Vakeel Saab
-
ఆ ఫోటోలు ఎందుకు షేర్ చేస్తానంటే: అనన్య నాగళ్ల
మల్లేశం సినిమాతో వెండితెరకు పరిచయమైన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. అందం, అభినయంతో పాటు నటనలో మంచి టాలెంట్ ఉన్న బ్యూటీ అనన్య.. వకీల్ సాబ్ సినిమా అనన్యకు మంచి బ్రేక్ ఇచ్చింది కానీ, అవకాశాలను మాత్రం అందివ్వలేకపోయింది. దానికి ప్రధాన కారణం తెలుగమ్మాయి అనే ప్రశ్నలు రావడం సహజం. తను హీరోయిన్ మెటిరీయల్ అయినప్పటికీ సహాయనటిగానూ ప్రేక్షకులను మెప్పించింది. ప్రధాన కథాననాయకగా ఆమె నటించిన తాజా చిత్రం ‘అన్వేషి’. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇన్స్టా వేదికగా తరచూ గ్లామరస్ ఫొటోలు షేర్ చేయడానికి గల కారణాన్ని ఆమె తెలిపారు. 'వకీల్సాబ్’కు ముందు ఎక్కువగా ట్రెడిషనల్ ఫొటోలు షేర్ చేసేదాన్ని. శాకుంతలం చిత్రంలో నటిస్తున్న సమయంలో ఒక గ్లామర్ పిక్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. దానికి చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఆ ఫొటోలు షేర్ చేయడానికి అప్పట్లో ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు. కాకపోతే ఆ ఫొటోలకు భారీగా రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాటు సినిమా అనే రేస్లో నేను ఉండాలనుకుంటున్నా.. ఇక్కడ నువ్వు కొనసాగాలంటే అన్ని రకాలుగా కనిపించాలి. ఈ కారణంతో మాత్రమే నేను గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తున్నాను. అంతకుమించి ఎలాంటి కారణం లేదు. కమర్షియల్ సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయి.. కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు.' అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ఇలా ఓపెన్గా ఉన్న విషయాన్ని చెప్పిన అనన్యపై నెటిజన్లు కూడా పాజిటివ్గానే రెస్పాన్స్ అవుతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన 'అన్వేషి' చిత్రాన్ని వి.జె.ఖన్నా డైరెక్ట్ చేశాడు. నవంబర్ 17న ఇది విడుదల కానుంది. -
వకీల్సాబ్ నటిపై రూమర్లు.. మండిపడ్డ టాలీవుడ్ బ్యూటీ
టాలీవుడ్లో మల్లేశం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ అనన్య నాగళ్ల. మొదటి మూవీతోనే మంచి గుర్తింపు పొందిన ఈ బ్యూటీ ఇప్పుడిప్పుడే కెరీర్లో ముందుకెళ్తోంది. అయితే ఇటీవల ఆమెపై గాసిప్స్ గుప్పుమంటున్నాయి. త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. టాలీవుడ్లో ఓ అగ్రనిర్మాత కుమారుడితో వివాహబంధంలోకి అడుగు పెడుతున్నట్లు పలు కథనాలు వచ్చాయి. ఈ వార్తలపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది అనన్య . 'నాకోసం వరుడిని చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా పెళ్లి ఎప్పుడు, ఎక్కడ చేస్తున్నారో దయచేసి నాకు తెలియజేయండి. దానివల్ల నా పెళ్లికి నేను కూడా హాజరవుతానంటూ' వ్యంగ్యాస్త్రాలు సంధించింది. పవన్ కల్యాణ్ ‘వకీల్సాబ్’, ‘మ్యాస్ట్రో’ చిత్రాల తర్వాత అనన్య ‘శాకుంతలం’లో నటించారు. Guys, thanks for selecting a groom for me 🙏 but please naku kuda evaro cheppandi with the date and time as well, so that i can attend my own wedding 😊 — Ananya Nagalla (@AnanyaNagalla) October 2, 2022 -
తమిళంలో ఎంట్రీ ఇచ్చేసిన వకీల్సాబ్ బ్యూటీ
Annaya Nagalla Enter Into Kollywood: మల్లేశం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల. వకీల్సాబ్ సినిమాతో మాంచి క్రేజ్ సంపాదించుకున్న అనన్య ఇప్పుడు తమిళంలో సైతం ఎంట్రీ ఇచ్చేసింది. కోలీవుడ్ హీరో శశికుమార్ సినిమాలో కీలక పాత్ర చేసేందుకు అనన్య ఎంపికైంది. దీనికి సంబంధించిన అప్డేట్ను అనన్య ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. టైమ్ ట్రావెల్ బేస్డ్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి అంజల ఫేమ్ తంగం పా శరవణన్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. Tamil debut❤️ https://t.co/Qq35I2dDon — Ananya Nagalla (@AnanyaNagalla) February 15, 2022 -
అచ్చ తెలుగు అమ్మాయి నటి అంజలి పుట్టినరోజు స్పెషల్ ఫోటోలు
-
Pawan Kalyan: ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. మళ్లీ వస్తున్న ‘వకీల్ సాబ్’
Vakeel Saab: దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’మూవీలో రీ ఎంట్రీ ఇచ్చి న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 9న విడుదలై పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే దాదాపు రూ.80 కోట్లకు పైగా వసూళ్లను సాధించి పవన్ సత్తా ఏంటో నిరూపించింది. అయితే సినిమా వచ్చిన రెండు వారాల గ్యాప్ లోనే కరోనా వైరస్ తీవ్రత పెరిగి పోవడంతో కలెక్షన్స్ కూడా దారుణంగా పడిపోయాయి. కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం లాక్డౌన్ని ప్రకటించింది. దీంతో థియేటర్లు అన్ని మూతపడటంతో మూడు వారాల్లోనే ప్రముఖ ఓటీటీ అమెజాన్లో స్ట్రీమింగ్ అయింది. ఓటీటీలో కూడా ఎక్కువ వ్యూస్ని సాధించి రికార్డుని క్రియేట్ చేసింది. ఈ విషయం పక్కన పెడితే.. తమ అభిమాన హీరో సినిమాని థియేటర్లలో చూడాలని ఆశ పడిన చాలామంది అభిమానుల కరోనా వైరస్ మాత్రం బ్రేకులు వేసింది. ఈ సమయంలో వకీల్ సాబ్ దర్శక నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్ని మరోసారి థియేటర్లకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు కనిష్ఠ స్థాయికి చేరుకుంది. ప్రభుత్వాలు కూడా ఒక్కొక్కటిగా అన్లాక్ని ప్రకటిస్తున్నాయి. 50 శాతం అక్యుపెన్షీతో థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ కూడా ఇచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా త్వరలో థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వనున్నాయి.దీంతో నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్ని మరోసారి థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఈ మూవీని దాదాపు 300 థియేటర్స్లో రీ రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఇదే ఇదే కనుగా నిజమైతే పవన్ ఫ్యాన్స్కి పండగనే చెప్పొచ్చు. చదవండి: ‘శాకుంతలం’ అప్డేట్స్ : సెట్స్పైకి ఎప్పుడంటే.. ఒంటినిండా బురదతో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా? -
Sid Sriram: సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటలు విన్నారా?
Happy Birthday Sid Sriram: పొగడ్త అందరికీ చేత కాదు. అందరి గొంతు అందుకు నప్పదు. స్త్రీలను పొగిడే ఒక గొంతు కొన్నాళ్లుగా తెలుగులో తళతళలాడుతోంది. కొంత అరవం కొంత తెలుగు కలగలిసిన ఆ శబ్దానికి హీరోయిన్లే కాదు ప్రేక్షకులూ ఫిదా అవుతున్నారు. మే 19 సిద్ శ్రీరామ్ జన్మదినం. 32లోకి ఎంటర్ అవుతున్నాడు.ఆ గొంతు పొగిడిన స్త్రీ సౌందర్యపు పాటలు ఇవి. ‘ముల్లో పువ్వో పోయే దారిదైనా నిన్నే నమ్మి వచ్చానే అడవి గుర్రమంటి ఒక గుర్రెపిల్లలాగా నీ వెంటే వస్తున్నానే యాడికే... యాడికే తీసుకెళ్తావే నీతో పాటే’.... మణిరత్నం ‘కడలి’ సినిమా కోసం సిద్ శ్రీరామ్ మొదటిసారి ప్రియురాలిని కీర్తిస్తూ ఈ పాట ఏ ముహూర్తాన పాడాడోగాని తెలుగులో అమ్మాయిలను బుట్టలో వేసుకోవడానికి సినిమాల్లో సిద్ గొంతును హీరోలు అరువు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. సిద్ గొంతుతో ‘నీ బాగున్నావు... ముచ్చటగా ఉన్నావు.. నువ్వు నవ్వితే బుగ్గన సొట్ట పడుతుంది’ వంటి మామూలు మాటలు మాట్లాడినా ఆ హీరోయిన్ తప్పక లవ్ను యాక్సెప్ట్ చేసే మెస్మరిజమ్ అతని గొంతులో ఉంది. అది సినిమాకు ప్లస్ అవుతోంది. శంకర్ కూడా ఇది కనిపెట్టి ‘ఐ’ కోసం సిద్ చేత పాడించాడు. ‘నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా’ పాట బయట హిట్. చూడటానికి కాదు. వినడానికి. ‘హృదయం వేగం వీడదే వెతికే చెలిమే నీడై నన్ను చేరితే’... అని ‘సాహసం శ్వాసగా సాగిపో’లో సిద్ శ్రీరామ్ ‘వెళ్లిపోమాకే’ పాటలో అంటాడు. ఆ లైన్స్తో హీరోయిన్ హీరో నాగచైతన్య ప్రేమలో పడుతుంది. ప్రేమను చెప్పడానికి కాదు ఆ ప్రేమలో దూరం వస్తే దాని లోతును చెప్పడానికి కూడా సిద్ శ్రీరామ్ గొంతు బాగా నప్పుతుంది. ‘అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా చెలి ఏదనీ’ అని ‘నిన్ను కోరి’లో సిద్ పాడిన పాట అలాంటి స్థితిలో ఉన్న ప్రేమికులను తాకుతుంది. ఇక ‘గీత గోవిందం’లోని ‘ఇంకెం ఇంకెం ఇంకేం కావాలే’ పాటతో సిద్ తెలుగువారి ఇంటింటి గాయకుడు అయ్యాడు. ‘నీ ఎదుట నిలబడు చనువే వీసా... అందుకుని గగనపు కొనలే చూసా’ అని అమాయకంగా పాడుతుంటే రష్మికా మందన్నా ఏంటి మందికా రష్మన్నా కూడా ఫిదా కాక తప్పదు కదా. అదే వరుసలో ‘టాక్సీ వాలా’లో ‘మాటే వినదుగా వినదుగా’ కూడా విజయ్ దేవరకొండకు దక్కింది. కళ్లను శ్లాఘించి హిట్ కొట్టినవాళ్లున్నారు. కాని సిద్ శ్రీరామ్ ‘అల వైకుంఠపురములో’ కాళ్లను శ్లాఘించి సూపర్హిట్ కొట్టాడు. ‘నీ కాళ్లను పట్టుకు వదలవన్నవి చూడే నా కళ్లు’... ఒక ఊపు ఊపింది. ‘ఎంతో బతిమాలినా ఇంతేనా అంగనా మదిని మీటు మధురమైన మనవిని వినుమా’ అని సిద్ ఈ పాటలో అంటాడు. వినక ఊరుకోగలదా పూజా హేగ్డే. ఇక చిన్న సినిమాలకు ఒక్క పాటతో ప్రాణం పోయొచ్చు అని ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలో ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా’ పాటతో సిద్ చూపిస్తాడు. ‘నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే... నువ్వు వదిలేటి శ్వాసకే గాలులు బతికాయి చూడవే’... సిద్ మాత్రమే ఆ పదానికి ప్రాణవాయువు ఇవ్వగలడు. కాని స్త్రీ గొప్పతనాన్ని నిజంగా వర్ణించడానికి కూడా సిద్ శ్రీరామ్ గొంతు అవసరమవుతుంది. ‘వకీల్సాబ్’లో ‘మగువా మగువా’ పాటను సిద్ పాడాడు. ‘ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా... నీవు లేని జగతిలో దీపమే వెలుగునా’ అని ఆమె గొప్పను సిద్ నిర్ధారిస్తూ పాడతాడు. మగవ మెచ్చే పాటలు మరెన్నో సిద్ పాడాలి. మనం వినాలి. స్త్రీలు ముచ్చటపడుతూనే ఉండాలి. హ్యాపీ బర్త్డే హృదయగాయకా.(నేడు సిద్ శ్రీరామ్ జన్మదినం) – సాక్షి ఫ్యామిలీ -
Vakeel Saab: మొదట అనుకుంది పవన్ను కాదట!
వకీల్ సాబ్తో మూడేళ్ల తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చాడు పవన్ కల్యాణ్. బాలీవుడ్లో బ్లాక్బస్టర్ హిట్ సాధించిన పింక్కు రీమేక్గా రూపొందిన ఈ సినిమాను తెలుగులో ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా మార్పులుచేర్పులు చేశారు. తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ చిత్రం గురించి తాజాగా ఓ ఆసక్తికర వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వకీల్ సాబ్లో మొదటగా పవన్ కల్యాణ్ను హీరోగా అనుకోలేదట. నందమూరి బాలకృష్ణ అయితే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతారని భావించారట. దీంతో ఈ ప్రాజెక్టును ఆయన దగ్గరకు తీసుకువెళ్తే బాలయ్య దీన్ని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పేరును సూచించాడని, అలా దిల్ రాజు పవన్ను కలిసి వకీల్సాబ్కు ఒప్పించినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. బాక్సాఫీస్తోపాటు, ఓటీటీలోనూ మంచి ఆదరణ లభించిన ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్, శృతి హాసన్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం వకీల్సాబ్ టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే బాలయ్య మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' సినిమా చేస్తున్నాడు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా కనిపించనుంది. శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రల్లో నటించనున్నారు. మరోవైపు పవన్.. క్రిష్ జాగర్లమూడితో కలిసి హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్లో రానా దగ్గుబాటితో కలిసి నటిస్తున్నాడు. చదవండి: చిరు, పవన్, వెంకీతో సహా అంతా..ఆ కథలే, ఎందుకు? హాట్ టాపిక్గా మారిన పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్ -
రెమ్యునరేషన్ పెంచిన తమన్.. ఒక్కో మూవీకి ఎంతంటే..
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మంచి ఊపు మీద ఉన్నాడు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వరస సినిమాలకు సంగీతం అందిస్తూ టాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా దూసుకెళ్తున్నాడు. ‘అల వైకుంఠపురము’లో తర్వాత ఆయన సంగీతంలో మరింత కొత్తదనం కనిపిస్తోంది. రొటీన్గా కాకుండా ఢిపరెంట్ స్టైల్లో సంగీతం అందించి ఆకట్టుకుంటున్నాడు. ఆయన ఈ ఏడాది ‘క్రాక్’, ‘వకీల్సాబ్’, ‘వైల్డ్ డాగ్’ లాంటి పెద్ద సినిమాలకు సంగీతం అందించాడు. వాటిలో ‘వకీల్సాబ్’లోని పాటలు జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘మగువా’ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇలా మెలోడీలతో పాటు మాస్ సాంగ్స్ని కూడా ఆకట్టుకునేలా కంపోజ్ చేస్తూ.. రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్కు సరైన పోటీగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం తమన్ బాలకృష్ణ ‘అఖండ’, మహేశ్ బాబు ‘సర్కారువారి పాట’, పవన్ కల్యాణ్ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ రీమేక్, నాని ‘టక్ జగదీశ్’ అఖిల్ ‘ఏజెంట్’, శంకర్- రామ్చరణ్ మూవీ సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. వరుస విజయాలతో దూసుకెళ్తున్న తమన్.. తాజాగా తన రెమ్యునరేషన్ని కూడా పెంచేశాడట. ‘అల వైకుంఠపురములో’ వరకు రూ. కోటి కంటే తక్కువ తీసుకునే తమన్.. ఆ తర్వాత తన పారితోషికాన్ని కోటిన్నర వరకు పెంచేశాడట. ఇక ఈ ఏడాది క్రాక్, వకీల్సాబ్ కూడా సూపర్ హిట్ కావడంతో మరో 50 లక్షలు పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమన్ ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు పుచ్చుకుంటున్నాడట. కొన్ని సినిమాలకు బడ్జెట్ని బట్టి తీసుకుంటాడని టాక్. కథ నచ్చితే తక్కువ తీసుకోనైనా సంగీతం అందిస్తాడని తమన్కు పేరుంది. ఇక రాక్స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఒక్కో సినిమాకు రూ.3కోట్లు తీసుకుంటారని సమాచారం. చదవండి : త్రివిక్రమ్ సినిమా : మరోసారి మహేశ్కు జోడిగా ఆ హీరోయిన్ బెడ్ సీన్.. వెక్కి వెక్కి ఏడ్చిన రాశీ ఖన్నా -
పవన్ కల్యాణ్కు భార్యగా నిత్యా మీనన్!
