరిధిలోని సబ్ సెంటర్ల్లో పని చేసే వైద్య సిబ్బందిలో ఎక్కువ మంది ఫీల్డ్ వర్క్ చేసే వారే. వారిలో ఆరోగ్య కార్యకర్తలు, పురుష, మహిళా కార్యకర్తలు ఎక్కువగా వున్నారు. జిల్లాలో మొత్తం 81 పీహెచ్సీలు, వాటికి అనుబంధంగా 680 ఆరోగ్య ఉప కేంద్రాల్లో సుమారు 800 మంది ఏఎన్ఎంలు, 200 మంది సూపర్వైజర్లు పని చేస్తున్నారు. వీరంతా వారి పరిధిలోని పిల్లలు, బాలింతలు, గర్భిణిలకు వ్యాక్సిన్లు వేయటం, గర్భిణిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారి యోగ క్షేమాలను రికార్డు చేసి పీహెచ్సీ వైద్యాధికారికి నివేదించాలి. అయితే వీటిలో ఎక్కువ రిస్క్, అత్యవసర సేవలు అవసరమైన వారిని ఏరియా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలి. ఈ క్రమంలో గర్భిణిలను జిల్లాలోని వివిధ ఏరియా ఆసుపత్రులకుకానీ, ఏలూరు, కాకినాడలలోని జనరల్ ఆసుపత్రులకుగానీ కేసులను రిఫర్ చేసినప్పుడు సంబంధిత ఏఎన్ఎంలు బయోమెట్రిక్ హాజరే వేసుకోవాలా? రోగి కూడా వెళ్లాలా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయోమెట్రిక్ హాజరు విధానం ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసినా సర్వర్లు సరిగా పనిచేయక పోయినా, పంచాయతీ సిబ్బంది సరిగా స్పందించకపోయినా గంటల తరబడి బయోమెట్రిక్ యంత్రాల వద్ద పడిగాపులు కాయవలసి వస్తోందని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగి పని చేసే గ్రామంలో మాత్రమే బయోమెట్రిక్ హాజరు వేయాలని ప్రభుత్వం ఆదేశించడం వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకూ గ్రామంలో సర్వర్లు పని చేయకపోతే పక్క గ్రామంలో గానీ, పీహెచ్సీలోగానీ బయోమెట్రిక్ హాజరు వేసేవారు. ప్రస్తుత నిబంధనలతో వారి పరిస్థితి దినదిన గండంగా మారింది. రోగికి అత్యవసర వైద్యం కోసం బయటకు వెళ్తే ఆరోజుకు హాజరు లేనట్లేనని పేర్కొంటున్నారు. రెవెన్యూ సిబ్బందికి మినహాయింపు వీఆర్వో, సర్వేయర్, డిప్యూటి తహసీల్దార్, తహసిల్దార్కు బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపునిస్తూ వారం క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్ర స్థాయిలో పని చేసే వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు నిబంధనలు కఠినం చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్ర స్థాయి సిబ్బందిని మినహాయించాలి బయోమెట్రిక్ హాజరు నుంచి వైద్య ఆరోగ్య శాఖలోని క్షేత్ర స్థాయి ఉద్యోగులను ముఖ్యంగా ఏఎన్ఎం, సూపర్వైజర్లకు మినహాయింపు ఇవ్వాలి. ఇప్పటికే వారిపై అనేక పని భారాలు మోపారు. క్షేత్ర స్థాయిలో పని చేసే ఉద్యోగులు రోగులకు సేవలందించాలో, బయోమెట్రిక్ హాజరు కోసం వేచి చూడాలో తెలియక సతమతమవుతున్నారు. – కె.జయమణి, జిల్లా అధ్యక్షులు, వైద్య ఆరోగ్య శాఖ మహిళా ఉద్యోగుల సంఘం -
ముమ్మరంగా బోరుగుంతల పూడ్చివేత
మెదక్రూరల్: బోరుబావులను పూడ్చేందుకు ఆయా గ్రామాల సర్పంచ్లు, యువత, అధికారులు ముందుకు వçస్తున్నారు. మెదక్ మండలం మంబోజిపల్లి గ్రామ సమీప పొలంలో ప్రమాదకరంగా ఉన్న బోరుబావిని సర్పంచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో పూడ్చివేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బోర్ వేసిని నీరుపడని గుంతలను వెంటనే పూడ్చివేయాలని సూచించారు. పాపన్నపేట(మెదక్): మండల పరిధిలోని చిత్రియాల్లో నిరుపయోగంగా ఉన్న బోరు గుంతలను ఎస్ఐ సందీప్రెడ్డి ,గ్రామ పోలీసు ఇన్చార్జి ఇమ్మానియల్ ఆధ్వర్యంలో పోలీసులు పూడ్చివేశారు. బోరు తవ్వినా నీరు పడకపోవడంతో చాలా మంది రైతులు వాటిని అలాగే వదిలేశారు. ఈ సంధర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ప్రమాదకరంగా ఉన్న బోర్లను రైతులు వెంటనే పూడ్చివేత చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. లేనిపక్షంలో కేసులు నమోదుచేస్తామన్నారు. హవేళిఘణాపూర్(మెదక్): ప్రమాదకరంగాఉన్న బోరుబావులను పూడ్చివేయాలని హవేళిఘణాపూర్ ఎస్ఐ శ్రీకాంత్ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మంగళవారం ఎస్ఐ ఆధ్వర్యంలో మండల పరిధిలోని తొగిట, కూచన్పల్లి, ముత్తాయికోట, మద్దుల్వాయి గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. నీరు పడని బోరుబావుల పూడ్చివేత చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. అంతకు ముందు హవేళిఘణాపూర్ ఉన్నత పాఠశాలలో ప్రమాదకరంగా ఉన్న బోరుబావిని పూడ్చివేశారు. బైక్ ర్యాలీలో ఎంపీటీసీ శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు సాయిలు, రాంచంద్రారెడ్డి, మంగ్యనాయక్, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. పెద్దశంకరంపేట(మెదక్): బోరుబావుల మూసివేతపై ప్రతిఒక్కరూ స్పందించాలని ఎస్ఐ విజయరావు, సర్పంచ్ జంగం శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేట బస్టాండ్తో పాటు ఇతర ప్రాంతాల్లోఉన్న ప్రమాదకరంగా ఉన్న బోరుబావులను మట్టితో పూడ్చివేశారు. ప్రజల స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బోరుబావులను పూడ్చివేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు సుభాష్గౌడ్, ఈఓ నవీన్కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు. -
ఇబ్బందులే అసలు పరీక్ష
ఏలూరు సిటీ : గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ప్రశాం తంగా ముగిసింది. అడుగడుగునా సమస్యలు, ఇబ్బం దులు అభ్యర్థులకు పెద్ద పరీక్షగా మారాయి, విధిగా గుర్తింపు కార్డులు తీసుకురావాలనే నిబంధనపై అవగాహన కల్పించకపోవటంతో వందలాది మంది పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. ఆర్ట్స్ గ్రూప్ అభ్యర్థులకు ఈ పరీక్ష ఏపీపీఎస్సీ స్థాయిలో లేదని చెబుతుండగా, సైన్సు సబ్జెక్ట్ అభ్యర్థులకు మాత్రం కొంచెం కష్టంగా అనిపించింది. జిల్లా వ్యాప్తంగా 65 పరీక్షా కేంద్రాల్లో 74.39 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎన్ని ఇబ్బందులో.. జిల్లాలో 39,828మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 10,201 మంది గైర్హాజరయ్యారు. 29,627 మంది స్క్రీనింగ్ టెస్ట్కు హాజరయ్యారు. 9 మంది స్పెషల్ ఆఫీసర్లు, 30మంది లైజాన్ ఆఫీసర్లు, కలెక్టర్ కె.భాస్కర్, జేసీ పులిపాటి కోటేశ్వరరావు, డీఆర్వో కట్టా హైమావతి, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ వీ.రమేష్బాబు, డీఈఓ ఆర్ఎస్ గంగాభవాని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. కలెక్టర్ భాస్కర్ ఏలూరులోని సీఆర్ఆర్ అటానమస్, సీఆర్ఆర్ ఉమెన్స్, సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీల్లోని కేంద్రాలను తనిఖీ చేశారు. ఏలూరు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, జంగారెడ్డిగూడెం, తణుకు, తాడేపల్లిగూడెం, పెదపాడు, పెదవేగి, నల్లజర్లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. ఏలూరు రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీ పరీక్షా కేంద్రం వద్ద తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంకు చెందిన ఎస్.దివ్య గుర్తింపు కార్డు లేకుండా రావటంతో పరీక్ష రాసేందుకు అధికారులు నిరాకరించారు. గోడు చెప్పుకునే అవకాశాన్ని కూడా అధికారులు ఇవ్వకపోవటం గమనార్హం. చాలాచోట్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తడంతో వందలాది మంది అభ్యర్థులు పరీక్ష రాయకుండా వెనుదిరగాల్సి వచ్చింది. ఆర్టీసీ బస్సులు కిటకిటలాడాయి. టికెట్లు ఇచ్చేందుకు బస్సులను పలుచోట్ల నిలుపుదల చేయడంతో అభ్యర్థులు ఒత్తిడికి గురయ్యారు. సకాలంలో పరీక్ష కేంద్రానికి వెళ్లగలమో లేదోనని ఆందోళన చెందారు. నెలల తరబడి శిక్షణ పొందిన వారితోపాటు పరీక్షలో ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే ఆశతో అభ్యర్థులు తీవ్రంగా శ్రమించారు. చాలామంది ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. 9.30 గంటల నుంచి వారికి లోనికి అనుమతించారు. చంటి పిల్లలు ఉన్న వారు భర్త, బంధుగణంతో పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లగా వారి కుటుంబ సభ్యులు, బంధువులు చెట్లు, పుట్టలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదిలావుంటే.. వేసవి వచ్చేసిందా అన్నట్టు భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు. -
షేల్ గ్యాస్ తవ్వకాలతో అనర్థాలు
భీమవరం : షేల్ గ్యాస్ తవ్వకాల వల్ల ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రొఫెసర్ కె.బాబూరావు ఆందోళన వ్యక్తం చేశారు. భీమవరం క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ హాల్లో ఆదివారం సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన షేల్ గ్యాస్ వెలికితీత వ్యతిరేక సభలో ఆయన ముఖ్యవక్తగా ప్రసంగించారు. షేల్ గ్యాస్ను వెలికితీసేందుకు నాలుగు కిలోమీటర్ల పొడవు ఆ తర్వాత అడ్డంగా పైపులు వేస్తారని దీనికిగాను వివిధ రకాల రసాయనాలతో కూడిన నీటిని పదివేల పౌండ్ల ఒత్తిడితో భూమిలోనికి పంపి షేల్ (నాపరాయి)ని పగులగొడతారన్నారు. దీనివల్ల భూగర్భ జలాలు సైతం కలుషితమై తాగునీటికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. షేల్గ్యాస్ తవ్వకాలకు అవసరమైన అధునాతన పరిజ్ఞానం ఓఎన్జీసీ వద్ద లేదన్నారు. 3 లక్షల ఎకరాలకు ముప్పు మూడు జిల్లాల్లో సుమారు 70 వేల బావులను తవ్వడానికి రంగం సిద్ధం చేశారని, ఒక్కో బావి వద్ద సుమారు నాలుగు ఎకరాల పంటకు నష్టం తప్పదని, దీంతో సుమారు 3 లక్షల ఎకరాలకుపైగా పంట కోల్పోవాల్సి వస్తుందని బాబూరావు చెప్పారు. షేల్ గ్యాస్ తవ్వకాలకు నీరు ఎక్కువగా ఉపయోగించాల్సి రావడంతో నీటి కొరత ఏర్పడుతుందన్నారు. షేల్గ్యాస్ తవ్వకాలకు ఓఎ¯ŒSజీసీ ఇచ్చిన నివేదికలు సక్రమంగా లేవని దీనివల్ల విపరీతమైన భూతాపం పెరిగిపోయే ప్రమా దం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు ఇచ్చే కమిటీలు కూడా ఉత్సవ విగ్రహాలుగా మారాయని, కమిటీలపై ప్రజాప్రతినిధులు పెత్తనంతో ప్రమాదకరమైన వాటికి కూ డా అనుమతులు వస్తున్నాయని బాబూరావు విమర్శిం చారు. మూడు జిల్లాల్లో షేల్గ్యాస్ ఆరు లక్షల చదరపు ఘనపుటడుగులు మాత్ర మే ఉందని గుర్తించారని ఇది చాలా తక్కువన్నారు. పంటల దిగుబడిపై ప్రభావం షేల్ గ్యాస్ వెలికితీసే క్రమంలో వెలువడే విషవాయువుల కారణంగా డ్రిల్లింగ్ ప్రాంతంలోని 20 కిలోమీటర్ల వరకు పం టల దిగుబడి ఘోరంగా పడిపోతుందని ప్రొఫెసర్ జి.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వ చర్యల ను ప్రతి ఒక్కరూ అడ్డుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అమెరికా వంటి దేశాలు కూడా షేల్గ్యాస్ను వ్యతిరేకించాయని స్పష్టం చేశారు. ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి మర్ల విజయకుమార్, సీపీఐ రాష్ట్ర సహాయ కా ర్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, నార్ల వెం కటేశ్వరరావు, నెక్కంటి సుబ్బారావు, ఎ ం.సీతారామ్ప్రసాద్, చెల్లబోయిన రం గారావు, లంక కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
ప్రాణసంకటం
