varla ramaiah
-
‘జగనన్నకు చెబుదాం’పై టీడీపీ నీచ రాజకీయం.. వర్ల రామయ్య పైత్యం
సాక్షి, అమరావతి: ప్రజల సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రభుత్వం ప్రారంభించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంపై టీడీపీ నీచ రాజకీయాలకు తెరతీసింది. మీడియా సాక్షిగా జగనన్నకు చెబుదాం గ్రీవెన్స్ సెల్కు టీడీపీ నేత వర్ల రామయ్య, కార్యకర్తలు మూకుమ్మడిగా ఫోన్లు చేశారు. వెటకారంగా మాట్లాడుతూ ఉద్యోగులను వేధింపులకు గురిచేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నుంచే వర్ల రామయ్య.. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తనతోపాటు మరో 20 మంది పార్టీ నేతలు, కార్యకర్తలను మీడియా సమావేశంలో కూర్చోబెట్టి వారితో 1902 హెల్ప్లైన్కి ఒకేసారి ఫోన్లు చేయించారు. తాను కూడా తన ఫోన్ నంబరు, ల్యాండ్లైన్ నంబర్ల నుంచి ఫోన్ చేశారు. హెల్ప్లైన్లో మాట్లాడుతున్న ఉద్యోగులతో అసభ్యంగా మాట్లాడుతూ, వెటకారం చేస్తూ వర్ల రెచ్చిపోయారు. ‘నీ పేరేంటి.. నీ ఫోన్ నంబర్ చెప్పు.. నీ దుంప తెగ.. నువ్వు చాలా తెలివైనవాడివయ్యా.. నా సమస్యను జగనన్నకు చెప్పే అవకాశం లేదా? అన్ని సమస్యల్ని వెంటనే పరిష్కరించేస్తామన్నారుగా..’ అంటూ ఉద్యోగిని వేధించారు. ‘సీఎం జగన్ అవినీతి చేస్తున్నారు.. ఫిర్యాదు రాసుకో అంటూ’ ఉద్యోగిని చాలాసేపు ఇబ్బంది పెట్టారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమమైన ‘జగనన్నకు చెబుదాం’ను అడ్డుకోవడం, దానిపై బురద జల్లడమే లక్ష్యంగా వర్ల రామయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీడీపీ తన నీచ రాజకీయాల కోసం ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడం అన్యాయమని మండిపడుతున్నారు. ప్రజల నిజమైన ఫిర్యాదుల పరిష్కారానికి అవకాశం ఇవ్వకుండా రాజకీయ డ్రామాలాడడం టీడీపీ నైజానికి నిదర్శనమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు, టీడీపీ నేతలు ఎంతకైనా దిగజారతారనే దానికి ఇది నిదర్శనమని అంటున్నారు. ప్రభుత్వంతో తమ సమస్యలు చెప్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను టీడీపీ నేతలు అడ్డుకోవడంపై సొంత పార్టీ నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులను వేధించడానికి, వారి విధులకు ఆటంకం కలిగించడానికి చేసిన ప్రయత్నంగానూ ఇది కనిపిస్తోందని ధ్వజమెత్తుతున్నారు. -
తప్పు చేయకపోతే భయం ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: ఎలాంటి తప్పూ చేయకుండా పారదర్శకంగా ఉన్నప్పుడు సిట్ దర్యాప్తునకు ఎందుకు భయపడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అవినీతి దురుద్దేశం ఉన్నప్పుడు ఎందుకు విచారించకూడదని ప్రశ్నించింది. ఒక ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని భావించిన తర్వాతి ప్రభుత్వం, వాటిని సమీక్షించకూడదంటే తప్పు జరిగినట్లు వందశాతం అంగీకరించినట్టే (ఇమ్యూనిటీ ఇచ్చినట్లే) కదా అని వ్యాఖ్యానించింది. ఇలా సమీక్షించడం ప్రజా ప్రయోజనానికి వ్యతిరేకమా అని ప్రశ్నించింది. రాజకీయ వైరుధ్యం ఉంటే విచారణ చేయకూడదా అని నిలదీసింది. పాలనలో దురుద్దేశం ఉన్నప్పుడు విచారణ జరగాలి కదా , శాశ్వతంగా తప్పించుకోలేరు కదా అని వ్యాఖ్యానించింది. సీబీఐ విచారణకు స్వీకరించలేదన్న కారణంతో తప్పు ఏమీ జరగనట్లేనని ఎలా భావించాలని ప్రశ్నించింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న విధాన నిర్ణయాలు, అమరావతి భూసేకరణ, ఫైబర్నెట్ తదితర అంశాలపై ఏర్పాటైన సిట్ దర్యాప్తును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేశ్లతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు పూర్తవడంతో ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. గురువారం వర్ల రామయ్య తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్ధ దవే వాదనలు వినిపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ బృందంలో అందరూ వారి పార్టీ వారేనని ఆరోపించారు. న్యాయమూర్తి జస్టిస్ షా స్పందిస్తూ.. గత ప్రభుత్వం చేసిన పనులపై తర్వాతి ప్రభుత్వం సమీక్షించకూడదా అని ప్రశ్నించారు. పాలన వ్యవహారాలైతే తప్పకుండా పరిశీలించొచ్చని దవే అన్నారు. దురుద్దేశపూర్వకమైన పాలనా వ్యవహారమైతే విచారణ చేపట్టొచ్చుకదా అని జస్టిస్ షా మరోసారి ప్రశ్నించగా.. రాజకీయపరమైన ఉద్దేశాలైతే విచారణలను నియంత్రించాలని దవే అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడని వారు అధికారంలోకి రాగానే విచారణకు ఆదేశించడంలో ఉద్దేశం తెలుసుకోవాలన్నారు. నిజ నిర్ధారణ బృందం నివేదిక పరిశీలించిన సభాపతి దర్యాప్తు చేయమని ఆదేశించారని అన్నారు. నిజ నిర్ధారణ బృందంలో రాజకీయ నేతల గురించి తాను మాట్లాడుతున్నానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ, విచారణకు సీబీఐ చేతులు ఎత్తేసిందన్నారు. సీబీఐ నిరాకరించినంత మాత్రాన దురుద్దేశపూర్వక వ్యవహారాలు జరగలేదని ఎలా భావించాలని, ఈ విధంగా ఎలా ఊహించుకుంటారని జస్టిస్ షా ప్రశ్నించారు. ప్రభుత్వం మారిన తర్వాత దురుద్దేశ చర్యలపై వీకే ఖన్నా తీర్పును దవే ప్రస్తావించారు. పక్షపాతం ఉంటే న్యాయపరమైన చర్యలకు వెళ్లొచ్చని ఆ తీర్పులో ఉందని జస్టిస్ సుందరేశ్ చెప్పారు. ఈ కేసు విషయాన్ని సీరియస్గానే తీసుకుంటున్నామని, కేవలం రాజకీయ కక్షలు మాత్రమే నిజాలను వెలికితీస్తాయని భజన్లాల్ తీర్పు చెబుతోందని జస్టిస్ షా గుర్తుచేశారు. మీరు పారదర్శకంగా ఉంటే ఆందోళన ఎందుకని దవేనుద్దేశించి అన్నారు. ఈ వ్యవహారంలో అధికారులేమైనా ప్రకటన చేస్తే సీఆర్పీసీ వర్తించడంతోపాటు అరెస్టులు ఉంటాయని దవే తెలిపారు. గోద్రా ఘటన ఎఫ్ఐఆర్ల గురించి దవే ప్రస్తావిస్తుండగా అవి అవసరం లేదని జస్టిస్ ఎంఆర్ షా చెప్పారు. దవే వాదనలు కొనసాగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ జీవో ఏకపక్షంగా, పక్షపాతంగా ఉందన్నారు. సిట్ కూడా చీకట్లో దేని కోసమో వెతుకుతున్నట్లు ఉందన్నారు. దీనికి జస్టిస్ షా స్పందిస్తూ.. ప్రతి ఒక్కరూ చీకట్లోనే వెదుకుతారని, విచారణ జరిగితే అన్నీ వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించారు. వాదనలకు సంబంధించి క్లుప్తంగా కోర్టుకు అందజేయాలని ఇరుపక్షాలకు ధర్మాసనం సూచించింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి కొన్ని అంశాలు ప్రస్తావించాలని పేర్కొనగా ఒక్కో పక్షం నుంచి ఒకరికే అవకాశం ఇస్తామని, ఇది అందరికీ వర్తిస్తుందని జస్టిస్ ఎంఆర్ షా వ్యాఖ్యానించారు. సిట్టింగ్ జడ్జిపై సీజేఐకి సీఎం లేఖపై విచారణ వాయిదా సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2020 అక్టోబరు 6న సీజేఐకి రాసిన లేఖలో చేసిన వ్యాఖ్యలపై దాఖలైన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు గురువారం విచారించింది. న్యాయవాదికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో పిటిషనర్ సునీల్ కుమార్ సింగ్ కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలేమిటని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేశ్లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించగా.. సీజేఐకి ముఖ్యమంత్రి రాసిన లేఖను మీడియా ముందు బహిర్గతం చేశారని, ఈ పద్ధతిని అనుమతించకూడదని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేయకుండా హైకోర్టు స్టే విధిస్తూ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ నుంచి ఈ పిటిషన్ను వేరు చేస్తున్నట్లు జస్టిస్ ఎంఆర్ షా తెలిపారు. ఈ పిటిషన్పై తదుపరి విచారణను ధర్మాసనం డిసెంబరు 12కు వాయిదా వేసింది. ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. -
ఏపీ ప్రభుత్వ పిటిషన్పై విచారణ పూర్తి.. తీర్పు రిజర్వ్
సాక్షి, ఢిల్లీ: అమరావతి భూ కుంభకోణం, ఫైబర్నెట్ కుంభకోణాలపై సిట్ విచారణను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ గురువారంతో పూర్తైంది. ఇరుపక్షాల వాదనలు ముగియగా.. తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీం ధర్మాసనం. అంతకు ముందు విచారణ సమయంలో జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్లతో కూడిన ధర్మాసనం టీడీపీ నేత వర్ల రామయ్య తరపు న్యాయవాదిపై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరిపే అధికారం లేదంటే ఎలా? అలాంటి వారికి వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్లు కాదా? ఇది ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకం కాదా?.. దురుద్దేశం లేదని చెప్పేందుకే సీబీఐకి ఇస్తామని చెప్పారు కదా? దురుద్దేశం గనుక ఉంటే ఇవన్నీ దర్యాప్తులో తెలుస్తాయి కదా! అని ప్రశ్నించింది. రాజకీయ వైరుధ్యం వల్ల ఎంక్వేరీ చేయవద్దా?. గత ప్రభుత్వాలు చేసిన నిర్ణయాలపై సమీక్ష జరిపే అధికారమే లేదంటే ఎలా?. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కీలక విధానాలు, ప్రాజెక్టులలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం ఏర్పాటుచేసిన సిట్ పై స్టే ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి వాదనలు వినిపిస్తూ కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు ఒక పోలీసు స్టేషన్లో సిట్ను ఏర్పాటు చేసినట్లు సుప్రీంకు నివేదించారు. నిజ నిర్ధారణ పూర్తి చేశామని, పక్షపాతం ఉండకూడదనే సీబీఐ దర్యాప్తు కోరుతున్నామన్నారు. కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయని, ప్రభుత్వం నేరుగా నమోదు చేయలేదని తెలిపారు. విధాన నిర్ణయాలు, టెండర్, కాంట్రాక్టులకు సంబంధించిన కేసుల్లో సారూప్యం చూడాలని కోరారు. అమరావతి భూ కుంభకోణం, ఫైబర్నెట్ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ విచారణ కాకుండా నిజ నిర్ధారణ మాత్రమే చేసిందన్నారు. ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించవచ్చని, నిజ నిర్ధారణపై నిషేధం ఉండదని స్పష్టం చేస్తూ ఈ మేరకు తీర్పులను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇక వర్లరామయ్య తరపు న్యాయవాది దవే వాదనలు వినిపిస్తూ.. పక్షపాతంతో ఈ అంశంపై జివో ఇచ్చారని, అధికార పార్టీతో నిజనిర్దారణ ఏర్పాటుచేశారని వాదించారు. ఈ క్రమంలో ధర్మాసనం కలుగజేసుకుని.. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజాధనం దుర్వినియోగం, వృథా ఉంటే దర్యాప్తు చేయకూడదా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. ఏవైనా లావాదేవీలు దురుద్దేశపూరితంగా జరిగాయని భావిస్తే అది విచారించదగినదే కదా? అని ప్రశ్నించింది. ఇదీ చదవండి: అమరావతి రైతులకు హైకోర్టులో ఎదురు దెబ్బ -
అవినీతి దురుద్దేశాలపై దర్యాప్తు చేయొద్దా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘అవినీతి చేయాలనే దురుద్దేశాలపై దర్యాప్తు చేయకూడదా? ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజాధనం వృథా, దుర్వినియోగం లాంటివి ఉంటే దర్యాప్తు వద్దా..?’’ అని టీడీపీ నేత వర్ల రామయ్య తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. అమరావతి భూ కుంభకోణం, ఫైబర్నెట్ కుంభకోణాలపై విచారణను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి వాదనలు వినిపిస్తూ కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు ఒక పోలీసు స్టేషన్లో సిట్ను ఏర్పాటు చేసినట్లు నివేదించారు. నిజ నిర్ధారణ పూర్తి చేశామని, పక్షపాతం ఉండకూడదనే సీబీఐ దర్యాప్తు కోరుతున్నామన్నారు. కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయని, ప్రభుత్వం నేరుగా నమోదు చేయలేదని తెలిపారు. విధాన నిర్ణయాలు, టెండర్, కాంట్రాక్టులకు సంబంధించిన కేసుల్లో సారూప్యం చూడాలని కోరారు. కోర్టు సమీక్ష అధికారాలను ప్రభుత్వాల సమీక్ష అధికారాలతో పోల్చలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎం. ఆర్. షా గతంలో ఇచ్చిన ఓ తీర్పులో కొంత భాగాన్ని సింఘ్వి చదివి వినిపించారు. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించవచ్చు.. రాజకీయ శత్రుత్వంతో కమిషన్ల నియామకంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు పలు తీర్పులు ఇచ్చాయని సింఘ్వి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అమరావతి భూ కుంభకోణం, ఫైబర్నెట్ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ విచారణ కాకుండా నిజ నిర్ధారణ మాత్రమే చేసిందన్నారు. ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించవచ్చని, నిజ నిర్ధారణపై నిషేధం ఉండదని స్పష్టం చేస్తూ ఈ మేరకు తీర్పులను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. జగన్నాధరావు కేసులో రాజ్యాంగ ధర్మాసనం తీర్పులో కొంత భాగాన్ని చదివి వినిపించారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని స్టే ఇస్తే ఇక విచారణ అధికారం రాష్ట్రానికి ఎక్కడుంటుందని, ఇలా చేయడం దర్యాప్తును ప్రాథమిక దశలోనే అడ్డుకోవడమేనన్నారు. ఎఫ్ఐఆర్పై విచారణ చేయవద్దని అనడం అవగాహన లేకపోవడమేనని, ఇది జాతీయ దర్యాప్తు సంస్థ విచారించదగిన కేసు అని పేర్కొంటూ సింఘ్వి వాదనలు ముగించారు. సీబీఐ విచారించాలా వద్దా? అనే అంశంపై చర్చిద్దామని ధర్మాసనం పేర్కొంది. క్రిమినల్ కేసుల కోసమే.. టీడీపీ నేత వర్ల రామయ్య తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్ధ దవే వాదనలు వినిపిస్తూ ఇది పాలనా ప్రతీకార కేసుగా అభివర్ణించారు. సిట్ ఉద్దేశం నిజ నిర్ధారణ మాత్రమే కాదని, క్రిమినల్ కేసులతో అనుసంధానానికి మార్గాలను అన్వేషించేందుకేనని ఆరోపించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజాధనం దుర్వినియోగం, వృథా ఉంటే దర్యాప్తు చేయకూడదా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. ఏవైనా లావాదేవీలు దురుద్దేశపూరితంగా జరిగాయని భావిస్తే అది విచారించదగినదే కదా? అని ప్రశ్నించింది. ఎక్కడ దుర్వినియోగం జరిగిందో చెప్పకుండా నోటిఫికేషన్ ఇచ్చి సిట్ ఏర్పాటు చేశారని దవే పేర్కొన్నారు. కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించడం ఏకపక్షంగా ఉందన్నారు. ఎలాంటి దర్యాప్తు నివేదిక రాకుండా అలా ఎలా అంటారని ధర్మాసనం ప్రశ్నించింది. ఎంపీలు విజయసాయిరెడ్డి, ప్రభాకర్రెడ్డి, మిథున్రెడ్డి కూడా కేబినెట్ సబ్కమిటీల సమావేశానికి హాజరయ్యేవారని దవే పేర్కొన్నారు. కొందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్న ఉద్దేశంతోనే సిట్ ఏర్పాటైందన్నారు. పాలనా చర్యలంటూ క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అనంతరం విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. -
ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ చేస్తే తప్పేంటి?: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: గత ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ చేస్తే తప్పేంటి? అని సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశ్నించారు. సిట్ నివేదిక వచ్చే వరకు ఆగలేరా? అంటూ టీడీపీ నేత వర్ల రామయ్య తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు న్యాయవాది జస్టిస్ ఎంఆర్ షా ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో కీలక విధాన నిర్ణయాలు, భారీ ప్రాజెక్టులలో జరిగిన అవకతవకలపై ఏపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. అయితే సిట్ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించడాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. ఈకేసును సీబీఐకి అప్పగించాలని మేం కోరాం. దర్యాప్తు చేయొద్దని హైకోర్టు బ్లాంకెట్ ఆర్డర్ ఎలా ఇస్తుంది అని ప్రశ్నించారు. తదుపరి విచారణను రేపటి(గురువారం)కి వాయిదా వేశారు. చదవండి: (CM KCR: కేంద్రం టార్గెట్గా సీఎం కేసీఆర్ కొత్త వ్యూహం!) -
అర్హత ఉంటే నారా దేవాన్ష్కు కూడా అమ్మఒడి ఇస్తాం: వెల్లంపల్లి
-
‘గడప గడపకు’ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన.. టీడీపీ నేత వర్ల రామయ్య ఇంటికెళ్లిన వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టిన ‘గడప గడపకి మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విద్యాధరపురంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. గడప గడపకి కార్యక్రమంలో భాగంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇంటికి వెళ్లారు. ఆయన భార్య జయప్రదకు రైతు భరోసా కింద 13,500 రూపాయలు అందినట్లుగా ధ్రువీకరణ ప్రతాన్ని అందజేశారు. చదవండి: ‘సైకిల్’ కకావికలం.. కుప్పంలో పడిపోయిన టీడీపీ గ్రాఫ్ ఇంటిలోనే ఉన్నప్పటికీ వర్ల రామయ్య, ఆయన భార్య జయప్రద బయటకురాలేదు. ధ్రువీకరణ పత్రం తీసుకోవడానికి డ్రైవర్ను పంపించారు. రైతు భరోసా అందినట్లుగా డ్రైవర్ ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ నేత వర్ల రామయ్య ఇంట్లో కూడా రైతు భరోసా ఇచ్చామని తెలిపారు. టీడీపీ నేత కూడా ప్రభుత్వ పథకం అందుకున్నారన్నారు. అర్హత ఉంటే నారా దేవాన్ష్కు కూడా అమ్మ ఒడి ఇస్తామని వెల్లంపల్లి అన్నారు. -
సిగ్గుమాలిన మనిషి.. ఈ వీడియో చూసి బాబు,వర్ల సిగ్గు తెచ్చుకోవాలి
-
టీడీపీ నేత ‘వర్ల’ తనయుడిపై కేసు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): టీడీపీ నేత వర్ల రామయ్య తనయుడు, కృష్ణాజిల్లా పామర్రు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వర్ల కుమార్రాజా (రాజా)పై కేసు నమోదైంది. డివిజన్ అభివృద్ధి పనుల కోసం నిర్మించిన శిలాఫలకం దిమ్మె కూల్చివేయడం, పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను చంపేస్తానని బెదిరించిన ఘటనపై విజయవాడలోని భవానీపురం పోలీసులు కుమార్రాజాపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ విద్యాధరపురం 44వ డివిజన్ చిన్న సాయిబాబా గుడి ఎదురుగా అంబేడ్కర్ నగర్లో మంచినీటి పైపులైన్ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరయ్యాయి. ఈ పనుల శంకుస్థాపన కోసం అంబేడ్కర్ నగర్ ఆర్చి వద్ద శిలాఫలకం ఏర్పాటుచేసేందుకు కాంట్రాక్టర్ శేఖర్ దిమ్మె నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇంత లో వర్ల కుమార్రాజా అక్కడకు వచ్చి శిలాఫలకం నిర్మాణం చేయొద్దంటూ అడ్డుకున్నారు. ఆర్చికి అడ్డువస్తుందంటూ వాగ్వాదానికి దిగి చంపేస్తానంటూ కాంట్రాక్టర్ను బెదిరించారు. అంతటితో ఆగక దిమ్మెను కూల్చివేశారు. ఈ విషయాన్ని కాంట్రాక్టర్ శేఖర్ ఇంజినీరింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మున్సిపల్ ఏఈ ఇస్సార్ అహ్మద్ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో కుమార్రాజాపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డివిజన్ అభివృద్ధి పనులు చేపడుతుంటే జీర్ణించుకోలేక ఇలా ధ్వంస రచన చేయడంపై కాలనీ వాసులు మండిపడుతున్నారు. పేదలకు తాగునీరు అందడం వర్ల రామయ్య, ఆయన తనయుడుకు ఇష్టంలేదా అని ప్రశ్నిస్తున్నారు. -
టీడీపీ నేత వర్ల రామయ్యకు ఐపీఎస్ అధికారుల సంఘం హెచ్చరిక
సాక్షి, అమరావతి: టీడీపీ నేత వర్ల రామయ్య, ఆ పార్టీ నేతలు తమ ఉనికిని చాటుకునేందుకు డీజీపీతోపాటు ఇతర పోలీసు అధికారులను ఏకవచనంతో సంబోధిస్తూ పరుష పదజాలంతో దూషించడాన్ని ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఐపీఎస్ అధికారుల సంఘం జాయింట్ సెక్రటరీ రాజీవ్కుమార్ మీనా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చదవండి: గుడివాడలో టీడీపీకి భంగపాటు వర్ల రామయ్య తరచు ఉద్దేశపూర్వకంగా సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో పోరాడాలి తప్ప అధికారులను తరచుగా వివాదాల్లోకి లాగి వ్యక్తిగతంగా దూషించడం సబబు కాదన్నారు. ప్రతి స్థానిక సమస్యను డీజీపీకి ఆపాదించడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం మానుకోవాలని హితవు పలికారు. మాట్లాడేటప్పుడు పదప్రయోగం అత్యంత ముఖ్యమన్నారు. ఇదే రకమైన వ్యవహారశైలి కొనసాగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బాబు, లోకేష్లకే కాసినో గురించి బాగా తెలుసు
సాక్షి, అమరావతి: కాసినోలు, అశ్లీల నృత్యాల గురించి చంద్రబాబు, లోకేష్లకు బాగా తెలుసని రాష్ట్ర మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గతంలో లోకేష్ స్విమ్మింగ్ పూల్లో మహిళలతో అర్ధ నగ్నంగా, చేతిలో మద్యం గ్లాసు పెట్టుకుని చేసిన వేషాలను అందరూ చూశారన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తన కల్యాణ మండపంలో కాసినో, జూదం నిర్వహించినట్టు రుజువు చేస్తే రాజీనామాతో పాటు ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే చంద్రబాబు, లోకేష్, ఆయన కుల మీడియా ఏం చేస్తారో చెప్పే దమ్ముందా అని నిలదీశారు. ప్రశాంతంగా ఉండే గుడివాడలో చంద్రబాబు చిచ్చు రాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసింది, చేస్తోంది కూడా చంద్రబాబే అని మండిపడ్డారు. ఇప్పటికీ మహిళలను అడ్డు పెట్టుకుని బతుకుతున్న చరిత్ర చంద్రబాబుదేనన్నారు. గతంలో లక్ష్మీపార్వతిని సాకుగా చూపించి ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని లాక్కున్నారన్నారు. మరో మహిళను అడ్డుపెట్టుకుని బ్రోకర్ పని చేసి సైకిల్ గుర్తు తెచ్చుకున్నారని చెప్పారు. చివరికి కట్టుకున్న భార్యను కూడా రాజకీయాల కోసం రోడ్డుపైకి తెచ్చారన్నారు. రాజకీయాలకు చంద్రబాబు అనర్హుడని వ్యాఖ్యానించారు. రెండు వారాలుగా గుడివాడలో లేను తాను గత రెండు వారాలుగా గుడివాడలో లేనని, కోవిడ్తో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందిæ కేబినెట్ మీటింగ్ కోసం వచ్చినట్టు తెలిపారు. అటువంటిది చంద్రబాబు పెట్టే పెడిగ్రీ తింటూ.. ఆయన ఏం చెబితే.. అది చూపించే డబ్బా మీడియా, మొరిగే తొత్తులు గుడివాడలోని తన కల్యాణ మండపంలో ఏదో జరిగిపోతోందని, ఎక్కడో తీసుకొచ్చిన వీడియోలు చూపించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. న్యూట్రల్ మీడియా గుడివాడ వెళ్లి వాస్తవాలేమిటో తెలుసుకుని ప్రజలకు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా చంద్రబాబు ఎప్పుడో సమాధి అయ్యారని, ఇంకా సిగ్గూ, శరం లేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజ నిర్ధారణ కమిటీ పేరుతో ఎప్పుడూ ఎన్నికల్లో గెలవని వర్ల రామయ్య, విజయవాడలో ఆస్తులు ఆక్రమించి, మహిళల్ని వేధించిన బోండా ఉమ గుడివాడ వెళ్తారా అని ప్రశ్నించారు. సంక్రాంతికి సంప్రదాయంగా జరిగే కోడి పందేలే గుడివాడలో కూడా జరిగాయన్నారు. ఎక్కడో డ్యాన్సులు జరుగుతున్నాయని మీడియాలో వార్తలు వస్తే.. తానే స్వయంగా డీఎస్పీకి ఫోన్ చేసి ఆపించానని చెప్పారు. చంద్రబాబు కాదు కదా.. ఎవరొచ్చినా గుడివాడలో ప్రజల అండ ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. -
Kuppam: టీడీపీ నేతలపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నిరసన
కుప్పం(చిత్తూరు జిల్లా): ‘మీ రాజకీయాల్లోకి మా అభిమాన నేతను లాగి నానా యాగీ చేయడం బాగోలేదు. ఎన్టీఆర్ మాటల్లో పస లేదు.. దమ్ము లేదు.. కోపం లేదంటూ మీ ఇష్టాను సారం నోరు పారేసుకుంటారా.. ఇలా మీ అంతకు మీరే మాట్లాడుతున్నారా.. లేక ఇలా మాట్లాడాలని మీకు ఎవరైనా చెప్పారా.. ఇంకో సారిలా పిచ్చి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. బాబులకే బాబు మా తారక్ బాబు’ అని టీడీపీ నేతలపై సీనీ నటుడు ఎన్టీఆర్ అభిమానులు చిత్తూరు జిల్లా కుప్పంలో నిప్పులు చెరిగారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై వారు ఆదివారం నిరసన తెలిపారు. చదవండి: నేను ఏడ్చినా మీకు పట్టదా?.. చిత్తూరు జిల్లా నేతలకు బాబు క్లాస్ చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఉద్దేశిస్తూ దుర్భాషలాడారంటూ.. బాబు, టీడీపీ నేతలు నానాయాగి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యల్లో పసలేదంటూ టీడీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా వర్ల రామయ్య, బుద్దా వెంకన్న లాంటివారు జూనియర్ ఎన్టీఆర్పై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో జూనియర్ అభిమానులు కుప్పం ఆర్టీసీ బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఎస్ఆర్ఎం సినిమా థియేటర్ వరకు నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. పోలీసులు అనుమతి ఇవ్వక పోవడంతో ఎస్ఆర్ఎం థియేటర్ ఎదుట జూనియర్కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత శివకుమార్ మాట్లాడుతూ తమ అభిమాన నటుడిపై కుట్ర పూరితంగా చేస్తున్న విమర్శలను సహించేది లేదని హెచ్చరించారు. -
పరిషత్ ఎన్నికలపై తీర్పు వాయిదా
