TV9
-
రవిప్రకాశ్పై కేసు ఉపసంహరణ చెల్లదు
సాక్షి, హైదరాబాద్: నిధుల దుర్వినియోగం, ఫోర్జరీలకు పాల్పడ్డారంటూ టీవీ9 మాజీ డైరెక్టర్ రవిప్రకాశ్పై నమోదైన కేసు ఉపసంహరణకు అనుమతించిన కూకట్పల్లిలోని మేజి్రస్టేట్ కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ అలందా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పి.కౌశిక్ రావు హైకోర్టును ఆశ్రయించారు. రవి ప్రకాశ్పై కేసు ఉపసంహరణకు రాష్ట్ర ప్రభుత్వం 2024, మార్చి 15న జీవో 158 జారీ చేసింది. దీని ఆధారంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెమో దాఖలు చేయగా, కూకట్పల్లి కోర్టు తీర్పునిచి్చంది. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కౌశిక్రావు కోరారు. ఈ పిటిషన్పై జస్టిస్ వేణుగోపాల్ సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. ‘రవిప్రకాశ్పై క్రిమినల్ కేసును మార్చిలో ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీని ఆధారంగా అనుమతిస్తూ మేజి్రస్టేట్ ఉత్తర్వులు జారీ చేయడం చట్టవిరుద్ధం. కేసు పూర్వాపరాలను, ఇతర అంశాలను పరిశీలించకుండానే ఉత్తర్వుల జారీ సరికాదు. క్రిమినల్ కేసు ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు?.. కారణాలు ఏమైనా ఉన్నాయా?.. లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు. ప్రభుత్వం కేసును ఉపసంహరించుకోవడంతో పడే ప్రభావాన్ని, చార్జిషీట్లోని ఆధారాలను, సాక్షుల స్టేట్మెంట్లను పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదు. మేజి్రస్టేట్ కూడా ఎలాంటి కారణాలను పేర్కొనకుండా మెమోను అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చారు. రవిప్రకాశ్.. నిందితుడిగా ఫోర్జరీ పత్రాలు సృష్టించడం, మోసానికి పాల్పడటం లాంటి పనులు చేశారని సాక్షులు వాంగ్మూలంలో పేర్కొ న్నారు. యాంత్రికంగా ఉత్తర్వులు జారీ చేయకూడదన్న సత్యాన్ని మేజి్రస్టేట్ పాటించలేదు. వీటిని పరిగణనలోకి తీసుకుని మేజిస్ట్రేట్ కోర్టు ఇచి్చన ఉత్తర్వులను రద్దు చేయాలి’అని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వం, రవిప్రకాశ్, సొంటినేని శివాజీ, జె. కనకరాజు, జె. తేజవర్మ, మహేశ్ గాం«దీకి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ ఈ నెల 5కి వాయిదా వేశారు. -
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్పై ఈడీ కేసు
-
రవిప్రకాశ్పై ఈడీ కేసు నమోదు
హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. టీవీ9 అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నుంచి భారీగా నిధులను రవిప్రకాశ్ విత్ డ్రా చేయడంతో ఈడీ కేసు నమోదు చేసింది. 2018 సెప్టెంబర్ నుంచి 2019 మే వరకూ 18 కోట్ల రూపాయల నిధులను రవిప్రకాశ్తో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు విత్ డ్రా చేశారని కేసు నమోదు కావడంతో దానిపై విచారణ చేపట్టారు.గతంలోనే ఈ ఫిర్యాదుతో రవిప్రకాశ్తో సహా పలువురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయగా, ఇదే కేసులో ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే రవిప్రకాశ్ విత్ డ్రా చేసిన 18 కోట్ల రూపాయలను ఎక్కడికి తరలించారన్న అంశంపై ఈడీ ఆరా తీయనుంది. కంపెనీలో ఎక్కువ షేర్లు ఉన్న డైరెక్టర్లను సంప్రదించకుండా, ఎలాంటి బోర్డు మీటింగ్ పెట్టకుండా 18 కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసిన కేసులో ఏ-1గా రవిప్రకాశ్ ఉన్నారు. -
హిందూ దేవతలను కించపరిచారని టీవీ9పై ఫిర్యాదు
మల్కాజిగిరి: టీవీ9 ఇస్మార్ట్ న్యూస్లో హిందూ దేవతలను కించ పరిచారని బీజేపీ నాయకులు మల్కాజిగిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈనెల 14వ తేదీన ఉదయం ఇస్మార్ట్ న్యూస్లో గ్రామ దేవతను కరో నా అమ్మవారిగా (ఫొటో) మార్చి పూజలు చేసే దృశ్యాలు ప్రసారం చేశారని లేఖలో పేర్కొన్నారు. దీనిని ప్రసారం చేసిన సదరు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, సదానంద్, ధర్మతేజ, భరత్యాదవ్ పాల్గొన్నారు. -
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఇంట్లో సోదాలు
సాక్షి, బంజారాహిల్స్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఇంట్లో సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 బీఎన్రెడ్డి కాలనీలోని రవిప్రకాశ్ ఇంట్లో ముసద్దీలాల్ జ్యువెల్లరీస్ అధినేత సుకేశ్ గుప్తా తలదాచుకున్నట్లు అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరిపారు. సుకేశ్ గుప్తాపై ఎస్ఆర్ఈఐ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ అసోసియేట్ వైస్ప్రెసిడెంట్ వేణుగోపాల్ ఫిర్యాదు చేశారు. దీంతో పక్కా సమాచారం మేరకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి సుకేశ్ గుప్తాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బషీర్బాగ్ కేంద్రంగా పనిచేసే ఆశీ రియల్టర్కు చెందిన సుకేశ్గుప్తా, నీతూగుప్తా, నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సురేశ్కుమార్, రవిచంద్రన్లు ఎస్ఆర్ఈఐ వద్ద రూ.110 కోట్ల రుణం కోసం 2018 జూన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఆ దేడాది అక్టోబర్ నుంచి ప్రతి 3 నెలలకు ఓ వాయిదా చొప్పున చెల్లిస్తూ మొత్తం 4 దఫాల్లో రుణం వడ్డీ సహా తీర్చాలన్నది ఒప్పందం. ఈ రుణానికి సంబంధించి షూరిటీగా హఫీజ్పేటలో ఉన్న 8 ఎకరాల స్థలంతో పాటు, కింగ్కోఠిలో 28,106 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నజ్రీబాగ్ ప్యాలెస్ను చూపిస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ రుణం చెల్లించడంలో విఫలం కావడంతో గతేడాది డిసెంబర్లో హఫీజ్పేటలోని స్థలాన్ని వేలం వేసిన ఎస్ఆర్ఈఐ సంస్థ 102.6 కోట్లు రాబట్టుకుంది. మిగిలిన మొత్తం రికవరీ కోసం నజ్రీబాగ్ ప్యాలెస్ వేలం వేయాలని ప్రయత్నించగా, నిందితులు అప్పటికే తమను మోసం చేస్తూ ఐరిస్ హాస్పిటాలిటీస్కు విక్రయించినట్లు గుర్తిం చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుకేశ్ గుప్తా, నీతూ గుప్తా, రవీంద్రన్, సురేశ్కుమార్లపై కేసు నమోదు చేసి, వారి కోసం వెతుకుతున్నారు. తాజాగా రవిప్రకాశ్ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకొని సుకేశ్గుప్తాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
రవిప్రకాశ్ కస్టడీపై విచారణ రేపటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో వెలిచేటి రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్పై సోమవారం వాదనలు విన్న నాంపల్లి కోర్టు.. తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. టీవీ9 అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డు తీర్మానం లేకుండా అక్రమంగా దాదాపు రూ.18 కోట్లు డ్రా చేసిన కేసులో రవిప్రకాశ్ను పోలీసులు గతవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నిందితుడు రవిప్రకాష్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే అనేక కీలక ఆధారాలు లభిస్తాయనీ, పది రోజుల పాటు కస్టడీలోకి అనుమతి ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోర్టుకు విన్నవించింది. రవిప్రకాశ్ తన అధికార దుర్వినియోగంతో ఉద్యోగులకు ఇవ్వాల్సిన బోనస్, ఎక్స్గ్రేషియా నిధులను అక్రమంగా మళ్లించారని, దీనికి సంబంధించిన ఆధారాలు అన్ని కోర్టుకు సమర్పిస్తున్నామని ఈ మేరకు తెలిపింది. అలాగే అతడు డ్రా చేసిన నగదు లావాదేవీల పూర్తి ఆధారాలు పోలీసులకు ఇవ్వడం జరిగిందని వివరించింది. రవిప్రకాశ్పై ఉన్న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), హైకోర్టులోని కేసులకు.. ఈ కేసుకు సంబంధం లేదనీ, 18 కోట్ల రూపాయలు ఎక్కడికి తరలించారనే దానిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని కోరింది. కంపెనీలో ఎక్కువ షేర్లు ఉన్న డైరెక్టర్లను సంప్రదించకుండా, ఎలాంటి బోర్డు మీటింగ్ పెట్టకుండా 18 కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసిన కేసులో ఏ-1గా రవిప్రకాశ్, ఏ-2గా ఆర్థిక వ్యవహారాలు చూసే మూర్తిగా గుర్తించారు. కాగా ప్రస్తుతం మూర్తి పరారీలో ఉన్నాడు. -
రవిప్రకాశ్ మనీలాండరింగ్కు పాల్పడ్డారు
సాక్షి, అమరావతి: టీవీ9 మాజీ సీఈవో వెలిచేటి రవిప్రకాశ్ అలియాస్ రవిబాబు రూ.వందల కోట్ల మేర మనీలాండరింగ్కు పాల్పడ్డారని, విదేశాల్లో పెద్దఎత్తున నల్లధనాన్ని దాచిపెట్టడంతో పాటు భారీ మొత్తంలో విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ అక్రమాలపై దర్యాప్తు జరిపేలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థను(సీబీఐ) ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్కి తాజాగా లేఖ రాశారు. రవిప్రకాశ్, ఆయన భార్య దేవిక, ఇతరుల అక్రమార్జన, పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలను కూడా జతచేసి సీజేఐకి పంపించారు. అడ్డగోలు సంపాదన ‘‘ఎలక్ట్రానిక్ మీడియా వ్యాపారంలో ఉన్న రవిప్రకాశ్ తన పదవిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులకు పాల్పడి పెద్ద మొత్తంలో డబ్బు, ఆస్తులను సంపాదించారు. ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బును విదేశాల్లో దాచిపెట్టారు. ఇది మనీలాండరింగ్ నిరోధక చట్టం(వీఎంఎల్ఏ), ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ చట్టం(ఫెమా), ఆర్బీఐ నిబంధనలు, ఆదాయపు పన్ను చట్టంతో పాటు ఇతర చట్ట నిబంధనలకు విరుద్ధం. సానా సతీష్బాబుకు రవిప్రకాశ్ అత్యంత సన్నిహితుడు. సానా సతీష్, మొయిన్ ఖురేషీతో కలిసి బ్యాంకులను, ఎంఎంటీసీలను మోసం చేశారు. సానా సతీష్ను సీబీఐ, ఈడీలు ఇప్పటికే విచారిస్తున్నాయి. వీరంతా కూడా అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించి, తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసి ఆ డబ్బును హవాలా మార్గంలో దేశం దాటించారు. ముసద్దీలాల్ జ్యువెలర్స్కు చెందిన సుకేష్ గుప్తాతో కలిసి వీరంతా కూడా అక్రమ వ్యాపారాలు, కార్యకలాపాలు నిర్వహించారు. ఇలా ఎన్నో ఆస్తులను కూడబెట్టారు. అంతేకాక ఈ విధంగా సంపాదించిన డబ్బును హవాలా ద్వారా విదేశాల్లో పెట్టుబడులుగా పెట్టారు. రవిప్రకాశ్కు పలు దేశాల్లో పలు రకాల చిరునామాలు, బ్యాంకు ఖాతాలున్నాయి. రవిప్రకాశ్, అతని భార్య దేవిక మీడియా ఎన్ఎక్స్టీ లిమిటెడ్లో చైర్మన్, డైరెక్టర్గా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఇండో జాంబియా బ్యాంక్లో ఖాతా కూడా ఉంది. ఈ వివరాలను కూడా వీరు బహిర్గతం చేయలేదు. జాతి ప్రయోజనాలను ఆశించి ఈ ఫిర్యాదు చేస్తున్నా. ఈ ఆధారాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రవిప్రకాశ్, అతని భార్య దేవిక, ఇతర సహాయకుల అక్రమాలు, అక్రమార్జనపై ఈడీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని అభ్యర్థిస్తున్నా’’ అని తన లేఖలో కోరారు. -
రవిప్రకాశ్పై సుప్రీం సీజేకు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ ఆస్తులపై విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్కు విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. రవిప్రకాశ్ అక్రమంగా ఆస్తులను కూడబెట్టారని ఫిర్యాదు చేశారు. ఈడీ, సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ఫెమ, మనీలాండరింగ్, ఐటీ నిబంధనల్ని రవిప్రకాశ్ ఉల్లంఘించారని ఆరోపించారు. మొయిన్ ఖురేషి, సానా సతీష్తో కలిసి పలువురిని మోసం చేశారని లేఖలో పేర్కొన్నారు. నకిలీ డాక్యుమెంట్లతో నగల వ్యాపారి సుఖేష్ గుప్తాను బెదిరించారని తెలిపారు. హవాలా సొమ్ముతో కెన్యా, ఉగాండాలోని కంపాల సిటీకేబుల్లో రవిప్రకాశ్ పెట్టుబడులు పెట్టారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. రవిప్రకాశ్ అక్రమ వ్యాపారాలు, పలు సంస్థల్లో పెట్టిన షేర్ల వివరాలను జతచేసి ఆధారాలతో సహా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్కు విజయసాయిరెడ్డి లేఖ రాసినట్టు తెలిసింది. -
సాధారణ ఖైదీగానే సింగిల్ బ్యారక్లో రవిప్రకాశ్
-
మెరుగైన మోసం
-
రవిప్రకాశ్ అరెస్ట్...
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డు తీర్మానం లేకుండా దాదాపు రూ.18 కోట్లు చీటింగ్ చేసిన కేసులో ఆ టీవీ మాజీ సీఈవో రవిప్రకాశ్ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. 2017–18, 2018–19 సంవత్సరాల కం పెనీ లాభాలకు సమానంగా బోనస్, ఎక్స్ గ్రేషియాల కింద రూ.18,31,75,000 నగదు డ్రా చేశారని, అయితే టీడీఎస్ మినహాయింపుల తర్వాత రూ.11,74,51,808గా బ్యాంక్ స్టేట్మెంట్లో కనిపిస్తోందని అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ హోల్టైమ్ డైరెక్టర్ జి.సింగారావు బంజారాహిల్స్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. టీవీ9 లోని 90.54 శాతం మెజారిటీ షేర్హోల్డింగ్ను ఈ ఏడాది ఆగస్టు 27 నాటికి అలందా మీడియా, ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. కొత్త బోర్డు డైరెక్టర్లు సంస్థ రికార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలు పరిశీలించగా, రవిప్రకాశ్, ఎంవీకేఎన్ మూర్తిలు మోసపూరితంగా డబ్బులు డ్రా చేశారని తేలింది. 2018 సెప్టెంబర్ 18న , 2019 మార్చి 3న,మే 8న రవిప్రకాశ్ రూ.6,36,000, 2018 అక్టోబర్ 24, డిసెంబర్ 10, 2019 మే 8న ఎంవీకేఎన్ మూర్తి రూ.5,97,87,000లు, కంపెనీ డైరెక్టర్ క్రిఫర్డ్ పెరీరా 2018 అక్టోబర్ 24, డిసెంబర్ 10, 2019 మే 8న రూ.5,97,87,000 డ్రా చేసినట్లు గుర్తించారు. వీరు ముగ్గురు కలిసి కింద రూ.18,31,75,000 డ్రా చేశారని రికార్డులను బట్టి తెలిసింది. కంపెనీకి నష్టం కలిగించడంతో పాటు మోసపూరితంగా చేసిన లావాదేవీలను బోనస్, ఎక్స్గ్రేషియా రంగుపులిమే ప్రయత్నం చేశారు. బోర్డు తీర్మానం లేకుండా అలాంటివి ఇచ్చే వీలుండదు. కంపెనీ షేర్హోల్డర్స్ జనరల్ మీటింగ్లో ఆమోదం తీసుకోకుండానే బోనస్, ఎక్స్గ్రేషియాగా రికార్డు చేయాలని అకౌంటెంట్లకు వారు సూచించినట్లు తెలిసింది. ‘సెప్టెంబర్ 24న జరిగిన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో ఈ మోసపూరిత లావాదేవీలపై పూర్తిస్థాయి చర్చలు జరిగాకే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాలని నిర్ణయించాం. ఆ నగదును తిరిగి రాబట్టేందుకు న్యాయపరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించాం’అని ఫిర్యాదులో జి.సింగారావు పేర్కొన్నారు. పోలీసులతో వాగ్వాదం.. బీఎన్రెడ్డి కాలనీలోని రవిప్రకాశ్ ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే, మీరెవరంటూ రవి ప్రకాశ్ ప్రశ్నిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీస్స్టేషన్ వరకు తన కారులోనే వస్తానని చెప్పగా పోలీసు వాహనాన్ని ఎస్కార్టుగా పెట్టి స్టేషన్కు తరలించారు. అనంతరం రవిప్రకాశ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు కూడా టీవీ9కు సంబంధించిందని గతంలోనే అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రవిప్రకాశ్కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి సీతాఫల్మండిలో మేజిస్ట్రేట్ ముందు ముందు హాజరుపర్చగా.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం చంచలగూడ జైలుకు తరలించారు. రవిప్రకాశ్కు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై ఈ నెల 9న విచారణకు రానుంది. కస్టడీలోకి తీసుకుంటాం: వెస్ట్జోన్ డీసీపీ సుమతి సొంత అవసరాల కోసం భారీ మొత్తంలో కంపెనీ నగదు డ్రా చేసుకున్న రవిప్రకాశ్ను పోలీసు కస్టడీకి తీసుకుంటాం. టీవీ9 తాజాగా సమర్పించిన రికార్డుల ఆధారంగా నాన్బెయిలబుల్ కేసు నమోదు చేశాం. రవిప్రకాశ్ను విచారిస్తే పూర్తిస్థాయిలో వివరాలు తెలుస్తాయి. -
రవిప్రకాశ్ను విచారిస్తున్న పోలీసులు
-
రవిప్రకాశ్ను అరెస్ట్ చేశాం: డీసీపీ
సాక్షి, హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ను అరెస్ట్ చేసినట్టు బంజారాహిల్స్ పోలీసులు శనివారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. టీవీ9 ప్రస్తుత సీఈవో గొట్టిపాటి సింగారావు శుక్రవారం చేసిన ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్ను అరెస్ట్ చేసినట్టు వెస్ట్ జోన్ డీసీపీ సుమతి మీడియాకు వెల్లడించారు. రవిప్రకాశ్తో పాటు అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్(ఏబీసీఎల్) మాజీ సీఎఫ్వో ఎంకేవీఎన్ మూర్తిపై 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఏబీసీఎల్ కంపెనీ చెందిన దాదాపు రూ.18 కోట్ల నిధులను సొంతానికి వాడుకున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రవిప్రకాశ్ను అదుపులోకి ప్రశ్నించినట్టు తెలిపారు. బోనస్, ఎక్స్గ్రేషియా పేరుతో కంపెనీ నిధులను స్వలాభానికి వాడుకుని.. సంస్థకు నష్టం కలిగించినట్టు ఫిర్యాదు పేర్కొన్నట్టు వెల్లడించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, షేర్ హోల్డర్ల ఆమోదం తీసుకోకుండా కంపెనీ ఖాతా నుంచి నిధులను తీసుకుని స్వప్రయోజనాల కోసం వాడుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయన్నారు. రవిప్రకాశ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు చెప్పారు. రవిప్రకాశ్ను తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరతామని డీసీపీ సుమతి తెలిపారు. -
పోలీసుల అదుపులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్
-
పోలీసుల అదుపులో రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏబీసీఎల్ కంపెనీ నుంచి రూ.12 కోట్ల నగదును రవిప్రకాశ్ అక్రమంగా వాడుకున్నారంటూ టీవీ9 ప్రస్తుత సీఈవో గొట్టిపాటి సింగారావు ఫిర్యాదు చేశారు. సంస్థ నిధులను భారీగా పక్కదోవ పట్టించారనే ఫిర్యాదుతో రవిప్రకాశ్తో పాటు ఏబీసీఎల్ మాజీ సీఎఫ్వో ఎంకేవీఎన్ మూర్తిపై బంజరాహిల్స్ పోలీసులు 409,418,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వి రవిప్రకాశ్ మూడు విడతల్లో రూ.6కోట్ల 36 లక్షలు విత్ డ్రా చేశారు. అలాగే డైరెక్టర్గా వ్యవహరించిన ఎంకేవీఎన్ మూర్తిపైనా నిధుల విత్డ్రా కేసు నమోదైంది. ఆయన రూ.5కోట్ల 97 లక్షలు విత్డ్రా చేయగా, మరో డైరెక్టర్ క్లిఫోర్డ్ పెరారీపైనా నిధుల విత్డ్రా కేసు నమోదు చేశారు పోలీసులు. పెరారీ రూ.5కోట్ల 97 లక్షలు విత్డ్రా చేసినట్లు సమాచారం. అలందా షేర్ హోల్డర్లు, డైరెక్టర్లకు సమాచారం ఇవ్వకుండా రవిప్రకాశ్ బృందం...భారీ మొత్తంలో కంపెనీ నగదును విత్ డ్రా చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమకు తాము భారీగా బోనస్లు కూడా ప్రకటించుకున్నారు. ఏబీసీఎల్ కంపెనీని టేకోవర్ చేసిన అలందా మీడియా డైరెక్టర్లు ఈ ఏడాది సెప్టెంబర్ 24న సమావేశమై పక్కదారి పట్టిన నిధులపై బోర్డులో చర్చించారు. అనంతరం రవిప్రకాశ్ అండ్ కోపై క్రిమినల్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. -
అరెస్టయితే బయటకు రాలేడు
సాక్షి, హైదరాబాద్: టీవీ9 లోగో కంపెనీ పేరిటే రిజిస్టర్ అయిందని, ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్ వ్యక్తిగతం కాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్రెడ్డి హైకోర్టులో వాదించారు. లిటిగేషన్ కోసమే రూ.వంద కోట్ల విలువ చేసే టీవీ9 లోగోను రూ.99 వేలకే రవిప్రకాశ్ అమ్మేశారని చెప్పారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రవిప్రకాశ్ దాఖలు చేసిన రిట్పై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును తర్వాత వెల్లడిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి ప్రకటించారు. టీవీ9 లోగోను 15 ఏళ్లపాటు వాడుకున్నందుకు 4% వాటా ఉంటుందనే వాదనలో అర్థం లేదని ప్రతాప్రెడ్డి వాదించారు. టీవీ9 చానల్ కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయలు చేతులు మారాయన్న రవిప్రకాశ్ ఆరోపణను ఖండించారు. రూ.500 కోట్లు బ్యాంకు లావాదేవీల ద్వారానే జరిగాయన్నారు. కొత్త యాజమాన్యం చట్ట ప్రకారం డైరెక్టర్లను నియమించిందని, అయితే రవిప్రకాశ్ ఫోర్జరీ పత్రాలు తయారు చేసి వాటా బదిలీ అయినట్లు చేశారన్నారు. రవిప్రకాశ్కు బెయిల్ మంజూరైతే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందన్నారు. రవిప్రకాశ్ను అరెస్ట్ చేస్తే బయటకు రావడం కష్టమని ఆయన తరఫు న్యాయవాది దిల్జీత్సింగ్ అహ్లూవాలియా వాదించారు. ముందస్తు బెయిల్ ఇస్తే పోలీసుల దర్యాప్తుకు రవిప్రకాశ్ సహకరిస్తారని, అందుకు ఎలాంటి కఠిన షరతులు పెట్టినా ఫర్వాలేదన్నారు. కావాలని మూడు కేసుల్లో ఇరికించినప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చని, సుప్రీం కోర్టు సిబ్బియా కేసులో ఇచ్చిన తీర్పును అనుసరించి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. -
రవిప్రకాశ్కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు
సాక్షి, హైదరాబాద్: టీవీ9 యాజమాన్యం దాఖలు చేసిన కేసులో నిందితుడైన ఆ చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్కు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో గట్టిగా వాదించింది. బెయిల్ మంజూరు చేస్తే రవిప్రకాశ్ సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తారని, పైగా మరో నిందితుడు నటుడు శివాజీ పరారీలో ఉన్నారని, దీంతో రవిప్రకాశ్కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలు బాగా ఉన్నాయంది. కింది కోర్టే కాకుండా సుప్రీంకోర్టు సైతం రవిప్రకాశ్కు బెయిల్ ఇవ్వలేదని తెలంగాణ పోలీసుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరేన్ రావల్ వాదించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రవిప్రకాశ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి ఎదుట వాదప్రతివాదనలు జరిగాయి. ఇప్పటికే కింది కోర్టు రవిప్రకాశ్ బెయిల్ దరఖాస్తును కొట్టివేసిందని, సుప్రీంకోర్టుకు వెళితే అరెస్ట్ నోటీసుకు 48 గంటల గడువు ఇవ్వాలని పేర్కొందని హరేన్ రావల్ చెప్పారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ‘కింది కోర్టు ఉత్తర్వులకు ఇక్కడ సంబంధం లేదు. సుప్రీంకోర్టు రవిప్రకాశ్ను అరెస్ట్ చేయాలని ఆర్డర్ ఏమీ ఇవ్వలేదు’అని వ్యాఖ్యానించారు. రవిప్రకాశ్ను అరెస్ట్ చేయకూడదని కూడా సుప్రీంకోర్టు పేర్కొనలేదని, 48 గంటల ముందు నోటీసు ఇవ్వాలని మాత్రమే చెప్పిందని న్యాయవాది బదులిచ్చారు. ఏబీసీఎల్లో రవిప్రకాశ్కు పది శాతమే వాటా ఉందని, 40 వేల షేర్లను రూ.20 లక్షలకు నటుడు శివాజీకి అమ్మినట్లుగా గత ఏడాది తప్పుడు పత్రాలు సృష్టించారని హరేన్ రావల్ చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరిలోనే వాటాల్ని విక్రయించడం నిజమైతే ఆ విషయాల్ని ఆదాయపు పన్ను శాఖకు అందజేసిన రిటర్న్లో ఎందుకు పేర్కొనలేదన్నారు. షేర్ల అమ్మకాల గురించిగానీ, తద్వారా వచ్చిన రూ.20 లక్షల సొమ్ము గురించిగానీ రవిప్రకాశ్ లేదా శివాజీ ఆదాయపు పన్ను పత్రాల్లోనే కాకుండా రికార్డుల్లో కూడా ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. రూ.140 కోట్లతో 90 శాతం టీవీ9 వాటాల కొనుగోలుకు ఏబీసీఎల్, అలందాల మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. అయితే, ఫోర్జరీ ద్వారా తప్పుడు పత్రాల్ని సృష్టించి అమ్మకాలను అడ్డుకునేందుకు రవిప్రకాశ్ కుట్ర పన్నారని ఆరోపించారు. టీవీ9, బ్రాండ్ పేరును రవిప్రకాశ్ రూ.99 వేలకు చట్ట వ్యతిరేకంగా అమ్మేయడమే కాకుండా మరో మీడియా సంస్థకు అక్రమంగా నిధులు మళ్లించారని పేర్కొన్నారు. తప్పు చేశారు కాబట్టే రవిప్రకాశ్ తప్పించుకు తిరిగారని, ఇప్పటికీ శివాజీ పరారీలో ఉన్నారని హరేన్ రావల్ వాదించారు. కేసు విచారణకు హాజరుకాకుండా కోర్టుల చుట్టూ తిరిగి బెయిల్ మంజూరు కోసం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాక పోలీసుల దర్యాప్తునకు రావ డం ప్రారంభించారని పేర్కొన్నారు. దర్యాప్తులో కూడా పొంతనలేని జవాబులు చెబుతున్నారని, మీడియా రంగంలో ఉన్న నేపథ్యంలో ఆయనకు ఉన్న పరిచయాల దృష్ట్యా సాక్షుల్ని ప్రభావితం చేయవచ్చని, ఈ దశలో రవిప్రకాశ్కు బెయిల్ మంజూరు చేయవద్దని రావల్ వాదించారు. మౌనంగా ఉండటమూ హక్కే.. తొలుత రవిప్రకాశ్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దిల్జిత్ సింగ్ అహ్లూవాలియా వాదిస్తూ.. బెయిల్ మంజూరుకు ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం లేదన్నారు. పోలీసులు 40 గంటలపాటు విచారించారని, పోలీసులు తాము కోరుకున్న జవాబులు రాబట్టాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం కూడా హక్కేనని చెప్పారు. టీవీ9లో శ్రీనిరాజుకు ఉన్న 90 శాతం వాటాను కొనుగోలుకు సైఫ్ మారిషస్తో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారని, జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ నుంచి సైఫ్ మారిషస్ స్టే ఉత్తర్వులు ఉన్నా వేరే వారికి రూ.500 కోట్లకు విక్రయించారని తెలిపారు. ఒక్కసారిగా సైఫ్ మారిషస్ ఆ కేసును వెనక్కి తీసుకుందని, దీని వెనుక రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి లావాదేవీలు నిర్వహించారని, రూ.294 కోట్లు టెర్రరిస్టుల్లాంటి వారికి అందే హవాలా తరహాలో బదిలీలు జరిగాయని, దీనిపై రవిప్రకాశ్ సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేశాక రాష్ట్ర ప్రభుత్వం ఆయన వెంటపడిందని చెప్పారు. ఈ కేసుల వెనుక కుట్ర ఉందని, ఒక కేసులో స్టేషన్ హౌస్ ఆఫీసర్ కాకుండా ఏసీపీ స్థాయి అధికారి విచారిస్తున్నారని చెప్పగా, హరేన్ రావల్ కల్పించుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఈ విధంగా విచారించే వీలుందన్నారు. విచారణ మంగళవారానికి వాయిదా పడింది. -
రవి ప్రకాష్ బయట ఒకలా.. లోపల ఒకలా..