డబ్బుల్లేక జనం విలవిల రోగులు, వృద్ధులు, వికలాంగుల పరిస్థితి మరీ దయనీయం జనంతో కిక్కిరిసిపోతున్న బ్యాంకులు చాలాచోట్ల ‘సర్దుబాటు’తో సరి మెరుగు కాని ఏటీఎంల పరిస్థితి అనంతపురం నగరానికి చెందిన ఈ పెద్దాయన పేరు వెంకటేశులు. ఉద్యోగ విరమణ చేసి ఐదారేళ్లయ్యింది. ఇటీవల ప్రమాదంలో కాలు దెబ్బతినడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పెన్షన్ డబ్బుతోనే సంసారం గడవాలి. ఇప్పుడు చికిత్సకు కూడా డబ్బు అవసరమైంది. ఆయనొస్తే కానీ విత్డ్రా చేసుకోలేని పరిస్థితి. దీంతో కుటుంబ సభ్యులు అష్టకష్టాలు పడి వెంకటేశులును స్థానిక సాయినగర్ ఎస్బీఐకి తీసుకొచ్చారు.కొంత నగదు డ్రా చేసుకుని వెళ్లారు. ఏటీఎంలు పనిచేసి ఉంటే తమకీ పరిస్థితి వచ్చేది కాదని వారు వాపోయారు. ప్రజల కరెన్సీ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు తప్పడం లేదు. ఎప్పటిలాగే సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా బ్యాంకులు కిక్కిరిసిపోయాయి. చాలా వరకు ఏటీఎంలు పనిచేయలేదు. పనిచేసిన వాటి వద్ద చాంతాడంత క్యూలు కన్పించాయి. పెద్ద నోట్లు రద్దు చేసి సోమవారం నాటికి 27 రోజులైనా సమస్య ఏమాత్రమూ తీరలేదు. ఇంకెన్నాళ్లు కొనసాగుతుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, రోగులకు ప్రాణసంకటంగా మారింది. ఇంట్లో మంచానపడ్డ వారు, వివిధ జబ్బులతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు, వికలాంగులు, అంధులు, వయో వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ పింఛన్ సొమ్ము కోసం ప్రాణాలకు తెగించి..బ్యాంకుల వద్దకు రావాల్సి వస్తోంది. పేదలు, రైతులు, మహిళలు, గర్భిణులు, బాలింతలకు కూడా కష్టాలు తప్పడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకుల వద్ద క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సివస్తోంది. నగదు కొరతతో సర్దుబాట్లు జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోనూ నగదు కొరత తీవ్రంగా ఉంది. సరఫరా అవుతున్న అరకొర నగదు ఒకట్రెండు రోజుల్లోనే ఖాళీ అవుతోంది. దీంతో ఎక్కడా ఒకేసారి రూ.24 వేలు విత్డ్రా ఇచ్చే పరిస్థితి లేదు. రూ.4 వేల నుంచి గరిష్టంగా రూ.10 వేలతో సర్దుబాటు చేసి పంపుతున్నారు. చిన్న డినామినేషన్ నోట్లు తక్కువగా ఉండటంతో 80 శాతం వరకు రూ.2 వేల నోట్లతో సరిపెడుతున్నారు. రోజుకు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్లు ఉంటే కాని అందరికీ న్యాయం చేయలేమని బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు. ప్రస్తుతం రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు మాత్రమే దినసరి లావాదేవీలు జరుగుతున్నట్లు అంచనా. ఎస్బీఐ పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా.. ఆంధ్రా, సిండికేట్, కెనరా, ఏపీజీబీ, కార్పొరేషన్, ఎస్బీహెచ్ లాంటి ప్రధాన బ్యాంకుల్లో సైతం నగదు కొరత కొనసాగుతోంది. వీటికి సంబంధించి సోమవారం కూడా దాదాపు 30 శాఖల్లో 'నోక్యాష్', 'క్యాష్ నిల్' బోర్డులు తగిలించారు. యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఐడీబీఐ, బ్యాంకు ఆఫ్ బరోడా లాంటి కొన్ని ప్రైవేట్ వాణిజ్య బ్యాంకుల్లో పరిస్థితి బాగానే ఉన్నా, ఇండస్ఇండ్, ఇండియన్, బ్యాంకు ఆఫ్ ఇండియా, దేనా, పంజాబ్నేషనల్ బ్యాంకు, విజయా, కరూర్ వైశ్యా, కొటక్ మహింద్రా బ్యాంకుల్లో నగదు కొరత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. నిరవధికంగా మూతబడ్డ ఏటీఎంలు సోమవారం కూడా అనంతపురం నగరంలో ఏటీఎంలు పనిచేయలేదు. కౌంటర్ల ద్వారా నగదు ఇవ్వడానికే ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఏటీఎంలలో పెట్టడానికి బ్యాంకర్లు సాహసించడం లేదు. సాయంత్రం, రాత్రి వేళల్లో 10 నుంచి 15 ఏటీఎంలలో కొంత నగదు పెడుతుండగా, అది గంటల్లోనే అయిపోతోంది. జిల్లాలో ఎస్బీఐ ఏటీఎంలు 212 ఉండగా, నాలుగైదు మాత్రమే పనిచేయడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా మొత్తం 556 ఏటీఎంలకు గానూ సోమవారం 20కి మించి పనిచేయలేదని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. నగదు రహితంపై అవగాహన నగదు రహిత లావాదేవీలపై బ్యాంకర్లు, అధికారులు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయితే..వీటికి ప్రజల నుంచి స్పందన కనిపించడంలేదు. ఉన్నఫళంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, స్మార్ట్ఫోన్ల వాడకం ఇబ్బందే అని ప్రజలు అంటున్నారు. స్వైప్మిషన్లు, రకరకాల యాప్లు ఉపయోగించి బ్యాంకింగ్ సేవలు పొందడానికి చదువుకున్నవారు, అధికారులు, బ్యాంకర్లే అవస్థలు పడుతుండటంతో ఇక రైతులు, పేదలు, సామాన్య వర్గాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. -
కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు
అనంతపురం అగ్రికల్చర్: అనంతపురం జిల్లాలో 27వ రోజు సోమవారం కూడా నగదు కష్టాలతో జనం ఇబ్బంది పడ్డారు. అనంతపురం, హిందూపురం, తాడిపత్రి, గుంతకల్లు లాంటి ప్రధాన పట్టణాల్లో బ్యాంకుల వద్ద ఉద్యోగులు, పెన్షనర్లు, సామాన్యులు అవస్థలు పడ్డారు. కదిరి, ఓడీ చెరువు, గుంతకల్లు, యాడికి తదితర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విత్డ్రాల కోసం వృద్ధులు, వికలాంగులు, రోగులు, గర్భిణులు, బాలింతలు బ్యాంకుల వద్ద పడిగాపులు కాసినా చాలా మందికి నిరాశ తప్పలేదు. సోమవారం విత్డ్రాలు చాలా బ్యాంకుల్లో రూ.4 వేల నుంచి గరిష్టంగా రూ.10 వేలు ఇచ్చారు. చిన్న నోట్ల కొరత కొనసాగింది. 80 శాతానికి పైగా రూ.2 వేల నోట్లతో సరిపెట్టారు. రూ.500 నోట్లు ఒకట్రెండు బ్యాంకులు మినహా ఎక్కడా పంపిణీ చేయలేదు. 556 ఏటీఎంలకు గానూ 20 మించి పనిచేయలేదు. జిల్లాలో ఇప్పటివరకు రూ.2,500 కోట్లకు పైగా డిపాజిట్లు వచ్చినట్లు సమాచారం. -
ఖాతాల్లో ఫుల్... జేబుల్లో నిల్
మూడో రోజూ అదే తంతు వేతన జీవులకు తీరని అవస్థలు పింఛ¯ŒSదారులు తిరుగుముఖం క్షణాల్లో రూ.140 కోట్లు ఖాళీ సాక్షి ప్రతినిధి – కాకినాడ : ఖాతాల్లో డబ్బున్నా ఖాతాదారులు మాత్రం వంద రూపాయల కోసం కటకటలాడుతున్నారు. చివరకు వేతన జీవులు కూడా జేబులో సరిపడా డబ్బుల్లేక నరకం చూస్తున్నారు. నెలలో ఒకటో తేదీ మొదలై శనివారం నాటికి మూడు రోజులైపోయింది. చేతిలో కనీస ఖర్చులకు డబ్బులు లేక సగటుజీవి సతమతమవుతున్నాడు. జీతాలువిడుదలైనా నాలుగు వేలు మించి చేతిలో పడక ఉద్యోగులు పరిస్థితి దయనీయంగా మారింది. ఒకరోజు కాకపోతే రెండో రోజు అప్పటికీ కాకపోతే మూడో రోజైనా అంతా సర్థుకుంటుందనే ఆశించారు.తీరా శనివారం కూడా నగదు విడుదల్లో పెద్దగా ఎటువంటి మార్పు కనిపించ లేదు. నెల ప్రారంభంలో చెల్లించే ఖర్చులకు చేతిలో సరిపడా డబ్బులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఉదయం నుంచి రాత్రి వరకు బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులుదీరిన వారికి నిరాశే ఎదురైంది. శుక్రవారం రాత్రికి జిల్లాకు వచ్చిన రూ.140 కోట్లు అన్ని బ్యాంకులకు జమ చేశారు. కానీ ఆ సొమ్ము రెండు గంటల్లోనే ఖాళీ అయిపోయింది.మధ్యాహ్నం 3 గంటల తరువాత దాదాపు జిల్లాలో ఏటీఎంలు, బ్యాంకుల్లో నగదు లేక ఖాతాదారులు, పింఛ¯ŒSదారులు, ఉద్యోగులు ఉసూరుమంటూ వెనుతిరిగారు. శనివారం రాత్రికి రూ.200 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఆ నగదు వస్తే సోమవారం ఉదయం ప్రధాన బ్యాంకులతోపాటు ఏటీఎంలలో పెట్టే ఏర్పాట్లు చేస్తున్నారు. అయినా సమస్య ఇప్పటికిప్పుడు పరిష్కారమై అవసరం మేరకు సొమ్ము లభించే పరిస్థితి లేదని బ్యాంకు వర్గాలే చేతులెత్తేస్తున్నాయి. జీతాలు, పింఛన్ల పంపిణీ మొదలైన మూడో రోజు శనివారం కూడా అదే తంతు కొనసాగింది. ఎక్కడా ఏ ఏటీఎంలోను, బ్యాంకులోను డబ్బులు లేవనే సమాధానమే ఎదురైంది. కొంతలో కొంత కనీసం నాలుగైదు వేలైనా దక్కాయని ఉద్యోగులు సరిపెట్టుకుంటున్నారు. మె జార్టీ బ్యాంకుల్లో ఉదయం ప్రారంభమై రెండు గంటల్లోనే నగదు నిండుకోవడం తో జనం నిరాశతో వెళ్లిపోయారు. పింఛ¯ŒSదారుల అవస్థలు దయనీయం... పింఛ¯ŒSదారులకు రూ.1000, రూ.1500 ఇవ్వాల్సి ఉన్నా రూ.100 నోట్లు కొరత కారణంగా కనీసం పది శాతం మందికి కూడా ఇవ్వలేకపోయారు. ఏజెన్సీలో నేరుగా పింఛ¯ŒSదారుల చేతికే సొమ్ములు ఇస్తామని ప్రకటించినా అది కూడా ఆచరణలో బెడిసికొట్టింది.రూ.100 నోట్లు కొరత, పూర్తి స్థాయిలో బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. సామాజిక భద్రతా పింఛన్లపైనే ఆధారపడ్డ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు రోజు గడిచే పరిస్థితి లేక కన్నీటి పర్యంతమవుతున్నారు. ఏలేశ్వరం ఆంధ్రా బ్యాంకులో పింఛ¯ŒSదారులకు రూ. 1000కి బదులు రూ. 500 ఇవ్వడంతో నిరాశ చెందారు. పింఛ¯ŒSదారుల ఇబ్బందులపై అఖిల భారత మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ నిర్వహించే వరకూ వెళ్లింది. గోకవరం కొత్తపల్లికి చెందిన కె.కుమారి బ్రెయి¯ŒSకు ఆపరేష¯ŒS చేయించుకుని మందుల కోసం ఆటోలో రాజమహేంద్రవరం వెళ్లి నిరాశతో ఇంటికి తిరిగి వచ్చేసింది. ఇలా చాలా మంది మందులు, ఇంట్లో పచారీ సరుకులు కొ నుగోలు చేయడానికి చేతిలో డబ్బుల్లేక నానా తంటాలుపడుతున్నారు. ఉదయం బారులుదీరినా బ్యాంకులో నగదు లేక రాజానగరం ని యోజకవర్గంలో చా లా బ్యాంకుల్లో జనం తిట్టుకుంటూ పోయారు. అంతటా ఇదే పరిస్థితి... ∙తుని, పిఠాపురం నియోజకవర్గాల్లోని బ్యాంకుల్లో అయితే నగదు చెల్లింపులు జరపలేదు. రాజమం డ్రి రూరల్లో పింఛ¯ŒSదారులకు బ్యాంకుల్లో పింఛన్లు పడలేదు. + రాజమండ్రి సిటీలో ఏటీఎంలు వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు క్యూలై¯ŒSలలో ఉండి రెండు వేలు వంతున తీసుకున్నారు. ∙కాకినాడ సిటీలో ఏటీఎంలలో నగదు లేక ఖాతాదారులు తిరిగి వెళ్ళిపోయారు. బ్యాంకు లో రూ.3 వేలు, రూ.4 వేలు మాత్రమే ఖాతాదారులకు ఇచ్చారు. అమలాపురంలో ఉద్యోగులకు పూర్తిస్థాయిలో నగదు ఇవ్వలేదు. మామిడికుదురు ఎస్బిఐలో సాయంత్రం 3 గంటల వరకు రూ.2వేలు నోట్లు ఇవ్వగా, నగదు నిండుకోవడంతో క్యూలో ఉన్న ఖాతాదారులు వెనుతిరిగారు. ఆత్రేయపురం మండలం ర్యాలి ఆంధ్రాబ్యాంకులో పింఛ¯ŒSదారులకు రూ.1000 డిపాజిట్ చేస్తే రూ.2 వేలు నోటు ఇస్తామనడంతో నిరాశ చెందారు. మండపేట, పెద్దాపురం, రామచంద్రపురం నియోజకవర్గాల్లో సామాజిక పింఛన్లు అందక వెనుతిరిగి వెళ్లి పోవడంకన్పించింది. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుంది.. తమ కష్టాలు ఎప్పటికి గట్టెక్కు తాయని జనం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. -
నోట్ల రద్దుతో రైతులు అతలాకుతలం
* వైఎస్సార్ సీపీ నాయకులు మేరుగ నాగార్జున, లేళ్ళ అప్పిరెడ్డి * చేతికందిన పంట మట్టిపాలు * పంటను కాపాడుకోలేకపోతున్న దైన్యం ఇంటూరు (అమృతలూరు): పెద్దనోట్ల రద్దుతో రైతులు అతలాకుతమవుతున్నారని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. మండలంలోని ఇంటూరులో గురువారం వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి వీరభద్ర శ్రీనివాసరెడ్డి (వాసు) గృహంలో పార్టీ నాయకులతో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ వ్యవసాయ తరుణంలో కూలీలకు కూలిడబ్బులు చెల్లించేందుకు కూడా చేతిలో చిల్లర నోట్లు లేక రైతులు సతమతమవుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లు చెల్లవనడంతో రైతాంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ధ్వజమెత్తారు. బ్యాంకుల ద్వారా వారానికి రూ.25 వేలు ఇస్తున్నామని ఊదరగొట్టి, వ్యవసాయ రైతులకు ఆటంకం కలిగించమని చెబుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ అమలు చేస్తున్నారో జవాబివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయం దండగ అన్నట్టుగా వ్యవహారం.. రెండో పంటకు అదును దాటడంతో రైతుల్లో కలవరం మొదలైందన్నారు. నోట్ల రద్దు కారణంగా కనీసం విత్తనాలు కొనలేని పరిస్థితి దాపురించిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు 90 శాతం అపరాలు మినుము, పెసర విత్తనాలు సబ్సిడీపై ఇచ్చారని గుర్తు చేశారు. రైతాంగానికి సబ్సిడీపై విత్తనాలు ఇవ్వకపోవడమే కాక, నాణ్యమైన విత్తనాలు కూడా దొరకడం లేదని, నకిలీ విత్తనాలతో రైతుల నోట్లో మట్టి కొడుతున్నారన్నారు. నోట్ల రద్దు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు ఒకసారి స్వాగతిస్తున్నామని, రెండోసారి తిరస్కరిస్తున్నామని, మూడోసారి కలత చెందానని అనడం ఆయన స్థాయికి తగదన్నారు. రైతులకు వ్యవసాయం దండగ అన్నట్టుగానే చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతులు సంక్షోభంలో ఉండడంతో కోతలు అర్థాంతరంగా ఆగిపోయిన పరిస్థితి నెలకొందన్నారు. ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదన్నారు. మార్క్ఫెడ్ ద్వారా ధాన్యాన్ని కొనిచ్చే ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగం సమస్యలపై ప్రభుత్వం చోద్యం చూస్తుంటే.. రైతాంగం తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. రైతులతో పెట్టుకుంటే ప్రభుత్వాలకు చరిత్ర లేకుండా చేస్తారన్నారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని, లేదంటే వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
ఎందుకొచ్చామురా.. దేవుడా..!
* అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి * తీవ్ర ఇబ్బందులు పడిన మహిళలు, విద్యార్థులు * చీకట్లో ఎటువెళ్లాలో తెలియక అవస్థలు ఎందుకు వచ్చామురా దేవుడా.. ఈ చంద్రబాబు మీటింగ్లేమిటో మా చావుకొచ్చింది.. కాలు కదపలేకపోతున్నాం.. ఎటు వెళ్లాలో తెలియడం లేదు.. ఇంటి దగ్గర పిల్లలు ఎలా ఉన్నారో ఏమిటో.. ఈ ఫోనులూ మూగబోయాయి.. మళ్లీ ఇంకోసారి మీటింగ్లంటూ అధికారులు ఒత్తిడి చేస్తే అప్పుడు చెబుతాం.. ఇదీ రాజధాని భవనాల శంకుస్థాపనకు వచ్చిన మహిళల ఆవేదన..ఊరిగాని ఊరు వచ్చారు..విద్యుత్ లేక ఎటుచూసినా అంధకారం అలుముకుంది..కాలు తీసి కాలు వేయాలంటే జర్రున జారింది..ఈ పరిస్థితిలో ఏమి చేయాలో తెలియక..ప్రతి ఒక్కరి గుండెల్లో ఆందోళన వారి కళ్లలో బిక్కుబిక్కుమంటూ కనిపింది. సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని ప్రాంత రైతులు భవనాల శంకుస్థాపన సభలకు వస్తే గొడవ చేస్తారని, బయటి ప్రాంతాల నుంచి జనాలను తరలించిన ప్రభుత్వం వారిని అష్టకష్టాల పాలు చేసింది. డ్వాక్రా సమావేశమని గుంటూరు జిల్లా వినుకొండ, కృష్ణా జిల్లా పామర్రు వంటి సుదూర ప్రాంతాల నుంచి మహిళలను రాజధాని శంకుస్థాపన సభకు తరలించారు. ఇక్కడకొచ్చాక జోరున వర్షం కురవడంతో కరెంటు లేక, సెల్ సిగ్నల్స్ రాక ఇళ్ల దగ్గర వారికి సమాచారం సైతం ఇవ్వలేకపోయారు. శనివారం తెల్లవారు జామున మూడు గంటల వరకు సభ ప్రాంగంణం వద్దనే ఉండి వచ్చిన జనాలను తరలించేందుకు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే విశేష కృషి చేశారు. కొంత మంది ఎటుపోవాలో తెలియక పార్కింగ్ ప్రాంతాల్లో ఉన్న బస్సుల్లోనే తల దాచుకున్నారు. ఐజీ సంజయ్, రూరల్ ఎస్పీ నారాయణనాయక్లు తమ సిబ్బందితో వీరిని గుర్తించి రోడ్డుపైకి చేర్చారు. స్పెషల్ పార్టీ పోలీసులు, ఆర్డీఎఫ్ బలగాలు భుజాలపై నీటి మూటలు వేసుకొని మోకాళ్ల లోతు బురదలో వెళ్లి ప్రజల దాహార్తి తీర్చారు. జేసీబీల సాయంతో కూరుకుపోయిన వాహనాలను బయటకు తీశారు. రోడ్డు క్లియర్ చేయడంలో ఎన్డీఆర్ఎఫ్ తీవ్రంగా శ్రమించాయి. ఒకదశలో ఉన్నతాధికారుల సీసీలు, డ్రైవర్ ఎక్కడనున్నారో కనుక్కోలేని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. డీఆర్డీఏ పీడీ హబీబ్ బాషా సభకు వచ్చిన మహిళలను వారి గమ్యస్థానాలకు చేర్చారు. కలెక్టర్ ఆదేశాలతో ఆర్ఎం 75 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి సమయంలో రాజధాని ప్రాంత గ్రామాల ప్రజలు, అక్షయ పాత్ర వారు భోజనాలు ఏర్పాటు చేశారు. కదలని వాహనాలు.. సభ ముగిసే సమయంలో ఆ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో ప్రాంగణాలు , పార్కింగ్ ప్రదేశాలు చిత్తడిగా మారాయి. రాజధాని శంకుస్థాపన ప్రాంతం నల్లరేగడి నేల కావడంతో జనాలు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. పొలాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఇరుక్కుపోయాయి. వందల సంఖ్యలో వాహనాలు ఇరుక్కపోయి అక్కడే ఉండిపోయాయి. సీఎం వచ్చిన ప్రతిసారీ.. గుంటూరు జిల్లాకు ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం చేశాక దాదాపు 30 సార్లు జిల్లాలో సభలు నిర్వహించారు. సభ నిర్వహించిన ప్రతిసారీ మహిళలు, స్కూలు విద్యార్థుల తరలింపు బాధ్యతను అధికారులకు అప్పగించారు. దీంతో సీఎం పర్యటనలంటే జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. సంబంధం లేని వారిని సభలకు తరలించి, ఇబ్బంది పెడుతున్నామనే భావన వెంటాడుతున్నా బయటకు చెప్పుకోలేని పరిప్థితి నెలకొంది. సీఎం సభలంటే ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, ఉన్నతాధికారులు హడలిపోతున్నారు. హడావుడిగా సమీక్ష.. రాజధాని ప్రాంతంలో శంకుస్థాపన సభలకు వెళ్లిన జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే సమాచారం ప్రభుత్వానికి చేరింది. ఈ నేపథ్యంలో జనాల నుంచి తిరుగుబాటు వస్తుందని భావించిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా అధికారులతో హడావుడిగా సమీక్ష నిర్వహించారు. -
అంగన్వాడీ చిన్నారులకు తీరని శాపం
–14వ ఆర్ధిక సంఘం నిధులున్నా – మౌలిక వసతులు కల్పన సున్నా –3,889 అంగన్వాడీ కేంద్రాల్లో కానరాని నీరు, ఫ్యాను, లైట్లు దెందులూరు: ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం జిల్లా ఉన్నతాధికారుల నిర్లక్ష్యపర్యవేక్షణ దోరణే కారణంగా జిల్లాలో ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు మౌలిక వసతుల కల్పనకు నోచుకోలేకపోతున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న చందాన కేంద్రంలో ఉన్నచిన్నారుల సౌకర్యాల పరిస్థితి తయారయ్యింది. అన్ని వ్యాధులకు మూలం తాగునీరు. సురక్షిమైన తాగునీరు కాకుండా వేరే నీరు తాగడం వల్ల వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. చిన్నారుల్లో వ్యాధి నిరోదక శకి తక్కువుగా ఉంటుంది. అడగలేని అంగన్వాడీ చిన్నారులకు సురక్షితమైన త్రాగునీరు, గాలి,విద్యుత్ లైట్లు సౌకర్యం కరువైంది. ఉన్నత పాఠశాలల్లో ఆర్ఓ సిస్టం ద్వారా త్రాగునీరు కల్పిస్తూ చిన్నారులకు మాత్రం రక్షణ లేని తాగునీటిని ప్రభుత్వం సరఫరా చేస్తుంది. జిల్లా కలెక్టర్ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో సురక్షితమైన తాగునీరు, ఫ్యాను, లైటు, విద్యుత్తు సౌకర్యం కల్పించాలని ఇందుకు ఆయా గ్రామ పంచాయతీలు 14వ ఆర్ధిక సంఘం నిధులు మంజూరుచేయాలని లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. నెలలు కావస్తున్నా అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు సమయంలో ఎలా ఉన్నాయో నేటికీ అలాగే ఉన్నాయి. గ్రామ పంచాయతీలు జిల్లా కలెక్టరు ఆదేశాలను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేకపోవడంతో జిల్లాలో 48 మండలాల్లో 3889 అంగన్వాడీ కేంద్రాల్లోదాదాపు లక్ష మంది చిన్నారులకు వేలాది మంది చిన్నారులు సురక్షితమైన తాగునీరు, గాలి సౌకర్యానికి దూరంగా ఉన్నారు. పర్యవేక్షణ చేయవలసిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఒత్తిడి పెంచకపోవడం, జిల్లా కలెక్టరు ఆదేశాలను అమలు చేసి నిధులు మంజూరు చేయాల్సిన గ్రామ కార్యదర్శులు స్పందించకపోవడం వెరసి అంగన్వాడీ కేంద్రాలు మౌలిక వసతుల కల్పనకు నోచుకోలేకపోతున్నాయి. వి చంద్రశేఖర్రావు, జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టరు, ఐసిడిఎస్ గతంలో జిల్లా కలెక్టరు లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చిన సంగతి వాస్తవమే. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో ఆర్ఓ ఫిల్టర్లు,ఫ్యాన్లు లేవు. ఇప్పుడిప్పుడే పంచాయతీ అధికారులు నిధులు మంజూరుకు అంగీకారం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా అన్ని పంచాయతీలకు వెళ్ళి తమ వంతు బాధ్యతగా మౌలిక వసతుల కల్పన విషయానికి సంబంధించి కలెక్టర్ ఆదేశాలను అన్ని పంచాయతీలకు సిడిపిఓలు , అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఇచ్చాము. వివరిస్తున్నాం. త్వరలో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఆర్ఓసిస్టం వాటర్ఫిల్టర్లు, ఫ్యాన్, విద్యుత్, లైట్ల సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. మేరుగు సునీల్, మనకోసం సమాచార హక్కు సంఘం సభ్యులు కలెక్టర్ ఆదేశాలు అమలు చేయాలి. చిన్నారుల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ గాలి, వెలుతురు, సౌకర్యాల ఏర్పాట్లలో కలెక్టర్ ఆదేశాల అమల చేయడానికి పంచాయతీలకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? నెలల తరబడి 14వ సంఘం ఆర్ధిక నిధులు కేటాయించకపోయినాకలెక్టర్తోపాటు జిల్లా ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అంగన్వాడీకేంద్రాల్లో చిన్నారుల సౌకర్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. -
నిద్రలేని రాత్రులు గడపుతున్నాం..
* అన్నీ ఊరికేనా, దళితవాడను అభివృద్ధి చేయరా * మంత్రి రావెలకు గోడును వెల్లబోసుకున్న వంగిపురం దళితవాడ మహిళలు * ఎంత చెప్పినా నమ్మట్లేదంటూ మంత్రి రావెల అసహనం వంగిపురం (ప్రత్తిపాడు): ‘కాలనీలో సరైన రోడ్లు లేవు. లోతట్టు ప్రాంతంలో ఉండటం వలన ఇళ్లలోనికి నీళ్లు వస్తున్నాయి. మొన్న నిద్రలేని రాత్రి గడిపాం. అన్నీ నీళ్లే. అభివృద్ధి అంతా ఊర్లోనే చేస్తున్నారు. దళితవాడను అభివృద్ధి చేయరా’ అంటూ.. మంత్రి రావెలకు వంగిపురం దళితవాడ మహిళలు తమగోడును వెల్లబోసుకున్నారు. ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి రావెలను స్థానిక దళితవాడ మహిళలు చుట్టుముట్టారు. మా కాలనీకి ఎందుకు రోడ్లు వెయ్యరంటూ ప్రశ్నించారు. స్పందించిన మంత్రి రావెల కిషోర్బాబు పక్కనున్న పార్టీ నాయకుడు సర్పంచ్ భర్త, శెట్టిపాపయ్యను ఈ రోడ్డును మనం మంజూరు చెయ్యలేదా అంటూ ప్రశ్నించారు. మంజూరు చేశామని అయినా వాళ్లు పదేపదే చెయ్యలేదని చెబుతున్నారని తెలిపారు. దళితవాడ రోడ్లకు రూ.1.53 కోట్లు, మేడావారిపాలెం రోడ్డుకు రూ. 1.75 కోట్లు మంజూరయ్యాయని పాపయ్య వివరించారు. అయినా ఆయన సమాధానంతో మహిళలు శాంతించలేదు. దీంతో మంత్రి రావెల వీళ్లకు ఎంత చెప్పినా నమ్మట్లేదు.. అందుచేత ప్రతి గ్రామంలో మంజూరైన పనుల వివరాలు, పింఛన్లు వివరాలను పంచాయతీ కార్యాలయంపై పెయింటింగ్ వేయించాలని ఓఎస్డీ అర్జునరావుకు ఆదేశాలు జారీ ఆదేశించారు. అభివృద్ధి అంతా ఊరికే చేస్తున్నారని, మా కాలనీల ఓట్లు నాయకులకు అవసరం లేదా అంటూ మండిపడ్డారు. ఒక్కసారి ఊరు ఎలా ఉందో పల్లె ఎలా ఉందో చూడాలని వాపోయారు. -
వర్షం మిగిల్చిన వేదన
-
హలో.. 108.. కుయ్యోముర్రో!
* జిల్లాలో సక్రమంగా అందని 108 వాహన సేవలు * నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టు సంస్థ * పట్టించుకోని ప్రభుత్వం * అవస్థలు పడుతున్న రోగులు రోడ్డు ప్రమాదాల్లో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అనేక ప్రాణాలను ఆపన్నహస్తం అందించి ఆయుషుపోసే అపర సంజీవని 108.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై కుయ్యోమొర్రో అంటుంది. సహాయమంటూ కాల్ చేస్తే ప్రస్తుతం ఏ వాహనమూ అందుబాటులో లేదంటూ వాయిస్ వినిపిస్తూ రోగుల సేవల నుంచి తప్పుకుంటుంది. దీని నిర్వహణ బాధ్యతలు తీసుకున్న కాంట్రాక్టు సంస్థ కనీసం డీజిల్ కూడా పోయించకుండా చేతులెత్తేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది తెనాలి అర్బన్: వైద్యం అందక ఏ ఒక్క ప్రాణం గాలిలో కలిసిపోకూడదని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో 108 సర్వీస్లను ప్రారంభించారు. ఆ సమయంలో వీటి బాధ్యతలను సత్యం సంస్థలకు అప్పగించారు. ఆ తర్వాత పరిణమాలతో ఆ బాధ్యతలు జీవీకే సంస్థ తీసుకుంది. అప్పటి నుంచి వాహనాల నిర్వహణ, మందులు, దానిలో పనిచేసే పైలెట్, టెక్నీషియన్ల వేతనాలు వంటి వాటిని సదరు సంస్థ నిర్వహిస్తోంది. అయితే జీవీకే సంస్థ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అది కాకుండా ఇటీవల జరిగిన 108 నిర్వహణ టెండర్లను బీవీజీ అనే సంస్థ దక్కించుకుందనేది సమాచారం. దీంతో జీవీకే సంస్థ వీటి నిర్వహణ బాధ్యతలను గాలికొదిలేసింది. దీంతో కొన్ని వాహనాలు మూలనపడ్డాయి. తెనాలిలో రెండు వాహనాలు ఉండగా ఒక దానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదు. దీంతో దానిని గుంటూరు తరలించారు. ప్రస్తుతం తెనాలిలో ఒక్క వాహనమే సేవలందిస్తోంది. సేవలను కుదిస్తున్న 108.. 108 సేవలు ప్రారంభించిన సమయంలో ఎక్కడి నుంచి అయిన రోగిని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లేవారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కేవలం ప్రభుత్వ వైద్యశాలలకు మాత్రమే తీసుకెళ్లాలనే నిబంధన పెట్టారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లాలంటే నిబంధనలు అడ్డు వస్తున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో బాధితులు ప్రైవేటు అంబులెన్స్లను ఆశ్రయించాల్సి వస్తోంది. డీజిల్లేక నిలిచిపోతున్న వాహనాలు జిల్లా పరిధిలో 35 వాహనాల ద్వారా ప్రతి రోజు 160 మంది పేదలకు సేవలందిస్తారు. వీటికి డీజిల్ జీవీకే సంస్థ అందించాలి. దీని కోసం సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ వారితో ఒప్పందం చేసుకోవాలి. పైలెట్లు ప్రతి రోజూ ఒక్కో వాహనంలో రూ.2 వేల నుంచి 2,500 వరకు డీజిల్ నింపుకుంటారు. ఆ నగదును అదే రోజు పెట్రోల్ బంక్ వారికి జీవీకే సంస్థ చెల్లిస్తుంది. సెప్టెంబర్ ప్రారంభం నుంచి మాత్రం ఏ ఒక్క వాహనానికి yీ జిల్ నగదు జమ చేయలేదు. దీంతో పైలెట్లు పెట్రోల్ బంక్ యజమానులతో మాట్లాడి రూ. 500 నుంచి రూ.1000లోపు డీజిల్ను పోయించుకుంటున్నారు. దీంతో ఒక్కో వాహనం ఇప్పటికే రూ.20 వేలకుపైగా పెట్రోల్ బంక్ వారికి బకాయిలు పడింది. దీంతో బంక్ నిర్వాహకులు డీజిల్ ఇవ్వలేమనే సంకేతాలు ఇవ్వడంతో వాహనంలో ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు చెప్పినా డీజిల్ పోస్తే వాహనం నడపండి లేకపోతే దానిని అపివేయండనే అనధికార ఆదేశాలు ఇస్తున్నారు. డీజిల్ కొరత వాస్తవమే.. 108 వాహనాలకు డీజిల్ కొరత ఏర్పడుతున్న మాట వాస్తవం. వాహనాల కాలపరిమితి దాటి పోవటం(5 లక్షల కిలోమీటర్లు తిరగటం) వల్ల తరచూ రిపేరు వస్తున్నాయి. చిన్నపాటి రిపేరైతే అప్పుడే చేయిస్తున్నాం, మిగిలిన వాటికి కొద్ది రోజుల సమయం తీసుకుంటున్నాం. అలాంటి సమయంలో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నాం. – రాజేంద్రప్రసాద్, జిల్లా ప్రమోషనల్ మేనేజర్ -
ఈ చావులకు బాధ్యులెవరు ?