వకీల్సాబ్ తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న తదుపరి చిత్రం ‘అయ్యప్పనమ్ కోషియం’. మలయాళ సూపర్ హిట్ రీమేక్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇప్పటివరకు హీరోయిన్గా ఎవరు నటించనున్నారన్నదానిపై క్లారిటీ వచ్చేసింది. మొదట సాయి పల్లవిని హీరోయిన్గా అనుకున్నా తన డేట్స్ కుదరక పోవడంతో సెట్ కాలేదు. దీంతో మేకర్స్ నిత్యా మీనన్ను సంప్రదించగా, ఆమె వెంటనే ఓకే చెప్పేసింది. ఇప్పటికే పవన్ సినిమాలో నిత్య నటించనుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే . తాజాగా ఈ సినిమాలో పవన్కు భార్యగా నిత్యా మీనన్ నటించనుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఒక రకంగా ఈ సినిమా నిత్యామీనన్కు కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగులో సన్ ఆఫ్ సత్యమూర్తి (2015) తరువాత పెద్ద చిత్రాలకు ఆమె ఇంత వరకు సంతకం చేయలేదు. ఇక ఇదే సినిమాలో మరో యంగ్ హీరో రానా నటిస్తుండగా, అతడికి జోడీగా కోలివుడ్ నటి ఐశ్వర్య రాజేష్ను ఎంపిక చేశారు. ఇటవలె పవన్ కల్యాణ్ కరోనా నుంచి కోలుకోవడంతో త్వరలోనే ఈ మూవీ షూటింగులో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. చదవండి : రీ ఎంట్రీ ఇస్తున్న వరుణ్ సందేశ్.. బోల్డ్ పోస్టర్ రిలీజ్ Vakeel Saab: పవన్ సినిమాపై పంజాగుట్ట పీఎస్లో ఫిర్యాదు -
Vakeel Saab: పవన్ సినిమాపై పంజాగుట్ట పీఎస్లో ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా మీద అభ్యంతరం తెలుపుతూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో తన ఫోన్ నంబర్ను వాడుకున్నారంటూ సుధాకర్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన అనుమతి లేకుండానే వకీల్ సాబ్లో ఓ చోట తన ఫోన్ నంబర్ను స్క్రీన్ మీద చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనివల్ల ఎంతో మంది తరచూ ఫోన్లు చేస్తూ తనకు ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిపాడు. కొందరైతే నోటికొచ్చినట్లు తిడుతున్నారని వాపోయాడు. ఇప్పటికే ఈ విషయంపై బాధితుడి తరపు లాయర్ వకీల్ సాబ్ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపాడు. దీనిపై వారు స్పందించాల్సి ఉంది. కాగా 'అజ్ఞాతవాసి' ఫెయిల్యూర్ తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకుని వకీల్సాబ్తో రీఎంట్రీ ఇచ్చాడు పవన్ కల్యాణ్. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన 'పింక్'కు రీమేక్గా తెరకెక్కిందీ చిత్రం. ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో ప్రసారమవుతోంది. చదవండి: ప్రభాస్ అలా ఉంటాడని ఊహించలేదు : శృతీహాసన్ -
డ్రగ్స్ అవసరం లేదు, అవి మాత్రమే చాలు: థమన్
ఈ ఏడాది సంగీత దర్శకుడు థమన్ మాంచి స్పీడు మీదున్నాడు. తను అందించే సంగీతం ఒకెత్తు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో లెవల్లో ఉంటోంది. మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ సినిమాకు థమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరింత బలాన్నిచ్చింది. దీంతో ఈ సినిమానే కాదు, మ్యూజిక్ కూడా జనాలకు బాగా కిక్కిచ్చింది. ఇది చూసి టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా తన వైల్డ్డాగ్ సినిమాకు థమన్ కావాలని కోరాడట. అలా నాగ్ సినిమాలో కూడా అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ ఇచ్చి అందరినీ ఫిదా చేశాడు. ఇక మూడేళ్ల తర్వాత 'వకీల్సాబ్'తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ సినిమాకు కూడా మంచి నేపథ్య సంగీతాన్ని అందించి అందరి చేత ప్రశంసలు అందించుకున్నాడు. ఏప్రిల్ 30న ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఓటీటీలో ఈ సినిమాను వీక్షించిన ఓ నెటిజన్ థమన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. 'ఇది కంపోజ్ చేసేటప్పుడు ఏమైనా తాగావా ఏంటి? నీ కెరీర్లో ఇప్పటివరకు చేసినవాటిలో ఇదే హైలైట్. అసలు మామూలుగా లేదు..' అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన థమన్.. 'అలాంటిదేమీ లేదు, కాకపోతే పవన్ కల్యాణ్ గారిని స్క్రీన్ మీద చూడటంతో అలా అనిపిస్తుంది అంతే. మాకు డ్రగ్స్ అవసరం లేదు, కేవలం హగ్స్, థగ్స్ ఇస్తే చాలు.. రెచ్చిపోతాం..' అని రిప్లై ఇచ్చాడు. Not exactly ⚠️ but the truth is the MAN on the screen @PawanKalyan gaaru ⚡️❤️ it will automatically make us feel high we don’t need drugs jus hugs 🤗 and some thugs 😎 @Karthika28_ ⚡️ #VakeelSaabBGM ♥️ https://t.co/d7J5kLQKMG — thaman S (@MusicThaman) May 2, 2021 సూపర్ స్టార్ మహేశ్బాబు 'సర్కారు వారి పాట'కు కూడా అందరూ ఆశ్చర్చపోయే రీతిలో సంగీతాన్నివ్వాలని మరో నెటిజన్ కోరగా.. తప్పకుండా ఇస్తానని మాటిచ్చాడు. మరోవైపు ఆయన సంగీతం అందించిన అల వైకుంఠపురములోని బుట్టబొమ్మ పాట యూట్యూబ్లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సాంగ్ 600 మిలియన్ల వ్యూస్ను దాటేసింది. Sure o sure ❤️👩@imManaswinidhfm 💫☀️ https://t.co/TBujiOhdsm — thaman S (@MusicThaman) May 2, 2021 చదవండి: ‘వకీల్ సాబ్’తో నా కల నెరవేరింది: తమన్ -
Vakeel Saab: ‘మగువా.. మగువా’ వీడియో సాంగ్ వచ్చేసింది
పవర్స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల గ్యాప్ తర్వాత నటించిన చిత్రం ‘వకీల్సాబ్’. ఏప్రిల్ 9న విడుదలైన ఈ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య, శ్రుతి హాసన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 30 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ‘మగువా.. మగువా’ వీడియో పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, మోహన భోగరాజు ఆలపించారు. తమన్ సంగీతం అందించారు. -
OTTకి మహర్దశ: కొత్తగా రిలీజయ్యే సినిమాలివే!
2020 సంవత్సరంతోనే కరోనా పీడ విరగడువుతుందనకుంటే అది మరింత విజృంభిస్తూ ఇక్కడే తిష్ట వేసింది. దీంతో గతేడాదే వినోదానికి దూరమైన సినీ లవర్స్ ఈసారి కూడా తమకు ఎంటర్టైన్మెంట్ దొరకదా? అని నెత్తిన చేయి పెట్టుకుంటున్నారు. అయితే ఇలాంటివారికోసమే దర్శకనిర్మాతలు కొత్త రూట్లో పయనిస్తున్నారు. థియేటర్ లేకపోతే ఓటీటీ ఉందిగా, ఇంక టెన్షన్ ఎందుకు దండగ అని అభయమిస్తున్నారు. ఎంచక్కా ఎక్కడికీ వెళ్లకుండా కూర్చున్న చోటే కాలక్షేపం అందిస్తామంటే ఎవరు మాత్రం వద్దంటారు. అందుకే చాలామంది ఓటీటీకి జై కొడుతున్నారు. ఫలితంగా థియేటర్లో రిలీజైన సినిమాలు, ఇంకా విడుదల కాని సినిమాలు అన్నీ కూడా పోలోమని ఓటీటీకి క్యూ కడుతున్నాయి. తాజాగా కొన్ని పెద్ద, చిన్న సినిమాలు కూడా వేర్వేరు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ డేట్స్ను ప్రకటించాయి. అవేంటో చూసేద్దాం.. జగమే తంత్రం.. హీరో ధనుష్- కార్తీక్ సుబ్బరాజు కలయికలో వచ్చిన చిత్రం 'జగమే తందిరమ్'. తెలుగులో 'జగమే తంత్రం' పేరుతో విడుదల అవుతోంది. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటించింది. కరోనా కారణంగా చాలా నెలల నుంచి వాయిదా పడుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. జూన్ 18 నుంచి ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇందులో ధనుష్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తాడట. వకీల్ సాబ్.. ఇటీవలే థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించిన సినిమా 'వకీల్ సాబ్'. 'అజ్ఙాతవాసి' డిజాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ చేసిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, అంజలి, నివేదా థామస్, అనన్య, శృతి హాసన్ ముఖ్య పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మించగా, థమన్ సంగీతం అందించాడు. థ్యాంక్ యు బ్రదర్.. యాంకర్ అనసూయ భరద్వాజ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'థ్యాంక్ యు బ్రదర్'. సందేశాత్మక అంశంతో తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల థియేటర్లు మూత పడటంతో ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా నుంచి మంచి ఆఫర్ వచ్చింది. దీంతో అనసూయ సినిమా ఆహాలో మే 7 నుంచి స్ట్రీమింగ్ అవనుంది. నారప్ప.. విక్టీర వెంకటేష్ హీరోగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'నారప్ప'. సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ అసురన్కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. మే 14న ఈ చిత్రాన్ని థియేటర్లో రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ గతంలో ప్రకటించింది. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా రిలీజ్ను వాయిదా వేస్తారా? లేదా ఓటీటీలో రిలీజ్ చేస్తారా? అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం నారప్పను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారని అంటున్నారు. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. రంగ్దే.. నితిన్, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'రంగ్దే'. మార్చి 26న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాను ఓటీటీ సంస్థ జీ 5 కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఒకవేళ మంచి డీల్ కుదిరితే మే 21 నుంచి జీ 5లో ప్రసారం చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కర్ణన్.. ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కర్ణన్'. మాలి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజైంది. కోట్లాది రూపాయల కలెక్షన్లు కురిపించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఫిల్మీ దునియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో మే 9 నుంచి ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్లో మార్పు ఉండే అవకాశం ఉంది. మోహన్ గోవింద్ డైరెక్షన్లో అశ్విన్ కాకుమను ముఖ్య పాత్రలో నటించిన 'పిజ్జా 3 ద మమ్మీ' సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుందట. కార్తీ, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన 'సుల్తాన్' ఆహాలో మే 2న విడుదల కానున్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' మే 13న అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో ఒకేసారి రిలీజ్ అవుతోంది. చదవండి: మీ డ్యాన్స్, స్టైల్.. ఫెంటాస్టిక్, లవ్ యూ అల్లు అర్జున్: సల్మాన్ బిగ్బాస్ దివిపై ట్రోల్స్.. పాప కాస్త ఓవర్ చేస్తోందంటూ.. -
అమెజాన్లో వకీల్ సాబ్: ఎప్పటి నుంచి అంటే
మూడేళ్ల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్తో రీఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క అన్నట్లుగా పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ చేస్తూ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడీ హీరో. అభిమానులను ఏమాత్రం నిరాశపర్చకుండా ఏడాదికి ఒకటీ రెండు సినిమాలైనా రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట పవన్. మూస ధోరణిలో ఉన్న పాత్రలను కాకుండా విభిన్నంగా ఉండేవాటికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన 'వకీల్ సాబ్' ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజైంది. దీన్ని అంత త్వరగా ఓటీటీలో ప్రసారం చేయొద్దని అనుకున్నారు. కలెక్షన్లు కూడా ఓ రేంజ్లో రావడంతో అందులో పవన్ వాటా సైతం తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఇదిలా వుంటే ఇప్పుడు థియేటర్లు మూత పడటంతో ఈ సినిమాను ఓటీటీలో ప్రసారం చేసేందుకు డీల్ కుదుర్చుకున్నారు. ఈ నెల 30 నుంచి అమెజాన్ ప్రైమ్లో దీన్ని స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు స్పెషల్ ప్రోమోను సైతం రిలీజ్ చేశారు. He is his own judge, in his court... only the truth will be served! New trailer out now! Meet #VakeelSaabOnPrime on April 30. @PrimeVideoIN@PawanKalyan #SriramVenu @shrutihaasan @i_nivethathomas @yoursanjali @AnanyaNagalla @MusicThaman @BayViewProjOffl pic.twitter.com/vCvBFA2I3O — Sri Venkateswara Creations (@SVC_official) April 27, 2021 చదవండి: వకీల్ సాబ్ సినిమా డైలాగ్ రైటర్ మన ఊరి అల్లుడే.. -
హాట్ టాపిక్గా మారిన పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ వకీల్సాబ్. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఏపప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమాలో పవన్ లాయర్గా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. వకీల్సాబ్కు కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా 65 కోట్లు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. రెమ్యూనరేషన్గా 50 కోట్ల, లాభాల్లో 15 కోట్లు వాటాగా తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో నటించిన నివేదా థామస్కు 75 లక్షలు, అంజలి 50 లక్షలు, అనన్యకు 25 లక్షలు పారితోషికంగా అందినట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్కు సైతం భారీ రెమ్యూనరేషనే ఇచ్చినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలుచోట్ల ఆంక్షలు విధించారు. తెలంగాణలో థియేటర్లు, మల్టీఫ్లెక్స్ లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చాలా చోట్ల 50% ఆక్యుపెన్సీతో థియేటర్లు కొనసాగుతున్నాయి. దీంతో వకీల్సాబ్ మూవీను త్వరలోనే ఓటీటీలో రిలేజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చేనెలలో ఈ మూవీ అమెజాన్ పప్రైమ్లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. చదవండి: అయినా ఇప్పుడు ట్రిప్పులు ఏంటి : శృతి హాసన్ 'అతని వల్లే ఆర్తి అగర్వాల్ కెరీర్ ఫేడ్ అవుట్ అయ్యింది' -
సినిమా షూటింగ్లకు ‘సెకండ్ బ్రేక్’
ఈ సినిమా పరిశ్రమ పరిస్థితి ఏంటి? ఈ కరోనా ఎటువైపు తీసుకెళుతోంది? కరోనా ఫస్ట్ వేవ్ చాలా నష్టాన్ని మిగిల్చింది. తొలి తాకిడి తట్టుకుని, మెల్లిగా తేరుకుంటున్న సమయంలో... ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చిపడింది. మళ్లీ సినిమా షూటింగ్లకు ‘సెకండ్ బ్రేక్’ వేయక తప్పడం లేదు. సెకండ్ వేవ్ ప్రభావంతో తాజాగా అర్ధంతరంగా షూటింగ్ ఆగిన చిత్రాల గురించి తెలుసుకుందాం... కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తలూ తీసుకుని, చిరంజీవి ‘ఆచార్య’ సినిమా షూటింగ్ చేస్తూ వచ్చారు. కానీ, రోజురోజుకీ కరోనా కేసులు ఎక్కువ అవుతుండడం, ఇదే చిత్రం షూటింగ్లో పాల్గొన్న సోనూ సూద్ కరోనా బారినపడటంతో ఈ సినిమా షూటింగ్కి బ్రేక్ ఇచ్చేశారు. చిత్రీకరణ ఆపాలనే నిర్ణయాన్ని సోమవారం తీసుకుంది చిత్రబృందం. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్కి పడిన బ్రేక్ కారణంగా ఆ సమయానికి ‘ఆచార్య’ తెరపైకి రావడం కుదరకపోవచ్చు. మరోవైపు ఇంకో పదంటే పది రోజులు మాత్రమే షూటింగ్ చేస్తే, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ పూర్తయిపోతుంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం కృష్ణంరాజు–ప్రభాస్ కాంబినేషన్ సీన్స్ తీస్తే సినిమా పూర్తయిపోతుంది. పది రోజుల షూటింగ్ ఎలాగోలా పూర్తి చేయాలనుకున్నారు కూడా! కానీ, ఇప్పుడు మాత్రం షూటింగ్ ఆపేయాలని నిర్ణయించుకున్నారు. ‘ఆచార్య’, ‘రాధేశ్యామ్’ చిత్రాల షూటింగ్ ఆపాలనుకున్న విషయం సోమవారం బయటికొచ్చింది. ఇక, ఇప్పటికే కరోనా వల్ల ఆగిన సినిమాల విషయానికొస్తే... మహేశ్బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. షూటింగ్లో పాల్గొనే ముందు యూనిట్ సభ్యులకు కరోనా పరీక్షలు చేయగా నలుగురికి పాజటివ్ నిర్ధారణ అయిందట. వీరిలో హీరో వ్యక్తిగత సహాయకుల్లో ఒకరు కూడా ఉన్నారు. దీంతో హైదరాబాద్లో జరగాల్సిన ‘సర్కారువారి పాట’ సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణకు బ్రేక్ పడింది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. ఇక రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రౌద్రం... రణం... రుధిరం’ (ఆర్ఆర్ఆర్)కి బ్రేక్ పడింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్ను ముంబయ్లో గ్రీన్ మ్యాట్ బ్యాక్డ్రాప్లో ప్లాన్ చేశారట. అయితే మహరాష్ట్రలో చిత్రీకరణలను ఆపేయాల్సిందిగా ప్రభుత్వం నిబంధన విధించడంతో ‘ఆర్ఆర్ఆర్’ ప్లాన్ ముందుకు సాగలేదని సమాచారం. ‘ఎఫ్ 2’లో బోలెడంత ఫస్ అందించిన వెంకటేశ్, వరుణ్ తేజ్ మళ్లీ నవ్వించడానికి ‘ఎఫ్ 3’ చిత్రీకరణతో బిజీ అయ్యారు. సరదా సరదాగా సాగుతున్న ఈ సినిమా చిత్రీకరణకు చిత్రదర్శకుడు అనిల్ రావిపూడికి కరోనా సోకడం వల్ల బ్రేక్ పడింది. ఈ చిత్రం ఆగస్టు 27న రిలీజ్కు ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల పవన్కల్యాణ్ కరోనా బారిన పడ్డారు. అంతే కాదు... ఆయన చిత్రబృందంలో ఇంకా పాజిటివ్ నిర్ధారణ అయినవాళ్లు చాలా ఉన్నారట. దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న సీనియర్ కో–డైరెక్టర్ సత్యం కరోనా బారిన పడి కన్నుమూశారు. దీంతో పవన్కల్యాణ్–రానా నటిస్తున్న మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ షూటింగ్ నిలిచిపోయింది. మరోవైపు వేగంగా షూటింగ్ సాగుతున్న హీరో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ సినిమాకు కూడా కరోనా బ్రేక్ వేసింది. హీరో వ్యక్తిగత సహాయకుల్లో ఒకరికి పాజిటివ్ రావడంతో షూటింగ్ నిలిపివేసినట్లు తెలిసింది. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబరు 1న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలతో పాటు మరికొన్ని చిన్నా పెద్ద సినిమాల చిత్రీకరణలు ఆగాయి. మొత్తానికి షూటింగ్స్ తేదీలన్నీ తారుమారవుతున్నాయి. విడుదల తేదీలు తారుమారయ్యే అవకాశం ఉంది. కరోనా చేస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. -