సైబరాబాద్ : టీవీ9 లోగో విక్రయం విషయంలో ట్రేడ్ మార్క్, కాపీ రైట్స్ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ సీఈవో రవి ప్రకాష్ విచారణకు వచ్చినప్పుడు బయట ఒకలా.. లోపల ఒకలా వ్యవహరిస్తున్నారని బంజారాహిల్స్ పోలీసు అధికారులు తెలిపారు. రవి ప్రకాష్ను గత మూడు రోజులుగా విచారించినా ఎటువంటి సమాధానాలు చెప్పలేదన్నారు. విచారణకు ముందు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చే రవి ప్రకాష్ను విచారించామన్నారు. ఆయనను విచారించిన మూడు రోజులు మూడు నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. అలంద మీడియా ఇచ్చిన కేసుపైన అన్ని కోణాల్లో రవి ప్రకాష్ను ప్రశ్నించామన్నారు. రవి ప్రకాష్ ఫోర్జరీ చేసినట్లు తమ వద్ద టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయని తెలిపారు. నటుడు గరుడ శివాజీకి కూడా ఈ మధ్యనే నోటీసులు పంపామన్నారు. తమ వద్ద ఉన్న ఆధారాలు, రవి ప్రకాష్ చెప్పిన సమాధానాలను రేపు కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. కోర్టు ఇచ్చే ఉత్తర్వులను బట్టే రవి ప్రకాష్ను అరెస్ట్ చేయాలా? లేదా? అన్నది తెలుస్తుందన్నారు. -
అమ్మే హక్కుంది... విక్రయించలేదు!
సాక్షి, హైదరాబాద్: టీవీ–9 లోగో విక్రయం విషయంలో ట్రేడ్ మార్క్, కాపీ రైట్స్ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన పోలీసులకు చుక్కలు చూపించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెబుతూ విషయం పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని తెలిసింది. శుక్రవారం 6 గంటల పాటు ప్రశ్నించినా రవిప్రకాశ్ నుంచి సరైన సమాధానాలు రాలేదు. దీంతో శనివారం సంబంధిత డాక్యుమెంట్లు తీసుకుని రావాల్సిందిగా ఆదేశిస్తూ రవిప్రకాశ్ను ఇంటికి పంపారు. టీవీ–9 కొత్త యాజమాన్యానికి లోగో దక్కకూడదనే కుట్రతోనే రవిప్రకాశ్ ఈ వ్యవహారం నడిపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రూ.99 వేలకు టీవీ–9 లోగోను మోజో టీవీకి అక్రమంగా విక్రయించినట్లు ఫోర్జరీ పత్రాలు, తప్పుడు సంతకాలతో మోసం చేశాడంటూ అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్రావు గత నెలలో బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే రవిప్రకాశ్పై క్రిమినల్ కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా రవిప్రకాశ్కు ‘సీఆర్పీసీ 41 (ఎ)’సెక్షన్ కింద 2 నోటీసులు జారీ చేశారు. మొదటి నోటీసును బేఖాతరు చేసిన రవిప్రకాశ్ గురువారం అందుకున్న రెండో నోటీసుతో దిగివచ్చాడు. శుక్రవారం ఉదయం 11.20 గంటలకు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు వచ్చి దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యారు. ఏసీపీ కేఎస్ రావ్, ఇన్స్పెక్టర్ కళింగ్రావుతో కూడిన బృందం ఆయన్ను వివిధ కోణాల్లో ప్రశ్నించింది. టీవీ–9 కొత్త యాజమాన్యాన్ని ఇబ్బందులు పెట్టాలని కుట్ర పన్నారా? అనే ప్రశ్నకు ఆయన నుంచి మౌనమే సమాధానమైంది. లోగోను ఎలా విక్రయించారనే ప్రశ్నకు ‘అది నా సంస్థ. ఆ హక్కు నాకు ఉంది’అంటూ సమాధానం ఇచ్చారని తెలిసింది. దీంతో తీవ్రంగా స్పందించిన పోలీసులు అదే నిజమనుకున్నా... రూ.100 కోట్ల విలువైన సంస్థ లోగోను కేవలం రూ.99 వేలకే అమ్మారంటే నమ్మవచ్చా? అని ప్రశ్నించగా... తాను ఎవరికీ విక్రయించలేదంటూ చెప్పిన రవిప్రకాశ్ తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఏ ప్రశ్న అడిగినా పొంతన లేని సమాధానాలు చెబుతూ దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. సాయంత్రం వరకు విచారించి ఆపై ఆ వ్యవహారానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను తీసుకుని శనివారం రమ్మని పంపారు. శుక్రవారం నాటి విచారణలో రవిప్రకాశ్ నుంచి సరైన సమాధానాలు రాలేదని పోలీసులు చెబుతున్నారు. మరోపక్క అటు సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు, ఇటు హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసుల విచారణలను తప్పించుకోవడానికి రవిప్రకాశ్ మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు అందుకు చెక్ చెప్పడానికి రవిప్రకాశ్ గతంలో అజ్ఞాతంలో ఆయన ఎక్కడికి వెళ్లారు? ఎలా తలదాచుకున్నారు? సహకరించింది ఎవరు? అనే అంశాలను సాంకేతికంగా సంగ్రహిస్తున్నట్లు సమాచారం. రవిప్రకాశ్ అరెస్టు నేడు! ఫోర్జరీ, నిధుల మళ్లింపు వ్యవహారంలో పోలీసులు కేసు వేగవంతం చేశారు. రవిప్రకాశ్ను అరెస్టు చేసే దిశగా పోలీసులు పావులు కదుపుతున్నారు. ఈ విషయంలో న్యాయనిపుణుల సలహా కూడా అడిగిన పోలీసులు శనివారం అరెస్టుపై నిర్ణయం తీసుకోనున్నారు. గురువారం సైబరాబాద్ పోలీసు విచారణ సందర్భంగా రవిప్రకాశ్ పోలీసులనే బెదిరించడం సంచలనం రేపుతోంది. ‘‘నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఏదో ఒక రోజు మీకు టైం వస్తుంది’’అని బెదిరించే ప్రయత్నం చేయడం గమనార్హం. పోలీసులపై పదే పదే తీవ్ర ఆరోపణలు చేస్తూ దర్యాప్తు అధికారులను ప్రభావితం చేస్తున్నాడన్న కారణంతో సైబరాబాద్ కమిషనరేట్లో పోలీసులు మీడియా పాయింట్ను ఎత్తేశారు. దీంతో రవిప్రకాశ్ నేరుగా తమపైనే బెదిరింపులకు దిగాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ పరిణామంతో సీరియస్ అయిన పోలీసులు సీపీ సజ్జనార్తో సమావేశమై, అరెస్టు విషయమై చర్చించారని సమాచారం. ఫోర్జరీ ఆరోపణ అంగీకారం.. మొత్తం 3 రోజుల సైబరాబాద్ విచారణలో రవిప్రకాశ్ ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ఫోర్జరీ కేసులో సంతకాన్ని తానే ఫోర్జరీ చేసినట్లు అంగీకరించాడు. ఎలా ఫోర్జరీకి పాల్పడిందీ.. పోలీసులకు వివరించాడు. ఈ పనికి ఎందుకు పాల్ప డ్డావంటే మాత్రం సమాధానం దాటవేశాడు. అతని మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు పోలీసులు నిందితుడి చేతిరాతను సేకరించారు. ఫోర్జరీ కేసులో ఈ చేతిరాతను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపనున్నారు. విచారణనంతా పోలీ సులు వీడియో రికార్డింగ్ చేశారు. మొత్తానికి ఈ కేసులో శనివారం పలు కీలక మలుపులు చోటుచేసుకోనున్నాయి. -
రవి ప్రకాష్ అరెస్ట్కు రంగం సిద్ధం!
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ అరెస్ట్కు రంగం సిద్ధమైందని సమాచారం. ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసులో రవి ప్రకాష్నుంచి కీలక ఆధారాలను రాబట్టిన పోలీసులు ఆరెస్ట్కు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లు సమాచారం. రవి ప్రకాష్ ఈ శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. గడిచిన మూడు రోజుల విచారణలో పోలీసులకు సహకరించని రవి ప్రకాష్ నాల్గవ రోజు కూడా తన పంథాను కొనసాగించారు. యాజమాన్యం మార్పిడి తర్వాత టీవీ9 లోగో కొత్త యాజమాన్యానికి దక్కకుండా రవి ప్రకాష్ కుట్ర పన్నారు. లోగో అక్రమ విక్రయం కేసులో రవి ప్రకాష్పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. టీవీ9 లోగోను సీఈఓ స్థాయిలో ఉన్న వ్యక్తిగా ఎలా విక్రయించాలనుకున్నారని, లోగోను అమ్మేయాలనుకుంటే యాజమాన్యానికి ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. మూడు రోజులపాటు విచారించిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు.. మూడు రోజుల విచారణను వీడియో రికార్డింగ్ చేశారు. రవి ప్రకాష్కు పెన్ను, పేపర్ ఇచ్చి గంట సేపు పరిశీలించారు. అతడు పేపర్పై రాసిన విధానాన్ని బట్టి అతని మానసిక స్థితిని, చేతి రాతను పరిశీలించారు. ఫోర్జరీ విషయంలో రవి ప్రకాష్ చేతి వ్రాతను సేకరించారు. దర్యాప్తులో సేకరించిన పత్రాలను ఎఫ్ఎస్ఎల్కు పంపారు. రవి ప్రకాష్ ఇన్ని రోజులు ఎక్కడ తలదాచుకున్నారో టాస్క్ ఫోర్స్ పోలీసులకు పూర్తి సమాచారం దొరికింది. -
బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసు విచారణలో టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు హాజరయ్యారు. విచారణ నిమిత్తం గత మూడు రోజులుగా సైబర్ క్రైం పోలీసుల ఎదుట ఆయన హాజరైన సంగతి తెలిసిందే. అయితే, సైబర్ క్రైం పోలీసులకు ఆయన సహకరించలేదని తెలుస్తోంది. మొదటి రోజు దాదాపు 5 గంటలపాటు పోలీసులు ఆయనను విచారించగా.. ఆయన నోరు మెదపలేదు. దీంతో నోటీసులు ఇచ్చి పంపించారు. ఇక రెండో రోజు విచారణకు హాజరైన రవిప్రకాష్ కేవలం ఒక్క ప్రశ్నకు మాత్రమే సమాధానమిచ్చారు. డిజిటల్ సంతకం ఫోర్జరీ చేసినట్లు అంగీకరించారు. ఫోర్జరీ చేసిన విధానం కూడా వివరించారు. కానీ, దేనికోసం ఫోర్జరీ చేశారన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. ఆరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విచారణ కొనసాగింది. ఇక మూడో రోజు విచారణకు గురువారం ఆయన పోలీసుల ఎదుట హాజరయ్యారు. నిన్న కూడా తీరు మారలేదు. రవిప్రకాశ్ పోలీసుల ప్రశ్నలకు స్పందించలేదు. పైగా విచారణ అధికారులను బెదిరించే యత్నం చేశారు. ‘నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఏదో ఒక రోజు మీకూ టైమ్ వస్తుంది’ అన్ని బ్లాక్ చేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. -
మూడోరోజు విచారణకు రవిప్రకాశ్
-
మూడోరోజు విచారణకు హాజరైన రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసు విచారణలో టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ మూడోరోజు విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం 10 గంటలు సమయంలో ఆయన సైబర్ క్రైం కార్యాలయానికి చేరుకున్నారు. 27 రోజుల పాటు పరారీలో ఉన్న ఆయన ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం పోలీసుల ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. ఆయనను 5 గంటలపాటు పోలీసులు ప్రశ్నించారు. అయితే, రవిప్రకాశ్ పోలీసులకు ఏమాత్రం సహకరించకుండా.. వారి ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. ఇక రెండోరోజు కూడా ఆయన తీరు మారలేదు. బుధవారం ఉదయం 11.30 గంటలు దాటిన తర్వాత సైబర్ క్రైం కార్యాలయానికి వచ్చిన రవిప్రకాశ్.. అక్కడ మీడియాతో మాట్లాడిన అనంతరం విచారణ కోసం లోపలకు వెళ్లారు. అప్పటి నుంచి రాత్రి 10.30 గంటల వరకు 11 గంటలపాటు పోలీసులు ఆయన్ను విచారించారు. (రెండోరోజూ అదే తీరు!) ప్రధానంగా అలందా మీడియా కార్యదర్శి కౌశిక్రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన రెండు కేసులపై పోలీసులు ప్రశ్నలు సంధించారు. టీవీ9 పాత యాజమాన్యం నుంచి అలందా మీడియాకు యాజమాన్య బదిలీలు జరగకుండా ఉండేందుకు నకిలీ పత్రాలు సృష్టించడం, కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడంపై నమోదైన రెండు కేసులకు సంబంధించి పోలీసులు విచారించారు. అయితే, విచారణలో తమకు రవిప్రకాశ్ ఎంతమాత్రం సహకరించలేదని పోలీసు అధికారులు తెలిపారు. -
రవిప్రకాశ్కు పోలీసుల ప్రశ్నల పరంపర
సాక్షి, హైదరాబాద్: టీవీ9 కేసులో ఫోర్జరీ, డేటా చౌర్యం తదితర నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆ చానల్ మాజీ సీఈఓ రవిప్రకాశ్ రెండోరోజు సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యాడు. బుధవారం మధ్యాహ్నం ఆయన సైబరాబాద్ సైబర్ క్రైం కార్యాలయానికి చేరుకున్నారు. రవిప్రకాశ్ను మంగళవారం ఐదు గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలకు రవిప్రకాష్ ఏమాత్రం సహకరించలేదని, పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. ఇక సైబర్ క్రైం కార్యాలయం వద్ద రవిప్రకాశ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. అనంతరం స్టేషన్లోకి వెళ్లారు. ఆయనకు పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు. (సత్యాన్ని చంపేయబోతున్నారు : రవిప్రకాశ్) కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్ సంతకాన్ని ఫోర్జరీ చేసిందెవరు..? ఎందుకు చేయాల్సి వచ్చింది. తాజాగా కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలతో ఎన్సీఎల్టీకి పాత తేదీలతో శివాజీతో మీరు ఫిర్యాదు చేయించడానికి కారణాలేంటి..? శివాజీకి 40 వేల షేర్లు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది. మీ స్నేహితుడైన శివాజీకి షేర్లు బదిలీ చేయకుండా ఎందుకు చీట్ చేశారు ? మీడియా, మాఫియా మధ్య పోరాటం అంటున్నారు కదా..! టీవీ9 యాజమాన్య మార్పిడి జరిగినప్పుడు సీఈఓగా దానిని కొత్త యాజమాన్యానికి అప్పగించాల్సిన బాధ్యత మీకు లేదా..? టీవీ9 లోగో అనేది ఆ సంస్థకు చెందిన ఆస్థి.. టీవీని అమ్మాం కానీ లోగోను అమ్మలేదంటూ మీరు మాట్లాడటంలో ఏమైనా అర్థం ఉందా..? యాజమాన్యానికి తెలియకుండా టీవీ 9 నిధులను మీరు దుర్వినియోగం చేశారా ..? లేదా..? ఒకవేళ మీరు ఎలాంటి తప్పులు చేయనప్పుడు నెలరోజులుగా ఎందుకు తప్పించుకు తిరిగారు...పోలీసులకు ఎప్పుడో లొంగిపోయి వివరణ ఇస్తే అయిపోయేది కదా.. అని పోలీసులు రవిప్రకాశ్కు పలు ప్రశ్నలు సందించారు. -
రెండోరోజు విచారణకు రవిప్రకాశ్..
-
సత్యాన్ని చంపేయబోతున్నారు : రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: టీవీ9 కేసులో ఫోర్జరీ, డేటా చౌర్యం తదితర నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆ చానల్ మాజీ సీఈఓ రవిప్రకాశ్ రెండోరోజు సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యాడు. బుధవారం మధ్యాహ్నం ఆయన సైబరాబాద్ సైబర్ క్రైం కార్యాలయానికి చేరుకున్నారు. ఇదిలాఉండగా.. 27 రోజులుగా పరారీలో ఉన్న రవిప్రకాశ్ ఎట్టకేలకు మంగళవారం పోలీసుల ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. ఫోర్జరీ, నిధుల మళ్లింపు, డేటా చౌర్యం కింద నమోదైన 2 కేసుల్లో ఇప్పటికే పోలీసులు సిద్ధం చేసుకున్న ప్రశ్నావళి ప్రకారం రవిప్రకాశ్ను నిన్న ఐదు గంటల పాటు ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలకు రవిప్రకాష్ ఏమాత్రం సహకరించలేదని, పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. (పోలీసుల ఎదుటకు రవిప్రకాశ్) సైబర్క్రైం కార్యాలయం వద్ద రవిప్రకాశ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ మీడియాకు మాఫియాకు తెలుగు నెలమీద యుద్ధం జరుగుతోంది. మీడియా వైపు మేమున్నాం. ప్రజలంతా మీడియా వైపు ఉండాలి. మాఫియాకు వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలో మీడియా కబ్జాకాండ కొనసాగుతోంది. దొంగ పత్రాలు సృష్టించి, పొలీసులు, రెవెన్యూ అధికారులు పేద రైతుల్ని ఒత్తిడి చేసి ఏవిధంగా అయితే భూములు ఆక్రమిస్తారో అదే పద్దతిలో మీడియాను ఆక్రమిస్తున్నారు. నాకు కొంత మంది మిత్రులు ఉన్నారు. వారంతా కలసి మోజో టీవీని నెలకొల్పారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దానిని కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్కు చెందిన అంబరీష్ పూరి వ్యవహరిస్తున్నారు. కొంతమంది పోలీసుల సహకారంతో మోజో టీవీ యాజమాన్యాన్ని బెదిరించి లాకున్నారు. సత్యాన్ని చంపేయబోతున్నారు. ఈ లేకి తనాన్ని నిలదీయడానికి అందరూ పోరాడాలి. మీడియా కబ్జాపై జర్నలిస్టులందరూ పోరాడాలి. ప్రజలందరూ మీడియా కబ్జాపై గళం ఎత్తాలని కోరుతున్నా’అని ముగించారు. -
పోలీసుల ఎదుటకు రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: టీవీ9 కేసులో ఫోర్జరీ, డేటా చౌర్యం తదితర నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆ చానల్ మాజీ సీఈఓ రవిప్రకాశ్ ఎట్టకేలకు 27 రోజుల పరారీ తర్వాత పోలీసుల ఎదుటకు వచ్చాడు. మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో పోర్షే కారులో(పీవీ05సీ 0055) రవిప్రకాశ్ సైబరాబాద్ సైబర్ క్రైం కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న విలేకరులను పలకరిస్తూ నేరుగా కార్యాలయంలోకి వెళ్లిపోయాడు. 5 గంటల పాటు విచారణ: ఫోర్జరీ, నిధుల మళ్లింపు, డేటా చౌర్యం కింద నమోదైన 2 కేసుల్లో ఇప్పటికే పోలీసులు సిద్ధం చేసుకున్న ప్రశ్నావళి ప్రకారం రవిప్రకాశ్ను ఐదు గంటల పాటు ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలకు రవిప్రకాష్ ఏమాత్రం సహకరించలేదని, పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. కొన్ని ప్రశ్నలకు అడ్డదిడ్డమైన సమాధానాలతో పాటు అప్పుడు తాను లేనని, తనకు గుర్తు లేదని, తన లాయర్లు సమాధానం చెబుతారంటూ దాటవేసే విధంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. మరోసారి హాజరు కావాలని నోటీస్: బుధవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని రవిప్రకాశ్కు నోటీస్ ఇచ్చినట్టు సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. తాము అడిగిన ప్రశ్నలకు రవిప్రకాశ్ సరైన సమాధానం ఇవ్వడం లేదన్నారు. విచారణ అనంతరం రవిప్రకాశ్ మాట్లాడారు. ‘‘టీవీ9ను ఇద్దరు ధనికులు అక్రమంగా కొనుకున్నారు. నాపై దొంగ కేసులు పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బోర్డ్ మీటింగ్ పెట్టుకొని నన్ను అక్రమంగా టీవీ9 నుంచి బయటికి పంపించారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను. పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్న. ఇది మాఫియాకు, మీడియాకు జరుగుతున్న ధర్మయుద్ధం. ఈ యుద్ధంలో జర్నలిజమే గెలుస్తుంది’’అని పేర్కొన్నారు. నమోదైన కేసులివే: శొంఠినేని శివాజీతో కలిసి నకిలీ కొనుగోలు పత్రాల సృష్టి, నిధుల మళ్లింపు, కుట్ర, నకిలీ పత్రాల సృష్టి, సంస్థ కార్యదర్శి సంతకం ఫోర్జరీ తదితర ఆరోపణలపై రవిప్రకాశ్పై అలందా మీడియా కార్యదర్శి కౌశిక్రావు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ యాక్ట్, 66, 72 ఐపీసీ 406, 420, 467, 469, 471 సెక్షన్ల కింద కేసులు సైబరాబాద్ పోలీసులు నమోదు చేశారు. మరో కేసులో రవిప్రకాశ్తోపాటు ఎంకేవీఎన్ మూర్తిపైనా ఐటీ యాక్ట్ 66(సీ), 66(డీ), ఐపీసీ 420, 468, 471, 120(బీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు మే 9వ తేదీన టీవీ9 కార్యాలయంతోపాటు, బంజారాహిల్స్లోని రవిప్రకాశ్ నివాసం, హిమాయత్నగర్లోని శివాజీ నివాసంలోనూ సోదాలు నిర్వహించారు. పలు కంప్యూటర్ హార్డ్డిస్కులు, ల్యాప్ట్యాప్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో సమాచారం చెరిపివేసినా.. పోలీసులు తిరిగి సంగ్రహించగలిగారు. ఇదే క్రమంలో రవిప్రకాశ్పై మే 16వ తేదీన టీవీ9 లోగో, కాపీరైట్స్, ట్రేడ్మార్కులు 2018 మేలో మీడియా నెక్టŠస్ ఇండియా కంపెనీకి బదలాయించడంపై బంజారాహిల్స్ పోలీస్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో ఐపీసీ 467, 420, 409, 406, 120(బీ)సెక్షన్ల కింద హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. తర్వాత ఆయా కేసుల్లో విచారణకు హాజరుకావాలని సీఆర్పీసీ 160 కింద పోలీసులు రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. మరో రెండుసార్లు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద అతని ఇంటికి నోటీసులు అంటించి వచ్చారు. రవిప్రకాశ్ దేశం దాటకుండా అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో లుక్ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. గత్యంతరం లేకనే వచ్చాడు: పోలీసులు ఎన్నిసార్లు ప్రయత్నించినా రవిప్రకాశ్ అందుబాటులోకి రాలేదు. అతను ఏపీలో తలదాచుకున్నాడని ప్రచారం జరిగింది. ఏపీలో అతడికి మద్దతిచ్చే రాజకీయ నాయకులకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. దీనికితోడు రెండుసార్లు, హైకోర్టు లో.. ఆఖరుగా సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్కు విశ్వప్రయత్నాలు చేశాడు. అక్కడ ఎదురుదెబ్బ తగలడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రవిప్రకాశ్ పోలీసుల ఎదుట హాజరైనట్లు తెలుస్తోంది. మరో నిందితుడైన శివాజీ రేపోమాపో బయటకు వస్తాడని పోలీసులు భావిస్తున్నారు. -
పోలీసుల ఎదుట హాజరైన రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫోర్జరీ, డేటా చౌర్యం కేసుల్లో నిందితుడిగా ఉన్న రవిప్రకాశ్ గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి రవిప్రకాశ్ తీవ్రంగా ప్రయత్నించారు. అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రవిప్రకాశ్పై ఫొర్జరీ కేసు నమోదు చేశారు. అయితే ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టు తిరస్కరించాయి. దారులన్నీ మూసుకుపోవడంతో రవిప్రకాశ్ పునారాచనలో పడినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన మంగళవారం సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయినట్టుగా తెలుస్తోంది. అన్ని విషయాలపై ప్రశ్నిస్తాం : సైబర్ క్రైమ్ ఏసీపీ రవిప్రకాశ్ విచారణకు హాజరు కావడంపై సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాసరావు స్పందించారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసుకు సంబంధించిన అన్ని విషయాలపై రవిప్రకాశ్ను ప్రశ్నిస్తామని తెలిపారు. రవిప్రకాశ్ చెప్పేదాన్ని బట్టి ఎన్ని రోజులు విచారణ చేయాలనేదానిపై ఆలోచిస్తామన్నారు. తమ దగ్గర ఉన్న ఆధారాలతో అతన్ని ప్రశ్నిస్తామని వెల్లడించారు. రవిప్రకాశ్పై కేసులు.. శాంకినేని శివాజితో కలిసి నకిలీ కొనగోలు పత్రాల సృష్టి, నిధుల మళ్లింపు, కుట్ర, సంస్థ కార్యదర్శి సంతకం ఫోర్జరీ తదిత ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు వివిధ కేసులు నమోదు చేశారు. టీవీ9 లోగో, కాపీరైట్స్, ట్రేడ్మార్క్లు 2018 మేలో మీడియా నెక్స్ట్ ఇండియా కంపెనీకి బదలాయించడంపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అయితే రవిప్రకాశ్ కోసం పోలీసులు ఆయా నగరాల్లో గాలింపు చేపట్టిన సంగతి తెలిసిందే.పోలీసులు ఎంత గాలించినా.. రవిప్రకాశ్ పదేపదే స్థావరాలు మారుస్తూ వస్తున్నాడు. ఇప్పటి దాకా దాదాపు 30 సిమ్ కార్డులు మారుస్తూ. సోషల్ మీడియాలో స్నేహితులతో మంతనాలు సాగిస్తున్నాడు. పరారీలో ఉంటూనే హైకోర్టులో రెండుసార్లు, సుప్రీంకోర్టులోనూ ముందస్తు బెయిల్ కోసం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. చదవండి : సుప్రీంకోర్టులో రవిప్రకాశ్కు చుక్కెదురు -
రవిప్రకాశ్ లొంగిపోవడమే శరణ్యం..