* జిల్లాలో పెరుగుతున్న డెంగీ మరణాలు * బెంబేలెత్తుతున్న జనం * మరణాలు లేవంటున్న వైద్య అధికారులు * శాఖల మధ్య కొరవడిన సమన్వయం గుంటూరు మెడికల్ : జిల్లావాసులను డెంగీ జ్వరం వణికిస్తోంది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా డెంగీ పేరే వినిపిస్తోంది. జ్వరబాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రతిరోజూ జిల్లాలో ఏదో ఒక చోట డెంగీతో మృతిచెందిన కేసులు నమోదవుతుండటం పరిస్థితికి తీవ్రతకు నిదర్శనం. జ్వరాలు వ్యాపించకుండా, మరణాలు సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ శాఖలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. మంచానికే పరిమితం... గ్రామాల్లో అనేక మంది వ్యాధి బారిన పడి మంచానికే పరిమితమవుతున్నారు. పట్టణాల్లోని పలు ప్రైవేటు ఆస్పత్రులు డెంగీ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యార్థులు, వృద్ధులు, యువత అనే తేడా లేకుండా పలువురు మృత్యువాత పడుతున్నారు. వైద్య అధికారులు మాత్రం డెంగీ మరణాలు జిల్లాలో ఇప్పటి వరకు లేవని, కేవలం తాడేపల్లిలో సంభవించిన బాలుడి మరణమే డెంగీ అనుమానాస్పదమని చెబుతున్నారు. పరీక్షల్లో పాజిటివ్.. నిర్ధారణకు నో! రాష్ట్ర ప్రభుత్వం మెడాల్ కంపెనీ ద్వారా ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయిస్తోంది. వీరి పరీక్షల్లో అధిక సంఖ్యలో డెంగీ నిర్ధారణ నివేదికలు ప్రభుత్వానికి అందుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు వాటిని డెంగీ పాజిటివ్గా నిర్ధారణ చేయవద్దంటూ జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కేవలం గుంటూరు వైద్య కళాశాలలో ఎలీసా పద్ధతిలో నిర్ధారణ జరిగే డెంగీ జ్వరాలనే అధికారికంగా వైద్య అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల మధ్య డెంగీ నిర్ధారణపై భేదాభిప్రాయాలు రావడంతో జ్వర బాధితులు తమకు డెంగీ ఉన్నట్టా, లేనట్టా అన్న విషయం తేల్చుకోలేక తర్జనభర్జన పడుతున్నారు. కొంతమంది వ్యాధి నిర్ధారణ తేలేలోపు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. డెంగీ జ్వరం లక్షణాలివీ... పగటి వేళల్లో కుట్టే ఎడిస్ ఈజిప్ట్ అనే దోమ కాటు ద్వారా డెంగీ జ్వరం వస్తుంది. జ్వరంతో పాటు విపరీతంగా తలనొప్పి, ఒళ్లునొప్పులు, కీళ్లనొప్పులు, కంటిలోపల కదలికలు తగ్గడం, వాంతి అయినట్లు భ్రాంతి కలగటం, నోరు ఎండిపోతూ ఎక్కువగా దాహం వేయడం లాంటి లక్షణాలు వ్యాధి సోకిన వారిలో కనిపిస్తాయి. ప్లేట్లెట్లపై అపోహలు వీడండి... ఎలాంటి జ్వరం వచ్చినా ప్లేట్లెట్లు తగ్గటం సహజం. అంతమాత్రానికే కంగారు పడకూడదు. సాధారణంగా 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ప్లేట్లెట్లు ఉంటాయి. వీటి సంఖ్య 20 వేల కన్నా తక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి ప్రమాదం సంభవించదు. శరీరంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడి అవి పగిలి వాటి ద్వారా రక్తం వస్తే, మూత్రంలో, దగ్గుతున్నప్పుడు కళ్లె ద్వారా రక్తం పడిపోతూ ఉంటే అప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. డాక్టర్ కేళంగి రాజేంద్రకుమార్, ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రి ప్రొఫెసర్ -
జంబ్లింగ్తో విద్యార్థులకు తీవ్ర నష్టం
ఏపీ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య నరసరావుపేట : ప్రభుత్వం నూతనంగా ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశపెట్టాలనుకునే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షలలో జంబ్లింగ్ విధానంతో విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఏపీ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొల్లి బ్రహ్మయ్య అన్నారు. విద్యావిధానంలో నూతన పద్ధతులను ప్రవేశపెట్టాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేపట్టే జంబ్లింగ్ విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. శనివారం పలనాడురోడ్డులోని కాన్ఫరెన్స్ హాలులో విలేకర్ల సమావేశంలో ఆయన తన కార్యవర్గ ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. హైదరాబాదులో తమతో ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో ఇదే విషయాన్ని స్పష్టంచేశామని, దీనికి ప్రిన్సిపల్ కార్యదర్శి సమ్మతించారన్నారు. అకడమిక్ కాలెండర్ ప్రకారం 220 రోజుల పనిదినాల్లో పదోతరగతి ఫైనల్ పరీక్షలు నిర్వహణకు 15 రోజులు, వాల్యుయేషన్కు పదిహేను రోజుల చొప్పున 30రోజులు తరగతులు నిర్వహించలేకపోవటంతో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులకు 190 రోజులే మిగులుతున్నాయన్నారు. క్వార్టర్లీ, హాఫర్లీ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం పెట్టి మండల స్థాయిలో వాల్యుయేషన్ నిర్వహించటం వలన రెండు పరీక్షలతో మరో 30రోజులు ఉపాధ్యాయులు వాల్యుయేషన్కు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీంతో విద్యార్థులకు విద్యను బోధించేందుకు కేవలం 160రోజులే మిగులుతుందన్నారు. ప్రభుత్వం విద్యేతర కార్యక్రమాలకు కొన్నిరోజులు ఉపయోగించుకుంటుందన్నారు. పరీక్ష పేపర్లు దిద్దటంలో ఉపాధ్యాయులు తలోరకంగా మార్కులు వేయటం వలన విద్యార్థులకు నష్టం చేకూరుతుందన్నారు. బార్ కోడింగ్ విధానం లేకుండా పేపర్లు దిద్దటం కోసం మండలాలు మార్చటం వలన ఎవరి పేపర్లు ఎవరివి అనేది తేలికగా తెలుస్తుందన్నారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యాసంస్థల మధ్య విభేదాలు పొడచూపుతాయని చెప్పారు. జంబ్లింగ్ విధానంతో పనిదినాలు వృధా కావటం తప్పితే నూతనంగా విద్యార్థులకు లభించే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. అందువలన జంబ్లింగ్ విధానాన్ని ప్రభుత్వం ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు, విద్యాసంస్థల అధిపతులు జి.రాజగోపాలరెడ్డి, (ఆక్స్ఫర్డ్), గడ్డం భూపాల్రెడి ్డ(నవభారత్ హైస్కూల్), జిల్లా కార్యదర్శులు పి.శ్రీనివాసరావు, బోడెపూడి శ్రీనివాసరావు, పి.యోగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఐదు రోజులుగా కదలని మాచర్ల ప్యాసింజర్
మాచర్ల: భారీ వర్షాల వలన ఐదురోజులుగా మాచర్ల– గుంటూరు– భీమవరం ప్యాసింజర్ రైలు రాకపోకలు నిలిచిపోవడంతో సామాన్య ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గత మంగళవారం భారీ వర్షాల నేపథ్యంలో మాచర్ల– గురజాల రైల్వే ట్రాక్ దెబ్బతింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు నిర్వహిస్తూనే ఉన్నారు. శనివారం సాయంత్రానికి కూడా రైలు రాకపోకలపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో నిత్యం రైలులో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మాచర్ల– గుంటూరుకు కేవలం రూ.30తో వెళ్లే ప్రయాణికులు ప్రస్తుతం బస్సులను ఆశ్రయించాల్సిరావడంతో వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. నడికుడి నుంచి గుంటూరుకు రైలు తిరుగుతున్నా సంబంధిత వేళలు తెలియకపోవడం, మాచర్ల నుంచి నడికుడికి రూ.35కుపైగా బస్సు చార్జీ చెల్లించాల్సిన పరిస్థితి. బస్సులలో గుంటూరుకు వెళ్లాలంటే ఎక్స్ప్రెస్కు రూ. 120, 5 స్టార్కు రూ.150 చెల్లించాల్సిన పరిస్థితి. ఇందువల్ల ఆయా ప్రాంతాలకు నిత్యం రైలులో వెళ్లే ప్రయాణికులు నానా తంటాలు పడుతున్నారు. రెండు రోజుల్లో ట్రాక్ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పిన రైల్వే అధికారులు ఐదు రోజులైనా పూర్తి చేయకపోవడంపై ప్రయాణికుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ట్రాక్ నిర్మాణ పనులు పూర్తి చేసి మాచర్ల– గుంటూరు రైలు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
వరద బీభత్సం
-
శిథిల భవనంలో ఉపాధి శాఖ
* విద్యార్థులు, నిరుద్యోగులకు అవస్థలు * కనీస వసతులు కరువు * బిక్కుబిక్కుమంటూ ఉద్యోగుల విధి నిర్వహణ జిల్లా ఉపాధి కల్పన శాఖ కార్యాలయం శిథిల భవనంలో కునారిల్లుతోంది. ఆఫీసు ప్రాంగణంలోకి అడుగు సైతం పెట్టలేని విధంగా ఉంటుంది. ఎంప్లాయిమెంట్ చేసుకునేందుకు నిత్యం వచ్చే వేలాది మంది అభ్యర్థులు వసతుల లేమితో అవస్థలు ఎదుర్కొంటున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా ఎంప్లాయిమెంట్ ఆఫీసు గురించి ఆలోచించిన దాఖలాల్లేవు. ఎంతో మందికి ఉపయోగకరంగా ఉండే ప్రభుత్వ శాఖకు శాశ్వత భవనం ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు. గుంటూరు (లక్ష్మీపురం): జిల్లా ఉపాధి కార్యాలయంలో ఎంప్లాయిమెంట్ కోసం వచ్చే వారికి కనీస వసతులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరం నడిబొడ్డున కలెక్టర్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయ భవనం శిథిలమై ఉంది. భవనం లోపలి భాగం గోడలు నెర్రలుగా పగిలి పెచ్చులూడిపోతున్నాయి. నలు వైపులా మర్రి చెట్టు వేళ్ళు పెరిగి పోయి గోడల్లోనుంచి వస్తున్నాయి. వర్షం కురిసిందంటే చాలు భవనంలో సగ భాగం అంతా నీటి చెమ్మ వస్తుంది. కీలకమైన రికార్డులు సైతం తడిచి పోయే పరిస్థితి నెలకొంది. ఉద్యోగులు సైతం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కార్యాలయంలో వసతులు నిల్..... జిల్లా నలుమూలల నుంచి వచ్చే విద్యార్థులు, నిరుద్యోగులు కార్యాలయంలో కనీస వసతులు లేకపోవడంతో అసౌకర్యానికి గురవుతున్నారు. కూర్చునేందుకు కుర్చీలు గానీ, బల్లలు, గానీ లేక పోవడంతో కార్యాలయ వరండాలో నేలపైనే కూర్చొని దరఖాస్తులు పూర్తి చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్ల సదుపాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుక్క మంచినీరు సైతం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిత్యం ఎంతో మంది వచ్చే కార్యాలయంలో ఈ విధమైన పరిస్థితి ఉండటం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఉపాధి శాఖకు శాశ్వత భవనం కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం.. జిల్లా ఉపాధి కార్యాలయానికి వచ్చే విద్యార్థులు, నిరుద్యోగులు, సిబ్బందికి వసతులు లేవు. భవనం పాతది కావడంతో నెర్రలు వచ్చి వర్షపు నీటితో చెమ్మ వస్తుంది. ఈ విషయం∙జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. కార్యాలయం మార్చాలని విన్నవించాం. డాక్టర్ రజనీ ప్రియా, జిల్లా ఉపాధి అధికారి -
కష్టాల్లో సీఆర్పీలు
* చాలీచాలని వేతనాలు * అవీ మూడు నెలలుగా అందని వైనం * పెరిగిన జీతాల కోసం ఎదురుచూపులు గురజాల: వారంతా ఉపాధ్యాయ శిక్షణ పొందిన విద్యావంతులు, పరిస్థితులు కలిసిరాక ఉపాధ్యాయ పోస్టులను అందుకోలేకపోయారు. విద్యా శాఖ పరిధిలోనే పనిచేస్తున్నా కనీస వేతనానికి నోచుకోలేకపోతున్నారు. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కింద ప్రభుత్వం 2011లో సీఆర్పీల వ్యవస్థను ప్రవేశపెట్టింది. పాఠశాలలను నిరంతరం మోనటరింగ్ చేసేందుకు ఒక వ్యవస్థ అవసరమని ప్రభుత్వం దీన్ని అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఈ వ్యవస్థను పటిష్టపరిచేందుకు అటు కేంద్రంగాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని దృష్టి సారించలేదు. సీఆర్పీలు స్వతంత్రంగా పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం క్లస్టర్ రిసోర్స్ సెంటర్ మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. పోనీ పార్ట్ టైంగా పనిచేస్తున్నారా అంటే అదీ లేదు. ఉపాధ్యాయులతో పాటుగా పూర్తి స్థాయిలో పనిచేస్తుంటారు. కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన వీరికి ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తోంది కేవలం రూ.8,300 మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం రూ.15 వేలు ఉంటే గాని కుటుంబం గడవని పరిస్థితి. చాలీచాలని వేతనాలతో క్లస్టర్ రిసోర్సు పర్సన్ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 279 మంది సీఆర్పీలు.. జిల్లాలో మొత్తం 279 స్కూల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. వీటిలో పాఠశాలల మోనటరింగ్ కోసం ఒక్కో స్కూల్ కాంప్లెక్స్కు ఒక సీఆర్పీ చొప్పున 279 మందిని నియమించారు. ఒక్కో స్కూల్ కాంప్లెక్స్ కింద సుమారుగా 10 నుంచి 18 పాఠశాలలు మోనటరింగ్ చేయాల్సివుంటుంది. వీరు ప్రతి రోజు ఒక పాఠశాలను సందర్శించి సమాచారాన్ని సేకరించి మండల రిసోర్సు సెంటరుకు అందచేయాలి. వీరికి ప్రతినెల వచ్చే వేతనం తప్ప ప్రయాణం, ఇతర ఖర్చులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో జీతం నుంచే వాటిని ఖర్చుచేయాల్సివస్తోంది. దీంతో ప్రయాణ ఖర్చుల కింద సుమారుగా రూ.2,500 వరకు పక్కన పెట్టాల్సివుంది. ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.8,300ల్లో రూ.2,500 పోగా చేతికి వచ్చేది రూ.5,800 మాత్రమే. విద్యాశాఖకు ప్రధాన వనరులు వీరే... విద్యాశాఖకు సంబంధించి సకల సమాచారాన్ని సేకరించి అందించడంలో వీరు అత్యంత కీలకంగా పనిచేస్తారు. పరీక్ష పత్రాల పంపిణీ, మధ్యాహ్న భోజన బిల్లులు సేకరణ వంటి పనులను నిర్వర్తిస్తున్నారు. విద్యార్థులకు యూనిఫాం వివరాలు సేకరించడంతో పాటు అంగవైకల్యం గల పిల్లలను గుర్తించి వారి వివరాలను దగ్గరలోని ఇఇఆర్టీలకు అందచేస్తారు. ఉపాధ్యాయులకు, జిల్లా అధికారులకు మధ్య వారధిగా వ్యవహరిస్తుంటారు. జిల్లా అధికారుల అదేశానుగుణంగా వివిధ రకాల విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకం... పాఠశాల ఉపాధ్యాయులతో పాటు అర్హత ఉన్నా, కాంట్రాక్టు విధానంలో సీఆర్పీలుగా పనిచేస్తున్న వీరికి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. ఈ వ్యవస్థ ఏర్పాటుచేసినప్పుడు వేతనంతో పాటుగా ఫోన్ బిల్లు, ట్రావెలింగ్ అలవెన్సులు అందించేవారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి కేవలం వేతనం మాత్రమే ఇస్తోంది. రాష్ట్రంలో మొత్తం 4,034 క్లస్టర్లు వున్నాయి. వాటిలో 3,521 మంది విధులు నిర్వహిస్తున్నారు. 3,105 మందికి వచ్చే బడ్జెట్ను 3,521 మంది సీఆర్పీలకు సర్దుబాటు చేస్తున్నారు. గత మూడు నెలలుగా వేతనాలు అందించలేదు. దీంతో అప్పులు చేసి బతకాల్సి వస్తోందని పలువురు సీఆర్పీలు వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.. సీఆర్పీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. స్కూల్ అసిస్టెంట్కు ఇస్తున్న కనీస వేతనం సీఆర్పీలకు ఇవ్వాలి. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ జీవో 151ని సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులకు వర్తింపచేయాలి. ముఖ్యంగా సీఆర్పీలకు ఉద్యోగ భద్రతతో పాటు కుటుంబానికి భద్రత కల్పించాలి. మొబైల్ యాప్, నెట్ చార్జీలు, సెల్ బిల్లు, ప్రయాణ ఖర్చుల కింద వెయ్యి రూపాయలు అందచేయాలి. – బి.కాంతారావు,సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్టు అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ -
రహదారులేవో..? వాగులేవో?
-
ప్రమాదం అని తెలిసినా..
మారీసుపేట: ప్రమాదం పొంచి ఉందని తెలిసినా వెళ్లక తప్పని పరిస్థితి. ఎన్నో సంవత్సరాల నుంచి వీరి తలరాతలు మారతాయనుకున్నా వీరి ఆశలు అడియాసలుగానే మిగులుతున్నాయి. దీంతో వీరు బలకట్టుపైనే నిత్యం రాకపోకలు సాగించడం తప్పడం లేదు. సంగంజాగర్లమూడిలో సంగమేశ్వరస్వామి దేవస్థానం ఎదురు కొమ్మమూరు కాల్వ ఉంది. దేవస్థానం ఎదురుగా కొందరూ పేదలు నివసిస్తున్నారు. వీరు గ్రామంలోకి రావాలంటే బలకట్టును ఆశ్రయించక తప్పదు. ఎన్నో ఏళ్ళ నుంచి పేదలు ఈ విధంగా బలకట్టుపైనే అటు ఇటూ రాకపోకలు సాగిస్తూ వస్తున్నారు. ఇలాంటి పేదలకు ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటు చేద్దామనే ఆలోచన పాలకులకు రాకపోవడం విడ్డూరం. ఏదైనా ప్రమాదం జరిగితే ఎంతో ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి కాలినడక వంతెనను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
అయ్యో.. పోలీసన్న!
* మూడు షిఫ్టులు...రెండు టీమ్లతో పుష్కర బందోబస్తు * ఒత్తిడితో అల్లాడుతున్న పోలీసన్నలు * అమరావతిలో అస్వస్థతకు గురై ఒంగోలు ఎస్ఐ మృతి * పాలకపార్టీ నేతలు, ఉన్నతాధికారుల మధ్య ఉక్కిరిబిక్కిరి సాక్షి, గుంటూరు: కృష్ణా పుష్కరాల సందర్భంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్లు, దేవాలయాలు, పార్కింగ్ ప్రదేశాలు, పుష్కర నగర్లు, ట్రాఫిక్ పాయింట్లు, హైవే హాల్టింగ్ పాయింట్ల వద్ద పోలీసులు, వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన వలంటీర్లను బందోబస్తు విధులకు ఉపయోగిస్తున్నారు. అన్ని శాఖల అధికారులు రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తూ మూడు షిప్టులుగా తమ విధులను నిర్వర్తిస్తుంటే పోలీసు శాఖలో మాత్రం ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అంతా రోజుకు 12 నుంచి 14 గంటల పాటు విధులు నిర్వర్తించాల్సివస్తోంది. మూడు షిప్టులుగా విభజించినా సిబ్బంది కొరతతో రెండు టీమ్లు మాత్రమే ఏర్పాటు చేసి వారినే మూడు షిప్టులలో పనిచేయిస్తున్నారు. దీనికి తోడు వేసవిని తలపిస్తూ ఎండలు విపరీతంగా కాస్తుండడంతో పోలీసులు అలసి, సొమ్మసిల్లి పడిపోతున్నారు. వేలాది వాహనాలు తిరుగుతుండటంతో రోడ్లపై దుమ్ము ధూళి తట్టుకోలేక వ్యాధుల బారిన పడుతున్నారు. రోడ్లపై విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కనీసం మంచినీరు అందించే ఏర్పాట్లు కానీ, మరుగుదొడ్ల సౌకర్యం కాని లేకపోవడం దారుణమైన విషయం. తీవ్ర అస్వస్థతకు గురై ఎస్ఐ మృతి.. పుష్కరాల విధులు నిర్వహించేందుకు ప్రకాశం జిల్లా ఒంగోలు పీసీఆర్లో పనిచేస్తున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు (58) ఈనెల 9వ తేదీన అమరావతికి వచ్చారు. ఈయనకు ధ్యాన బుద్ధ ఘాట్ వద్ద ట్రాఫిక్ విధులు అప్పగించగా ఐదు రోజులపాటు రోడ్లపై విధులు నిర్వహించి తీవ్ర అస్వస్థతకు గురై మంగళవారం కుప్పకూలిపోయారు. దీంతో అధికారులు ఆయన్ను ఒంగోలు పంపగా గంటల వ్యవధిలోనే ఎస్ఐ వెంకటేశ్వర్లు మతిచెందారు. సీతానగరం పుష్కర ఘాట్ వద్ద విదులు నిర్వహిస్తున్న గుంటూరుకు చెందిన మహిళా కానిస్టేబుల్ సుల్తానా బేగం తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.శుక్రవారం ఒక్కరోజే 15 మంది కానిస్టేబుళ్లు డయేరియా, విషజ్వరాల బారినపడి పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాటుచేసిన వైద్యశిబిరాల్లో చికిత్స పొందడం గమనార్హం. నలిగిపోతున్న సిబ్బంది.. పుష్కరాల సందర్భంగా అధికార పార్టీ నేతలు, పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు తట్టుకోలేక కింది స్థాయి అధికారులు, సిబ్బంది నలిగిపోతున్నారు. మూడు రోజుల క్రితం అమరావతిలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎస్ఐ ద్విచక్రవాహనంపై ట్రిపుల్ రైడింగ్లో వెళుతున్న యువకులను ఆపి తాళం లాక్కొన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ యువకులు ఎస్ఐపై దూషణలకు దిగుతూ దురుసుగా ప్రవర్తించారు. అనంతరం విషయాన్ని వారు ‘చినబాబు’ దాకా తీసుకెళ్లడంతో పాపం... ఆ ఎస్ఐపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు అందినట్టు తెలిసింది. ఇలా అయితే తాము పనిచేయలేమంటూ పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
తిండీ తిప్పలూ లేకుండా కౌన్సెలింగ్
నూజివీడు : నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ఐటీలకు ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహణ సందర్భంగా సౌకర్యాలు కల్పించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం రాత్రి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 555 సీట్ల భర్తీకి గాను వెయిటింగ్ జాబితాలో ఉన్న దాదాపు 1665 మంది విద్యార్థులను కౌన్సెలింగ్కు నూజివీడు ట్రిపుల్ఐటీకి పిలిచారు. అంతమంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా రావడంతో దాదాపు 4వేల మంది అయ్యారు. వీరంతా మంగళవారం ఉదయం 8గంటలకు కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కౌన్సెలింగ్ దాదాపు పగలు, రాత్రి కలిపి 24గంటల పాటు జరిగింది. వారికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొనుక్కునే వీలూ లేదు మధ్యాహ్న భోజనంను తక్కువ ధరకు అందజేసినా రాత్రి భోజనం ఏర్పాటు చేయలేదు. తాగునీరు, టాయ్లెట్ వసతీ లేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారిగా గొడవకు దిగారు. కొనుక్కుని తినడానికి కూడా భోజనం, నీరు లేదంటూ నిర్వాహకులపై మండిపడ్డారు. చివరకు దిగివచ్చిన అధికారులు మహిళలు అక్కడి టాయ్లెట్లను వాడుకోవడానికి అనుమతించడంతో గొడవ సద్దుమణిగింది. తల్లిదండ్రులు సిమెంట్రోడ్లపైన, సిబ్బంది క్వార్టర్ల సెల్లార్లలో పడుకుని నిద్రపోయారు. -
సారొస్తున్నారు.. సర్దుకోండి!