సాక్షి అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నియమావళి అమలు చేయకపోవడం సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధమంటూ టీడీపీ నేత వర్ల రామయ్య పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి చేపట్టవద్దని ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. ఈ వ్యాజ్యాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని సింగిల్ జడ్జికి ధర్మాసనం సూచించింది. మరోవైపు ఎన్నికలను మొదటి నుంచి నిర్వహించాలని కోరుతూ జనసేన నేత శ్రీనివాసరావు, బీజేపీ నేతలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సత్యనారాయణమూర్తి మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ, వి.వేణుగోపాలరావు, ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి తదితరులు వాదనలు వినిపించారు. ఎన్నికల నిర్వహణకు రూ.150 కోట్ల వ్యయం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నియమావళిని అమలు చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉందని వేదుల నివేదించారు. ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నారన్నారు. అయితే వర్ల రామయ్య ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అర్హత ఆయనకు లేదని సీవీ మోహన్రెడ్డి తెలిపారు. ఈ వ్యాజ్యం వెనుక వ్యక్తిగత ప్రయోజనాలు లేవని వర్ల చెబుతున్నందున ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం అవుతుందని, దీనిపై ధర్మాసనమే విచారణ జరపాల్సి ఉంటుందన్నారు. నాలుగు వారాల గడువు గరిష్ట పరిమితి మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల నిర్వహణకు రూ.150 కోట్ల వరకు ఖర్చు అయిందని, ఎన్నికలను రద్దు చేస్తే మళ్లీ అంత పెద్ద మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఇది ఖజానాపై భారం మోపడమే అవుతుందని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ఎన్నికలు పూర్తి అయ్యాయని, ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారని వివరించారు. ఫలితాల వెల్లడికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. జనసేన తరపు న్యాయవాది వేణుగోపాల్ రావు వాదనలు వినిపిస్తూ ఎన్నికలలో బలవంతపు ఉపసంహరణలు జరిగాయన్నారు. పలు చోట్ల హింసాత్మక ఘటనల గురించి అప్పటి ఎన్నికల కమిషనర్ కేంద్రం దృష్టికి తెచ్చారని తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
పోలీసులకు రాజకీయ రంగు పులమడం సరికాదు
గుంటూరు: టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పోలీసులపై పలు రకాలుగా ఆరోపణలు చేస్తూ రాజకీయ రంగు పులమడం సరికాదని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ విశాల్గున్నీ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 1వ తేదీన గుంటూరు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాలెంకు చెందిన బాణావత్ యలమంద నాయక్ను ఆయన అందుబాటులో లేకపోతే ఆయన కుమారుడు ప్రసన్నకుమార్కు సీఆర్పీసీ నోటీసును అందజేసిన తర్వాతనే రెవెన్యూ అధికారి సమక్షంలో పోలీసులు అరెస్టు చేశారన్నారు. లిక్కర్ కేసులో నాయక్ ప్రమేయం ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేలిన అనంతరం చర్యలు చేపట్టామన్నారు. కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టి, దుర్భాషలాడామని చెప్పడం సరికాదన్నారు. రిమాండ్ కోసం వైద్యుల వద్ద పరీక్షలు జరిపామని, అనంతరం న్యాయమూర్తి వద్ద హాజరుపరిచినప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే అక్కడే చెప్పాల్సి ఉందన్నారు. రిమాండ్ అనంతరం యలమంద నాయక్ తనను కిడ్నాప్ చేసి దుర్భాషలాడి కొట్టారని చెప్పడం ఎంతవరకు వాస్తవమో గుర్తించాలని అన్నారు. గురజాల డీఎస్పీ, సీఐలు ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసుల్లో దర్యాప్తు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని గుర్తించి వారికి చార్జి మెమోలు జారీ చేశామని, ఆపై డీజీపీ గౌతమ్ సవాంగ్కు నివేదిక పంపానని, దీని ఆధారంగా ఆ ఇద్దరినీ సస్పెండ్ చేశారన్నారు. -
వర్లకే అలా..ఇక మనకెలా!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పార్టీకి విధేయుడు, సీనియర్ నాయకుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యకే ఇలా జరిగితే పార్టీలోని ఇతరుల పరిస్థితిపై టీడీపీలోని ఎస్సీ వర్గాల నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. 2016లోనూ మాజీ మంత్రి, సీనియర్ నాయకుడైన జేఆర్ పుష్పరాజ్ను రాజ్యసభకు పంపుతున్నట్లు చివరి నిమిషం వరకు చెప్పి మోసం చేయడాన్ని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు నాయకులు గుర్తుచేస్తున్నారు. దళిత నాయకులు, కార్యకర్తలు జెండాలు మోయడానికి, పార్టీ ఎస్సీ, ఎస్టీ సెల్ పదవులు కట్టబెట్టడానికి తప్ప అధికార పదవుల విషయంలో ఎన్నడైనా ప్రాధాన్యమిచ్చారా అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా పేద వర్గాలతో ఆడుకోవడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య అని సీనియర్ నాయకులు గుర్తుచేస్తున్నారు. ►అధిష్టానం వర్ల రామయ్యకు మూడు పర్యాయాలు అగౌరపరిచింది. ఎన్నికల బరిలో తలపడిన ప్రతిసారీ చివరకు అనుయాయులు అయ్యో! రామయ్య!! అనే సానుభూతిని మిగిల్చింది. ►గుంటూరు జిల్లా గురజాల ప్రాంతానికి చెందిన వర్ల రామయ్య పోలీసు శాఖకు రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉద్యోగ రీత్యా కృష్ణా జిల్లాలో పనిచేసినందున విస్తృత పరిచయాలు ఉన్నాయని, రిజర్వుడు స్థానం నుంచి పోటీకి అవకాశం కలి్పంచాలని అధిష్టానాన్ని కోరినప్పుడు 2009 సాధారణ ఎన్నికల్లో తిరుపతి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు ఆఖరు నిమిషంలో ఆదేశించారు. తిరుపతిలో అన్నీ తానే చూసుకుంటానంటూ భరోసా ఇచ్చి సాగనంపారు. ఆ ఎన్నికల్లో వర్ల ఓటమి పాలయ్యారు. ►2014 ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్టు ఆశించిన రామయ్య తన సామాజిక వర్గం, విస్తృత పరిచయాలు ఉన్నందున నందిగామ, తిరువూరుల్లో ఏదో ఒక స్థానం కేటాయించాలని అధిష్టానాన్ని కోరారు. కాని పామర్రులో పోటీకి దింపారు. మచిలీపట్నం లోక్సభ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావుకు నియోజకవర్గ పరిధిలో సానుకూల ఓట్లు రాగా వర్ల ఓటమి పాలయ్యారు. ►2019లో ఏకంగా టిక్కెట్టుకే ఎగనామం పెట్టారు. వైఎస్సార్ సీపీ నుంచి కొనుగోలు చేసిన ఉప్పులేటి కల్పనకు పామర్రు టికెట్టు ఇచ్చిన సంగతి తెలిసిందే. ►పార్టీకి తగినంత బలం లేకున్నా రాజ్యసభ ఎన్నికల బరిలోకి వర్లను దింపి ముచ్చటగా మూడోసారి ఓటమిని మూటకట్టుకునేలా ఆయన పేరిట రికార్డు చేశారు. కాగా గత ప్రభుత్వ హయాంలో వర్ల రామయ్యకు ఆర్టీసీ చైర్మన్ పదవి మాత్రం దక్కింది. స్వామిదాసు కుటుంబానికీ మొండిచేయి.. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసుకు ఆ స్థానం నుంచి పోటీకి అవకాశం ఇవ్వలేదు. జెడ్పీ చైర్పర్సన్గా పనిచేసిన తన సతీమణి నల్లగట్ల సుధారాణికి అయినా టికెట్ ఇవ్వాలని స్వామిదాసు కోరారు. కానీ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కె.ఎస్.జవహర్ను తిరువూరు నుంచి పోటీ చేయించారు. ►గుంటూరు జిల్లాకు చెందిన జేఆర్ పుష్పరాజ్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకుడు. పొలిట్బ్యూరో సభ్యుడిగా, రెండు పర్యాయాలు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2016 రాజ్యసభ ఎన్నికల్లో చివరి నిమిషం వరకు ఆశపెట్టి టీజీ వెంకటేశ్కు ఆ సీటును కట్టబెట్టారు. భారీ మొత్తం తీసుకునే టీజీకి సీటిచ్చారనే విమర్శలు అప్పట్లో తీవ్రంగా వచ్చిన సంగతి తెలిసిందే. ►గుంటూరు జిల్లాకు చెందిన రావెల కిషోర్బాబును మంత్రి పదవి నుంచి మధ్యలో తొలగించారు. అవినీతి ఆరోపణలు వస్తున్నాయని సాకుగా చూపారు. పశి్చమగోదావరి జిల్లాకు చెందిన రిజర్వుడు వర్గానికి చెందిన పీతల సుజాతను కూడా మధ్యలోనే మంత్రి పదవి నుంచి పక్కనపెట్టేశారు. అదే మంత్రి వర్గంలోని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు పట్టించుకోలేదు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎన్ని అరాచకాలు చేసినా తన సామాజికవర్గం అయినందున చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. -
‘టీడీపీకి మిగిలింది ఆ ఒక్కటే’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయిన ఆరునెలలు ముందుగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘నేతన్న నేస్తం’ అందించిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మగ్గం ఉన్న ప్రతి నేతన్నకు రూ.24 వేలు ఇచ్చినందుకు ఆయన సీఎం వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టేశారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం చేనేతలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ధర్మవరంలో ఇచ్చిన మాటను సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారని, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తన పాలనతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని తెలిపారు. సీఎం నేతృత్వంలో కొత్త పథకాలు పరంపర కొనసాగుతుందని సుధాకర్ బాబు పేర్కొన్నారు. (శాసనసభ నిర్ణయమే అంతిమం: స్పీకర్) ‘‘రాజ్యసభ ఎన్నికలతో టీడీపీ పతనం అయ్యింది. రాజ్యసభలో వైఎస్సార్సీపీ బలం 6 కి పెరిగింది. టీడీపీకి ఒక్కటే మిగిలింది. దళితుడైన వర్ల రామయ్యను చంద్రబాబు బలి పశువు చేశారు. ఓడిపోయే సీటు వర్లకు ఇచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు దళితులకు రాజ్యసభ సీట్లు ఇవ్వలేదు. ఆయన సామాజిక వర్గం వారికే చంద్రబాబు రాజ్యసభ స్థానాలు కట్టబెట్టారు. ఆదిరెడ్డి భవాని ఓటు తప్పుగా వేసిందో, ఉద్దేశపూర్వకంగా వేసిందో తరువాత తెలుస్తుంది. దళితులైన మోత్కుపల్లి, పుష్పరాజ్, వర్లకు రాజ్యసభ సీటు ఇస్తామని చంద్రబాబు మోసం చేశారని’ సుధాకర్బాబు దుయ్యబట్టారు. గెలిసే సీటు ఆయన సామాజిక వర్గం వారికి, ఓడిపోయే సీటు దళితులకు ఇచ్చారని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. లోకేష్ ను ఎందుకు రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి నిలపలేదని ప్రశ్నించారు. చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి రాజకీయం చేస్తున్నారని సుధాకర్బాబు నిప్పులు చెరిగారు. ('కొడుకు విప్లవ యోధుడిలా కనిపించి ఉంటాడు') -
అందుకే వర్ల రామయ్యను బరిలోకి..
సాక్షి, అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ ఏమాత్రం గెలిచే అవకాశం లేదని తెలిసీ దళిత నేత వర్ల రామయ్యను పోటీకి దింపి అవమానాల పాలు చేశారనే ఆగ్రహం పార్టీలో వ్యక్తమవుతోంది. నాలుగు రాజ్యసభ స్థానాలూ సంఖ్యాబలం దృష్ట్యా వైఎస్సార్ సీపీకి దక్కడం ఖాయమని స్పష్టంగా తెలుస్తున్నా దళిత వర్గాన్ని మోసం చేసేందుకే చంద్రబాబు రామయ్యను బరిలో దింపినట్లు పేర్కొంటున్నారు. ఏకగ్రీవం కావాల్సిన స్థానాలకు అనివార్యంగా ఎన్నికలు వచ్చేలా చేసి చివరికి తమకున్న కొద్దిమంది ఎమ్మెల్యేలతోనూ పూర్తిస్థాయిలో ఓట్లు వేయించుకోలేక అభాసుపాలయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వర్ల రామయ్యకు 17 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే టీడీపీ ఓట్లు వర్లకు పూర్తి స్థాయిలో పడలేదని స్పష్టమవుతోంది. పోటీలో ఉన్నది దళిత నేత కావడం వల్లే నిర్లక్ష్యం చేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. చెల్లుబాటు కాని బ్యాలెట్ పేపర్పై.. గెలిచేటప్పుడు మీ సొంత కులం వారికి, ఓడేటప్పుడు దళిత నేతకు సీటిస్తారా? అని రాసి ఉండడం చర్చనీయాంశమైంది. టీడీపీలో దళితులకున్న గౌరవం ఏపాటిదో దీనిద్వారా స్పష్టమైందని విశ్లేషకులు చెబుతున్నారు. (నలుగురూ నెగ్గారు ) ► ఆరేళ్లలో మూడుసార్లు టీడీపీ నాయకుల్ని రాజ్యసభకు పంపే అవకాశం వచ్చినప్పుడు తన కోటరీలోని ముఖ్యులు, సొంత సామాజికవర్గానికి చెందిన వారికి చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చి సీట్లిచ్చారు. ఇప్పుడు ఓడిపోయే సీటును దళిత వర్గానికి కట్టబెట్టారు. ఆరేళ్లలో ఒక్క దళితుడు, ఒక్క బీసీ నాయకుడినైనా రాజ్యసభకు పంపకపోగా నమ్మించి మోసం చేశారని పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ► 2014లో టీడీపీ నుంచి ఇద్దరిని రాజ్యసభకు పంపే అవకాశం రాగా తన సొంత సామాజికవర్గానికి చెందిన గరికపాటి మోహనరావుకు ఒక సీటు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తోట సీతారామలక్ష్మికి మరో సీటు ఇచ్చారు. తెలంగాణకు చెందిన మోత్కుపల్లి నరసింహులు తనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరినా చంద్రబాబు పట్టించుకోలేదు. ► 2016లో టీడీపీ తరఫున ముగ్గురిని రాజ్యసభకు పంపినప్పుడు ఎన్డీఏ కోటాలో సురేష్ ప్రభుకి అవకాశం ఇచ్చారు. టీడీపీ నుంచి టీజీ వెంకటేష్కు రెండో సీటు కేటాయించారు. మూడో సీటును అప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తన సన్నిహితుడైన సుజనా చౌదరికి చంద్రబాబు కట్టబెట్టారు. టీడీపీకి చెందిన దళిత నేత జేఆర్ పుష్పరాజ్కు సీటిస్తానని ఇంటికి పిలిపించుకుని గంటల తరబడి కూర్చోబెట్టి అవమానించి పంపారు. ► 2018లో టీడీపీకి రెండు రాజ్యసభ స్థానాలు దక్కే పరిస్థితి ఉన్నప్పుడు సీఎం రమేష్కు రెండోసారి అవకాశం ఇచ్చారు. మరో సీటు వర్ల రామయ్యకు ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో కనకమేడల రవీంద్రకుమార్కు ఇచ్చారు. -
డాక్టర్ సుధాకర్తో మాట్లాడినట్లు నిరూపిస్తారా?