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో పరారీలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్కు అన్ని దారులు మూసుకుపోయాయి. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టు తిరస్కరించడంతో రవిప్రకాశ్ పునారాచనలో పడ్డారు. పోలీసులకు చిక్కకుండా కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్లో తలదాచుకుంటున్నారు. ఈ మాజీ సీఈవో ప్రస్తుతం లొంగిపోయే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏపీలో రాజకీయంగానూ పలువురు నేతలు రవిప్రకాశ్కు ఆశ్రయం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో రెండు వారాల ముందే ఏపీని వీడినట్లు సమాచారం. తరువాత బెంగళూరుకు, అక్కడ నుంచి ముంబై, గుజరాత్కు వెళ్లినట్లు.. తెలవడంతో పోలీసులు ఆయా నగరాల్లో అతని కోసం గాలించారు. పోలీసులు ఎంత గాలించినా.. రవిప్రకాశ్ పదేపదే స్థావరాలు మారుస్తూ వస్తున్నాడు. ఇప్పటి దాకా దాదాపు 30 సిమ్ కార్డులు మారుస్తూ. సోషల్ మీడియాలో స్నేహితులతో మంతనాలు సాగిస్తున్నాడు. పరారీలో ఉంటూనే హైకోర్టులో రెండుసార్లు, సుప్రీంకోర్టులోనూ ముందస్తు బెయిల్ కోసం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. ఒత్తిడి పెంచుతున్న బృందాలు శాంకినేని శివాజితో కలిసి నకిలీ కొనగోలు పత్రాల సృష్ట, నిధుల మళఙ్లంపు, కుట్ర, సంస్థ కార్యదర్శి సంతకం ఫోర్జరీ తదిత ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు వివిధ కేసులు నమోదు చేశారు. టీవీ9 లోగో, కాపీరైట్స్, ట్రేడ్మార్క్లు 2018 మేలో మీడియా నెక్ట్స ఇండియా కంపెనీకి బదలాయించడంపై బంజారాహిల్సీ పోలీసు ఠాణాలో కేసు నమోదైంది. లొంగిపోవడమే శరణ్యం.. వాస్తవానికి మే చివరి వారంలో రవిప్రకాశ్ లొంగిపోతాడన్న సమాచారం జరిగింది. కానీ సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సాధ్యపడలేదని సమాచారం. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆయన బెయిల్ పిటిషన్ను తిరస్కరించడంతో ఇప్పుడు లొంగిపోవడం మినహా మరో మార్గం లేదు. ఇందే సమయంలో రవిప్రకాశ్తో పాటు మరారీలో ఉన్న మరో నిందితుడు శివాజీ ఆచూకీ కూడా పోలీసులకు ఇంతవరకు చిక్కలేదు. పోలీసులు అన్ని వైపులా ఒత్తిడి పెంచుతుండడంతో వీరిద్దరూ లొంగిపోతారా? పరారీలోనే ఉంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
తప్పించుకు తిరుగువాడు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసుల విషయంలో పోలీసుల వ్యూహాలు ఫలిస్తున్నాయి. ఈ కేసుల్లో నిందితులంతా దేశం వదిలిపోకుండా ఇప్పటికే విమానాశ్రయాలు, షిప్యార్డుల్లో లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు వేట ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తుండటం, నిందితుల సన్నిహితులు, స్నేహితులపై నిఘా తీవ్రతరం చేస్తున్నారు. ఈ కేసుల్లో తప్పకుండా పురోగతి ఉంటుందని, వారిని తప్పకుండా పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్న పోలీసులు ఇప్పుడు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. దీనికితోడు మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో నిందితులకు వాతావరణం ప్రతికూలంగా మారుతోంది. దీంతో పోలీసుల చేతికి చిక్కకుండా ఉండేందుకు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. ఇప్పుడు తమ లాయర్ల ద్వారా కోర్టులను ఆశ్రయిస్తూ ముందస్తు బెయిళ్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు కేసుల్లోను ముఖ్య నిందితులంతా.. ఏపీలో తలదాచుకున్నారన్న విమర్శలు రావడం, ఇప్పుడు రాజకీయంగా వారికి ప్రతికూల వాతావరణం ఏర్పడిందని సమాచారం. దీంతో ఆ ప్రాంతం తమకు అంత సురక్షితం కాదని భావించి ఇప్పటికే మరో చోటుకు మకాం మార్చారని సమాచారం. పట్టువదలని డాకవరం.. జాతీయస్థాయిలో సంచలనం రేపిన డేటా చౌర్యం కేసులో ప్రధాన నిందితుడు, ఐటీ గ్రిడ్ సంస్థ అధినేత డాకవరం అశోక్ అరెస్టును తప్పించేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ కేసులో ఫిబ్రవరి 23 తర్వాత కేసు నమోదైంది. అప్పటికే డాకవరం రాష్ట్రం సరిహద్దులు దాటి పారిపోయాడు. అతనికి ఏపీలోని కొందరు ఆశ్రయమిచ్చినట్లు సమాచారం. పైగా అప్పటి ఏపీలోని ప్రభుత్వం పెద్దలు అశోక్కు బహిరంగంగా మద్దతివ్వడం కూడా చర్చనీయాంశమైంది. పోలీసులు తన కోసం గాలిస్తుండగానే.. అశోక్ మాత్రం హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఆయనకు చుక్కెదురైంది. దీంతో అశోక్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. విచిత్రంగా మే 24 నుంచి ఈసారి ఎల్బీనగర్ కోర్టును ఆశ్రయించగా కోర్టు అతని అప్పీల్ను తిరస్కరించింది. దీంతో ఆయన తిరిగి బుధవారం హైకోర్టును ఆశ్రయించాడు. రవిప్రకాశ్ ఏకంగా సుప్రీంకే..! డేటాచౌర్యం, ఫోర్జరీ కేసులో పరారీలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, మరో నిందితుడు, సినీనటుడు శివాజీలు ఇప్పటిదాకా పోలీసులకు చిక్కలేదు. ఇప్పటికే రెండుసార్లు సీఆర్పీసీ సెక్షన్ 160, 41ఏల కింద 2 సార్లు నోటీసులు ఇచ్చినా.. ఇంతవరకూ పోలీసుల ఎదుట హాజరుకాలేదు. ముందస్తు బెయిలు కోసం 2 సార్లు హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. తాజాగా రవిప్రకాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పోలీసులు ఆయనపైనా లుక్అవుట్ నోటీసులు జారీ చేసి దేశం వదిలిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కేసులో రవిప్రకాశ్ ఇప్పటికే ఏపీ వదిలి ఉత్తరభారతానికి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేక పోలీసు బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయి. -
రవిప్రకాశ్ కోసం గాలింపు ముమ్మరం!
సాక్షి, హైదరాబాద్: టీవీ 9 చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్కోసం తెలంగాణ పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాశ్ ఇంతవరకూ పోలీసుల విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. రవిప్రకాశ్పై ఐటీ యాక్ట్ 66 (సీ) 66 (డీ),72లతోపాటు, 406, 420, 467, 469, 471, 120 బీ సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా, ఇప్పటికే సైబరాబాద్ సైబర్ క్రైం విభాగం, బంజారాహిల్స్ పోలీసులు, మరోవైపు టాస్క్ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు సీఆర్పీసీ సెక్షన్ల 160, సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసినా రవిప్రకాశ్, మరో నిందితుడు, సినీనటుడు శివాజీ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. తనపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని, ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ రవిప్రకాశ్ రెండుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు భంగపాటే మిగిలింది. ఏపీ వదిలి వెళ్లాడా? తెలంగాణ నుంచి పరారైన రవిప్రకాశ్ ఏపీలోని అప్పటి అధికార పార్టీ నేతల వద్ద తలదాచుకున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రవిప్రకాశ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మరోచోటుకు పారిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే, బెంగళూరు, విజయవాడలతోపాటు ముంబై, గుజరాత్లోనూ రవిప్రకాశ్ తలదాచుకునే అవకాశాలు ఉండటంతో రెండు టీంలు అక్కడా వెతికేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. రవిప్రకాశ్ తన ఆచూకీ చిక్కకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటిదాకా దాదాపు 30 వరకు సిమ్కార్డులు మార్చాడని సమాచారం. సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా మాత్రం సన్నిహితులతో మంతనాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మిగిలిన నిందితులు పోలీసుల విచారణకు బాగానే సహకరిస్తున్నారు. -
రవిప్రకాశ్కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: టీవీ9 టేకోవర్ విషయంలో సైఫ్ మారిషస్ కంపెనీ లిమిటెడ్–ఐ విజన్ మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ల మధ్య తలెత్తిన వివాదం సమసిపోయింది. కోర్టు వెలుపల ఈ రెండు కంపెనీలు రాజీ చేసుకోవడంతో ఐ విజన్పై సైఫ్ మారిషస్ దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణకు హైదరాబాద్లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ ) శుక్రవారం అనుమతిచ్చింది. ఈ పిటిషన్పై టీవీ9 మాజీ సీఈవో వి. రవిబాబు అలియాస్ రవిప్రకాశ్ చేసిన అభ్యంతరాలను ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. రవిప్రకాశ్ లేవనెత్తిన అభ్యంతరాలన్నీ అలందా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్కు అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ (ఏబీసీఎల్)కు సంబంధించిన అంతర్గత వివాదాలని గుర్తుచేసింది. ఏబీసీఎల్ టేకోవర్, ఆ కంపెనీ నుంచి రవిప్రకాశ్, ఇతరులు డైరెక్టర్లుగా తొలగింపు తదితర వివాదాలను ఈ వ్యాజ్యంలో లేవనెత్తడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ వివాదాలు సైఫ్ మారిషస్ పిటిషన్ ఉపసంహరణను తిరస్కరించడానికి ఎంతమాత్రం కారణాలు కాజాలవని పేర్కొంది. ఈ అంశాలన్నింటిపై రవిప్రకాశ్ ఇప్పటికే ఇదే ట్రిబ్యునల్లో మరో పిటిషన్ దాఖలు చేశారని తెలిపింది. ఆ పిటిషన్ విచారణపై జూన్ 12 వరకు స్టే విధిస్తూ ఢిల్లీలోని జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుం టూ ఐ విజన్ మీడియాపై దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు సైఫ్ మారిషస్ కు అనుమతినిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ట్రిబ్యునల్ సభ్యులు (జ్యూడీషియల్) కె.అనంత పద్మనాభస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదీ సైఫ్–ఐ విజన్ మధ్య వివాదం... తమతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఐ విజన్ వాటాల బదలాయింపు చేయలేదని, అదే విధంగా ఎన్సీఎల్టీ ఆదేశాల మేరకు నడుచుకోలేదంటూ సైఫ్ మారిషస్ గత ఏడాది ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పెండింగ్లో ఉండగానే, ఈ రెండు కంపెనీల మధ్య ట్రిబ్యునల్ వెలుపల రాజీ కుదిరింది. దీంతో ఐ విజన్ మీడియాపై తాము దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరింది. అయితే దీనిపై రాతపూర్వకంగా పిటిషన్ దాఖలు చేసుకోవాలని సైఫ్ మారిషస్కు ఎన్సీఎల్టీ స్పష్టం చేసింది. దీంతో సైఫ్ పిటిషన్ ఉపసంహరణ నిమిత్తం పిటిషన్ దాఖలు చేసింది. ఇదే సమయంలో రంగ ప్రవేశం చేసిన రవిప్రకాశ్ సైఫ్ మారిషస్ పిటిషన్ ఉపసంహరణకు అనుమతించవద్దంటూ అభ్యంతరాలు లేవనెత్తారు. టీవీ 9లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ అందులో ప్రస్తావించారు. రవిప్రకాశ్ జోక్యంపై అభ్యంతరాలు... రవిప్రకాశ్ దాఖలు లేవనెత్తిన ఈ అభ్యంతరాలపై అటు సైఫ్ మారిషస్, ఐ విజన్ మీడియా, ఇటు ఏబీసీఎల్లు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అసలు తమ మధ్య లావాదేవీల్లో రవిప్రకాశ్కు ఏమాత్రం సంబంధం లేదని తెలిపాయి. సంబంధం లేని వ్యక్తి లేవనెత్తే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాయి. అందరి వాదనలు విన్న ట్రిబ్యునల్ సభ్యులు అనంత పద్మనాభస్వామి సైఫ్ మారిషస్ పిటిషన్ ఉపసంహరణకు అనుమతిచ్చారు. చట్ట ప్రకారం పిటిషన్ను ఉపసంహరించుకునే హక్కు పిటిషనర్కు ఉందన్నారు. సైఫ్–ఐ విజన్లు రాజీకొచ్చిన నేపథ్యంలో ఈ పిటిషన్ను పెండింగ్లో ఉంచాల్సిన అవసరం లేదని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే సంబంధం లేని వ్యక్తి లేవనెత్తిన అభ్యంతరాల ఆధారంగా పిటిషన్ను పెండింగ్లో ఉంచాల్సిన అవసరం లేదని వీఎల్ఎస్ వర్సెస్ సౌత్ ఎండ్ ఇన్ఫ్రా కేసులో ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన తీర్పును ఉదహరించారు. -
ఎన్సీఎల్టీలో రవిప్రకాష్కు చుక్కెదురు!
సాక్షి, హైదరాబాద్ : నిధుల మళ్లింపు, ఫోర్జరీకి పాల్పడి అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ మరింత చిక్కుల్లో పడ్డారు. ఇటీవల ఆయన ముందుస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టి వేయగా.. తాజగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్(ఎన్సీఎల్టీ)లో చుక్కెదురైంది. ఎన్సీఎల్టీలో ఏబీసీఎల్కు వ్యతిరేకంగా సైఫ్ మరిషస్ కంపెనీ వేసిన పిటిషన్ను అడ్డుపెట్టుకుని టీవీ9 యాజమన్య బదిలీని అడ్డుకోవాలని రవిప్రకాశ్ ప్రయత్నించారు. అయితే రెండు కంపెనీల మధ్య వివాదం ముగిసి సయోద్య కుదరడంతో ఏబీసీఎల్పై మారిషస్ కంపెనీ వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుంది. పిటిషన్ను వెనక్కి తీసుకోవాడాన్ని ఎన్సీఎల్టీ కూడా ఆమోదించింది. దీంతో రవిప్రకాశ్ పన్నిన వ్యూహానికి బ్రేక్ పడింది. అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాష్ పోలీసులు ఇచ్చిన 41ఏ సీఆర్పీసీ నోటీసులకు స్పందించలేదు. ఇప్పటికే ఆయనపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. రవిప్రకాష్ జాడకోసం సైబర్క్రైం పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల ఓ వీడియో సందేశం ద్వారా టీవీ9 నూతన యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు చేసిన రవిప్రకాశ్.. ఎన్సీఎల్టీలో కేసు నడుస్తుండగా తనపై పోలీసులు ఎలా కేసు నమోదు చేస్తారన్న విషయం తెలిసిందే. -
పోలీసులు అరెస్ట్ చేస్తారని.. గోడ దూకి పారిపోయా
సాక్షి, హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్కు హైకోర్టులో చుక్కెదురైంది. బంజారాహిల్స్ పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి రావడంతో గోడ దూకి పారిపోయానని, పోలీసులు అరెస్టు చేయకుండా తనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలన్న రవిప్రకాశ్ అభ్యర్థనను తోసిపుచ్చింది. పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాశ్ దాఖలు చేసుకున్న మూడు పిటిషన్లను కొట్టేసింది. రవిప్రకాశ్ విషయంలో సీఆర్పీసీ సెక్షన్ 41–ఏ ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు స్పష్టం చేసింది. ఇప్పటికే పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 41–ఏ కింద నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ. రాజశేఖర్రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏబీసీపీఎల్ కార్పొరేషన్ యాజమాన్యం మార్పిడి, వాటాల బదిలీ తదితర అంశాలపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో కేసులు పెండింగ్లో ఉన్న విషయాన్ని పోలీసులు పట్టించుకోకుండా తనపై కేసులు నమోదు చేశారని, ఈ కేసుల నమోదు వెనుక దురుద్దేశాలున్నాయని, అందువల్ల తనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రవిప్రకాశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి విచారణ జరిపారు. కేసుల నమోదు వెనుక దురుద్దేశాలున్నాయి... ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది దల్జీత్సింగ్ అహ్లువాలియా వాదనలు వినిపిస్తూ రవిప్రకాశ్ను అరెస్ట్ చేసి తీరాలన్న ఉద్దేశంతో పోలీసులు ఉన్నారని తెలిపారు. అందుకే ఒకే అంశానికి సంబంధించి మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారన్నారు. పిటిషనర్ కొన్ని డాక్యుమెంట్లను ఫోర్జరీ చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారని, వాస్తవానికి ఆ డాక్యుమెంట్లు గతేడాది ఏప్రిల్ 18న జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు సమర్పించారని తెలిపారు. దాదాపు ఏడాది తరువాత పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఎన్సీఎల్టీ ముందు విచారణలో ఉన్న వ్యవహారంలో కేసు నమోదు చేయడం దురుద్దేశాలతో కూడుకున్నదని వివరించారు. దురు ద్దేశాలతో కేసు నమోదు చేసినప్పుడు, ముందస్తు బెయిల్ మంజూరు చేయవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని తెలిపారు. ఈ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.ప్రతాప్రెడ్డి జోక్యం చేసుకుంటూ పిటిషనర్కు ఇప్పటికే సీఆర్సీపీ సెక్షన్ 41–ఏ, సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసినా రవిప్రకాశ్ స్పందించలేదన్నారు. ముందు ఆయనను పోలీసుల ముందు హాజరై విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అందుకే అప్పుడు గోడ దూకి పారిపోయారు... ఈ సమయంలో అహ్లువాలియా స్పందిస్తూ ఇటీవల టీవీ9 స్టూడియాలోకి వచ్చిన పోలీసులు రవిప్రకాశ్ అరెస్ట్కు ప్రయత్నించడంతో ఆయన గోడ దూకి పారిపోయారని తెలిపారు. ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ల గురించి పోలీసులు కేసు పెట్టారని, అవి ఫోర్జరీవో కావో తేల్చాల్సింది ఎన్సీఎల్టీ తప్ప పోలీసులు కాదని వివరించారు. ఉద్దేశపూర్వకంగా పోలీసులు ఈ వాస్తవాలను తొక్కిపెట్టారని తెలిపారు. ఇదే సమయంలో రవిప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదన్నారు. అందువల్ల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని, ఏ షరతులు విధించినా కట్టుబడి ఉంటామన్నారు. బయట ఉండి సాక్షులను ప్రభావితం చేస్తున్నారు... అయితే ఈ వాదనను ప్రతాప్రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కావాలంటే కేసును 15 రోజులకు వాయిదా వేయవచ్చునని, ఈలోగా పిటిషనర్ను పోలీసులు ముందు హాజరై విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వొచ్చునన్నారు. రవిప్రకాశ్ బయట ఉండి సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారని, ఎటువంటి వాంగ్మూలాలు ఇవ్వొద్దని ఒత్తిడి చేస్తున్నారని, ఇందుకు వాట్సాప్ను ఉపయోగిస్తున్నారని ఆయన కోర్టుకు నివేదించారు. తామేమీ రవిప్రకాశ్ విషయంలో కఠిన చర్యలేవీ తీసుకోబోమన్నారు. దీనికి అహ్లువాలియా స్పందిస్తూ, ఆ 15 రోజుల వరకైనా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ముందు విచారణకు వస్తే ఆ తరువాత బెయిల్ గురించి ఆలోచించవచ్చునని ప్రతాప్రెడ్డి చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాశ్ దాఖలు చేసిన మూడు పిటిషన్లను కొట్టేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రవిప్రకాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. పారిపోయి విలువల గురించి లెక్చర్! టీవీ9 వాటాల వివాదంలో ఫోర్జరీ, డేటా చౌర్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్... సమాజం, విలువలంటూ మరోసారి ఉపదేశమిచ్చారు. కేసులకు భయపడి తెలంగాణ వదిలి పారిపోయిన ఆయన.. పోలీసులపై, ఈ వివాదంపై వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై అక్కసు వెళ్లగక్కారు. తనపై వస్తున్న ఆరోపణలు, నమోదైన కేసుల నేపథ్యం గురించి బుధవారం రవిప్రకాశ్ మీడియాకు మరో వీడియోను విడుదల చేశారు. తనకు, కొత్త యాజమాన్యానికి ఎక్కడ విభేదాలు వచ్చాయి? అవి ఎలా మొదలయ్యాయి? అంటూ వీడియోలో సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు. తనకు, సిటీనటుడు శివాజీ మధ్య తలెత్తిన వాటాల వివాదం ఎన్సీఎల్టీ పరిధిలో ఉండగా పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఈ విషయంలో తెలంగాణ పోలీసులది అజ్ఞానమని అక్కసువెళ్లగక్కారు. కొన్ని మీడియా సంస్థలు తనను ఉగ్రవాదితో పోలుస్తూ పారిపోయానంటూ వార్తలు రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మీడియాకు పాఠాలు కూడా చెప్పారు. వీడియో సాంతం.. విలువలు, సమాజహితం అంటూ పదేపదే వల్లె వేసిన రవిప్రకాశ్... ఇంతకీ తానెందుకు పారిపోయానన్నది మాత్రం చెప్పలేదు. కోర్టులపై, చట్టాలపై విజ్ఞత ప్రదర్శిస్తూనే పోలీసులను ఎందుకు తప్పుబడుతున్నదీ మాత్రం చెప్పలేకపోయారు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. మధ్యలో మీడియా మీద పడటం, వార్తల విషయంలో హితబోధ చేస్తూ అక్కసును బయటపెట్టుకున్నారు. వీడియోను పరిశీలిస్తున్న పోలీసులు.. రవిప్రకాశ్ వీడియో బయటకు రాగానే సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వీడి యోను ఎక్కడ షూట్ చేశారు, ఎప్పుడు అప్లోడ్ చేశారో గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే సిమ్కార్డులు, ఫోన్లు మారుస్తూ పోలీసులకు తన జాడ చిక్కకుండా జాగ్రత్త పడుతున్న రవిప్రకాశ్కు ఈ వీడియో తీయడంలో ఎవరైనా సాయం చేశారా? అతని ఫోన్ నుంచే అప్లోడ్ చేశారా? అనే విషయాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే వారు పురోగతి సాధించినట్లు సమాచారం. -
రవిప్రకాశ్ కోసం మూడు బృందాలు
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, డేటాచౌర్యంతోపాటు పలు కేసులు ఎదుర్కొంటున్న టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కోసం తెలంగాణ పోలీసులు గాలింపును తీవ్రతరం చేశారు. అతని ఆచూకీ కోసం ఇప్పటికే మూడు బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులతోపాటు టాస్క్ఫోర్స్ పోలీసుల బృందం రవిప్రకాశ్ జాడ కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. రవిప్రకాశ్కు ఏపీలోని కొందరు రాజకీయ నాయకులు ఆశ్రయమిచ్చినట్లు సమాచారం. వారి వద్దే సినీనటుడు శొంఠినేని శివాజీ కూడా ఉన్నట్లు తెలిసింది. ప్రముఖుల అండతోనే శివాజీ తెలంగాణ పోలీసుల విచారణకు హాజరుకాకుండా కోర్టులో మాత్రం ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు వేస్తూ వస్తున్నారు. ఇందుకోసం లాయర్లు, అనుచరులతో మాట్లాడేందుకు పదేపదే సిమ్కార్డులు మారుస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వాట్సాప్ కాల్స్ను కూడా వాడుతున్నారని సమాచారం. పోలీసులు అతని కాల్స్పై నిఘా పెట్టారు. అయితే, ఆయన నిత్యం ఫోన్లు మారుస్తున్నట్లు గుర్తించారు. ఎవరి కేసు వారిదే..! రవిప్రకాశ్ కేసుల విషయంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. రెండు కేసుల్లో ఒకటి హైదరాబాద్, మరొకటి సైబరాబాద్లో నమోదయ్యాయి. శివాజీతో కలసి నకిలీ కొనుగోలు పత్రాల సృష్టి, నిధుల మళ్లింపు, కుట్ర, నకిలీపత్రాల సృష్టి, సంస్థ కార్యదర్శి సంతకం ఫోర్జరీ తదితర ఆరోపణలపై రవిప్రకాశ్పై ఐటీ యాక్ట్, 66, 72, ఐపీసీ 406, 420, 467, 469, 471 సెక్షన్ల కింద కేసులు సైబరాబాద్ పోలీసులు నమోదు చేశారు. టీవీ9 లోగో, కాపీరైట్స్, ట్రేడ్మార్కులు 2018 మే నెలలో మీడియా నెక్స్ట్ ఇండియా కంపెనీకి బదలాయించడంపై బంజారాహిల్స్ పోలీస్ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో ఐపీసీ 467, 420, 409, 406, 120 (బీ) సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. రెండింటిలో నిందితుడు ఒకరే అయినా కేసుల నేపథ్యం వేర్వేరు కావడంతో ఎవరి దర్యాప్తును వారే కొనసాగించాల్సి వస్తోంది. గతంలో ఐటీ గ్రిడ్ వ్యవహారంలో మాదాపూర్, ఎస్సార్నగర్ ఠాణాలలో ఫిర్యాదులు అందాయి. నేరస్వభావం ఒకటే కావడంతో ఈ రెండు కేసులను కలిపి విచారించేందుకు పోలీసు విభాగం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండాపోయింది. రవిప్రకాశ్ కోసం పోలీసులు టాస్క్ఫోర్స్ను కూడా రంగంలోకి దించినట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఉద్యోగి ఎంకేవీఎన్ మూర్తి, మోజో టీవీ చైర్మన్ హరికిరణ్లు పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నారు. రవిప్రకాశ్ విషయంలో పాత ఉద్యోగులను కూడా పోలీసులు పిలిపించి కూపీలాగుతున్నారు. అవకతవకల విషయంలో పలు వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ముందస్తు బెయిలివ్వండి
సాక్షి, హైదరాబాద్: పరారీలో ఉన్న టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ తనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన మూడు వేర్వేరు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఆయన మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం (22న) హైకోర్టు విచారణ జరపనుంది. ఏబీసీపీఎల్ కార్పొరేషన్ యాజమాన్య మార్పిడి, వాటాల బదిలీ తదితర అంశాలపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో కేసులు పెండింగ్లో ఉన్న విషయాన్ని పోలీసులు పట్టించుకోకుండా తనపై కేసులు నమోదు చేశారని రవిప్రకాశ్ తన పిటిషన్లలో పేర్కొన్నారు. ఎన్సీఎల్టీలో ఉన్న వివాదం గురించి తాను పోలీసులకు తెలియచేశానన్నారు. ఏబీసీపీఎల్ను అలందా మీడియాకు అప్పగించే విషయంలో ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండా ఉండేందుకే తనపై కేసులు నమోదు చేశారన్నారు. తనపై కేసులు నమోదు చేయడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయన్నారు. తనను అరెస్ట్ చేయడం ద్వారా ఒత్తిడి తెచ్చి ఎన్సీఎల్టీ ముందున్న కేసులను కొనసాగించకుండా చేయడమే ఈ కేసుల వెనకున్న ఉద్దేశమన్నారు. కొత్త యాజమాన్యం తనపై చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని తెలిపారు. ఒకే అంశానికి సంబంధించి పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం చెల్లదని ఆయన అన్నారు. ఎన్సీఎల్టీలో పెండింగ్లో ఉన్న వివాదానికి సంబంధించి కేసులు నమోదు చేయడం సరికాదని ఆయన తన పిటిషన్లలో పేర్కొన్నారు. పాత తేదీతో డాక్యుమెంట్ సృష్టించారని పోలీసులు చెబుతున్నారని, వాస్తవానికి ఆ విషయాన్ని ఎన్సీఎల్టీ తేల్చాల్సి ఉందన్నారు. ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు తనకు ఏ షరతులు విధించినా అభ్యంతరం లేదన్నారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని రవిప్రకాశ్ తెలిపారు. -
మరోసారి హైకోర్టుకు రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన మూడు వేర్వేరు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఆయన మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం హైకోర్టు విచారణ జరపనుంది. ఏబీసీపీఎల్ కార్పొరేషన్ యాజమాన్యం మార్పిడి, వాటాల బదిలీ తదితర అంశాలపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో కేసులు పెండింగ్లో ఉన్న విషయాన్ని పోలీసులు పట్టించుకోకుండా తనపై కేసులు నమోదు చేశారని రవిప్రకాశ్ తన పిటిషన్లలో పేర్కొన్నారు. ఎన్సీఎల్టీలో ఉన్న వివాదం గురించి తాను పోలీసులకు తెలియచేశానన్నారు. ఏబీసీపీఎల్ను అలందా మీడియాకు అప్పగించే విషయంలో ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండా ఉండేందుకే తనపై కేసులు నమోదు చేశారని తెలిపారు. తనపై కేసులు నమోదు చేయడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయన్నారు. తనను అరెస్ట్ చేయడం ద్వారా ఒత్తిడి తెచ్చిన ఎన్సీఎల్టీ ముందున్న కేసులను కొనసాగించకుండా చేయడమే ఈ కేసుల నమోదు వెనుకున్న ఉద్దేశమన్నారు. కొత్త యాజమాన్యం తనపై చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని తెలిపారు. ఒకే అంశానికి సంబంధించి పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం చెల్లదన్నారు. ఎన్సీఎల్టీలో పెండింగ్లో ఉన్న వివాదానికి సంబంధించి కేసులు నమోదు చేయడం సరికాదని ఆయన తన పిటిషన్లలో పేర్కొన్నారు. పాత తేదీతో డాక్యుమెంట్ సృష్టించారని పోలీసులు చెబుతున్నారని, వాస్తవానికి ఆ విషయాన్ని ఎన్సీఎల్టీ తేల్చాల్సి ఉందన్నారు. వరుసగా కేసులు నమోదు చేస్తూ తన చుట్టూ ఉచ్చుబిగిస్తున్నారని, తద్వారా అరెస్ట్ను తనకు రుచి చూపించాలన్న కృతనిశ్చయంతో పోలీసులు ఉన్నారని తెలిపారు. ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయవచ్చునన్నారు. ముందస్తు బెయిలు, తాత్కాలిక ముందస్తు బెయిల్ ఏ ఏ సందర్భాల్లో ఇవ్వొచ్చో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని తెలిపారు. ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు తనకు ఏ షరతులు విధించినా అభ్యంతరం లేదన్నారు. తనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేస్తే, దర్యాప్తునకు పూర్తి సహకరిస్తానని తెలిపారు. కాగా నిధుల మళ్లింపు, ఫోర్జరీకి పాల్పడి ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్పై సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. రవిప్రకాశ్ పాస్పోర్టును పోలీసులు సీజ్ చేశారు. -
నోటీసులివ్వగానే పరార్
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసు. ఈ కేసులో నిందితులందరికీ నోటీసులు జారీ చేసినా, దాదాపు అందరూ పోలీసుల విచారణకు వెంటనే రాలేదు. రేపని.. మాపని.. ఆరోగ్యం బాగాలేదని.. అందుబాటులో లేమంటూ.. రకరకాల కారణాలు చెప్పి విచారణను వీలైనంత జాప్యం చేశారు. ఈలోగా కేసు గురించి అంతా మర్చిపోయారు. ఇది ఇలాంటి కేసుల్లో ఇరుక్కునే వారికి ప్రాథమిక పాఠంగా మారింది. విచారణను వీలైనంత జాప్యం చేస్తే.. కేసు గురించి అంతా మర్చిపోతారన్న సంకేతాలు బలంగా వెళ్లాయి. అది మొదలు.. ఇలాంటి కేసుల్లో చిక్కుకున్న వారెవరూ పోలీసు విచారణ అంటే పెద్దగా బెదిరిపోవడం లేదు. వెసులుబాటే ఆసరా.. ఓటుకు కోట్లు కేసులో నిందితుడు మత్తయ్య నుంచి ఫోర్జరీ కేసులో ఇరుక్కున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ వరకు అందరూ ఇదే పోకడ అనుసరిస్తుండటం గమనార్హం. విచిత్రంగా ఓటుకు కోట్లు, ఐటీ గ్రిడ్ డేటా చౌర్యం కేసులు ఆరంభంలో తీవ్ర సంచలనం రేపాయి. కానీ, కాలక్రమంలో రెండు కేసుల్లో ఇంత వరకూ పెద్దగా పురోగతి లేకపోవడం, నత్తకు తాతలా దర్యాప్తు సాగడం చర్చనీయాంశంగా మారింది. ఈ మూడు ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాలే కావడంతో పోలీసులు నిబంధనల ప్రకారం.. సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేస్తున్నారు. వీటిని అందుకున్న నిందితులు కేసు దర్యాప్తును ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో విచారణకు డుమ్మా కొడుతున్నారు. తెలంగాణలో ఉంటే పోలీసులు ఎలాగైనా అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో పొరుగు రాష్ట్రాలకు పారిపోతున్నారు. వీరంతా ఏపీకి వెళ్లడం, అక్కడి అధికార టీడీపీ నిందితులకు మద్దతు పలకడం విశేషం. ఒకవేళ తెలంగాణ పోలీసులు వెళ్లినా.. వారికి నిందితులను అరెస్టు చేయడం కష్టం అవుతుండటంతో ఈ కేసుల్లో విపరీతమైన జాప్యం నెలకొంటోంది. మత్తయ్య బాటలో ఏపీకి పారిపోయిన ఐటీ గ్రిడ్ అశోక్, రవిప్రకాశ్ ఆచూకీని ఇంతవరకూ పోలీసులు కనిపెట్టలేకపోయారు. వాస్తవానికి క్లిష్టమైన కేసుల చిక్కముడులు విప్పడంలో, వివిధ నేరాల్లో నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చేయడంలో రాష్ట్ర పోలీసులు అనేక ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటున్నారు. కానీ, ఈ మూడు కేసుల్లో మాత్రం దర్యాప్తు తీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా సాగడం గమనార్హం. -
ఆస్ట్రేలియాలో రవిప్రకాశ్!
హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఆస్ట్రేలియాలో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. టీవీ9 కాపీ రైట్స్, ట్రేడ్మార్క్లను కేవలం రూ. 99 వేలకే మీడియా నెక్స్ట్ ఇండియా కంపెనీకి బదలాయించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి అసైన్డ్ డీడీలు అమలు చేశారంటూ అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్పై కేసు నమోదవడం తెలిసిందే. ఈ కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసినా రవిప్రకాశ్ హాజరుకాకపోవడంతో ఆయన కోసం గాలింపు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలో ఉన్నట్లు రెండు రోజుల క్రితం గుర్తించినప్పటికీ పోలీసులు అక్కడికి వెళ్లే ముందురోజే రవిప్రకాశ్ జారుకున్నట్లు సమాచారం. దీంతో ఆయన కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టగా రవిప్రకాశ్ ఆస్ట్రేలియాలో తలదాచుకున్నట్లు తెలిసింది. పోలీసులు ఇప్పటికే బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని రవిప్రకాశ్ ఇంటితోపాటు ఆయన సన్నిహితుల ఇళ్ల వద్ద నిఘా ఉంచారు. మరోవైపు టీవీ9 వాటాల వ్యవహారంలో తప్పుడు పత్రాలు సృష్టించడంతోపాటు సంతకం ఫోర్జరీ చేశారన్న కేసులో నిందితులైన రవిప్రకాశ్, నటుడు శివాజీ అచూకీ కోసం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, టాస్క్ఫోర్స్ పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. రవిప్రకాశ్, శివాజీల కోసం లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే రవిప్రకాశ్ ఇప్పటికే ఆస్ట్రేలియాకు జారుకున్నట్లు పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఈ నోటీసుల వల్ల ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుందనేది తెలియాల్సి ఉంది. పోలీసుల ముందు హాజరైన హరికిరణ్... టీవీ9 కాపీరైట్స్, ట్రేడ్మార్క్లను అక్రమంగా బదలాయించుకున్న కేసులో మీడియా నెక్స్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత హరికిరణ్ చెరెడ్డిపై కేసు నమోదవడంతో ఆయన శనివారం బంజారాహిల్స్ పోలీసుల ముందు హాజరయ్యారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ఎప్పుడు పిలిచినా హాజరవుతానని లిఖితపూర్వక లేఖను పోలీసులకు అందించారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఎవో ఎంవీకేఎన్ మూర్తి ఇప్పటికే సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసుల విచారణకు హాజరవుతున్నారు. రవిప్రకాశ్ అడ్వొకేట్ ఇంట్లో సోదాలు.. టీవీ9 వాటాల వ్యవహరంలో తప్పుడు పత్రాలు సృష్టించారంటూ రవిప్రకాశ్పై నమోదైన కేసులో ఆయన అడ్వొకేట్ జె.కనకరాజ్ ఇంట్లో సైబరాబాద్ పోలీసులు శనివారం సోదాలు చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 3లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాలనీ ప్లాట్ నంబర్ 40లోని ఆయన ఇంట్లో తనిఖీలు చేసి కీలక సాక్ష్యాలు సేకరించినట్లు తెలిసింది. వడదెబ్బ వల్ల విశ్రాంతి తీసుకుంటున్నా: శివాజీ తమిళనాడు, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వల్ల వడదెబ్బ తగలడంతో విశ్రాంతి తీసుకుంటున్నానని, తాను ఎక్కడికీ పారిపోలేదని శనివారం విడుదల చేసిన వీడియోలో శివాజీ పేర్కొన్నాడు. రవిప్రకాశ్కు, తనకు మధ్యలో ఉన్న చిన్న పంచాయితీని కొన్ని మీడి యా సంస్థలు చిలువలు పలువలుగా చేసి చూపిస్తున్నాయని ఆరోపించారు. ఈ విషయంలో పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ‘ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా కేసు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. పోరాడతా. మరికొంతకాలం విశ్రాంతి తీసుకొని బయటకు వస్తా. న్యాయం దొరకడం ఆలస్యం కావచ్చు కానీ చివరకు గెలుపు మాత్రం న్యాయానిదే’అని శివాజీ అన్నాడు. తెలంగాణ పోలీసులు, నాయకులతోపాటు ఏపీ నాయకులపై పలు ఆరోపణలు చేసిన శివాజీ... తాను ఎక్కడ ఉన్నదీ వీడియోలో వెల్లడించకపోవడం గమనార్హం. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : రవిప్రకాశ్ ఆస్ట్రేలియా జారుకున్నట్లు పోలీసుల అనుమానం -
‘వామ్మో! రవిప్రకాశూ నువ్వు మామూలోడివి కాదు’
సాక్షి, హైదరాబాద్: నిధుల మళ్లింపు, ఫోర్జరీకి పాల్పడి అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా మరోసారి మండిపడ్డారు. వామ్మో రవి ప్రకాశూ నువ్వు మామూలోడివి కాదంటూ ఆయన అక్రమాల పుట్టను భట్టబయలు చేశారు. ‘‘బ్రోకర్ శివాజీని పట్టుకుని పోలీసులు తమ స్టైల్లో ప్రశ్నిస్తే గరుడ పురాణం స్క్రిప్ట్ ఎవరిచ్చారో కక్కేస్తాడు. అది మీడియా ‘నయీం’ పనే అని తేలుతుంది. ఈ నేరాలు విచారించాలంటే స్పెషల్ కోర్టులు కావాలి. 25 ఏళ్ల క్రితం వేయి జీతానికి పనిచేసినోడు వందల కోట్లు ఎలా పోగేశాడో తేల్చాలి. క్రీ.శ.193లో రోమన్ చక్రవర్తి పెర్టినాక్స్ను అతని సైన్యమే హతమార్చి సామ్రాజ్యాన్ని వేలంలో అమ్మేశారట. రవిప్రకాష్ దాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చాడు. టీవీ9 లోగోలను రూ.99 వేలకు తన మోజోటివీకే విక్రయించి కార్పోరేట్ రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాడు. వామ్మో!రవిప్రకాశూ నువ్వు మామూలోడివి కాదు’’ అంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. కాగా అంతకుముందు కూడా రవిప్రకాశ్పై విజయసాయి రెడ్డి ట్విట్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ‘‘బాధితులు పెద్ద సంఖ్యలో టీవీ9 కొత్త మేనేజ్మెంటుకు తమ గోడు వెల్లబోసుకుంటున్నారట’’ అంటూ ట్విటర్లో ఆరోపించారు. క్రీ.శ.193లో రోమన్ చక్రవర్తి పెర్టినాక్స్ను అతని సైన్యమే హతమార్చి సామ్రాజ్యాన్ని వేలంలో అమ్మేశారట.రవిప్రకాష్ దాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చాడు.టీవీ9 లోగోలను రూ.99 వేలకు తన మోజోటివీకే విక్రయించి కార్పోరేట్ రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాడు. వామ్మో!రవిప్రకాశూ నువ్వు మామూలోడివి కాదు. — Vijayasai Reddy V (@VSReddy_MP) 18 May 2019 -
నిందితులకు షెల్టర్జోన్గా అమరావతి
సాక్షి, అమరావతి: సంచలనం రేకెత్తించిన కీలక కేసుల్లో నిందితులకు అమరావతి షెల్టర్ జోన్గా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో అడ్డగోలుగా దొరికిపోయి, కేసుల్లో చిక్కుకున్న నిందితులు ఆంధ్రప్రదేశ్లో దాగుడుమూతలు ఆడుతున్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో వారికి ఉన్న సన్నిహిత సంబంధాలే కారణమన్నది బహిరంగ రహస్యం. ఓటుకు నోటు కేసు, డేటా స్కామ్, టీవీ 9కు సంబంధించిన చీటింగ్ కేసు వంటి వాటిలో సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికి పోయిన వారికి చంద్రబాబు అభయం ఇచ్చి ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలున్నాయి. చంద్రబాబు ప్రమేయం ఉన్న కేసుల నుంచి, తన ప్రయోజనం కోసం పనిచేసే వారి కేసుల వరకు నిందితులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రీకరించేలా పరిణమిస్తున్నాయి. అనేక కేసుల్లో నింది తులను కాపాడేందుకు ప్రయత్నాలు చేసినట్టుగానే తాజాగా టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, ఆయన సన్నిహితుడైన సినీ నటుడు శివాజీలకు ఏపీలో షెల్టర్ ఇచ్చినట్టు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. పరారీలో ఉన్న రవిప్రకాశ్పై ఇప్పటికే ఉన్న ఫోర్జరీ కేసుతోపాటు నిధుల దుర్వినియోగంపై తెలంగాణా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. రవిప్రకాశ్, ఆయన సన్నిహితుడు శివాజీలు టీడీపీ పెద్దల సంరక్షణలో విజయవాడ, ప్రకాశం జిల్లాలో ఉన్నట్టు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు. సీఎం సొంత సామాజికవర్గానికి చెందిన వీరిని ప్రకాశం జిల్లాలోని ఒక రిసార్ట్స్లోను, మరో ఫామ్హౌస్లోను రెండు రోజుల క్రితం వరకు సకల సౌకర్యాలతో సాకినట్టు తెలంగాణ పోలీసులకు సమాచారం అందింది. ప్రస్తుత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి సంరక్షణలోనే రవిప్రకాశ్ ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. శివాజీకి కూడా విజయవాడ, ప్రకాశం జిల్లాల్లో షెల్టర్ ఇచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే తనపై పోలీసులు సీఆర్పీసీ 154 కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను (భోజన విరామం) విచారణకు చేపట్టాలన్న రవిప్రకాశ్ తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెల్సిందే. ఇది ఇలా ఉంటే అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ విచారణకు హాజరయ్యేందుకు మరో పది రోజులు గడువు కావాలంటూ రెండు రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ మెయిల్ పంపించడం గమనార్హం. ఈ కేసుతో సంబంధం ఉన్న సినీనటుడు శివాజీ కూడా తనకు ఆరోగ్యం సరిగా లేదని మెయిల్ పంపించారు. అయితే వీరిద్దరి ఈ మెయిల్స్పై సంతృప్తి చెందని తెలంగాణ పోలీసులు వారు ఎక్కడ ఉన్నా అదుపులోకి తీసుకునేందుకు రంగంలోకి దిగడం గమనార్హం. ఇప్పటికే రెండు పర్యాయాలు రవిప్రకాశ్కు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెల్సిందే. రవిప్రకాశ్ అరెస్టుకు రంగం సిద్ధమైన తరుణంలో ఆయన్ను కాపాడేందుకు నేరుగా ఏపీ సీఎం చంద్రబాబు పావులు కదుపుతుండటం విమర్శలకు తావిస్తోంది. రవిప్రకాశ్ అరెస్టు కాకుండా చూడటంతో పాటు ఆయనను ఈ కేసు నుంచి తప్పించేందుకు చంద్రబాబు నేరుగా రామోజీరావును కలవడం కలకలం రేపుతోంది. తన రాజగురువు రామోజీరావు ద్వారా టీవీ 9 యాజమాన్యానికి చెందిన రామేశ్వర్కు నచ్చజెప్పేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికీ దొరకని అశోక్ ఆచూకీ.. తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ అడ్డగోలుగా డేటా స్కామ్కు పాల్పడిన వ్యవ హారంలో ప్రధాన పాత్రధారి ఐటీ గ్రిడ్స్ ఎండీ దాకవరపు అశోక్ ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. అశోక్ తెలంగాణ పోలీసులకు చిక్కితే ఆంధ్రప్రదేశ్లోని పెద్దల బండారం బయట పడుతుందనే భయంతో అతన్ని చంద్రబాబు సర్కారే కాపాడుతోందనే అనుమానాలున్నాయి. ఆధార్ డేటాబేస్కు ఏపీ, తెలంగాణకు ప్రజల 7,82,21,397 రికార్డులు లింక్ అయ్యాయని, ఆధార్తోపాటు ప్రజల వ్యక్తిగత సమాచారం కూడా చోరీకి గురైనట్టు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) నిగ్గు తేల్చి, ఇప్పటికే ప్రా«థమిక రిపోర్టు ఇచ్చింది. అశోక్ను కాపాడేందుకు ఏపీఎస్పీ 6 బెటా లియన్తోపాటు ఇతర రహస్య ప్రాంతాలకు తరలిస్తూ షెల్టర్ ఇస్తున్నట్టు సమాచారం. అశోక్ తెలంగాణ పోలీసులకు దొరక్కుండా ఏపీ సర్కార్ షెల్టర్ ఇవ్వడంతోపాటు ఇంటె లిజెన్స్కు చెందిన ఇద్దరు గన్మెన్లను కూడా ఇచ్చి వీఐపీ భద్రత కల్పించినట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఓటుకు నోటు కేసులో మత్తయ్యకు షెల్టర్ తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఓటుకు కోట్లు వ్యవహారంలో అడ్డంగా దొరికేసిన చంద్రబాబు..ఆ కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీకి చెందిన జెరుసలేం మత్తయ్యకు అప్పట్లో విజయవాడలో షెల్టర్ ఇచ్చారు. ఓటుకు కోట్లు కేసును రాజకీయం చేసి దాని నుంచి తప్పించుకునేలా ఏపీలోనూ చంద్రబాబు కేసులు పెట్టించి ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్)ను ఏర్పాటు చేసి అది కూడా రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం గమనార్హం. గరుడ పురాణం శివాజీకి దన్ను ఇటీవల బీజేపీ, వైఎస్సార్సీపీలపై అనేక కట్టుకధలు అల్లిన గరుడ పురాణం సృష్టికర్త శివాజీ కొంతకాలం పాటు అజ్ఞాతంలో వెళ్లిపోయి ఎన్నికల సమయంలో ప్రత్యక్షమయ్యారు. చంద్రబాబుకు నమ్మిన బంటులా వ్యవహరిస్తున్న సినీనటుడు శివాజీ గరుడ పురాణం స్క్రిప్ట్ అంతా టీడీపీ పెద్దల కనుసన్నల్లో ఒక మంత్రి సహకారంతో సిద్ధం చేసినట్టు ప్రచారం జరిగింది. రాష్ట్రంలో రాజకీయపరమైన అనిశ్చితిని కల్పించేలా, ప్రతిపక్షం, కేంద్ర ప్రభుత్వంపైన అభూతకల్పనలతో ఆయన చెప్పిన గరుడ పురాణం గుట్టు విప్పేలా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించాలన్న డిమాండ్ రావడంతో ముందు జాగ్రత్తగా ఆయన అదృశ్యమయ్యారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరగబోతోందని ముందే చెప్పిన శివాజీ ఆ విషయం ఎలా గుర్తించారు? ఆయనకు టీడీపీ పెద్దలు ముందే లీకులు ఇచ్చి చెప్పించి నెపం వేరొకరిపై నెట్టే ప్రయత్నం చేశారా? అనే అనేక ప్రశ్నలకు ఆయన్ను విచారిస్తేనే జవాబులు తెలుస్తాయనే బలమైన వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే విజయవాడలో కొంతకాలం, అమెరికాలో మరికొద్ది రోజులు ఆయన తలదాచుకోవడం వెనుక టీడీపీ పెద్దల దన్ను ఉందనేది బహిరంగ రహస్యం. -
రవిప్రకాశ్ కోసం రామోజీ వద్దకు..
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ కేసును ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు నేరుగా రంగంలోకి దిగారు. రవిప్రకాశ్ అరెస్టు కాకుండా చూడటంతో పాటు ఆయనను ఈకేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఈనాడు’చైర్మన్ రామోజీరావును కలిశారు. విజయవాడ నుంచి హెలికాప్టర్లో నేరుగా ఫిల్మ్సిటీకి వచ్చిన చంద్రబాబు దాదాపు 3గంటల పాటు వివిధ అంశాలపై రామోజీరావుతో చర్చలు జరిపారు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్పై అరెస్ట్ వారెంట్ జారీచేస్తారన్న వార్తల నేపథ్యంలో చంద్రబాబు, రామోజీరావు కలయిక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. టీవీ9 సీఈవోగా తన ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా ప్రాధాన్యత ఇవ్వకుండా వెనకేసుకొచ్చిన రవిప్రకాశ్పై కేసులు వద్దంటూ ఇప్పటికే రెండు, మూడు సార్లు టీవీ9 కొత్త యాజమాన్యానికి చంద్రబాబు సూచించారు. కొత్త యాజమాన్యంలో ముఖ్యుడైన ఓ పారిశ్రామికవేత్తను విజయవాడకు పిలిపించి బెదిరించినట్లు కూడా తెలిసింది. అయినా కొత్త యాజమాన్యం తనమాట ఖాతరు చేయకపోవడంతో నేరుగా రంగంలోకి దిగారు. తను రాజగురు రామోజీరావు ద్వారా కొత్త యాజమాన్యానికి నచ్చజెప్పేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కొత్త యాజమాన్యంలో ప్రధాన భాగస్వామి రామేశ్వరరావుకు రామోజీరావుకు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు.. రామోజీరావు ద్వారా రాయబారం నెరుపుతున్నారు. పరారీలో ఉన్న రవిప్రకాశ్పై ఇప్పటికే ఉన్న ఫోర్జరీ కేసుతోపాటు నిధుల దుర్వినియోగంపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. టీవీ9 నిధులను యథేచ్చగా ఓ టీవీ ఛానల్ ఉద్యోగుల జీతభత్యాలకు, తాను వ్యక్తిగతంగా నడుపుతున్న ఓ పత్రిక ఖర్చులకు వినియోగించినట్లు ఫిర్యాదులున్నాయి. దీంతో రవిప్రకాశ్కు ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతో చంద్రబాబు రంగంలోకి దిగినట్టున్నారని ఓ సీనియర్ పోలీసు అధికారి అన్నారు. చంద్రబాబుకు ఎందుకంత ప్రేమ చంద్రబాబుకు టీవీ9 సీఈవోగా రవిప్రకాశ్ అన్ని రకాలుగా మద్దతు ఇవ్వడంతో పాటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను లక్ష్యంగా చేసుకున్నారు. అవసరమైన సందర్భాలలో రవిప్రకాశ్ ద్వారా టీవీ9ను వాడుకుంటూ.. ప్రత్యక్షంగా, పరోక్షంగా జగన్పై చంద్రబాబు దుష్ప్రచారానికి పాల్పడ్డారు. సీబీఐ దర్యాప్తు సమయంలోనూ జగన్ నివాసమైన లోటస్పాండ్లో స్విమ్మింగ్ పూల్ ఉందంటూ, ఇంట్లో బార్ ఉందంటూ టీవీ9 ద్వారా చంద్రబాబు అసత్య ప్రచారం చేయించారు. రాజకీయంగా ఎదురీదుతున్న సమయంలో తన ప్రత్యర్థి జగన్ను దెబ్బతీయడానికి రవిప్రకాశ్ జరిపిన అసత్య ప్రచారానికి బదులుగా.. ఇప్పుడు ఆయన్ను కాపాడేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రామేశ్వరరావుపై ఒత్తిడి తేవడానికి వీలుగా రామోజీరావును చంద్రబాబు ఎంచుకున్నాడు. అయితే, ఈ విషయంలో రామోజీరావు ఎంతమేరకు సహకరిస్తారన్నది వేచి చూడాల్సిందే. జాతీయ రాజకీయాలపైన చర్చ ఏపీ శాసనసభ ఎన్నికలతో పాటు జాతీయ రాజకీయాలపైన చంద్రబాబు, రామోజీరావు మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో మళ్లీ ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే టీడీపీ వ్యూహం ఎలాగుంటే బాగుంటుందన్న అంశాన్నీ చర్చించినట్లు సమాచారం. ఎన్డీయే నుంచి బయటకు రావడంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని రామోజీరావు అభిప్రాయపడినట్లు తెలిసింది. మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తే కలిసిపోవడమే మంచిదనే అభిప్రాయం వీరిద్దరి మధ్య చర్చల్లో వ్యక్తమైనట్లు సమాచారం. రవిప్రకాశ్కు ఎదురుదెబ్బ టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై పోలీసులు సీఆర్పీసీ 154 కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను (భోజన విరామం) విచారణకు చేపట్టాలన్న ఆయన తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరమేమీ లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. సీఆర్పీసీలోని 154 సెక్షన్ చెల్లుబాటును ప్రశ్నిస్తే.. ఇప్పటికిప్పుడు విచారణ చేయాల్సిన అవసరమేమీ లేదని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. అయితే.. రవిప్రకాశ్పై పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన తరపు న్యాయవాది చెప్పారు. అలాంటి పరిస్థితులు ఉంటే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్న ధర్మాసనం.. విచారణను వచ్చే జూన్కు వాయిదా వేసింది. బుధవారం మధ్యాహ్నం రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఈనాడు’చైర్మన్ రామోజీరావును కలిశారు. విజయవాడ నుంచి హెలికాప్టర్లో నేరుగా ఫిల్మ్సిటీకి వచ్చిన చంద్రబాబు దాదాపు 3గంటల పాటు వివిధ అంశాలపై రామోజీరావుతో చర్చలు జరిపారు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్పై అరెస్ట్ వారెంట్ జారీచేస్తారన్న వార్తల నేపథ్యంలో చంద్రబాబు, రామోజీరావు కలయిక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. టీవీ9 సీఈవోగా తన ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా ప్రాధాన్యత ఇవ్వకుండా వెనకేసుకొచ్చిన రవిప్రకాశ్పై కేసులు వద్దంటూ ఇప్పటికే రెండు, మూడు సార్లు టీవీ9 కొత్త యాజమాన్యానికి చంద్రబాబు సూచించారు. కొత్త యాజమాన్యంలో ముఖ్యుడైన ఓ పారిశ్రామికవేత్తను విజయవాడకు పిలిపించి బెదిరించినట్లు కూడా తెలిసింది. అయినా కొత్త యాజమాన్యం తనమాట ఖాతరు చేయకపోవడంతో నేరుగా రంగంలోకి దిగారు. తను రాజగురు రామోజీరావు ద్వారా కొత్త యాజమాన్యానికి నచ్చజెప్పేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కొత్త యాజమాన్యంలో ప్రధాన భాగస్వామి రామేశ్వరరావుకు రామోజీరావుకు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు.. రామోజీరావు ద్వారా రాయబారం నెరుపుతున్నారు. పరారీలో ఉన్న రవిప్రకాశ్పై ఇప్పటికే ఉన్న ఫోర్జరీ కేసుతోపాటు నిధుల దుర్వినియోగంపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. టీవీ9 నిధులను యథేచ్చగా ఓ టీవీ ఛానల్ ఉద్యోగుల జీతభత్యాలకు, తాను వ్యక్తిగతంగా నడుపుతున్న ఓ పత్రిక ఖర్చులకు వినియోగించినట్లు ఫిర్యాదులున్నాయి. దీంతో రవిప్రకాశ్కు ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతో చంద్రబాబు రంగంలోకి దిగినట్టున్నారని ఓ సీనియర్ పోలీసు అధికారి అన్నారు. చంద్రబాబుకు ఎందుకంత ప్రేమ చంద్రబాబుకు టీవీ9 సీఈవోగా రవిప్రకాశ్ అన్ని రకాలుగా మద్దతు ఇవ్వడంతో పాటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను లక్ష్యంగా చేసుకున్నారు. అవసరమైన సందర్భాలలో రవిప్రకాశ్ ద్వారా టీవీ9ను వాడుకుంటూ.. ప్రత్యక్షంగా, పరోక్షంగా జగన్పై చంద్రబాబు దుష్ప్రచారానికి పాల్పడ్డారు. సీబీఐ దర్యాప్తు సమయంలోనూ జగన్ నివాసమైన లోటస్పాండ్లో స్విమ్మింగ్ పూల్ ఉందంటూ, ఇంట్లో బార్ ఉందంటూ టీవీ9 ద్వారా చంద్రబాబు అసత్య ప్రచారం చేయించారు. రాజకీయంగా ఎదురీదుతున్న సమయంలో తన ప్రత్యర్థి జగన్ను దెబ్బతీయడానికి రవిప్రకాశ్ జరిపిన అసత్య ప్రచారానికి బదులుగా.. ఇప్పుడు ఆయన్ను కాపాడేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రామేశ్వరరావుపై ఒత్తిడి తేవడానికి వీలుగా రామోజీరావును చంద్రబాబు ఎంచుకున్నాడు. అయితే, ఈ విషయంలో రామోజీరావు ఎంతమేరకు సహకరిస్తారన్నది వేచి చూడాల్సిందే. జాతీయ రాజకీయాలపైన చర్చ ఏపీ శాసనసభ ఎన్నికలతో పాటు జాతీయ రాజకీయాలపైన చంద్రబాబు, రామోజీరావు మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో మళ్లీ ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే టీడీపీ వ్యూహం ఎలాగుంటే బాగుంటుందన్న అంశాన్నీ చర్చించినట్లు సమాచారం. ఎన్డీయే నుంచి బయటకు రావడంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని రామోజీరావు అభిప్రాయపడినట్లు తెలిసింది. మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తే కలిసిపోవడమే మంచిదనే అభిప్రాయం వీరిద్దరి మధ్య చర్చల్లో వ్యక్తమైనట్లు సమాచారం. రవిప్రకాశ్కు ఎదురుదెబ్బ టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై పోలీసులు సీఆర్పీసీ 154 కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను (భోజన విరామం) విచారణకు చేపట్టాలన్న ఆయన తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరమేమీ లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. సీఆర్పీసీలోని 154 సెక్షన్ చెల్లుబాటును ప్రశ్నిస్తే.. ఇప్పటికిప్పుడు విచారణ చేయాల్సిన అవసరమేమీ లేదని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. అయితే.. రవిప్రకాశ్పై పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన తరపు న్యాయవాది చెప్పారు. అలాంటి పరిస్థితులు ఉంటే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్న ధర్మాసనం.. విచారణను వచ్చే జూన్కు వాయిదా వేసింది. -
ఆయన ఫోన్లో కూడా దొరకట్లేదంటగా?
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 రవి ప్రకాశ్, సీనీ నటుడు శివాజీపై వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా పలు విమర్శలు, వ్యంగోక్తులు చేశారు. విజిల్ బ్లోయర్స్ యాక్ట్, పీనల్ కోడ్ సెక్షన్ల గురించి ఉపన్యాసాలు దంచిన గరుడ పురాణం శివాజీ నాలుగు రోజులుగా ఎందుకు పరారీలో ఉన్నారని ప్రశ్నించారు. తన జాతకం తానకే తెలిసిపోవడంతో పరారీలో ఉంటున్నారని విమర్శించారు. ‘ రవి ప్రకాశ్ రక్షిస్తాడనుకుంటే ఆయనే రోడ్డునపడ్డాడు. ఫోన్లో కూడా దొరకట్లేదంటగా’ అంటూ వరుస ట్వీట్లతో శివాజీపై విమర్శనాస్త్రాలు సంధించారు. చదవండి : తెల్లకాగితం మీద అగ్రిమెంట్ రాసుకోవడమేంటో? టీవీ 9 వాటాల వ్యవహారంలో సొంత లబ్ధి కోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారని నమోదైన కేసు వ్యవహారంలో శుక్రవారం విచారణకు హాజరు కావాలని సైబర్ క్రైమ్ పోలీసులు టీవీ 9 మాజీ ఫైనాన్స్ డైరెక్టర్ ఎంకేవీఎన్ మూర్తి, రవి ప్రకాశ్, శివాజీలకు నోటీసులు అందించారు. వీరిలో ఎంకేవీఎన్ మూర్తి విచారణకు హాజరుకాగా.. రవిప్రకాశ్, శివాజీ డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. -
అంతా రవిప్రకాశే చేసుకున్నాడా..!