* పోలీసుల హడావుడి * స్నానాలు చేసే వారిని ఘాట్ల నుంచి ఖాళీ చేయించిన వైనం * పుణ్యం కోసం వచ్చిన భక్తులకు ఇబ్బందులు కృష్ణా పుష్కరాల కోసం అమరావతికి వచ్చిన భక్తులకు మంగళవారం చుక్కలు కనిపించాయి.. ముఖ్యమంత్రి అమరావతికి వస్తుండటంతో భక్తులను ఘాట్ వద్దకు అనుమతించే విషయంలో అటు పోలీసులు, ఇటు అధికారులు ఇబ్బందులకు గురిచేశారు.. తెల్లవారుజామున స్నానాలకు వచ్చిన వారిని సైతం పోలీసులు ఘాట్ల నుంచి బయటకు వెళ్లాలని ఆదేశాలు జారీచేసి ఘాట్లను ఖాళీ చేయించారు.. దీంతో స్నానాలకు వచ్చిన భక్తులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ ఘాట్ వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి.. ఈ సమయంలో భక్తుల అవస్థలు వర్ణనాతీతం. అమరావతి (గుంటూరు రూరల్) : పుష్కరాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతికి వచ్చే సమయంలో పోలీసుల హడావుడి భక్తులను ఇబ్బందులకు గురిచేసింది. ముఖ్యమంత్రి ఉదయం 11.30కు ధరణికోట ఘాట్ వద్దకు వచ్చి సుమారు గంటపాటు మీటింగ్ చెప్పారు. ఆ సమయంలో భక్తులు స్నానాలు చేయకుండా పోలీసులు ధరణికోట ఘాట్ను ఖాళీ చేయించారు. దీంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ముఖ్యమంత్రి ఎప్పుడు వెళతాడా అని భక్తులు ఎదురుచూశారు. ట్రాఫిక్ మళ్లింపు.. ముఖ్యమంత్రి పర్యటన ఉండటంతో అమరావతికి వచ్చే సత్తెనపల్లి, క్రోసూలు, విజయవాడ, గుంటూరు రహదారుల నుంచి వచ్చే భక్తులను రాకుండా నిలిపివేశారు. దీంతో ముఖ్యమంత్రి వెళ్లే వరకూ భక్తులు రోడ్లపై నరకయాతన పడ్డారు. దీనికితోడు ఘాట్ల వద్ద ఉన్న భక్తులను పోలీసులు స్నానాలు చేయకుండా నిలిపివేయటంతో ఇబ్బందులు పడ్డారు. ఖాళీగా ఘాట్లు.. ముఖ్యమంత్రి అమరావతిలోని ధరణికోట ఘాట్లో మీటింగ్ చెప్పటం ప్రారంభించటంతో పోలీసులు అరకొరగా ఉన్న భక్తులను మీటింగ్ వద్దకు తరలించారు. పుణ్య స్నానాలకు వస్తే మీటింగ్లని తరలిస్తారేంటని భక్తులు పోలీసులను ప్రశ్నించగా పైస్థాయి అధికారుల ఆదేశాలని, ముఖ్యమంత్రి మీటింగ్లో జనాలు లేకుంటే బాగుండదని చెప్పి తరలిస్తున్నామని తెలపటం గమనార్హం. సీఎం తన ప్రసంగంలో ‘సాక్షి’ పత్రికపై అక్కసు వెళ్లగక్కారు. ‘సాక్షి’ పత్రికలో వస్తున్న కథనాలను విమర్శించారు. -
మండుటెండలో మహిళా పోలీసులు
అమరావతి (గుంటూరు రూరల్) : మండుటెండలో మహిళా పోలీసులు సోమవారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీఐపీ ఘాట్ మెట్లపై డ్యూటీ చేస్తున్న పోలీసులు భానుడి తాపానికి ఉక్కిరిబిక్కిరయ్యారు. కనీసం టెంట్లు కూడా లేకపోవడంతో నడి ఎండలోనే విధులు నిర్వర్తించాల్సి వస్తోందని ఆవేదన చెందారు. ఎండ నుంచి రక్షణ పొందేందుకు చీర కొంగులు, కర్చీఫ్లను తలపై కప్పుకున్నారు. డ్యూటీ తప్పని సరికాంటంతో ఎర్రని ఎండలో అల్లాడిపోయారు. -
గ'జీత'గాళ్ల దీనస్థితి
* పుష్కరాల్లో వేతనం కంటే.. పని ఎక్కువ * పనిగంటలు పాటించని అధికారులు * కనీసం భోజనం కూడా అందని వైనం రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు వారిని.. కృష్ణా పుష్కరాల్లో భక్తుల రక్షణ కోసం పని చేస్తే.. అన్ని వసతులు కల్పిస్తామని అధికారులు చెప్పారు.. కానీ ఇక్కడకు వస్తే.. కనీసం భోజనం కూడా పెట్టని పరిస్థితి.. ఎనిమిది గంటల పాటే విధులన్నారు.. పన్నెండు గంటల పాటు పని చేయిస్తున్నారు. అన్ని గంటలు నీటిలో నిలబడ్డా.. కనీసం వారిని పట్టించుకునే నాథుడే లేడు.. అమరావతిలోని పుష్కర ఘాట్లులో గజఈతగాళ్ళు పడుతున్న బాధలు వర్ణనాతీతం. పట్నంబజారు (గుంటూరు): కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఏదైనా ఘటనలు జరిగినా.. భక్తులు పొరపాటున నీటిలో మునిగినా.. కీలక పాత్ర పోషించేది ఈతగాళ్ళే. బ్లూ టీషర్ట్ వేసుకుని పడవలపై వృద్ధులకు సాయం అందిస్తూ భక్తులకు రక్షణగా ఉంటున్నారు. ఆఖరికి మట్టిని కూడా తొలగించే బాధ్యతలను వారు నిర్వర్తిస్తున్నారు. పుష్కరాల్లో భాగంగా నిత్యం రూ. 450 చెల్లించి 250 మంది ఈతగాళ్ళను మత్య్సశాఖ వారు విధుల్లోకి తీసుకున్నారు. 11వ తేదీ రాత్రి నుంచే వీరు విధుల్లో ఉన్నారు. కానీ వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. నిత్యం రాత్రి సమయాల్లో కూడా పడవల్లోనే నిద్రించాల్సి దుస్థితి. తినేందుకు భోజనం కూడా దొరకని పరిస్థితి. అధికారులు భోజనం పంపటంలేదని ఈతగాళ్లు చెబుతున్నారు. దీని వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సేవలు... కేవలం ఇబ్బందులు కలిగిన సమయంలోనే కాకుండా భక్తులకు ఈతగాళ్లు ఎన్నో సేవలందిస్తున్నారు. అనేక మంది వృద్ధులు పిండ ప్రదానం చేసేందుకు వచ్చి నీటిలోకి దిగాలంటనే ఒకటికి పలుమార్లు ఆలోచించే పరిస్థితులు ఉన్నాయి. ఆ సమయాల్లో వారు ఆ వృద్ధులను తీసుకుని వెళ్లి నదిలోకి చివర పిండ ప్రదానాలు చేయించి తిరిగి ఘాట్లపై వదలి పెడుతున్నారు. ఏక కాలంలో ఎనిమిది గంటల పాటు నీటిలో ఉండాలంటే సామాన్యమైన విషయం కాదని భక్తులు అంటున్నారు. భక్తులకు ఇటువంటి సేవలందిస్తున్న వారికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
వాళ్లకో రూల్.. వీళ్లకో రూల్!
* అడుగడుగునా భక్తులకు ఆంక్షలు * ఏం చేయాలో పాలుపోక భక్తుల పాట్లు * వీఐపీలు, పోలీసులకు మాత్రం నో రూల్స్ * ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు అమరావతి (గుంటూరు రూరల్/ పట్నంబజారు): ‘సారూ.. మేము దూరప్రాంతాల నుంచి అమరావతికి పుణ్య స్నానం చేద్దామని వచ్చామయ్యా... ఆ దారిలో వెళితే..ఆ పోలీసాయన ఇటు పొమ్మన్నడూ.. ఇక్కడకు వస్తే మీరేమో.. ఇటు కాదంటున్నారు.. ఇంతకీ మా దారేది.. ఎటు వెళ్లాలి...’ అంటూ సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు వాపోతున్నారు. అమరావతిలోని బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు వారికి చుక్కలు చూపిస్తున్నారు. ఏ దారిన వెళితే.. ఏ ఘాటు వస్తుందో తెలియక భక్తులు సతమతమవుతున్నారు. అడుగడుగునా.. అడ్డంకులే... అమరలింగేశ్వరస్వామి ఆలయానికి వచ్చేది ప్రధాన రహదారి కావడంతో 90 శాతం మంది భక్తులు ఈ దారినే వస్తున్నారు. ఈ దారిలో పోలీసులు మొత్తం.. అష్ట దిగ్బంధనం చేశారు. కేవలం ప్రధాన రహదారిలోనే ఐదు ప్రాంతాల్లో బారికేడ్లు, చెక్పోస్టులను ఏర్పాటు చేయడంతో పుష్కర యాత్రికులు అవస్థలకు గురవుతున్నారు. మండుటెండల్లో పోలీసుల ఆంక్షలు తప్పుకుని మూడు కిలోమీటర్లు నడుస్తూ వచ్చే భక్తులకు ఆలయానికి రాకముందే దేవుడు కనిపిస్తున్నాడు. యాత్రికులే కాకుండా అమరావతిలో నివాసం ఉన్న వారిని, చుట్టుపక్కల గ్రామాల నుంచి వివిధ అవసరాల కోసం అమరావతి వచ్చి వెళుతుంటారు. గ్రామస్తులు, స్థానికంగా నివాసం ఉండే వారిని కూడా పోలీసులు లేనిపోని ఆంక్షలు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పోలీసు వాహనాలు యథేచ్ఛగా... ప్రధాన రహదారిలో నడచి వెళుతున్న భక్తులను కూడా వెళ్లనివ్వని పోలీసులు..వారి వాహనాలను మాత్రం యథేచ్ఛగా వదిలి పెడుతున్నారు. కనీసం వాహనాలపై డ్యూటీ పాసు కూడా ఉండడం లేదు. తీరా ఆరా తీస్తే.. ఆ వాహనాల్లో ఎస్ఐ స్థాయి నుంచి జిల్లా స్థాయి పోలీసు అధికారుల కుటుంబ సభ్యులు, మిత్రులు, వారి సపరివారం, స్థానిక అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు దర్జాగా వీఐపీ ఘాట్లకు వస్తున్నారు. ఈ విషయమై మీడియా శనివారం ఎస్పీ కె.నారాయణ్నాయక్ దృష్టికి తీసుకుని వెళ్లగా, భక్తులకు ఇబ్బందులు కలిగే ఆంక్షలు విధించరాదని, సమన్వయంతో పని చేయాలని సిబ్బందికి చెప్పినా క్షేత్రస్థాయిలో ఆచరించడం లేదనడం గమనార్హం. కనీసం కూర్చునేందుకు.. అనుమతివ్వరు.. పుష్కర స్నానం చేసిన అనంతరం ఓ వృద్ధురాలు అమరేశ్వరుని దర్శనం కోసం ఆలయం వద్దకు వస్తుంటే.. అలుపు వచ్చి ఆలయం పక్కనే మెట్లపై కూర్చుంది. కనీసం వృద్ధురాలనే జాలి కూడా లేకుండా ఆమెను పోలీసులు పక్కకు పంపిన వైనాన్ని చూసి భక్తులు అయ్యో పాపం అనుకున్నారు. అధికారుల ఆదేశాలతోనే..? పుష్కర ట్రాఫిక్ బందోబస్తులో భాగంగా బారికేడ్ల వద్ద సీఐ స్థాయి అధికారికి విధులు అప్పజెప్పారు. సదరు అధికారి మాత్రం సిబ్బందికి స్పష్టంగా పోలీసు వాహనం మినహా ఎవరినీ లోపలికి వెళ్లనివ్వద్దని చెప్పడంతో సిబ్బంది రెచ్చిపోతున్నారు. దీంతో నిత్యం బారికేడ్ల వద్ద భక్తులు, ఇతర శాఖల అధికారులు సైతం పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతా«ధికారులు స్పందించి ట్రాఫిక్ ఆంక్షలపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని, భక్తులు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరుతున్నారు. -
సిబ్బంది ఫుల్.. సౌకర్యాలు నిల్
భోజనం లేక అస్వస్థతకు గురైన స్వీపర్ ఆసుపత్రిలో మంచాలు లేవు సీతానగరం ఘాట్ వద్ద నామమాత్రంగా వైద్యశిబిరాలు తాడేపల్లి రూరల్ : కృష్ణా పుష్కరాల్లో సేవలందించేందుకు వచ్చిన సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించటంలో ప్రభుత్వం విఫలమైంది. అత్యవసర సదుపాయాలు లేకపోవటంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను పెద్ద ఎత్తున నియమించారు. తాడేపల్లి పరిధిలోని సీతానగరం ఘాట్ వద్ద 3వేల మంది పోలీసులు, 2 వేల మంది పారిశుద్ధ్య సిబ్బంది, 500 మంది ఎన్సీసీ విద్యార్థులు ఉన్నారు. వీరంతా రెండు రోజుల క్రితమే ఘాట్ వద్దకు చేరుకున్నారు. అయితే వీరిలో అనేక మందికి బుధవారం మధ్యాహ్నం నుంచి భోజనం అందలేదు. ఈ నేపథ్యంలో భీమడోలుకు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు మొండెం వెంకటేశ్వర్లు గురువారం ఉదయం విధులు నిర్వర్తిస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. ఘాట్లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో పరికరాలు, మందులు లేవు. ఆసుపత్రికి తరలించాలన్నా అంబులెన్స్ అందుబాటులో లేదు. వెంకటేశ్వర్లు పరిస్థితిని గమనించిన బంధువులు ఉండవల్లి సెంటర్ సమీపంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లారు. వాహనంలో తీసుకెళ్లే సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేశ్వర్ల కాలు కిందకి జారటంతో మరో గాయం తగిలింది. ఇన్ని అవస్థలు పడి పీహెచ్సీకి తీసుకెళితే అక్కడ బెడ్లు లేకపోవటంతో వీలైచైర్పైనే కూర్చోబెట్టి వైద్యం అందించారు. సీతానగరం ఘాట వద్ద ఏర్పాటు చేసిన రెండు వైద్యశిబిరాల్లో కనీస సౌకర్యాలు కనిపించలేదు. దీంతో వచ్చిన సిబ్బంది అట్టపెట్టెలు కింద వేసుకుని కూర్చొన్నారు. -
రూకల కోసం.. నడకయాతన
– ప్రతి నెలా వేలల్లో పంపిణీ కాని పింఛన్లు – అమలు కాని ప్రభుత్వ ఆదేశాలు – ఆఫ్లైన్పై దృష్టి పెట్టని అధికారులు – పింఛన్దారులకు తప్పని వెతలు ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదు. ఫలితంగా ప్రతి నెలా వేలాది మంది లబ్ధిదారులకు పింఛన్ అందడం లేదు. పింఛన్దారులు తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్తుండడంతో ఇవ్వలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే..పంపిణీ సిబ్బంది అసలు తమ ఇళ్ల వద్దకే రావడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా అంతిమంగా వేలాది మందికి పింఛన్ కష్టాలు తప్పడం లేదు. అనంతపురం టౌన్ : ఎన్టీఆర్ భరోసా పథకం కింద జిల్లా వ్యాప్తంగా 3,86,826 మంది పింఛన్దారులు ఉన్నారు. వీరిలో వృద్ధాప్య 2,00,778 మంది, వితంతు 1,19,042, వికలాంగ 55,572, చేనేత 11,240, కల్లుగీత పింఛన్దారులు 194 మంది ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులతో పాటు వెలుగు సీసీలు మొత్తం 1,261 మంది పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా 1–5లోపు పూర్తి చేయాలని ఆదేశాలున్నా అది సాధ్యం కావడం లేదు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా ఎక్కడా అమలు కావడం లేదు. ఆఫ్లైన్పై దృష్టి పెట్టని అధికారులు పింఛన్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం ట్యాబ్లు పంపిణీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సంకేతాలు (సిగ్నల్స్) అందకపోవడంతో పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సంకేతాలందే ప్రాంతాల్లో కార్యదర్శులు, సీసీలు కూర్చుని పింఛన్లు పంపిణీ చేయాల్సి వస్తోంది. సంకేతాలు సక్రమంగా అందకపోవడం, వేలిముద్రల సమస్యలతో ఒక్కో పింఛన్ అందించేందుకు 15 నిమిషాల వరకు పడుతోంది. మరికొన్ని చోట్ల రెండు, మూడు రోజుల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో పాటు పింఛన్ పంపిణీ సిబ్బంది వేరే ప్రాంతాల నుంచి వస్తుండడంతో సకాలంలో ప్రక్రియ పూర్తి కావడం లేదు. వాస్తవానికి సంకేతాలు అందని ప్రాంతాల్లో ఆఫ్లైన్లో పంపిణీ చేసి, ఆ తర్వాత డేటాను ఆన్లైన్లో నమోదు‡ చేసే అవకాశముంది. ఈ విషయంలో చాలా మంది ఎంపీడీఓలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పైగా సకాలంలో పూర్తి చేయాలన్న నిబంధనతో చాలాచోట్ల పంచాయతీ కేంద్రంలోనే పంపిణీ చేపడుతున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల వృద్ధులు, వికలాంగులు వ్యయ ప్రయాసలకోర్చి అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. కొన్ని పంచాయతీ కేంద్రాలు దూరంగా ఉండడం, రవాణా సౌకర్యాలు కూడా లేకపోవడంతో ఇలాంటి చోట్ల నరకయాతన అనుభవిస్తున్నారు. 22,936 మందికి అందని పింఛన్ ఆగస్టుకు సంబంధించి 3,86,826 పింఛన్లు మంజూరవగా.. పంపిణీ చేసింది 3,63,926. అంటే 22,936 మందికి అందలేదు. మిగులు మొత్తం రూ.2,63,07,000. ఆగస్టులోనే కాదు.. ప్రతి నెలా ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. ఆరు నెలలుగా పింఛన్ తీసుకోని వారి వివరాలు నెల మంజూరైన పింఛన్లు అందుకోని వారు మార్చి 3,88,983 25,152 ఏప్రిల్ 3,87,043 18,283 మే 3,87,759 21,973 జూన్ 3,87,654 17,631 జూలై 3,87,479 20,359 ఆగస్టు 3,86,826 22,936 ఇంటింటికీ వెళ్లి ఇవ్వాలన్న ఆదేశాలున్నాయి పింఛన్లను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాలన్న ఆదేశాలున్నాయి. ప్రస్తుతానికి నడవలేని స్థితిలో ఉన్న వారికి వాళ్ల ఇంటి వద్దే ఇస్తున్నాం. సాంకేతిక ఇబ్బందులున్న చోట ఆఫ్లైన్లో పంపిణీ చేస్తున్నాం. వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి పింఛన్లు మాత్రమే మిగులుతున్నాయి. రెండు నెలలు రాకపోయినా మూడో నెలలో వస్తే పింఛన్ మొత్తం అందజేస్తాం. – వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ రెండు కిలోమీటర్లు నడవాలి నేను యాడికిలోని రాఘవేంద్ర కాలనీలో ఉంటున్నా. పింఛన్ను కోన రోడ్డులోని చౌడేశ్వరి గుడి వద్ద ఇస్తారు. అక్కడికి సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంతదూరం వెళ్లి తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. – చిన్న నారాయణ, యాడికి -
బస సరే.. మరి భోజనం ?