సాక్షి, మార్కాపురం (ప్రకాశం) : అనస్తీషియా వైద్యుడు సుధాకర్ బాబు వ్యవహారంపై చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ చేస్తున్న రాజకీయాలపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని హైకోర్టు సీబీఐకి అప్పగించడంతో దీనిని మేనేజ్ చేయడానికి తాను రంగంలోకి దిగినట్లు టీడీపీ నేత వర్ల రామయ్య చేస్తున్న ఆరోపణలను ఖండించారు. (స్థానికులే చేతులు కట్టేశారు) డాక్టర్ సుధాకర్తో గాని, వాళ్ల అమ్మతో గాని నేను మాట్లాడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమని, నిరూపించడానికి మీరు సిద్దమా? అని మంత్రి సవాల్ విసిరారు. మేనేజ్ అనే పదం టీడీపీకి, ఆ పార్టీ నేతలకు బాగా వర్తిసుందన్నారు. ఎందుకంటే వారు దేనినైనా, ఎవరినైనా మేనేజ్ చేయగలరని విమర్శించారు. వర్ల రామయ్య, డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్లను అడ్డుపెట్టుకొని దళితులను రెచ్చగొట్టే విధంగా టీడీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని అవమానకరంగా మాట్లాడిన చంద్రబాబుతో దళిత జాతికి క్షమాపణ చెప్పించాలంటూ డిమాండ్ చేశారు. (రంగనాయకమ్మా.. డ్రామాలెందుకమ్మా!) టీడీపీ ఉడత ఊపులకు భయపడేది లేదన్నారు. జగనన్న నాయకత్వాన్ని అందరూ మెచ్చుకుంటున్నారని, దళిత జాతికి ఏ విధంగా ప్రయోజనాలు అందిస్తున్నారో అందరికీ తెలుసని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. మద్యం తాగి ఉభయ రాష్ట్రాల సీఎంలను, ప్రధానమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ రోడ్డుపై న్యూసెన్స్ చేసినందుకు అనస్తీషియా డాక్టర్ సుధాకర్ను పోలీసులు అరెస్ట్ చేసిన వ్యవహారంలో హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. (డాక్టర్ సుధాకర్ టీడీపీ మనిషి: ఎంపీ సురేష్) -
వర్ల రామయ్యపై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖను కించపరిచే విధంగా అసత్య ఆరోపణలు చేసిన టీడీపీ నాయకుడు వర్ల రామయ్యపై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పోలీసులు, డీజీపీ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షణలో నిస్పక్షపాతంగా, నిర్భయంగా విధులు నిర్వర్తిస్తుంటే వర్ల రామయ్య పోలీసు వ్యవస్థపై అవాస్తవ ఆరోపనలు చేస్తూ, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పోయే విధంగా, పోలీసుల మనోభావాలు దెబ్బవిధంగా వ్యాఖ్యలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తెలిపింది. ఈ మేరకు శనివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టుల ముందు అందరూ సమానమే. అందులో ప్రత్యేకంగా పోలీసు శాఖకు కోర్టులపై అపారమైన నమ్మకం, గౌరవం ఉంది. కోర్టులకు సంబంధించిన విషయాల్లో ఒక మాజీ పోలీసు అధికారి అయివుండి, కోర్టులపై మీసాలు తిప్పి, తొడలు కొడుతూ సవాలు విసరడం మీ అజ్ఞానాన్ని అవగహనారాహిత్యాన్ని తెలియజేస్తోంది. సమాజంలో జరిగిన ఏ సంఘటన పై అయినా, సరైనా వివరాలు అవసరమై సందర్భరాల్లో విధినిర్వహణలో భాగంగా అధికారులను కోర్టులో హాజరై వివరణ ఇవ్వాలని కోర్టులు ఆదేశించడం సాధారణం. గతంలో కూడా అనేక సందర్భాల్లో పోలీసు అధికారులు కోర్టుల ఆదేశాల మేరకు హాజరై వివరాలు తెలిపారు. అదే విధంగా డీజీపీ కూడా విధినిర్వహణలో భాగంగా, బాధ్యత గల అధికారిగా కోర్టులో హాజరై వారి ఆదేశాలను పాటించడం జరిగింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ విధినిర్వహణలో సమర్థత, వారి సాహసోపేతమైన నిర్ణయాలు, ప్రత్యేకమైన గుర్తింపు గల అధికారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు సుపరిచితమే. వర్ల రామయ్య లాంటి వ్యక్తుల తప్పుడు ప్రకటనలు ఎవరూ నమ్మరు. మాచర్ల ఘటనలో ఐపీసీ 307 ప్రకారం కేసు నమోదు చేశాము. వెంటనే ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచాము. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధిస్తే.. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అవాస్తవాలు మాట్లాడుతున్నారు. కళ్లుండి చూడలేని మీరు ఇకనైనా మీ కళ్లకు పట్టిన పచ్చకామెర్లను వదిలించుకుని వాస్తవాలు తెలుసుకుని అవగహనతో మాట్లాడాలి. పోలీసు వ్యవస్థపై బురదజల్లే కార్యక్రమాను మానుకోవాలని పోలీసు అధికారుల సంఘం హెచ్చరిస్తోంది’ అని ఓ ప్రకటన విడుదల చేశారు. -
ఓడిపోతారని తెలిసే టికెట్ ఇచ్చారు: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీకి అభ్యర్థులే కరువయ్యారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ విమర్శించారు. టీడీపీలో నామినేషన్ వేసే వారు లేరు, బీఫార్మ్ తీసుకునేవారు లేరని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెఎస్సార్ సీపీ నామినేషన్లు అడ్డుకుంటున్నారని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత శాసనసభ ఎన్నికల్లో టీడీపీని 23 సీట్లకు పరిమితం చేసినా చంద్రబాబుకు బుద్ది రాలేదని విమర్శించారు. చంద్రబాబు నాయకత్వంపై టీడీపీ నేతలకు నమ్మకం పోయిందన్నారు. జగన్ సంక్షేమ పాలన చూసే టీడీపీ ముఖ్య నేతలు తమ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. గతంలో చంద్రబాబు దళితులకు రాజ్యసభ టిక్కెట్లు ఇవ్వలేదని.. ఇప్పుడు ఓడిపోతారని తెలిసే వర్ల రామయ్యకు టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. వర్ల రామయ్యను బలిపశువును చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబును టీడీపీ దళిత నేతలు నిలదీయాలని పిలుపునిచ్చారు. గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేశారని.. ప్రతిపక్ష నేతగా కూడా చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు. అందుకే వైయస్ జగన్ను ప్రజలు గెలిపించారని, మాట ఇస్తే నిలబెట్టుకునే నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఏకైక సీఎం జగన్ అని.. తొమ్మిది నెలల జగన్ పాలన చూసి నేతలు క్యూ కడుతున్నారని జోగి రమేష్ పేర్కొన్నారు. -
దళిత నేతకు గెలవని సీటు
సాక్షి, అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి గెలిచే అవకాశం ఏమాత్రం లేకపోయినా దళిత నేత వర్ల రామయ్యను టీడీపీ తరఫున పోటీకి దింపుతుండటం చర్చనీయాంశమైంది. ఈసారి రాష్ట్రానికి వచ్చే నాలుగు రాజ్యసభ స్థానాల్లో సంఖ్యాబలం అధికంగా ఉన్న వైఎస్సార్ సీపీ గెలవడం లాంఛనమేనని తెలిసినా చంద్రబాబు దళిత నేతను పోటీకి దింపడం ఆ వర్గాన్ని మోసం చేయడానికేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరేళ్లలో మూడుసార్లు టీడీపీ నాయకుల్ని రాజ్యసభకు పంపే అవకాశం వచ్చినప్పుడు తన కోటరీలోని ముఖ్యులు, సొంత సామాజిక వర్గం వారికి ప్రాధాన్యం ఇచ్చిన వైనాన్ని దళిత నాయకులు గుర్తు చేస్తున్నారు. ఆరేళ్లలో ఒక్క దళిత, బీసీ నేతనైనా రాజ్యసభకు పంపకపోగా.. మాట ఇచ్చి వారిని మోసం చేసిన ఉదంతాలున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 2002 నుంచీ మాటిచ్చి మోసగించడమే - 2014లో టీడీపీ నుంచి ఇద్దరిని రాజ్యసభకు పంపే అవకాశం రాగా.. తన కోటరీలో సొంత సామాజిక వర్గానికి చెందిన గరికపాటి మోహనరావుకు ఒక సీటు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తోట సీతారామలక్ష్మికి మరో సీటు ఇచ్చారు. - ఆ సమయంలో తెలంగాణకు చెందిన మోత్కుపల్లి నరసింహులు రాజ్యసభ సీటివ్వాలని అడిగినా చంద్రబాబు పట్టించుకోలేదు. - 2016లో టీడీపీ తరఫున ముగ్గురిని రాజ్యసభకు పంపాల్సి ఉండగా ఎన్డీఏ కోటాలో సురేష్ ప్రభుకి అవకాశం ఇచ్చి, టీడీపీ నుంచి టీజీ వెంకటేష్కు రెండో సీటు ఇచ్చారు. - మూడో సీటును అప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తన కోటరీ వ్యక్తి, సన్నిహితుడు సుజనా చౌదరికి కేటాయించారు. - అదే సమయంలో టీడీపీకి చెందిన దళిత నేత జేఆర్ పుష్పరాజ్కు సీటిస్తానని తన ఇంటికి పిలిపించుకుని గంటల తరబడి కూర్చోబెట్టి ఆ తర్వాత లేదని చెప్పి అవమానించి పంపారు. - 2018లో టీడీపీకి రెండు రాజ్యసభ స్థానాలు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు సీఎం రమేష్కు రెండోసారి ఇచ్చారు. మరో సీటును వర్ల రామయ్యకు ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో కనకమేడల రవీంద్రకుమార్కు ఇచ్చారు. - 2002 నుంచి ఇప్పటివరకూ పలుమార్లు రాజ్యసభకు టీడీపీ నాయకుల్ని పంపే అవకాశం వచ్చినా ఎప్పుడూ దళితులను చంద్రబాబు పట్టించుకోలేదు. - గతంలో రాజ్యసభ సీటివ్వాలని కోరిన పరసా రత్నం, సత్యవేడుకు చెందిన హేమలత, బల్లి దుర్గాప్రసాద్ (అప్పట్లో టీడీపీ నేత) వంటి వారికి మొండిచేయి చూపారు. - ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నప్పుడు గవర్నర్గా పంపిస్తానని నమ్మించి మోసం చేశారని మోత్కుపల్లి నరసింహులు పలు సందర్భాల్లో వాపోయారు. -
‘దళితులను చంద్రబాబు కించపరుస్తున్నాడు’
సాక్షి, ప్రకాశం : సానుభూతి పొందడానికి దళిత వ్యక్తిని ఎన్నికల్లో పోటీలో ఉంచి చంద్రబాబు దళితులను కించపరుస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు దళితులతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న 21 మంది ఎమ్మెల్యే సీట్లతో రాజ్య సభ సీటు గెలిచే అవకాశం లేకున్న చంద్రబాబు దళిత వ్యక్తి వర్ల రామయ్యను పోటీలో పెట్టడం సానుభూతికోసమేనన్నారు. మంగళవారం మార్కాపురంలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. 2016లో దళిత వ్యక్తి టీ పుష్పరాజ్ను రాజ్యసభకు పంపుతానని చెప్పి చివరి నిమిషంలో టీజీ వెంకటేష్ను రాజ్యసభకు పంపిన చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు. 2018లో దళిత వ్యక్తి వర్ల రామయ్యకు సీటు ఇస్తానని చెప్పి రెండు గెలిచే సీట్లు ఉన్న సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్ను రాజ్యసభకు పంపించి రామయ్యను మోసం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికీ సమన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. -
దళితులను మరోసారి అవమానించిన చంద్రబాబు
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దళితులను మరోసారి అవమానించారు. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి ఇప్పిస్తానని చంద్రబాబు మోసం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున వర్ల రామయ్యను పోటీకి నిలపడం ద్వారా మరోసారి వారిని మోసం చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం లేకపోవడం వల్లే వర్ల రామయ్యను చంద్రబాబు బరిలో నిలిపినట్టుగా తెలుస్తోంది. గెలిచే అవకాశం ఉన్నప్పుడు దళితులకు రాజ్యసభ సీటు ఇవ్వని చంద్రబాబు.. తన సామాజికవర్గం, అగ్రవర్ణాలకు అవకాశం కల్పించారు. అందులో భాగంగానే సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్రావు, సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్, టీజీ వెంకటేశ్లను రాజ్యసభకు పంపించారు. గతంలో వర్ల రామయ్య కన్నీరు పెట్టుకున్నా రాజ్యసభ సీటు ఇవ్వని చంద్రబాబు.. ఇప్పుడు అతన్ని బరిలో నిలపడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందని దళిత సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దళితులపై చంద్రబాబుకు అంత ప్రేమ ఉంటే.. వర్ల రామయ్యకు అప్పుడు ఎందుకు అవకాశం కల్పించలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ దళితులను అవమానించడమేనని వారు మండిపడుతున్నారు. కాగా, 2002 నుంచి ఇప్పటివరకు ఒక్క దళిత నేతను కూడా చంద్రబాబు రాజ్యసభకు పంపలేదు. 2016లో జేఆర్ పుష్పరాజ్కు రాజ్యసభ సీటు ఇస్తానని తిప్పించుకున్న చంద్రబాబు.. చివరి నిమిషంలో దానిని అగ్రవర్ణాలకు కేటాయించారు. చదవండి : చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేస్తాం -
రాజీనామా చేసిన వర్ల రామయ్య
సాక్షి, విజయవాడ: ఎట్టకేలకు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి శనివారం పంపించారు. కాగా ప్రభుత్వం మారి అయిదు నెలలు తర్వాత వర్ల రామయ్య తన పదవికి రిజైన్ చేయడం గమనార్హం. ఆర్టీసీ నిబంధనల ప్రకారం చైర్మన్ పదవీ కాలం కేవలం ఏడాది మాత్రమే ఉంటుంది. కానీ వర్ల రామయ్య పదవీ కాలం ఏప్రిల్ 24, 2019లో ముగిసినా ఆయన మాత్రం పదవి నుంచి వైదొలగలేదు. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ 1950 చట్టం సెక్షన్-8లోని ఉప నిబంధన-2 ప్రకారం నెల రోజుల గడువిస్తూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు సెప్టెంబర్లో నోటీసు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకున్న ఆయన నెల రోజుల తర్వాత ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. -
వర్ల రామయ్య విజ్ఞతకే వదిలేస్తున్నాం...