'వకీల్సాబ్'కు వ్యతిరేకంగా చేసిన జీవో కాదు
సినిమా టిక్కెట్ రేట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో సామాన్యులకూ, చిన్న నిర్మాతలకూ మేలు చేసేలా ఉందని అన్నారు దర్శక – నిర్మాత నట్టి కుమార్. ఈ విషయంపై గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ – ‘‘ఏప్రిల్ 8న ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 35 జారీ చేసింది. టిక్కెట్ల రేట్ల సవరణకు సంబంధించి కొత్త జీవో పాస్ చేయాలని టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే ఫిల్మ్ ఛాంబర్ తరఫున మేము అడుగుతూ వచ్చాం. ఏపీ సీయం జగన్ మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి, చిన్న సినిమాల నిర్మాతలకు ఉద్దేశించి ఇప్పుడు జీవోను పాస్ చేశారు. ‘వకీల్సాబ్’ సినిమా 9న రిలీజ్ అయితే, ఆ జీవో 8న పాస్ అయ్యింది. ‘వకీల్సాబ్’కు వ్యతిరేకంగా ఈ జీవో పాస్ చేశారంటూ ప్రచారం సాగింది. అది వాస్తవం కాదు. నిజానికి, ఇలాంటి జీవో కోసం ఫిల్మ్ ఛాంబర్ నుంచి చాలా సార్లు సంప్రదించాం. ‘వకీల్సాబ్’ టికెట్ రేట్లలో తేడాల వల్లే బెనిఫిట్ షోలు రద్దు అయ్యాయి. అంతేకానీ ప్రభుత్వం ఆ బెనిఫిట్ షోలను రద్దు చేసిందనేది అవాస్తవం. నిర్మాత డి. సురేశ్బాబు మీటింగులు పెట్టి, థియేటర్స్ బంద్ అంటున్నారని తెలిసింది. ‘వకీల్సాబ్’ నడిచేవరకు థియేటర్లు ఉంచి, తరువాత బంద్ చేస్తారట. ఈ నెల 16న నా సినిమా (‘ఆర్జీవీ దెయ్యం’) విడుదల ఉంది. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే కోర్టుకు వెళతాను. థియేటర్లను మూసివేస్తామని బెదిరిస్తుంటే, వారి లైసెన్సులను రద్దు చేయాలి’’ అన్నారు. ‘‘కరోనా సమయంలోని మూడు నెలల ఫిక్స్డ్ కరెంట్ ఛార్జీలను రద్దు చేస్తూ, మరో ఆరు నెలల ఛార్జీలను వాయిదా వేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషదాయకం. అలాగే, టిక్కెట్ రేట్ల అడ్డగోలు పెంపును అడ్డుకుంటూ, సామాన్యుడికి ప్రభుత్వం మేలు చేసింది’’ అన్నారు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రెటరీ జె.వి. మోహన్ గౌడ్. -
సినీ రంగంలో రాణిస్తున్న నెల్లిమర్ల అల్లుడు
సాక్షి, విజయనగరం (నెల్లిమర్ల): వకీల్ సాబ్ సినిమా డైలాగ్ రైటర్ మన ఊరి అల్లుడే. ఆ సినిమాకు డైలాగులు రాసిన మామిడాల తిరుపతి నెల్లిమర్ల పట్టణానికి చెందిన అమ్మాయినే వివాహం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామానికి చెందిన తిరుపతి నెల్లిమర్ల మండల పరిషత్ కార్యాలయంలో సబ్స్టాఫ్గా పనిచేస్తున్న బొద్దాన శంకరరావు, మంగమ్మ దంపతుల కుమార్తె బొద్దాన రూపాదేవిని 2011వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. తిరుపతి, రూపాదేవి దంపతులకు కైవల్య అనే పాప ఉంది. ప్రస్తుతం వారి కుటుంబం హైదరాబాద్లో నివసిస్తోంది. తిరుపతి 20 ఏళ్ల కిందట సినీ పరిశ్రమకు వెళ్లారు. 13 ఏళ్ల కిందట చిత్ర నిర్మాత దిల్రాజు టీమ్లో చేరారు. అప్పట్నుంచి ఆ టీమ్లో ప్రధాన టెక్నీషియన్గా కొనసాగుతున్నారు. 2011లో వేణుశ్రీరామ్ డైరెక్షన్లో వచ్చిన ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ సినిమాకు స్క్రిప్ట్ కోఆర్డినేటర్గా, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా వ్యవహరించారు. 2013లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. 2017లో మహేశ్బాబు హీరోగా నటించిన ‘స్పైడర్’ సినిమాకు స్క్రిప్ట్ అసిస్టెంటుగా, నాని నటించిన ‘ఎంసీఏ’కు డైలాగ్ రైటరుగా వ్యవహరించారు. తాజాగా శుక్రవారం విడుదలైన పవర్స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్కు డైలాగులు రాశారు. సినీ పరిశ్రమలో తిరుపతికి మంచి భవిష్యత్ ఉందని నెల్లిమర్ల పట్టణవాసులు చర్చించుకుంటున్నారు. ఆయన నెల్లిమర్ల అల్లుడు కావడంపై గర్వపడుతున్నారు. ఆయనకు ఫోన్లో అభినందనలు తెలుపుతున్నారు. -
ప్రభుత్వ ధరలకే సినిమా టికెట్లు అమ్మాలి
-
ప్రభుత్వ ధరలకే సినిమా టికెట్లు అమ్మాలి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ జీవోలోని ధరల ప్రకారమే ఆదివారం నుంచి సినిమా టికెట్లు అమ్మాలని థియేటర్ల యాజమాన్యాలను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ అధిక ధరలు వసూలు చేస్తే ఆయా థియేటర్ల యాజమాన్యాలపై అధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. శనివారం(10వ తేదీ) వరకు అడ్వాన్స్ బుకింగ్లో ఇచ్చిన టికెట్ల విషయంలో జోక్యం చేసుకోవద్దని అధికారులకు సూచించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులిచ్చింది. వకీల్సాబ్ సినిమాకు మొదటి మూడు రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవచ్చన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి హౌస్ మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ధర్మాసనం శనివారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. సినీ ప్రేక్షకుల నుంచి అధిక రేట్లు వసూలు చేయకుండా ఉండేందుకే కొత్త మార్గదర్శకాలతో జీవో ఇచ్చినట్లు తెలిపారు. మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నా.. సింగిల్ జడ్జి మాత్రం కేవలం అడ్వాన్స్ బుకింగ్లో ఇచ్చిన టికెట్లు మాత్రమే కాకుండా మూడు రోజుల పాటు అన్ని రకాల టికెట్లను అధిక ధరలకు అమ్ముకునేందుకు అనుమతిచ్చారని వివరించారు. థియేటర్ల యాజమాన్యాల తరఫు న్యాయవాది కె. దుర్గా ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. దీనివల్ల థియేటర్ల యజమానులు నష్టపోతున్నారని వివరించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. ఆదివారం నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలని స్పష్టం చేసింది. -
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వీరంగం.. కానిస్టేబుల్పై కత్తితో దాడి
సాక్షి, అనంతపురం : పవన్కల్యాణ్ ఫ్యాన్స్ సృష్టించిన వీరంగంలో ఓ కానిస్టేబుల్కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురంలోని నార్పలలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. శ్రీనివాస డీలక్స్ థియేటర్లో వకీల్ సాబ్ సినిమా సెకండ్ షోలో పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఘర్షణ నెలకొంది. సీన అనే వ్యక్తి తాగిన మైకంలో ముందు సీట్లో కూర్చున్న వ్యక్తిపై వాటర్ ప్యాకెట్ విసిరేయడంతో అతని ఫోన్ తడిచిపోయింది. వాటర్ ప్యాకెట్తో మొదలైన గొడవ కొట్టుకునేదాకా చేరింది. మద్యం మత్తులో ఇద్దరు యువకులు పరస్పరం దాడి చేసుకుంటుండగా థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సీన అనే పవన్ కల్యాణ్ ఫ్యాన్ పోలీసులపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్కు తీవ్రగాయాలు కావడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి : షూటింగ్ : అలాంటి సీన్లు చేయడానికి నో పర్మిషన్ 'పుష్ప'పై కాంట్రవర్సీ.. కాపీ కొట్టారంటూ నెటిజన్లు ఫైర్ -
ప్రేక్షకుడిపై భారం పడకూడదనే..
సాక్షి, అమరావతి: వినోదం కోసం సినిమా థియేటర్కు వెళ్లే సగటు ప్రేక్షకుడిపై భారం పడకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రతిపక్షాలు అనవసర రాజకీయం చేసి రాద్ధాంతం చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కొత్త సినిమా పేరుతో అడ్డగోలుగా ధరలు పెట్టి, ఇష్టం వచ్చినన్ని షోలు వేసి ప్రేక్షకుల జేబులు గుల్లచేయడానికి అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను గుడ్డిగా వ్యతిరేకించడం ఎంతవరకూ సమంజసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రేక్షకులకు మేలు జరిగేలా తీసుకున్న నిర్ణయాలను వక్రీకరించి.. పవన్కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్సాబ్ సినిమాను అడ్డుకోవడం కోసమే కొత్త నిబంధనలు తెచ్చారని బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ దేవ్ధర్, చంద్రబాబు, జనసేన నాయకులు ఈ సినిమా రేట్లపై రాద్ధాంతం చేయడం వెనుక రాజకీయ లబ్ధి కోణమే తప్ప సామాన్యుల కోణం ఏమాత్రం కనిపించడంలేదు. ఉన్నతస్థాయి కమిటీ మార్గదర్శకాలు.. సినిమా టికెట్ల ధరలు ఎంత ఉండాలనే దానిపై ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. సామాన్యులకు అందుబాటులో ఉండేలా టికెట్ల ధరలు నిర్ణయించింది. ఈ రేట్లకు మించి అమ్మితే థియేటర్ల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. థియేటర్లలో సౌకర్యాలు, పార్కింగ్, అక్కడ అమ్మే తినుబండారాల ధరలపైనా మార్గదర్శకాలు ఇచ్చింది. అన్నింటికీ మించి కొత్త సినిమాలు విడుదలైనప్పుడు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేసి టికెట్లు అమ్మే విధానానికి స్వస్తి పలికింది. అందరికీ ఒకే ధరలో టికెట్లు అందేలా చర్యలు తీసుకుంది. 24 గంటలపాటు షోలు వేసే విధానానికి అడ్డుకట్ట వేసింది. ఈ నిబంధనలు రాష్ట్రంలో విడుదలయ్యే చిన్నా, పెద్దా అన్ని సినిమాలకు వర్తిస్తాయి. అందరికీ ఒకే ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రేక్షకులు సరదాగా సినిమాకెళ్లి ఎంజాయ్ చేయడం కోసమే మేం టికెట్ల ధరలను నిర్ణయించాం. ఇవి ఏ హీరోకైనా, ఏ సినిమాకైనా ఒకటే. కొత్త సినిమాలు విడుదలైతే టికెట్లు ఎక్కువ రేట్లకు అమ్మడం, బ్లాక్లో అమ్మడం వంటి వాటికి చెక్ పెట్టాం. దీనివల్ల సామాన్యులకు మేలు జరుగుతుంది. – పేర్ని నాని.. రవాణా, సినిమాటోగ్రఫీ మంత్రి -
నా పాల వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారు
సాక్షి, పొదలకూరు/తిరుపతి: ముప్పై ఏళ్లుగా తాను పాల వ్యాపారం చేస్తుంటే దానిని దెబ్బతీయాలని గుజరాత్ నుంచి ఒకడిని (అమూల్) పట్టుకొచ్చారని.. వాడికి బలవంతంగా పాలు పోయమంటున్నారని.. ఇది కక్షసాధింపు కాదా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. మీరు ఈ రాష్ట్రంలో ఉంటారు, ఎక్కడికి వెళ్లిపోరు.. అసలు, వడ్డీతో సహా మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి అని వైఎస్సార్సీపీ నేతలనుద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. పవన్ను, తనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం చంద్రబాబు నెల్లూరు జిల్లా పొదలకూరులో పర్యటించారు. సభలో ఆయన మాట్లాడుతూ.. వకీల్సాబ్ సినిమా స్పెషల్ షోలకు ఏపీలో అనుమతులివ్వలేదని, పవన్పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు. తాను తలుచుకుంటే ఒక్కరు కూడా మిగలరు.. ఖబడ్దార్ అంటూ వైఎస్సార్సీపీ నేతలను ఉద్దేశించి హెచ్చరించారు. అలాగే, విశాఖలో ఆంధ్రజ్యోతి పత్రికకు సంబంధించిన గోడౌన్కు అన్ని అనుమతులున్నా ఆక్రమించారంటూ కూల్చివేశారని ఆరోపించారు. అధికారంలోకి వస్తేకార్యకర్తలకు ఫుల్ పవర్స్ అంతకుముందు.. శ్రీకాళహస్తిలో జరిగిన కార్యకర్తల సమావేశంలోనూ చంద్రబాబు మాట్లాడారు. పార్టీ కోసం టీడీపీ కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారని.. అయితే వారికి న్యాయం చేయలేకపోయానన్నారు. న్యాయం చేయలేదని మనస్సులో పెట్టుకోవద్దని, ఎనిమిది రోజులపాటు అన్ని పనులు వదిలిపెట్టి పార్టీ సత్తాచాటాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసుధన్రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. ‘మీరు సీఎం అయితే మేం ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా.. జరగాల. ఇప్పుడున్న పోలీసులు, రెవెన్యూ వారిపై కక్ష తీర్చుకోవాలి’.. అని కోరగా, చంద్రబాబు స్పందిస్తూ.. ప్రభుత్వం వచ్చాక కార్యకర్తలకు ఫుల్ పవర్స్ ఇచ్చి వడ్డీతో సహా కక్ష తీర్చుకునేలా అవకాశం కల్పిస్తామన్నారు. వలంటీర్లు వెంట్రుకలు కూడా పీకలేరని మండిపడ్డారు. ఉద్యోగులు తోక తిప్పితే కట్ చేస్తానని హెచ్చరించారు. నిలిచిపోయిన 108 అంబులెన్స్ అంబులెన్స్కు దారివ్వని తమ్ముళ్లు పొదలకూరు: నెల్లూరు జిల్లా పొదలకూరులో టీడీపీ కార్యకర్తలు మానవత్వం లేకుండా వ్యవహరించారు. ‘108’ అంబులెన్స్కు వారు దారి ఇవ్వలేదు. పట్టణంలో శుక్రవారం చంద్రబాబు రోడ్షో, బహిరంగసభ కోసం గేటు సెంటరుకు ఆ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. ఇంతలో.. గుండెనొప్పితో బాధపడుతున్న పొదలకూరు మండలానికి చెందిన మహిళను 108లో నెల్లూరు ఆస్పత్రికి తరలిస్తున్నారు. అంబులెన్స్ గేటు సెంటర్కు చేరుకుంది. అయితే, టీడీపీ తమ్ముళ్లు సుమారు 30 నిమిషాలపాటు దాన్నిపట్టించుకోలేదు. దారి ఇవ్వమని 108 టెక్నీషియన్ (డ్రైవర్)తో పాటు బాధితురాలి కుటుంబ సభ్యులు ఎంత బతిమాలినా కనికరించలేదు. -
ఆ నిబంధన ప్రకారం రోజూ 4 షోలకే అనుమతి
తిరుపతి: వకీల్సాబ్ సినిమాకు, ఎన్నికలకు సంబంధం ఏంటని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం రోజు 4 షోలకే అనుమతుందని తెలిపారు. టికెట్ రేట్లు పెంచి జనం జేబులు కొట్టాలా.. పవన్ సినిమా కోసం ప్రత్యేకంగా నిబంధనలు మార్చరని కుండ బద్దలు కొట్టారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీజేపీ అసలు ఏపీ ప్రజలకు ఏం చేసిందో తెలపాలని సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా, రైల్వేజోన్ ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేశారని బీజేపీ మీద మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం పాచిపోయిన లడ్డూలు పెట్టిందని పవన్ గతంలో చేసిన ఆరోపణలను మంత్రి గుర్తుచేశారు. బీజేపీ నేతలు చెప్పిన అచ్చేదిన్ ఎక్కడ వచ్చిందో చెప్పాలని పేర్నినాని ప్రశ్నించారు. 14ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలో మాట్లాడాలంటే వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తనకు తానే భజన చేసుకుంటున్నాడని, కానీ ఇప్పటికే ప్రజలు అతడిని తరిమికొట్టారని విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని పేర్నినాని ధీమా వ్యక్తం అన్నారు. చదవండి: ‘రుణమాఫి పేరుతో చంద్రబాబు రైతులను దోచుకున్నాడు’ -
‘వకీల్ సాబ్’ మూవీ రివ్యూ
టైటిల్ : వకీల్ సాబ్ జానర్: లీగల్ డ్రామా నటీనటులు : పవన్ కల్యాణ్, శృతిహాసన్, ప్రకాశ్ రాజ్, అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్ సమర్పణ : బోనీ కపూర్ దర్శకత్వం : శ్రీరామ్ వేణు సంగీతం : తమన్ సినిమాటోగ్రఫీ : పీఎస్ వినోద్ ఎడిటింగ్ : ప్రవీన్ పూడి విడుదల తేది : ఏప్రిల్ 09, 2021 అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకొని ‘వకీల్ సాబ్’గా ఈ శుక్రవారం (ఏప్రిల్ 9) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పవన్. పవన్ రీఎంట్రీ మూవీ కావడం.. అందులోనూ అమితాబ్ నటించి బాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ పింక్ సినిమాకు రీమేక్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్కు మంచి స్పందన రావడంతో ‘వకీల్ సాబ్’పై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ వకీల్ సాబ్ ఏ మేరకు అందుకున్నాడు? పవన్ రీఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథ పల్లవి(నివేధా థామస్), జరీనా బేగం(అంజలి), దివ్య నాయక్(అనన్య నాగళ్ళ )వేరు వేరు ప్రాంతాలకు చెందిన మధ్యతరగతి యువతులు. ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్కు వచ్చి ఒకే ఇంట్లో అద్దెకు ఉంటారు. డ్యూటీకి వెళ్లడం, వచ్చిన డబ్బులు ఇంటికి పంపించడం వీరి కర్తవ్యం. ఇలా హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్న ఈ ముగ్గురు ఒక రోజు పార్టీ కోసం బయటకు వెళ్లి రాత్రి క్యాబ్లో ఇంటికి వెళ్తూ అనుకోకుండా ఎంపీ రాజేందర్(ముఖేష్ రిషి) కొడుకు వంశీ(వంశీకృష్ణ) గ్యాంగ్తో రిసార్ట్కి వెళ్తారు. అక్కడ జరిగిన ఓ సంఘటన ఈ ముగ్గురి జీవితాలను మలుపుతిప్పుతుంది. ఈ ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు అవుతుంది. పల్లవిని అరెస్ట్ చేస్తారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఈ ముగ్గురు యువతులకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాని క్రమంలో సస్పెండ్కు గురైన లాయర్ సత్యదేవ్ అలియాస్ వకీల్ సాబ్( పవన్ కల్యాణ్) అండగా నిలబడతాడు. అసలు సత్యదేవ్ ఎందుకు సస్పెండ్ అయ్యాడు? అతని చరిత్ర ఏంటి? మధ్యతరగతి కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడపడుచులకు వకీల్ సాబ్ ఎలా న్యాయం చేశాడు? రాజకీయ నేపథ్యం ఉన్న వంశీని, డబ్బులకు అమ్ముడుపోయే లాయర్ నందా(ప్రకాశ్ రాజ్)ని సత్యదేవ్ ఎలా ఢీకొన్నాడు? అనేదే మిగతా కథ. నటీనటులు అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కల్యాణ్ వెండితెరకు దూరమయ్యాడు. దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లి తెరపై కనిపించాడు. వకీల్ సాబ్ పాత్రలో పవన్ పరకాయ ప్రవేశం చేశారు. ముఖ్యంగా కోర్టు సన్నివేశాల్లో పవన్ చెప్పే డైలాగ్స్ అబ్బురపరచడంతో పాటు ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఇక శృతిహాసన్ చనిపోయినప్పుడు వచ్చే ఎమోషనల్ సీన్లో పవన్ కల్యాణ్ జీవించేశాడు. అలాగే మధ్యతరగతి చెందిన యువతుల పాత్రల్లో అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ అద్భుతంగా నటించారు. వకీల్ సాబ్ భార్య పాత్రలో శృతిహాసన్ పర్వాలేదనిపిస్తుంది. ఇక క్రిమినల్ లాయర్ నందా పాత్రలో ప్రకాశ్రాజ్ ఎప్పటిమాదిరే జీవించేశాడు. వంశీకృష్ణతో మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. విశ్లేషణ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పింక్’కి రీమేకే ఈ వకీల్ సాబ్ సినిమా. సమాజంలో మహిళల పట్ల కొంతమంది వ్యక్తులకు ఉన్న చులకన భావాన్ని, దానివల్ల స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రం ‘పింక్’. అక్కడ అమితాబ్ బచ్చన్, తాప్సీ, కృతి కల్హరి, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే సినిమాను అజిత్లో కోలీవుడ్లో రీమేక్ చేశారు. అక్కడా సూపర్ హిట్ అయింది. రెండు చోట్ల సూపర్ హిట్ కావడంతో ఈ కథను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలని భావించాడు నిర్మాత దిల్ రాజు. పవర్స్టార్ పవన్కల్యాణ్ స్టార్డమ్ని దృష్టిలో ఉంచుకుని మూలకథలో ఎలాంటి మార్పులు చేయకుండా, దానికి కొన్ని కమర్షియల్ హంగుల్ని చేర్చాడు దర్శకుడు వేణు శ్రీరామ్. బాలీవుడ్, కోలీవుడ్లో చూపించని విధంగా ఇందులో పవన్ని యంగ్ లుక్లో చూపించారు. అలాగే హీరోకి ప్లాష్ బ్యాగ్ కూడా పెట్టాడు. అయితే అది మాత్రం వర్కౌట్ కాలేదు. సినిమా కథకు అది కాస్త అడ్డంకిగా అనిపిస్తుంది. అలాగే శ్రుతీహాసన్, పవన్ కల్యాణ్ మధ్య వచ్చిన లవ్ సీన్స్కూడా అంతగా ఆకట్టుకోవు. ఫస్టాఫ్లో కొన్ని చోట్ల అనవసరమైన సీన్స్ కూడా ఉండటం కొంతమేర ప్రతికూల అంశమే. అలాగే ఇంటర్వెల్ వరకు అసలు కథ ముందుకు సాగదు. ఇక సినిమాకు ప్రధాన బలం కోర్టు సీన్స్ . కోర్టు సన్నీవేశాల్లో వచ్చే డైలాగ్స్ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేవిగా ఉంటాయి.‘అడుక్కునోళ్లకి అన్నం దొరుకుంది. కష్టపడినోడికి నీడ దొరుకుంది కానీ పేదోడికి మాత్రం న్యాయం దొరకదు’, ‘ఆడది అంటే బాత్రుంలో ఉండే బొమ్మ కాదు నిన్ను కన్న అమ్మ’ లాంటి డైలాగ్స్ హృదయాలను హత్తుకుంటాయి. అయితే సెకండాఫ్ మొత్తం కోర్టు సన్నివేశాలే ఉండడం పవన్ ఫ్యాన్స్కు నచ్చినా.. సాధారణ ప్రేక్షకుడికి కాస్త ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉంది. అలాగే కొన్ని డైలాగ్స్ పవన్ రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టి రాసినట్లుగా అనిపిస్తాయి. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. పలు సన్నివేశాలను తన నేపథ్య సంగీతంతో ఓ రేంజ్కి తీసుకెళ్లాడు. ముఖ్యంగా కోర్టు సన్నివేశాలకు తనదైన బీజీఎం ఇచ్చి తమన్ అదరగొట్టాడు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫి బాగుంది. కోర్టు సన్నివేశాలను కళ్లకుకట్టినట్లు చూపించాడు. పవీన్ పూడి ఎడిటింగ్ పర్వాలేదు. ఫస్టాఫ్లో కొన్ని సీన్లకు కత్తెరపడితే బాగుండనిపిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ పవన్ కల్యాణ్, ప్రకాశ్రాజ్ నటన తమన్ సంగీతం కోర్టు సీన్స్ మైనస్ పాయింట్స్ ఫస్టాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ -
వకీల్ సాబ్ ఫేమ్ అందాల అనన్య నాగల్ల ఫోటోలు
-
హీరోయిన్ అంజలికి కరోనా..ఆమె ఏమందంటే..
దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుంది. సినీ ఇండస్ర్టీని సైతం కరోనా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్, విజయేంద్రప్రసాద్, నివేదా థామస్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆ జాబితాలో హీరోయిన్ అంజలి కూడా చేరిందని, ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వార్తలు వినిపించాయి. గత కొన్ని రోజులుగా అంజలి వకీల్సాబ్ ప్రమోషన్స్లో పాల్గొంటుంది. ఈ సినిమాలో ఈమెతో పాటు కలిసి నటించిన నివేదా థామస్కు ఇటీవలె కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అంజలికి సైతం కరోనా సోకిందని పలు వార్తలు గుప్పుమన్నాయి. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్నట్లు రూమర్స్ వినిపించాయి. దీనిపై అంజలి సైతం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఇదంతా నిజమే అనుకొని అంజలికి కరోనా సోకిందనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతుండటంతో నటి అంజలి క్లారిటీ ఇచ్చారు. 'నాకు కరోనా వచ్చిదంటూ పలు న్యూస్ ఆర్టికల్స్లో వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదు. నాకు కరోనా సోకిందనే వార్త పూర్తి అబద్ధం. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నాకు కోవిడ్ రాలేదని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి' అంటూ నెటిజన్లను కోరింది. 🙏🏻 pic.twitter.com/6eprZEWJZ4 — Anjali (@yoursanjali) April 8, 2021 చదవండి : బ్రేకప్ తట్టుకోవడం చాలా కష్టం: అంజలి టీకా తీసుకున్నా.. ప్రముఖ నటికి కరోనా -
'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్; అందరి కళ్లు అంజలిపైనే
-
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
ఏప్రిల్లో సందడి చేసే సినిమాలివే..
ప్రేక్షకుడికి వినోదాన్ని పంచడానికే సినిమా. వినోదానికి ప్రతిఫలంగా నాలుగు కాసులు వస్తాయి కనుకనే ఏటా వేలాది సినిమాలు రిలీజవుతుంటాయి. అందులో కొన్ని హిట్ ట్రాక్ ఎక్కితే, మరికొన్ని మాత్రం ఏకంగా బ్లాక్బస్టర్ హిట్లు కొడతాయి. కానీ గతేడాది మాత్రం కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల థియేటర్లో బొమ్మ ఆడక సగటు ప్రేక్షకుడికి వినోదం కరువైంది. తర్వాత థియేటర్లు రీఓపెన్ అయినా కరోనా టెన్షన్తో జనాలు సినిమాలను ఆదరిస్తారో లేదో అన్న ఆందోళన వ్యక్తమైంది. కానీ ఈ అనుమానాలను పటాపంచలు చేశారు సినీప్రియులు. కంటెంట్ బాగుంటే భయాలన్నీ పక్కనపెట్టి థియేటర్కు కదిలివస్తామని చెప్తున్నారు. చెప్పినట్లుగానే ఇప్పటివరకు పలు సినిమాలను ఆదరించారు. అభిమానించారు. దీంతో నిర్మాతలు కూడా తమతమ సినిమాలను ఓటీటీల్లో కాకుండా థియేటర్లలోనే రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది పండగ ఉన్న ఏప్రిల్ నెలలో ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూసేద్దాం.. మన్మథుడు 2 ఫ్లాప్ కావడంతో కొంత నిరాశలో ఉన్నాడు టాలీవుడ్ కింగ్ నాగార్జున. దీంతో ఈసారి లవ్స్టోరీ కాకుండా క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఎంచుకున్నాడు. సాల్మన్ డైరెక్షన్లో ఆయన చేస్తున్న వైల్డ్డాగ్ మూవీ ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల కానుంది. ఏప్రిల్ 2న మరో స్టార్ హీరో సినిమా రిలీజ్ కాబోతోంది. తమిళ హీరో కార్తీ నటించిన సుల్తాన్ అదే రోజు తెలుగులోనూ విడుదలవుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తర్వాత చేస్తున్న సినిమా వకీల్సాబ్. ఈ చిత్రం ఏప్రిల్ 9న రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత వారం రోజులకే అంటే ఏప్రిల్ 16న నాగచైతన్య, సాయి పల్లవి జోడీగా నటించిన లవ్స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సత్యదేవ్, మిల్కీబ్యూటీ తమన్నా నటించిన గుర్తుందా శీతాకాలం చిత్రం ఏప్రిల్ 14న థియేటర్లలోకి రానుంది. నేచురల్ స్టార్ నాని టక్ జగదీష్ ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన విరాట పర్వం ఏప్రిల్ 30న సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అలాగే విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం తెలుగులో ఓ మంచి రోజు చూసి చెప్తా పేరుతో ఏప్రిల్ 2న రిలీజ్ అవుతోంది. ఇక కన్నడ స్టార్ పునీత్ రాజ్కుమార్ నటించిన యువరత్న ఏప్రిల్ 1న విడుదల కానుంది. సునీల్ డిటెక్టివ్గా నటించిన కనబడుట లేదు ఏప్రిల్ 16న థియేటర్లలో సందడి చేయనుంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తలైవి సినిమా ఏప్రిల్ 23న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇందులో సంచలన నటి కంగనా రనౌత్ నటించింది. చదవండి: టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ రివ్యూ.. 8 హిట్ సినిమాలు ఇవే -
వకీల్ సాబ్ బెనిఫిట్ షో.. టికెట్ ధర ఎంతో తెలుసా?
‘పవన్ కల్యాణ్ సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షో టికెట్ దొరికాలి కానీ నా కంటే అదృష్టవంతుడు ఎవడూ ఉండదు’ పవర్ స్టార్ అభిమానుల అందరి ఫీలింగ్ ఇది. పవన్ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనేది చాలా మంది అభిమానుల కలలు కంటుంటారు. టికెట్ దొరికితే చాలు.. ఆస్కార్ అవార్డు్ గెలిచినంత పొంగిపోతారు. నా అభిమానా హీరో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ దొరికింది అంటూ గర్వంగా చెప్పుకుంటారు. ఆ టికెట్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ప్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. పవన్ కల్యాణ్కు ఉన్న క్రేజీ అది. పవన్ అన్న, ఆయన సినిమాలన్న పడి చచ్చేవారు లక్షల్లో ఉన్నారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ నుంచి మూడేళ్ల తర్వాత సినిమా వస్తే తొలి రోజు టికెట్ రేట్స్ ఎలా ఉంటాయి? ఒక వేళ వేలల్లో ఉన్నా కూడా ఫ్యాన్స్ కొనక ఊరుకుంటారా? చాన్సే లేదు. డబ్బులు ఎంతైనా టికెట్ కొనడం ఖాయం. ఈ విషయం వకీల్ సాబ్ నిర్మాతలకు కూడా తెసులు. అందుకే తొలి మూడు రోజుల్లోనే వీలైనంత పిండుకోవాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. ఏప్రిల్ 9న విడుదల కాబోతున్న వకీల్ సాబ్ సినిమాటికెట్ ధరలను అమాంతం పెంచారని ప్రచారం జరుగుతుంది. నార్మల్ టికెట్ ధర రూ.200గా ఫిక్స్ చేశారట. ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలో వకీల్ సాబ్ బెనిఫిట్ షో వేయాలని చిత్ర బృందం భావిస్తుందట. ఏప్రిల్ 8 అర్థరాత్రి నుంచే ప్రీమియర్ షోలు పడతాయి. దీని కోసం టికెట్ ధరను రూ.1500గా ఫిక్స్ చేశారని సమాచారం. మూడేళ్ల తర్వాత తమ అభిమాన హీరో నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ టికెట్ ధరను ఎంత పెంచినా ఆలోచించరు. రూ.200 కాదు..2000 అయినా థియేటర్లలో తమ అభిమాన హీరో సినిమా చూడడానికి రెడీగా ఉన్నారు. ఇక వకీల్ సాబ్ విషయానికి వస్తే.. బాలీవుడ్లో సూపర్ హిట్ అయినా పింక్ మూవీకి రీమేక్ ఇది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. చదవండి: వకీల్ సాబ్ ట్రైలర్పై రామ్ చరణ్ కామెంట్ నితిన్ బర్త్డే వేడుకల్లో సింగర్ సునీత దంపతులు -
వకీల్సాబ్ : ట్రైలర్కే అద్దాలు పగిలితే.. ఇక సినిమా రిలీజైతే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'వకీల్ సాబ్'. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఏప్రీల్9న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం అభిమానుల మధ్య ట్రైలర్ను విడుదల చేశారు. వైజాగ్ థియేటర్లో ట్రైలర్ చూసేందుకు పవన్ అభిమానులు ఎగబడ్డారు. కిక్కిరిసిన జనంతో అద్దాలు బద్దలు కొట్టుకొని మరీ లోపలికి చొచ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన పలువురు పవన్ అభిమానులు...'కేవలం ట్రైలర్ కే అద్దాలు పగలకొట్టేస్తే రేపు సినిమా రిలీజ్ కు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. చాలా ఆకలి మీదున్నాం' అని అంటున్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ను సినీ నిర్మాత బండ్ల గణేష్..తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోను అభిమానులు రీట్వీట్లు చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. బాలీవుడ్ సినిమా ‘పింక్’కు రీమేక్గా వస్తున్న సినిమా ఇది. హిందీలో అమితాబ్ చేసిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాన్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచానాలు నెలకొన్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై పవన్ను చూసేందుకు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీవేంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజ్, శిరీశ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. బోనీ కపూర్ సమర్పణలో చిత్రం తెరకెక్కుతోంది. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. చదవండి : వకీల్సాబ్ ట్రైలర్ లాంఛ్.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ వకీల్ సాబ్ ట్రైలర్పై రామ్ చరణ్ కామెంట్ -
వకీల్ సాబ్ ట్రైలర్పై రామ్ చరణ్ కామెంట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన 'వకీల్ సాబ్' చిత్రం నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రకంపనలు సృష్టిస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే 1.35కోట్ల పైగా వ్యూస్, 9లక్షలకు పైగా లైక్స్ అందుకోని రికార్డులు సృష్టిస్తుంది. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అందుకే ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చినా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్పై ఫ్యాన్స్తో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'వకీల్ సాబ్' ట్రైలర్ పై మెగా పవర్స్టార్ రామ్ చరణ్ స్పందించాడు. ‘బాబాయ్... మైండ్ బ్లోయింగ్. ఎప్పట్లాగానే పవర్ ఫుల్ గా ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు.దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అమితాబ్ బచ్చన్ నటించిన బాలీవుడ్ సినిమా ‘పింక్’కి రీమేక్ ఇది. అందులో అమితాబ్ చేసిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. Babayi... Mind Blowing and as always Powerful 💪🔥! #VakeelSaabTrailer https://t.co/uvMvVX4Rvq — Ram Charan (@AlwaysRamCharan) March 29, 2021 చదవండి: వకీల్సాబ్ ట్రైలర్ లాంఛ్.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ హీరోయిన్తో అల్లు శిరీష్ డేటింగ్ ? ఫోటోలు వైరల్ -
వకీల్సాబ్ ట్రైలర్ లాంఛ్.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ
విశాఖపట్నం : పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ సినిమా ‘పింక్’కు రీమేక్గా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాన్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీవేంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజ్, శిరీశ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. బోనీ కపూర్ సమర్పణలో చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం అభిమానుల మధ్య ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. దీంతో థియేటర్లో ట్రైలర్ను చూసేందుకు పవన్ ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఒకరిపై ఒకరు తోసుకుంటూ, అద్దాలు పగలకొట్టి మరీ లోపలికి చొచ్చుకెళ్లారు. దీంతో పలువురు పవన్ అబిమానులు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #WATCH | Andhra Pradesh: Ruckus erupted at a theatre in Visakhapatnam during the release of the trailer of actor & Jan Sena chief Pawan Kalyan's movie, yesterday pic.twitter.com/MjNrpxto1d — ANI (@ANI) March 30, 2021 చదవండి : మీరు వర్జినా?: వకీల్ సాబ్ ట్రైలర్ ‘వకీల్ సాబ్’ హవా.. అంబరాన్నంటిన టికెట్ల ధరలు -
ఏప్రిల్ 9న లంచ్, డిన్నర్ కలిసి చేద్దాం : దిల్ రాజు
పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వకీల్ సాబ్’. నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో అభిమానుల మధ్య ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ‘సరిగ్గా చెప్పండి.. ఏం చెప్పారు.. ఏం చేశారు’, ‘అలా జరగద్దు.. జరగకూడదు’ అనే డైలాగ్స్తో టీజర్ సాగుతుంది. టీజర్ విడుదల సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘పవన్ కల్యాణ్ను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు మనం మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నాం. వెయిటింగ్ పూర్తయింది. ట్రైలర్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే. ఏప్రిల్ 9న లంచ్, డిన్నర్ కలిసి చేద్దాం’’ అన్నారు. ‘‘ట్రైలర్ కంటే సినిమా ఇంకా బాగుంటుంది’’ అన్నారు వేణు శ్రీరామ్. హిందీ హిట్ ‘పింక్’ చిత్రానికి తెలుగు రీమేక్గా ‘వకీల్ సాబ్’ రూపొందిన విషయం తెలిసిందే. చదవండి: లవ్స్టోరీ’ వాయిదాపై చిత్ర యూనిట్ క్లారిటీ పదహారువందల మందిని ప్రేమించా' -
మీరు వర్జినా?: వకీల్ సాబ్ ట్రైలర్
‘మీరు వర్జినా.. అని అమ్మాయిలను అడగొచ్చు.. మేం అబ్బాయిలను అడగొద్దా’ అంటూ కోర్టులో పవర్స్టార్ పవన్ కల్యాణ్ వాదిస్తూ కనిపించాడు. ఏం న్యాయం నందాజీ.. కూర్చోండి అంటూ ప్రకాశ్ రాజ్కు కౌంటర్ ఇస్తూ కనిపించాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ‘వకీల్ సాబ్’ ట్రైలర్ శనివారం హోలీ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది. ట్రైలర్ విడుదలతో పవన్ కల్యాణ్ అభిమానులకు హోలీ గిఫ్ట్ చిత్ర బృందం అందించింది. న్యాయవాది పాత్రలో పవన్ అదరగొట్టారు. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రధారులుగా కనిపిస్తున్నారు. ‘మీరు వర్జినా..?. అందరికీ వినబడేట్టు గట్టిగా చెప్పండి’ అంటూ ప్రకాశ్ రాజ్ నివేథాను ప్రశ్నిస్తుండడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్నప్పటికీ ట్రైలర్లో మాత్రం కనిపించలేదు. న్యాయవాది పాత్రలో పవన్ ఆకట్టుకున్నారు. పవన్కు ప్రత్యర్థి న్యాయవాదిగా ప్రకాశ్రాజ్ కనిపిస్తున్నారు. అత్యాచార ఘటనపై కోర్టులో జరిగే వాదోపవాదనలు సినిమాలో కీలకంగా ఉండనుంది. హిందీ సినిమా ‘పింక్’కు రీమేక్గా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీవేంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజ్, శిరీశ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. బోనీ కపూర్ సమర్పణలో చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ఏప్రిల్ 9వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్ ను తీసుకోగా.. శాటిలైట్ రైట్స్ను జీ తెలుగు కొనేసింది. ఈ సినిమాపై పవన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. -
‘వకీల్ సాబ్’ హవా.. అంబరాన్నంటేలా టికెట్ల ధరలు!
పవర్స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ చేస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్ నేడు(మార్చి29) హోలీ సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు #VakeelSaabTrailerDay హ్యాష్ ట్యాగ్తో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. వకీల్సాబ్ రిలీజ్ విషయంలో చిత్ర నిర్మాత దిల్రాజ్ భారీ ప్లాన్తో ఉన్నట్లు తెలుస్తోంది. విడుదల తేదికి ముందు రోజు అర్థరాత్రి వైజాగ్లోని కొన్ని థియేటర్లలో 12 గంట నుంచి మూడు మిడ్నైట్ షోలను ఏర్పాటు చేయనున్నారు. అభిమానుల షో గా చెప్పే ఆ షో ఈ టికెట్ ధర విషయంలో భారీ మొత్తంలో ఫిక్స్ చేశాడు నిర్మాత. ఈ నేపథ్యంలో మిడ్నైట్ షోకు సంబంధించి ఒక్కో టికెట్ ధర ఏకంగా 1500 రూపాయలు నిర్ణయించారు. అంతేగాక ఉదయం బెనిషిట్ షో టికెట్ ధర 500 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే అన్ని ప్రాంతాల్లో మొదటి వారం టికెట్ ధర 200గా ఫిక్స్ చేశారు. టికెట్ల రేట్లు అధికంగా పెంచడంతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వకీల్ సాబ్ రికార్డు సృష్టించడం ఖాయం అనిపిస్తుంది. మరోవైపు పెద్ద మొత్తంలో టికెట్ల రేట్లు పెంచడంతో వకీల్ సాబ్ సామాన్య ప్రేక్షకులకు అందనంత దూరంలో ఉన్నట్లుగా ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాకు పవన్ ఇంతకముందు ఎన్నడూ లేని విధంగా 50 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్గా తీసుకుంటున్నాడు. కాగా ఏప్రిల్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్లో హిట్ సాధించిన పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్సాబ్గా రీమేక్గా చేస్తున్న విషయం తెలిసిందే. పింక్'లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను 'వకీల్ సాబ్'లో పవన్ కల్యాణ్ పోషిస్తుండడంతో సినిమాకు భారీ హైప్ క్రియెట్ అయ్యింది. అలాగే మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ విడుదల కానుంది. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చదవండి: వకీల్ సాబ్ బిగ్ అప్డేట్ వచ్చేసింది -
వకీల్ సాబ్ బిగ్ అప్డేట్ వచ్చేసింది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'వకీల్ సాబ్'. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ ఇది. హిందీలో అమితాబ్ చేసిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. విడుదలకు దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ను మొదలు పెట్టింది చిత్రబృందం. అందులో భాగంగా ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ను స్టార్ట్ చేసింది. ఇక ఇప్పటికే టీమ్ ఇంటర్యూలు.. మ్యూజిక్ పెస్ట్లు నిర్వహిస్తుండగా.. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల తేదిని ప్రకటించింది. మార్చి 29న వకీల్ సాబ్ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కాగా, వకీల్సాబ్ బిగ్ అడ్డేట్ రానుందని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బుధవారం ఉదయం ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో వకీల్ సాబ్ ట్రైలర్ రాబోతుందని అంతా భావించారు. కానీ కేవలం ట్రైలర్ రిలీజ్ డేట్ని మాత్రమే ప్రకటించి అభిమానులను కాస్త నిరుత్సాహపరిచారు. మరోవైపు వకీల్ సాబ్ డిజిటల్ రైట్స్ తో పాటు.. శాటిలైట్ రైట్స్ కూడా ధరకు అమ్ముడుపోయాయి. అమెజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్ ను తీసుకోగా.. శాటిలైట్ రైట్స్ను జీ తెలుగు కొనేసింది. దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ చత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. . The Power 🔥 In Black-Blazer gets mightier! Witness it with #VakeelSaabTrailer on March 2️⃣9️⃣th@PawanKalyan #SriramVenu @shrutihaasan @SVC_official @i_nivethathomas @MusicThaman @yoursanjali @AnanyaNagalla @bayviewprojoffl @BoneyKapoor @adityamusic #VakeelSaabOnApril9th pic.twitter.com/zQajga06hH — Sri Venkateswara Creations (@SVC_official) March 24, 2021 చదవండి: షాకింగ్ వీడియో.. అవసరాల శ్రీనివాస్ గుట్టు రట్టు! అల్లు అర్జున్ కొత్త బిజినెస్: మహేష్కు పోటీగా! -
సాయంత్రం వకీల్ సాబ్ బిగ్ అప్డేట్: రెడీయా?
దాదాపు మూడేళ్ల తర్వాత పవర్స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీతో బిగ్ స్క్రీన్పై ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై పవన్ను చూసేందుకు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ రానుందని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ రోజు సాయంత్రం (మార్చి 24న ) 5 గంటలకు ఓ అప్డేట్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు పేర్కొంటూ ‘ది బిగ్గెస్ట్ అప్డేట్ ఈజ్ ఆన్ ది వే’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇది ట్రైలర్కు సంబంధించిన అప్డేట్ అయ్యుంటుందంటూ అప్పుడే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పవన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మరి ఆ అప్డేట్ ఏంటో తెలుసుకోవాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే మరి. ఈ సమయంలో విడుదల చేస్తారా ? రాష్ట్రంలో కరోనా మళ్లీ తన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెడుతోంది. దీంతో రద్దీ ప్రాంతాలలో ఒకటైన సినిమా హాళ్లను తిరిగి మూసివేయాలని, ఒకవేళ అది సాధ్యం కాకుంటే కనీసం సగం సీట్లు (50%) మాత్రమే నింపుకొనేందుకు మాత్రమే అనుమతి ఇస్తారంటూ ఊహాగానాలు వినిపించాయి. ఇటువంటి సమయంలో వకీల్ సాబ్ లాంటి భారీ సినిమాల విడుదలంటే వసూళ్ల పరంగా సినిమా కలెక్షన్ల పై పడే అవకాశం లేకపోలేదు. మరి ఈ సినిమాను అనుకున్న తేదీన విడుదల చేస్తారో లేక కరోనా కారణంగా మళ్లీ వాయిదా వేస్తారో అన్న ఆందోళన వ్యక్తమైంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లు యథాతథంగా నడుస్తాయని క్లారిటీ ఇవ్వడంతో పవన్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. -
‘అల వైకుంఠపురములో’ సక్సెస్ ఎంజాయ్ చేయలేదు :తమన్
‘‘ఒక సినిమాలో పాటలన్నీ హిట్ అయ్యాయంటే ఆ క్రెడిట్ సంగీత దర్శకుడు ఒక్కడిదే కాదు.. పాటల రచయిత, సింగర్స్, డైరెక్టర్స్, నిర్మాత.. ఇలా అందరికీ ఆ క్రెడిట్ దక్కుతుంది. ఓ సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే ఆ క్రెడిట్ కూడా 24 క్రాఫ్ట్స్ వారిది.. ఎవరి పని వారు బాగా చేస్తేనే సినిమా హిట్ అవుతుంది’’ అని సంగీత దర్శకుడు తమన్ అన్నారు. పవన్ కల్యాణ్ హీరోగా, శ్రుతీహాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. బోనీ కపూర్ సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు తమన్ హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ–‘‘మ్యూజికల్ సక్సెస్ అనేది చాలా రేర్గా వస్తుంది. ‘అల వైకుంఠపురములో’ పాటలన్నీ బాగా పాపులర్ అయ్యాయి.. కరోనా కారణంగా ఆ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేయలేకపోయాను. లాక్డౌన్ తర్వాత వచ్చిన ‘సోలో బతుకే సో బెటర్, క్రాక్’ సినిమాలు అటు మ్యూజికల్గానూ, ఇటు సినిమాపరంగానూ మంచి హిట్టయ్యాయి. పవన్ కల్యాణ్గారి ‘గబ్బర్ సింగ్’ సినిమాకి నేను సంగీతం అందించాల్సింది.. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఇప్పుడు ‘వకీల్ సాబ్’కి కుదిరింది. ‘దిల్’ రాజుగారికి త్రివిక్రమ్గారు చెప్పడంతో ‘వకీల్ సాబ్’ అవకాశం వచ్చింది. ఈ సినిమాలోని ‘మగువా మగువా, సత్యమేవ జయతే, కంటిపాప’ పాటలకు మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. ‘మగువా మగువా..’ పాటని చిరంజీవిగారు కూడా వాళ్ల అమ్మతో షేర్ చేసుకోవడం హ్యాపీ. నేపథ్య సంగీతం ఇంకా హైలెట్ అవుతుంది. నేను చేసిన ‘టక్ జగదీష్’, బాలకృష్ణ–బోయపాటి శ్రీను సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్, పవన్ కల్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోషియుం’ రీమేక్, మహేశ్బాబు ‘సర్కారువారి పాట’ సినిమాలకు సంగీతం అందిస్తున్నాను’’ అన్నారు. చదవండి: నువ్వు చూస్తున్నావని తెలుసు: నవీన్ పొలిశెట్టి ఎమోషనల్ సర్కారు వారిపాట: మహేశ్కి తండ్రిగా సీనియర్ హీరో -
'వకీల్ సాబ్' అసలు టైటిల్ ఇదేనట!
పవర్ఫుల్ లాయర్ పాత్రలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ సినిమాను శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తుండగా.. బోనీ కపూర్ సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. దాదాపు మూడేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవల చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో దర్శకుడు వేణు శ్రీరామ్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అందులో ఈ సినిమా టైటిల్ గురించి మాట్లాడుతూ తాము ముందు “వకీల్ సాబ్” టైటిల్ అనుకోలేదని సినిమా కథకు తగ్గట్టుగా “మగువ” అని అనుకున్నామని తెలిపారు. కానీ తర్వాత పవన్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని “వకీల్ సాబ్” టైటిల్ ఫిక్స్ అయ్యామని తెలిపారు. ఇక ఈ టైటిల్తో వచ్చిన సాంగ్ ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ను దర్శకత్వం వహించే అవకాశాన్ని పొందడం నిజంగా తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఒక కథను ప్రేక్షకులకు నచ్చేలా చెప్పడం చాలా సవాలుతో కూడుకున్న పని. అందులోనూ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్కి తగ్గట్టు, ఆయనకున్న విపరీతమైన ఫాలోయింగ్ని దృష్టలో ఉంచుకొని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా కొన్ని కమర్షియల్ అంశాలను జోడించినట్లు తెలిపారు. ‘వకీల్ సాబ్’ ట్రైలర్ ఈ నెల 29న విడుదలయ్యే అవకావం ఉంది. ఏప్రిల్ 9న చిత్రం విడుదలకు సన్నాహాలు చేసున్నారు. అలాగే ప్రీ-రిలీజ్ ఈవెంట్ను ఏప్రిల్ 3న నిర్వహించనున్నారు. ( చదవండి : కండీషన్లు పెట్టిన ‘వకీల్ సాబ్’..! ) -
‘వకీల్ సాబ్’తో నా కల నెరవేరింది: తమన్
‘‘వకీల్ సాబ్ ’ సినిమా చేస్తున్నప్పుడు ఎంతో ఎంజాయ్ చేశాం.. సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులకూ అదే అనుభూతి కలుగుతుంది’’ అని దర్శకుడు వేణు శ్రీరామ్ అన్నారు. పవన్కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతీహాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటించారు. బోనీ కపూర్ సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో వకీల్ సాబ్ మ్యూజికల్ ఫెస్ట్ను నిర్వహించారు. వేణు శ్రీరామ్ మాట్లాడుతూ– ‘‘పవన్ కల్యాణ్తో పనిచేయడం సంతోషంగా ఉంది. ‘వకీల్ సాబ్’కు మంచి సంగీతం ఇచ్చిన తమన్కు, అద్భుతమైన లిరిక్స్ ఇచ్చిన రామజోగయ్య శాస్త్రికి థ్యాంక్స్. ఈ సినిమా మీ అందరి అంచనాలు అందుకునేలా ఉంటుంది’’ అన్నారు. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ మాట్లాడుతూ– ‘‘పవన్ కల్యాణ్కి నేను పెద్ద అభిమానిని. మణిశర్మగారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు ‘ఖుషి’, ‘గుడుంబా శంకర్’, ‘బాలు’ చిత్రాలకు పనిచేశాను. ఆయన సినిమాకు సంగీతం అందించడం నా కల. అది ‘వకీల్ సాబ్’తో నెరవేరినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సింగర్స్ హారిక నారాయణ, పృథ్వీ, దీపు, శ్రీ కృష్ణ, సాహితీ, సుభ తదితరులు పాల్గొన్నారు. చదవండి: హీరోయిన్ కనబడుట లేదు: డోంట్ వర్రీ అంటున్న పోలీసులు కొత్త డైరెక్టర్తో మహేశ్ మూవీ.. కానీ, ఓ షరతు! -
‘వకీల్ సాబ్’ ఫస్ట్ రివ్యూ.. పవర్స్టార్ ఫ్యాన్స్కి పండగేనట
పవర్స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో పవన్ కల్యాణ్ అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. సినిమా ఎలా ఉంటుందో అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదలకు ముందే పవన్ కల్యాణ్ అభిమానులకు శుభవార్త వచ్చేసింది. దుబాయ్లో ఉంటూ టాలీవుడ్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ విమర్శకుడు, ఓవర్ సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు గురించి చాలా మందికి తెలుసు. ఇప్పటికే ఆయన చాలా తెలుగు సినిమాలకు ఫస్ట్ రివ్యూలు ఇచ్చారు. ఇప్పుడు ‘వకీల్ సాబ్’కి కూడా రివ్యూ ఇచ్చేశాడు. పవన్ కల్యాణ్ ఈజ్ బ్యాక్ అని.. బిగ్గెస్ట్ హిట్ అందుకోబోతున్నారంటూ రివ్యూలో చెప్పుకొచ్చాడు. మోస్ట్ కాంట్రవర్సియల్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ క్రిటిక్గా తనని తాను ప్రకటించుకున్న ఉమర్.. విడుదలకు ముందే సినిమా చూశానంటూ.. తాను ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ని అని రివ్యూలు ఇస్తూ ఫేమస్ అయ్యాడు. ఇటీవల ఇతని తన ట్వీటర్ అకౌంట్ హ్యాకింగ్కి గురికావడంతో మళ్లీ కొత్త అకౌంట్తో రివ్యూలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ‘వకీల్ సాబ్ సెన్సార్ రిపోర్ట్ సాలిడ్ అండ్ టెర్రఫిక్. సింగిల్ కట్ లేకుండా సెన్సార్ కంప్లీట్ చేసుకుందని.. ఔట్ స్టాడింగ్ రెస్పాన్స్ వచ్చిందని పేర్కొన్నాడు. గతంలో కూడా పవన్ సినిమాలు కాటమరాయుడు, అజ్ఞాతవాసి చిత్రాలు కూడా సూపర్ హిట్ అంటూ రివ్యూలు ఇచ్చాడు. కానీ అవి ఫ్లాప్ని మూటగట్టుకున్నాయి. మరి ‘వకీల్ సాబ్’కి ఇచ్చిన రివ్యూ ఏ మేరకు వాస్తవమో తెలియాలంటే ఏప్రిల్ 9 వరకు ఆగాల్సిందే. వకీల్ సాబ్ విషయానికి వస్తే.. బాలీవుడ్ సినిమా ‘పింక్’కి రీమేక్ ఇది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. #VakeelSaab Censor Reports are Solid & Terrific ! #PawanKalyan is back with bang. #vakeelsaabOnApril9th 👍👍 pic.twitter.com/kNVS5pKIIO — Umair Sandhu (@UmairSandu) March 16, 2021 చదవండి: వకీల్ సాబ్’ నుంచి మరో సాంగ్ విడుదల డైరెక్టర్ మృతి, హాస్పిటల్ బిల్ కట్టిన విజయ్ సేతుపతి -
‘వకీల్ సాబ్’ నుంచి మరో సాంగ్ విడుదల
పవర్స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వకీల్సాబ్’. ఇప్పటికే ఈ సినిమాలో విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్గా నిలిచాయి. ఎస్.ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి కంటి పాప..కంటి పాప అనే పాట విడుదలయ్యింది.రామ జోగయ్యశాస్ర్తి రచించిన ఈ పాటను బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ పాడారు. సాంగ్ రిలీజ్ అయిన కాసేపట్లోనే వేలసంఖ్యలో వ్యూస్ వచ్చాయి. అయితే ముందుగా ప్రకటించిన సమయం కాకుండా కొంచెం ఆలస్యంగా ఈ సాంగ్ను రిలీజ్ చేశారు. టెక్నికల్ కారణాల వల్ల సాంగ్ రిలీజ్ కొంచెం ఆలస్యమవుతుందని చిత్ర బృందం ఇది వరకే ప్రకటించింది. ఇక బాలీవుడ్లో హిట్ సాధించిన పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్సాబ్గా రీమేక్గా చేస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పింక్'లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను 'వకీల్ సాబ్'లో పవన్ కల్యాణ్ పోషిస్తుండడంతో సినిమాకు భారీ హైప్ క్రియెట్ అయ్యింది. అలాగే మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ విడుదల కానుంది. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చదవండి : (పవన్ కల్యాణ్ న్యూలుక్.. ఫొటో వైరల్) (ఆ టైంలో డిప్రెషన్కు లోనయ్యా : హీరోయిన్) -
పవన్ కల్యాణ్ న్యూలుక్.. షాకవుతున్న ఫ్యాన్స్
దాదాపు మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీతో బిగ్ స్క్రీన్పై ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. ఆయన నటించిన ‘అజ్ఞాతవాసి’ విడుదలై మూడేళ్లు అవుతుండటంతో వెండితెరపై ఆయనను చూసేందుకు అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చుస్తున్నారు. అయితే 2020లోనే వకీల్ సాబ్ మూవీ విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రీల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రాజకీయాలపై దృష్టి పెట్టిన ఆయన గ్లామర్కు కాస్తా దూరమయ్యాడు. గడ్డం పెంచి పెద్ద జట్టుతో ఉన్న పవన్ కాస్తా బరువు కూడా పెరిగాడు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆయన కాస్తా గ్లామర్పై దృష్టి పెట్టాడు. ఈ నేపథ్యంలో పవన్ న్యూ లుక్ ఫొటో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. క్లీన్ షేవ్తో స్లీమ్గా మునుపటి పవర్ స్టార్ల దర్శనమివ్వడంతో అభిమానులంతా సర్ప్రైజ్ అవుతున్నారు. ఈ ఫొటోలో పవన్ బ్లాక్ ట్రౌజర్-టీ షర్ట్తో నడుముపై చేతులు పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తు దర్శనం ఇచ్చాడు. ఇలా స్టైలిష్ లుక్ వపన్ను చూసి ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. ‘పవర్ స్టార్ ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం పవన్ క్రిష్ డైరెక్షన్లో, హరీష్శంకర్, సాగర్ చంద్ర డైరెక్షన్లో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Pawan Kalyan (@pawankalyan.k) చదవండి: శివరాత్రికి పవన్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారు: అషూ రెడ్డి వార్నింగ్ -
వకీల్ సాబ్: ‘సత్యమేవ జయతే’ పాట విన్నారా..
పవర్స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘వకీల్సాబ్’ చిత్రం నుంచి రెండో పాట నేడు(మార్చి3) విడుదలైంది. రామజోగయ్య శాస్త్రి కలం నుంచి జాలువారిన ‘సత్యమేవ జయతే’ సాంగ్ను బుధవారం చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ‘జనజనజన జనగణమున కలగలిసిన జనం మనిషి రా.. ’ అంటూ ప్రారంభమైన ఈ పాట పవన్ అభిమానులనే కాకుండా సాధారణ ప్రేక్షకుడిని సైతం ఆకట్టుకుంటుంది. థమన్ ఎనర్జిటిక్ బీట్తో సంగీతం అందించగా.. శంకర్ మహదేవన్, పృథ్వీ చంద్ర కలిసి పాడారు. ఇందులోని బలమైన లిరిక్స్ పాటను మరోస్థాయికి తీసుకెళ్లాయి. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్లో దూసుకుపోతుంది. కాగా 2020 మార్చి 8న మహిళా దినోత్సవం కానుకగా మగువ మగువ పాట విడుదలైంది. సరిగ్గా మొదటి పాట విడుదలైన ఏడాదికి రెండో పాట విడుదలవ్వడం విశేషం. మగువ పాటకు విశేష స్పందన లభించిన విషయం తెలిసిందే. మరి ఈ పాట జనాలకు ఎంత వరకు రీచ్ అవుతోంది వేచి చూడాలి. బాలీవుడ్లో హిట్ సాధించిన పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్సాబ్గా రీమేక్గా చేస్తున్న విషయం తెలిసిందే. దీనిని వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు. పింక్'లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను 'వకీల్ సాబ్'లో పవన్ కల్యాణ్ పోషిస్తుండడంతో సినిమాకు భారీ హైప్ క్రియెట్ అయ్యింది. అలాగే మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ విడుదల కానుంది. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చదవండి: పవన్ సినిమాకు నో చెప్పిన సాయి పల్లవి! నాని ‘వీ’ చిత్రంపై కోర్టుకెక్కిన నటి.. -
వకీల్సాబ్ అప్డేట్.. రెండో పాటకు రేపే ముహూర్తం!
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ వచ్చింది. వకీల్సాబ్లోని రెండో పాట ‘సత్యమేవ జయతే’ను మార్చి 3 రిలీజ్ చేయనున్నట్లు మంగళవారం ప్రకటించారు. #SatyamevaJayate Lyrical Video from Power Star @PawanKalyan's #VakeelSaab on March 3rd @ 5 PM#VakeelSaabMusicalFest#VakeelSaabOnApril9th pic.twitter.com/09jSjEzEui — BARaju (@baraju_SuperHit) March 2, 2021 ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన మగువా మగువా పాటకు విశేష స్పందన లభించింది. పాట రిలీజ్ అయిన చాలా రోజుల వరకు అందరి నోట, ఫోన్లలో ఇదే పాట నానింది. అలాగే ఇటీవల విడుదల చేసిన టీజర్కు కూడా రెస్పాన్స్ అదిరిపోయింది.. మరి సత్యమేవ జయతే సాంగ్కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. కాగా బాలీవుడ్లో హిట్ సాధించిన పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్సాబ్గా రీమేక్గా చేస్తున్న విషయం తెలిసిందే. పింక్'లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను 'వకీల్ సాబ్' లో పవన్ కల్యాణ్ పోషిస్తుండడంతో సినిమాకు భారీ హైప్ క్రియెట్ అయ్యింది. చదవండి : పవన్ కల్యాణ్ అడిగితే.. ఆయనకు 4వ భార్యగా ఉంటా.. బిగ్బాస్ బ్యూటీ హిమజకు పవన్ కళ్యాణ్ లేఖ -
పవర్ స్టార్ సినిమాను దక్కించుకున్న అమెజాన్!
వీడు ఆరడుగుల బుల్లెట్టు, ధైర్యం విసిరిన రాకెట్టు.. అని 'అత్తారింటికి దారేది'లో గేయ రచయిత శ్రీమణి చెప్పినట్లుగానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాక్సాఫీస్ భయాలను ఏమాత్రం పట్టించుకోకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఆ మధ్య 'అజ్ఞాతవాసి'తో నిరాశపర్చిన ఈ హీరో ఏకకాలంలో మూడు సినిమాలు చేస్తూ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తున్న వకీల్ సాబ్ను ఉగాది కానుకగా ఏప్రిల్ 9న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు ఓటీటీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ రేటుకు ఈ చిత్రాన్ని దక్కించుకున్నట్లు సమాచారం. అయితే థియేటర్లలో 50 రోజులు ఆడిన తర్వాతే ఓటీటీలో ప్రసారం చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. అంటే మే నెలాఖరులో వకీల్ సాబ్ అమెజాన్లో ప్రత్యక్షం కానుందన్నమాట. ఇక ఇదివరకే దీని శాటిలైట్ హక్కులను జీ తెలుగు కొనేసిన విషయం తెలిసిందే. కాగా గత సినిమా ఫ్లాపుల ప్రబావం పవన్ కల్యాణ్ మీద ఇసుమంతైనా లేకపోగా అతడు తన రెమ్యూనరేషన్ను పెంచేయడం గమనార్హం. మరోవైపు గతంలో తీసుకున్నదాని కంటే 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఎక్కువగా ఇచ్చేందుకు నిర్మాతలు సైతం సిద్ధమవుతుండటం విశేషం. ఈ క్రమంలో వకీల్ సాబ్కు పవన్ సుమారు రూ.50-55 కోట్లు ఎక్కువగా తీసుకున్నట్లు వినికిడి. అంటే ఆయన ఇంచుమించు రూ.300- 400 కోట్ల పారితోషికం అందుకున్నట్లు లెక్క. ఇదిలా వుంటే పవన్ ప్రస్తుతం 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్తో పాటు క్రిష్ డైరెక్షన్లో ఒకటి, సాగర్ చంద్ర దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్నాడు. చదవండి: పవన్ రీ ఎంట్రీ ఖరీదు రూ. 300 కోట్లా? -
వకీల్ సాబ్ వచ్చేస్తున్నాడు.. ఆ రోజే రిలీజ్
పవర్స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఉగాది కానుకగా ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటుంది. కాగా గత నాలుగు రోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసపెట్టి సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఒకరికొకరు పోటీపడి మరి రిలీజ్ డేట్లు ఫిక్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పవన్ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో వకీల్ సాబ్ యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ డేజ్ ప్రకటించడంతో సినిమా కోసం ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్న పవర్ స్టార్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. చదవండి: దూసుకొస్తున్న ఖిలాడి.. రిలీజ్ డేట్ ఫిక్స్ కాగా సంక్రాంతి సందర్భంగా ‘వకీల్ సాబ్’ టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో పవర్ స్టార్ తొలిసారిగా వకీల్గా భిన్న పాత్ర పోషించారు. హిందీలో వచ్చిన 'పింక్' చిత్రాన్ని తెలుగులో 'వకీల్ సాబ్' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా రూపొందిస్తున్నారు. చదవండి: శర్వానంద్, సిద్ధార్ధ్ల మహా సముద్రం’ రిలీజ్ డేట్ ఫిక్స్ -
పవన్ రీ ఎంట్రీ ఖరీదు 300 కోట్లా?
సినిమా పరిశ్రమలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెబితేనే ఒక సంచలనం. హిట్, ప్లాప్ అనే సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ కొత్త సినిమాను అభిమానులను విపరీతంగా ఆదరిస్తారు. పవర్స్టార్ సినిమాల ఫ్లాప్ ఎఫెక్ట్ అనేది కేవలం ఆ సినిమా వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత చేయబోయే సినిమా మీద చాలా తక్కువగానే ఉంటుంది అని చెప్పుకోవాలి. పవర్ స్టార్ కెరీర్లో ఇలా చాలాసార్లు జరిగింది. అందుకే సినిమాతో సంబంధం లేకుండా పవన్ మీద పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉంటారు. సినిమాకు తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ కూడా భారీ మొత్తంలో చెల్లిస్తారు. గత సినిమా ఫ్లాప్ తర్వాత కొన్ని కారణాల నేపథ్యంలో గ్యాప్ తీసుకోని వచ్చిన కూడా పవన్ రెమ్యూనరేషన్ మీద ఎలాంటి ప్రభావం పడకపోవడం మనం గమనించవచ్చు. గతంలో తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే 5 నుంచి 10 కోట్లు ఎక్కువగా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న "వకీల్ సాబ్" సినిమాకు సుమారు రూ.50-55 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా లైన్ లో ఉండగానే క్రిష్ సినిమా మొదలుపెట్టేశాడు. అలాగే త్వరలో 'అయ్యప్పన్ కొషియమ్' రీమేక్ ప్రారంభంకానుంది. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమాను ఓకే చేసేసాడు. ఇలా పవన్ వరుసగా ఆరు సినిమాలు ఓకే చేసినట్లు సమాచారం. వీటిలో ప్రతి సినిమాకు రూ.50-60 కోట్లు చెల్లించడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతోపవన్ ఏకంగా రెమ్యూనరేషన్ రూపంలో రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు అందుకోనున్నారు. అభిమానులు మాత్రం తమ హీరో వరుసగా ఆరు సినిమాలు చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
కేక పుట్టిస్తోన్న ‘వకీల్ సాబ్’ టీజర్.. ఆ డైలాగ్లో..
పవర్ స్టార్ అభిమానులంతా ఎడాదిన్నరగా ఎప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్న ‘వకీల్ సాబ్’ రానే వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ‘వకీల్ సాబ్’ టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసి వారికి సర్ప్రైజ్ ఇచ్చింది. తమ అభిమాన నటుడి సినిమాను వెండితెరపై చూసేందుకు ఉత్సుకతతో ఉన్న వపన్ అభిమానులు ఈ టీజర్తో పండుగా చేసుకుంటున్నారు. ఇటీవల షూటింగ్ను పూర్తి చేసుకున్న వకీల్ సాబ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇందులో పవర్ స్టార్ తొలిసారిగా వకీల్గా భిన్న పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్లకు విశేషన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక టీజర్ విషయానికి వస్తే.. పవర్ స్టార్ తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు. ఇందులో అడ్వకేట్ సూట్తో ప్రారంభమైన ఈ టీజర్లో పవన కల్యాణ్ పెన్నుతో టిక్ టిక్ మనే శబ్ధం చేస్తూ.. చేతి వాచ్ను ఆయుధంగా వాడి కోర్టు సీరియస్గా వాదిస్తున్న సీన్ టీజర్కు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకొవచ్చు. ఇక మెట్రో రైల్లో.. కోర్టులో వాదించడం తెలుసు కోటు తీసి కొట్టడం తెలుసు అని చెప్పే డైలాగ్ కేక పెట్టించేలా ఉంది. ఇళ్లు ఖాళీ చేసి సామాన్లు తీసుకుకెళ్తున్న వ్యాన్లో కుర్చుని పవన్ బుక్ చదవుతున్న సీన్తో టీజర్కు ఎండ్ పడింది. ఇప్పటికే ఫస్ట్ లుక్తో ఈ సినిమాపై పెరిగిన అంచనాలు టీజర్తో మరింత క్రేజ్ను సంపాదించుకుంటోంది. మొత్తానికి అజ్ఞాతవాసితో నిరుత్సాహపరిచిన పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’తో కేవ్వు కేక పుట్టించనున్నాడంటూ ఆయన అభిమానులంతా కాలర్ ఎగిరేస్తున్నారు. -
'వకీల్ సాబ్' టీజర్ టైమ్ ఫిక్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'వకీల్ సాబ్' ఫస్ట్ టీజర్ సంక్రాంతి(జనవరి 14న) సందర్భంగా సాయంత్రం 06:03 గంటలకు విడుదల అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇదివరకే డిసెంబర్ 31న ఈ సినిమాకు సంబందించిన ఒక పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. మరోసారి జోడీగా ఈ చిత్రంలో పవన్, శృతిహాసన్ కలిసి నటించనున్నారు. హిందీలో వచ్చిన 'పింక్' చిత్రాన్ని తెలుగులో 'వకీల్ సాబ్' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా రూపొందిస్తున్నారు. -
వైరల్ అవుతున్న పవన్ ‘వకీల్ సాబ్’ ఫోటోలు
పవన్ కల్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఆ సినిమాకు సంబంధించిన పోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన కూడా లీకుల బెడద మాత్రం తప్పడం లేదు.తాజాగా ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ నుంచి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. క్లైమాక్స్ ఫైట్కు సంబంధించిన ఫొటో ఒక్కటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ నటుడు దేవ్ గిల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఫైట్ కు సంబంధించిన ఫోటోలతో పాటు పవన్ తో దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్ అయింది.ఈ స్టిల్స్ను బట్టి చూస్తే... సినిమాలో చాలా మార్పులు చేశారని అర్ధమవుతుంది. కాగా..ఈ ఏడాది ట్విట్టర్ లో ట్రెండ్ అయిన ట్యాగ్స్ లలో ‘వకీల్ సాబ్’ కూడా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ‘వకీల్ సాబ్’ విషయానికి వస్తే.. హిందీ ‘పింక్’ సినిమాకు రీమేక్ ఇది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి,శ్రుతిహాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు ‘వకీల్ సాబ్’ రాక కోసం ఎదురుచూస్తున్నారు. -
ఆదివాసీలతో పవన్ ముచ్చట.. వీడియో వైరల్
పవర్స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నారు. లాక్డౌన్ ముగిశాక ఓ షెడ్యూల్లో పాల్గొన్న ఆయన కాస్త విరామం తీసుకున్నారు. తాజాగా కీలక సన్నివేశాల చిత్రీకరణ మళ్లీ సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో యాక్షన్ సన్నివేశాలతో పాటు ప్లాష్ బ్యాక్కు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇక షూటింగ్లో భాగంగా అరకు వెళ్లిన పవన్.. అక్కడి ఆదివాసీలతో కాసేపు సరదాగా గడిపాడు. షూటింగ్ విరామ సమయంలో ఆదివాసీల జీవన స్థితిగతుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు పాట రూపంలో వారి స్థితిగతుల్ని వపన్కు వివరించారు. ఈ వీడియోని స్వయంగా పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. ‘నిన్న 'వకీల్ సాబ్' షూటింగ్ విరామంలో,అరకు ఆదివాసీల ఆంధ్ర-ఒరియా లో అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ పాడే పాట .. ( వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన ' వనవాసి' గుర్తుకువచ్చింది)’అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. హిందీ ‘పింక్’ సినిమాకు రీమేక్గా తెరకెక్కుతున్న‘వకీల్ సాబ్’కు వేణు శ్రీరామ్ దర్శకుడు. నివేదా థామస్, అంజలి,శ్రుతిహాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు ‘వకీల్ సాబ్’ రాక కోసం ఎదురుచూస్తున్నారు. నిన్న 'వకీల్ సాబ్' షూటింగ్ విరామంలో,అరకు ఆదివాసీల ఆంధ్ర-ఒరియా లో అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ పాడే పాట .. ( వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన ' వనవాసి' గుర్తుకువచ్చింది) pic.twitter.com/CkgNP3PSMA — Pawan Kalyan (@PawanKalyan) December 24, 2020 -
వకీల్ సాబ్ సెట్లో అడుగుపెట్టనున్న శృతి
శృతి హాసన్ తెలుగులో చేసిన ఆఖరి చిత్రం ‘కాటమరాయుడు’. ఆ తర్వాత కొన్ని రోజులకు బాలీవుడ్లో ‘బెహెన్ హోగీ తేరీ’ చిత్రంలో తలుక్కుమన్నారు. అంతే.. తర్వాత కొన్ని రోజుల వరకు ఆమె జాడే మాయం. ఈ మూడు సంవత్సరాలు ఆమె ఏ భాషలోనూ, ఏ సినిమాలోనూ కనిపించలేదు. పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్బై చెప్పేస్తుందన్న పుకార్లు కూడా వినిపించాయి. కానీ ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ తన నటనతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు శృతి. జీ-5లో రిలీజ్ అయిన ‘యారా’ సినిమాతో బాలీవుడ్కు మళ్లీ హాయ్ చెప్పారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్లో విడుదల అయిన తమిళ చిత్రం ‘పుత్తమ్ పుదు కలయ్’లో ఓ చిన్న పాత్రలో కనువిందు చేశారు. ఇక టాలీవుడ్కు రావాల్సిన టైమ్ వచ్చేసింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న క్రాక్ సినిమాలో శృతి హీరోయిన్గా చేస్తుందన్న సంగతి తెలిసిందే. దాంతో పాటు పవర్స్టార్ పవన్కళ్యాణ్ కమ్బ్యాక్ సినిమా వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో శృతి నటిస్తుందని వార్తలు వచ్చినా వాటిపై మూవీ టీమ్ ఏం స్పందించలేదు. మధ్యమధ్యలో ఆ పాత్ర కీర్తి సురేశ్ చేస్తుందని, రాశి ఖన్నా ఆ రోల్లో కనిపించబోతుందని పుకార్లు వినిపించాయి. అందుకే ఏది నిజమో తెలియని అయోమయ స్థితిలో పడిపోయారు ఫ్యాన్స్. (వెబ్ సిరీస్లతో నిర్మాతగా..) పవన్ కళ్యాణ్తో ఇప్పటికే రెండుసార్లు కలిసి నటించిన శృతి హాసన్ వకీల్ సాబ్ సినిమాతో మూడోసారి జతకట్టబోతుందని తేలిపోయింది. తను ఈ సినిమా షూటింగ్లో పాల్గోనే తేదీ కూడా ఖరారయ్యింది. ప్రస్తుత షెడ్యూల్లో పవన్ కళ్యాణ్పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఈ షెడ్యూల్ ఒక వారంలో ముగియనుంది. డిసెంబర్ మొదటివారంలో మొదలుకానున్న తరువాతి షెడ్యూల్లో శృతి హాసన్ సెట్లోకి అడుగుపెట్టనున్నారు. గబ్బర్సింగ్, కాటమరాయుడు సినిమాలలో లాగా వకీల్సాబ్ సినిమాలో శృతిది ఫుల్ లెన్త్ రోల్ కాదని తెలుస్తోంది. -
వకీల్సాబ్ షూటింగ్: పవన్ మెట్రో ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురువారం మెట్రోరైలులో ప్రయాణించారు. సామాన్యుడిలా మెట్రోలో ప్రయాణించిన పవన్ అక్కడ ఉన్న ద్రాక్షరామం రైతుతో ముచ్చటించారు. ఆయన మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో ప్రయాణించారు. వకీల్సాబ్ షూటింగ్ నిమిత్తం ఆయన మియాపూర్ వెళ్లాల్సి వచ్చింది. సాధారణ ప్రయాణికుడిలా మెట్రోస్టేషన్లో చెకింగ్ ప్రక్రియను, ఎంట్రీ విధానాన్ని పాటించారు. ఈ ప్రయాణంలో భాగంగా అమీర్ పేట స్టేషన్లో ట్రైన్ మారారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఈ సందర్భంలో తోటి ప్రయాణికులతో సంభాషించారు. మియాపూర్ వెళ్లే ట్రైన్లో పవన్ కళ్యాణ్ పక్కన ద్రాక్షారామం, సత్యవాడ ప్రాంతాల వారు కూర్చున్నారు. దీంతో ఆయన ద్రాక్షారామానికి చెందిన చిన సత్యనారాయణ అనే రైతుతో మాట్లాడారు. పంటల గురించి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన సత్యనారాయణ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వ్యవసాయం బాగా దెబ్బతింది అని చెప్పారు. తమ ప్రాంతంలోనూ, కుటుంబంలోనూ చాలామంది పవన్ కల్యాణ్ అభిమానులు ఉన్నారని చెప్పారు. ఈ ప్రయాణంలో పవన్ను కలవడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. మెట్రో ట్రైన్ ప్రయాణం తనకు మొదటిసారి అని ఆ రైతు చెప్పగానే పవన్ కళ్యాణ్ కూడా నవ్వుతూ మీకే కాదు నాకు కూడా మెట్రో ప్రయాణం ఇదే మొదటిసారి అని అన్నారు. ఇక ఈ మెట్రోప్రయాణంలో పవన్ వెంట చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. చదవండి:పండగ నాడు వకీల్ సాబ్ టీజర్?! -
వకీల్ సాబ్ కోసం పవన్ కళ్యాణ్ మెట్రో ప్రయాణం
-
నివేదాకు వకీల్ సాబ్ టీమ్ స్పెషల్ గిఫ్ట్
తెలుగు, తమిళ, మలయాళంలో పలు సూపర్హిట్ సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు అందుకున్న నటి నివేదా థామస్. నిన్ను కోరి, జెంటిల్మేన్, బ్రోచేవారెవరురా, దర్బార్ లాంటి సూపర్హిట్ సినిమాలు ఇప్పటికే ఆమె ఖాతాలో ఉన్నాయి. 2008లో వచ్చిన మలయాళం సినిమా 'వెరుతే ఒరు' భార్యతో వెండితెరకు పరిచయమైన నివేదా తను తమిళంలో చేసిన మొదటి చిత్రం 'కురువి'తో మంచి పేరు సాధించారు. మలయాళంలో బ్లాక్బస్టర్ అయిన దృశ్యం సినిమాకు తమిళ రీమేక్గా వచ్చిన పాపనాశం సినిమాతో నివేదాకు అసలైన బ్రేక్ వచ్చింది. ఇందులో కమల్ హాసన్ సుయంబులింగం పాత్ర పోషించగా, నివేథా ఆయన కూతురు సెల్వి సుయంబులింగంగా నటించారు. ప్రస్తుతం పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న నివేదా షూటింగ్లో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఈ రోజు నివేదా థామస్ పుట్టినరోజు సందర్భంగా వకీల్ సాబ్ ఆమెకు బహుమతిగా ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. (కాజల్ వెడ్డింగ్ లెహెంగా తయారీకి 30 రోజులు) Team #VakeelSaab wishes @i_nivethathomas, a very Happy Birthday! pic.twitter.com/OpARfbLZsI — Sri Venkateswara Creations (@SVC_official) November 2, 2020 కాగా.. పరిమిత సిబ్బందితో ఈ సినిమా షూటింగ్ జరుగుతండగా నివేదా ఇటీవల షూటింగ్లో భాగమయ్యారు. పలు జాగ్రత్తలు పాటిస్తూ నివేదా షూటింగ్లో పాల్గొంటున్నారు. 7 నెలల లాక్డౌన్ తర్వాత షూటింగ్ను తిరిగి ప్రారంభించారు. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న వకీల్ సాబ్కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. నివేదా థామస్ ఓ కీలక రోల్లో నటిస్తున్నారు. -
పండగ నాడు వకీల్ సాబ్ టీజర్?!
పవన్ కల్యాణ్ తాజాగా నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం విడుదల గురించి పవర్ స్టార్ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నారనే వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. పండుగ నాడు వకీల్ సాబ్ టీజర్ను విడుదల చేయనున్నారనే వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచే వకీల్ సాబ్ యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. పండుగ నాడు టీజర్ని రిలీజ్ చేయాల్సిందిగా అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 25న సాయంత్రం 5 గంటలకు వకీల్ సాబ్ టీజర్ విడుదల కానుందనే వార్త ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇక దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. (చదవండి: కండీషన్లు పెట్టిన ‘వకీల్ సాబ్’..!) శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ఈ సినిమా వస్తుంది. ఈ మధ్యే వకీల్ సాబ్ షూటింగ్ మళ్లీ మొదలైంది. హిందీలో సూపర్ హిట్ అయిన్ పింక్కు రిమేక్గా వస్తున్న వకీల్ సాబ్ని తెలుగులో దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి దీనిని విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. షూటింగ్ చివరి దశకు వచ్చిందని.. పవన్కు సంబంధిసంచి కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని తెలిసింది. కచ్చితంగా ఈ సినిమాతో పవన్ అదిరిపోయే రీ ఎంట్రీ ఇస్తాడని నమ్ముతున్నారు అభిమానులు. నిజానికి ఈ సినిమాను మేలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా ప్లాన్స్ అన్నీ తారుమారు అయ్యాయి. ఇక వకీల్ సాబ్ వచ్చే ఏడాది థియేటర్లలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. -
షూటింగ్కి రెడీ
కరోనా బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్స్తో బిజీ కాబోతున్నారు శ్రుతీహాసన్. ఇటీవలే కొన్ని యాడ్స్ చిత్రీకరణల్లో పాల్గొన్నారామె. తాజాగా సినిమా చిత్రీకరణలకు కూడా సిద్ధమయ్యారు. అక్టోబర్ నుంచి ‘వకీల్ సాబ్’ చిత్రీకరణలో పాల్గొంటారట శ్రుతీహాసన్. పవన్ కల్యాణ్, అంజలి, నివేదా థామస్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ ‘పింక్’కి రీమేక్. ఇందులో పవన్ కల్యాణ్ భార్యగా శ్రుతీహాసన్ నటించనున్నారు. అయితే ఇందులో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందని సమాచారం. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. సంక్రాంతికి సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాతో పాటు రవితేజ ‘క్రాక్’లోనూ నటిస్తున్నారు శ్రుతి. ఆ సినిమా చిత్రీకరణ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. -
కండీషన్లు పెట్టిన ‘వకీల్ సాబ్’..!
పవర్ఫుల్ లాయర్ పాత్రలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమాను శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తుండగా.. బోనీ కపూర్ సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమా విడులయ్యే అవకాశముంది. అయితే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో వకీల్ సాబ్ షూటింగ్కి కాస్త విరామమిచ్చారు. అన్లాక్ ప్రక్రియ మొదలవడంతో ఇప్పుడిప్పుడే ఆగిపోయిన సినిమా షూటింగులు సెట్స్పైకి వెళ్తున్నాయి. ఈక్రమంలో వకీల్ సాబ్ షూటింగ్ కూడా తిరిగి ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఈమేరకు సినీ నిర్మాతలు పవన్ను సంప్రదించినట్టు సమాచారం. అయితే, పవన్ వారికో కండీషన్ పెటినట్టు తెలుస్తోంది. తాను చాతుర్మాస్య దీక్షలో ఉన్నందున సాయంత్రం 4 గంటల వరకే అందుబాటులో ఉంటానని చెప్పినట్టు తెలిసింది. దాంతో సాయంత్రం 6 తర్వాత తిరిగి యథావిధిగా పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చనేది ఆయన ఆలోచన. దీనికి నిర్మాతలు ఒప్పుకున్నారని, ఈ నెలాఖరు నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని సినీ వర్గాల ద్వారా తెలిసింది. పవన్ చాతుర్మాస్య దీక్ష నవంబర్లో పూర్తి కానుంది. (చదవండి: ఆలయంలో సతీసమేతంగా జక్కన్న పూజలు) -
పవర్ఫుల్ లాయర్
‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బోనీ కపూర్ సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పవన్ అభిమానులు, సినీ ప్రేక్షకులు కోరుకునేలా ఓ పవర్ఫుల్ లాయర్ పాత్రలో పవన్ కల్యాణ్గారు కనిపించబోతున్నారు. కరోనా వైరస్ పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత మిగిలిన షూటింగ్ను పూర్తి చేసి, సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్ , కెమెరా: పి.ఎస్. వినోద్, కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి. -
'వకీల్ సాబ్' మోషన్ పోస్టర్ విడుదల
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నడు(బుధవారం) 49వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. ‘అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి' సినిమాతో టాలీవుడ్లో హీరోగా రంగప్రవేశం చేసిన ఆయన ఎందరో అభిమానులకు దేవుడిగా మారే స్థాయికి ఎదిగిపోయారు. అయితే అనూహ్యంగా అన్న చిరంజీవి బాటలోనే ఆయన కూడా రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు విరామం ఇవ్వడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. సుమారు రెండేళ్ల గ్యాప్ తర్వాత "వకీల్ సాబ్"తో తిరిగి సందడి చేయనున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా 'వకీల్ సాబ్' చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్ను విడుదల చేసింది. ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ఈ పోస్టర్ విడుదలైంది. (ఆ రోజు పవన్ అభిమానులకు డబుల్ ధమాకా) ఇందులో మహాత్మాగాంధీ, అంబేద్కర్ వంటి మహోన్నత వ్యక్తులను మొదట చూపించారు. ఆ తర్వాత పవన్ సూటు వేసుకుని లాయర్ గెటప్లో దర్శనమిచ్చారు. ఒక చేత క్రిమినల్ లా పుస్తకం పట్టుకుని, మరో చేత కర్ర పట్టుకుని ఏ దారిలోనైనా నేరస్థులను వదిలేదే లేదని చెప్పకనే చెప్తున్నారు. ఇక బ్యాక్గ్రౌండ్లో "సత్యమేవ జయతే" అంటూ వస్తుండటం మోషన్ పోస్టర్కు అదనపు ఆకర్షణగా నిలిచింది. కాగా శ్రీరామ్ వేను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'వకీల్ సాబ్' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర బ్యానర్స్ క్రియేషన్స్పై దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. ఇది బాలీవుడ్ బ్లాక్బస్టర్ హిట్ ‘పింక్’ తెలుగు రీమేక్ అన్న విషయం తెలిసిందే (నిహారిక నిశ్చితార్థం: పవన్ అందుకే వెళ్లలేదు) -
ఆ రోజు పవన్ అభిమానులకు డబుల్ ధమాకా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. ఇది బాలీవుడ్లో బ్లాక్బస్టర్గా నిలిచిన 'పింక్' సినిమాకు రీమేక్ అన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఎప్పుడా అని ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ మోషన్ టీజర్ రిలీజ్ డేట్పై క్లారిటీ వచ్చింది. ఆయన పుట్టిన రోజు తెలుసు కదా.. సెప్టెంబర్ 2. అభిమానులకు అది పండగ రోజు కూడా! అదే రోజు మోషన్ టీజర్ను వదిలి అభిమానులకు బర్త్డే ట్రీట్ ఇచ్చేందుకు వకీల్ సాబ్ యూనిట్ సిద్ధమవుతోంది. అసలే రెండేళ్ల విరామం తర్వాత పవన్ రీ ఎంట్రీ ఇస్తుండటంతో సినిమా నుంచి వచ్చే అప్డేట్ కోసం కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. (చదవండి: అన్నయ్య చేయిపట్టి పెరిగాను.. పవన్ భావోద్వేగం) ఈ క్రమంలో ఆయన పుట్టిన రోజు, టీజర్ విడుదల ఒకే రోజు కావడంతో, రెండింటిని ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియాలో మోత మోగిస్తామంటున్నారు అభిమానులు. అందుకోసం ఇప్పటినుంచే కౌంట్ డౌన్ కూడా ప్రారంభించారు. కాగా ఈ సినిమా చిత్రీకరణ సమయంలో పవన్ న్యాయం కోసం కోర్టులో వాదిస్తున్న ఫొటోతో పాటు, షూటింగ్ ఫొటోలు కూడా లీకై, వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. వకీల్ సాబ్ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తుండగా తమన్ సంగీతమందిస్తున్నారు. (చదవండి: పవన్ సినిమా.. నన్నెవరూ కలవలేదు) -
పవన్ ‘వకీల్ సాబ్’: మరో లీక్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ బ్లాక్బస్టర్ హిట్ ‘పింక్’ తెలుగు రీమేక్గా వస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ‘మగువా మగువా’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్గా నిలిచాయి. అయితే దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రానికి లీకుల బెడద తప్పడం లేదు. (త్రివిక్రమ్తో మరో సినిమా.. పవన్ ఆసక్తి?) ఈ చిత్రానికి సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ న్యాయవాది గెటప్లో న్యాయం కోసం కోర్టులో గట్టిగా వాదిస్తున్నట్టు కనిపించాడు. ఎంతో ఇంట్రెస్ట్గా ఉన్న ఆ ఫోటో చూపరులను ముఖ్యంగా పవర్స్టార్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పవన్ స్టిల్ లీకవడం పట్ల చిత్ర యూనిట్ అసహనం వ్యక్తం చేస్తోంది. గతంలో కూడా షూటింగ్ స్పాట్లో పవన్కు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో చిత్ర బృందం ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా లీకుల బెడద తప్పడం లేదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. (ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్: తమన్) -
త్రివిక్రమ్తో మరో సినిమా.. పవన్ ఆసక్తి?
పవర్స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో నాలుగో సినిమా రాబోతుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడు చిత్రాల్లో రెండు సూపర్డూపర్ హిట్ కాగా మరొకటి బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్తో మరో సినిమా చేయాలని పవన్ ఆమితాసక్తిని కనబరుస్తున్నారట. కాగా ఈ మధ్య పవన్కు త్రివిక్రమ్ ఓ కథ వినిపించడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయట. అంతేకాకుండా వీలైనంత త్వరగా పూర్తి స్క్రిప్ట్ను సిద్దం చేసి తక్కువ సమయంలోనే ఈ చిత్రాన్ని తీసేలా ప్లాన్ చేయాలని త్రివిక్రమ్కు పవన్ సూచించారని సమాచారం. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' చేస్తున్న పవన్, ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ చిత్రం చేయనున్నారు. హరీష్ శంకర్తో ఓ సినిమాకు కూడా పవన్ కమిట్ అయ్యారు. అయితే లాక్డౌన్ కారణంగా క్రిష్ సినిమాకు సంబంధించి భారీ సెట్ల నిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయట. దీంతో ప్రభుత్వాలు షూటింగ్లకు అనుమతి ఇచ్చినా ఈ సినిమా సెట్స్పైకి వెళ్లడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. క్రిష్ సినిమా షూటింగ్ ప్రారంభంకావడానికి ముందు వచ్చే ఈ చిన్న గ్యాప్లో త్రివిక్రమ్తో సినిమా చేయాలని పవన్ భావిస్తున్నాడట. (మరో రికార్డు క్రియేట్ చేసిన ‘అఆ’) మరోవైపు ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ వెయిట్ చేస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ పూర్తయితే గానీ ఎన్టీఆర్-త్రివిక్రమ్ల సినిమా పట్టాలెక్కే అవకాశం లేదు. ఈ క్రమంలో నాని, వెంకటేష్లతో మల్టీస్టారర్ చిత్రానికి ప్లాన్ చేసినప్పటికీ అది ఇప్పట్లో వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. దీంతో త్వరలోనే పవన్-త్రివిక్రమ్ కాంబోలో సినిమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. (హరీశ్ మరో చిత్రం.. పవన్ ఫ్యాన్స్కు డౌట్) -
పవర్ స్టార్ సరసన అనుష్క?
చిన్న గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవర్స్టార్ పవన్ కల్యాణ్ జోరు పెంచారు. వేణు శ్రీరామ్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ‘వకీల్ సాబ్’ విడుదలకు సిద్దంగా ఉంది. అయితే కరోనా లాక్డౌన్తో థియేటర్లకు తాళం పడటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వకీల్ సాబ్ విడుదలవడంతో పాటు క్రిష్ సినిమా పట్టాలెక్కేది. కానీ కరోనాతో అన్నీ తలకిందులయ్యాయి. అయితే ఈ లాక్డౌన్ సమయాన్ని ప్రీ ప్రొడక్షన్ పనులకోసం సద్వినియోగం చేసుకుంటున్నారు దర్శకులు. ఈ క్రమంలో పవన్-క్రిష్ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాబిన్ హుడ్ కాన్సెప్ట్తో హిస్టారికల్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ బందిపోటు పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా టైటిల్ ‘విరూపాక్ష’గా ఫిక్సయిందని టాలీవుడ్ టాక్. అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్ల విషయంలో స్పష్టతరావడం లేదు. తొలుత ఈ చిత్రంలో జాక్వలిన్ ఫెర్నాండెజ్ అని అనుకున్నారు. కానీ తాజాగా ఈ చిత్రంలో స్వీటీ అనుష్క పవన్ సరసన నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఇద్దరి హీరోయిన్లకు అవకాశం ఉండటంతో జాక్వలిన్, అనుష్కల వైపు క్రిష్ మొగ్గు చూపుతున్నట్లు ఫిలింనగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు. దీంతో ఈ సినిమా అప్డేట్ కోసం పవర్స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చదవండి: ‘విజయ్ ఆగ్రహం.. మద్దతిచ్చిన టాలీవుడ్’ ‘డియర్ విజయ్.. నేనర్థం చేసుకోగలను’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_191237004.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పవన్ సినిమా.. నన్నెవరూ కలవలేదు
పవర్స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని రిలీజ్కు సిద్దంగా ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా మే15న విడుదలై క్రిష్ పీరియాడికల్ చిత్ర షూటింగ్ ప్రారంభమయ్యేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు. దీంతో ఎక్కడి సినిమాలు అక్కడే ఆగిపోయాయి. అయితే ఈ అనూహ్యంగా దొరికిన ఖాళీ సమయాన్ని ప్రీ ప్రొడక్షన్ పనులకోసం వినియోగించుకుంటున్నారు. పవన్-క్రిష్ కాంబినేషన్లో రాబోతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీలో ఓ పవర్ఫుల్ పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ శివకార్తీకేయన్ను చిత్రబృందం సంప్రదించినట్లు అనేక వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఈ కోలీవుడ్ హీరో సన్నిహితులు స్పందించారు. పవన్ సినిమా గురించి శివకార్తీకేయన్ను ఎవరు స్పందించలేదని, ప్రస్తుతం వరుస తమిళ సినిమాలతో అతడు బిజీగా ఉన్నారని చెబుతున్నారు. అయితే ఈ విషయంపై స్పష్టతరావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ చిత్రంలో బందిపోటుగా పవన్ కనిపించనున్నారని లీకువీరులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో పవన్ పాత్ర పేరు వీరు అని అందుకే ‘విరూపాక్ష’ అనే సినిమా టైటిల్ను ఫిక్స్ చేయాలని క్రిష్ భావిస్తున్నారని మరో వార్త వినిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఇద్దరి హీరోయిన్లు నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కీరవాణి సంగీతమందిస్తున్నట్లు సమాచారం. చదవండి: రాజమౌళికి రిక్వెస్ట్.. ఏం చేస్తారో చూడాలి భన్సాలీ చిత్రం.. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పవన్తో సినిమా.. శృతి క్లారిటీ
పవర్స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’. పింక్ రీమేక్గా వస్తోన్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ‘మగువా మగువా’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్గా నిలిచాయి. రెండేళ్ల తర్వాత పవన్ రీ ఎంట్రీ ఇస్తుండటం, ఫస్ట్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ సాధించడంతో ‘వకీల్ సాబ్’ అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడగా.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం అంజలి, నివేదా థామస్లను చిత్ర బృందం ఇప్పటికే ఎంపిక చేసింది. అయితే మరో కీలక పాత్రలో శృతిహాసన్ నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో అనేక వార్తల వస్తున్నాయి. అయితే ఇటీవలే తన సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా.. ప్రస్తుతం తను తెలుగులో క్రాక్ చిత్రంలో మాత్రమే నటిస్తున్నాని, ఏ రీమేక్ చిత్రంలో నటించడం లేదని పేర్కొంది. అంతేకాకుండా తనను ఎవరూ కూడా సంప్రదించలేదని తేల్చిచెప్పడంతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఫుల్స్టాప్ పడింది. గబ్బర్ సింగ్, కాటమరాయుడు చిత్రంలో పవన్, శృతిహాసన్ల కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో ‘వకీల్ సాబ్’ కోసం దర్శకనిర్మాతలు ఈ ముద్దుగుమ్మను సంప్రదించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్: తమన్ వకీల్ సాబ్ ఫస్ట్ లుక్పై వర్మ ట్వీట్ -
ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్: తమన్
సాక్షి, హైదరాబాద్ : సినీ నటడు పవన్ కల్యాణ్కు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అభిమానులు ఉన్నారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తోటి నటులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయనను అభిమానిస్తారు. వారిలో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ కూడా ఒకరు. కాగా శనివారం పవన్ కల్యాణ్ ట్విటర్లో తమన్ను ఫాలో అయినట్లు నోటిఫికేషన్ రాగానే తమన్ ఆనందంతో ఎగిరి గంతేశారు. 'బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఇది. ఈరోజు స్టార్ట్ చేయడానికి ఇంత కన్నా మంచి పరిణామం ఏముంటుంది' అంటూ ట్విటర్లో పంచుకున్నారు. పవన్కళ్యాణ్ ట్విటర్లో 34 మందినే ఫాలో అవుతున్నారు. వారిలోనూ ఎక్కువమంది రాజకీయనేతలు కాగా తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి చిరంజీవి, రామ్చరణ్లను ఫాలో అవుతున్నారు. బాలీవుడ్ చిత్రం పింక్ రీమేక్గా తెరకెక్కుతున్న వకీల్సాబ్ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా, అనిరుద్ధ రాయ్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 8న మగువా మగువా ఫస్ట్సాంగ్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ప్రపంచవ్యాప్తంగా వకీల్సాబ్ సినిమా మే 15న విడుదల చేయాలని భావిస్తున్నారు. One of the biggest happiesttttttttttt fannnnnnnnnnnnnnnnnnnnnn moment Can’t get a bigger way to start the day . Sirrrrrrrrrrrr ♥️ Lots of gratitude & respect sir Love U sir God bless ✊ pic.twitter.com/fX5CTClbLi — thaman S (@MusicThaman) April 4, 2020 -
వకీల్ సాబ్ అప్డేట్ : ఆరోజే టీజర్
హైదరాబాద్ : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉగాదికి అసలైన పండగను ఆస్వాదించే వార్తను వకీల్సాబ్ చిత్రబృందం అందిస్తోంది. వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్న వకీల్ సాబ్ ట్రైలర్ను ఉగాది సందర్భంగా మార్చి 25న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే విడుదలైన వకీల్ సాబ్ మూవీ ఫస్ట్లుక్కు పవన్ అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. ఫస్ట్లుక్లో పవర్స్టార్ లుక్ అద్భుతంగా ఉందని టాలీవుడ్ హీరోలు, ప్రముఖుల నుంచి ప్రశంసలు లభించాయి. ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీకపూర్ నిర్మాణ భాగస్వామ్యంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ కావడంతో పవర్స్టార్ అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమితాబ్ బచన్ ప్రధాన పాత్రలో బాలీవుడ్లో తెరకెక్కిన పింక్ రీమేక్గా వకీల్సాబ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. చదవండి : వకీల్ సాబ్ నుంచి తొలిసాంగ్ -
వకీల్ సాబ్ నుంచి తొలిసాంగ్
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్సాబ్’. బాలీవుడ్ ‘పింక్’ సినిమాకు ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే. బిగ్బీ అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను ఇక్కడ పవన్ చేయనున్నాడు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి తొలిసాంగ్ రిలీజైంది. ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా’ అంటూ తొలి రెండు లైన్లలోనే స్త్రీ ఔన్నత్యాన్ని చాటిచెప్పారు. మెలోడీగా సాగిపోతున్న ఈ పాటలో ప్రతి లైనులో మహిళ ప్రాశస్త్యాన్ని ఇనుమడింపజేశారు. (నా జీవితం ఏ మగాడి సాయం లేకుండా సాగుతోంది: రేణు) ఆమె గొప్పతనాన్ని, ఓర్పు, సహనాలను కీర్తించారు. సింగర్ సిధ్ శ్రీరామ్ గాత్రంతో ఈ సాంగ్ మరింత మధురంగా మారింది. ఈ పాటకు థమన్ సంగీతమందించగా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించాడు. పవన్కు ఇది 26వ సినిమా కాగా చాలా విరామం తర్వాత చేస్తున్న చిత్రం కావడంతో వకీల్సాబ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా మే 15న విడుదల కానుంది. (కిర్రాక్గా పవన్ 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్) -
మార్చి8న ‘వకీల్ సాబ్’ సర్ప్రైజ్!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘వకీల్ సాబ్’ చిత్ర యూనిట్ స్త్రీమూర్తులకు ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనుంది. మహిళల గొప్పదనాన్ని తెలియజెప్పే.. ‘మగువా మగువా’ పాటను మార్చి 8 న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం శుక్రవారం తెలిపింది. ఈమేరకు ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా’ చరణాలతో సాగే పాట ప్రోమోను విడుదల చేసింది. కాగా, ఈ సినిమా బాలీవుడ్ హిట్ చిత్రం 'పింక్' చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. (కిర్రాక్గా పవన్ 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్) ఇక చాలా కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’గా వస్తుండటంతో అంచానాలు భారీగా నెలకొన్నాయి. గత సోమవారం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. పవన్కు ఇది 26వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వకీల్ సాబ్ను నిర్మిస్తున్నాడు. రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. సంగీతం తమన్ అందిస్తున్నాడు. (వకీల్ సాబ్ ఫస్ట్ లుక్పై స్పందించిన వర్మ) -
వకీల్ సాబ్ ఫస్ట్ లుక్పై వర్మ ట్వీట్
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'పై ట్విటర్ ద్వారా స్పందించారు. పవర్ స్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్పై స్పందిస్తూ.. 'నేను కొంత మంది ఇడియట్స్ గురించి ఆలోచించను. ఇలాంటి ఇడియట్ పనులను చేయను' అంటూ వకీల్ సాబ్ పోస్టర్ను జతచేస్తూ వర్మ కామెంట్స్ చేశారు. అయితే.. ఆ పోస్టర్లో పవన్ కూర్చున్న స్టైల్లోనే కూర్చున్న వర్మ 'డైరెక్టర్ సాబ్' అంటూ టైటిల్ ఇవ్వడం గమనార్హం. కాగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ సోమవారం సాయంత్రం విడుదలైన విషయం తెలిసిందే. చదవండి: కిర్రాక్గా పవన్ 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ -
కిర్రాక్గా పవన్ 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్
పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'వకీల్ సాబ్' చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. చాలా కాలం తర్వాత బాలీవుడ్ చిత్రం 'పింక్' రీమేక్తో పవర్ స్టార్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండడంతో అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం టైటిల్ను వకీల్ సాబ్గా ఖరారు చేయగా.. ఫస్ట్ లుక్ను తాజాగా రిలీజ్ చేశారు. టైటిల్ని ధృవీకరిస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చిత్రయూనిట్ ఓ పోస్ట్ చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. చదవండి: హీరోయిన్ను ముంబై రమ్మన్న అజ్ఞాత వ్యక్తి! 'ఆటో ట్రాలీలో ఓ పుస్తకం చదువుతూ.. కుర్చీలో కూర్చోని ఉండటం' ఫస్ట్ లుక్లో కనబడుతోంది. కాగా.. ఇది పవన్ కల్యాణ్ నటించిన 26వ చిత్రం. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సొంత నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. చదవండి: రాహుల్ పెద్ద హీరో కావాలి : గోపిచంద్ Sri Venkateswara Creations in association with Bay View Projects produly presents Power Star @PawanKalyan as #VakeelSaab.#VakeelSaabFirstLook#PSPK26FirstLook #PSPK26FirstLookFestival@SVC_official #SriramVenu @MusicThaman#PSPK26 @BayViewProjOffl @BoneyKapoor pic.twitter.com/ibBx8DgYAe — Sri Venkateswara Creations (@SVC_official) March 2, 2020