స్నానాల పరిస్థితి ఏమిటి ? తలలు పట్టుకుంటున్న అధికారులు తాడేపల్లి (తాడేపల్లి రూరల్) : పుష్కర విధులకు విచ్చేసే అధికారులకు బస ఏర్పాటు చేయడానికి యంత్రాంగం పలు పాఠశాలలు, సత్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పాఠశాలలో సుమారు 300 మంది సిబ్బంది బస చేయనున్నారు. అధికారులు మొక్కుబడిగా పాఠశాలలు అప్పజెప్పారు కానీ, అందులో బస చేసే ఉద్యోగులకు స్నానాలు, టాయ్లెట్లు, ఆహారం వంటి అంశాలలో ఇప్పటికీ ఏర్పాట్లు చేయలేదు. 300 మంది ఉద్యోగులకు స్నానాలకు అవసరమైన నీరు, టాయ్లెట్లు లేని పాఠశాలలు, సత్రాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క పాఠశాలలో 300 మంది ఉంటే మొత్తం విధులు నిర్వర్తించే సుమారు 5 వేల మంది ఉద్యోగులకు నీటి వసతికి తీసుకున్న చర్యలు ఏమిటో స్పష్టం చేయలేదు. భోజన సదుపాయం ఒక చోట, వసతి మరో చోట కావడంతో విధులు నిర్వహించిన అనంతరం వసతి గహంలో ఉంటే భోజనానికి అక్కడకు వెళ్లాలంటే రెండు మూడు కిలోమీటర్లకు పైగా నడిచి వెళ్లాల్సి ఉంది. పుష్కరఘాట్లలో విధులు నిర్వహించి, మరలా భోజనం కోసం అంతదూరం వెళ్లాలంటే ఎలా అని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పురుషులు అయితే ఏదో విధంగా వసతి గహాల్లో కాలకత్యాలు తీర్చుకుని, స్నానం చేయగలరు. మరి మహిళా ఉద్యోగుల పరిస్థితి ఏమిటో అర్థంకాక సతమతమవుతున్నారు. ఒకరోజు రెండు రోజులైతే ఏదో విధంగా సరిపెట్టుకుంటారు. 12 రోజులు ఎలా అని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్ప వచ్చే భక్తులకు, ఉద్యోగులకు సరైన సదుపాయాలు కల్పించడంలో శ్రద్ధ చూపడం లేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వ్యాపారులకు అందలం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి అప్పిరెడ్డి సీఆర్డీఏ పరిధిలో భూములు, భవనాల రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై మండిపాటు పట్నంబజారు : కార్పొరేట్ వర్గాలకు రెడ్ కార్పెట్ వేస్తూ.. కంత్రీగాళ్లకు కొమ్ముకాస్తూ.. బడా పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూరుస్తూ, సామాన్య ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపేలా చంద్రబాబు సర్కారు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా సీఆర్డీఏ పరిధిలో భూములు, భవనాల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడంపై రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ జిల్లా రిజిస్ట్రార్ కె.శ్రీనివాసరావుకు శుక్రవారం వినతిపత్రం ఇచ్చారు. అనంతరం అప్పిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు రెండేళ్ల పాలనలో అడుగడుగునా చట్టాలు తుంగలో తొక్కుతూ ఆదాయం కోసం హడావుడిగా జీవోలు విడుదల చేయడంపై మండిపడ్డారు. సీఆర్డీఏ పరిధిలో టీడీపీకి చెందిన బడా వ్యాపార వేత్తలకు లబ్ధి చేకూర్చేలా జీవో విడుదల చేయడం సమంజసమేనా అని నిలదీశారు. బడా వ్యాపారులకు అన్నం.. సామాన్యులకు సున్నం అన్నచందంగా చంద్రబాబు సర్కారు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచిందని ఎద్దేవా చేశారు. పెంచిన రిజిస్ట్రేషన్ చార్జిల జీవోను తక్షణమే ఉపసంహరించుకుని చార్జీల పెంపుపై ప్రజాభిప్రాయం సేకరించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రజలకు వెలుసుబాటు ఇవ్వకుండా గంటల్లోనే రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం చేస్తున్న వికృత చేష్టలకు ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. -
మంచంపట్టిన గిరిజనం
ఎంపీ దత్తత గ్రామంలో ప్రబలిన జ్వరాలు గొల్లమందల(ఎ.కొండూరు) : గొల్లమందల శివారు గిరిజన తండాలో జ్వరాలు ప్రబలాయి. జ్వరంతో బాధపడుతూ సుమారు 30 మంది మంచానికే పరిమితమయ్యారు. కనీసం మందుబిళ్లలు కూడా ఇచ్చేవారు కరువయ్యారని జ్వరపీడితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటం వల్ల దోమలు పెరిగి జ్వరాలు ప్రబలుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఎంపీ దత్తత తీసుకున్న ఈ గిరిజన తండాలో సుమారు 250 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. తండాలో రహదారికి ఇరువైపులా డ్రెయినేజీ సౌకర్యం లేకపోవడంతో మురుగునీరు నిల్వ ఉండి దుర్వాసన వస్తోంది. దోమలు పెరిగిపోతున్నాయి. తండా వాసులందరికీ తాగునీరు తీసుకెళ్లడానికి ఒకే ఒక చేతి పంపు ఉంది. ఆ పంపు చుట్టూ మురుగు చేరి నీరు కలుషితమవుతోంది. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినా ఫలితం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తండాలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. -
‘ప్రత్యేక’ విద్య డల్!
5 నెలలుగా జీతాలు రాక ఉపాధ్యాయుల అవస్థలు ఫిజియోథెరపిస్ట్లు, ఆయాల లేమితో నిర్వీర్యమవుతున్న వ్యవస్థ ఆందోళనలో ప్రత్యేక అవసరాలుగల చిన్నారుల తల్లిదండ్రులు ప్రత్యేక అవసరాలుగల చిన్నారుల మానసిక స్థితిని చక్కదిద్ది వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వనరుల విద్యా కేంద్రాలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రగతి పథకంలో సాగిన ఈ కేంద్రాలు టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పరిస్థితి దిగజారింది. – తాడికొండ రూరల్ తాడికొండలో ఉన్న ప్రత్యేక విద్యావనరుల కేంద్రంలో ప్రస్తుతం 19 మంది చిన్నారులు ఉన్నారు. ఫిజియోథెరపిస్టు, ఆయాల కాంట్రాక్టు కాలపరిమితి పూర్తవడంతో తొలగించారు. ఆ పోస్టుల్లో ఇంకా ఎవరినీ నియమించలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టు ఉపాధ్యాయులే అన్నీ తామే నడిపించాల్సివస్తోంది. గదులను శుభ్రం చేసేందుకు కూడా ఎవరూ లేకపోవడంతో కేంద్రం నిర్వహణ కష్టంగా మారిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఫిజియోథెరపిస్ట్ లేకపోవడంతో తల్లిదండ్రులు కూడా చిన్నారులను కేంద్రానికి పంపించేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. నిర్వహణ లోపంతో ఫ్లోరింగ్ కుంగిపోవడంతో ఇబ్బందిగా మారింది. జిల్లాలో మొత్తం 57 మండలాల్లో ఈ పాఠశాలలు కొనసాగుతుండగా కేవలం 19 మండలాల్లో మాత్రమే గత ప్రభుత్వ హయాంలో పక్కా భవనాలు మంజూరయ్యాయి. జిల్లా అంతటికీ ఫిజియోధెరపిస్ట్లు 13 మంది ఉండగా కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకునే పద్ధతి పాటిస్తుండటంతో ఈ ఏడాది ఎక్కడా నియామకం చేయలేదు. ఆయాలను కూడా నియమించలేదు. ఫలితంగా ఉపాధ్యాయులే అన్నీ తామై నడిపిస్తున్నారు. ఐదు నెలలుగా అందని జీతాలు.. ప్రత్యేక విద్యావనరుల కేంద్రాల్లోని ఉపాధ్యాయులకు (శిక్షకులు) 5 నెలలుగా జీతాలు అందడంలేదు. దీంతో పలువురు శిక్షకులు విధుల నుంచి తప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రత్యేక విద్యావనరుల కేంద్రాలు మూతపడాల్సిన పరిస్థితి తలెత్తుతుందని పలువురు వికలాంగ బాలబాలికల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సత్వరమే జీతాలు విడుదల చేసి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నాం.. కొన్ని నెలలుగా జీతాలు లేకపోవడంతో కేంద్రాన్ని అప్పులు తెచ్చి కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు చొరవతో జీతాలు వెంటనే విడుదల చేయాలి. చాలా ఇబ్బందిగా ఉంది. – కత్తి నాగబాబు, ఉపాధ్యాయుడు, తాడికొండ ప్రజాప్రతినిధులు చొరవ చూపిస్తే మరింత అభివృద్ధి.. ఈ కేంద్రాల్లో సమస్యల పరిష్కారానికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి. ఎంతో మంది ప్రత్యేక అవసరాలుగల చిన్నారుల జీవితాల్లో ఈ కేంద్రాలు వెలుగు నింపుతున్నాయి. జీతాలు రాక మేం ఎంతో ఇబ్బంది పడుతున్నాం. – మండ్ల యలమంద, ఉపాధ్యాయుడు, తాడికొండ -
సరదా తెచ్చిన తంటా
వేంపల్లె(ఇడుపులపాయ) : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి సరదాగా రైలింగ్ (మెట్ల వద్ద రక్షణగా వేసిన స్టీల్ పైపులు)పై జారుతుండగా.. ప్రమాదవశాత్తు నాల్గవ అంతస్తు నుంచి జారిపడి ప్రాణం మీదకు తెచ్చుకొన్నాడు. తలకు తీవ్ర గాయాలై పరిస్థితి విషమించడంతో తిరుపతి రమాదేవి ఆసుపత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇడుపులపాయ జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కోనఅనంతపురం సుగాలి తాండాకు చెందిన రామయ్య నాయక్ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పీ–2 (ఇంటర్సెకండియర్) పూర్తి చేసుకొని ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదివేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో పాత క్యాంపస్ నుంచి కొత్త క్యాంపస్లో ఈ విద్యార్థులకు గదులు కేటాయించారు. బ్లాక్–1లో ఉన్న భవనంలో రామయ్య నాయక్ రెండవ అంతస్తులో తోటి విద్యార్థులతో ఉన్నాడు. మంగళవారం రాత్రి 10గంటల సమయంలో నాల్గవ అంతస్తులో ఉన్న స్నేహితులను కలిసేందుకు అక్కడికి వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో సరదాగా మెట్లకు రక్షణగా వేసిన స్టీల్ పైపులపై(రైలింగ్) జారుతూ గదికి చేరుకోవాలనుకున్నాడు. పైపులపై జారే ప్రయత్నంలో చేతిలో పుస్తకాలు ఉన్నందువల్ల అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అధికారులు స్థానిక ట్రిపుల్ ఐటీ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు తిరుపతి స్విమ్స్కు తరలించారు. అక్కడ చేర్చుకొనేందుకు నిరాకరించడంతో తిరుపతిలోని రమాదేవి ఆసుపత్రిలో చేర్పించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. -
పల్స్ సర్వే ఫ్లాప్
-
అందని ‘పల్స్’
► ముందుకు కదలని స్మార్ట్పల్స్ సర్వే ► ఒకరోజు సిగ్నల్, ఇంకోరోజు నెట్, మరోరోజు వెర్షన్ సమస్య ► ఒక్కో ఇంటికి రెండు గంటలకుపైగా సమయం ► తలలు పట్టుకుంటున్న ఎన్యుమరేటర్లు ► నిర్ణీత గడువులోగా మొదటి విడత పూర్తి అనుమానమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వేకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఒకరోజు సిగ్నల్ సమస్య, ఇంకోరోజు ముందుకు కదలని నెట్, మరోరోజూ వెర్షన్ మార్పు...ఇలా రకరకాల సమస్యలతో సర్వే నత్తనడకను తలపిస్తోంది. ఒక్కో ఇంటిని అరగంటలోపు సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు, సాంకేతిక సమస్యల కారణంగా రెండు గంటలకు పైగా పడుతోంది. దాంతో ఎన్యుమరేటర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒంగోలు టౌన్: జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వే నత్తనడకన సాగుతోంది. వారం రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో అతికష్టం మీద రెండువేల గృహాలను పూర్తి చేశారు. ఈ లెక్కలను చూసి దిమ్మతిరిగిన యంత్రాంగానికి రాష్ట్రవ్యాప్తంగా పోల్చుకుంటే ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో ఉందంటూ తేలడంతో నవ్వాలో ఏడవాలో అర్థంకాని అయోమయ పరిస్థితిలో జిల్లా యంత్రాంగం ఉంది. జిల్లాలో 8లక్షల 60 వేల 4643 కుటుంబాలు ఉన్నాయి. రెండు విడతల్లో ఆ కుటుంబాలకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా ఈనెల 8 నుంచి 30వ తేదీ వరకు మొదటి విడత, ఆగస్టు 6 నుంచి 14వ తేదీ వరకు రెండో విడత సర్వే చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ సర్వే కోసం 2312 ఎన్యుమరేటర్ బ్లాకులుగా గుర్తించింది. అందులో గ్రామీణ ప్రాంతాల్లో 1932, పట్టణ ప్రాంతాల్లో 285, నగర పంచాయతీల్లో 95 బ్లాక్లుగా విభజించింది. ప్రతి ఎన్యుమరేటర్కు ట్యాబ్, బయోమెట్రిక్ డివైస్ అందిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ముందుగా ప్రకటించింది. ట్యాబ్లు తగినంతగా లేకపోవడంతో ఇతర శాఖల్లో అమలు చేస్తున్న ట్యాబ్లను హడావుడిగా తెప్పించి సర్వే చేపట్టారు. సర్వర్ డౌన్ : సర్వే ప్రారంభించిన రోజు నుంచి నెట్ సమస్య, సర్వర్లు డౌన్ కావడం పరిపాటిగా మారింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సర్వే నిర్వహిస్తున్నట్లు పదేపదే ప్రకటించినా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో ఘోరంగా విఫలమైంది. సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తూనే ఉండటం జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. ఒక్కో ఎన్యుమరేటర్ రోజుకు 14 ఇళ్లు సర్వే చేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. అయితే సాంకేతిక సమస్యలతో రెండిళ్లు దాటి ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. దానికితోడు సర్వేకు సంబంధించి 80 రకాల ప్రశ్నలకు సమాధానాలను సేకరించాల్సి రావడంతో అధిక సమయం తీసుకుంటోంది. ఒక ఇంటిలోని కుటుంబ సభ్యుల వివరాలన్నీ సేకరించడంతోపాటు వారికి సంబంధించిన ఐరిష్ లేదా తంబ్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశాలు రావడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి చంద్రన్న బీమా పథకం కూడా ఎన్యుమరేటర్లకు తలనొప్పిగా మారింది. అసంఘటిత కార్మికులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ పథకం ద్వారా ఎలాంటి ఉపయోగం కలుగుతుందన్న విషయాన్ని ఎన్యుమరేటర్లు సమగ్రంగా చెప్పలేకపోవడం కూడా ఆలస్యానికి కారణమవుతోంది. ఇదిలా ఉంటే స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి ఏ రోజు ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్నారన్న విషయాన్ని ముందుగా ప్రకటించకపోవడం ఆలస్యానికి మరింత కారణమవుతోంది. పైగా సర్వే అంశాల వల్ల తాము నష్టపోతామన్న భయం కూడా అనేక మందిని పట్టి పీడిస్తోంది. ఒకవైపు ప్రభుత్వ పథకాలు సమగ్రంగా అందించేందుకు స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ, అందుకు విరుద్ధంగా తమకు అందుతున్న పథకాలకు ఎక్కడ పంగనామం పెడతారోనన్న భయం ప్రజలను పట్టిపీడిస్తోంది. జిల్లాలో అడుగుపెట్టని స్పెషల్ ఆఫీసర్ స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి అన్ని జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. అందులో భాగంగా గతంలో జిల్లా కలెక్టర్గా వ్యవహరించిన కరికాల వళవన్ను ప్రకాశంకు కేటాయించింది. అయితే స్మార్ట్ పల్స్ సర్వే ప్రారంభమై వారం రోజులు దాటినా ఇంతవరకు స్పెషల్ ఆఫీసర్ జిల్లాలో అడుగుపెట్టలేదు. ప్రతిచోట ఏదో ఒక సమస్య వస్తుండటం, దానిని పరిష్కరించేసరికి సంబంధిత అధికారులకు తలబొప్పి కడుతున్న తరుణంలో స్పెషల్ ఆఫీసర్ రాకవల్ల పెద్దగా ప్రయోజనాలు కనిపించడం లేదు. -
ఉపాసన ఒక్కరేకాదు..