సాక్షి, విజయవాడ: పోలీసులపై టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను ఏపీ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. పోలీస్ అనేది ఒక వ్యవస్థ అని ఎవరైనా చట్టానికి లోబడే పని చేస్తారని స్పష్టం చేసింది. బుధవారం ఏపీ పోలీస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి మస్తాన్ మాట్లాడుతూ...‘ వర్ల రామయ్యపై పోలీస్ ఉద్యోగిగా మాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. పోలీసుల జాతకాలు తెలుసు, ఒక జెండా పట్టుకున్నారని టీడీపీ నేతలు కించపరిచేలా మాట్లాడారు. ఇటువంటి వ్యాఖ్యలను వర్ల రామయ్య ఎందుకు సమర్థిస్తున్నారు. ఖండించాల్సిన ఆయన డీజీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. పోలీసులు చట్టానికి లోబడే పనిచేస్తారు. మా శాఖలో పని చేసిన మీకు ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మా సంఘంలో పని చేసిన అనుభవం కూడా రామయ్యకు ఉంది. మా మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే...ఖండించడం తప్పా?. పోలీసులకు కులం, మతం లేవు. మా అందరిదీ ఖాకీ కులమే. పోలీస్ శాఖను కించపరిచేలా ఎవరు మాట్లాడినా సహించం. పోలీస్ సంఘంలో మనుషులు మారారేమో...విధానాలు మారలేదు. వర్ల రామయ్య కేసుపెట్టి ఉంటే.. ఆ స్టేషన్ ఎస్హెచ్వో చట్టప్రకారం వెళతారు. పోలీసుల జాతకాలు నా దగ్గర ఉన్నాయని బెదిరించడాన్ని వర్ల రామయ్య విజ్ఞతకే వదిలేస్తున్నాం.’ అని అన్నారు. ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు స్వర్ణలత మాట్లాడుతూ... వర్ల రామయ్య పోలీస్ వ్యవస్థను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. పోలీస్గా, సంఘం సభ్యుడిగా పనిచేసిన ఆయనకు వ్యవస్థ ఎలా ఉంటుందో తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. పోలీస్ శాఖలో కులాన్ని తీసుకు వస్తున్నారని, అది సరికాదని అన్నారు. పోలీసుల సంఘానికి ప్రెస్మీట్ పెట్టే అర్హత ఎందుకు లేదో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్లో ఎవరు పోలీస్ శాఖపై విమర్శలు చేసినా సహించేది లేదన్నారు. విజయవాడ పోలీసు అధికారులు సంఘం అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ.. ఇప్పుడు కులం పేరు చెప్పుకుంటున్న వర్ల రామయ్య ఏనాడైనా దళితులకు న్యాయం చేశారా అని ప్రశ్నలు సంధించారు. ఆర్టీసీ చైర్మన్ హోదాలో దళిత విద్యార్థులను అవమానించిన చరిత్ర ఆయనది అని గుర్తు చేశారు. రాజకీయ నేతగా మీరు దళితుల ఎదుగుదలకు ఎప్పుడైనా ప్రోత్సహించారా అంటూ డీజీపీపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ‘నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు.. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా నేను చేయను. మా పోలీసు వేదికపై నుంచి వర్ల రామయ్యకు అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. మా శాఖలో పనిచేసిన వ్యక్తి నోటికొచ్చినట్లు మాట్లాడితే మాకు బాధ కలిగింది. మాది ఖాకీ కులమే తప్ప... మరే కులాలతో మాకు సంబంధం లేదు. వర్ల రామయ్యది ఏ కులమో కూడా మాకు తెలియదు. ఈ ఖాకీ డ్రెస్ వేసుకున్నందుకు ప్రాణ త్యాగానికైనా నేను సిద్దంగా ఉన్నాను’ అని ఏపీ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. -
పోలీస్ వ్యవస్థ ఎవరికీ తలొగ్గి పనిచేయదు
-
‘నీ జాతకం మొత్తం నా దగ్గర ఉంది.. ఖబర్దార్ ’
సాక్షి, విజయవాడ : పోలీసుల మీద అవాకులు చవాకులు పేలుతున్న టీడీపీ నేత వర్ల రామయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ హెచ్చరించారు. పోలీసులపై ఎవరైనా అసత్య ప్రచారం చేసినా, దూషించినా.. న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ‘పోలీసుల జాతకాలు నీ వద్ద ఉన్నాయని మాట్లాడుతున్నావ్.. నీ జాతకం మొత్తం నా దగ్గర ఉంది ఖబర్దార్’ అంటూ హెచ్చరికలు జారీచేశారు. అదే విధంగా పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి మస్తాన్ ఖాన్ మాట్లాడుతూ.. రాజకీయ పబ్బం గడుపుకోడానికి టీడీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పోలీస్ వ్యవస్థ ఎవరికీ తలొగ్గి పనిచేయదని పేర్కొన్నారురు. పోలీసులను కించపరిచేలా మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని, తమకు అనవసరంగా పార్టీ రంగు పులమడం సరికాదని హితవు పలికారు. -
వర్ల రామయ్యకు నెల గడువిచ్చిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ప్రభుత్వం మారినా టీడీపీ సీనియర్ నేత, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య మాత్రం ఆ పదవిని పట్టుకుని వేళ్లాడుతూనే ఉన్నారు. దీంతో ఆ పదవి నుంచి వైదొలగడానికి రాష్ట్ర ప్రభుత్వం నెల రోజులు గడువు ఇస్తూ నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ నిబంధనల ప్రకారం చైర్మన్ పదవీ కాలం కేవలం ఏడాది మాత్రమే ఉంటుంది. కానీ, వర్ల రామయ్య పదవీ కాలం ఏప్రిల్ 24, 2019లో ముగిసినా ఆయన మాత్రం పదవి నుంచి వైదొలగలేదు. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ 1950 చట్టం సెక్షన్-8లోని ఉప నిబంధన-2 ప్రకారం నెల రోజుల గడువిస్తూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు నిన్న నోటీసు జారీ చేశారు. అదే విధంగా విజయవాడ జోనల్ చైర్మన్ పార్థసారధికి కూడా ఒక నెల గడువిస్తూ ఆర్టీసీ నోటీసులు ఇచ్చింది. ఇదే సమయంలో కడప జోనల్ చైర్మన్ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి రాజీనామాను ఆమోదించింది. -
ముగిసిన జోగి రమేశ్ విచారణ
సాక్షి, గుంటూరు: అరండల్పేట పోలీస్ స్టేషన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేశ్ విచారణ ముగిసింది. ఆయనను ఉదయం నుంచి దాదాపు ఆరు గంటలకు పైగా విచారించిన పోలీసులు.. మళ్లీ 15వ తేదీన నల్లపాడు పోలీస్ స్టేషన్కు రావాలని అన్నారు. వర్ల రామయ్య ఫిర్యాదుతో జోగి రమేశ్కు పోలీసులు అక్రమంగా నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే తనకు నోటీసులు పంపడంపై స్పందించిన జోగి రమేశ్.. అధికారాన్ని ఉపయోగించి ప్రతిపక్ష నేతలను పోలీసు కేసుల్లో ఇరికించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నోటీసులతో బయపెట్టాలని చూస్తోందంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతపైనే కుట్రలు చేస్తున్నవారు ఎంతకైనా తెగిస్తారంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వ నిరంకుశ చర్యలను ధైర్యంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. కాగా, నేడు అరండల్పేట పోలీస్ స్టేషన్కు హాజరైన రమేశ్కు మద్దతుగా భారీగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని తమ నిరసన తెలిపారు. అయితే వారితో పోలీసులు వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు కేసులు పెడతామని బెదిరించారని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆరోపించారు. ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. విచారణ అనంతరం అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. రమేశ్ను 15వ తేదీన మళ్లీ విచారణకు రావాల్సిందిగా కోరినట్టు తెలిపారు. -
గుంటూరు: వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ కక్షసాధింపు
-
వర్ల రామయ్య వర్సెస్ కేఈ కృష్ణమూర్తి
సాక్షి ప్రతినిధి, కర్నూలు : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో టీడీపీ పొత్తు విషయంపై టీడీపీలో సెగ పుడుతోంది. కాంగ్రెస్ దౌర్భాగ్యం తమకెందుకని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇటీవల వ్యాఖ్యానించడంపై ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య మండిపడ్డారు. పార్టీ వేదికల్లో అభిప్రాయం చెప్పాలని, బహిరంగంగా మాట్లాడి పార్టీ కేడర్కు ఏం సందేశమిస్తున్నారని కేఈని ఉద్దేశించి వర్ల వ్యాఖ్యానించారు. వర్ల ఎవరు తనకు చెప్పడానికని డిప్యూటీ సీఎం కేఈ మండిపడ్డారు. కాంగ్రెస్తో పొత్తు విషయంలో కిందిస్థాయి కేడర్ నుంచి వచ్చిన అభిప్రాయాలనే తాను వెల్లడించానని చెప్పారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగానే ఎన్టీఆర్ పార్టీని స్థాపించారనే విషయం తమ మనస్సుల్లో హత్తుకుపోయిందన్నారు. కాంగ్రెస్ పొత్తుపై మాట్లాడినందుకు సీఎం చంద్రబాబు తనను మందలించారనడంలో నిజం లేదన్నారు. ధర్మపోరాటం సభలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఈ నేతలు ఇరువురు మీడియాతో మాట్లాడారు. -
పవన్ కల్యాణ్పై వర్ల రామయ్య సెటైర్లు!
సాక్షి, విజయవాడ : జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్పై ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్.. సీఎం పదవి కోసమే రోడ్లపై తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. కృష్ణా జిల్లా విజయవాడలో ఆదివారం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. నేను సినిమా హీరోను.. సీఎం పదవి ఇచ్చేయమంటే ప్రజలు పవన్కు అధికారాన్ని ఇవ్వరని ఎద్దేవా చేశారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి కూడా సీఎం పదవి కోసం ఇలానే తిరిగారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. సినిమా హీరోలను ముఖ్యమంత్రులుగా ఆదరించే పరిస్థితి రాష్ట్రంలో లేదని అభిప్రాయపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు మాత్రమే ప్రజలు ఓట్లేసి సీఎంగా ఆదరించారని వర్ల రామయ్య అన్నారు. -
మరోసారి వర్ల రామయ్య నిర్లక్ష్యపు వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి : ఏపీఎస్ ఆర్టీసీ చైర్మెన్ వర్ల రామయ్య మరోసారి నిర్లక్ష్య వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఆర్టీసీపై అధ్యయనానికి ఆయన మూడు రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వర్ల మాట్లాడుతూ.. హత్య చేస్తే జైలుకు వెళ్తారని అందరికీ తెలసునని, కానీ ఎంత మంది ఊరుకుంటున్నారని, శిక్ష పడుతుందని తెలినసినా హత్యలకు పాల్పడుతున్నారంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఏపీలో ప్రైవేట్ బస్సుల కల్చర్ ఇప్పటిది కాదని, దానికి చంద్రబాబు అనడం సరికాదన్నారు. ప్రయాణికుల్లో మార్పు రావాలని, ప్రైవేటు బస్సుల్లో ప్రయానించొద్దు అనే ఉద్యమాన్ని ప్రజలే తీసుకు రావాలంటూ వ్యాఖ్యానించారు. బస్సు స్టేషన్కు రెండు కిలోమీటర్ల సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ టికెట్స్ అమ్మవద్దని రూల్ ఉందని, కానీ ఎవరు రూల్స్ పాటిస్తారంటూ మాట్లాడారు. గుజరాత్లో ఆర్టీసీ ప్రయాణాలు అద్భుతంగా అందుబాటులో ఉన్నాయని, అభివృద్ధి చూసి ఏపీలో ప్లాన్ చేయాలనే ఆలోచనలో బాబు ఉన్నారని అన్నారు. గుజరాత్లో ప్రత్యేక మార్గం ఉందని అందుకే అభివృద్ధిలో ముందుందని పేర్కొన్నారు. గుజరాత్ పర్యటన అనంతరం ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో బస్స్టాపుల నిర్మాణంపై సీఎంకు ప్లాన్ ఇస్తామని చెప్పారు. బస్టాండ్ కి వచ్చిన ప్రయాణికులకు షాపింగ్స్, సినిమాలు, హోటల్స్ అన్ని అక్కడే ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ నిర్మాణాల కోసం ప్రైవేటు వ్యక్తులు కాంట్రాక్ట్ కోసం ముందుకు రావాలని కోరారు. -
వర్ల రామయ్య చాంబర్లో కుర్చీ 40 వేలు..
ఆయన ఓ సంస్థకు చైర్మన్. ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. అప్పటికే సంస్థ అప్పుల్లో ఉంది. ఇలాంటి సమయంలో ఎవరైనా సంస్థ ఆర్థికాభ్యున్నతికి చర్యలు తీసుకుంటారు. ఆయన మాత్రం అందుకు భిన్నంగా హంగు, ఆర్భాటం కోసం కోట్లు ఖర్చుపెడుతున్నారు. ప్రమాణ స్వీకారం పేరుతో ఆర్టీసీ నిధులు భారీగానే ఖర్చు చేశారు. ఇవి చాలవన్నట్లుగా తన చాంబర్ ఆధునికీకరణ, ప్రత్యేక కుర్చీ, విలాసవంతమైన కార్లు తదితరాల వాటి కోసం మరిన్ని నిధులు వ్యయం చేశారు. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్లుగా చైర్మన్ వ్యవహారం ఉందని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆయన తీరును విమర్శిస్తున్నారు. సాక్షి,అమరావతిబ్యూరో: గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి తరువాత తన రాజకీయ ఉద్యోగం కోసం నాలుగేళ్లుగా ఎదురుచూసిన వర్ల రామయ్యకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆర్టీసీ చైర్మన్గా నామినేటెడ్ పదవిని కట్టబెట్టారు. ఆయనతో పాటు మరో నలుగురికి నాలుగు జోన్ల చైర్మన్లగా అవకాశం కల్పించారు. నాలుగేళ్ల పాటు అధికారుల పాలనలో ఆర్టీసీ ఆదాయం పెంచుకునేలా కృషిచేస్తున్న నేపథ్యంలో పాలకవర్గం పేరుతో ప్రభుత్వం ఆర్టీసీపై అదనపు భారం మోపింది. ఇప్పటికే దాదాపు రూ.4 వేల కోట్ల అప్పులతో నెట్టుకువస్తున్న ఆర్టీసీకి ప్రభుత్వం కనీస చేయూత కూడా ఇవ్వలేదు. కొత్త బస్సుల కొనుగోలుకు చిల్లర వేస్తూ డీజిల్పై రాయితీ కూ డా ఇవ్వని దుస్థితిలో ఉంది. ఈ క్రమంలో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన పాలకవర్గం తమ విలాసాల కోసం ఆర్టీసీ నిధులను నీళ్లలా ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విలాసాల కోసం.. ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ప్రమాణ స్వీకారం కోసం ఆర్భాటం చేశారు. సుమారు 2 వేల మందిని జనసమీకరణ చేయించి వారికి భోజనాలు ఏర్పాటు చేయించారు. దాంతో పాటు తన చాంబర్ను ప్రత్యేకంగా ఆధునికీకరించారు. చాంబర్ ఆధునికీకరణ, ప్రమాణస్వీకారం కోసం, చైర్మన్ కూర్చునేందుకు ప్రత్యేక కుర్చీ తదితరాల కోసం రూ. కోటి వరకు ఖర్చు చేశారు. అలాగే వర్ల హోదా, డాబు కోసం తనతో పాటు తన కుటుంబ అవసరాల కోసం దాదాపు రూ.70 లక్షల విలువ చేసే రెండు ఖరీదైన గేర్లెస్ ఇన్నోవా, ఫార్చూనర్ కార్లు కొనుగోలు చేశారు. దాంతో పాటు ఎస్కార్ట్ కోసం మరో వాహనంకొనుగోలు చేశారు. కేవలం కార్ల కొనుగోలు కోసమే కోటి రూపాయలు ఖర్చు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇంటి పనులకోసం ఆర్టీసీ ఉద్యోగులు? ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న వెంటనే తన సొంత అవసరాల కోసం ఆరుగురు ఉద్యోగులను ఉపయోగించు కుంటున్నారన్న ఆరోపణలున్నాయి. క్యాబినెట్ ర్యాంకు హోదా ఉన్న చైర్మన్కు అధికారికంగా సీనియర్ స్కేల్ అధికారితో పాటు స్టెనో, ఇద్దరు అటెండర్లు, గన్మెన్తోపాటు నలుగురు సెక్యూరిటీ విభాగం, నలుగురు డ్రైవర్లు ఉంటారు. అనధికారికంగా మరో ఆరుగురిని ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. రాజకీయ నిరుద్యోగులకు ఉపాధిగా.. అప్పుల్లో ఉన్న ఆర్టీసీని మాత్రం రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి వనరులుగా మార్చేసింది టీడీపీ ప్రభుత్వం. ఆర్టీసీకి ఆర్థిక భారంగా మారిన ఆర్టీసీ జోనల్ చైర్మన్ల వ్యవస్థను ఉమ్మడి రాష్ట్రంలోనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. కానీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మాత్రం నలుగురు నేతలకు ఉపాధి కోసం తిరిగి జోనల్ చైర్మన్ల వ్యవస్థ పునద్ధరించింది. వారికి చాంబర్లు, ఆర్భాటపు ఖర్చుల కోసం మరో రూ.2 కోట్ల వరకు కేటాయించాల్సి వస్తోందని ఆర్టీసీ కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ చైర్మన్గా పనిచేసిన నేతలు కూడా ఇంత ఆర్భాటపు ఖర్చులు చేయలేదని కార్మిక నేతలు చెబుతున్నారు. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వారే స్వప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ప్రస్తుత ఆర్భాటం కోసం ఖర్చు చేసిన నిధులతో నాలుగు తెలుగు వెలుగు, ఒక వోల్వా బస్సు కొనుగోలు చేయవచ్చని పలువురు కార్మికులు వ్యాఖ్యానిస్తున్నారు. చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టి నెలన్నర కావస్తున్నా సంస్థ పురోభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శిస్తున్నారు. -
ప్రకంపనలు రేపుతున్న వర్ల రామయ్య వ్యాఖ్యలు
-
వర్ల రామయ్యకు అహంకారం పెరిగింది..
సాక్షి, గుంటూరు : ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అనుచిత వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్ ... వర్ల రామయ్య వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.... ‘వర్ల రామయ్యకు పదవి రావడంతో అహంకారం పెరిగింది. వెంటనే మాదిగలకు క్షమాపణ చెప్పాలి. లేదంటే మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదు.’ అని హెచ్చరించారు. కాగా ఆర్టీసీ బస్సులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్న ఓ యువకుడిని వర్ల రామయ్య కులం పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు రావెల కిషోర్...గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని అసైన్డ్ భూములను పరిశీలించారు. తక్కువ ధరకు భూములు ఇవ్వాలని ప్రభుత్వ ఒత్తిడి చేస్తోందని రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రైతులకు ఉపాధి చూపించిన తర్వాతే వారి వద్ద నుంచి భూములు సేకరించాలని రావెల కిషోర్ అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
వర్ల రామయ్య పిల్లలు ఫోన్ వాడరా?
సాక్షి, విజయవాడ: బస్సులో ప్రయాణిస్తున్న యువకుడి పట్ల ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అనుచిత ప్రవర్తన, అభ్యంతరకర వ్యాఖ్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఎంపీ వరప్రసాద్ శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. వర్ల తీరును ఆక్షేపించారు. (చదవండి: నువ్వు మాదిగా? ఇంకేం చదువుతావ్) ‘‘మచిలీపట్నం బస్టాండ్లో ఆకస్మిక తనిఖీకి వెళ్లిన వర్ల రామయ్య.. తన స్థాయిని మర్చిపోయి ఓ యువకుడిని ఉద్దేశించి వాడు, వీడు అని దుర్భాషలాడారు. పక్కనున్న టీడీపీ నాయకులు ఆయన్ని ఇంకాస్త రెచ్చగొట్టారు. ఇంగితజ్ఞానం కూడా మర్చిపోయి.. నీ కులమేంటని ప్రశ్నించారు. ఫోన్ వాడితే పనికిరాకుండాపోతావని తిట్టిపోశారు. ఏం? వర్ల రామయ్యగారి పిల్లలు ఫోన్లు వాడరా? పేదలకు ఒక న్యాయం, రామయ్య బిడ్డలకు ఒక న్యాయమా? అసలు కులం అడగటం ఏం సంస్కృతి? ఆయన అనాల్సిన మాటలేనా అవి!’’ అని ఎంపీ వరప్రసాద్ వాపోయారు. యథా బాబు.. తథా రామయ్య: గతంలో దళితులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా దారుణంగా మాట్లాడారు. కనీసం క్షమాపణలు చెప్పినట్లు కూడా చెప్పలేదు. ఇక ఆయన కింద పనిచేసే నాయకులు అంతకంటే గొప్పగా మాట్లాడతారని అనుకోలేం’ అని వరప్రసాద్ పేర్కొన్నారు. -
వర్ల రామయ్య ఇంగితజ్ఞానం మర్చిపోయి..
-
దళిత విద్యార్థిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్ల రామయ్య
-
నువ్వు మాదిగా? ఇంకేం చదువుతావ్
సాక్షి, మచిలీపట్నం/అమరావతి: ఆర్టీసీ బస్సులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్న ఓ యువకుడిని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య కులం పేరుతో దూషించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడున్న అధికారులు, టీడీపీ నేతలు అవాక్కయ్యారు. ఈ ఘటన గురువారం కృష్ణాజిల్లా మచిలీపట్నం బస్టాండ్ అవరణలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా మచిలీపట్నం బస్టాండ్ తనిఖీ నిమిత్తం వచ్చిన వర్ల రామయ్య అక్కడ ఆగిఉన్న బస్సు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఓ యువకుడు బస్సులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సెల్ఫోన్లో పాటలు వింటున్నాడు. తనను చూసి సీటులో నుంచి లేవలేదని అనుకున్నారో ఏమో.. ఇయర్ ఫోన్స్ లాక్కుని తన చెవికి పెట్టుకున్నారు. అనంతరం తన నోటికి పనిచెప్పారు. రాయలేని విధంగా దుర్భాషలాడారు. ‘‘నీకు ఫోన్ ఎందుకురా? ఎస్సీనా నువ్వు?.. మాలా? మాదిగా?’’ అని నిలదీశారు. తాను మాదిగనని ఆ యువకుడు బదులివ్వగా.. వర్ల మరింత రెచ్చిపోయారు. ‘‘మాదిగ (నా.. కొ..) అస్సలు చదవరు. బాగుపడరు’’.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా.. ‘‘మీ నాన్న, మీ అమ్మ ఏం పనిచేస్తారు? ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఎన్ని లక్షలు ఉన్నాయి బ్యాంకులో?’’ అంటూ అసంబద్ధ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్, ఆర్టీసీ అధికారులుఅవాక్కయ్యారు. ఆర్టీసీ అధికారుల పనితీరు, బస్టాండ్లో సౌకర్యాలపై తనిఖీ చేయాల్సి వర్ల రామయ్యకు ప్రయాణికులను దుర్భాషలాడాల్సి అవసరం ఏంటని విమర్శలు వ్యక్తమయ్యాయి. కులం పేరుతో దూషించడం దుర్మార్గం మచిలీపట్నం బస్టాండ్లో దళితులను, ప్రయాణికులను అవమానపరుస్తూ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య మాట్లాడటం సిగ్గుచేటని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అన్నారు. మాదిగోళ్లకు చదువు సంధ్యలు ఉండవు.. వీరికి సెల్ఫోన్లు కావాలి అని మాట్లాడటం ఆయన స్థాయికి తగదన్నారు. దళిత కులంలో పుట్టి అదే దళితులను అవమానపరుస్తూ రామయ్య మాట్లాడటం దుర్మార్గమని, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మార్కెటింగ్ శాఖ మంత్రి తదితరులు సైతం దళితులను కించపరిచేలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయన్నారు. మార్చి నాటికి అంబేడ్కర్ స్మృతివనం ఇదిలా ఉంటే.. అమరావతిలో 2019 మార్చి నాటికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేస్తామని, ఇప్పటికే ఆ బాధ్యతను ఏపీఐఐసీ ఎగ్జిక్యూటీవ్ ఏజెన్సీకి అప్పగించామని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్మృతివనం ప్రాజెక్టును రూ.100 కోట్లతో 20 ఎకరాల్లో చేపట్టనున్నామని, ఇందుకు సంబంధించిన డిజైన్ సైతం ఖరారు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కూడా పాల్గొన్నారు. -
దళిత యువకుడిపై వర్ల రామయ్య అభ్యంతరకర వ్యాఖ్యలు
-
దళిత యువకుడిపై వర్ల రామయ్య అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, మచిలీపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) చైర్మన్ వర్ల రామయ్య బస్సులో ప్రయాణిస్తున్న దళిత యువకుడి పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గురువారం మచిలీపట్నం బస్టాండ్లో అధికారులతో కలసి ఆయన బస్సుల తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్సులో ఓ యువకుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటాన్ని రామయ్య గమనించారు. అతని దగ్గరకు వెళ్లి చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోవా? అంటూ ప్రశ్నించారు. ‘మీ కులం ఏంటో చెప్పు?. మాల లేదా మాదిగా?. మాదిగలు అసలు చదవరు. ఈ వెధవ పరీక్ష కూడా రాసి ఉండడు. మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు?. పొలం ఉందా?. బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంది?. డబ్బులు లేకపోతే ఎలా చదువుకుంటావ్?. ఫోన్లు గీన్లు మానేసి చదువుకో.’అంటూ అసభ్యంగా మాట్లాడారు. రామయ్య వ్యాఖ్యలతో ఆర్టీసీ అధికారులు, బస్సులోని ఇతర ప్రయాణీకులు విస్తుపోయారు. గత వారంలో ప్రయాణీకులతో డ్రైవర్లు, కండెక్టర్లు మర్యాదగా ప్రవర్తించాలని, మర్యాద వారోత్సవాలు నిర్వహించారు. ఇంతలో సాక్ష్యాత్తు ఆర్టీసీ చైర్మన్ దళిత యువకుడిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘పవన్ నియమించిన ప్రతినిధుల్లో ఇద్దరు బీజేపీ నేతలు’
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై టీడీపీ నేతల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పవన్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్కు రాజకీయ అవగాహన లేదని విమర్శించారు. పవన్ నియమించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల్లో ఇద్దరు బీజేపీ నాయకులు ఉన్నారని, వారు బీజేపీ చెప్పింది వింటారు కానీ పవన్ మాట వినరని ఆయన అన్నారు. గతంలో ప్రజారాజ్యంపార్టీ స్థాపించిన చిరంజీవి కొన్ని సీట్లు అయినా సాధించగలిగారని, కానీ పవన్ మాత్రం అంతకుముందే దుకాణం సర్దేస్తారని ఎద్దేవా చేశారు. -
చంద్రబాబు నాటకంలో దళితులే పావులా ?
-
ఓటుకు కోట్లు కేసును చేపట్టినందుకేనా...?
టీడీపీ దళిత నేత, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్యకు సీఎం చంద్రబాబునాయుడు మొండి చెయ్యి చూపించారు. రాజ్యసభ పదవికి వర్ల రామయ్య పేరును పరిశీలించిన చంద్రబాబు, చివరకు ఆయన్ను పక్కన పెట్టి టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్కు కట్టబెట్టారు. దీంతో దళిత, బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయి. వర్ల రామయ్య ఆగ్రహంతో రగిలిపోయారు. సాక్షి, విజయవాడ: టీడీపీలో కీలక పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి ఇస్తున్నారని ఆ పార్టీకి చెందిన దళిత, బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుజనాచౌదరి, సీఎం రమేష్లతో సమానంగా వర్ల రామయ్యకు రాజ్యసభ సీటును ఎందుకివ్వరని దళిత నాయకులు ప్రశ్నిస్తున్నారు. పార్టీలో చేరినప్పటి నుంచి వర్ల రామయ్య పార్టీ అభివృద్ధికి కష్ట పడుతున్నారని ఆయనకు ఇచ్చే గుర్తింపు ఇదేనా.. అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీలో లాబీయింగ్లు, బలమైన శక్తులకే కీలకమైన పదవులు దక్కుతాయనే విషయం మరొకసారి నిరూపితమైందని ఆ పార్టీలోని వర్గాలు అంటున్నాయి. సీఐగా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలివేసి టీడీపీలో చేరిన వర్ల రామయ్యకు 2009 ఎన్నికల్లో చివర నిమిషంలో తిరుపతి ఎంపీ టిక్కెట్ ఇవ్వడంతో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో పామర్రు అసెంబ్లీ సీటు ఇస్తే ఉప్పులేటి కల్పన చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత ఎమ్మెల్సీ పదవిని ఆశించినప్పటికీ చివరకు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సారి పామర్రు సీటు కూడా ఇచ్చే అవకాశం లేకపోవడంతో రాజ్యసభ సీటును వర్ల ఆశించి భంగపడ్డారు. చంద్రబాబును ఆకట్టుకునేందుకు.... టీడీపీ అధినేత చంద్రబాబును ఆకట్టుకునేందుకు వర్ల రామయ్య విశ్వ ప్రయత్నం చేశారు. ఇటీవల విజయవాడలో మాదిగల మహాసభను నిర్వహించి మాదిగ హక్కుల పోరాట సమితికి చెందిన ఇద్దరు కీలకనేతల్ని టీడీపీలో చేర్పించారు. అదే సభలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతూ ఆయన దళితులకు న్యాయం చేస్తారంటూ స్తుతించారు. సీటు వస్తుందనే నమ్మకంతో ఆదివారం తన కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. చివరి నిమిషంలో ఆయనకు సీటు రాలేదని తెలుసుకుని నీరుకారిపోయారు. తన కుటుంబసభ్యులతో కలిసి వెనుతిరిగి వెళ్లిపోయారు. పార్టీ నిర్ణయం తనకు బాధ కలిగిస్తోందని ఆయన మీడియాతో బహిరంగంగానే చెప్పారు. ఓటుకు కోట్లు కేసును చేపట్టినందుకేనా...? చంద్రబాబు ఇరుక్కున్న ఓటుకు కోట్లు కేసును హైకోర్టు న్యాయవాది కనకమేడల రవీంద్ర కుమార్ వాదిస్తున్నారు. ఈ కేసులో చంద్రబాబు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రవీంద్రకుమార్కు రాజ్యసభ సీటు ఇచ్చారని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన రవీంద్రకుమార్ గతంలో బెజవాడ బార్ అసోసియేషన్లోనూ పనిచేశారు. ఆయన టీడీపీకి చేసిన సేవ కంటే చంద్రబాబుకు సహాయం చేసినందుకే ఈ పదవి దక్కిందని భావిస్తున్నారు. -
ఊరించి.. చివరికి హ్యాండిచ్చి
సాక్షి, అమరావతి: రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక తీరుపై తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆశావహులను చివరి వరకు ఊరించి, చివరకు హ్యాండివ్వడంపై సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం వ్యక్తిగత, రాజకీయ అవసరాలే ప్రాతిపదికన సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్ ఎంపికపై సీనియర్లు రగిలిపోతున్నారు. అధినేత చెప్పే మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన ఉండడంలేదని వ్యాఖ్యానిస్తున్నారు. అభ్యర్థుల ఖరారును చివరి వరకు సాగదీసి, చివరకు తమకు నచ్చిన వారికి ఇవ్వడం పార్టీ అధినాయకత్వానికి పరిపాటిగా మారిందని అంటున్నారు. గతంలో సుజనా చౌదరి, టీజీ వెంకటేష్లకు రాజ్యసభ సీట్లు ఇచ్చినప్పుడు, ఇప్పుడు కూడా ఇదే పద్ధతిని పాటించారని చెబుతున్నారు. పార్టీకి ఆది నుంచి సేవలందిస్తున్న వారిని కాదని గతంలో టీజీ వెంకటేష్కు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎంతో మంది రాజ్యసభ సీటు ఆశించారని, వారందరినీ కాదని రవీంద్ర కుమార్ను ఎంపిక చేశారని, ఇది పార్టీ నేతలను విస్మరించడమేనని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి రాజ్య సభ స్థానంపై రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, పార్టీ సీనియర్ నేతలు బీద మస్తాన్రావు, వర్ల రామయ్య, మసాల పద్మజ, నల్లగట్ల స్వామిదాసు, హేమలత, జూపూడి ప్రభాకర్ వంటి వారు ఆశలు పెట్టుకున్నారు. పార్టీకి తాము చేసిన సేవలను అధినాయకత్వానికి వివరించి, రాజ్య సభకు అవకాశం ఇవ్వాలని కోరారు. వారికి న్యాయం చేస్తామని అధినాయకత్వం చెప్పింది. దీంతో వారు తమకు సీటు వస్తుందని కోటి ఆశలతో ఎదురు చూశారు. చివరి వరకు వారిని ఊరించిన అధినాయకత్వం, చివరకు తమకు నచ్చిన వారిని రాజ్యసభకు ఎంపిక చేసింది. మరీ ముఖ్యంగా వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు దాదాపు ఖరారయింది. ఈమేరకు పార్టీ నాయకత్వం లీకులు కూడా ఇచ్చింది. ఆదివారం ఉదయం వరకు రామయ్యకు సీటు ఖరారయిందన్న వార్తలు వెలువడ్డాయి. ఆదివారం ఉదయం రామయ్య కుటుంబంతో సహా సీఎం నివాసానికి బయల్దేరారు. అయితే, చివరి నిమిషంలో రామయ్య పేరు జాబితా నుంచి మాయమైంది. ఆయన స్థానంలో కనకమేడల రవీంద్రకుమార్ పేరు జాబితాలోకి ఎక్కింది. దీంతో రామయ్య తీవ్ర మనస్తాపం చెందారు. విజయవాడ శివారు నుంచే ఆయన తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. మరోవైపు.. తనకు అవకాశం ఇవ్వకపోవడంపై కంభంపాటి రామ్మోహన్రావు కూడా అసంతృప్తితో ఉన్నారు. రమేష్, రవీంద్ర ఎంపిక ఎంతవరకు న్యాయమని ఆశావహులంతా ప్రశ్నిస్తున్నారు. ఎంపిక తీరుపట్ల యనమలతోపాటు ఇతర సీనియర్లు కూడా అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. -
టీడీపీ కార్యాలయమైనా, ప్రకాశం బ్యారేజ్ పైనా రెడీ
-
సవాల్ విసిరి..తోక ముడిచిన టీడీపీ నేతలు
సాక్షి, విజయవాడ : వైఎస్ఆర్ సీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరిన టీడీపీ నేతలు తోక ముడిచారు. చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అరాచకాలను వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన సవాల్ను స్వీకరించిన వైఎస్ఆర్ సీపీ నేతలు సుధాకర్ బాబు, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో 3 గంటల పాటు ఎదురుచూసినప్పటికి అధికార పార్టీ నేతలు అడ్రస్ లేకుండా పోయారు. దీనిపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు అవినీతిని ఎప్పుడైనా, ఎక్కడైనా సాక్ష్యాధారలతో ఎండగడతామని చెప్పారు. టీడీపీ కార్యాలయమైనా, ప్రకాశం బ్యారేజ్ పైనా అయిన వస్తామని అందుకోసం ఏడాది పాటు సమయం ఇస్తున్నామని టీడీపీ నేతలకు దమ్ముంటే చర్చకు రావాలని ప్రతి సవాల్ చేశారు. ‘చర్చించే దమ్ములేక టీడీపీ నేత వర్ల రామయ్య చర్చకు రాలేకపోయారు. మేము అన్ని ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు టీడీపీ నేతలకు టైం ఇస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్ అయినా సరే.. టీడీపీ కార్యాలయం అయినా చర్చకు మేం రెడీ. మరోసారి వైఎస్ జగన్ను విమర్శిస్తే ఊరుకోం.’ అని హెచ్చరించారు. కాగా అవినీతిపై చర్చించేందుకు సిద్ధమని వర్ల రామయ్య సవాల్ చేసిన విషయం తెలిసిందే. -
బార్అసోసియేషన్ కాదు... బ్యారేజ్ దగ్గరికి రా...
-
బార్అసోసియేషన్ కాదు.. బ్యారేజ్ దగ్గరికి రా..
సాక్షి, విజయవాడ : ‘‘మీరు నిజంగా టీడీపీకి చెందినవారైతే.. మాట మీద నిలబడే దమ్ముంటే.. జనవరి 1న ఉదయం 10 గంటలకు ప్రకాశం బ్యారేజీ దగ్గరికి రండి! ‘బిట్ కాయిన్’తోపాటు 100 అంశాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎవరిని తెచ్చుకుంటారో మీ ఇష్టం. కానీ చర్చకు రావాల్సిందే. శాంతిభద్రతల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చెయ్యొద్దు. మాది తప్పని తేలితే బేషరతుగా క్షమాపణలు చెబుతాం. మీరు తప్పని తేలితే, వైఎస్ జగన్పై నిరాధారమైన ఆరోపణలు చేసింనందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’’ అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు.. అధికార పార్టీ నేతలకు సవాలు విసిరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏమిటి వివాదం? : సైతం రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి బిట్ కాయిన్ ఇండియా సాఫ్ట్వేర్ సర్వీసెస్ అనే సంస్థను నెలకొల్పి, సుమారు రూ.200 కోట్ల డిపాజిట్లు సేకరించి మోసానికి పాల్పడ్డారు. ఆయనకు వైఎస్సార్సీపీతో సంబంధాలున్నాయని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శిస్తూ.. ఈ విషయంలో ఎలాంటి చర్చకైనా సిద్ధమేనని ప్రకటించారు. కాగా, అక్రమాలకు పాల్పడిన రామకృష్ణారెడ్డి నిజానికి చంద్రబాబు మనిషేనని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సుధాకర్బాబు జవాబిచ్చారు. అన్ని అంశాలపై వర్ల రామయ్య చెప్పినట్లు బార్ అసోసియేషన్ ఆఫీసులో కాకుండా ప్రకాశం బ్యారేజీ దగ్గరే పబ్లిక్గా చర్చిద్దామని అన్నారు. మిస్టర్ వర్ల రామయ్యా.. రా : సైతం రామకృష్ణారెడ్డి గతంలో సేవాదళ్లో పనిచేసిన మాట వాస్తవమైనా, అక్రమార్కుడన్న సంగతి తెలిసి పార్టీ నుంచి గెంటేశామని, మాటవినకుంటే వైఎస్సార్ ఫౌండేషన్ తరఫున లీగల్ నోటీసులు కూడా పంపామని సుధాకర్బాబు తెలిపారు. వైఎస్సార్సీపీతో తనకు సంబంధంలేదని రామకృష్ణారెడ్డి పత్రికాముఖంగా పేర్కొన్న విషయాన్ని సైతం గుర్తుచేశారు. వాస్తవం ఇలా ఉంటే, వర్ల రామయ్య మాత్రం ప్రతిపక్షనేతపై నిరాధారమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని సుధాకర్బాబు ప్రశ్నించారు. ‘‘మిస్టర్ వర్ల రామయ్యా.. దమ్ముంటే జనవరి 1న, ఉదయం 10 గంటలకు ప్రకాశం బ్యారేజీ దగ్గరికి రా.. చర్చకు భయపడి పారిపోకు. ‘బిట్ కాయిన్’ రామకృష్ణారెడ్డి.. చంద్రబాబు ఫొటోలతో సంస్థకు పబ్లిసిటీ ఇచ్చుకున్న విషయం, ఆయన కుంభకోణంలో బాబుకు, ఆయన కుమారుడు లోకేశ్కు వాటాలున్న విషయం అన్నింటిపైనా మాట్లాడుదాం. ఇదొక్కటేకాదు.. గతంలో ముఖ్యమంత్రి సైతం ప్రతిపక్షనేతను ఉద్దేశించి అడ్డగోలుగా మాట్లాడారు. తీరా ఆధారాలు చూపమంటే తోకముడిచి పారిపోయారు. వాటన్నింటికీ సమాధానాలు చెప్పాలి’’ అని సవాలు చేశారు. -
‘ఇష్టముంటే ఉండొచ్చు..లేదంటే వెళ్లిపోవచ్చు’
సాక్షి, విజయవాడ : మాజీమంత్రి రావెల కిషోర్పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రావెల కిషోర్ బాబు తన పరిధి దాటి మాట్లాడుతున్నారని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. ‘రావెలకు ఇష్టముంటే పార్టీలో ఉండొచ్చు...లేదంటే వెళ్లిపోవచ్చు’ అని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్రం పరిధిలోని అంశమని, చంద్రబాబును కించపరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. క్రమశిక్షణ తప్పితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, వర్గీకరణపై టీడీపీకి ఓ సిద్ధాంతం ఉందని అన్నారు. ఆ వ్యాఖ్యలకు ఆయనే అర్థం చెప్పాలి ఎవరో చెప్పే మాటలు వినే పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని మంత్రి కేఎస్ జవహర్ వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి రావెల కిషోర్ వ్యాఖ్యల్ని ఆయన తప్పుపట్టారు. మాదిగ వర్గానికి రాజకీయ ప్రాధాన్యం కల్పించింది టీడీపీనే అని అన్నారు. రావెల వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటో ఆయనే చెప్పాలని ...ఆ వ్యాఖ్యలు రావెల వ్యక్తిగతమన్నారు. ఆయన ఏదో మానసిక ఓత్తిడిలో ఉన్నట్లున్నారని జవహర్ అన్నారు. మాదిగలకు టీడీపీకి ఉన్న బంధాన్ని విడదీయాలని మందకృష్ణ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కుల పునాదులపై రాజకీయ పార్టీలు పెట్టాలనుకోవడం వారి అపరిపక్వతకు నిదర్శనమన్నారు. కాగా తనకు పదవుల కన్నా ఎస్సీ వర్గీకరణే ముఖ్యమని గుర్రం జాషువా జయంతి ఉత్సవాలలో గురువారం మాజీ మంత్రి రావెల కిషోర్బాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ కోసం తాను శాసనసభ్యత్వాన్ని కూడా వదులుకునేందుకు సిద్ధమన్న ఆయన...ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లో నడుస్తానని చెప్పుకొచ్చారు. అయితే గతంలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదని, కేంద్ర పరిధిలోని అంశమని రావెల పేర్కొన్న విషయం విదితమే. -
ఏయ్ ఖాకీ పో వెనక్కి.. అంటూ వర్ల రామయ్య..
తిరుపతి: ఏయ్ ఖాకీ .. పో వెనక్కి, సభా వేదికపై నీ కేంపని అంటూ మాజీ పోలీసు అధికారి, టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తీరుతో విధి నిర్వహణలో వున్న పోలీసులు అవాక్కయ్యారు. తిరుపతి ఇందిరా మైదానంలో నిన్న (బుధవారం) తుడా చైర్మన్గా నరసింహయాదవ్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామయ్య తీరు సభికులను, పార్టీ కార్యకర్తలను సైతం ఆశ్చర్యపరిచింది. సభా వేదికలో కనిపించేందుకు పార్టీ కేడర్ ఎగబడటంతో కార్యకర్తల్లో క్రమశిక్షణ లేదంటూ మైక్ తీసుకున్న వర్ల రామయ్య తనదైన శైలిలో ఏకవచనంతో అందరిపైనా విరుచుకుపడ్డారు. పోలీసులను, పార్టీ వారినీ, అధికారులను... ఇలా ఎవరినీ వదలలేదు. పార్టీ నేతలు పలువురు వేదికపై ఉండగా ఏయ్.. రేయ్ వేదిక దిగు... నీకేంపనిక్కడ వెళ్లు అంటూ మాట్లాడారు. కష్టపడి పనిచేసిన మమ్మల్ని ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి రేయ్ పోండని ఎలా మట్లాడతారని స్థానిక నాయకులు అసహనం వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం చేయించేందుకు పత్రాలు తీసుకొచ్చిన తుడా అధికారులపైనా దురుసుగా వ్యవహరించారు. ఎవరు నువ్వు .. తుడా అధికారివా.. అయినా వెళ్లు పిలిచినప్పుడు రా.. పో అంటూ మాట్లాడటంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో ఇన్స్పెక్టర్ హోదాలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉన్న వర్ల రామయ్య అకారణంగా విధి నిర్వహణలో ఉన్న తమనిలా మాట్లాడడం ఏమిటని పోలీసులు వాపోయారు. -
'జగన్ను విమర్శించేందుకే వాడుకున్నారు'
విజయవాడ: అధికార టీడీపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై రేగిన చిచ్చు కొనసాగుతూనే ఉంది. పార్టీని నమ్ముకున్నవారికి న్యాయం జరగలేదని ఏపీలోని చాలా జిల్లాల్లో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై నేతలు బహిరంగంగానే అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కక పోవడంపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర అసంతృప్తి లో ఉన్నారు. గత వారం నుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. కాగా వైఎస్ జగన్ను విమర్శించేందుకే తనను వాడుకుని వదిలేశారని ఆయన సహచరుల వద్ద ఆవేదన చెందినట్టు సమాచారం. -
గెలుస్తామా.. లేదా!
కర్నూలు కార్పొరేషన్పై మల్లగుల్లాలు టీడీపీ వ్యూహాత్మక కమిటీ నేడు భేటీ వర్ల రామయ్య నేతృత్వంలో ఉదయం 11 గంటలకు.. కర్నూలు : కర్నూలు కార్పొరేషన్లో మన పార్టీ పరిస్థితి ఏమిటనే విషయంలో అధికార పార్టీలో అంతర్మథనం మొదలయింది. కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ గెలిచే అవకాశం ఉందా? లేదా అనే అంశంపై హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య నేతృత్వంలో సమావేశం కానున్నట్టు తెలిసింది. స్టేట్ గెస్ట్హౌస్లో ఆదివారం ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో పాటు మాజీ మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి విష్ణువర్దన్ రెడ్డి, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు మణిగాంధీ, ఎస్వీ కూడా హాజరుకానున్నట్టు తెలిసింది. ముస్లింలు దూరమేనా.. ప్రధానంగా బీజేపీతో పొత్తు నేపథ్యంలో పార్టీకి ముస్లింలు దూరంగా ఉంటున్నారనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. వీరికి ఇచ్చిన హామీలు కూడా పెద్దగా నెరవేరలేదు. ఉర్దూ యూనివర్సిటీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. హజ్హౌస్ నిర్మాణంపైనా ఏ మాత్రం కదలిక లేదు. పైగా బీజేపీతో ఉన్న పొత్తుతో కార్పొరేషన్ ఎన్నికల్లో ముస్లింలు తమ వెంట నిలిచే అవకాశం లేదని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనికితోడు ఎమ్మెల్యే ఎస్వీ చేరిక కూడా పార్టీకి పెద్దగా లాభించే అవకాశం లేదని కూడా విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఇందుకు కారణంగా ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డితో పాటు పెద్దగా నాయకులు, కార్యకర్తలు తరలిరాలేదని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మైనార్టీ నేతలు కూడా ఈ చేరికపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికల్లో వాస్తవిక బలం ఏమిటో తెలుసుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. -
పురంధేశ్వరి కాంగ్రెస్ కోవర్టు: వర్ల
విజయవాడ(గుణదల): బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అవగాహన లేమితోనే సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేత, రాష్ట్ర గృహనిర్మాణ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పురందేశ్వరి ఇంకా కాంగ్రెస్ కోవర్టుగా ఎన్డీఏలో పనిచేస్తున్నారని ఆరోపించారు. -
డొక్కాలో కాంగ్రెస్ వాసన పోలేదు
గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య సాక్షి, విజయవాడ బ్యూరో: మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీలో చేరినా ఇంకా కాంగ్రెస్ సంస్కృతిని వదిలించుకోలేక పోతున్నారని, ఆ వాసన ఆయనలో ఇంకా పోలేదని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు. శనివారం సీఎం కార్యాలయం వద్ద మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మాదిగలకు కృష్ణమాదిగే నాయకుడని ఆయన వ్యాఖ్యానించడం సరికాదని, దీనిపై పార్టీలో చర్చిస్తామని చెప్పారు. టీడీపీలో ఎలా పనిచేయాలో ఆయన ఇంకా తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల అంశాన్ని చంద్రబాబు చూసుకుంటారని దానిపై కృష్ణమాదిగ తమకు చెప్పాల్సిన పనిలేదన్నారు. -
టీడీపీ నేత వర్ల రామయ్యపై భూ ఆక్రమణ కేసు
విజయవాడ: టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యపై భూ ఆక్రమణ ఆరోపణలు వెల్లువెత్తాయి. దళిత సంఘాలు పోలీసులను ఆశ్రయించాయి. భవానీపురం పోలీస్ స్టేషన్లో రామయ్యపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 420, 405, 3, ప్రివెన్షన్ ఆఫ్ డామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ(1984) చట్టం కింద రామయ్యపై పో్లీసులు కేసు నమోదు చేశారు. -
వర్ల రామయ్యకు మతి భ్రమించింది: కల్పన
నామినేటెడ్ పదవి రాలేదనే నిరాశతో టీడీపీ నేత వర్ల రామయ్యకు మతి భ్రమించిందని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మండిపడ్డారు. ప్రచారంలో తన భర్త పాల్గొనలేదని, తన కుటుంబంపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆమె అన్నారు. ప్రజలు ఛీత్కరించినా వేదికలు ఎక్కి మాట్లాడటం వర్ల రామయ్యకు సరికాదని ఆమె విమర్శించారు. పోలీసు ఉద్యోగం నుంచి ఆయన ఎందుకు వీఆర్ఎస్ తీసుకున్నారో సమాధానం చెప్పాలని కల్పన డిమాండ్ చేశారు. తన అవినీతిని కప్పిపుచ్చుకోడానికే ఆయనిలా చేయలేదా అని ప్రశ్నించారు. అసైన్డ్ భూములను కబ్జా చేసి లక్షల రూపాయలు దండుకున్న ఘనత రామయ్యదని ఆమె అన్నారు. దళిత ఎమ్మెల్యేనైన తనను ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి వేధిస్తున్నారని వాపోయారు. వర్ల రామయ్యపై తాను మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తానని, ఆయన అవినీతి బాగోతంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని హెచ్చరించారు. -
'పురందేశ్వరికి కాంగ్రెస్ వాసన పోలేనట్టుంది'
విజయవాడ: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఆంధ్రప్రదేశ్ లో పాలన సాగుతోందని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకుడు వర్ల రామయ్య తప్పుబట్టారు. బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... పురందేశ్వరికి ఇంకా కాంగ్రెస్ వాసన పోలేనట్టుందని ఆయన ఎద్దేవా చేశారు. ఐదేళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన పురందేశ్వరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. కేంద్రం, రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన నడుస్తోందన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై ఎస్ఐ వీరంగం
కృష్ణా: ఇటీవల పలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై భౌతిక దాడులకు దిగుతున్నారు. శనివారం కృష్ణా జిల్లాలోని పెదపాయపూడి మండలం వానపాములలో వైఎస్సార్సీపీ కార్యకర్తపై ఓ ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తను బసవయ్యను ఎస్ఐ సోమేశ్వరరావు చితకబాదారు. దాంతో మనస్తాపం చెందిన బసవయ్య పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇదిలాఉండగా, టీడీపీ నేత వర్ల రామయ్య ప్రోద్బలంతోనే ఎస్ఐ దాడులు చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. -
‘వర్ల’ వస్తే జన్మభూమిని అడ్డుకుంటాం
రిమ్మనపూడి(పామర్రు) : ప్రజాప్రతినిధి, అధికారులను కాదని టీడీపీ నాయకుడు వర్ల రామయ్యను వేదికపైకి ఆహ్వానిస్తే ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాలను అడ్డుకుంటామని స్థానిక ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన హెచ్చరించారు. మండలంలోని రిమ్మనపూడి గ్రామంలో సోమవారం జన్మభూమి కార్య క్రమం జరిగింది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేయకుండానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంల్రు కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ, రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి వెళ్లిపోయారు. దీంతో లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వెంటనే స్పందించి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జన్మభూమిలో ప్రొటోకాల్ పాటించాలని, సంబంధం లేని వారిని వేదికపైకి ఆహ్వానించవద్దని అధికారులకు సూచించారు. ఎటువంటి సంబంధం లేకపోయినా జన్మభూమి కార్యక్రమంలో వర్ల రామయ్య పాల్గొంటున్నారని విమర్శించారు. ఆయన పాల్గొనడాన్ని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తే వారిని బయటకు పంపాలని వర్ల రామయ్య పోలీసులను ఆదేశించడం విడ్డూరంగా ఉందన్నారు. కొన్నిచోట్ల వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడులకు దిగడం దారుణమన్నారు. సీఎం చద్రబాబు మాటలను కూడా ధిక్కరిస్తున్న వర్ల రామయ్య వల్ల జన్మభూమి కార్యక్రమంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు. ఇప్పటికైనా మంత్రులు, టీడీపీ నాయకులు స్పందించి వర్ల రామయ్యను జన్మభూమిలో పాల్గొనకుండా చూడాలని హితవుపలికారు. ఎంపీడీవో రామనాథం టీడీపీ నాయకులతో కలిసి సభాస్థలి నుంచి వెళ్లిపోవడంపై కల్పన ఆగ్రహం వ్యక్తంచేశారు. వృద్ధురాలికి గాయం.. పరామర్శించిన ఎమ్మెల్యే జన్మభూమి సందర్భంగా జరిగిన తోపులాటలో తులశమ్మ అనే వృద్ధురాలిపై పలువురు పడిపోయారు. ఆమె కాలికి గాయమైంది. స్థానిక వైద్యులు చికిత్స చేశారు. తులశమ్మను ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పరామర్శించి పింఛను సొమ్ము రూ.1,000ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు బీవీ రాఘవులు, కొలుసు ఆదిలక్ష్మి పాల్గొన్నారు. -
తీరు మార్చుకోని వర్ల రామయ్య
విజయవాడ: పార్టీ అధినేత హెచ్చరించినా టీడీపీ నాయకుడు వర్ల రామయ్య తీరు మారలేదు. అతిగా ప్రవర్తించి వివాదాలు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా కృష్ణా జిల్లా పామర్రు మండలం రెబ్బనపూడిలో ఆయన వివాదానికి కారణమయ్యారు. జన్మభూమి కార్యక్రమంలో ఆయన చేసిన హడావుడితో వివాదం రేగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అంతకుముందు కనుమూరు గ్రామంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో హడావుడి చేయడంతో వర్ల రామయ్యకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. పార్టీకి చెడ్డ పేరు తీసుకురావొద్దని హెచ్చరించారు. -
వర్ల రామయ్యపై చంద్రబాబు ఫైర్
విజయవాడ: టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్యపై ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆదివారం ఫైర్ అయ్యారు. పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దంటూ వర్ల రామయ్యకు క్లాస్ పీకారు. నిన్న కనుమూరులో చోటు చేసుకున్న ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని వర్ల రామయ్యను చంద్రబాబు హెచ్చరించారు. శనివారం కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలోని కనుమూరు గ్రామంలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదికపై టీడీపీ నేత వర్ల రామయ్య తెగ హడావుడి చేశారు. దీంతో అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకురాలు ఉప్పులేటి కల్పన ఏ హోదాతో వేదిక ఎక్కారని రామయ్యను ప్రశ్నించారు. దీంతో నన్నే ప్రశ్నిస్తావా అంటూ రామయ్య హడావుడి చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉంది మా ప్రభుత్వం. నేనే కేవలం 1000 ఓట్ల తేడాతో ఓడిపోయాను. అది గుర్తుంచుకో అంటూ.. హెచ్చరించారు. అంతేకాదు రేపోమాపో నీవు కూడా మా పార్టీలోకే రావాల్సిందేనన్నారు. రామయ్య మాటలకు ఆగ్రహించిన కల్పన అనవసర వ్యాఖ్యలు చేయొద్దంటూ రామయ్యకు హితవు పలికారు. ఇటీవల పామర్రు శాసన సభకు జరిగిన ఎన్నికల్లో వర్ల రామయ్యపై ఉప్పులేటి కల్పన విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
నేను ఓడిపోయినా... ఇది మా ప్రభుత్వం
విజయవాడ: కృష్ణా జిల్లా పామర్రు మండలం కనుమూరులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం వేదికగా స్థానిక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఉప్పులేటి కల్పన, టీడీపీ నేత వర్ల రామయ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వివరాలు .... శనివారం కనుమూరు గ్రామంలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదికపై టీడీపీ నేత వర్ల రామయ్య తెగ హడావుడి చేస్తున్నారు. దీంతో అక్కడే కల్పన ఏ హోదాతో వేదిక ఎక్కారని రామయ్యను ప్రశ్నించారు. దీంతో నన్నే ప్రశ్నిస్తావా అంటూ రామయ్య హడావుడి చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉంది మా ప్రభుత్వం. నేనే కేవలం 1000 ఓట్ల తేడాతో ఓడిపోయాను. అది గుర్తుంచుకో అంటూ.. హెచ్చరించారు. అంతేకాదు రేపోమాపో నీవు కూడా మా పార్టీలోకే రావాల్సిందేనని అన్నారు. రామయ్య మాటలకు ఆగ్రహించిన కల్పన అనవసర వ్యాఖ్యలు చేయొద్దంటూ రామయ్యకు హితవు పలికారు. ఇటీవల పామర్రు శాసన సభకు జరిగిన ఎన్నికల్లో వర్ల రామయ్యపై ఉప్పులేటి కల్పన విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
‘వర్ల’ ఆగడాలు అరికట్టండి
మచిలీపట్నం : టీడీపీ నాయకుడు వర్ల రామయ్య ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయని, అరికట్టాలని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మంగళవారం రాత్రి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పామర్రు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన వర్ల రామయ్య.. ఆయనకు ఓటు వేయలేదని ప్రజలను వేధిస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు నిర్వహించే సమీక్షా సమావేశాల్లో పాల్గొని పెత్తనం చెలాయిస్తున్నారని చెప్పారు. ఇటీవల జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆమె వివరించారు. పోలీసులు సైతం ఆయనకు వత్తాసు పలుకుతున్నారని వివరించారు. ఎమ్మెల్యేనంటూ బెదిరింపులు.. ఎన్నికల్లో ఓటమిపాలైన వర్ల రామయ్య తానే నియోజకవర్గానికి ఎమ్మెల్యేనని, టీడీపీ అధికారంలో ఉందని, అధికారులు తన మాట వినకుంటే మంత్రులతో చెప్పి బదిలీ చేయిస్తానని బెదిరింపులకు దిగుతున్నారని కల్పన తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి టీడీపీకి విరాళాలు ఇవ్వాలని, లేకపోతే ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తున్నారని, దీంతో భయపడిన అధికారులు సెలవుపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. వైఎస్సార్ సీపీకి ఓట్లు వేసిన వారి జాబితాను రూపొందించుకుని, వారు నియోజకవర్గంలో ఉండకూడదని బాహాటంగానే హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. ఇసుక క్వారీలు తెరిపించండి పామర్రు నియోజకవర్గ పరిధిలోని తోట్లవల్లూరు, పమిడిముక్కల మండలాల్లో ఉన్న తొమ్మిది ఇసుక క్వారీలను తెరిపించాలని కలెక్టర్కు ఉప్పులేటి కల్పన వినతిపత్రం అందజేశారు. ఇసుక క్వారీలను తెరిస్తే నియోజకవర్గానికి ఆదాయం వస్తుందని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక తక్కువ ధరకే లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇసుక క్వారీలకు వేలంపాట నిర్వహించేందుకు నూతన పాలసీని తయారు చేస్తోందని చెప్పారు. ఈ నిబంధనల ప్రకారం ఇసుక క్వారీలకు అనుమతులు ఇస్తామని తెలిపారు. వర్ల రామయ్య విషయంపై మాట్లాడుతూ పామర్రు నియోజకవర్గంలోని అందరు అధికారులకు ఈ అంశంపై తగు సూచనలు, సలహాలు ఇస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ను కలిసిన వారిలో మొవ్వ, పెదపారుపూడి జెడ్పీటీసీ సభ్యులు చిమటా విజయశాంతి, మూల్పూరి హరీష, తోట్లవల్లూరు ఎంపీపీ కళ్లెం వెంకటేశ్వరరెడ్డి, పామర్రు సర్పంచ్ దేవరకొండ రోహిణి, పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు ఉన్నారు. -
'మహానాడు.. తెలుగుదేశం నేతల పండుగ'
హైదరాబాద్ : మహానాడు తెలుగుదేశం నేతల పండుగ అని ఆపార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ 1983 నుంచి మహానాడును టీడీపీ ఆనవాయితీగా జరుపుకుంటోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న్టట్లు వర్ల రామయ్య అన్నారు. కాగా తెలుగుదేశం మహానాడును పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడును మరోసారి ఎన్నుకోవటం వరకే పరిమితం చేయనున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో హైదరాబాద్ గండిపేటలో జరగనున్న మహానాడులో పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకునే అవకాశాలు లేవని సమాచారం. వచ్చే నెల రెండో తేదీ నుంచి రాష్ట్రం రెండుగా విడిపోనుంది. దీంతో రెండు రాష్ట్రాలకు అధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉంది. అయితే ఈ మహానాడులో రెండు రాష్ట్రాలకు విడివిడిగా అధ్యక్షులను ఎన్నుకోకుండా పార్టీ అధ్యక్షుడి గా చంద్రబాబును మాత్రమే ఎన్నుకుంటారని తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతానికి సాధారణ ఎన్నికల సమయంలో ఒక కమిటీని నియమించారు. ప్రస్తుతానికి ఆ కమిటీనే యధాతథంగా కొనసాగించనున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారంగా ఉంది.