సాక్షి, హైదరాబాద్ : మెరుగైన సమాజం కోసం.. కులం గోడలు కూల్చేద్దాం..! అంటూ భారీ ఆదర్శాలను వల్లెవేస్తూ ఒక సాధాసీదా జర్నలిస్టుగా జీవితం ప్రారంభించిన రవిప్రకాశ్ టీవీ9 సీఈవో స్థాయికి ఎదిగాడు. ఇంటా బయటా ఎన్నో ‘రాజీకీయాలు’ చేశాడు. 8 శాతం వాటాతో 90.5 శాతం షేర్లు కలిగిన అలందా వాటాదారులను నియంత్రించాలని చూశాడు. చివరకు అవమానకర రీతిలో అటు సీఈవో పదవిని ఇటు డైరెక్టర్ పదవిని కోల్పోయాడు. గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకున్నాడు. డెరెక్టర్లను నియమించుకోకుండా, యాజమాన్య బాధ్యతలు నిర్వర్తించకుండా అలందా సంస్థకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని శుక్రవారం సాయంత్రం జరిగిన ఏబీసీఎల్ బ్రాడ్ కాస్టింగ్ డెరెక్టర్లు వెల్లడించారు. సంస్థలో అధికారం చెలాయించే క్రమంలో రవిప్రకాశ్ తన గోతి తనే తవ్వుకున్నాడనే విమర్శలు వినవస్తున్నాయి. (టీవీ9తో రవిప్రకాశ్కు సంబంధం లేదు: డైరెక్టర్లు) ‘50కి పైగా షేర్లున్న వాటాదారుకు యాజమాన్య హక్కులు దఖలు పడాలి. మేమూ అదే చేశాం. సంస్థలో అవకతవకలు చోటుచేసుకున్నాయని తమ దృష్టికి వచ్చిన వెంటనే డైరెక్టర్ల సమావేశం నిర్వహించి మే 8న ఆయనను పదవి నుంచి తొలగించాం. కంపెనీల చట్టం ప్రకారం డైరెక్టర్ల మీటింగ్లో తీసుకున్న నిర్ణయాన్ని షేర్ హోల్డర్ల మీటింగ్లో చర్చించి శుక్రవారం మీడియాకు వెల్లడించాం. వాటార్లందరి అభిప్రాయం మేరకే వారిని తొలగించాం. కానీ, రవిప్రకాశ్ నిన్న టీవీ9 లైవ్లోకొచ్చి తనపై ఎలాంటి ఆరోపణలు లేవని అన్నాడు. ఆరోపణలు లేకుంటే మంచిదే’ అని డెరెక్టర్ సాంబశివరావు అన్నారు. ఇక ఆదిపత్యం చెలాయించే క్రమంలో రవిప్రకాశ్ ఫోర్జరీ సంతకాల కేసులో ఇరుకున్నట్టు తెలుస్తోంది. తన సంతకం ఫోర్జరీ చేశారని కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాలే స్వయంగా ఫిర్యాదు చేసినట్లు డైరెక్టర్లు చెప్పారు. టీవీ9 కొత్త సీఈవోగా మహేంద్ర మిశ్రా, సీఓఓగా గొట్టిపాటి సింగారావును నియమించింది. -
సీఈవో, డైరెక్టర్గా రవి ప్రకాశ్ను తొలగిస్తున్నాం
-
టీవీ9తో రవిప్రకాశ్కు సంబంధం లేదు: డైరెక్టర్లు
సాక్షి, హైదరాబాద్: టీవీ9 సీఈవో, డైరెక్టర్ పదవి నుంచి రవిప్రకాశ్ను తొలగిస్తున్నట్లు ఈ సంస్థ డైరెక్టర్లు ప్రకటించారు. టీవీ9 సంస్థలో చోటుచేసుకున్న కీలక పరిణామాల నేపథ్యంలో బోర్డుసభ్యులు శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. రవి ప్రకాశ్ స్థానంలో కొత్త సీఈవోగా మహేంద్ర మిశ్రాను, సీవోవోగా గొట్టిపాటి సింగారావు నియమిస్తున్నట్లు అలందా మీడియా డైరెక్టర్ ఎస్ సాంబశివరావు ప్రకటించారు. సంస్థలో అవకతవకలు చోటుచేసుకున్నాయని తమ దృష్టికి వచ్చిన వెంటనే డైరెక్టర్ల సమావేశం నిర్వహించి మే 8న ఆయనను పదవి నుంచి తొలగించామని తెలిపారు. 9 నెలల క్రితమే టీవీ9లో 90.5 శాతం వాటాలను ఏవీసీఎల్ నుంచి అలందా మీడియా కొనుగోలు చేసిందని, కొనుగోలు అనంతరం సంస్థలో చాలా అవరోధాలు సృష్టించారని, సంస్థలో 8శాతం వాటా ఉన్న వాళ్లు నియంత్ర చేయాలని చూశారని వెల్లడించారు. డైరెక్టర్ల సమావేశం జరగకుండా రవి ప్రకాశ్, మూర్తి అడ్డుపడ్డారని అన్నారు. వాటాదార్లందరి అభిప్రాయం మేరకే రవిప్రకాశ్ను తొలగిస్తున్నామని ఆయన ప్రకటించారు. కంపెనీ సెక్రటరీ సంతకాన్ని రవి ప్రకాశ్ ఫోర్జరీ చేశారని ఆయన వెల్లడించారు. తన సంతకాన్ని రవి ప్రకాశ్ ఫోర్జరీ చేశారని కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాలే స్వయంగా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. యజమాన్య మార్పిడి జరగకుండా రవి ప్రకాశ్, మూర్తి ఎన్నో అవరోధాలు సృష్టించారని, తప్పుడు నిర్ణయాలతో సంస్థను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించినట్లు తెలిపారు. ప్రస్తుతం టీవీ9లోని అన్ని ఛానెళ్లు కొత్త సంస్థ పరిధిలోకి వస్తామని స్పష్టం చేశారు. తాజా ఘటన నేపథ్యంలో టీవీ9తో రవిప్రకాశ్, మూర్తిలకు ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెప్పారు. అలాగే వాళ్లిదరూ ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు జరిపితే మాకంపెనీకి ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెప్పారు. టీవీ9 సంస్థలలోకి కొత్తగా నలుగురు డైరెక్టర్లను తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రవి ప్రకాశ్తో పాటు మిగతా వారికి 9.5 శాతం వాటాలు ఉన్నాయని, షేర్హోల్డర్గా రవిప్రకాశ్ సమావేశాలకు హజరుకావచ్చని బోర్డు డైరెక్టర్లు తెలిపారు. -
రెండోరోజు టీవీ9 సంస్థలో కీలక పరిణామాలు
-
టీవీ9 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల చర్చలు
-
టీవీ 9 తాత్కాలిక సీఈఓగా మహేంద్ర మిశ్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టీవీ 9 తెలుగు ఛానల్ కొత్త సీఈఓగా మహేంద్ర మిశ్రా, సీఓఓగా గొట్టిపాటి సింగారావు నియమితులయ్యారు. ఈ మేరకు అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీపీఎల్) బోర్డు నిర్ణయం తీసుకుంది. శుక్ర వారమిక్కడ ఏబీసీపీఎల్ డైరెక్టర్లు జగపతిరావు జూపల్లి, సాంబశివరావు సంగు, శ్రీనివాసరావు అరవపల్లి, పుల్లూరి కౌశిక్రావు మీడియాతో మాట్లాడారు. గతే డాది ఆగస్టులో ఏబీసీపీఎల్లో అలంద మీడియా అండ్ ఎంటర్టైన్స్మెంట్ ప్రైవే ట్ లిమిటెడ్ 90.54% వాటాను కొనుగోలు చేసినట్టు సాంబశివరావు వెల్లడించారు. రవిప్రకాశ్, ఇతరులకు 9.5% వాటా ఉన్న ట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో హోల్ టైం డైరెక్టర్ అండ్ సీఈఓ నుంచి రవిప్రకాశ్ను, హోల్ టైం డైరెక్టర్ అండ్ సీఎఫ్వో పదవుల నుంచి మంగిపూడి కల్యాణ వెంకట నర సింహ మూర్తి (ఎంకేవీఎన్ మూర్తి)లను శాశ్వతంగా తొలగించినట్టు చెప్పారు. ఇకపై ప్రజలు, బ్యాంకు లు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు, ఇన్స్టిట్యూషన్లు ఎవరూ కూడా రవిప్రకాశ్తో వ్యవహారా లు, కార్యకలాపాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మైనార్టీ షేర్ ఉంది కాబట్టి షేర్ హోల్డర్స్ సమావేశానికి రవిప్రకాశ్ హాజరుకావొచ్చని.. ప్రాఫిట్స్, డివిడెండ్లను డిక్లేర్ చేయవచ్చన్నారు. ప్రస్తుతం టీవీ 9 కన్నడ హెడ్గా మిశ్రా పనిచేస్తున్నారని, టీవీ 9 తెలుగుకు శాశ్వత సీఈఓను నియమించేంత వరకూ ఈయనే పదవిలో కొనసాగుతార న్నారు. 10 టీవీ సీఈఓగా ఉన్న సింగారావుకు 6ఏళ్ల కు పైగా మా టీవీతో అనుబంధం ఉంది. స్టార్ ఇండి యా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాసెస్లో ఈయన చీఫ్ ఇంటిగ్రేషన్ ఆఫీసర్గా, ఆపరేషన్స్ హెడ్గా ఉన్నారు. ఉద్యోగుల తొలగింపులుండవ్.. టీవీ 9కు తెలుగుతో పాటు కన్నడ, గుజరాతీ, మరాఠీ, యూఎస్ఏ, భారత్వర్‡్ష చానల్స్, న్యూస్ 9 బెంగళూరు, టీవీ 1 హైదరాబాద్ చాన ల్స్ కూడా ఉన్నాయి. మేనేజ్మెంట్ మారినప్పటికీ.. ఏబీసీపీఎల్, టీవీ 9 బ్రాండింగ్లో ఎలాంటి మార్పులూ ఉండవని, ఉద్యోగుల తొలగింపులూ జరగవని సాంబశివరావు స్పష్టంచేశారు. అవసరమైతే కొత్త ఉద్యోగులతో పాటూ చానల్స్ కూడా ప్రారంభిస్తామని తెలిపారు. -
పోలీసుల విచారణకు హాజరైన టీవీ9 సీఎఫ్వో మూర్తి
-
టీవీ9 భారత్ వర్ష్కు ఎన్నికల సంఘం వార్నింగ్
-
విచారణకు హాజరైన టీవీ9 సీఎఫ్వో మూర్తి
సాక్షి, హైదరాబాద్ : తప్పుడు పత్రాలు సృష్టించారనే ఆరోపణలతో నోటీసులు అందుకున్న టీవీ9 సీఎఫ్వో ఎంవీకేఎన్ మూర్తి శుక్రవారం సైబరాబాద్ పోలీస్ కార్యాలయానికి వచ్చారు. సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. నిధుల మళ్లింపు, ఫోర్జరీ అంశాలపై మూర్తిని పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు టీవీ9 కార్యాలయంలో 12 హార్డ్ డిస్క్లు, నాలుగు ల్యాప్టాప్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా రవిప్రకాశ్, నటుడు శివాజీ, మరికొందరు కలిసి సంతకాలు ఫోర్జరీ చేశారని, రవిప్రకాశ్, సీఎఫ్వో మూర్తి, ఇతరులు తప్పుడు పత్రాలు సృష్టించి నిధులు దారి మళ్లీంచారంటూ ఏబీసీఎల్ను టేకోవర్ చేసిన అలందా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కౌశిక్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే రవిప్రకాశ్, నటుడు శివాజీ, సీఎఫ్వో ఎంవీకేఎన్ మూర్తికి నోటీసులు జారీ చేశారు. అయితే రవి ప్రకాశ్, శివాజీ నేరుగా విచారణకు హాజరు అవుతారా? లేక వాళ్ల తరపున న్యాయవాది హాజరు అవుతారా అనే దానికి ఉత్కంఠ నెలకొంది.మరోవైపు ఈ కేసుకు సంబంధించి బంజారాహిల్స్ ఏసీపీ, సీఐలు ఇవాళ ఉదయం సైబరాబాద్ సీపీ సజ్జనార్ను కలిశారు. -
టీవీ9 భారత్ వర్ష్కు ఈసీ వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ : టీవీ9 భారత్ వర్ష్ ఛానల్కు కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్ ఇచ్చింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు మాయం అయ్యాయంటూ తప్పుడు కథనాలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవీఎంల భద్రత, తరలింపు అంశాలపై అత్యున్నత నిఘా ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టం చేసింది. తప్పుడు రిపోర్టింగ్ చేయకుండా జర్నలిజం ప్రమాణాలు కాపాడాలని హితవు పలికింది. మీడియా జర్నలిజం విలువలు విడిచి దురద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని ఈసీ అభిప్రాయపడింది. ప్రజల్లోకి తప్పుడు సమాచారం ప్రచారం చేయొద్దని ఈసీ ఈ సందర్భంగా టీవీ9 భారత్ వర్ష్ చానల్కు హితవు పలికింది. కాగా భారత్ వర్ష్ ఛానల్ను రవి ప్రకాశ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫోర్జరీ, నిబంధనలకు విరుద్ధంగా ఆయన భారత్ వర్ష్ చానల్కు కోట్లు దారి మళ్లించారంటూ టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
సాక్షి ప్రతినిధిపై రవిప్రకాశ్ అనుచరులు దౌర్జన్యం
-
టీవీ9 వద్ద ఉద్రిక్తత, సాక్షి ప్రతినిధిపై దౌర్జన్యం
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కవరేజ్కు వెళ్లిన ‘సాక్షి’ మీడియా ప్రతినిధిపై రవిప్రకాశ్ అనుచరులు వాగ్వివాదానికి దిగారు. గేటు బయట నుంచే మీడియా వాళ్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండగా, వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ’సాక్షి’ రిపోర్టరుతో రవిప్రకాశ్ అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. కెమెరాను లాక్కునేకు ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. టీవీ9 కార్యాలయం వద్ద మిగతా చానల్స్ ప్రతినిధులు ఉన్నప్పటికీ...కేవలం సాక్షి మీడియా ప్రతినిధినే వాళ్లు టార్గెట్ చేశారు. రోడ్డు అడ్డంగా ఉన్నారని, తమకు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ దౌర్జన్యానికి దిగారు. లైవ్ కవరేజ్ చేస్తున్న డీఎస్ఎన్జీ వాహనం వైర్లు పీకేశారు. చదవండి: (టీవీ9లో రెండోరోజు పోలీసుల సోదాలు) -
టీవీ9లో రెండోరోజు పోలీసుల సోదాలు
సాక్షి, హైదరాబాద్ : రెండోరోజు కూడా టీవీ9 కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. కాగా సీఈఓ పదవి నుంచి తొలగించామని టీవీ9 యాజమాన్యం ప్రకటించాక కూడా గురువారం సాయంత్రం టీవీ9 తెరపై రవిప్రకాశ్ కనిపించారు. తనపై తప్పుడు వార్తలు వస్తున్నాయని, తాము సమాజం కోసమే పనిచేస్తున్నామని చెప్పారు. అంతే తప్ప.. ఫోర్జరీ వంటి ఆరోపణలపై ఎలాంటి వివరణా ఇవ్వలేదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అత్యవసర భేటీ ఈ పరిణామాల నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ శుక్రవారం ఉదయం 11 గంటలకు అత్యవసరంగా సమావేశం కానుంది. తాజా పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనుంది. అలాగే సీఈవో తొలగింపు, కొత్త సీఈవో నియామకంపై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. టీవీ9 వాటాల వ్యవహారంలో రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీలపై సైబర్క్రైం పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవల టీవీ9లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసిన అలందా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ డైరెక్టర్ పి.కౌశిక్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్క్రైం పోలీసులు ఐటీ యాక్ట్ 66,72 సెక్షన్లతోపాటు ఐపీసీ 406, 420, 467, 469 ,471, 120(బీ) సెక్షన్లపై కేసు నమోదు చేసి నిన్నటి నుంచి విచారణ జరుపుతోంది. -
రవిప్రకాశ్, శివాజీపై ఫోర్జరీ కేసు
సాక్షి,హైదరాబాద్: టీవీ9 వాటాల వ్యవహారంలో రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీలపై సైబర్క్రైం పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ మొదలు పెట్టారు. ఇటీవల టీవీ9లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసిన అలందా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ డైరెక్టర్ పి.కౌశిక్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్క్రైం పోలీసులు ఐటీ యాక్ట్ 66,72 సెక్షన్లతోపాటు ఐపీసీ 406, 420, 467, 469 ,471, 120(బీ) సెక్షన్లపై కేసు నమోదు చేసి గురువారం విచారణ ప్రారంభించారు. దీంతోపాటుగా నకిలీ పత్రాల సృష్టి, ఫోర్జరీ వ్యవహారంలో రవిప్రకాశ్తో పాటు ఎంకేవీఎన్ మూర్తిపై కూడా ఐటీ యాక్ట్ 66(సీ), 66(డీ), ఐపీసీ 420, 468, 471, 120(బీ) సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు. కోర్టు సెర్చ్వారంట్ ఆధారంగా గురువారం బంజారాహిల్స్లోని టీవీ9 కార్యాలయంతో పాటు రవిప్రకాశ్ నివాసంలోను, హిమాయత్నగర్లోని సినీనటుడు శివాజీ, ఖైరతాబాద్లోని మూర్తి ఇళ్లలోనూ సోదాలు జరిపి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిపిన సోదాల్లో కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను కూడా స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా సీఆర్పీసీ 160 సెక్షన్ కింద నోటీసులిచ్చారు. రవిప్రకాశ్ ఇంట్లో లేకపోవడంతో శుక్రవారం తమ ఎదుట హాజరుకావాలని ఇంటి గోడకు నోటీసులు అతికించారు. టీవీ9 కార్యాలయంలో బందోబస్తు బంజారాహిల్స్ టీవీ9 కార్యాలయంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సైబరాబాద్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఉదయం కార్యాలయంలో రవిప్రకాశ్ కోసం ఆరా తీశారు. ఆయన లేరని చెప్పడంతో వివిధ డాక్యుమెంట్లను అడిగి తెప్పించుకున్నారు. సైబరాబాద్ పోలీసులు టీవీ9 కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారని ప్రచా రం జరగడంతో పెద్ద సంఖ్యలో జనం ఇక్కడికు వ చ్చారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. అలాగే హిమాయత్నగర్ వై జంక్షన్ వద్ద నివాసముంటున్న నటుడు శివాజీ ఇంట్లో ఉదయం 10–11 గంటల మధ్యలో పోలీసులు సోదా లు చేశారు. ఆ సమయంలో హీరో శివాజీ ఇంట్లో లేరు. సోదాల్లో పలు కీలక పత్రాలు పోలీసుల చేతికి చిక్కినట్లు తెలిసింది. -
టీవీ9 నుంచి రవిప్రకాశ్ ఔట్!
సాక్షి, బిజినెస్ ప్రతినిధి: తెలుగు శాటిలైట్ చానళ్లలో కొత్త ఒరవడి తెచ్చిన టీవీ9 నుంచి ఆ చానల్ సీఈఓ వెలిచేటి రవిప్రకాశ్ను తొలగించారు. చానల్లో 90% వాటాను మైహోమ్ గ్రూప్, మేఘ ఇంజనీరింగ్ సంస్థలకు చెందిన అలందా గ్రూపు ఇటీవలే కొనుగోలు చేసింది. 90% వాటా కొనుగోలు చేసినప్పటికీ.. తమకు రవిప్రకాశ్ అడ్డంకులు సృష్టిస్తున్నారని, కంపెనీ సెక్రటరీ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని, అందుకే ఆయన్ను సీఈఓ పదవి నుంచి తొలగిస్తున్నామని అలందా మీడియా పేర్కొంది. ఫోర్జరీ విషయంలో తాము చీటింగ్ కేసు కూడా పెట్టినట్లు తెలిపింది. ‘రవిప్రకాశ్ కొందరు వ్యక్తులతో కుమ్మక్కై సంస్థకు హాని చేసేలా వ్యవహరిస్తున్నారు’అని అలందా ఆ ఫిర్యాదులో పేర్కొంది. కానీ.. గురువారం సాయం త్రం రవిప్రకాశ్ టీవీ9 చానల్లో కనిపించారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనన్నారు. అంతే తప్ప.. ఫోర్జరీ కేసు గురించిగానీ, తనపై వచ్చిన ఇతర అభియోగాల గురించి కానీ ప్రస్తావించలేదు. ఈ వ్యవహారం వివరాలు చూస్తే.. టీవీ9 లోగోతో తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ, ఇంగ్లిష్, హిందీ చానళ్లు నిర్వహిస్తున్న అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ (ఏబీసీఎల్)ను వ్యాపారవేత్త శ్రీనిరాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్, ఐల్యాబ్స్ వెంచర్ కేపిటల్ ఫండ్ ప్రారంభించాయి. ఏబీసీఎల్లో ఈ రెండు సంస్థలకు కలిపి 90 శాతానికి పైగా వాటా ఉంది. ఈ సంస్థలో ఉద్యోగిగా చేరి సీఈవో, డైరెక్టర్గా ఎదిగిన రవిప్రకాశ్, ఆయన సహచరులకు 8% వాటా ఉంది. గత ఆగస్టులో శ్రీనిరాజు తన వాటాను హైదరాబాద్కు చెందిన అలందా మీడియాకు విక్రయించారు. అదే నెలలో డీల్ పూర్తయి ఏబీసీఎల్ యాజమాన్యం అలందా చేతిలోకి వచ్చింది. ఆర్ఓసీ (రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్)లో కూడా దీనికి సంబంధించిన పత్రాలు నమోదయ్యాయి. దీంతో నలుగురు కొత్త డైరెక్టర్లను ఏబీసీఎల్లో నియమించడానికి కేంద్ర సమాచార శాఖ అనుమతి కోరుతూ ఏబీసీఎల్ బోర్డు తీర్మానాన్ని ఆమోదించి పంపింది. ఈ తీర్మానాలపై ఒకసారి వి.రవిప్రకాశ్, మరోసారి ఎంకేవీఎన్ అనే మరో డైరెక్టర్ ఏబీసీఎల్ డైరెక్టర్ల హోదాలో సంతకాలు చేశారు. దరఖాస్తును పరిశీలించిన కేంద్ర సమాచార శాఖ.. మొన్నటి మార్చి 29న అనుమతి కూడా మంజూరు చేసింది. అన్ని అనుమతులూ ఉన్నా.. కొత్త డైరెక్టర్లతో బోర్డు మీటింగ్కు రవిప్రకాశ్ రకరకాలుగా అడ్డుపడుతూ వచ్చారు. దీంతో ఆ నలుగురు డైరెక్టర్లూ ఏప్రిల్ 23న సమావేశమై.. తమ నియామక పత్రాలను ఆర్ఓసీలో దాఖలు చేయాలని కంపెనీ సెక్రటరీని కోరారు. సెక్రటరీ సంతకం ఫోర్జరీ? దీన్ని అడ్డుకునే దురుద్దేశంతో రవిప్రకాశ్, ఆయన సన్నిహితులు కొందరు ఆ కంపెనీ సెక్రటరీ రాజీనామా చేసినట్లు ఫోర్జరీ డాక్యుమెంట్ను సృష్టించారనేది అలందా అభియోగం. దీనిపై కంపెనీ సెక్రటరీ కూడా ఆర్ఓసీకి ఫిర్యాదు చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకు న్న ఆర్ఓసీ అధికారులు ఏబీసీఎల్లో కొత్త డైరెక్టర్ల నియామక పత్రాలను ఆమోదించారు. ‘90% వాటా మా చేతిలోనే ఉంది. కనుక చట్టపరంగా పూర్తి అధికారం మాకే ఉంది. అందుకే ఈ మొత్తం వ్యవహారంలో రవిప్రకాశ్ వైఖరిని సీరియస్గా తీసుకుని, ఆయన్ను పదవి నుంచి తొలగించాలని నిర్ణయించాం’అని అలందా మీడియా తెలియజేసింది. ఇదీ అలందా మీడియా ఫిర్యాదు దురుద్దేశపూర్వకంగా సినీ నటుడు శొంఠినేని శివాజీతో కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించారని, సంస్థ నిర్వహణలో తమకు ఇబ్బందులు కల్పించేలా రవిప్రకాశ్ ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో టీవీ9 కొత్త యాజమాన్యం పేర్కొంది. కుట్రలో భాగంగా కంపెనీకి చెందిన ముఖ్యమైన డేటాను తస్కరించడమే కాక, దాన్ని బయటి వ్యక్తులకు చేరవేసినట్లు అనుమానాలు ఉన్నాయని కూడా ఫిర్యాదులో తెలిపింది. రవిప్రకాశ్కు టీవీ9లో 20 లక్షల షేర్లుండగా (8%) దాన్లో 40 వేల షేర్లు తనకు విక్రయించడానికి 2018 ఫిబ్రవరిలో ఒప్పందం చేసుకుని డబ్బులు చెల్లించానని, ఏడాదిలోగా బదిలీ చేయాల్సి ఉన్నా రకరకాల సాకులతో చేయలేదని, ఏబీసీఎల్ యాజమాన్య మార్పులపై తనకు నిజాలు చెప్పలేదని ఆరోపిస్తూ శివాజీ ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)కు వెళ్లటం తెలిసిందే. ఏదో ఒక వివాదాన్ని సృష్టించి.. కొత్త యాజమాన్యానికి అడ్డంకులు సృష్టించటమే శివాజీ ఉద్దేశమని అలందా పేర్కొంది. శివాజీ చెబుతున్న షేర్ పర్ఛేజ్ అగ్రిమెంట్ కేవలం తెల్ల కాగితాలపై ఉండడం ఇక్కడ గమనార్హం. అడ్డుకున్నది ఆయనేనా? చిత్రమేంటంటే టీవీ9లో తన వాటాను విక్రయించడానికి శ్రీనిరాజు కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. చాలా డీల్స్ కుదిరిన తర్వాత కూడా చివర్లో బెడిసి కొట్టేవి. దీనివెనక రవిప్రకాశ్ ప్రమేయం ఉందనేది ఏబీసీఎల్ యాజమాన్య వర్గాల మాట. కొన్నేళ్లుగా టీవీ9 నిర్వహణలో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయన్న అనుమానాలున్నాయని, అవి బయటపడతాయనే భయంతోనే కొత్త యాజమాన్యాన్ని రవిప్రకాశ్ అడ్డుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. పైపెచ్చు డబ్బులు తీసుకుని షేర్లు ఇవ్వకపోతే రవిప్రకాశ్పై శివాజీ కేసు పెట్టాలి తప్ప ఏబీసీఎల్ను వివాదాల్లోకి లాగటం కూడా ఈ అనుమానాలకు ఊతమిచ్చేదే. ఉద్వాసన తర్వాత కూడా టీవీ9లో రవిప్రకాశ్! సీఈఓ పదవి నుంచి తొలగించామని టీవీ9 యాజమాన్యం ప్రకటించాక కూడా గురువారం సాయంత్రం టీవీ9 తెరపై రవిప్రకాశ్ కనిపించారు. తనపై తప్పుడు వార్తలు వస్తున్నాయని, తాము సమాజం కోసమే పనిచేస్తున్నామని చెప్పారు. అంతే తప్ప.. ఫోర్జరీ వంటి ఆరోపణలపై ఎలాంటి వివరణా ఇవ్వలేదు. దీనిపై కొత్త యాజమాన్యం స్పందిస్తూ.. ‘మేం 90% వాటా కొనటం అబద్ధమా? మెజార్టీ వాటా ఉన్నా మా డైరెక్టర్లకు రవిప్రకాశ్ అడ్డుపడటం అబద్ధమా? తన సంతకం ఫోర్జరీ చేశారంటూ కంపెనీ సెక్రటరీ ఫిర్యాదు చేయటం నిజం కాదా? ఆ ఫిర్యాదు ఆధారంగా నోటీసులు జారీ చేయడం వాస్తవం కాదా?’అని ప్రశ్నించింది. మీపై నమ్మకముంచి చానల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించిన కంపెనీకి మీరు చేసిందేమిటని నిలదీసింది. -
టీవీ9 సీఈవోగా రవిప్రకాశ్ తొలగింపు
-
రవిప్రకాశ్ పాస్పోర్ట్ స్వాధీనం, శివాజీ ఇంట్లో సోదాలు
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీతో పాటు, నిధుల మళ్లింపుకు పాల్పడి టీవీ9 నుంచి ఉద్వాసనకు గురైన రవిప్రకాశ్ పాస్పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక గత రెండురోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. టీవీ చానల్ నిర్వహణ తన ఇష్టారాజ్యంగా జరగాలన్న పంతంతో కొత్త యాజమాన్యానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ, చివరికి ఓ కీలక ఉద్యోగి సంతకాన్ని కూడా ఫోర్జరీ రవిప్రకాశ్ను ఆ సంస్థ సీఈవో పదవి నుంచి టీవీ9 యాజమాన్యం తొలగించింది. అలంద మీడియా సంస్థ ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్పై సైబర్ క్రైమ్లో 406, 467, ఐటీ యాక్ట్ 56 సెక్షన్ల కింద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. చదవండి: టీవీ9 సీఈవో రవిప్రకాశ్పై కేసు నమోదు నటుడు శివాజీ నివాసంలో సోదాలు.. అలాగే టీవీ9లో తనకు వాటా ఉందంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను ఆశ్రయించిన నటుడు శివాజీ నివాసంలోనూ పోలీసులు సోదాలు జరుపుతున్నారు. నారాయణగూడ, హిమాయత్ నగర్లోని ఆయన నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. కాగా సంస్థకు హాని కలిగించే దురుద్దేశంతో శివాజీతో దురుద్దేశ పూర్వకంగా కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా, సంస్థ యాజమాన్యానికి... కంపెనీ నిర్వాహణలో ఇబ్బందులు కల్పించేలా రవి ప్రకాశ్ ప్రయత్నిస్తున్నారని టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన విషయం తెలిసిందే. ఈ కుట్రలో భాగంగా కంపెనీకి చెందిన ముఖ్యమైన డాటాను తస్కరించడమే కాక, కంపెనీకి నష్టం చేసే దురుద్దేశంతో ఆ డేటాను బయటి వ్యక్తులకు చేరవేసినట్లు అనుమానాలు ఉన్నాయని కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. అలందా మీడియా ఫిర్యాదు ప్రకారం రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీతో కలిసి కుట్ర పూరితమైన చర్యలకు పాల్పడి ఏబీసీఎల్ యాజమాన్యానికి, కంపెనీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడ్డారు. ఈ వివరాల్లోకి వెళితే, సినీనటుడు శివాజీ ఏప్రిల్ 19, 2019న హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించారు. శివాజీ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం... ఏబీసీఎల్లో రవిప్రకాశ్కు 20 లక్షల షేర్లు అంటే 8 శాతం వాటా ఉంది. ఇందులోనుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు రవి ప్రకాశ్కు 20 లక్షల రూపాయలు చెల్లించి ఫిబ్రవరి 20, 2018న ఒప్పందం కుదుర్చుకున్నానని, ఈ ఒప్పందం జరిగిన ఏడాదిలోగా షేర్లను తన పేరు మీద బదిలీ చేసేందుకు రవిప్రకాశ్ అంగీకరించారని, తాను అతని మీద నమ్మకం ఉంచానని శివాజీ పేర్కొన్నారు. చదవండి: టీవీ9 నుంచి రవిప్రకాశ్కు ఉద్వాసన అయితే, ఏబీసీఎల్లో మార్పులకు సంబంధించి రవిప్రకాశ్ కొన్ని నిజాలను తనవద్ద దాచారని, మోసపూరితంగా వ్యవహరించారని శివాజీ ఆరోపించారు. షేర్ల బదిలీ గురించి తాను పలుమార్లు రవిప్రకాశ్కు గుర్తు చేసినా ఏదో ఒక సాకు చూపుతూ, షేర్లు బదిలీ చేయలేదని, దీంతో తాను విసిగిపోయి ఫిబ్రవరి 15, 2019న రవిప్రకాశ్కు స్వయంగా నోటీసు అందజేశానని శివాజీ ఎన్సీఎల్టీ వద్ద దాఖలు చేసిన తన అఫిడవిట్లో పేర్కొన్నారు. దానికి రవి ప్రకాశ్ ఫిబ్రవరి 17న స్పందిస్తూ షేర్ల బదిలీలో జాప్యానికి ఎన్సీఎల్టీ జారీ చేసిన ఒక మధ్యంతర ఉత్తర్వు కారణమని, ఈ వివాదం పరిష్కారం అయిన తర్వాత షేర్లు బదిలీ చేస్తానని సమాధానం ఇచ్చారు. రవిప్రకాశ్, శివాజీల మధ్య 2018 ఫిబ్రవరిలో జరిగినట్లుగా చెబుతున్న షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కేవలం తెల్ల కాగితాలపై ఉండడం గమనార్హం. ఎవరైనా వాటా కొనుగోలు చేస్తే తక్షణం షేర్ల బదిలీ కోరుకుంటారు, కానీ, శివాజీ ఇందుకు ఏడాది గడువు ఇచ్చాననడం అనుమానాలను కలిగిస్తోంది. ఈ అనుమానాల వల్లే, శివాజీ, రవిప్రకాశ్ మధ్య కుదిరనట్లు చెబుతున్నది ఫోర్జరీ ఒప్పందంగా టీవీ9 కొత్త యాజమాన్యం భావిస్తోంది. కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు కలిగించే ఉద్దేశ్యంతో రవిప్రకాశ్, శివాజీతో కలిసి కుమ్మక్కై ఈ నాటకానికి తెర తీశారని ఏబీసీఎల్ కొత్త యాజమాన్యం తన ఫిర్యాదులో పేర్కొంది. -
టీవీ9 నుంచి రవిప్రకాశ్కు ఉద్వాసన
సాక్షి, హైదరాబాద్ : నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈవో రవిప్రకాశ్కు టీవీ9 ఉద్వాసన పలికింది. ఆయనను సీఈవో బాధ్యతల నుంచి యాజమాన్యం తప్పించింది. సంస్థ నిర్వహణలో వైఫల్యంతో పాటు, సంస్థలో కీలక ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఆరోపణల నేపథ్యంలో యాజమాన్యం గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా అసోసియేట్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ (ఎబీసీఎల్) వ్యవస్థాపకుడు, సీఈవో రవిప్రకాశ్కు కేవలం ఎనిమిది శాతం వాటా మాత్రమే ఉన్నప్పటికీ నూతన యాజమాన్యానికి సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తన నిర్ణయాలే చెల్లుబాటు అయ్యేలా ఒత్తిడి తేవడంతో పాటు, టీవీ9 తన ఆధ్వర్యంలోనే నడవాలని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. కాగా టీవీ9లో మెజారిటీ వాటా కలిగిన శ్రీనిరాజు తన వాటాలను అలంద మీడియాకు విక్రయించిన విషయం విదితమే. చదవండి:(టీవీ9 సీఈవో రవిప్రకాశ్పై కేసు నమోదు) మరోవైపు టీవీ9 వ్యవహారంలో నటుడు శివాజీ నివాసంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. టీవీ9లో నటుడు శివాజీకి కూడా వాటా ఉన్నట్లు ... రవిప్రకాశ్ నుంచి ఆయన ఈ షేర్లు కొన్నట్లు తెలుస్తోంది. టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసుకున్న అనంతరం ఈ కొనుగోలు ప్రక్రియను సవాల్ చేస్తూ శివాజీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో సవాల్ కూడా చేశాడు. అయితే రవిప్రకాశ్ ప్రోద్బలంతోనే శివాజీ ట్రిబ్యునల్ను ఆశ్రయించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ వార్తలకు ఊతమిస్తూ రవిప్రకాశ్, శివాజీ కలిసి ఉన్న ఓ ఫోటో గత ఏడాది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందుకే ఆరునెలలకు ఓసారి ఆపరేషన్ ’గరుడ’ అంటూ హడావుడి చేసే శివాజీకి టీవీ9 ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేసిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శివాజీని కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే...టీవీ9 పేరుతో తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ, ఇంగ్లీషు, హిందీ ఛానళ్లు నిర్వహిస్తున్న అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్)ను వ్యాపారవేత్త శ్రీనిరాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ , ఐల్యాబ్స్ వెంచర్ కేపిటల్ ఫండ్ కలిపి ప్రారంభించాయి. ఏబీసీఎల్ కంపెనీలో ఈ రెండు సంస్థలకు కలిపి 90 శాతానికి పైగా వాటా ఉండగా, ఆ సంస్థలో ఓ ఉద్యోగిగా చేరి సీఈవో, డైరెక్టర్గా హోదా పొందిన రవిప్రకాశ్, ఆయన అసోసియేట్స్కు సంస్థలో దాదాపు 8 శాతం వాటా ఉంది. ఏబీసీఎల్లో 90 శాతానిపైగా వాటా ఉన్న రెండు సంస్థల నుంచి ఆ వాటాను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్కు చెందిన అలందా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ప్రైవేట్ లిమిటెడ్ ఆగస్టు 23, 2018న ఒప్పందం కుదుర్చుకుని ఆగస్టు (24) 25న నగదు కూడా చెల్లించింది. దీనికి అనుగుణంగానే ఆ షేర్లు మొత్తం కూడా అలందా మీడియా పేరు మీద ఆగస్టు 27వ తేదీన డి-మ్యాట్ రూపంలో బదిలీ కూడా జరిగింది. దీంతో ఏబీసీఎల్ యాజమాన్యం అలందా చేతికి మారినట్లయ్యింది. ఈ లావాదేవీని గుర్తిస్తూ, ఏబీసీఎల్ కంపెనీ తన రికార్డుల్లో నమోదు కూడా చేసుకుంది. సంబంధిత పత్రాలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో దాఖలు కూడా చేశారు. ఏబీసీఎల్ యాజమాన్యం చేతులు మారడంతో అలందా మీడియా సంస్థ తరపున నలుగురు డైరెక్టర్లను ఏబీసీఎల్ డైరెక్టర్ల బోర్డులో నియమించేందుకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అనుమతి కోరుతూ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు అధికారికంగా పంపించింది. ఈ తీర్మానాల మీద ఒకసారి రవిప్రకాశ్, మరోసారి ఎంకెవీఎన్ మూర్తి అనే మరో డైరెక్టర్ ఏబీసీఎల్ డైరెక్టర్ల హోదాలో సంతకాలు చేశారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మార్చి 29, 2019న అనుమతి మంజూరు చేస్తూ ఏబీసీఎల్కు సమాచారం పంపింది. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ, కొత్త డైరెక్టర్లతో బోర్డు మీటింగ్ నిర్వహించేందుకు రవిప్రకాశ్ శతవిధాలా అడ్డుపడుతూ వచ్చారు. దీంతో ఏబీసీఎల్లో 90 శాతానికి పైగా వాటా పొందిన అలందా మీడియాకు చెందిన నలుగురు డైరెక్టర్లు ఏప్రిల్ 23, 2019న సమావేశమై తమ నియామకానికి చెందిన పత్రాలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో దాఖలు చేయాల్సిందిగా ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న కంపెనీ సెక్రటరీని కోరారు. రవిప్రకాశ్, ఆయన సహచరులు కొందరు దీన్ని అడ్డుకునే దురుద్దేశంతో, ఆ కంపెనీ సెక్రటరీ రాజీనామా చేసినట్లు పాత తేదీతో ఫోర్జరీ డాక్యుమెంట్ను సృష్టించారు. ఇదే విషయాన్ని సదరు కంపెనీ సెక్రటరీ రాతపూర్వకంగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కు ఫిర్యాదు చేయడమే కాక, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తాను రాజీనామా చేసినట్లు నకిలీ పత్రాన్ని సృష్టించారని వివరించారు. కంపెనీలో 90 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యానికి ఆ కంపెనీ నిర్వహణలో అడుగడుగునా అడ్డుపడుతూ, కంపెనీల చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కొత్త యాజమాన్యం ఆరోపించింది. మెజార్టీ వాటాదారుల హక్కులను అణగదొక్కే విధంగా కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారంటోంది అలందా మీడియా. సంస్థ నిర్వహణకు సంబంధించి రవిప్రకాశ్ పాల్పడిన అక్రమాలపై టీవీ9 యాజమాన్యం అతనిపై చీటింగ్ కేసు కూడా పెట్టింది. సంస్థకు హాని కలిగించే ఉద్దేశంతో కొందరు వ్యక్తులతో కుమ్మక్కై ఫోర్జరీ పత్రాలు సృష్టించడమే కాక, కంపెనీ నిర్వహణలో యాజమాన్యానికి ఇబ్బందులు కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. -
నటుడు శివాజీతో కలిసి రవిప్రకాశ్ కుట్ర..
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీతోపాటు యాజమాన్యానికి తెలియకుండా నిధులు మళ్లించారంటూ ఆరోపణలతో టీవీ9 సీఈవో రవిప్రకాశ్పై సైబర్ క్రైమ్లో ఐపీసీ 406, 420, 467, 469, 471, 120B, 90, 160..ఐటీ యాక్ట్ 66,72 సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో ఆయన కోసం రెండు రోజుల నుంచి తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. నిధుల మళ్లింపు జరిగిందని ఆరోపిస్తూ అలంద మీడియా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ...సీఈవోపై ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తన సంతకాన్ని రవిప్రకాశ్ ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలంద సంస్థ ఫిర్యాదుతో రవిప్రకాశ్ నివాసంతో పాటు టీవీ9 కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. చదవండి: రవిప్రకాశ్ పాస్పోర్ట్ స్వాధీనం, శివాజీ ఇంట్లో సోదాలు టీవీ9 నుంచి రవిప్రకాశ్కు ఉద్వాసన కాగా కొద్దిరోజుల కిందటే ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి 90శాతం షేర్లు కొనుగోలు చేసి టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసిన విషయం తెలిసిందే. యాజమాన్యం మారిన తర్వాత కొత్తగా నలుగురు డైరెక్టర్లను తీసుకోవాలని అలంద మీడియా ప్రతిపాదించింది. డైరెక్టర్ల నియామకానికి కేంద్ర సమచారశాఖ అనుమతి ఇచ్చినా... ఆ ప్రతిపాదనను రవిప్రకాశ్ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డైరెక్టర్ల నియామకాన్ని వ్యతిరేకిస్తూ బోర్డు మీటింగ్లో కొత్తవారిని తీసుకోవద్దంటూ ప్రతిపాదిస్తూ ఇప్పటికే ఉన్న ఓ డైరెక్టర్ సంతకంతో డాక్యుమెంట్ తయారు చేయించి, అక్రమాలకు పాల్పడ్డారని సమాచారం. అయితే ఆ సంతకం తాను చేయలేదని, డాక్యుమెంట్లో ఉన్న సంతకాన్ని రవిప్రకాశ్ ఫోర్జరీ చేశారని బాధిత డైరెక్టర్ ఆరోపించారు. దీంతో అలంద సంస్థ కార్యదర్శి పోలీసుల్ని ఆశ్రయించారు. ఇక కేవలం 9శాతం వాటా మాత్రమే కలిగి ఉన్న ఆయన యాజమాన్య మార్పును అడ్డుకునేందుకు కుటిలయత్నం చేసినట్లు భోగట్టా. టీవీ9 తన నియంత్రణలోనే ఉండాలంటూ షరతులు విధించిన రవిప్రకాశ్ కొత్త యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. మరోవైపు టీవీ9 కార్యాలయం నుంచి కొన్ని ఫైల్స్, ల్యాప్టాప్తో పాటు హార్డ్డిస్క్లు మాయం అయినట్లు పోలీసులు గుర్తించారు. రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్తో పాటు ఆయన అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
వైఎస్ జగన్ సంచలన ప్రకటన
సాక్షి, అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా అంతులేని అవినీతికి పాల్పడ్డారని, తాము అధికారంలోకి రాగానే ఆ కుంభకోణాలన్నిటిపైనా సమగ్రమైన విచారణ జరిపిస్తామని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. టీవీ 9 చానెల్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతికి చాలా ఆధారాలే ఉన్నాయని, వాటన్నిటినీ దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తామని జగన్ స్పష్టం చేశారు. ప్రశ్న: పాదయాత్ర ద్వారా మీరు తెలుసుకున్న కొత్త విషయాలు ఏంటి? పాదయాత్ర మొదలు పెట్టి ఒక సంవత్సరం రెండు నెలలు అవుతుంది. ఈ 14 నెలల కాలంలో మీరు తెలుసుకున్న కొత్త విషయాలేంటి? జగన్: ప్రజల తరుఫున పోరాటంలో పాదయాత్ర అన్నది అత్యంత బ్రహ్మాస్త్రంలాంటిది. ప్రజల కష్టాలు తెలుసుకోవడమే కాకుండా, పాదయాత్ర చేసిన నియోజకవర్గం దాటే లోపు ప్రతి మూడు, నాలుగు రోజులకు బహిరంగ సభ కూడా జరుపుతున్నాం. విషయాలను బహిరంగ సభలో చెబుతూ, ఆ విషయాలను రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగేలా చేస్తున్నాం. ప్రశ్న: మీరు ప్రజల మధ్య ఉండడం కొత్త కాదు కదా.. ఇంతకు ముందు ఓదార్పు యాత్ర చేశారు. అనేక సభలు, ధర్నాలు చేశారు. వాటికీ, దీనికి తేడా ఏంటంటే ఏం చెప్పగలుగుతారు? జగన్: పాదయాత్ర సమయంలో నేను ప్రజల్లో ఉంటూ.. ఫలానా చోట నేను ఉంటాను, ఫలానా చోట నేను పడుకుంటానని తెలిసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ దారి గుండా పోయే సమయంలో ప్రజలు వచ్చి వారి సమస్యలు చెప్పుకోగలుగుతున్నారు. వినే మనిషి ఒకరు ఉన్నారు.. రేప్పొద్దున ఆ మనిషి మంచి పొజిషన్లోకి వస్తే ఏదైనా చేస్తారన్న భరోసా ఆ ప్రజల్లో కలుగుతోంది. ప్రశ్న: మీ పాదయాత్ర 3,600 కిలోమీటర్లు పూర్తయిందంటే, కొన్ని వేల సమస్యలు, కొన్ని వేల వినతులు విని ఉండొచ్చు. రేపు అధికారం వస్తే అవన్నీ పరిష్కారించడానికి మీ దగ్గర ఏదన్నా మార్గం ఉందా? జగన్: మెజార్టీ సమస్యలు పరిష్కరించదగ్గవే. 99.99 శాతం సమస్యలు సమాజంలో ఈ రోజు పడుతున్న అగచాట్లే. ఇవన్నీ ప్రభుత్వం స్వయంగా చేసిన తప్పిదం వల్ల వచ్చిన సమస్యలే. ఉదాహరణకు పింఛను ఇవ్వడం.. ప్రభుత్వం స్వయంగా దగ్గర ఉండి చేసిన పాపమే. జన్మభూమి కమిటీల ద్వారా లంచాలు అడగడం. మరుగుదొడ్లకు సైతం లంచాలు తీసుకునే పరిస్థితి. మోడల్ స్కూళ్లలో పని చేస్తున్న వారికి నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టే వారికి నెలల తరబడి సరుకుల బిల్లులు ఇవ్వకపోవడం.. ఆరు నెలలకు పైగా వారికి ఇచ్చే గౌరవ వేతనం ఎగరగొట్టడం.. ఇలాగైతే వారు పిల్లలకు భోజనం ఎలా పెడతారు? మేం శాచ్యురేషన్ మోడ్లో మా నాన్న ఇంతకు ముందు చేసిన పద్ధతిలో ఈ సమస్యను అధిగమిస్తాం. మేం అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను రద్దు చేస్తాం. అదీగాక గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తాం. అదే గ్రామంలో పది మందికి ఉద్యోగాలిస్తాం. గ్రామ సచివాలయం ఆ గ్రామంలోనే ఉంటుంది. ఆ గ్రామంలో పది మంది ఉద్యోగం చేస్తా ఉంటారు. ప్రభుత్వ పథకమేదైనా కావాలన్నా, ఆ గ్రామానికి చెందిన ఏ సమస్య అయినా గ్రామ సచివాలయంలోనే పరిష్కారమవుతుంది. 72 గంటలలోనే లంచాలు లేకుండా పని జరుగుతుంది. ప్రశ్న: 2014కు ముందు చంద్రబాబు కూడా ఇలానే చెప్పారు. వినడానికి చాలా బాగున్నాయి. అప్పుడు చంద్రబాబుకు ఓటు వేశారు. ఇప్పుడు కూడా మీరు చెబుతున్నారు. వినడానికి బాగున్నాయి. ఇప్పుడు మీకున్న ఆలోచనలను ఇదే తరహాలో చేరవేయగలిగే పరిస్థితి ఉంటుందా? జగన్: చంద్రబాబును ఇంకొక నాయకుడితో పోల్చకూడదు. ఒక పిల్లవాడి వద్దకు వెళ్లి చంద్రబాబు గురించి చెప్పమని మీ టీవీ ఇంటర్వ్యూలో ఎవరినన్నా అడగండి. ఒక్కసారి మైక్ పెట్టి చంద్రబాబుపై మీ అభిప్రాయం ఏంటని అడగండి. వారి నోట్లో నుంచి వచ్చే మొదటి మాట ఏంటో తెలుసా? చంద్రబాబు లాంటి మోసగాడు ఉండరు నాయనా అనే అక్క అయితే, పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్నాడయ్యా, మాఫీ కాలేదు, మా సున్నా వడ్డీ డబ్బులు కూడా పోయాయయ్యా అంటోంది. రైతును అడిగితే.. మా వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడయ్యా. బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నాడయ్యా. బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి రాలేదు కానీ, వేలం నోటీసులు ఇంటికి వస్తున్నాయి. ఆయన చేసిన రుణమాఫీ మా వడ్డీలకు కూడా చాలడం లేదు. ఇంతకు ముందు ప్రభుత్వాలు మాకు వడ్డీ లేకుండా సున్నా వడ్డీకి డబ్బులన్నా ఇచ్చేవి. ఈయన వచ్చాక అదీ రావడం లేదయ్యా. ఆ డబ్బులు కట్టడం మానేశాడయ్యా. అన్యాయం చేశాడయ్యా.. అంటారు. చదువు అయిపోయి ఉద్యోగం వెతుక్కుంటున్న పిల్లవాడు అనేది ఏమిటో తెలుసా? ఉపాధి గానీ ఉద్యోగం గానీ ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఈ రోజు ఉద్యోగం లేదు, రూ.2 వేల నిరుద్యోగ భృతి లేదు, అడ్డగోలుగా మోసం చేశాడన్నా.. అంటాడు. చదువుకుంటున్న పిల్లవాడ్ని అడిగితే, ఈ రోజు ఇంజనీరింగ్ చదవాలంటే లక్ష రూపాయలు ఫీజు కట్టాలి.. ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ రూ.30 వేలన్నా.. అది కూడా ఇవ్వక రెండేళ్లవుతోంది. మిగతా రూ.70 వేలు సంవత్సరం సంవత్సరం మా తల్లిదండ్రులు ఎక్కడ నుంచి తేవాలన్నా.. నాలుగేళ్లలో మూడు లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి.. అప్పుల పాలవుతూ, చదువుకునే పరిస్థితి ఈ రోజు లేదన్నా.. బీసీలపై ప్రేమ అని ఆ పెద్ద మనిషి అంటాడు.. ఇక్కడ చదువే లేక మేం ఉంటే ఏ రకమైన ప్రేమన్నా ఆయనది.. బీసీలపై ప్రేమ అంటే నాలుగు కత్తెరలు, నాలుగు ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడం కాదన్నా.. పిల్లలను అప్పుల పాలు కాకుండా చదివించాలి.. చదివి ఉద్యోగం చేయాలి.. కాస్తో కూస్తో ఇంటికి పంపే పరిస్థితి రావాలి.. అప్పుడే బీసీలపై ప్రేమ అంటారు గానీ, ఇదేమి ప్రేమన్నా.. ఇంత మోసగాడు మరొకరు ఉండరంటారు. ఇంకా కాస్త లోతుకు పోయి అడిగితే, అన్నా.. మమ్మల్ని ఎస్సీలో చేర్చుతానన్నారు.. మమ్మల్ని ఎస్టీలుగా చేస్తానన్నాడు.. మమ్మలి బీసీలుగా చేస్తాడని ఇంకొందరు అంటారు. ఏదీ కాదు అని తెలుసు. తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన చరిత్ర ఉంది. అనుభవం ఉంది. కానీ, ఓట్ల కోసమని, అడ్డగోలుగా మోసం చేసిన పరిస్థితుల్లో ఆయనంత మోసగాడు ఉండరు. ఆయన ముఖ్యమంత్రి కావడమే తన సొంత మామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచే కదా.. ఇంకా అడిగితే.. తొమ్మిదేళ్లు ఆయన సీఎంగా ఉన్నప్పుడూ ఇదే పరిస్థితి.. ఇంతే గొప్పగా చెప్పాడు.. మా ఖర్మ ఏంటంటే, పదేళ్లు గ్యాప్ వచ్చింది.. ఆయన చేసిన మోసాలు మరిచిపోయాం.. కాబట్టి మా ఖర్మకొద్ది ఆయనకు ఓటు వేశామని చెబుతారు. ప్రశ్న: 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చంద్రబాబు చెబుతున్నారు.. మీరు 46 ఇయర్స్ యంగ్మాన్.. క్లాష్ అవుతున్న తీరు ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు. జగన్: త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజలు ఎవరిని ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారనేది తెలుస్తుంది కదా.. ఓటు ఎవరికి వేయబోతున్నారు అనేది తెలిసిపోతుంది. ప్రశ్న: 2014లో మేము అధికారంలోకి రావాల్సిన వాళ్లం అని మీరంటున్నారు. చంద్రబాబు లాస్ట్మినిట్లో అధికారంలోకి వచ్చారు. ఈసారి మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు అధికారంలోకి వస్తానని. చంద్రబాబు నాయుడు పవర్ను నిలబెట్టుకోడు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు. జగన్: నిలబెట్టుకునే దానికే కదా రోజుకో డ్రామా వేస్తున్నాడు. మామూలుగా తెలుగు సినిమాలు చూస్తూ ఉంటాం. సంవత్సరానికి ఐదారు రిలీజ్ అవుతూంటాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్బాబు ఇలా ఒకటీ లేదా రెండు సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. కానీ ఆరు మాసాల్లో ఎన్నికలనే సరికే చంద్రబాబు నాయుడు వారానికో సినిమా. పెన్షన్లు రావడం లేదా.. అయ్యో ఇప్పుడే మంజూరు చేస్తా. అయ్యో మీకు ఇళ్లు మంజూరు కాలేదా.. ఇప్పుడే మంజూరు చేస్తున్నా. పోనీ ఇచ్చారా అంటే అదీ లేదు. అంతా డ్రామా. అయ్యో ప్రత్యేక హోదా రాలేదా? నాలుగేళ్లయి పోయింది. ఇంతవరకూ ప్రత్యేక హోదా రాలేదా? నేను ధర్మపోరాట దీక్ష చేస్తా. అదీ ఒక సినిమా. రాజధాని..అయ్యో ఇంతవరకూ కట్ట లేదా? బాహుబలి సినిమా అయిపోయింది ఇంతవరకూ కట్టడాలు లేవా? అదొక సినిమా అయిపోయింది. గ్రాఫిక్స్ చూపిస్తారు. అయ్యో పోలవరం.. పునాది దాటి ముందుకు పోలేదా.. నా మనవడిని కూడా తీసుకెళ్లి చూపిస్తా. స్పీడు పెంచుతా. 2018 జూన్ కంతా నీళ్లిస్తా. ఇదీ ఒక డ్రామా. ఇన్ని కొత్త సినిమాలు ప్రపంచంలో ఏ హీరో కూడా తీసి ఉండరు. బీజేపీలో కలుస్తాడు కాంగ్రెస్ను తిడతాడు. బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేశాడు. ఇప్పుడు కాంగ్రెస్తో సంసారం చేస్తూ బీజేపీని తిడుతున్నాడు. బీజేపీతో ఉన్నప్పుడు జగన్కు ఓటేస్తే కాంగ్రెస్కు వేసినట్టే అన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్తో ఉంటూ.. జగన్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే అంటాడు.అటు బీజేపీతో, ఇటు కాంగ్రెస్తో సంసారం చేసింది చంద్రబాబునాయుడు గారే. ఇద్దరితో కాపురం చెయ్యని వ్యక్తి, చెయ్యని పార్టీ ఏదన్నా ఉందంటే జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే. ప్రశ్న: మీకు బీజేపీతో సన్నిహిత సంబంధాలున్నాయని పదే పదే చంద్రబాబునాయుడు చెబుతున్నారు. వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి పదే పదే మోడీని కలుస్తున్నారు. అపాయింట్మెంట్లు ఈజీగా దొరుకుతున్నాయి అంటున్నారు. దాన్ని బ్రేక్ చెయ్యడానికి, ఖండించడానికి మీదగ్గరేమైనా ఆధారాలున్నాయా? జగన్: విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ప్రధాన మంత్రిని ఎన్నిసార్లు కలిశాడో చెప్పమనండి.. ఒకసారి నేను కూడా తెలుసుకుంటా. ప్రధాన మంత్రి ఖాళీగా ఉన్నారు.. ఎప్పుడడిగితే అప్పుడు అప్పాయింట్మెంట్ ఇస్తున్నాడు అంటూంటే ఆశ్చర్యంగా ఉంది. ఎన్నిసార్లు కలిశాడో చెబితే.. ఈ టెలికాస్ట్ ద్వారా ప్రజలు తెలుసుకుంటారు. అంత ఖాళీగా ప్రధాని ఉంటున్నాడంటే నేను కూడా తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తా. నాకు తెలిసినంత వరకూ ప్రధానిని ఆయన 4 ఏళ్లలో 3 సార్లు కలిసి ఉంటారు. నాతోపాటు 2 సార్లు వచ్చి ఉంటాడు. అదికాక ఆయనేమన్నా లోకల్ సమస్యలపై ఒకసారో రెండుసార్లో కలిసి ఉంటాడు. అలాంటి అపాయింట్మెంట్ ఎవరికైనా ఇస్తారు. ప్రతి ఎంపీకి ఇస్తారు. దాన్ని వక్రీకరించాలనుకున్నప్పుడు అదే చేస్తారు. ప్రశ్న: ఆంధ్రా పాలిటిక్స్లో ఇదే జరుగుతోంది. బీజేపీ విషయంలో మరో క్లారిఫై చెయ్యాలి. మీరు నరేంద్రమోదీని ఎప్పుడూ విమర్శించరు. ఎన్డీఏ పాలసీని వ్యతిరేకించరు. జీఎస్టీ మీద మాట్లాడరు. దీన్ని బట్టి మీకు, వాళ్లకు అండర్ స్టాండింగ్ ఉందని అంటున్నారు. జగన్: ఎవడండీ అనింది.. నేను నోట్ల రద్దు మీద మాట్లాడలేదని చెప్పింది? ఒక్కసారి రికార్డులు వెనక్కు తియ్యండి. నావల్లే మోదీ నోట్ల రద్దు చేశాడు అన్నది చంద్రబాబు. ఆన్ రికార్డులో అన్నాడు. నోట్ల రద్దు కమిటీకి అధ్యక్షుడు ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు. ఇంప్లిమెంటేషన్ మెకానిజం లేకుండా నోట్ల రద్దు అనేది తొందర పాటు చర్య అని, దీనివల్ల మంచికన్నా చెడు ఎక్కువ జరుగుతుంది అని మొదటిసారి నేనే చెప్పా. జీఎస్టీకి దేశంలో ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చారు. జీఎస్టీకి మద్దతు ఇవ్వకపోతే ఎలాంటి ఇంప్రెషన్ ఇచ్చారో తెలుసా? ప్రపంచమంతా జీఎస్టీని ఇంప్లిమెంట్ చేస్తోంది. దాన్ని అనుసరించకపోతే ఏ లెవెల్లో వెనకబడిపోతాం అన్నది మీడియా ఏ లెవెల్లో హైప్ ఇచ్చింది. ఒక్కసారి చూడండి. ఏ మీడియా కూడా జీఎస్టీని వ్యతిరేకించలేదు. ఏ ముఖ్యమంత్రి వ్యతిరేకించలేదు. కొన్ని సెక్టార్లకు అన్యాయం జరిగిందనేదే గ్రీవెన్స్. చేనేతలకు అన్యాయం జరుగుతోంది అని మేము ప్రధానికి లేఖ ఇచ్చాం. మా ఎంపీలు వెళ్లి ప్రధానిని కలిసి వివరించారు. అరుణ్ జైట్లీకి చెప్పారు. టాక్స్లు రద్దు చెయ్యండి అన్నారు. ప్రశ్న: హోదా మీద కూడా బీజేపీని సుతిమెత్తగా కొడుతున్నారట.. జగన్: చంద్రబాబు నాయుడు ఏ వీడియో టేపులు చూపిస్తున్నాడో.. బీజేపీ అన్యాయం చేసిందని ఏమి చూపిస్తున్నాడో.. 14వ ఆర్థిక సంఘం ఏం చెప్పింది, అభిజిత్సేన్ ఏం చెప్పారు? ఇవన్నీ ముందు ఎవరు చెప్పారు? వీటన్నిటిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవగాహన కల్పించింది ఎవరు? ఒక్క జగనే. అసలు రాష్ట్రాన్ని కాంగ్రెస్ విడగొట్టి ఒక తప్పు చేస్తే.. ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చకపోవడం రెండో తప్పు. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చి ఉండుంటే సుప్రీంకోర్టుకైనా వెళ్లి న్యాయం అడిగివుండే వాళ్లం. ఆ హక్కు కాంగ్రెస్ పార్టీ మాకు ఇవ్వలేదు. అది కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు. బీజేపీ చేసిన తప్పు అధికారంలో ఉండి, చేయతగ్గ స్థానంలో ఉండి, మాట ఇచ్చి, పార్లమెంటులో ఉంటూ, ఐదేళ్లు కాదు, పదేళ్లు ఇస్తామని చెప్పి, మేనిఫెస్టోలో పెట్టి, ఆ తర్వాత తిరుపతికి వచ్చి, సభలోనే ప్రత్యేక హోదాను ఇస్తానని మోడీగారే చెప్పి.. ఇప్పుడు ఆయన ఇవ్వకపోవడం మోడీ, బీజేపీ చేసిన తప్పు. మూడో హంతకుడు నారా చంద్రబాబు నాయుడు. పోరాటం చెయ్యాల్సిన వ్యక్తి, అడగాల్సిన వ్యక్తి నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేశాడు. ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ఏం చేశారండి? ప్రత్యేక హోదా సంజీవనా? అన్నాడు. ప్రత్యేక హోదా గురించి అడిగితే జైలులో పెట్టిస్తాను అన్నాడు. ప్రత్యేక హోదాతో మిగతా రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయ్ అన్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అసెంబ్లీలో ఈ మాదిరిగా మాట్లాడితే.. అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటో నీకు తెలుసా ముఖ్యమంత్రీ? ప్రత్యేక హోదా వల్ల కలిగే మేళ్లు ఏమిటో నీకు తెలుసా ముఖ్యమంత్రి గారూ? అని నేను అసెంబ్లీలో చంద్రబాబుకు క్లాస్ పీకాను. కావాలంటే ఆ టేపులు రివైండ్ చేసి ఒక్కసారి వినండి. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి, ప్రత్యేక హోదాను ఖూనీ చేసి, ప్రత్యేక హోదా కోసం పోరాడిన మా మీద వీళ్లు మాట్లాడుతా ఉంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి దేశ వ్యాప్త చర్చకు కారణమయ్యారు. ఈ పెద్ద మనిషి ఇప్పుడు ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి మళ్లీ ఇప్పుడు కొత్త సినిమా చూపిస్తున్నాడు. ప్రశ్న: మీరు హోదా ఎలా తీసుకొస్తారు? కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాను.. హోదా ఇస్తానని రాహుల్ గాంధీ చెప్పాడని చంద్రబాబు అంటున్నాడు. ఎంపీలు రాజీనామాలు చేశారు.. దేశ వ్యాప్త చర్చ తీసుకొచ్చానని మీరు అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారి అండ లేకుండా, జాతీయ పార్టీ లేకుండా హోదా రాదు. మీరు ఎవరివైపు ఉంటారు? జగన్: హోదా విషయంలో ఈ పార్టీలను నమ్మి నమ్మి సాలైపోయింది. కాంగ్రెస్ మోసం చేసింది. బీజేపీ మోసం చేసింది. చంద్రబాబు నాయుడు మోసం చేసాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా మోసం చేశాడు. అందరూ కలిసే ఈ మోసాలు చేశారు. నేను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున అడిగేది ఒక్కటే. ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి ప్రజలనే మీ ద్వారా కోరుతున్నా. ఎవర్నీ నమ్మొద్దండి. 25కు 25 ఎంపీలు.. మొత్తం వైఎస్సార్ పార్టీకే తెచ్చుకున్న తర్వాత దేశంలో ప్రధాన మంత్రి ఎవరైనా కానీ.. ఐ యామ్ నాట్ బాదర్డ్. బీజేపీ, కాంగ్రెస్ ఎవరైనా కానీ, ఎల్లయ్య కానీ, పుల్లయ్యకానీ, ఫెడరల్ ఫ్రంట్ తరపున రజనీ కానీ ఎవరైనా సరే.. ప్రత్యేక హోదా ఇదిగో నేను సంతకం పెట్టబోతున్నాను. నీ మద్దతు ఇవ్వు అని చెబితే 25 మంది వైఎస్సార్సీపీ ఎంపీలతో మద్దతు ఇవ్వడానికి సిద్ధం. మద్దతు ఇచ్చిన రెండు రోజుల్లో ప్రత్యేక హోదా తేవాలి. 25 మంది ఎంపీలు మన చేతిలో ఉంటే మన దగ్గర అధికారం ఉంటుంది. అలా కాకుండా ఎవరితోనో పొత్తు పెట్టుకుని, మళ్లీ అదే పరిస్థితి పునరావృతమై మళ్లీ మోసపోవడం అంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ప్రశ్న: మీకు పక్క రాష్ట్రం కేసీఆర్తో బాగా సాన్నిహిత్యం ఉందని ప్రచారం జోరుగా ఉంది. కేసీఆర్ కూడా చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్నాడు. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉంది? జగన్: వాస్తవమేంటంటే.. కేసీఆర్ను ఇంత వరకు నేను ఎప్పుడూ కలవలేదు. మొన్న ఆయన గెలిచిన తర్వాత ఫోన్లో మాట్లాడి కంగ్రాచ్యులేట్ చేశా. ఇందులో తప్పేముంది? అంతకన్నా కేసీఆర్తో నాకు పరిచయం లేదు. ప్రశ్న: కానీ కేసీఆర్కు మీపై ప్రత్యేకమైన ప్రేమ ఉంది. గత ఎన్నికల్లో మీరే గెలుస్తారని చెప్పారు. ఇప్పుడు కూడా మీరంటే ప్రత్యేకమైన అభిమానం కనబరుస్తున్నారు. కారణం ఏమై ఉంటుందో మీరు అబ్జర్వ్ చేశారా? జగన్: బేసిక్గా ఏంటంటే.. ఒక మనిషి సినిమాకు పోతాడు. అందులో హీరో క్యారెక్టర్ అంటేనే ఇష్ట పడతాడు. విలన్ క్యారెక్టర్ నచ్చదు. సినిమా చూసినంతసేపు హీరోనే గెలవాలని చూస్తాడు. ఎందుకంటే ఆ మనిషి నైజాన్ని, క్యారెక్టర్ను బట్టి. చంద్రబాబు నైజం, క్యారెక్టర్ దేశ ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంకా దగ్గరగా చూశారు. కేసీఆర్ కూడా దగ్గరగా చూసిన వ్యక్తి కాబట్టి కేసీఆర్ చంద్రబాబుపై అలా మాట్లాడి ఉండచ్చు. ప్రశ్న: సో.. కేసీఆర్ను ఆంధ్ర పాలిటిక్స్లోకి ఆహ్వానిస్తారా? జగన్: ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే ప్రత్యేక హోదా అవసరం. దాని విషయంలో బీజేపీ, కాంగ్రెస్లు మోసం చేశాయి. ఆంధ్రప్రదేశ్లోని పవన్ కళ్యాణ్ కూడా మోసం చేశాడు. ఇంత మంది మోసం చేసినా కూడా కేసీఆర్కు ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేదు. అయినా కూడా తెలుగు ప్రజల కోసం ఒకడుగు ముందుకేస్తాను.. అవసరమైతే హోదా ఇవ్వాలని ప్రధానికి కూడా లేఖ రాస్తానని కేసీఆర్ ముందుకొచ్చి నాలుగు మాటలు మాట్లాడాడు. అటువంటి మంచి మాటలు మాట్లాడిన వ్యక్తిని మనం స్వాగతించాలి. కేసీఆర్కు, బీజేపీ, కాంగ్రెస్కు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద బలమేమీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రత్యేక హోదా కోసం ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు 25 మంది స్వరం విన్పించడం ఒక ఎత్తు. వారికి తెలంగాణకు చెందిన ఎంపీలు 17 మంది మద్దతు పలకడం మరొక ఎత్తు. వారంతా జతై 42 మందిమి ఏకమై ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడిగితే అది ఇంకొక ఎత్తు. ఆ స్టేజ్కు ఎదిగితే ఆంధ్ర రాష్ట్రానికి జరిగే మేలు అంతకంటే మరొకటి ఉండదు. ఇందులో ఎస్యూరెన్స్ అనేది ఆయనే మీడియా ఛానళ్లలో చెప్పారు. కేసీఆర్ కూతురు, ఎంపీ కవిత పార్లమెంట్లోను ఏపీకి హోదా ఇవ్వాలని కోరారు. ప్రశ్న: తెలంగాణాలో కేసీఆర్కు మీ క్యాడర్ సహకరించారు కాబట్టి, ఏపీలో కేసీఆర్ మీకు సహకరిస్తారా? అనే రాజకీయ చర్చ జరుగుతోంది.. జగన్: కేసీఆర్కు ఒకరి సపోర్టు అవసరం లేదు. జగన్ సపోర్టుతో ఆయన గెలిచారని చెప్పడం కూడా కేసీఆర్ను తగ్గించినట్టు అవుతుంది. తెలంగాణలో ఒక పార్టీకి సపోర్టు చేయమని మేం పిలుపునివ్వలేదు. ఎందుకంటే అక్కడి ప్రజలు ఎవరికి ఓటెయ్యాలనేది, ఎవరి వల్ల మేలు జరుగుతుందో చూసుకుని ఓటేసేలా వారి మనస్సాక్షికి వదిలేశాం. అయితే నేచురల్లీ నాన్నగారిని ప్రేమించే వ్యక్తులు, మా పార్టీని ప్రేమించే వ్యక్తులకు టీడీపీతో కూడిన కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలంటే చెయ్యిపోదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా టీడీపీతో పోరాడిన కాంగ్రెస్.. అదే టీడీపీతో కలిసి పోటీ చేయడం. దీంతో సహజంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఉంటారు. అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి.. నేను కచ్చితంగా చెప్పాలి. 2014లో ఫస్ట్ బీజేపీ మాతో ఎప్రోచ్ అయ్యింది.. చంద్రబాబు కన్నా ముందు. నేను పార్టీలో ఉన్న 25 మంది సీనియర్లను పిలిచాను. సోమయాజులు, మైసూరారెడ్డి, కొణతాల రామకృష్ణ అందరిని పిలిచి అందరికీ పేపర్ ఇచ్చాను. ఏం చేద్దాం అని అడిగాను. 25 మందిలో 23 మంది నో చెప్పారు. అంతకన్నా ప్రజాస్వామ్య బద్దంగా నిర్ణయం తీసుకునే విధానం బహుశా ఏ పార్టీ చేసి ఉండదు. ప్రశ్న: మీకు, ఆయనకు ఇంత వ్యక్తిగత వైరమెందుకు? మీరు ఆయన గురించి ఆయన మీ గురించి విమర్శించుకుంటున్నారు. అసలు విషయాలు పక్కదారి పడుతున్నాయి.. జగన్: నేనైతే చంద్రబాబునాయుడు గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క మాట మాట్లాడి ఉంటే నాకు చెప్పండి. నేను మాట్లాడిన ప్రతి మాటలో ఆయన తప్పును ఎత్తి చూపించాను. అయ్యా చంద్రబాబు గారూ.. ఈ మాటన్నారు, ఇది చేశారు.. ఇది అన్యాయం కాదా.. మీకు సిగ్గుగా అనిపించడం లేదా.. ఇలా చెయ్యడానికి మీకు సిగ్గుందా.. అన్యాయం అనిపించడం లేదా అని అన్నానుగానీ, వ్యక్తిగతంగా ఎప్పుడూ అనలేదు. ఎలాగైనా లాభం మాకే ప్రశ్న : మనం ఏపీ పాలిటిక్స్ను అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ ఒక ఫ్యాక్టర్ అవుతోంది. అది పెద్ద ఫ్యాక్టరా..చిన్న ఫ్యాక్టరా అనేది ఎన్నికల్లో తెలుస్తుంది. మీతో కలిస్తే బిగ్ ఫ్యాక్టర్ అంటున్నారు. మీతో కలవకుండా విడిగా పోటీ చేస్తే తెలుగుదేశానికి బిగ్ ఫ్యాక్టర్ అంటున్నారు. తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ కలిస్తే ఇంకో ఫ్యాక్టర్ అంటున్నారు. మీదాకా వచ్చే సరికి అబ్జర్వేషన్ ఏమిటి? ఏది జరిగినా ఈ ట్రయాంగిల్ పార్టీ సిస్టమే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. ఏం జరిగే అవకాశం ఉందని మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? జగన్: నేను మీకొక థియరీ చెబుతా.. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేశాడే అనుకో.. ఏమౌతుంది? లాస్ట్టైం ఇదే చంద్రబాబుతో కలిసి పోటీ చేశాడు. నేను పూచీగా ఉన్నాను.. చంద్రబాబుకు ఓటెయ్యండని ఊరూరా తిరిగారు. ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంతగా తిరిగినందువల్ల ఆయన్ను ప్రేమించే ప్రతి ఒక్కరూ చంద్రబాబుకే ఓటు వేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సపరేట్గా పోటీ చేస్తున్నాడంటే ఏం జరుగుతుంది? ఆ రోజు పవన్ కళ్యాణ్ను అభిమానించే వ్యక్తులే బహుశా పవన్ కళ్యాణ్కు మళ్లీ ఓటు వేసుకుంటారేమో.. అందులో కూడా బహుశా అందరూ వేయరేమో.. మెజార్టీ వాళ్లు వేస్తారేమో.. అప్పుడు ఓటు బ్యాంకు ఎవరిది తగ్గుతుంది? తగ్గేది చంద్రబాబు ఓటు బ్యాంకే తగ్గుతుంది కానీ మా ఓటు బ్యాంకు తగ్గే పరిస్థితి ఉండదు. రెండో సినారియోకొస్తాం.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి పోటీ చేస్తే ఏమి జరుగుతుంది? ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎవరికి వస్తుంది? వైఎస్సార్సీపీకే. ఓటరు దగ్గర ఉన్న ఛాయిస్లు రెండే రెండు. అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు పాలన మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ స్థాయిలో వ్యతిరేక ఓటు ఉందంటే.. చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. రాష్ట్ర ప్రజలు ఎప్పుడు బిహేవ్ చేసినా అట్లానే బిహేవ్ చేస్తారు. 1994లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు 294 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 26 స్థానాలు మాత్రమే. అంటే లెస్ ద్యాన్ 10 పర్సెంట్. అదే రకంగా 2004లో టీడీపీ ఓడిపోయినప్పుడు టీడీపీకి వచ్చిన స్థానాలు 47. అంటే లెస్ ద్యాన్ 15 పర్సెంట్. ఉన్న స్థానాలకు 15 పర్సెంట్ స్థానాలు కూడా రాలేదు. ప్రభుత్వానికి అనుకూలమైన ఓటు, ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు ఇలా రెండే రెండు నిలుస్తాయి. చంద్రబాబు నాయుడు, ఆయన కూటమితో భాగస్వాములుగా ఉన్న వారందరికీ కూడా డిపాజిట్లు కూడా రాని పరిస్థితుల్లోకి వెళ్లిపోతారు. ప్రశ్న: జగన్ చుట్టూనే రాజకీయం జరుగుతుంది.. జగన్ ఏం చెబితే అదే నిర్ణయం అనే ఇంప్రషన్ ఇంకా కంటిన్యూ అవుతోంది. అది వాస్తవమా? కాదా? అంతర్గత ప్రజాస్వామ్యంపై మీరు ఏం చెబుతారు? జగన్: రీజనల్ పార్టీల్లో ఎప్పుడూ కూడా లీడర్ను బట్టే ఓట్లు పడతాయి. ఆ పార్టీని లీడ్ చేసే వ్యక్తి గుణగణాలు ఎలాంటివి? ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఏమిటి? అనే దానిపై ఆధారపడి ఓట్లు పడతాయనేది వాస్తవం. నేను ఇంకేదో చెబితే తప్పు చెప్పినట్టు అవుతుంది. నేచురల్గా నేను తీసుకునే ఏ నిర్ణయానికైనా అన్నింటికంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది నేనే. అందుకే మంచి నిర్ణయం తీసుకోవాలనే ఎవరైనా అనుకుంటారు. మంచి నిర్ణయం తీసుకునే ప్రక్రియలో నేను ఖచ్చితంగా అందరిని సంప్రదిస్తాను. సలహాలు తీసుకుంటాను. ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటానో అన్నది నా ఇష్టానికి వదిలెయ్యాలి. నాకు శ్రేయోభిలాషులుగా ఉన్నవారు, పార్టీలో ముఖ్యులు, అడగదగ్గ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వారిని కచ్చితంగా సంప్రదిస్తాను. ప్రశ్న: 2019లో మిమ్మల్ని చూసి ఓటెయ్యాలా? నియోజకవర్గంలో అభ్యర్థిని చూసి ఓటెయ్యాలా? ఎవరిని చూసి ఓటెయ్యాలి? జగన్: వాస్తవం ఏదంటే డిబేట్ ఏదైనా చేయొచ్చు. మీరు అనుకూలంగాను మాట్లాడొచ్చు. వ్యతిరేకంగా మాట్లాడొచ్చు. ఎనీ రీజనల్ పార్టీ గురించి మీకు చెబుతున్నా.. ఎమ్మెల్యే చేయగలిగిన పనులు చాలా లిమిటెడ్. ఒక పెన్షన్ ఇప్పించలేడు.. ఒక ఇల్లు ఇప్పించలేడు ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి అనే వ్యక్తి మంచి వాడైతే, మనసున్న వ్యక్తి అయితే ఎమ్మెల్యేలు కాలర్ ఎగేసుకొని వాళ్ల నియోజకవర్గంలో తిరగగలుగుతారు. నాన్న టైంలో సాచురేషన్ పద్ధతిలో పెన్షన్ కావాలన్నా.. ఇళ్లు కావాలన్నా.. రేషన్ కార్డులు కావాలన్నా.. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ ఇలా అన్నీ సాచురేషన్ పద్ధతిలో ఎవ్వరికి కష్టం వచ్చినా కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని ఏమీ చూడ లేదు. అర్హుడై ఉంటే చాలు చేసేయమనేవారు. అప్పుడు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వెళ్లి కాలర్ ఎగరేసుకొని తిరిగే వారు. ప్రశ్న: జగన్ మొండివాడు.. ఎవరి మాట వినడు.. అనే మాట ఎందుకు వచ్చింది? జగన్: మొండోడు జగన్ అని మా పార్టీ వాళ్లు ఎవరూ అనరు. గిట్టని వారు, ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. మా పార్టీ వాళ్లను అడిగితే ఒక నిర్ణయం తీసుకుంటే జగన్ గట్టిగా ఉంటాడు అంటారే తప్ప.. ఎవరినీ కలవడు, ఎవరితో మాట్లాడడు అని అనరు. నా అంత ఎక్కువగా అభిప్రాయాలు తీసుకునే వ్యక్తి ఎవరూ ఉండరన్నది మా పార్టీ వాళ్లకు తెలుసు. ప్రశ్న: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి జగన్కు మధ్య పోటీనా? మధ్యలో పవన్ కళ్యాణ్ రాడా..? జగన్: అబ్జల్యూట్లీ కరెక్ట్. పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు గారే ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణలో తాను పోటీ చేస్తానన్నప్పుడు తెలంగాణలో జనసేన మద్దతు ఇచ్చిందని ఆయనంతకు ఆయనే ఓపెన్ డయాస్లో చెప్పుకున్నాడు. ఈ మధ్య కాలంలోనే స్టేట్ మెంట్ ఇచ్చాడు. నేను, పవన్ కలుస్తానంటే జగన్కు అంత బాధ ఎందుకని చంద్రబాబు నాయుడు గారే అన్నారు. సో చూస్తా ఉంటే ఇంతకుముందు కలిసి పోటీ చేసి ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు విడిపోయినట్టుగా నటించి మోసం చేసే కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు ఆ నటన కూడా కాస్తా పక్కన పెట్టేసి ముగుసు తీసేసి మళ్లీ ఒక్కటయ్యే పరిస్థితి కన్పిస్తున్నట్టుగా చంద్రబాబు మాటలను బట్టి చూస్తే అర్థం అవుతోంది. మరి ఏం జరిగినా కాని నాకైతే భయం లేదు. బాధ లేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి పోటీ చేస్తే ఇంకా నేను సంతోష పడతా. ప్రశ్న: పవన్ మీతో వస్తాడని బయట పెద్ద ప్రచారం జరుగుతోంది.. మీతో అండర్ స్టాండ్ అయిపోయిందని. మధ్యలో ఎక్కడ బ్రేక్ అయింది? అసలు ఉందా? జగన్: అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో.. అక్కడ కూడా పాపం ఆయన మీతో వస్తాడంట అని అడగటం కూడా ధర్మం కాదు పాపం. ఎందుకంటే పవన్కళ్యాణ్ నాతో ఎప్పుడూ మాట్లాడింది లేదు. నేను ఆయనతో మాట్లాడింది లేదు. నేను ఆయన్ను చూసింది లేదు.. ఆయన నన్ను చూసింది లేదు. కాబట్టి అలా అనడం కరెక్టు కాదు. ప్రశ్న: పొత్తులు ఈ సారి మీరు వద్దనుకుంటున్నారా? లేకపోతే ఎవ్వరూ రావట్లేదా? జగన్: పొత్తుల గురించి మేము ఏరోజూ ఆరాట పడలేదు. నేను గట్టిగా నమ్మేది ఏంటి అంటే మనం మన కష్టాన్ని నమ్మాలి. ఎవ్వరి మీదో ఆధారపడకూడదనేది గట్టిగా నమ్ముతా. ఒక మనిషిగా నేను అదే పాలసీ పాటిస్తా. ఎప్పుడే విషయంలోనూ నేను ఎవ్వరిమీద ఆధారపడను. నా బలం మీదనే నేను ఆధారపడతాను. నేను గట్టిగా నమ్మేది ఏంటంటే ఓట్లు వేసే వాళ్లు ప్రజలు. ఆశీర్వదించాల్సింది దేవుడు. వీళ్లిద్దరినీ నమ్ముకోవాలి కానీ ఎవ్వరితో ఒకరితో పొత్తు పెట్టుకోవాలి.. వాళ్ల భుజాల మీద నేను నడవాలి అన్న ఆలోచన చేయడమే తప్పు అని నేను భావిస్తా. ఈ రోజు నాకు 175 నియోజకవర్గాల్లో ప్రతి చోటా మా పార్టీకి చెందిన అభ్యర్థి ఉన్నాడు. వాళ్లకు అన్యాయం చేసి పొత్తు పెట్టుకొని వేరే పార్టీకి టిక్కెట్లు ఇచ్చి మన జెండాను మోసిన వ్యక్తిని పక్కన పెట్టడం ధర్మం కాదని నేను భావిస్తా. కాబట్టి నేను ఎప్పుడూ ప్రజల్ని, దేవుడ్ని నమ్ముకున్నా కాబట్టి పొత్తు గురించి నేను ఎప్పుడూ ఆలోచన చేయలేదు. ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఏ రోజూ రాలేదు. ప్రశ్న: మీరు అధికారంలోకి వస్తే వీటన్నిటి మీద ఏం చేస్తారు? జగన్: చంద్రబాబు ప్రజలకు మ్యానిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో చేరుస్తామన్నారు. రుణాలు మాఫీ, ఇంటింటికి ఉద్యోగాలని, రెండు వేలు నిరుద్యోగ భృతి అని, బ్యాంకులో పెట్టిన బంగారం తీసుకొచ్చి ఇస్తానని అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిన వ్యక్తి. అంతే కాకుండా ఇంత దారుణంగా రాష్ట్రాన్ని లూటీ చేసిన వ్యక్తి పాలనపై ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటువంటి వ్యక్తికి తోడుగా ఎవరు వచ్చినా, ఎంత పెద్ద కూటమి ఏర్పాటైనా రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు, కూటమికి గట్టిగా బుద్ధి చెబుతారు. ప్రశ్న: అవినీతిపై మీరు వేసిన పుస్తకంలో ఉన్నవి నిజమని నమ్ముతున్నారు కాబట్టి మీరు అధికారంలోకి వస్తే ఏమి చేస్తారు? జగన్: పుస్తకంలో ఉన్న ప్రతి అంశం మీద వివరంగా విచారణ చేయిస్తా. మొదట క్యాబినెట్ సబ్ కమిటీ వస్తుంది. కోర్టుకు తీసుకుపోయి శిక్ష వేయించగలిగే ఆధారాలు ఉన్నాయన్నప్పుడు ఇవన్నీ కోర్టుకు తీసుకుపోతాము. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏజెన్సీలు బాగా ఉన్నాయి. నాకూ సీఐడీ ఉంది అంటూ అనర్గళమైన మాటలు చంద్రబాబు మాట్లాడారు. ఆ ఏజెన్సీలన్నీ యాక్టివేట్ అయి ప్రతి అంశంపైనా పూర్తి స్థాయిలో విచారించి ఆధారాలు పూర్తిగా వచ్చిన తర్వాత కోర్టు బోన్లో నిలబెట్టే కార్యక్రమం కచ్చితంగా చేస్తాం. ప్రశ్న: మీ మీద కత్తి దాడి జరిగింది, బాధితుడు మీరు.. ప్రత్యక్షి సాక్షి మీరు. మీరు విచారణకు ఎందుకు సహకరించడం లేదు? జగన్: దేశంలో అత్యంత సురక్షితంగా ఉన్న స్థలం ఏదని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఉజ్జాయింపుగా కొన్ని పేర్లు చెబుతారు. అటువంటి పేర్లలో ఎయిర్పోర్టులో వీఐపీ లాంజ్ కూడా ఉంటుంది. అత్యంత సురక్షిత స్థలం అని మనం అనుకునే ఏరియా అది. అటువంటి సురక్షిత ప్రాంతంలోని వీఐపీ లాంజ్లోకి కత్తి ఎలా వచ్చింది? ఇది ప్రాథమికమైన ప్రశ్న. ఆ కత్తి ఎలా వచ్చిందంటే, హత్యాయత్నం చేసిన వ్యక్తి ఎయిర్పోర్టులోని ఒక రెస్టారెంట్లో పని చేస్తున్నాడు. ఆ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు. 2014లో తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం రేసులో ఉన్న వ్యక్తి. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితుడు. ఆ ఎమ్మెల్యే గత చరిత్ర ఎలా ఉందంటే, వంగవీటి రంగా గారి హత్య కేసులో అతను నిందితుడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన విజయవాడ వదిలిపెట్టి విశాఖపట్నం వచ్చి ఎమ్మెల్యే అయ్యాడు. అటువంటి చరిత్ర ఉన్న వ్యక్తికి ఈయన (హర్షవర్దన్) అత్యంత సన్నిహితుడు. హర్షవర్ధన్ చౌదరి... చంద్రబాబు, లోకేశ్తోనూ అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. రెస్టారెంట్ ఆయనది కాబట్టి, ఈ మనిషి (హత్యాయత్నం చేసిన వ్యక్తి) అక్కడ పని చేస్తున్నాడు కాబట్టి ఆ కత్తి వీఐపీ లాంజ్లోకి రాగలిగింది. అక్కడ పని చేస్తున్న ఈ వ్యక్తి, హత్యాయత్నం చేసిన ఈ వ్యక్తిపై ఇదివరకే హత్యాయత్నం చేసిన ఆరోపణ ఒకటి ఉంది. అటువంటి వ్యక్తికి పోలీసులు ఎన్ఓసీ (నో అబ్జక్షన్ సర్టిఫికెట్) ఎలా ఇచ్చారు? ఎన్ఓసీ ఉంటేనే ఎయిర్పోర్టులో సీఐఎస్గానీ ఇంకెవరైనా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండాలి. నేను విశాఖపట్నంలోకి ప్రవేశించింది ఆగస్టు 14న. ఐదు నెలల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే తిరుగుతున్నా. హత్యాయత్నం మధ్యలో మూడు నెలల తర్వాత జరిగింది. నేను విశాఖపట్నంలోకి ప్రవేశించడంతోనే ఎయిర్పోర్టులో సీసీ కెమెరాలు పని చేయడం ఆగిపోయాయి. ఆ తర్వాత నామీద హత్యాయత్నం జరిగేదాకా అవి పని చేయలేదు. నేను విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించిన తర్వాతే అవి పని చేయకుండా పోయాయి. హైకోర్టులో జడ్జి కూడా ఈ ప్రస్తావన చేశారు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో హత్యాయత్నం జరిగితే ఒక గంట లోపే డీజీపీ, మంత్రులు, చంద్రబాబునాయుడు ముందుకు వచ్చి కేసును తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చారు. ఒక మార్ఫ్డ్ ఫ్లెక్సీని విడుదల చేశారు. ఫ్లెక్సీ వేసే అభిమాని ఎవరైనా గరుడ పక్షి ఫొటో పెడతారా? నువ్వే చెప్పు.. పెడితే మా అమ్మ ఫొటో లేకపోతే మా నాన్న రాజశేఖరరెడ్డి ఫొటో పెడతారు. ఇంకా ఎక్కువ అభిమానస్తుడైతే నా చెల్లెలు ఫొటో కూడా పెడతారు. అంతేగాని గరుడ పక్షి ఫొటో ఎవరు పెడతారు? వైసీపీ ప్లెక్సీ బ్లూ కలర్లో ఉంటుంది. సాధారణంగా పసుపు కలర్లో తెలుగుదేశం ఫ్లెక్సీలు, బ్లూ కలర్లో వైసీపీ ఫ్లెక్సీలుంటాయి. ఈ ఫ్లెక్సీ పసుపు కలర్లో ఉంది. గంటలో మార్ఫ్డ్ ఫ్లెక్సీని విడుదల చేశారు. చేసిన తర్వాత ఈ మనిషి (హత్యాయత్నం చేసిన వ్యక్తి) నా అభిమాని అని తప్పుడు ప్రచారం చేశారు. నేను నిన్నే అడుగుతున్నా.. నిన్ను ప్రేమించేవాళ్లు ఎవరైనా నిన్ను చంపాలని ప్రయత్నిస్తారా? నన్ను ప్రేమిస్తున్నాను, అభిమానిస్తున్నాడంటూనే చంపడానికి ప్రయత్నించాడని వాళ్లే మళ్లీ అంటారు. ప్రశ్న: అందుకే మీరు మాట్లాడలేదా? జగన్: కాదు. ఘటన జరిగిన వెంటనే నేను జెంటిల్మెన్గా వ్యవహరించా. ఎలా జరిగింది.. ఎవరు చేశారు.. ఎందుకు చేశారో సడన్గా తెలియని పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితిలో నా నోటి నుంచి ఆవేశపూరితమైన ప్రకటనలు (వైల్డ్ స్టేట్మెంట్స్) వస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది. ప్రతిపక్ష నాయకుడి మీద హత్యాయత్నం, ఫలానా వాళ్లు చేయించారని తెలిసీ తెలియని మాటలు మాట్లాడితే దాని పర్యవసానంతో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది. అది తెలిసి జెంటిల్మెన్గా వ్యవహరించా. హత్యాయత్నం జరిగిన తర్వాత చొక్కా మార్చుకున్నా. హత్యాయత్నం జరిగిన చోట నేను ఒక్కడినే కాదు.. 30 మంది ఉన్నారక్కడ వీఐపీ లాంజ్లో. సీఎస్ఐ సిబ్బంది, ఇండిగో సిబ్బంది, ఇతర వీఐపీలు కూర్చున్నారు. వారి ముందు ఘటన జరిగింది. ఘటన జరిగాక రక్తం కారుతుంటే చొక్కా విప్పి ప్రాథమిక చికిత్స చేసిన వాళ్లే ఎయిర్పోర్టులో కట్టుకట్టారు. మళ్లీ ఇంకో చొక్కా వేసుకుని హైదరాబాద్కు వచ్చి, ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నా. ఆ తర్వాత ఇంటికి వచ్చి రెండు వారాలు విశ్రాంతిలో ఉన్నా. విశ్రాంతి పూర్తయిన తర్వాత మళ్లీ పాదయాత్ర మొదలు పెట్టా. మొదలుపెట్టిన మొదటి మీటింగ్లోనే ఇవన్నీ అడిగాను. ఎక్కడా నేను మాట్లాడలేదు. ప్రశ్న: మరి విచారణ? జగన్: నువ్వే చెప్పు రజనీ.. హత్యారోపణ ఎదుర్కొంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు అదే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పోలీసులతో విచారణ చేస్తే న్యాయం జరుగుతుందా? హత్యాయత్నం చేయించింది రాష్ట్ర ప్రభుత్వమని మేము అనుకుంటున్నాం. అటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పోలీసులతో, డీజీపీ గంటకే తప్పుదోవ పట్టించే స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితులు చూసిన నేపథ్యంలో, డీజీపీ ఇంత దారుణంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అదే పోలీసులచేత విచారణ జరిగితే న్యాయం జరుగుతుందని ఎవరైనా అనుకుంటారా? కాబట్టి మేము థర్డ్ పార్టీ విచారణ అడిగాం. థర్డ్ పార్టీ ఎవరని మేం చెప్పలేదు. మీ ఇష్టం.. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని థర్డ్ పార్టీ ఎవరితోనైనా విచారణ చేయించమని అడిగాం. తప్పేం ఉంది? జగన్ అనే వ్యక్తి ఫిబ్రవరిలో ఇక్కడే కొత్త ఇంట్లో చేరనున్నాడు ప్రశ్న: మీరు రాజధానిని మారుస్తారని,లేదంటే కుదిస్తారని, మరేమేమో చేస్తారని ప్రజలకు అనుమానం ఉంది? జగన్: ఇదే మాట చంద్రబాబునాయుడును ఎందుకు అడగటం లేదు. ఇంతవరకు రాజధాని ప్రాంతంలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ లేదు. ఏదైనా తాత్కాలికమే. సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు అన్నీ తాత్కాలికమే. పర్మనెంట్ అనే పేరుతో ఇంతవరకు ఒక్క ఇటుక వేయలేదు. ఎందుకు వేయడం లేదు? ఎందుకు మీరు అడగటం లేదు? ఇదే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ఇల్లు కట్టాడా? హైదరాబాద్లో వంద కోట్లపైన ఖర్చుపెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఇంట్లో వేసిన మార్బుల్ గురించి, ఫ్లోరింగ్ గురించి కథలు కథలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అడుగుకు వేలల్లో ఖర్చు పెట్టారంట.. ఎందుకు రాజధానిలో ఇల్లు కట్టలేదు? ముఖ్యమంత్రిగా ఉన్నాడు.. ఇక్కడ ఉండాలనుకుంటే ఇల్లు కట్టాలి. అదే రాజధాని ప్రాంతంలో జగన్ అనే వ్యక్తి ఇల్లు కడుతున్నాడు.. ఫిబ్రవరిలో కొత్త ఇంట్లోకి చేరబోతున్నాడు. ఆఫీసు కడుతున్నాం అక్కడ. ఇన్ని కనిపిస్తున్నా రకరకాలుగా తిమ్మిని బమ్మిని చేసే మాటలు మాట్లాడుతున్నారు. ఏదో ఒక ఆరోపణ ఏదో రూపంలో చేస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసిన అవినీతి రాజధానిలో ఆ స్థాయిలో ఉంది. ఆ అవినీతిపై ఏ స్థాయిలో విచారణ జరుగుతుందో తెలియదు. బహుశా నాస్టేజీ దాటిపోయి, కోర్టు స్టేజీ దాటిపోయి, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల నుంచి ఏ స్టేజీలోకి పోతుందో నాకు తెలియదు. రాజధాని భూముల్లో జరిగిన అవినీతి మామూలు అవినీతి కాదు. ల్యాండ్ పూలింగ్లో తీసుకున్న ఈ భూములను ఇష్టం వచ్చిన రేటుకు, ఇష్టం వచ్చిన వ్యక్తికి లంచాలు తీసుకుని ఇచ్చారు. సింగపూర్ కంపెనీ అంట.. 16 నుంచి 17 వందల ఎకరాలు ఎందుకిస్తున్నాడండీ? వాళ్లు అక్కడ చేసేది ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి దమ్మిడీ మేలు జరగదు. వాళ్లు అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తారంట. ప్లాట్లు వేసి అమ్ముతారంట. వచ్చే లాభాలు తీసుకునేది వాళ్లే. ఇంతటి దారుణంగా స్కాములు జరుగుతుంటే వీటిపై విచారణలు జరగకుండా ఉంటాయా? జరిగితే తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యుడు ఎవరు? చంద్రబాబు కాదా? బాబుకు దేవుడు మొట్టికాయలు వేసే రోజొస్తుంది ప్రశ్న: జైలుకు పంపించే పరిస్థితి కూడా ఉంటుందా? జగన్: జైలుకు పోతాడా, పోడా అన్నది ఆధారాలు, సాక్ష్యాలను బట్టి ఉంటుంది. నేను చిన్న ఉదాహరణ చెబుతా. రాజధాని పలానా చోట వస్తుందని చంద్రబాబునాయుడుకు తెలుసు. ప్రజలను మిస్లీడ్ చేస్తాడు. నూజివీడు దగ్గర వస్తుంది, ఇంకోచోట వస్తుందని మిస్లీడ్ చేశాడు. అధికారం చేపట్టాక డిసెంబరు దాకా ఎక్కడ అనేది చెప్పలేదు. మధ్య ఆరు నెలల కాలంలో ఆయన, ఆయన బినామీలు రాజధాని ఎక్కడ వస్తుందో అక్కడ రైతుల వద్ద నుంచి భూములు కొన్నారు. సాక్షాత్తు హెరిటేజ్ అనే ఆయన సొంత సంస్థ పేరిట కూడా 14 ఎకరాలు రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేశాడు. ఆ తర్వాత రాజధాని అక్కడే ఏర్పాటు చేశారు. దీనిని స్టాక్ మార్కెట్లో అయితే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. ఇందుకు శిక్ష మూడు నుంచి నాలుగేళ్లు జైలులో ఉండాల్సి వస్తుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వ్యక్తి రాజ్యాంగ రహస్యాలను వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోనని ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇక్కడ తాను, తన బినామీలు బాగుపడేదాని కోసం రాజ్యాంగ రహస్యాన్ని తన వ్యక్తిగత అవసరం కోసం వాడుకున్న పరిస్థితి. దీనికి శిక్ష ఏమిటి? ఆధారాలతో సహా ఉన్నాయి. ఇటువంటివి అనేకం అక్కడ ఉన్నాయి. ఎప్పుడో ఒకసారి దేవుడికి కూడా కోపం వస్తుంది. శిశుపాలుడికి కూడా 100 తప్పులు నిండిన తరువాత 101వ తప్పు చేస్తే దేవుడు మొట్టికాయలు వేశాడు. ఈయన చేసిన అన్యాయాలకు, అవినీతికి, అప్రజాస్వామిక పాలనకు కచ్చితంగా ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒకసారి దేవుడు మొట్టికాయలు వేసి బుద్దిచెప్పే పరిస్థితి వస్తుంది. ప్రశ్న: ఇప్పుడు ఎన్ఐఏ వచ్చింది.. సహకరిస్తారా? జగన్: తప్పకుండా సహకరిస్తాం. మేం సహకరించేది ఏంటి.. వాళ్లు విచారణ చేయాలి. విచారణ తర్వాత దోషులను పట్టించాలి. నేను బాధితుణ్ణి. ఏం జరిగిందనేది వాళ్లు నాకు చెప్పాలి.. రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ప్రశ్న: పాదయాత్రలు చేసిన వాళ్లందరూ సీఎంలయ్యారు.. మీరు కూడా అవుతున్నారా? జగన్: దేవుని దయ, ప్రజల దీవెనలు. -
వైఎస్ జగన్పై దుష్ప్రచారం: చానళ్లకు నోటీసులు
-
వైఎస్ జగన్పై దుష్ప్రచారం: చానళ్లకు నోటీసులు
జగన్పై మరోసారి ఎల్లో మీడియా వీరంగం - మూడు చానెళ్లకు జగన్ లాయర్ల లీగల్ నోటీసులు - ఏపీ విపక్ష నేత లక్ష్యంగా టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఈటీవీ విష కథనాలు - ఈడీ ట్వీట్లకు సొంత కథను జోడించి మరీ ప్రసారం... సాయంత్రం ఈడీ చేసిన ప్రకటనను పట్టించుకోని వైనం - ఇదంతా దురుద్దేశపూర్వకంగానే చేశారన్న జగన్ న్యాయవాదులు సాక్షి ప్రత్యేక ప్రతినిధి ఎల్లో మీడియా మళ్లీ విషం గక్కింది. అదిగో తోక అంటే.. ఇదిగో మేక అన్న చందాన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం ఇచ్చిన రెండు ట్వీట్లను పట్టుకుని ఎల్లో చానెళ్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9, ఈటీవీ రసవత్తరమైన కథను అల్లి పారేశాయి. అసలు ఈడీ ఏం చెప్పిందో.. ఎవరెవరినుద్దేశించి చెప్పిందో కూడా పట్టించుకోకుండా తమకు అలవాటైన తప్పుడు కథనాల్ని నిస్సంకోచంగా ప్రసారం చేసేశాయి. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా తమ నాయకుడు చంద్రబాబునాయుడు ఇరుకున పడటం, ఓటుకు కోట్లు కేసులో సాక్షాత్తూ చంద్రబాబుకే సుప్రీంకోర్టు నోటీసులివ్వటం... వీధి రౌడీల్ని మరిపిం చిన ఏపీ మంత్రుల గూండాగిరీని జనం అసహ్యించుకోవటం... ఏపీలో పెరుగుతున్న విచ్చలవిడి అవినీతిపై జాతీయ మీడియాలోనూ వార్తలొస్తుండటంతో... వీటన్నిటి నుంచి జనం దృష్టిని మళ్లించటానికి ఎల్లో చానెళ్లు శనివారం ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేశాయి. అసలు ఏం జరిగిందంటే...: మనీ లాండరింగ్ ఆరోపణలెదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం చగన్ భుజబల్, నేషనల్ రూరల్ హెల్త్మిషన్ స్కాం ఆరోపణలెదుర్కొంటున్న యాదవ్ సింగ్, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, ఇతర కేసుల్లో ఆరోపణలొచ్చిన ఏజీఎస్ ఇన్ఫోటెక్, రాజేశ్వర్ ఎక్స్పోర్ట్స్ ఇలా పలు సంస్థలు, వ్యక్తులకు చెందిన షెల్ కంపెనీల్లో సోదాలు నిర్వహించినట్లు సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ట్వీట్ చేసింది. వివిధ అంశాలకు సంబంధించి తాము సోదాలు జరిపిన సంస్థలు దేశ వ్యాప్తంగా 300 వరకూ ఉంటాయని కూడా మరో ట్వీట్లో తెలియజేసింది. నిజానికి ఇందులో రాజేశ్వర్ ఎక్స్పోర్ట్స్ అనే సంస్థ యారో గోల్డ్ జ్యుయలరీ ప్రైవేట్ లిమిటెడ్ అధిపతి రితేష్ జైన్ది. ఈ సంస్థ ద్వారా వందల కోట్ల రూపాయలు లాండరింగ్ జరిగిందని ఈ నెల మొదట్లోనే ఈడీ ప్రకటించింది. దానికి సంబంధించి కొందరిని అరెస్టు చేసింది కూడా. తాజాగా దీనికి చెందిన మరికొన్ని కంపెనీల్లోనూ సోదాలు జరిపినట్లు ప్రకటించింది. ఎన్ఆర్హెచ్ఎం, చగన్ భుజబల్ వ్యవహారాలు కూడా ఇదివరకు ఈడీ పేర్కొన్నవే. ఎల్లో మీడియాకు ఇది చాలదా! ఈడీ ట్వీట్లను పట్టుకుని, రాజేశ్వర్ ఎక్స్పోర్ట్స్తో జగన్మోహన్రెడ్డికి సంబంధాలున్నాయని, అదంతా ఈడీ చెప్పిందని, ఈ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని... ఇంకా ఏవేవో పచ్చి అబద్ధాలను వండేసింది ఎల్లో మీడియా. కనీసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే పదాన్ని సరిగా పలకటం కూడా చేతకాకపోయినా... దానికి సొంత కవిత్వాన్ని జోడించి ఈ చానెళ్ల ప్రతినిధులు జగన్పై కథనాల్ని వండేయటం చూస్తే వీళ్ల ఎల్లో జర్నలిజం ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం కాకమానదు. బహుశా.. ఇదంతా చూసో ఏమో.. ఈడీ సాయంత్రం సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది. అందులో వివిధ ఆరోపణలున్న పలువురు వ్యక్తులు, సంస్థల పేర్లు చెబుతూ... వాటికి సంబంధించి తాము వివిధ కంపెనీల్లో సోదాలు జరిపామని మాత్రమే పేర్కొంది. ఈ ప్రకటనలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి చెందిన కంపెనీలు... అని తప్ప ఒక్క కంపెనీ పేరుగానీ, వేరొక కంపెనీతో సంబంధాలున్నట్లు గానీ ఎక్కడా పేర్కొనలేదు. కానీ ఎల్లో మీడియాకు ఇదేమీ పట్టలేదు. ఎందుకంటే ఆ మూడు చానెళ్లు అప్పటికే వండాలనుకున్న కథనాల్ని వండేశాయి. మూడు చానెళ్లకు లీగల్ నోటీసులు కాగా రాజేశ్వర్ ఎక్స్పోర్ట్ అనే కంపెనీ పేరు కూడా తమ క్లయింట్కు తెలియదని, అలాంటిది ఆ కంపెనీతో సంబంధాలు అంటగడుతూ.. కథనాలు ప్రసారం చేయటం ఉద్దేశపూరితంగా తన క్లయింట్ ప్రతిష్టను దెబ్బ తీయటానికేనని జగన్మోహన్రెడ్డి తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఏమాత్రం ధ్రువీకరించుకోకుండా, ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా ప్రసారం చేసిన ఈ వార్తాకథనాల వెనక తీవ్ర స్థాయి దురుద్దేశాలున్నట్లు వారు అభిప్రాయపడ్డారు. అందుకే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9, ఈటీవీ చానెళ్లకు లీగల్ నోటీసులు జారీ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. రాజకీయం తప్ప ఏముందిందులో? నిజానికి ‘సాక్షి’లో పెట్టుబడులకు సంబంధించి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై పెట్టిన కేసులన్నీ రాజకీయ పూరితమైనవని ఆది నుంచీ నిరూపితమవుతూనే ఉంది. జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టాక కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయి కేసులు వేయటం, మూడు నెలల్లో బెయిలు రావాల్సిన కేసులో... 16 నెలలకు పైగా జైల్లో ఉంచటం ఇవన్నీ తెలియనివేమీ కావు. అంతేకాదు.. సోదాల నుంచి మొదలు పెడితే ముక్కలు ముక్కలు చార్జిషీట్లు వేయటం వరకూ ఏ కేసులోనూ జరగని వింతలన్నీ ఈ కేసులోనే చోటుచేసుకున్నాయి. అసలు జగన్మోహన్రెడ్డిని ఏమాత్రం ప్రశ్నించకుండానే ఆయనపై తొలి చార్జిషీటును వేయటం చూస్తే... ఈ కేసు ఎలా సాగిందన్నది ఇట్టే తెలిసిపోతుంది. అలాంటి కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. ఈ దశలో కూడా ఏపీలో జగన్కు పెరుగుతున్న ప్రజాదరణను దెబ్బతీయాలని, ఆయన పార్టీ నేతల్ని గందరగోళంలో పడెయ్యాలనే ఉద్దేశంతో చంద్రబాబు కేంద్ర స్థాయిలో తనకున్న లింకుల్ని ఉపయోగించి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎల్లో మీడియాతో సహా పలు వర్గాల్ని రంగంలోకి దింపుతున్నారు. దర్యాప్తు పూర్తయి, విచారణ జరుగుతున్న ప్రస్తుత దశలో కూడా జగన్మోహన్ రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ సీబీఐ ఇటీవలే పిటిషన్ వేయటం గమనార్హం. ఆ పిటిషన్ విచారణకు వస్తున్న దశలో దాన్ని ప్రభావితం చెయ్యాలన్న ఉద్దేశంతో ఎల్లో మీడియా మళ్లీ శివాలెత్తటం వెనక పరిణామాల్ని తేలిగ్గానే ఊహించుకోవచ్చు. -
ఏబీఎన్, టీవీ9 ప్రసారాలు పునరుద్ధరించాలి
హైకోర్టులో పిల్ సాక్షి, హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 ప్రసారాలను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని రంగారెడ్డి జిల్లా, కొత్తపేటకు చెందిన మురళి దాఖలు చేశారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలు కేబుల్ నెట్వర్క్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. -
చానళ్ల మూసివేతపై జర్నలిస్టుల నిరసన
-
హర్షవర్ధన్ వేషాలు ఇన్నిన్ని కావయా!!
-
ఆ చానళ్ల విషయంలో త్వరలో చర్యలు
* పత్రికా స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోం: జవదేకర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిలిచిపోయిన టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్ల ప్రసారాల పునరుద్ధరణ విషయంలో రెండు రోజుల్లో చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. మెదక్ ఉప ఎన్నిక ప్రచారం కోసం గురువారం హైదరాబాద్కు వచ్చిన ఆయనను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ రెండు చానళ్ల సిబ్బంది, ఐజేయూ ప్రతినిధులు కలిశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంఎస్వోలు ఆ రెండు చానళ్ల ప్రసారాలను నిలిపేశారని, పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. దీనికి స్పందించిన జవదేకర్ ఎన్నికల హడావుడి రెండు రోజుల్లో ముగుస్తుందని, ఆ తర్వాత తీసుకోబోయే చర్యలేంటో మీరే చూస్తారని వ్యాఖ్యానించారు. మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జవదేకర్ సూచించారు. -
టీవీ9, ఏబీఎన్ జర్నలిస్టుల ఆందోళన
-
మీడియా స్వేచ్ఛను గౌరవించాలి!
-
మా చానళ్ళపై వివక్ష చూపుతున్నారు!
-
తెలంగాణను అగౌరవ పరిస్తే.. పాతరేస్తాం!
-
పోలీసులకు లొంగిపోయిన టీవీ9 రవిప్రకాష్
హైదరాబాద్: టీవీ 9 సీఈఓ రవి ప్రకాష్ ఈరోజు ఎల్బినగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు. తెలంగాణ ప్రజాప్రతినిధులను కించపరిచేలా కథనం ప్రసారం చేసిన టీవీ9 న్యూస్చానల్పై, ఆ సంస్థ సీఈఓ రవిప్రకాష్పైన జూన్లో ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. జూన్ 12వ తేదీ రాత్రి 8.30 గంటలకు టీవీ9లో తెలంగాణ ప్రజాప్రతినిధులను కించపరిచే విధంగా కథనం ప్రసారం చేశారని ఆరోపిస్తూ 18న ఎల్బీనగర్కు చెందిన న్యాయవాది సుంకరి జనార్దన్గౌడ్ సైబరాబాద్ రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన న్యాయస్థానం టీవీ9 సంస్థ, దాని సీఈవో రవిప్రకాష్పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రవిప్రకాష్కు నోటీసులు జారీ చేశారు. రవిప్రకాష్ ఈరోజు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. కేసుకు సంబంధించి పోలీసులు కొద్దిసేపు అతనిని ప్రశ్నించారు. ఆ తరువాత అతనిని పంపించివేశారు. -
పోలీసులకు లొంగిపోయిన టీవీ9 రవిప్రకాష్
-
'హేళన చేసేలా టీవీ-9 చూపించడం విచారకరం'
-
'హేళన చేసేలా టీవీ-9 చూపించడం విచారకరం'
హైదరాబాద్ : అవహేళన చేసేవిధంగా కథనాలు ప్రసారం చేశారంటూ ఛానల్స్ ప్రసారాలు నిలిపివేయటం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. జడ్జిమెంట్ ఇవ్వకుండానే నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ఆయన బుధవారమిక్కడ ప్రశ్నించారు. ఎమ్ఎస్ఓల చర్య ప్రతీకార దాడిగా కనిపిస్తోందని జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఎంఎస్ఓలు ఈ నిర్ణయాన్ని స్వతంత్రంగా తీసుకుంటే సంతోషిస్తానని ఆయన అన్నారు. అయితే వారి నిర్ణయంలో ప్రభుత్వం ఒత్తడి ఉండకూడదన్నారు. అయితే ప్రసార మాధ్యమాలు కూడా స్వయం నియంత్రణ పాటించాలని ఆయన మరోవైపు వ్యాఖ్యలు చేశారు. మీడియాకు స్వేచ్ఛ ఉండాలని, అయితే అది హద్దులో ఉండాలన్నారు. శాసనసభను హేళన చేసేలా టీవీ-9 చూపించటం విచారకరమని జానారెడ్డి అన్నారు. ఆ చర్యను తాము ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ జెన్కోకు చెందిన అన్ని విద్యుత్ ప్లాంట్లతో విద్యుత్ పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న ముసాయిదా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ కోరటం సరికాదని జానారెడ్డి అన్నారు. అది విభజన చట్టాన్ని ఉల్లంఘించటమేనని అన్నారు. ఈఆర్ఎస్కి చంద్రబాబు లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందని జానా ప్రశ్నించారు. పీపీఏలను రద్దు చేయరాదంటూ కేంద్రాన్ని కోరతామన్నారు. ఇటువంటి కక్షసాధింపు చర్యలు సరికాదని ఆయన అన్నారు. -
ఆ చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలి
ఐజేయూ, టీయూడబ్ల్యూజే టీవీ9 కార్యక్రమంపై ఖండన సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్ల ప్రసారాలను నిలిపివేస్తూ తెలంగాణ ఎంఎస్ఓల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్(ఐజేయూ), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (టీయూడబ్ల్యూజే) ఖండించాయి. ఈ నిర్ణయం భావ ప్రకటనా స్వేచ్ఛకు, సమాచారాన్ని తెలుసుకునే హక్కుకు విఘాతం కలిగిస్తున్నదని ఐజేయూ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్. శేఖర్, విరాహత్ అలీలు సోమవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. టీవీ చానళ్లలో ప్రసార నాణ్యత, మంచీ చెడ్డలను నిర్ణయించే అధికారాలను సొంతం చేసుకునే ప్రయత్నాలను ఎంఎస్ఓలు విరమించుకొని, తక్షణమే ప్రసారాలను పునరుద్ధరించాలని కోరారు. ప్రజాప్రతినిధుల పట్ల టీవీ-9 ప్రసారం చేసిన కార్యక్రమాన్ని ఐజేయూ, టీయూడబ్ల్యూజే ఖండిస్తున్నాయని పేర్కొన్నారు. -
టీవీ9, ఏబీఎన్ ప్రసారాలు నిలిపివేత
తెలంగాణ సంస్కృతిని కించపరిస్తే సహించం భాష, యాసను గౌరవించకుంటే అన్ని చానళ్లకు అదేగతి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజాప్రతినిధులు, శాసనసభను అగౌరవపరిచేలా ప్రసారాలు చేయడంతోపాటు, ఇక్కడి సంస్కృతిని దెబ్బతీసేలా ఉన్న టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానళ్ల ప్రసారాలను నిలిపివేస్తున్నట్టు మల్టీసిస్టమ్ ఆపరేటర్స్ ఆర్గనైజేషన్ (ఎంఎస్ఓ), కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్(సీఓఏ) ప్రతినిధులు ప్రకటించారు. సోమవారం సికింద్రాబాద్లో తెలంగాణ రాష్ర్ట ఎంఎస్ఓ, సీఓఏ ప్రతినిధుల సమావేశం జరిగింది. అనంతరం ఎంఎస్ఓ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు సుభాష్రెడ్డి, గౌరవ అధ్యక్షుడు కావేటి సమ్మయ్య, పూర్వ అధ్యక్షుడు కులదీప్ సహానీ, నల్లగొండ అధ్యక్షుడు ఏచూరి భాస్కర్, కేబుల్ ఆపరేటర్ల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఈ రెండు చానళ్లు గతంలో శతవిధాలా ప్రయత్నించాయని చెప్పారు. ఉద్యమ సమయంలో వీటి ప్రసారాల ఫలితంగానే ఎందరో విద్యార్థులు, ఉద్యమకారులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటై కొత్త ప్రభుత్వం వచ్చాక సైతం ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను కించపరిచేలా విష ప్రసారాలు చేస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసారాలు చేస్తున్నాయని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన దళిత మహిళ బొడిగ శోభ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని కించపరిచేలా ప్రసారం చేయడం తెలంగాణ ప్రజల మనసును గాయపరిచిందన్నారు. తెలంగాణ ప్రజలను అవమాన పరిచే తరహాలో ఈ రెండు చానళ్లు పనిగట్టుకుని ప్రసారాలు చేస్తుండడంతో గత్యంతరం లేకే వాటి ప్రసారాలను నిలిపేస్తున్నామన్నారు. ఈ చానళ్ల యాజమాన్యాలు దిగివచ్చి, తమ డిమాండ్లను అంగీకరిస్తేనే ప్రసారాలు పునరుద్ధరిస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంలో ప్రసారాలు చేస్తున్న సీమాంధ్ర చానళ్లు ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేలా ప్రసారాలు చేయాలని, భాష, యాసను గౌరవించాలని వారు విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో సీమాంధ్ర చానళ్లన్నింటికీ ఇదేగతి పడుతుందని వారు హెచ్చరించారు. పాతరేట్లనే చెల్లిస్తాం.. పే చానళ్లకు పాత పద్ధతుల్లోనే చార్జీలు చెల్లిస్తామని ఎంఎస్ఓ, సీఓఏ ప్రతినిధులు ప్రకటించారు. కొత్తగా రూపొందించిన చార్జీలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
తెలంగాణలో TV9, ABN ప్రసారాల బంద్