నిర్మాతల తీరు, రెమ్యూనరేషన్ చెల్లింపుల్లో జాప్యంపై నిర్భయంగా గళం విప్పిన సీనియర్ టీవీ నటి ఉపాసన సింగ్ కు ఎల్లడలా మద్దతు లభిస్తోంది. ఆమె బాటలో మరికొందరు నటీనటులు తాము ఎదుర్కొటున్న తీవ్ర సమస్యలను వెల్లడించే ప్రయత్నం చేశారు. సెట్ లో లైంగిక వేధింపులు, దారికి రానివారిని నలిపేసే ప్రయత్నాలు, వ్యక్తిగత స్వాతంత్ర్యం కోల్పోవాల్సిరావడం.. తదితర విషయాలను దాచుకోకుండా వెళ్లగక్కుతున్నారు టీవీ స్టార్లు. వీరిలో పరిధి శర్మది కాస్త సీరియస్ సమస్య.. బహుళ ఆదరణ పొందిన 'జోథాఅక్బర్' సీరియల్ లో జోథాబాయిగా నటిస్తోన్న పరిధి శర్మను ఆ సీరియల్ డైరెక్టర్ శాంత్ రామ్ వర్మ లైంగికంగా వేధించారనే వార్తాలు సంచలనం రేపుతున్నాయి. దర్శకుడి తీరుతో విసుగు చెందిన పరిధి.. నిర్మాతలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిసింది. సదరు సీరియల్ నిర్మాత బాలాజీ ప్రొడక్షన్స్ కావడంతో ఆ సంస్థ అధినేత్రి ఏక్తా కపూర్ ను ఇదే విషయం మీడియా ప్రశ్నించింది. దానికి ఏక్తా.. 'శాంత్ రామ్, పరిధిల మధ్య వివాదం నడుస్తోందని తెలుసుకానీ అది లైంగిక వేధింపులు అయిఉండదు' అని వివరణ ఇచ్చారు. మరో టీవీ నటి శిల్పా షిండేది కూడా ఇదే తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. 'బాభీజీ ఘర్ పే హై' సీరియల్ లో ముఖ్యపాత్ర పోశించిన శిల్పని నిర్మాత బినాయిఫెర్ కోహ్లీ మానసికంగా వేధించాడట. వేధింపులకు తాళలేకే సదరు సీరియల్ నుంచి తప్పుకున్నానని శిల్పా ప్రకటించింది. దీంతో ఆమెకు లీగల్ నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్నారు నిర్మాతలు. మికాకు నైట్ చిక్కులు ప్రముఖ గాయకుడు మికా సింగ్ కలర్స్ చానెల్ లో ప్రసారం అవుతోన్న 'కామెడీ నైట్స్ లైవ్'లో శాశ్వత అతిథిగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. గతంలో కామెడీ నైట్స్ విత్ కపిల్ షోలో క్రికెటర్ నవజ్యోత్ సిద్ధు అతిథిగా కనిపించేవారు. ఆ ఇద్దరూ ఇప్పుడు సోనీ టీవీలో 'కపిల్ శర్మ షో'లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. కపిల్ ఆహ్వానం మేరకు మికా సోని టీవీ షోకు వెళ్లారు. ఇది రుచించని కలర్స్ నిర్మాతలు మికాను ఉన్నపళంగా కామెడీ నైట్స్ లైవ్ గెస్ట్ గా తొలిగించారట. 'ప్యార్ తూనే క్యా కియా' సీరియల్ తో పాపులర్ అయిన పథ్ సంథాన్ కూడా నిర్మాతలు తనను తొక్కేయడానికి ప్రయత్నిచారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. 'ప్యార్ తూనే..'కు సంబంధించిన రూ.5.5 లక్షల రెమ్యూనరేషన్ ఇంకా తనకు అందలేదని, డబ్బులివ్వండని నిలదీసినందుకు ఆ సీరియల్ నిర్మాత నా కెరీర్ చెడగొట్టాలని చూశారని పథ్ అంటున్నారు. -
'సోషల్ మీడియాతో ఆ పోలీసులకు తిప్పలు'
అబిడ్స్: నగరం నడిబొడ్డున ఉన్న అబిడ్స్లో ఓ ప్రేమజంటపై సినిమా థియేటర్ వద్ద కొంతమంది పోకిరీలు దాడిచేశారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. బుధవారం మధ్యాహ్నం నుంచే వాట్సాప్, ఫేస్బుక్లలో ఈ వార్త సంచలనం రేపింది. కానీ ఏ థియేటర్ వద్ద జరిగిందో, ఎవరిపై జరిగిందో వివరాలు మాత్రం పూర్తిగా లేకపోవడంతో అబిడ్స్ పోలీసులు సైతం తలపట్టుకున్నారు. అబిడ్స్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాస్, అదనపు ఇన్స్పెక్టర్ పులి యాదగిరి ఈ సోషల్ మీడియా సంచలన వార్తతో పలు థియేటర్ల వద్ద కూడా విచారణ జరిపారు. ఏ థియేటర్ వద్ద ఈ సంఘటన జరగలేదని పలువురు థియేటర్ యాజమానులు పోలీసులకు వివరించడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. అంతేగాక కొన్ని నెలల క్రితం అబిడ్స్ సంతోష్-స్వప్న థియేటర్ వద్ద ఒక ప్రేమజంటపై గుర్తుతెలియని పోకిరీలు దాడిచేసినట్లు సమాచారం. కానీ ఆ సంఘటనపై కూడా నేటి వరకు పోలీసులకు లిఖితపూర్వకంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఇలా సోషల్ మీడియా హాట్ న్యూస్ పోలీసులకే తలనొప్పిగా మారింది. -
‘డబుల్’కు ట్రబుల్!
- గందరగోళంగా మారిన రెండు పడక గదుల పథకం - లబ్ధిదారుల ఎంపిక ఆసాంతం అస్తవ్యస్తం - ఏ ప్రాతిపదిక లేకుండా సాగుతున్న ఎంపిక - అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ప్రక్రియ - మొదటి విడతలో ఒక్కో ఊరికి వచ్చేది ఐదు ఇళ్లే! - తమకే కేటాయించాలంటూ అనుచరుల ఒత్తిళ్లు - వారి జాబితానే పరిశీలిస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు - అసలు లబ్ధిదారులను పట్టించుకునే వారే కరువు - రాష్ట్రంలో గూడు లేని కుటుంబాలు 4 లక్షలపైనే సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదులు, ఓ వంటగది, రెండు టాయిలెట్లు, ఇంటి ముందు విశాల స్థలం..! ‘డబుల్ బెడ్రూం’ పథకంలో రాష్ట్ర సర్కారు పేదలకు నిర్మించి ఇవ్వనున్న ఇళ్లు ఇవీ!! దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ పథకం అత్యంత గందరగోళంగా మారింది. లబ్ధిదారుల ఎంపిక ఓ పజిల్లా తయారైంది. విధివిధానాలు ప్రకటించి సర్కారు చేతులు దులుపుకున్నా.. క్షేత్రస్థాయిలో పథకం అమలు అయోమయంగా మారిపోయింది. లబ్ధిదారుల ఎంపిక చిత్రవిచిత్రంగా సాగుతోంది. ఈ మొత్తం ప్రక్రియ అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే సాగుతుండటంతో.. తమకే ఇళ్లు కేటాయించాలంటూ అనుచరులు, పార్టీ సానుభూతిపరుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో అర్హుల ఎంపికకు ఓ ప్రాతిపదికంటూ లేకుండా పోయింది. గతంలో ప్రభుత్వం నిర్వహించిన సర్వేల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక కసరత్తు జరగడం లేదు. స్థానిక నేతలు ఇచ్చిన జాబితాలతోనే ఎమ్మెల్యేల కార్యాలయాలు నిండిపోతున్నాయి. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట్ల ఆ వ్యవహారాన్ని జిల్లా మంత్రులు చక్కబెట్టేందుకు సిద్ధమయ్యారు. వచ్చేవి ఊరికి ఐదే.. డబుల్ బెడ్రూం పథకం కింద మంజూరైన ఇళ్లను రాష్ట్రవ్యాప్తంగా పంచితే ఊరికి ఎన్ని ఇళ్లు కేటాయించాల్సి వస్తోందో తెలుసా...? కేవలం ఐదు! ఆశ్చర్యంగా ఇది నిజం. పథకం తొలివిడత కింద ప్రభుత్వం 60 వేల ఇళ్లను కేటాయించింది. వీటిలో సీఎం కోటా పోను మిగతా వాటిని నియోజకవర్గానికి 400 చొప్పున పంచారు. ఒక్కో నియోజకవర్గంలో సగటున 80-90 గ్రామాలుంటాయి. అంటే ఒక్కో గ్రామానికి గరిష్టంగా ఐదు ఇళ్లు వస్తాయన్న మాట. ఆ ఐదు ఇళ్లకు ప్రతి ఊరిలో కనీసం వందకు తక్కువ కాకుండా కుటుంబాల పేర స్థానిక నేతలు ఎమ్మెల్యేలు/జిల్లా మంత్రులకు జాబితాలు సమర్పించేశారు. దీంతో ఆ ఐదు ఇళ్లలో అధికార పార్టీ అనుచరులే పాగా వేసే పరిస్థితి నెలకొంది. మొత్తం ఇళ్లలో 50 శాతం స్థానిక ఎమ్మెల్యే, మిగతా 50 శాతం జిల్లా మంత్రి ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆ ఇళ్లు ఏయే గ్రామాల్లో నిర్మించాలో కూడా వీరే ఖరారు చేస్తారు. వీరు సిద్ధం చేసిన జాబితాను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని రెవెన్యూ అధికారుల బృందం పరిశీలిస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో అయితే గ్రేటర్ కమిషనర్ నియమించిన అధికారుల బృందం పరిశీలిస్తుంది. జాబితాను గ్రామసభ/వార్డు సభలో ప్రదర్శించి అర్హతను ఖరారు చేస్తారు. అనంతరం దాన్ని కలెక్టర్కు సమర్పిస్తారు. మరోసారి అధికారుల బృందం తుది పరిశీలన పూర్తి చేయటంతో అధికారికంగా లబ్ధిదారుల జాబితా సిద్ధమవుతుంది. అర్హులకు చోటేది? ఇప్పటివరకు ఏ నియోజకవర్గంలో ఏయే గ్రామాల్లో ఇళ్లు నిర్మించాలో తేల్చలేదు. గ్రామానికి సగటున ఐదు చొప్పున ఇళ్లు నిర్మించాల్సి రావటంతో గ్రామాల ఎంపిక ఎమ్మెల్యేలకు కత్తిమీద సాములా మారింది. దీంతో తొలుత కొన్ని గ్రామాలనే ఎంపిక చేయాలని చాలా మంది ఎమ్మెల్యేలు నిర్ణయించారు. మరోవైపు అధికార పార్టీ క్రియాశీలంగా ఉన్న గ్రామాల్లో సర్పంచులు, స్థానిక నేతలు ఇప్పటికే జాబితాలు సమర్పించారు. వాటి నుంచే ఉజ్జాయింపుగా కొన్ని పేర్లను కూడా సిద్ధం చేశారు. కానీ ఎక్కడా గతంలో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే గానీ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిర్వహించిన సర్వే నివేదికను గానీ ప్రాతిపదికగా తీసుకోలేదు. స్థానిక నేతలు, సర్పంచులు సమర్పించిన జాబితాలనే ఎమ్మెల్యేలు పరిగణనలోకి తీసుకున్నారు. ఫలితంగా ఇళ్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న అసలైన పేదలకు ‘చోటు’ లేకుండా పోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారుల ఎంపికపై నేతల నుంచి ఒత్తిడి ఉండటంతో సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప తన నియోజకవర్గంలో ఈ పథకం శంకుస్థాపనకే దూరంగా ఉండిపోవడం గమనార్హం. వచ్చే విడతలో ఊరికి కనీసం 25 ఇళ్లు: మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ‘‘ఈ విడత కేవలం నమూనా (మోడల్)గానే పరిగణిస్తున్నాం. తక్కువ ఊళ్లు ఎంపిక చేస్తే ఎక్కువ ఇళ్లు చొప్పున వస్తాయి. మలి విడత కింద కనీసం ఊరికి 25 ఇళ్లు వచ్చేలా కేటాయిస్తాం. ఈసారి అందరికీ ఇళ్లు సాధ్యం కాకున్నా.. వచ్చేవి కూడా నిరుపేదలకే ఇచ్చేలా చూస్తున్నాం. ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు ఎంపిక చేసిన లబ్ధిదారులు అర్హులా కాదా అన్నది కలెక్టర్లు తనిఖీ చేస్తారు. ఎక్కడా అనర్హులు లేకుండా చూస్తాం’’ గూడు లేనివారెందరో.. రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల పేద కుటుంబాలకు సొంతిళ్లు లేవు. జనాభా లెక్కల ఆధారంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వమే ఈ మేరకు తెలిపింది. రాష్ట్రంలో 2.5 లక్షల కుటుంబాలు కనీస ప్రమాణాలకు నోచుకోని ఇళ్లలో గడుపుతున్నాయి. ఊళ్ల అవతల ప్లాస్టిక్ కాగితాలు, వెదురు తడకల్లాంటి వాటినే ఆవాసంగా మార్చుకుని ఉంటున్నాయి. ఇలాంటి కుటుంబాల వివరాలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సర్వే నివేదికలో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రచ్చబండ పథకం కింద దరఖాస్తు చేసి ఇళ్లు మంజూరై ఎదురుచూస్తున్న కుటుంబాలు 5 లక్షల వరకు ఉన్నాయి. -
ఇసుక తెన్నెలపై ఆవిరవుతున్న బతుకులు
-
ఉన్నత విద్యకు తూట్లు
సందర్భం తెలంగాణ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి మాజీ పార్లమెంటు సభ్యులు ఎమ్ నారాయణ రెడ్డి రాస్తున్న బహిరంగ లేఖలలో ఇది అయిదవది. తెలంగాణలో ఉన్నత విద్యా వ్యవస్థకు గతంలో జరిగిన అన్యాయాన్ని సోదాహరణం గా వివరిస్తూ ఆయన రాసిన లేఖ సంక్షిప్త పాఠాన్ని అందిస్తున్నాం. ప్రియమైన చంద్రశేఖరరావు గారూ, ఇది నేను మీకు రాసి పంపుతున్న అయిదవ ఉత్తరం. ప్రస్తుతం విద్యా శాఖలు, విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్ర చర్చకోసం ఈ ఉత్తరంలో ప్రతిపాదిస్తున్నాను. 1. గతంలో తెలంగాణ ఎమ్మెల్యేలతో కూడిన ప్రాంతీ య కమిటీ మనకు ఉండేది. తెలంగాణ ప్రాంతంలో విద్యా వ్యవహారాలపై ఆ కమిటీ 1974 వరకు ఒక వాచ్ డాగ్లా పనిచేసేది. అయితే 1973లో జరిగిన జై ఆంధ్ర ఆందోళన తర్వాత ఆ కమిటీని 1974లో రద్దుచేశారు. ఆనాటి నుంచి ఆంధ్రపాలకులు చూపిస్తూ వచ్చిన వివక్ష, ప్రాంతీయ పక్షపాతం కారణంగా తెలంగాణ ప్రాంతంలో విద్య ఘోరంగా వెనుకంజ వేసింది. 2(ఎ). ఆంధ్రా పాలకుల తీవ్ర వివక్ష, ప్రాంతీయ పక్ష పాతాన్ని వివరించడానికి తెలంగాణలో ప్రైవేట్ ఎయి డెడ్ కళాశాలలకు సంబంధించిన చక్కటి ఉదాహరణను నేను ప్రస్తావిస్తాను. 2012లో రాష్ట్రంలోని మొత్తం ఎయి డెడ్ కళాశాలల సంఖ్య 170. వీటిలో తెలంగాణలోని 9 జిల్లాల్లో 21 కళాశాలలు మాత్రమే ఉండగా, 149 ఎయిడెడ్ కళాశాలలు ఆంధ్రాలో ఉండేవి. బి. ఇక 2011-12 సంవత్సరానికి గాను రెండు ప్రాం తాలకు అందించిన వార్షిక ధనసహాయం(గ్రాంట్ ఇన్ ఎయిడ్)కి సంబంధించి పరిశీలిస్తే ఎంత ఘోరమైన వివక్ష ప్రదర్శించారో తెలుస్తుంది: పై పట్టికను పరిశీలిస్తే ఆంధ్రా కాలేజీలకు రూ. 348 కోట్ల వార్షిక ధనసహాయం అందించగా, తెలంగా ణ కాలేజీలకు ముట్టింది రూ. 29 కోట్లు మాత్రమే. సి.కోస్తాంధ్రలోని నాలుగు జిల్లాల్లోని ఎయిడెడ్ కళాశాలలకు 2011-12 సంవత్సరాల్లో రూ.214 కోట్ల ను వార్షిక గ్రాంటుగా అందజేశారు. వాటి వివరాలు : 1. గుంటూరు- రూ. 103 కోట్లు, 2. కృష్ణా - రూ. 52 కోట్లు, 3. పశ్చిమ గోదావరి - రూ. 39 కోట్లు, 4. తూర్పు గోదావరి- రూ. 30 కోట్లు. 3. తెలంగాణలో ఎయిడెడ్ మహిళా కళాశాలలు మూడు మాత్రమే ఉండగా, ఆంధ్రాలో 13 కళాశాలలు ఉన్నాయి. వీటిలో 2011-12కు గాను ఆంధ్రా ఎయిడెడ్ మహిళా కళాశాలలకు రూ.30.42 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రకటించగా, తెలంగాణ కళాశాలలకు అదే ఏడాది రూ.3.50 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. 4. విద్యాపరంగా వెనుకబడిన తెలంగాణకు మరిన్ని నిధులను మంజూరు చేయడానికి బదులుగా ఆంధ్రా పాలకులు తెలంగాణ అదనపు నిధులను తమ ప్రాం తానికి మళ్లించుకున్నారు. డి.శ్రీనివాస్ ఉన్నత విద్యా మంత్రిగా ఏపీ శాసనసభలో జరిగిన ఒక ముఖ్య ఘట నను ప్రస్తావిస్తాను. నిజామాబాద్లోని మహిళా కళాశాలకు వార్షిక గ్రాంట్ మంజూరు చేయడంపై తెలం గాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డాక్టర్ జి.చిన్నారెడ్డి, ఎ. ఇంద్రకరణ్రెడ్డి ఒక ప్రశ్న లేవనెత్తారు. ఆ కళాశాల తన నియోజకవర్గ పరిధిలోనే ఉన్నప్పటికీ దానికి సహాయం చేయడంలో ఉన్నత విద్యా మంత్రి తన నిస్సహాయత ను వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆంధ్రా మంత్రు లు తమ తమ నియోజకవర్గాల్లోని ఎయిడెడ్ కాలేజీలకు భారీ మొత్తంలో నిధులను కేటాయించడానికి తమ అధికారాలను పూర్తిగా ఉపయోగించుకున్నారు. పిన్న మనేని వెంకటేశ్వరరావు ఉన్నత విద్యామంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్రప్రాంతంలోని ఎయిడెడ్ కళాశాలలకు కేటాయింపులను పెంచారు. 5. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ : తెలంగాణ కాలేజీలకు జరుగు తున్న అన్యాయానికి సాక్ష్యంగా ఎయిడెడ్ కళాశాలల సమస్యను టీఆర్ఎస్తో పాటు తదితర సంస్థలు కూడా 2010లో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ముందు లేవనెత్తాయి. జరిగిన అన్యాయాన్ని కమిటీ తన పరిశీలనలో కనుగొని దానిని తన నివేదికలో నమోదు చేసింది. తెలంగాణ ఎయిడెడ్ కళాశాలలకు తగినన్ని నిధులను మంజూరు చేయడం ద్వారా ఈ సమస్యను సరిదిద్ద వచ్చని కమిటీ సిఫార్సు చేసింది కూడా. కానీ ఆంధ్రా పాలకులు దీన్ని కూడా అమలు చేయలేదు. కాబట్టి సీఎంగా మీరు 2006నాటి జీఓ నంబర్ 35తోపాటు ఉన్నత విద్యాశాఖ లోని తెలంగాణ వ్యతిరేక జీవోలన్నింటినీ రద్దు చేయడ మే కాకుండా తెలంగాణ ఎయిడెడ్ కాలేజీలకు పూర్తి స్థాయి గ్రాంట్లను అందించగలరు. నాలుగు దశాబ్దాలైపైగా కేంద్రప్రభుత్వ విధానాలు విద్యారంగంలో మౌలిక సంస్కరణలను ప్రతిపాదిస్తూ వచ్చాయి. 1968నాటి తొలి పాలసీ విద్యలో మౌలిక పునర్వవస్థీకరణను కోరుకోగా, 1976లో రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ప్రోత్సహించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యతగా ప్రతిపాదించారు. 1992లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వం విద్యలో వ్యత్యాసాలను తొలగించి అందరికీ సమానా వకాశాలను కల్పించాలని ప్రకటించింది. ఇక 1993లో ఏపీలో ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన కేసును విచారించిన సుప్రీంకోర్టు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించడానికి విద్య ప్రాథమికహక్కు అంటూ చరిత్రాత్మక తీర్పును ప్రకటించింది. 2005లో యూపీఏ హయాంలో విద్యా హక్కు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇలా అన్ని విధానాలూ విద్యారంగంలో మౌలిక సంస్కరణల ఆవశ్యకతను నొక్కి చెబుతూ వచ్చాయి కానీ ఆంధ్రా పాలకులు మాత్రం వాటికి అనుగుణంగా ఒక్కటంటే ఒక్క చర్యను కూడా తీసుకోలేదు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యాప్తికి సంబంధించి అన్ని అవకా శాలను తెలంగాణ ప్రాంతం కోల్పోయింది. ముగింపుః తెలంగాణలోని వేలాది విద్యాసంస్థల అవసరాలు, సమస్యల పరిష్కారం కోసం ప్రస్తుత విద్యాశాఖ పాలనా వ్యవస్థ మౌలిక మార్పుకు గురికా వలసి ఉంది. విశ్వవిద్యాలయాలలో వలే విద్యాశాఖకు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అవసరం ఎంతైనా ఉంది. దీనికి గాను, భారతీయ 2వ అడ్మినిస్ట్రేటివ్ కమిషన్ సిఫార్సు చేసినట్లుగా విద్యాశాఖలో జాయింట్ సెక్రటరీల స్థానంలో ప్రొఫెషనల్స్, మేనేజ్మెంట్ నిపుణులను నియమించాలి. కళాశాల విద్యలో సమూల మార్పునకు సంబంధించి మీరు తగు చర్యలు చేపట్టగలరని ఆశిస్తున్నాను. - ఎం. నారాయణరెడ్డి (వ్యాసకర్త మాజీ పార్లమెంటు సభ్యులు) మొబైల్ 7702941017 -
సమస్యలు, సవాళ్లు, నిత్యం నావెంటే...
చెన్నై: విలక్షణమైన, వైవిధ్యభరితమైన సినిమాలు, అద్బుతమైన నటనతో సినీ అభిమానులను అలరించే ప్రముఖ నటుడు కమలహాసన్ ఉత్తమ విలన్ సినిమా ప్రమోషన్ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తన సినిమాలు వివాదాస్పదం కావడం, విడుదల లేటవ్వడంపై స్పందించారు. తనను కావాలనే టార్గెట్ చేసి, నిరంతరం ఇబ్బంది పెడుతున్నారని , అయినా తాను వెరవనన్నారు. ''నా దారి ముళ్లదారి..సమస్యలు, సవాళ్లు నాకు అలవాటే... అయినా నా పయనం ఆగదు'' అంటున్నారు ఈ 60 ఏళ్ల సీనియర్ నటుడు. పాపనాశం సినిమా వివాదం ఎవరు సృష్టించారో తనకు తెలుసన్నారు. సాండియార్ టైటిల్ ఇలా సినిమా ప్రకటించానో అలా వివాదం మొదలైందని... మరి అదే పేరుతో సినిమా విడుదలైనా ఎవరూ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. పాపనాశం, విశ్వరూపం -2 సినిమాల ఆలస్యానికి కూడా ఇలాంటి వివాదాలే కారణమన్నారు. మరోవైపు సినిమాలో కీలకమైన సెన్సార్ బోర్డుపై ఆయన విమర్శలు గుప్పించారు. ముంబై ఎక్స్ప్రెస్ సినిమా టైటిల్ వివాదాన్ని గుర్తు చేశారు. ముంబై అనే మాట తమిళభాషలో లేదని అభ్యంతరం చెప్పారనీ, మరి తమిళ భాషలో ముంబైని ఏమంటామని ఆయన ప్రశ్నించారు. సెన్సార్ బోర్డు భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని మండిపడ్డారు. కళాకారుడినైన తనకు ఏదైనా మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు ఉంటుందని తెలిపారు. ''నేను పనీపాటా లేకుండా కూర్చోలేను. ప్రేక్షకులను మంచి సినిమాలతో ఆకట్టుకోవడకోవడమే నా ఆశయం. నానుంచి వారు ఆశిస్తున్న దాన్ని అందించడంకోసం నిరంతరం తపన పడతాను'' అన్నారు కమల్. విశ్వరూపంలో సినిమా ముస్లింలను కించపరిచేలా ఉందని వివాదం చెలరేగడంతో వినూత్న రీతిలో డీటీహెచ్ మీడియా ద్వారా సినిమాను విడుదల చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా కమల్ తమిళంలో మరోనూతన ప్రాజెక్టు పనులు ప్రారంభించినట్టు తెలుస్తోంది. -
చిక్కుల్లో జూనియర్ వైద్యులు
- సాయం చేయలేమని చేతులెత్తేసిన సర్కారు - ఈ ఏడాది పీజీ పరీక్షకూ అనర్హులే సాక్షి, హైదరాబాద్: పట్టువిడుపులు లేకుండా గతేడాది అరవై రెండు రోజుల పాటు సమ్మె చేసిన జూనియర్ డాక్టర్లు చిక్కుల్లో పడ్డారు. హైకోర్టు వద్దని వారించినా.. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకున్నా.. వైద్య ఆరోగ్య మంత్రి, అధికారులు చర్చలకు ఆహ్వానించినా.. పెడచెవిన పెట్టడంతో ఇప్పుడు వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోవడమే కాకుండా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పీజీ పరీక్షలకు కూడా అనర్హులు కానున్నారు. మానవతా దృక్పథంతో సమ్మె కాలానికి మినహాయింపునిచ్చి సకాలంలో హౌస్ సర్జన్ కోర్సును పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని ఇటీవల ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులకు జూడాలు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి లక్ష్మారెడ్డితో పాటు వైద్య విద్య సంచాలకులు డి.శ్రీనివాస్, న్యాయశాఖ కార్యదర్శి సంతోశ్రెడ్డితో సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రత్యేకంగా సమీక్ష జరిపారు. జూడాలకు వెసులుబాటు ఇచ్చే మార్గాలు, ప్రత్యామ్నాయాలపై చర్చించారు. అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం వీరికి సాయం చేసే పరిస్థితి లేదని న్యాయ శాఖ చేతులెత్తేసింది. కేబినేట్లో చర్చించి ప్రత్యేకంగా జీవో జారీ చేయటం ద్వారా వెసులుబాటు కల్పించే అవకాశాన్ని సైతం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇందుకు సీఎం సానుకూలత వ్యక్తం చేసినప్పటికీ, ఇలా చేస్తే హైకోర్టు నుంచి మొట్టికాయలు తప్పవని న్యాయ నిపుణులు హెచ్చరించినట్లు సమాచారం. దీంతో జూనియర్ డాక్టర్లకు సాయం చేసే మార్గాలన్నీ మూసుకుపోయినట్లేనని, తమ వైపు నుంచి ఏమీ చేసే పరిస్థితి లేదని వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. సమ్మె చేసినంత కాలం కోర్సు పొడిగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీంతో మార్చి 31న పూర్తి కావాల్సిన జూడాల హౌస్ సర్జన్ కోర్సు మే నెలాఖరుకు పూర్తవుతుంది. దీంతో పాటు ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మెడికల్ పీజీ పరీక్షకు వీరు అనర్హులవుతారని అధికారులు తెలిపారు. -
కష్టాలలో కృష్ణా జిల్లా టీడీపీ నేతలు
-
కేంద్ర సహకార బ్యాంకు దోపిడీ!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రైతుల్ని నిలువు దోపిడీ చేస్తోంది. ఇచ్చిన రుణాలకు ఆరు నెలలకు ఒకసారి వడ్డీని తిరగరాస్తోంది. రిజర్వుబ్యాంకు నిబంధనల ప్రకారం తీసుకున్న రుణాలను రైతులు సంవత్సరంలోపు తీర్చవచ్చు. అయితే ఆరు నెలలు పూర్తికాకుండానే రుణాలు చెల్లించాలని రైతులపై ఒత్తిడి తీసుకువస్తోంది. ఆ విధంగా వసూలు చేయాలని సహకార సంఘాల సీఈవోలపై బ్యాంకు అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. బ్రాంచ్ల వారీ సమావేశాలు నిర్వహించి టార్గెట్లు పెడుతున్నారు. అనుకూలంగా వ్యవహరించకపోతే సంఘాలకు కొత్త రుణాలు ఉండవని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో 167 సహకార సంఘాలు రైతులకు సేవలు అందిస్తున్నాయి. సంఘాల్లోని సభ్యులు, సాగు విస్తీర్ణం, పంటల సాగు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రతీ ఖరీఫ్, రబీకి రూ.2 నుంచి రూ. 4 కోట్ల వరకు రుణాలను ఒకో సంఘానికి మంజూరుచేస్తున్నాయి. మొన్నటి రబీ నాటికి ఈ సంఘాలకు రూ.514.87 కోట్లను రుణాలుగా ఇచ్చాయి. రబీలో రుణాలు సాధారణంగా అక్టోబరు నుంచి మార్చి నెల వరకు ఇస్తారు. రుణం తీసుకున్న తేదీ నుంచి సంవత్సరంలోపు రైతులు రుణాలు చెల్లించవచ్చు. అయితే రుణాలు తీసుకుని సంవత్సరం కాకపోయినా, వాటిని వసూలు చేయాలని బ్యాంకు అధికారులు సహకార సంఘాల సీఈవోలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. రుణాలు తీసుకుని సంవత్సరం కూడా కాలేదని, ఇప్పుడు రుణాలు చెల్లించలేమని రైతులు చెబుతున్నారు. సంఘాల సీఈవోలు కూడా రైతుల బాధలకు అనుగుణంగా ఇప్పుడు రుణాల వసూలు సాధ్యం కాదని చెబుతున్నారు. బ్యాంకు అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎలాగైనా రుణాలు వసూలు చేయాల్సిందేనని బ్రాంచ్ ల వారీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సమావేశాలకు సంఘాల సీఈవోలు, సిబ్బంది, రైతులను పిలిచి రుణాలు వసూలుకానిదే కొత్త రుణాలు ఉండవంటున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం నరసరావుపేట జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచ్లో సంఘాల సీఈవోల సమావేశాన్ని బ్యాంకు సీఈవో విశ్వనాథం, చైర్మన్ మమ్మునేని వెంకటసుబ్బయ్య నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో రుణాలు వసూలు చేయాలని ఆదేశించారు. టార్గెట్లు నిర్ణయించారు. రైతుల నుంచి వ్యతి వడ్డీ వ్యాపారుల వలే బ్యాంకు సిబ్బంది అనుసరిస్తున్న వైఖరికి రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు సహకార సంఘాల్లో తీసుకున్న రుణాలు రద్దయ్యాయని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొత్త ప్రభుత్వం రుణాలను రద్దు చేసే అవకాశం ఉందని, అప్పటివరకు చెల్లించేది లేదని రైతులు చెబుతున్నారు. బుక్ ఎడ్జెస్ట్మెంట్.. రైతులు రుణాలు చెల్లించలేకపోతే వారు చెల్లించినట్టుగా రికార్డుల్లో నమోదు చేసి బుక్ ఎడ్జెస్ట్మెంట్ చేయాలని సంఘాల సీఈవోలపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. రుణాల వసూలు కంటే బుక్ ఎడ్జెస్ట్మెంట్లే ఎక్కువగా జరుగుతున్న క్రమంలో రైతులు బ్యాంకు ఓచర్లపై సంతకాలు చేయడానికి విముఖత చూపుతున్నారు. బుక్ ఎడ్జెస్మెంట్ చేయకపోతే మీకు జీతాలు కూడా రావని అధికారులు సంఘాల సీఈవోలను హెచ్చరిస్తున్నారు. ఇదికేవలం బ్యాంకు మనుగడ కోసం సంఘాలను బలితీసుకోవడమేనని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు.