Crop insurance
-
బీమా ధీమా లేదు
సాక్షి, హైదరాబాద్: మనదేశంలో వ్యవసాయం అంటే ప్రకృతితో జూదం ఆడినట్లే.. కష్టపడి పండించిన పంట చేతికందుతుందన్న గ్యారంటీ లేదు. అందుకే ప్రభుత్వాలు రైతుల పంటలకు బీమా సౌకర్యం కల్పిస్తాయి. కానీ, రాష్ట్రంలో బీమా పథకాలు లేకపోవటం, కేంద్ర ప్రభుత్వ బీమా పథకంలో రాష్ట్రం చేరకపోవటంతో ప్రకృతి వైపరీత్యాలతో పంటలు కోల్పోయిన రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇటీవల పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలకు 11,298 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖనే అధికారికంగా తేల్చింది. 13 జిల్లాలలోని 64 మండలాలలో 6,670 ఎకరాలలో వరి, 4,100 ఎకరాలలో మొక్కజొన్న, 309 ఎకరాలలో మామిడి, ఇతర పంటలు దెబ్బతిన్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. నష్టంపై నివేదిక వచ్చిన తరువాత పరిహారం చెల్లిస్తామని చెప్పారు కానీ.. ఎప్పటిలోగా రైతులను ఆదుకుంటారో చెప్పలేదు. గతంలో కూడా పంట నష్టం జరిగినప్పుడు ఇలాంటి ప్రకటనలే వచ్చాయి. కానీ, రైతులకు పైసా అందలేదు. ఈ నేపథ్యంలో పంటల బీమాపై మరోసారి చర్చ మొదలైంది. పదేళ్లుగా రైతులకు నిరాశే.. రైతులకు పంటల బీమా అందించే ‘జాతీయ వ్యవసాయ బీమా పథకం’(ఎన్ఏఐఎస్).. కేంద్ర ప్రభుత్వ రా్రïÙ్టయ కృషి బీమా యోజన (ఆర్కేబీవై) కింద 2016 వరకు అమలులో ఉండేది. ఈ పథకాన్ని కేంద్రం 1999–2000లో ప్రవేశపెట్టింది. 2016లో కేంద్రం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం (పీఎంఎఫ్బీవై) తీసుకొచ్చింది. కానీ, ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రం చేరలేదు. కేంద్ర బీమా పథకం ప్రీమియం ఎక్కువ, వచ్చే పరిహారం తక్కువ అని చెప్పిన అప్పటి సీఎం కేసీఆర్.. అంతకంటే మంచి పథకాన్ని తెస్తామని చెప్పారు. 2018 నుంచి రైతుబంధు అమలు చేయటంతో ఇక బీమా జోలికి పోలేదు. ఎప్పుడైనా ప్రకృతి వైఫరీత్యాలతో రైతులు నష్టపోతే ఆయా ప్రాంతాల్లో ఎకరాకు కొంత మొత్తాన్ని పరిహారంగా ఇచ్చే పద్ధతిని ప్రభుత్వం చేపట్టింది. ఇది కూడా గత పదేళ్లలో పెద్దగా అమలైన దాఖలాలు లేవు. ప్రభుత్వం మారినప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. మాటలు మాత్రమేనా? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో చేరనున్నట్లు తొలుత ప్రకటించింది. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లతో సమావేశం కూడా నిర్వహించారు. దీంతో బీమా పథకం అమలు చేస్తారని రైతులు ఆశించారు. కానీ, చివరికి ఆ హామీ నీటిమూటగానే మిగిలింది. కేంద్ర పథకంలో చేరలేదు.. రాష్ట్ర ప్రభుత్వం సొంత పథకం కూడా తీసుకురాలేదు. దీంతో పంటలు దెబ్బతింటే రైతులు నష్టపోవాల్సి వస్తోంది. సీఎం రేవంత్రెడ్డి పంటల బీమా అమలు చేస్తామని చెప్పినప్పటికీ, ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవలి అకాల వర్షాలకు 11,298 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారికంగా ప్రకటించినప్పటికీ, వాస్తవంగా అంతకు రెండింతల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. -
నమ్మించి నయ వంచన!
సాక్షి, అమరావతి : ఆచరణ సాధ్యం కాని హామీలతో అందలమెక్కిన టీడీపీ కూటమి ప్రభుత్వం అనుకున్నట్టుగానే అన్నదాతలకు మొండి చేయి చూపింది. ‘ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకుంటున్నారు. రైతులకు జగన్ కేవలం రూ.7,500 చొప్పునే ఇస్తున్నారు. మిగతా ఆరు వేలు కేంద్రమే ఇస్తోంది. అదే మాకు అధికారం ఇస్తే తొలి ఏడాది నుంచే ప్రతి రైతుకు మేమే రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తాం’ అంటూ ప్రజాగళంలో చంద్రబాబు గొప్పగా ప్రకటించారు. తీరా ఆచరణకు వచ్చేసరికి అన్నదాతలకు పంగనామాలు పెడుతున్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటూ.. వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించింది కేవలం నాలుగు శాతం మాత్రమే కావడం గమనార్హం. రూ.3.22 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేవలం రూ.12,401 కోట్లు కేటాయించడం పట్ల రైతుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది నవంబర్లో ప్రవేశపెట్టిన తొలి ఏడాది బడ్జెట్లో అన్నదాత సుఖీభవ పథకానికి మొక్కుబడిగా రూ.1,000 కోట్లు కేటాయించారు. ఓ వైపు వైపరీత్యాలు, మరోవైపు మార్కెట్లో ధరలు లేక తీవ్రంగా నష్టపోయిన తమకు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం ఎంతో కొంత ఊరటనిస్తుందని రైతులు ఆశగా ఎదురు చూశారు. కానీ పగ్గాలు చేపట్టి తొమ్మిది నెలలు గడిచినా తొలి ఏడాదికి సంబంధించి పైసా పెట్టుబడి సాయం విదిల్చ లేదు. వాస్తవానికి రాష్ట్రంలో రైతు భరోసా లబి్ధదారులు 53,58,368 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున జమ చేయాలంటే బడ్జెట్లో రూ.10,717 కోట్లు కేటాయించాలి. కానీ కేటాయించింది కేవలం రూ.6,300 కోట్లే. ఈ మొత్తం రూ 20 వేల చొప్పున అర్హులైన రైతులకు చెల్లిస్తే కేవలం 31.50 లక్షల మందికి మాత్రమే సరిపోతుంది. అంటే వాస్తవ లబ్ధిదారుల్లో 22.08 లక్షల మందికి పెట్టుబడి సాయం అందదు. మరో పక్క కౌలు రైతులకు తామే పూర్తిగా పెట్టుబడి సాయం అందిస్తామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. పెట్టుబడి సాయంలో ఇలా రూ.4,417 కోట్ల మేర కోత పెట్టడం పట్ల రైతాంగం నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ఆర్ఎస్కేలు, అగ్రి ల్యాబ్ల నిర్వహణకు కేటాయింపులు నిల్ ఆర్బీకే, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ల నిర్వహణకు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఆర్బీకేలను కుదించాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం అగ్రి ల్యాబ్లను పీ–4 పద్దతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నామని ఇటీవలే ప్రకటించింది. అందువల్లే వీటి నిర్వహణకు కేటాయింపులు జరపలేదనే వాదన విని్పస్తోంది. ధరల స్థిరీకరణ నిధికి వైఎస్ జగన్ హయాంలో రూ.3 వేల కోట్లు కేటాయిస్తే, చంద్రబాబు ప్రభుత్వం రూ.300 కోట్లు విదిల్చింది. విపత్తుల బారిన పడి పంటలు నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు ప్రకృతి వైపరీత్యాల సహాయనిధి కింద గత జగన్ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు కేటాయిస్తే, చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్లో పైసా కూడా కేటాయించ లేదు. విత్తన రాయితీ పథకానికి గతేడాది రూ.268 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది పెంచకపోగా రూ.240 కోట్లకు కుదించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాడి రైతులకు పశువుల మేత కోసం బంజరు భూముల కేటాయింపు కోసం నిధులు, గోపాల మిత్రల పునర్నియామకం ఊసే లేదు. రాయితీపై సోలార్ పంపు సెట్ల ఏర్పాటుకు కూడా నిధులు కేటాయించలేదు. రైతు కూలీలకు కార్పొరేషన్ స్థాపించి రాయితీలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న హామీ ప్రస్తావన లేదు. పట్టు పరిశ్రమకు 2023–24 బడ్జెట్తో పోల్చితే భారీగా కోత పెట్టింది. ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి, స్వచ్ఛంద బీమా నమోదు పథకం తీసుకొచ్చారు. ఈ పథకానికి రూ.1,023 కోట్లు మాత్రమే కేటాయించారు. గత ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా కోసం ఏటా రూ.1,700 కోట్లు కేటాయించారు. అలాగే వడ్డీ లేని పంట రుణాల కోసం వైఎస్ జగన్ సర్కారు హయాంలో ఏటా రూ.500 కోట్లు కేటాయించగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని సగానికి సగం తగ్గించింది. కేవలం రూ.250 కోట్లు మాత్రమే కేటాయించింది. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించడం వల్ల ఖరీఫ్ 2024–25 లో 69.51 లక్షల ఎకరాలకు బీమా కవరేజ్ పొందగా, స్వచ్ఛంద బీమా నమోదు పథకాన్ని అమలు చేయడంతో రబీ 2024–25 సీజన్లో కేవలం 7.65 లక్షల మంది రైతులు 9.93 లక్షల ఎకరాలకు మాత్రమే కవరేజ్ పొందగలిగారు. గడిచిన రబీ సీజన్తో పోల్చుకుంటే మూడో వంతు రైతులకు కూడా రక్షణ లేకుండా పోయింది. పాత లబ్దిదారులకే వేట నిషేధ భృతిగద్దెనెక్కగానే వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారునికి రూ.20 వేల చొప్పున వేట నిషేధ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. 2024–25 సీజన్కు 1,30,128 మంది అర్హత పొందగా, వారికి రూ.260.26 కోట్లు జమ చేయాల్సి ఉంది. కాని ఏడాది గడిచినా పైసా విదల్చలేదు. అనర్హులున్నారంటూ రీ సర్వే పేరిట అర్హులను తొలగించి, తమ పార్టీ సానుభూతిపరులను చేర్చి 1,22,968 మంది అర్హత పొందినట్టుగా లెక్క తేల్చారు. వారికి రూ.245.94 కోట్లు జమ చేయాలని ప్రతిపాదనలు పంపారు. అదే విషయాన్ని బడ్జెట్లో ప్రస్తావించారు. కానీ 2025–26 సీజన్లో వేటకు వెళ్లే మత్స్యకారులకు నిషేధ భృతి కోసం కేటాయింపులు జరపక పోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఆక్వా, నాన్ ఆక్వాజోన్తో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్ విద్యుత్ రూ.1.50కే సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అర్హత కలిగిన 68,134 ఆక్వా కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ విస్తరిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ ఆ మేరకు కేటాయింపులు జరపలేదు. ఎప్పటిలోగా అమలు చేస్తామన్న స్పష్టతా ఇవ్వలేదు. మరో వైపు ఆక్వా రైతులకు సబ్సిడీపై ఏరియేటర్స్, సబ్సిడీపై ట్రాన్స్ ఫార్మర్స్ ఏర్పాటు, కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణం వంటి హామీలపై పైసా కేటాయింపు జరపక పోవడంపై ఆక్వా రైతులు మండిపడుతున్నారు. మత్స్య యూనివర్సిటీకి మొండి చేయి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంతో పాటు వైఎస్సార్ ఉద్యాన, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయాలకు అరకొరగానే కేటాయింపులు జరిపారు. ఆంధ్రప్రదేశ్ మత్స్య యూనివర్సిటీకి కేవలం రూ.38 కోట్లు మాత్రమే కేటాయించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీకీ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో 400 ఎకరాల్లో రూ.332 కోట్ల అంచనాతో భవన నిర్మాణాలకు ప్రతిపాదించారు. రూ.100 కోట్లతో పరిపాలన భవనం, అకడమిక్ బ్లాక్, బాలుర, బాలికల హాస్టల్స్, రైతు శిక్షణా కేంద్రం, వైస్ చాన్సలర్ బంగ్లా నిర్మాణ పనులు చేపట్టారు. ఈ వర్సిటీకి గతేడాది పైసా ఖర్చు చేయలేదు. ఈ ఏడాది పైసా కేటాయింపులు జరపలేదు. మరోవైపు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ జెట్టీల నిర్మాణానికి సైతం పైసా కేటాయించలేదు. దీంతో వీటి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. -
అన్నదాత ఆక్రందన
(పంపాన వరప్రసాదరావు – సాక్షి, అమరావతి/నెట్వర్క్) : చంద్రబాబు పాలన అంటేనే కరువు కాటకాలకు పుట్టినిల్లంటారు! అన్నదాతలు భయపడినట్లుగానే టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది మొదలు ఓవైపు కరువు.. మరోవైపు తుపాన్లు, వరదలు, అకాల వర్షాలు.. ఒకటేమిటి వరుస వైపరీత్యాలతో రైతన్నలు హతాశులయ్యారు! ఇక ఎటు చూసినా కల్తీలు రాజ్యమేలుతున్నాయి. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో తెగుళ్లు, చీడపీడలు విజృంభించి దిగుబడులు దిగజారిపోయాయి. చివరికి చేతికొచ్చిన పంటకూ మద్దతు ధర దక్కక విలవిల్లాడి పోతున్నారు. మిర్చి నుంచి టమాటా వరకు.. ధాన్యం నుంచి కంది దాకా ఏ పంట చూసినా మద్దతు ధర లభించక.. పెట్టుబడి ఖర్చులూ దక్కక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రధాన పంటలకూ మద్దతు ధర దక్కని దుస్థితి నెలకొన్నా.. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద టన్ను కాదు కదా.. కనీసం క్వింటా పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసిన పాపాన పోలేదు. అన్నదాతా సుఖీభవ పెట్టుబడి సాయం లేదు.. కరువు సాయం లేదు.. పంట నష్ట పరిహారం జాడ లేదు... పంటల బీమా రక్షణ లేదు... వెరసి ‘కాల కూటమి’ పాలనలో రైతన్నల బతుకు దుర్భరంగా మారింది!16 లక్షల ఎకరాలు సాగుకు దూరంఈ దఫా ఖరీఫ్ సాగు లక్ష్యం 85.65 లక్షల ఎకరాలు కాగా, అతికష్టమ్మీద 70 లక్షల ఎకరాల్లోపు పంటలు సాగయ్యాయి. దాదాపు 16లక్షల ఎకరాలు సాగుకు దూరమయ్యాయి.ప్రకృతి వైపరీత్యాలతో 10 లక్షల ఎకరాల్లో పంట తుడిచి పెట్టుకుపోయింది. రాయలసీమలో దాదాపు వందకు పైగా మండలాలు కరువు కోరల్లో చిక్కుకోవడంతో సుమారు10 లక్షల ఎకరాలు బీడువారి పోయాయి. మొక్కుబడిగా 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం మినహా ప్రభుత్వం పైసా పరిహారం విదిల్చలేదు. 14.80 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన వేరుశనగ కేవలం 6.75 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఆరు లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన మిరప 3.72 లక్షల ఎకరాల్లోనే పరిమితమైంది.కాకి లెక్కలతో రైతు నోట్లో మట్టికష్టకాలంలో రైతన్నకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం కాకి లెక్కలతో వారి నోట్లో మట్టికొట్టింది. సూపర్సిక్స్లో ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సాయంలో పైసా విదిల్చిన పాపాన పోలేదు. ఖరీఫ్–23లో 2.37లక్షల మందికి చెల్లించాల్సిన రూ.164.05 కోట్లతోపాటు రబీ–2023–24 సీజన్లో 1.54 లక్షల మందికి జమ కావాల్సిన రూ.163.12 కోట్ల కరువు బకాయిలు ఊసెత్తడం లేదు. చివరకు గత జూలైలో కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన 32 వేల మందికి రూ.31.53 కోట్లు నేటికీ జమ చేయలేదంటే రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో తేటతెల్లమవుతోంది.ఎరువులకూ దిక్కు లేదు..ఎరువుల కొరత రైతులను అడుగడుగునా వేధించింది. చంద్రబాబు పాలనలో ఆనవాయితీగా రైతులు మండల కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తూ బస్తాపై రూ.100–400 వరకు వసూలు చేస్తూ డీలర్లు అందినకాడికి దోచుకుంటున్నారు. పుండుమీద కారం చల్లినట్టుగా కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు బస్తాకు రూ.255 వరకు పెంచాయి. నాసిరకం ఎరువుల నిర్వాకం సాక్షాత్తూ పౌరసరఫరాల మంత్రి తనిఖీల్లోనే బట్టబయలైంది.దిగజారిన దిగుబడులు.. దక్కని మద్దతుధాన్యం సహా ఈ ఏడాది ప్రధాన పంటల దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. సాధారణంగా దిగుబడులు తగ్గినప్పుడు మార్కెట్లో మంచి రేటు పలకాలి. కానీ ఈ ఏడాది ఏ పంటకూ కనీస మద్దతు ధర దక్కని దుస్థితి నెలకొంది. ఏటా ముందస్తు ధరలను అంచనా వేసే ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్కెటింగ్ కేంద్రం సైతం ఈ ఏడాది ఖరీఫ్ పంట ఉత్పత్తులకు ఆశించిన ధరలు లభించడం లేదని తేల్చి చెప్పింది. అధిక వర్షాలతో పంట నాణ్యత దెబ్బతినడంతో పాటు గోదాముల్లో పేరుకున్న నిల్వల కారణంగా మిరప, పత్తి ధరలు దారుణంగా క్షీణించాయని తేల్చింది.రూ.20,000 సూపర్ సిక్స్లో ఇస్తామని ఎగ్గొట్టిన పెట్టుబడి సాయం 2019–24 మధ్య విత్తనాలు, ఎరువులకు ఇబ్బంది పడని రైతులు.. కూటమి పాలనలో పడరాని కష్టాలు పడుతున్నారు. రైతు సేవా కేంద్రాల్లో నాన్ సబ్సిడీ విత్తనాల సరఫరా నిలిచిపోయింది. సబ్సిడీ విత్తనాలు అరకొరగానే ఇచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏటా సగటున 4 లక్షల టన్నుల ఎరువులను సరఫరా చేస్తే.. కూటమి సర్కారు మాత్రం చేతులెత్తేసింది. కృత్రిమ కొరత సృష్టిస్తూ బస్తాపై వంద నుంచి 400 వరకు డీలర్లు దండుకున్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధర బస్తాకు రూ.250 వరకు పెంపుతో రైతులకు పెనుభారంగా మారింది.» కనీస మద్దతూ కరువు» ధాన్యం బస్తాకు దక్కాల్సింది రూ.1,725 » దళారులు చెల్లిస్తున్నదిరూ.1,350–రూ.1,550 టమాట మీద నిలవని మంత్రి అచ్చెన్న టమాట పంట ధరలు పతనమై అన్నదాతలు గగ్గోలు పెట్టగా.. కిలో రూ.8కి కొంటామని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తర్వాత డబ్బుల్లేవని మాట మార్చారు. మార్కెట్లో టమాట ప్రస్తుతం కిలో రూ.20 ఉంది. రైతులకు దక్కుతున్నది రూ.3నుంచి రూ.5. మిర్చి, పత్తి మినుముధరల పతనం2023–24 సీజన్లో క్వింటా రూ.21 వేల నుంచి రూ.27 వేలు పలికిన మిర్చి... ప్రస్తుతం సగటున రూ.8 వేలు–రూ.11 వేలు కూడా లేదు. నిరుడు పత్తి క్వింటా రూ.10 వేలకు పైగానే పలకగా.. నేడు రూ.4 వేల నుంచి రూ.5,800కు పరిమితమైంది. మినుముల ధర గత సీజన్ లో క్వింటా రూ.10 వేలు ఉండగా.. ఇప్పుడు రూ.6 వేల నుంచి రూ.7,000 మాత్రమే.నిరుడు దిలాసా.. నేడు లాస్ డ్రాగన్ ఫ్రూట్ టన్ను నిరుడు రూ.1.80 లక్షలు పలకగా, నేడు రూ.1.20 లక్షలకు పడిపోయింది. అరటి రూ.25 వేలు, ద్రాక్ష రూ.40 వేలు, బొప్పాయి రూ.11 వేలు, పుచ్చకాయలు రూ.7 వేలు, కర్బూజా రూ.12 వేలకు మించడం లేదు. దిగుబడి లేక దిగాలు.. పరిహారం అందక కుదేలు2.80 ఎకరాల్లో వరి సాగు చేశా. తుపాన్తో రూ.50 వేలకు పైగా నష్టపోయా. పైసా కూడా పరిహారం ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం మా మండలంలో ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఎకరాకు రూ.5వేలు నష్టపోతున్నా. – భాస్కర్, పీవీ పురం, సత్యవేడు మండలం, తిరుపతి జిల్లాఎకరాకు రూ.లక్ష నష్టంఖరీఫ్లో ఆరు ఎకరాల్లో మిరప వేశా. ఎకరానికి రూ.లక్షన్నర వరకు ఖర్చుపెట్టా. బొబ్బర తెగులుతోపంట దెబ్బతింది. ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చేలా కనిపించడం లేదు. నిరుడు క్వింటా రూ.20 వేలు వరకు ఉంటే ఈ ఏడాది రూ.10 వేలకు కూడా కొనేవారు లేరు. ఎకరానికి రూ.లక్ష వరకు నష్టం వాటిల్లుతోంది. మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది.– వెన్నపూసల జగన్మోహన్రెడ్డి, కాచవరం, కారంపూడి మండలం, పల్నాడు జిల్లా గత ఐదేళ్లూ బాగుంది..8 ఎకరాల్లో 1,500 చీనీ చెట్లు సాగు చేశా. కూలీలు, మందులు, ఇతర పెట్టుబడి కింద రూ.6.50 లక్షలు ఖర్చు చేశా. హెక్టారుకు 25 టన్నుల దిగుబడి ఆశిస్తే వాతావరణం దెబ్బకొట్టింది. 10 టన్నుల దిగుబడే వచ్చింది. గత నాలుగైదు సంవత్సరాలు మంచి వర్షాలు కురిశాయి. దిగుబడులు బాగా వచ్చాయి. టన్ను రూ.50 వేలకు తక్కువ కాకుండా ధర పలకడంతో లాభాలు ఆర్జించా. వైఎస్ జగన్ హయాంలో ఉచిత పంటల బీమా కింద పరిహారం రూపంలో కూడా లబ్ధి పొందా. – రైతు నాగన్న, ముకుందాపురం, గార్లెదిన్న మండలం, అనంతపురం జిల్లాపత్తి రైతు చిత్తురాష్ట్రంలో పత్తి సాధారణ విస్తీర్ణం 14.91 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 9.82 లక్షల ఎకరాల్లో సాగైంది. వరదలు, వర్షాలకు తోడు గులాబీ తెగులు ప్రభావంతో ఎకరాకు 4–6 క్వింటాళ్లకు మించిరాలేదు. గతేడాది క్వింటా రూ.10 వేలకు పైగా పలికిన పత్తి... ప్రస్తుతం గ్రేడ్ను బట్టి రూ.4 వేల నుంచి రూ.5,800 మించి పలకని పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాల్లో సైతం గరిష్టంగా క్వింటాకు రూ.6,500 మించి ధర లేదని రైతులు చెబుతున్నారు. పెసర పంటకు కేంద్రం మద్దతు ధర రూ.8,558 ప్రకటించినా, ప్రస్తుతం మార్కెట్లో రూ.6 వేల నుంచి రూ.6,500 మించి పలకడం లేదు. 2023–24లో క్వింటా రూ.10 వేలు పలికిన మినుముకు ఈ ఏడాది రూ.7 వేలకు మించి ధర లేదు. టమాటా రైతులకు తొలి కోత నుంచే కష్టాలు మొదలయ్యాయి. మార్కెట్లో కిలో రూ.20 పలుకుతున్నా రైతులకు మాత్రం రూ.3–5కు మించి దక్కడం లేదు. ధర లేకపోవడంతో చీని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏలూరు, పశ్చిమ, తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సాగయ్యే కోకో పంటకు ఈసారి ధర లేకుండా పోయింది. చామంతి గతేడాది కిలో రూ.130 పలుకగా, ప్రస్తుతం కిలో రూ.20–30కి మించని పరిస్థితి నెలకొంది.మిర్చి రైతు కంట్లో కారంమిరప రైతులు తెగుళ్లు, చీడపీడలతో ఆశించిన దిగుబడులు రాక, మార్కెట్లో గిట్టుబాటు «ధర లేక తీవ్రంగా నష్టపోయారు. 2023–24 సీజన్లో 5.92 లక్షల ఎకరాల్లో మిరప సాగవగా, 2024–25లో కేవలం 3.94 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఎకరాకు రూ.2.50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. జెమినీ వైరస్, నల్లతామర, ఇతర తెగుళ్ల ప్రభావంతో ఎకరాకు 10–15 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాని పరిస్థితి. 2023–24 సీజన్లో క్వింటా రూ.21 వేల నుంచి రూ.27 వేల వరకు పలకగా, ప్రస్తుతం సగటున క్వింటాకు రూ.8 వేల నుంచి రూ.11 వేలకు మించి రావడం లేదని రైతులు వాపోతున్నారు. వ్యాపారులంతా సిండికేట్గా మారి తేజ రకానికి క్వింటాకు రూ.8 వేల నుంచి రూ.12 వేలు.. లావు రకాలకు రూ.8 వేల నుంచి రూ.10 వేలు.. మధ్యస్థ రకాలకు రూ.10–11 వేలకు మించి ఇవ్వడం లేదు. తెల్లకాయలు గతంలో క్వింటా రూ.10వేలు నుంచి రూ.13 వేలు పలికితే ప్రస్తుతం రూ.3వేల నుంచి రూ.4 వేలకు మించి కొనడం లేదు. రాష్ట్రంలోని గిడ్డంగుల్లో 27 లక్షల బస్తాల నిల్వలు పేరుకుపోయాయి. గతంలో టీడీపీ హయాంలో 12 లక్షల టన్నుల మిరప ఎగుమతులు జరగగా వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా, రికార్డు స్థాయిలో 16.10 లక్షల టన్నులను ఎగుమతి చేయడం గమనార్హం.రైతు కష్టం..పశువుల పాలు టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి కూరగాయల మార్కెట్లో కిలో టమాటా ధర రూ.3 నుంచి రూ.5 మధ్య పలికింది. 27 నుంచి 30 కిలోల బరువున్న టమాటా ట్రే ధర రూ.100 నుంచి రూ.150 మాత్రమే. కూలి, రవాణా ఖర్చులు పోగా, రైతులకు ఒక్కో ట్రేకు రూ.70 కూడా మిగలడం లేదు.చివరికి ఆ ధరకు కూడా మంగళవారం కొనుగోలు చేసేవారు లేకపోవడంతో పలువురు రైతులు తాము తెచి్చన టమాటా పంటను మార్కెట్లోనే పశువులకు పారబోసి వెనుదిరిగారు. ఉద్యాన, కూరగాయల రైతులను ఆదుకుంటామని చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం పత్తా లేకుండా పోయిందని, తమకు కష్టాలు తప్పడంలేదని రైతులు వాపోయారు. – బొబ్బిలి నాడు ప్రతీ పంటకు ‘మద్దతు’ఎన్నికల హామీ మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. సీఎం యాప్ ద్వారా మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పతనమైన ప్రతిసారీ జోక్యం చేసుకుని వ్యాపారులతో పోటీపడి కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర దక్కేలా చేసింది. పొగాకు, పత్తి, పసుపుతో సహా సజ్జలు, కొర్రలు, రాగులు, శనగ, పెసలు, కంది, వేరుశనగ, జొన్నలు, ఉల్లి, టమాటా, బత్తాయి, అరటి రైతులకు అండగా నిలిచింది. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి వంటి పంటలకు సైతం ఎమ్మెస్పీని ప్రకటించి ఐదేళ్లూ ఆ ధరకు ఒక్క రూపాయి తగ్గకుండా చూసింది. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో 3.74 లక్షల మంది రైతుల నుంచి రూ.3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేస్తే.. 2019–24 మధ్య వైఎస్ జగన్ హయాంలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796.47 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేశారు.అంటే.. రెట్టింపు కన్నా అధికం. ఇక చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన 3,403 టన్నుల పత్తి, రూ.18 కోట్ల విలువైన 8,459.56 టన్నుల టమాటాను సైతం కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. ఖజానాలో సొమ్ములు లేకపోయినా..వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఖజానాలో రూ.100 కోట్లకు మించి డబ్బులు లేకున్నా పగ్గాలు చేపట్టిన తొలి రోజు నుంచే రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టారు. రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. శనగలు, మొక్కజొన్న, పత్తి, కందులు, పసుపు.. ఇలా తొలి ఏడాదిలోనే 14 రకాల ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు సేకరించారు. 3,76,902 మంది రైతుల నుంచి రూ.4354.11 కోట్ల విలువైన 11,02,105 టన్నుల పంట ఉత్పత్తులను సేకరించి చిత్తశుద్ధిని చాటుకుంది. -
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అస్తవ్యస్థంగా ఈ క్రాప్
-
ప్రీమియం భారం బీమాకు దూరం
సాక్షి, అమరావతి: గతేడాది ఇదే రబీ సీజన్లో పంటల బీమాలో నమోదైన రైతుల సంఖ్య ఏకంగా 43.82 లక్షలు.. మరిప్పుడు.. కేవలం 5.94 లక్షలు.. ఏడాదిలో ఎంత తేడా! లక్షల ఎకరాలు.. లక్షలాది మంది రైతన్నలు బీమా రక్షణకు దూరమై గాలిలో దీపంలా సాగు చేయాల్సిన దుస్థితి నెలకొంది.. గత ఐదేళ్లూ అన్నదాతలపై పైసా భారం పడకుండా డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఎక్కడా తిరగాల్సిన అవసరం లేకుండా ఈ–క్రాప్ ప్రామాణికంగా గ్రామంలోనే పని పూర్తయ్యేది. నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు నూరు శాతం యూనివర్శల్ కవరేజ్ కల్పిస్తూ పంటల బీమా కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకంతో ఉచితంగా లబ్ధి చేకూరేది. రైతన్నలు నిశ్చింతగా పొలం పనుల్లో నిమగ్నమైతే కావాల్సిన కాగితాలు.. మిగతా ప్రక్రియ విషయాన్ని గ్రామ సచివాలయాలు, వలంటీర్లు దగ్గరుండి చూసుకునేవారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో 54.55 లక్షల మంది రైతన్నలకు పంటలు నష్టపోతే రికార్డు స్థాయిలో రూ.7,802.05 కోట్లు పరిహారంగా అందచేసి సాగుకు అండగా నిలిచింది. ఇప్పుడు వరికి పంటల బీమా వర్తించాలంటే హెక్టార్కు రూ.1,575 చొప్పున రైతన్నలు తమ చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాలి. పనులు మానుకుని బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరగాలి. రోజుల తరబడి పడిగాపులు కాయాలి. అసలు బీమా పథకానికి ఎప్పటిదాకా గడువు ఉందో చెప్పేవారు లేక.. ఈ అవస్థలు భరించలేక.. డబ్బులు కట్టలేక ఎంతో మంది ఈ పథకానికి దూరమయ్యారు. టీడీపీ కూటమి సర్కారు నిర్వాకాలతో అన్నదాతలు అన్యాయమైపోయారు! ఐదేళ్ల పాటు పైసా భారం పడకుండా అమలైన ఉచిత పంటల బీమా పథకం ద్వారా పూర్తి స్థాయిలో రక్షణ పొందిన రైతన్నలంతా నేడు ప్రీమియం భారాన్ని భరించలేక, పంటల బీమా చేయించుకోలేక గగ్గోలు పెడుతున్నారు.బీమా కవరేజ్ విస్తీర్ణం 8.44 లక్షల ఎకరాలేరబీ–2024–25 సీజన్లో దిగుబడి ఆధారిత పంటల బీమా పథకం కింద 13 పంటలను, వాతావరణ ఆధారిత పంటల కింద 3 పంటలను నోటిఫై చేశారు. జీడి మామిడి పంటకు ప్రీమియం చెల్లింపు గడువు నవంబర్ 15వ తేదీతోనే ముగియగా వరి మినహా మిగతా వాటికి ఈ నెల 15తో గడువు ముగిసింది. వరితో పాటు ఇటీవలే నోటిఫై చేసిన మామిడి పంటకు ఈ నెల 31వతేదీతో గడువు ముగియనుంది. దిగుబడి ఆధారిత పంటల బీమా కింద నోటిఫై చేసిన సాగు విస్తీర్ణం 45.55 లక్షల ఎకరాలు కాగా వాతావరణ ఆధారిత పంటల బీమా కింద నోటిఫై చేసిన జీడిమామిడి, మామిడి, టమాటా పంటల సాగు విస్తీర్ణం 15 లక్షల ఎకరాలు.. అంటే రెండూ కలిపి 60.55 లక్షల ఎకరాల పైమాటే. కానీ ఇప్పటి వరకు పంటల బీమా కవరేజ్ పొందిన విస్తీర్ణం కేవలం 8.44 లక్షల ఎకరాలు మాత్రమే కావడం గమనార్హం. వీటిలో వాతావరణ పంటల బీమా కింద 24,550 ఎకరాలు, దిగుబడి ఆదారిత పంటల బీమా కింద 8.20 లక్షల ఎకరాలలో సాగైన పంటలకు మాత్రమే బీమా కవరేజ్ పొందగలిగారు. రైతుల పరంగా చూస్తే ఈ రబీలో కేవలం 5,94,336 మంది మాత్రమే బీమా చేయించుకోగలిగారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల బీమా తీరు ఎలా ఉందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. పంటల బీమా వర్తించాలంటే గరిష్టంగా హెక్టార్కు మామిడికి రూ.5,625, జీడి మామిడికి రూ.3,837.50, టమాటాకు రూ.3,775, వరికి రూ.1,575 చొప్పున బీమా ప్రీమియాన్ని చెల్లించాలి. ఇతర పంటలకూ అదే స్థాయిలో ప్రీమియం భారం పడుతోంది. ఇంత భారం భరించలేక పంటల బీమాకు దూరం అవుతున్నట్లు అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు.ఐదేళ్లు నూరు శాతం కవరేజ్మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్లూ ఈ – క్రాప్ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసిన పంటలకు ఉచితంగా నూరు శాతం పంటల బీమా కవరేజ్ కల్పించింది. రబీ 2023–24 సీజన్లో 37.80 లక్షల ఎకరాల్లో సాగైన నోటిఫైడ్ పంటలకు బీమా కవరేజ్ కల్పించడంతో 43.82 లక్షల మంది బీమా రక్షణ పొందగలిగారు. టీడీపీ కూటమి సర్కారు పగ్గాలు చేపట్టిన మరుక్షణమే రైతుల మదిలో వైఎస్ జగన్ ముద్రను చెరిపివేయాలనే అక్కసుతో ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేసింది. పంటల బీమా అమలులో రైతులను భాగస్వాములను చేస్తామని చెబుతూ పెనుభారం మోపింది. స్వచ్ఛంద నమోదు పద్థతిలో పంటల బీమాకు శ్రీకారం చుట్టింది. చివరకు అవగాహన కల్పించలేక చేతులెత్తేసింది.తుపాన్, అకాల వర్షాలతో ఇప్పటికే తీవ్ర నష్టం..పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును జనవరి నెలాఖరు వరకు పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం పట్టించుకోలేదు. దీంతో రబీ సీజన్ ప్రారంభంలో విరుచుకుపడిన ఫెంగల్ తుపాన్తో పాటు ఇటీవల అల్పపీడన ప్రభావంతో కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రబీ పంటలకు బీమా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. దురదృష్టవశాత్తూ సీజన్ ముగిసేలోగా మరేదైనా విపత్తు సంభవిస్తే తమ పరిస్థితి అగమ్యగోచరమేనని అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.పారదర్శకంగా పథకం..1965లో కేంద్రం రూపొందించిన క్రాప్ ఇన్స్రూెన్స్ బిల్లు ఆధారంగా తెచ్చిన మోడల్ ఇన్స్రూెన్స్ పథకం వివిధ రూపాలు మార్చుకుని 2016 నుంచి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై)గా అమలవుతోంది. దీని ప్రకారం నోటిఫై చేసిన వ్యవసాయ పంటలకు ఖరీఫ్లో 2 శాతం, రబీలో 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున ప్రీమియాన్ని రైతులు చెల్లించగా మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించేవి. అయితే ప్రీమియం భారం అధికంగా ఉండడం, ఆర్థిక ఇబ్బందులు, అవగాహన లేక రైతులు సొంతంగా బీమా చేయించుకునేందుకు ముందుకొచ్చేవారు కాదు. రుణాలు తీసుకుంటే మాత్రం బ్యాంకులు ప్రీమియం రూపంలో నిర్దేశిత మొత్తాన్ని మినహాయించుకునేవి. లక్షలాది మంది రైతన్నలు తాము పండించిన పంటలకు బీమా చేయించుకోలేకపోవడంతో విపత్తుల బారిన పడితే తీవ్ర నష్టాల పాలయ్యేవారు. గతంలో బీమా చేయించుకున్న వారు సైతం ఎంతొస్తుందో? ఎప్పుడొస్తుందో తెలియక ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉండేవి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ దుస్థితిని తొలగిస్తూ చర్యలు చేపట్టింది. ఈ క్రాప్తో పాటు ఈ కేవైసీ నమోదు పూర్తికాగానే ఉచిత పంటల బీమా పధకం వర్తించే నోటిఫై చేసిన పంటలను (స్టార్ గుర్తు) ప్రత్యేకంగా తెలియచేస్తూ రైతులకు భౌతిక రసీదులు అందచేసింది. డాక్టర్ వైస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద నోటిఫై చేసిన పంటకు మీరు చెల్లించాల్సిన ప్రీమియాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి పంటకు బీమా చేసినట్లు స్పష్టంగా తెలియజేసింది. ఈ జాబితాలను ఏటా సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించడమే కాకుండా అభ్యంతరాలను పరిష్కరించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకుంది. కూటమి సర్కారు వచ్చాక ఈ క్రాప్ అస్తవ్యస్థంగా మారింది. ఎవరు ఏ పంట సాగు చేశారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక పంటల బీమాలో నమోదు చేసేందుకు అవసరమైన సాగు పత్రాల కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు.బాబు హయాంలో అరకొరగా..2014–19 మధ్య టీడీపీ హయాంలో ఏటా సగటున 46 లక్షల ఎకరాల చొప్పున 2.32 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పించగా, ఏటా సగటున 14.88 లక్షల మంది చొప్పున 74.4 లక్షల మంది రైతులు ప్రీమియం కట్టి బీమా సదుపాయం పొందారు. నాడు హుద్హుద్, తిత్లీ లాంటి భారీ తుపాన్లు, 324 మండలాల్లో కరువు ప్రభావం వల్ల రూ.వేల కోట్ల విలువైన పంటలను కోల్పోయినా రైతులకు దక్కిన పరిహారం అరకొరే. 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్లు మాత్రమే బీమా పరిహారం దక్కింది.జగన్ హయాంలో రికార్డు..2019–23 మధ్య వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా ఏటా 1.08 కోట్ల ఎకరాల చొప్పున 5.42 కోట్ల ఎకరాలకు ఉచిత పంటల బీమా సదుపాయాన్ని కల్పించింది. ఏటా సగటున 40.50 లక్షల మంది చొప్పున ఐదేళ్లలో 2.04 కోట్ల మంది రైతులకు బీమా రక్షణ కల్పిస్తూ చర్యలు తీసుకుంది. రైతుల తరపున వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3,022.26 కోట్లను బీమా కంపెనీలకు ప్రీమియం రూపంలో చెల్లించింది. ఇక ఐదేళ్లలో 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802.08 కోట్ల మేర బీమా పరిహారాన్ని అందచేసి ఆదుకుంది. అంతేకాకుండా 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో 6.19 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలు కూడా చెల్లించి అండగా నిలిచింది. టీడీపీ హయాంతో పోల్చితే అదనంగా 23.70 లక్షల మందికి రూ.4,390.88 కోట్ల మేర అదనంగా బీమా పరిహారం అందించి వైఎస్ జగన్ అన్నదాతలకు అండగా నిలిచారు.ప్రభుత్వమే చెల్లించాలి..నాకున్న 75 సెంట్ల పల్లపు భూమిలో వరి పండిస్తుంటా. 2021 సెప్టెంబరులో గులాబ్ తుపాను కారణంగా పంట నష్టపోతే నా బ్యాంకు ఖాతాకు ప్రభుత్వం రూ.4,650 జమ చేసి ఆదుకుంది. వైఎస్సార్సీపీ హయాంలో ఈ – క్రాప్లో నమోదైన ప్రతీ పంటకు బీమా వర్తించేది. ఇప్పుడు పంటల బీమా ప్రీమియాన్ని రైతులే చెల్లించాలని చెబుతున్నారు. ప్రీమియం భారాన్ని భరించలేక.. బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరగలేక, అవగాహన లేక చాలా మంది నష్టపోతున్నాం. రైతుల తరపున ప్రీమియాన్ని గతంలో మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి.– తమ్మిన సీతారమణ, రైతు, టి.నగరపాలెం, భీమిలి మండలం, విశాఖ జిల్లాప్రీమియం భారాన్ని మోయలేం..ప్రీమియం భారాన్ని భరించలేకనే రైతులు పంటల బీమాకు దూరమవుతున్నారు. వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు కనీసం మద్దతు ధర చెల్లించి ఆదుకోవడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అన్నదాతలు ఈ తరుణంలో ప్రీమియం చెల్లించి బీమా చేయించుకునే పరిస్థితిలో లేరు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి. – కోసూరి శివనాగేంద్ర, రైతు, పమిడిముక్కల మండలం, గడ్డిపాడు, కృష్ణా జిల్లాఉచిత బీమా కొనసాగించాలి..గత ఐదేళ్లూ రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకం ఎంతగానో ఆదుకుంది. స్వచ్ఛంద నమోదు పద్ధతి పేరుతో కూటమి ప్రభుత్వం తెచ్చిన పంటల బీమా వల్ల కౌలు రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది. గతంలో మాదిరిగా రైతుల తరపున ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి.– ఎం.హరిబాబు, ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శిఏటా రూ.900 కోట్లకుపైగా భారం..ప్రీమియం భారాన్ని భరించ లేకనే రాష్ట్రంలో రైతన్నలు పంటల బీమాకు దూరమయ్యారు. గత ఐదేళ్లు పైసా భారం పడకుండా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు పూర్తి స్థాయిలో బీమా కవరేజీ రైతులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. కూటమి సర్కారు కక్షకట్టినట్లు వ్యవహరిస్తూ ఉచిత పంటల బీమా పథకాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఏటా రూ.900 కోట్లకుపైగా అన్నదాతలపై భారాన్ని మోపడం దుర్మార్గం.–వడ్డి రఘురాం, వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్సార్ సీపీ రైతు విభాగం2021లో పైసా కట్టకుండా రూ.55 వేల పరిహారం..ఐదెకరాల్లో వరి సాగు చేస్తున్నా. ఖరీఫ్ 2021లో గులాబ్ తుపాను వల్ల మూడు ఎకరాల్లో పంట దెబ్బ తినడంతో రూ.55 వేల బీమా పరిహారం నా ఖాతాలో జమైంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ ప్రీమియం కింద పైసా చెల్లించలేదు. ప్రస్తుతం బీమా ప్రీమియాన్ని రైతులే చెల్లించాలని ఈ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది రైతులకు ఎంతో భారంగా ఉంది. మా తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఆదుకోవాలి. – ఎం.శ్రీనివాసరావు, రైతు, కేసీహెచ్ పల్లి, విజయనగరం జిల్లా -
సిబ్బందిపై పంటల బీమా భారం
సాక్షి, అమరావతి: పంటల బీమా అమలులో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. ప్రీమియం భారం భరించలేక పంటల బీమాలో తాము చేరలేమని రైతులు తెగేసి చెబుతుంటే.. ఎలాగైనా రైతులను చేర్పించాలంటూ రైతు సేవా కేంద్రాల సిబ్బంది (వీఏఏ)కి లక్ష్యాలను నిర్దేశించి మరి అధికారులు ఒత్తిడికి గురి చేస్తున్నారు. రైతులు కట్టలేమంటున్నారని చెబితే.. వారి తరఫున ఆ ప్రీమియం సొమ్ములు మీరే కట్టండంటూ అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు తట్టుకోలేక 15 రోజుల క్రితమే ఆళ్లగడ్డ మండలం జి.జంబులదిన్నె ఆర్ఎస్కే వ్యవసాయ అసిస్టెంట్ హరినాథ్రెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని గుర్తు చేస్తూ తమకూ ఇదే పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు.బీమా చేయాల్సింది 51.90 లక్షల ఎకరాలురబీ సాగు లక్ష్యం 57.50 లక్షల ఎకరాలు. నోటిఫై చేసిన పంటల సాగు విస్తీర్ణం 44.72 లక్షల ఎకరాలు, వీటికి అదనంగా బీమా పరిధిలోకి తీసుకొచ్చిన మామిడి విస్తీర్ణం మరో 7.18 లక్షల ఎకరాలు. అంటే బీమా చేయించాల్సిన విస్తీర్ణం 51.90 లక్షల ఎకరాలు. ఇప్పటివరకు సాగైన విస్తీర్ణం 18.50 లక్షల ఎకరాలు. దిగుబడి, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల కింద ఈ నెల 17వ తేదీ వరకు బీమా కవరేజీ పొందిన విస్తీర్ణం కేవలం 7,40,875 ఎకరాలు మాత్రమే. రైతులు పంటల బీమాకు ఏ స్థాయిలో ఆసక్తి చూపిస్తున్నారో ఈ గణాంకాలే చెబుతున్నాయి.వీఏఏలపై రైతుల ప్రీమియం భారంకేవలం వరి పంటకు మాత్రమే బీమా చేయించుకునేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. రబీలో 20.50 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. నోటిఫై చేసిన జిల్లాల పరిధిలో 15.77 లక్షల ఎకరాలు మాత్రమే బీమా కవరేజీ కల్పించాల్సి ఉండగా.. ఇప్పటివరకు కనీసం 10 శాతం విస్తీర్ణంలో కూడా బీమా కల్పించలేని దుస్థితి ఏర్పడింది. స్వచ్ఛందంగా ఈ పథకంలో చేరేందుకు రైతులెవరూ ముందుకు రాకపోవడంతో ఆ భారాన్ని వీఏఏలపై వేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్నెట్తో పాటు పాడిపంటలు మ్యాగజైన్ కోసం చందాలు చేర్పించేందుకు వీఏఏలకు చేతిచమురు వదిలిపోతోంది. ఇప్పుడు రైతుల తరఫున ప్రీమియం చెల్లించాలని ఒత్తిడి చేస్తే తాము బతికేదెలా అని వీఏఏలు ప్రశ్నిస్తున్నారు. ప్రీమియం భారం భరించలేక రైతులెవరూ పంటల బీమాపై ఆసక్తి చూపకపోవడంతో.. రోజుకు కనీసం 10 మందికి తక్కువ కాకుండా రైతులతో బీమా చేయించాల్సిందేనంటూ అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. చేసేది లేక ఉద్యోగాలను కాపాడుకునేందుకు రైతుల తరఫున ప్రీమియం కడుతున్నామని వీఏఏలు చెబుతున్నారు. ఈ నెలలో వచ్చిన జీతంలో మూడో వంతు మ్యాగజైన్స్కు, మిగిలిన మొత్తం ప్రీమియానికి చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రూ.2, రూ.3 వడ్డీలకు తెచ్చి మరీ కట్టాల్సి వస్తోందని చెబుతున్నారు. -
చంద్రబాబు మోసాలపై రైతుపోరు నేడే
సాక్షి, అమరావతి: రెండు సీజన్లు గడుస్తున్నా పెట్టుబడి సాయం రూ.20 వేలు అందక.. గిట్టుబాటు ధర దక్కక.. ఉచిత పంటల బీమా రద్దుతో ధీమా లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు వైఎస్సార్ సీపీ దన్నుగా నిలిచింది. అన్నదాతను దగా చేస్తున్న కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకున్న వైఎస్సార్సీపీ అన్ని జిల్లాల కేంద్రాల్లో శుక్రవారం రైతులతో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనుంది. అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించనున్నారు.కుడి, ఎడమల దగా..కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందుతుందని అన్నదాతలు ఆశించారు. అయితే రెండు వ్యవసాయ సీజన్లు గడిచిపోతున్నా కూటమి సర్కారు పైసా సాయం జమ చేసిన పాపాన పోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడి సాయం కింద రూ10,718 కోట్లు చెల్లించాల్సి ఉండగా బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లే విదిలించిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. మరోవైపు పంటల బీమా ప్రీమియం బకాయిలను ఎగ్గొట్టి రైతులకు దక్కాల్సిన రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారాన్ని అందకుండా చేసింది. సున్నా వడ్డీ రాయితీ కింద రూ.131.68 కోట్ల ఊసెత్తడం లేదు. రబీలో కరువు సాయం బకాయిలు రూ.319.59 కోట్లు ఎగ్గొట్టింది. ఖరీఫ్ ధాన్యాన్ని కొనే నాధుడు లేక రైతులు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్నెల్లలోనే రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. గత ఐదేళ్ల పాటు వెన్నుదన్నుగా నిలిచిన వైఎస్సార్ ఉచిత పంటల బీమాను కూటమి సర్కారు రాగానే అటకెక్కించడంతో ఆ భారం భరించలేక, బ్యాంకుల చుట్టూ తిరగలేక, అవస్థలు పడలేక అన్నదాతలు పంటల బీమాకు దూరమవుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఏకంగా 70 మంది వరకు రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడగా ఏ ఒక్కరికీ ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకోలేదు.రైతన్నకు బాసటగా జగన్..కూటమి ప్రభుత్వం దగా చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు వైఎస్ జగన్ దన్నుగా నిలిచారు. ప్రభుత్వంపై పోరాటానికి పిలుపునిచ్చారు. ఈమేరకు వైఎస్సార్సీపీ శ్రేణులు అన్ని జిల్లా కేంద్రాల్లో రైతులతో కలసి శుక్రవారం భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నాయి. టీడీపీ కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభంజనంలా కదిలి వచ్చేందుకు రైతన్నలు సన్నద్ధమయ్యారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని పేర్కొంటూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలను అందించనున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్న ప్రకారం రైతులకు పెట్టుబడి సాయంగా తక్షణమే రూ.20 వేలు అందించాలని కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు సమర్పించనున్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించాల్సిందేనని.. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. ధాన్యంలో తేమ శాతం లెక్కలతో రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. తక్షణమే ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని.. రైతులపై అదనపు భారం మోపే చర్యలను కూటమి ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేయనున్నారు.నాడు... చెప్పిన దాని కంటే మిన్నగారైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలను పెట్టుబడి సాయంగా అందిస్తానని నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే ఎవరూ అడగకపోయినా సరే ఆ సాయాన్ని రూ.13,500కి పెంచడమే కాదు.. ఐదేళ్లలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా రూ.67,500 అందజేశారు. చెప్పిన దాని కంటే మిన్నగా సాయం అందించి రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు. ఇక రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్శల్ కవరేజీ కల్పిస్తూ ఉచిత పంటల బీమాను అమలు చేశారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా అందించి రైతులకు అండగా నిలిచారు. పంట నష్ట పరిహారమైతే ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగానే రైతుల ఖాతాల్లో జమ చేశారు. సున్నా వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా నెలకొల్పిన ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన విత్తనాలు, నాన్ సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుల మందులను కూడా రైతుల ముంగిటికే అందించారు. లక్ష మందికి పైగా అభ్యుదయ రైతులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా సీజన్కు ముందుగానే పంటల ప్రణాళికలు రూపొందించి సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. రైతన్నలు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు, దళారీల ప్రమేయం లేకుండా కళ్లాల నుంచే నేరుగా కొనుగోలు చేశారు. ప్రతీ గింజకు కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా గన్నీ బ్యాగ్స్, లోడింగ్, రవాణా (జీఎల్టీ) భారాన్ని సైతం భరిస్తూ ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకొని మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను సేకరించి రైతన్నలకు ప్రతి అడుగులోనూ అండగా నిలిచారు. ఇలా వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019–24 మధ్య ఐదేళ్లలో అన్నదాతలకు ఏకంగా రూ.1,88,541 కోట్ల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు. -
రైతు కంట కన్నీరు
సాక్షి, అమరావతి: అన్నదాత కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పడరాని పాట్లు పడుతున్నారు. ఏటా సీజన్కు ముందే అందే పెట్టుబడి సాయం లేదు. ఉచిత పంటల బీమా అటకెక్కింది. పంటల బీమా పరిహారం జాడలేదు. కరువు సాయం ఊసే లేదు. సున్నా వడ్డీ రాయితీ లేదు. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందడం లేదు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలకు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కనీస మద్దతు ధర దక్కక రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టే దుస్థితి నెలకొంది. ప్రభుత్వ తీరుపై అన్నదాతలు కన్నెర్ర చేస్తున్నారు. ఓవైపు విత్తనాలు, ఎరువుల కోసం ధర్నాలు చేస్తున్నారు. మరోవైపు పండించిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆందోళన బాటపట్టారు. ఇటీవలే ధాన్యం రాశులతో మండల కేంద్రాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు డిమాండ్తో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగడం రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో ఆర్నెల్ల కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షోభంలో కూరుకుపోయిన రైతులకు అండగా వైఎస్సార్ సీపీ ఆందోళన బాటపట్టింది. ఈ నెల 13వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ఎదుట వైఎస్సార్ సీపీ తలపెట్టిన ఆందోళన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన వ్యక్తం చేసేందుకు రైతులు సన్నద్దమవుతున్నారు. అన్నదాతా.. ఎక్కడ సుఖీభవ? అధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తామంటూ సూపర్ సిక్స్లో ఇచి్చన హామీని చంద్రబాబు అటకెక్కించేశారు. గత ఐదేళ్లుగా వైఎస్సార్ రైతు భరోసా కింద లబ్ధి పొందిన 53.58 లక్షల మంది రైతులకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలంటే ఏటా రూ.10,718 కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో కేవలం రూ.వెయ్యి కోట్లు మాత్రమే విదిలించి చేతులు దులిపేసుకున్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ముగిసింది. రబీ సీజన్ ప్రారంభమై 40 రోజులు దాటింది. కేంద్రం రెండు విడతల్లో పీఎం కిసాన్ సాయం అందించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్క విడత కూడా పెట్టుబడి సాయాన్ని జమ చేసిన పాపాన పోలేదు. అన్నదాత సుఖీభవ కోసం విధివిధానాల రూపకల్పన కూడా జరగలేదు. పెట్టుబడిసాయం అందక, సకాలంలో రుణాలు దొరక్క గత రెండు సీజన్లలో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పంటల బీమాకు దూరం రైతులపై పైసాభారం పడకుండా ఐదేళ్ల పాటు నోటిఫై పంటలకు యూనివర్శల్ కవరేజ్ కల్పిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం అటకెక్కించేసింది. 2023–24 సీజన్కు సంబంధించి రైతులతో సహా రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి రూ.930 కోట్ల ప్రీమియం మొత్తాన్ని జమ చేయకపోవడం వల్ల ఆ సీజన్లో కరువు వల్ల పంటలు దెబ్బతిన్న దాదాపు 15 లక్షల మంది రైతులకు రూ.1,385 కోట్ల బీమా పరిహారం అందకుండా పోయింది. రబీ సీజన్ నుంచి స్వచ్ఛంద నమోదు పద్ధతిలో పంటల బీమా అమలు చేస్తుండడంతో ప్రీమియం భరించలేక రైతులు పంటల బీమాకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. రబీలో ఇప్పటి వరకు 16.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే బీమా కవరేజ్ పొందిన విస్తీర్ణం కేవలం 65 వేల ఎకరాలు మాత్రమే. ప్రీమియం భారం రైతుల నెత్తిన వేయడంతో ఈ సీజన్లో రూ.350 కోట్లకుపైగా భారం భరించలేక పంటల బీమాకు దూరమవుతున్నారు. కరువు సాయం అందక అగచాట్లు వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్–2023 సీజన్లో పంటలు నష్టపోయిన 8.89 లక్షల మంది రైతులకు రూ.1,126.31 కోట్లు జమ చేశారు. సాంకేతిక కారణాల వల్ల 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు జమ కాలేదు. రబీ–2023–24 సీజన్లో కరువు ప్రభావం వల్ల 2.52 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న పంటలకు గాను 2.32 లక్షల మంది రైతులకు రూ.164.05 కోట్ల కరువు సాయం చెల్లించాల్సి ఉంది. ఈ రెండు బకాయిలు కలిపి 3.91 లక్షల మంది రైతులకు రూ.327.71 కోట్ల కరువు సాయం ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతోంది.ఇక ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో కురిసిన వర్షాల వల్ల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తొలుత 16 జిల్లాల్లో 1.65 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, చివరికి నాలుగు జిల్లాల్లో 54 వేల ఎకరాలకు పరిమితం చేశారు. 29,944 మంది రైతులకు రూ.37.33 కోట్లు పరిహారం చెల్లించాలని లెక్కతేల్చగా ఆచరణకు వచ్చేసరికి కేవలం 23వేల మందికి రూ.25.75 కోట్లకు కుదించేశారు. ఆ పరిహారం నేటికీ జమ చేయలేదు. సెప్టెంబర్ లో కురిసిన భారీవర్షాలు, వరదలకు తొలుత 6 లక్షల ఎకరాల్లో పంటలతో పాటు పెద్ద ఎత్తున పాడి రైతులకు జరిగిన నష్టానికి సంబంధించి రూ.557 కోట్ల పరిహారం ఇవ్వాలని అంచనా వేయగా చివరికి 2.15 లక్షల మందికి రూ.319.59 కోట్లకు కుదించేశారు. సాంకేతిక కారణాలతో లక్షలాది మందికి నేటికీ పరిహారం అందక పడరాని పాట్లు పడుతున్నారు. మరొక పక్క వర్షాభావ పరిస్థితుల వల్ల కరువుతో అల్లాడుతున్న రాయలసీమ జిల్లాల్లో కంటి తుడుపుగా కరువు మండలాల ప్రకటన చేసిన ప్రభుత్వం ఆయా జిల్లాల రైతులను ఆదుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. కలసిరాని సాగు.. ఆదుకోని ప్రభుత్వం ప్రభుత్వ నిర్వాకానికి తోడు వైపరీత్యాల ప్రభావంతో ఖరీఫ్తో పాటు రబీ సాగు కూడా రైతులకు కలిసిరావడం లేదు. పెట్టుబడుల కోసం పడరాని పాట్లు పడ్డారు. రూ.3–5 వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ సాగు చేసినా వైపరీత్యాల ప్రభావంతో పంటలు దెబ్బతినడంతో పాటు ఆశించిన దిగుబడులు రాక లక్షలాది మంది రైతులు నష్టాలపాలయ్యారు. చేతికొచ్చిన పంటలు అమ్ముకునే సమయంలో మార్కెట్లో ధరలేక ధాన్యం రైతులతో పాటు పత్తి తదితర పంటల రైతులకు పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొంది. ఓ వైపు ముమ్మరంగా కోతలు జరుగుతున్న దశలో విరుచుకు పడిన ఫెంగల్ తుపాన్ ప్రభావంతో చేతికొచ్చిన పంట దెబ్బతిని మరింత నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో తమ రెక్కల కష్టార్జితాన్ని దళారీల పాల్జేయాల్సిన దుస్థితి రైతులకు దాపురించింది.తేమ శాతం సాకుతో దోపిడీ..కేంద్ర ప్రభుత్వం ధాన్యం సాధారణ రకానికి క్వింటా రూ.2300, ఏ–గ్రేడ్కు రూ.2320గా మద్దతు ధర ప్రకటించింది. అంటే 75 కేజీల బస్తాకు సాధారణ రకానికి రూ.1725, ఏ–గ్రేడ్కు రూ.1740 గిట్టుబాటు ధర చెల్లించాలి. కానీ కూటమి ప్రభుత్వ పాలనలో 75 కేజీల బస్తాకు రూ.400 నుంచి రూ.500 వరకు రైతు నష్టపోతున్నారు. రైతు సేవా కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యాన్ని తేమ శాతాన్ని బట్టి ధర నిర్ణయించాల్సిన అధికారులు మిల్లర్లు చెప్పిన ధరకు అమ్ముకోమంటూ సలహాలిస్తున్నారు. మరోవైపు మార్కెట్లో మద్దతు ధరకు మించి రేటు పలికే ఎంటీయూ 1262, ఎంటీయూ 1318, బీపీటీ 5204 వంటి ఫైన్ వెరైటీస్కు కూడా ఈసారి మద్దతు ధర కూడా దక్కడం కష్టంగా ఉంది. 75 కేజీల బస్తా రూ.1300–1500 మధ్య కొనే పరిస్థితి నెలకొంది. కోసిన ధాన్యాన్ని కొనే నాధుడు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. గోనె సంచుల కొరత తీవ్రంగా ఉంది. ఆరబోతకు కూలీల కొరత వేధిస్తోంది. కూలీల ఖర్చులు, పంటను కాపాడుకునేందుకు టార్పాలిన్స్కు ఎకరాకు రూ.వెయ్యి వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.ఆందోళన కలిగిస్తున్న రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్న రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కేవలం ఆర్నెల్ల వ్యవ«ధిలోనే సుమారు 70 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలకు ఒడిగట్టడం రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది. అత్యధికంగా ఒక్క కర్నూలు జిల్లాలోనే 30 మందికి పైగా బలవన్మరణం చెందారు. రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తాంధ్ర, గోదావరి జిల్లాల్లో కూడా రైతు ఆత్మహత్యలకు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు కుటుంబానికీ కూటమి సర్కారు పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు.జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే..అదే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే.. జూన్లో అన్నదాతకు తొలి విడత వైఎస్సార్ రైతు భరోసా సాయం అందేది. గడిచిన సీజన్ మాదిరిగానే ఈ ఏడాది కూడా 53.58 లక్షల మందికి మేలో రూ.7,500, అక్టోబర్లో రూ.4,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని జమ చేసేవారు. ఖరీఫ్–2023 సీజన్కు సంబంధించి రూ.1,385 కోట్ల బీమా పరిహారం అందేది. కరువు సాయం బకాయిలు రూ.327.71 కోట్ల కూడా జమ చేసేవారు. సున్నా వడ్డీ రాయితీ కింద సుమారు రూ.130 కోట్ల వరకు జమయ్యేది. ఖరీఫ్ సీజన్లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతీ రైతుకు పూర్తి స్థాయిలో పరిహారం జమయ్యేది. -
ప్రీమియం చెల్లించకపోతే పంటల బీమాకు అనర్హులు: కూటమి ప్రభుత్వం
-
ప్రీమియం చెల్లించకపోతే పంటల బీమాకు అనర్హులు
సాక్షి, అమరావతి: నిర్దేశించిన గడువులోగా ప్రీమియం చెల్లించకపోతే తాము సాగు చేసే పంటలకు బీమా పొందేందుకు రైతులు అర్హత కోల్పోతారని వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ స్పష్టం చేశారు. ఐదేళ్లుగా అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం స్థానంలో ఈ ఏడాది నుంచి రైతులను భాగస్వామ్యం చేస్తూ స్వచ్ఛంద నమోదు పద్ధతిన పంటల బీమా అమలు చేస్తున్నట్లు చెప్పారు. పంటల బీమా ప్రచార వారోత్సవాలను మంగళవారం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆ శాఖ డైరెక్టర్ సేనాపతి ఢిల్లీరావుతో కలిసి ప్రారంభించారు. ఇన్సూరెన్సు కంపెనీలు తయారు చేసిన వాల్పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. మీడియాతో రాజశేఖర్ మాట్లాడుతూ..పంట రుణం పొందిన సందర్భంలో సంబంధిత బ్యాంక్ వారే ప్రీమియం వసూలు చేసి సదరు బీమా కంపెనీకి నేరుగా చెల్లిస్తారని చెప్పారు. బీమా వద్దనుకుంటే ప్రీమియం తగ్గింపు నిలిపివేయాలని రాతపూర్వకంగా బ్యాంక్కు సమరి్పంచాలన్నారు. రుణం తీసుకోని రైతులు తమ వాటా ప్రీమియం మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించి సచివాలయాలు, పీఏసీఎస్లు, పోస్టాఫీస్లు, కామన్ సర్వీస్ సెంటర్స్ (సీఎస్సీ)ల్లో నమోదు చేసుకోవాలన్నారు.దళారీలను నమ్మి మోసపోవద్దనన్నారు. రబీ సీజన్కు సంబంధించి ఇతర పంటలకు ఈ నెల 15గానూ, వరికి 31 లోగా ప్రీమియం చెల్లించాలని, లేకుంటే బీమా పొందేందుకు ఏమాత్రం అవకాశం ఉండదన్నారు. స్వచ్ఛంద నమోదు పద్ధతిపై గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలకు కేటాయించిన ఇన్సూ్యరెన్స్ కంపెనీలు, ఆయా జిల్లాలో నోటిఫై చేసిన పంటల వివరాలు, పంటల వారీగా కట్టాల్సిన ప్రీమియం శాతం, రైతులు చెల్లించాల్సిన వాటా, నమోదు చేయడానికి గడువు, తదితరాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ శాఖ డైరక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఖరీఫ్ పంటలకు 2శాతం, రబీ పంటలకు 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున రైతులు తమ వాటా ప్రీమియం సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ భూ రికార్డులు, సీసీఆర్సీలు పొందిన రైతుల డేటాను జాతీయ పంటల బీమా పోర్టల్తో అనుసంధానం చేశామన్నారు. -
చంద్రబాబూ.. రైతుల ఉసురుపోసుకోవద్దు: వైఎస్ జగన్
రబీ సీజన్ నుంచి పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాలంటూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రైతుల తరఫున ప్రీమియం వాటా చెల్లించడం మీ ప్రభుత్వానికి భారమా చంద్రబాబూ?’ ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే.. – సాక్షి, అమరావతి1. వైఎస్సార్సీపీ హయాంలో రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్లపాటు ఉచిత పంటల బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేశాం. 2. నోటిౖఫై చేసిన ప్రతి పంటకూ, సాగైన ప్రతి ఎకరాకు యూనివర్సల్ కవరేజీ కల్పిస్తూ రైతులకు పూర్తి స్థాయిలో బీమా రక్షణ కల్పించాం.3.మా ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రైతులపై పైసా భారం పడకుండా 5.52 కోట్ల ఎకరాలకు బీమా కవరేజీ కల్పించాం. 2.04 కోట్ల మంది రైతులకు బీమా రక్షణ కల్పించాం. 4. మా ప్రభుత్వ హయాంలో ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించిన బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ప్రారంభంలో రైతుల ఖాతాలో జమ చేస్తూ వారికి అండగా నిలిచాం. 2014–19 మధ్య మీ ప్రభుత్వ హయాంలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల పరిహారం చెల్లిస్తే.. మా ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో 54.55 లక్షల మందికి రూ.7,802.08 కోట్ల బీమా పరిహారాన్ని నేరుగా వారి ఖాతాలకు జమ చేశాం.5. రైతుల తరఫున ఐదేళ్లలో రూ.3,022.26 కోట్ల ప్రీమియం మొత్తాన్ని మా ప్రభుత్వం బీమా కంపెనీలకు చెల్లించింది. 6. గతంలో బీమా చేయించుకున్న వారు సైతం పరిహారం కోసం అధికారులు, బీమా కంపెనీల చుట్టూ చెప్పులరిగేలా తిరిగేవారు.7. 2023–24 సీజన్లో రైతుల తరఫున ప్రీమియం మొత్తం రూ.930 కోట్లను ఈ ఏడాది జూన్లో మీరు చెల్లించకుండా ఎగ్గొట్టడం వల్ల ఆ సీజన్లో వర్షాభావ పరిస్థితులు, భారీ వర్షాలు, తుపానుల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు రూ.1,385 కోట్ల పరిహారం అందకుండా పోయింది.8. మా హయాంలో ఇచ్చిన మాటకు మించి ఏటా మూడు విడతల్లో ఎకరాకు రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించి సాగు వేళ రైతులకు అండగా నిలిచాం. 9. వైఎస్సార్ రైతు భరోసా కింద ఐదేళ్లలో 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288.17 కోట్లను నేరుగా బ్యాంక్ ఖాతాలకు జమచేసి వారికి వెన్నుదన్నుగా నిలిచాం. దేశంలోనే తొలిసారిగా గ్రామ స్థాయిలో ఆర్బీకే వ్యవస్థను ఏర్పాటు చేసి, వాటి ద్వారా విత్తు నుంచి పంట విక్రయం వరకు రైతులను చేయిపట్టి నడిపించాం.10. తొలిసారిగా ఈ–క్రాప్ ద్వారా సాగు చేసిన ప్రతి ఎకరాలో సాగైన ప్రతి పంటనూ నమోదు చేస్తూ.. ఈ క్రాప్ ప్రామాణికంగా రైతు క్షేత్రం వద్ద వారు పండించిన పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి వెన్నుదన్నుగా నిలిచాం. ఈ–క్రాప్ ప్రామాణికంగా పంట రుణాలు అందించడంతోపాటు పంటల బీమా, పంట నష్ట పరిహారం, సున్నా వడ్డీ రాయితీ వంటి సంక్షేమ ఫలాలు అందించాం.11. మీరు అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తున్నా.. సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకూ ఇస్తానన్న రూ.20 వేల పెట్టుబడి సాయంలో ఒక్కపైసా కూడా అందించలేదు.12. ఖరీఫ్, రబీ సీజన్లలో పెట్టుబడి కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి రూ.3నుంచి రూ.5 వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది.13. ఇప్పుడు రైతులకు ఐదేళ్లుగా అన్ని విధాలుగా ఎంతగానో అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేశావు. గతంలో మాదిరిగా ప్రీమియం భారాన్ని తిరిగి రైతుల నెత్తిన మోపావు.14. ఐదేళ్లుగా రైతులకు అన్నివిధాలుగా అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేయడం రైతులకు నువ్వు చేస్తున్న ఘోరమైన అన్యాయం.15. అసలే పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులపై పంటల బీమా ప్రీమియం భారం మోపడం భావ్యం కాదు. 16. రైతులను బాధపెట్టిన వారు బాగుపడినట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు. వాళ్ల ఉసురుపోసుకోవద్దు.17. ‘తక్షణమే ఉచిత పంటల బీమా పథకం రద్దు చేసే విషయంలో పునరాలోచించాలి. 18. రైతుల తరఫున ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరించాలి. లేకుంటే రైతులు ఎప్పటికీ నిన్ను క్షమించరు చంద్రబాబు..! -
‘చంద్రబాబూ..! రైతుల ఉసురుపోసుకోవద్దు’: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాలంటూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతులపైనే పంటల బీమా ప్రీమియం భారమా చంద్రబాబు అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులపై పాసా భారం పడకుండా ఐదేళ్లపాటు ఉచిత పంటల బీమీ పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తుచేశారు. నోటిఫై చేసిన ప్రతీ పంటకు సాగైన ప్రతీ ఎకరాకు యూనివర్శల కవరేజ్ కల్పిస్తూ రైతులకు పూర్తి స్థాయిలో అమలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రైతులపైనే పంటల బీమా ప్రీమియం భారమా @ncbn ? pic.twitter.com/J2jW6kLqyA— YS Jagan Mohan Reddy (@ysjagan) October 29, 2024 రైతుల్లో ఆందోళన..టీడీపీ ప్రభుత్వానికి రైతులంటే చిన్నచూపే అనే విషయం మరోసారి రుజువైంది. వ్యవసాయమంటే దండగ అని గతంలో చంద్రబాబు పలుమార్లు వ్యాఖ్యానించిన సందర్భాలను చూశాం. ఇప్పుడు ఉచిత పంటల బీమాకు మంగళం పాడేశారు. దీంతో రైతులు, రైతు సంఘాల నేతలు సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్లపాటు విజయవంతంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమాను అమలు చేసింది.ఆ పథకాన్ని ఎత్తేసి రైతులే పంటల బీమాను చెల్లించుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రైతులు నిరక్షరాస్యులే ఉంటారు. వాళ్లు పంటలబీమాను ప్రకటించినప్పుడు తెలుసుకుని వెళ్లి డబ్బులు చెల్లించడం అనేది చాలా కష్టతరమైన పని. ఇలాంటి నేపథ్యంలో పంటల బీమాను రైతులే చెల్లించాలనటం ఎంత వరకు సబబని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పంటల బీమా.. లేదిక ధీమా
పంటల బీమా పథకం అమలులోనూ కూటమి ప్రభుత్వం అన్నదాతలను దగా చేస్తోంది. ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేసి రైతుల వెన్ను విరుస్తోంది. రబీ సీజన్ నుంచి వలంటరీ ఎన్రోల్మెంట్ మోడల్ (స్వచ్ఛంద నమోదు పద్ధతి)లో పంటల బీమాను అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం చేసిన అధికారిక ప్రకటనతో తమకు మళ్లీ చీకటి రోజులు దాపురించాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తాము సాగు చేసిన పంటలను పంటల బీమా పరిధిలోకి తీసుకు రావాలంటే ప్రీమియం వాటా మొత్తం చెల్లించాల్సి రావడం రైతులకు పెనుభారంగా మారనుంది. - సాక్షి, అమరావతిరబీలోనే రూ.300 కోట్ల భారం రైతులకు ఎంతో మేలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో రైతులను భాగస్వామ్యం చేస్తూ పంటల బీమాను అమలు చేయబోతున్నట్టు తొలి సమీక్షలోనే సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సమయంలేని కారణంగా ఖరీఫ్ సీజన్ వరకు ఈ–పంట నమోదు ప్రామాణికంగా ఉచిత పంటల బీమాను కొనసాగించాలని, రబీ 2024–25 సీజన్ నుంచి వలంటరీ ఎన్రోల్మెంట్ మోడల్ పద్ధతి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్లో 15 దిగుబడి ఆధారిత, 7 వాతావరణ ఆధారిత పంటలకు ఉచిత బీమా కవరేజీ కల్పించగా, రబీలో 11 దిగుబడి ఆధారిత, 2 వాతావరణ ఆధారిత పంటలకు వలంటరీ ఎన్రోల్మెంట్ మోడల్ కింద బీమా కవరేజీ కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. వీటికి అదనంగా మామిడికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రబీ సీజన్ వరకు నోటిఫై చేసిన పంటలు 44.75 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) కింద కంపెనీలు నిర్దేశించిన ప్రీమియం మొత్తం (8 శాతం)లో నోటిఫై చేసిన వ్యవసాయ పంటలకు గరిష్టంగా ఖరీఫ్లో 2 శాతం, రబీలో 1.6 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున రైతులు తమ వాటాగా చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. ఇలా ఒక్క రబీ సీజన్లోనే రైతులపై రూ.300 కోట్లకు పైగా భారం పడతుందని అంచనా వేస్తున్నారు. వెన్నుదన్నుగా ఉచిత పంటల బీమా గతంలో ప్రీమియం మొత్తాన్ని మినహాయించుకుని రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. అయితే, బ్యాంకుల నుంచి రుణాలు పొందని రైతులు ప్రీమియం భారం అధికంగా ఉండటం, ఆర్థిక స్తోమత, అవగాహన లేకపోవడం వంటి కారణాలతో బీమా చేయించుకునేందుకు ముందుకొచ్చేవారు కాదు. ఫలితంగా రైతుల్లో అత్యధికులు బీమా చేయించుకోలేక విపత్తుల వేళ పంటలకు పరిహారం దక్కక నష్టపోయేవారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ రైతులపై పైసా భారం పడకుండా ఈ క్రాప్ నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతి పంటకు, సాగు చేసిన ప్రతి ఎకరాకు యూనివర్సల్ కవరేజీ కల్పిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. పంట నష్టానికి మరుసటి ఏడాది అదే సీజన్ ప్రారంభానికి ముందే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేవారు. ఇలా గడచిన ఐదేళ్లలో 5.42 కోట్ల ఎకరాలకు బీమా కవరేజీ కల్పించారు. ఏటా సగటున 40.5 లక్షల మంది చొప్పున ఐదేళ్లలో 2.04 కోట్ల మందికి బీమా కవరేజీ కల్పించారు. రైతుల తరఫున రూ.3,022.26 కోట్లను ప్రీమియం రూపంలో బీమా కంపెనీలకు చెల్లించగా.. ఐదేళ్లలో 54.55 లక్షల మంది రైతులు రూ.7,802.08 కోట్ల బీమా పరిహారం పొందగలిగారు. ఎన్రోల్మెంట్ ఎలాగంటే.. రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకునే ముందు తాము సాగు చేసే పంటల వివరాలను తొలుత ఎన్సీఐపీ (జాతీయ పంటల బీమా పోర్టల్)లో ఎన్రోల్ చేస్తారు. ఆయా పంటలకు కంపెనీలు నిర్దేశించిన ప్రీమియం మొత్తంలో రైతులు చెల్లించాల్సిన వాటా మొత్తాన్ని బ్యాంకులు మినహాయించుకుని మిగిలిన రుణాలను మంజూరు చేస్తాయి. ఆ మొత్తాన్ని బీమా కంపెనీలకు జమ చేస్తాయి. ఇక రుణాలు తీసుకోని (నాన్ లోనీ ఫార్మర్స్) మాత్రం తగిన ధ్రువీకరణ పత్రాలతో కామన్ సర్విస్ సెంటర్స్ (సీఎస్సీ), బ్యాంక్ బ్రాంచీలు, ఐసీ అపాయింట్మెంట్ చేసిన వ్యక్తుల ద్వారా లేదా వ్యక్తిగతంగా ఎన్సీఐసీ పోర్టల్లో ఎన్రోల్ చేసుకోవచ్చు. భూ యజమానులైతే ల్యాండ్ డాక్యుమెంట్స్, కౌలు రైతులైతే సీసీఆర్సీ కార్డులు తప్పనిసరిగా ఉండాలి. రైతులు సాగు చేసిన పంటలను ధ్రువీకరిస్తూ వీఏఏ/వీహెచ్ఏ/వీఎస్ఎలు జారీచేసే సర్టిఫికెట్లు ఉండాలి. రైతుల మొబైల్ నంబర్, ఆధార్తో సీడింగ్ అయిన బ్యాంక్ పాస్ పుస్తకం కాపీ లేదా క్యాన్సిల్ చేసిన చెక్ కాపీలను అప్లోడ్ చేయాలి. రబీ సీజన్లో వరి మినహా మిగిలిన నోటిఫైడ్ పంటలకు అక్టోబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీలోగా ఎన్రోల్ చేసుకోవాలి. జీడిమామిడికి నవంబర్ 15వ తేదీ, టమాటాకు డిసెంబర్ 15వ తేదీ వరకు, వరికి మాత్రం డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు. కటాప్ తేదీకి 7 రోజులు ముందుగా ఆప్షన్ మార్చుకుంటూ డిక్లరేషన్ ఇవ్వొచ్చు. బీమా చేయించుకునే పంటను మారుస్తున్నట్టయితే కటాప్ డేట్కు రెండు రోజులు ముందుగా చెప్పాలి. చలానా మొత్తాన్ని 15 రోజులు ముందుగా చెల్లించాలి. అలాగే 15 రోజులు ముందుగా రిజెక్ట్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. రైతులను నట్టేట ముంచుతున్న కూటమి ప్రభుత్వంవైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి ధ్వజంవ్యవసాయం దండగ అని చెప్పే చంద్రబాబు రైతులకు మేలు చేస్తారనుకోవడం భ్రమే. ఎన్నికల్లో అనేక హామీలతో రైతులను మభ్య పెట్టడం, అధికారంలోకి వచ్చాక వారిని నిలువునా ముంచడం చంద్రబాబుకు అలవాటే. ఇప్పుడూ రైతు వ్యతిరేక విధానాలనే కొనసాగిస్తూ అన్నదాతల నడ్డి విరుస్తున్నారు. అన్నదాతలపై పైసా భారం పడకుండా ఈ క్రాప్ నమోదే ప్రామాణికంగా జగన్ ప్రభుత్వం ఐదేళ్లు విజయవంతంగా అమలు చేసిన వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తివేయడం దుర్మార్గం. ఈ కుట్రలో భాగంగానే పంటల బీమాపై అధ్యయనం కోసం కేడినెట్ సబ్ కమిటీ వేశారు. ప్రభుత్వ సూచన మేరకే సబ్ కమిటీ రైతులకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చింది. వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం దేశంలోనే అత్యుత్తమ పథకమని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. మిగిలిన రాష్ట్రాలూ ఈ విధానాన్ని అమలు చేయాలని కూడా సూచించింది. ఇలాంటి అద్భుత పథకాన్ని ఎత్తివేయడం రైతులను నట్టేట ముంచడమే.జగన్పై కోపాన్ని రైతులపై చూపొద్దుసీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్పై ఉన్న కోపాన్ని రైతులపై చూపడం నైతికత అనిపించుకోదు. ఉచిత పంటల బీమాను ఎత్తేసి, రైతులే ప్రీమియం కట్టుకోవాలనడం అన్యాయం. కూటమి హామీ ఇచ్చిన మేరకు రైతులకు రూ.20 వేలు ఇవ్వకపోగా, పంటల బీమా ప్రీమియం భారాన్ని కూడా వేయడం బాధాకరం. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రైతులకు రూ. వందల కోట్ల లబ్ధి కలిగింది. – వంగాల భరత్కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడురైతులపై పెనుభారంవైఎస్ జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో రూ.3,411 కోట్లు పంటల బీమా పరిహారంగా చెల్లించింది. సుమారు 30.85 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగింది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలు పేరుతో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాను ఎత్తివేసి, అన్నదాతపై భారం వేయడం దుర్మార్గమే. దీనివల్ల ఖరీఫ్లో వరి రైతులు ఎకరాకు రూ.630 చెల్లించాల్సి ఉంటుంది. ఇది రైతులపై పెనుభారమే. – కొవ్వూరి త్రినాధ్ రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడురైతును ఆదుకొనే పథకాన్ని ఎత్తివేస్తారా?కరువు పీడిత అనంతపురం జిల్లా రైతాంగాన్ని ఉచిత పంటల బీమా పథకం ఎంతో ఆదుకుంది. అలాంటి మంచి పథకాన్ని కూటమి ప్రభుత్వం ఎత్తివేయడం దుర్మార్గం. రైతులను ఆదుకొని, ఆత్మహత్యలు నివారించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని తెచ్చింది. అన్ని పంటలకూ ఈ పథకాన్ని వర్తింపజేసింది. ఇప్పుడీ పథకాన్ని చంద్రబాబు నిలిపివేయడంతో జిల్లా రైతాంగంపై రూ.110 కోట్ల భారం పడుతుంది. – వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ -
‘ఫసల్ బీమా’లో కొత్త పద్ధతి!
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకానికి సంబంధించి కొత్త పద్ధతిని అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రీమియం సొమ్ము కంటే పరిహారపు సొమ్ము రైతులకు ఎక్కువగా చెల్లించే పరిస్థితి నెలకొంటే, బీమా కంపెనీకి నష్టం రాకుండా నిర్ణీత మొత్తంలో ప్రభుత్వం చెల్లించాలని యోచిస్తోంది.పరిహారపు సొమ్ము కంటే ప్రీమియం ఎక్కువెక్కువగా ఉంటే ముందనుకున్న లెక్క ప్రకారం నిర్ణీత మొత్తం ప్రభుత్వానికి కంపెనీ చెల్లించేలా, అటు వ్యవసాయ బీమా కంపెనీకి, ఇటు ప్రభుత్వానికి ఏ మాత్రం నష్టం జరగకుండా ఈ పథకాన్ని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు అనేక సందర్భాల్లో ప్రీమియం ఎక్కువ చెల్లించగా, క్లెయిమ్స్ మాత్రం చాలా తక్కువగా ఉండేవి. ఇలా కంపెనీలు తెలంగాణ నుంచి రూ. వందల కోట్ల లాభాలు పొందాయి. దీంతో గత ప్రభుత్వం ఈ పథకం నుంచి బయటకొచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కొత్త పద్ధతి ప్రకారం అటు రైతులకు, ఇటు ప్రభుత్వానికి, మరోవైపు కంపెనీలకు కూడా నష్టం జరగకుండా ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బీమా పథకం అమలు పంటల బీమా పథకంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ పద్ధతిలో పంటల బీమాను అమలు చేస్తున్న మధ్యప్రదేశ్ను అనుసరించాలని యోచి స్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్రంలో ఇటీవల వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, డైరెక్టర్ గోపి పర్యటించి.. అక్కడ అమలవుతున్న పంటల బీమాను అధ్యయనం చేశారు. బీమా అమలు చేస్తున్న కంపెనీలతోనూ చర్చించారు. ఏఐ పరిజ్ఞానంతో పంట నష్టాన్ని అత్యంత సక్రమంగా అంచనా వేయొచ్చని అంటున్నారు. ప్రస్తుతం మాన్యు వల్ పద్ధతిలో నష్టాన్ని అంచనా వేస్తుండగా, పారదర్శకంగా ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు మాన్యువల్గానూ... మరోవైపు ఏఐ ద్వారానూ పంటల నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఆ ప్రకారం నష్టాన్ని అంచనా వేస్తే, నష్టపోయిన పంటలకు బీమా కంపెనీలు పరిహారం ఇస్తాయని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. సింగిల్ రైతుకూ పరిహారం ఇచ్చేలా...!జీవిత బీమాలో వ్యక్తులకు ఏదైనా ప్రమాదం జరిగితే పరిహారం ఎలా వస్తుందో...పంట నష్టం జరిగిన సింగిల్ రైతుకు కూడా పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అంటే రైతు యూనిట్గా రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తారు. గతంలో అమలు చేసినప్పుడు గ్రామం లేదా మండలం యూనిట్గా వివిధ రకాలుగా పంటలను బట్టి పథకం ఉండేది. అంతేగాక సంబంధిత యూనిట్లో ఉన్న వ్యవసాయ పంటల్లో 33 శాతం దెబ్బతింటేనే బీమా పథకం వచ్చేది. అంటే వందెకరాలుంటే... 33 ఎకరాలు దెబ్బతింటేనే పథకం కింద రైతులకు పరిహారం అమలు చేసేవారు. కానీ ఇప్పుడు ఒక ఎకరా, అరెకరా ఉన్న ఒక్క రైతుకు కూడా పరిహారం అందుతుంది. అయితే ఈ వెసులుబాటును అమలుచేయాలంటే బీమా కంపెనీలు ఎక్కువ ప్రీమియం వసూలు చేస్తాయని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. కాగా, రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది రైతులు ఉన్నారు. గతంలో పంటల బీమా పథకాలు అమల్లో ఉన్నప్పుడు సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల మంది పంటల బీమా చేయించేవారు. ఇప్పుడు బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. దీనివల్ల బీమా పరిధిలోకి వచ్చే రైతుల సంఖ్య 50 లక్షలు ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రీమియం కూడా రూ. 2,500 కోట్ల మేరకు చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. » ఓ ఉన్నతాధికారి లెక్క ప్రకారం ఉదాహరణకు ప్రభుత్వం రైతుల తరఫున బీమా కంపెనీకి కోటి రూపాయల ప్రీమియం చెల్లించిందనుకుందాం. ఒక సీజన్లో పంటల నష్టం వల్ల రైతులకు బీమా కంపెనీ రూ. 1.20 కోట్లు చెల్లిస్తే...కంపెనీకి రూ. 20 లక్షల నష్టం వచ్చినట్టు లెక్క. అప్పుడు ప్రభుత్వం రూ. 40 లక్షలు చెల్లించి... ఆ కంపెనీకి రూ. 20 లక్షలు లాభం జరిగేలా చూస్తుంది.» అలా కాకుండా అదే కోటి ప్రీమియం ప్రకారం చూసుకుంటే... పంట నష్టం జరిగి రైతులకు కంపెనీ రూ. 60 లక్షలు చెల్లిస్తే... అప్పుడు ప్రభుత్వానికి రూ.40 లక్షలు నష్టం జరిగినట్టు లేదా అదనంగా కంపెనీకి 40 శాతం ఎక్కువ ప్రీమియం సొమ్ము చెల్లించినట్టు లెక్క. అప్పుడు ప్రభుత్వానికి అంతగా నష్టం జరగకుండా కంపెనీ రూ.20 లక్షలు ఇచ్చి కొంత వెసులుబాటు ఇస్తుంది. అయితే దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. -
రబీ నుంచి రైతులపైనే బీమా భారం
సాక్షి, అమరావతి : ఉచిత పంటల బీమాపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆ భారాన్ని రైతులే భరించాలని తేల్చి చెప్పేసింది. రైతులపై పైసా భారం పడకుండా యూనివర్శల్ కవరేజ్ కల్పిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లుగా అమలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. 2024–25 వ్యవసాయ సీజన్కు సంబంధించి నోటిఫై చేసిన పంటలకు బీమా వర్తింపజేస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ప్రస్తుత ఖరీఫ్ వరకు మాత్రమే.. అది కూడా సమయం లేని కారణంగా రైతుల తరపున ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుందని, రబీ నుంచి మాత్రం ప్రీమియం రైతులే చెల్లించుకోవాలని, వారికే పంటల బీమా వర్తిస్తుందని స్పష్టం చేసింది.ఈ పంట ఆధారంగానే పంటల బీమాఖరీఫ్– 2024, రబీ 2024–25 సీజన్లలో దిగుబడి ఆధారిత పంటలకు అమలు చేసే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై), వాతావరణ ఆధారిత పంటలకు అమలు చేసే పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్డబ్ల్యూ బీసీఐ)పై శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఖరీఫ్ సీజన్ వరకు ఈ పంట డేటా ఆధారంగా సోషల్ ఆడిట్ పూర్తయిన తర్వాత తుది జాబితాలో అర్హత పొంది, నోటిఫై చేసిన పంటలు సాగు చేసిన వారికి బీమా వర్తింపచేస్తామని ప్రకటించింది. ఖరీఫ్ సీజన్ వరకు గతంలో మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపింది. ఖరీఫ్లో దిగుబడి ఆధారిత పంటల పథకం కింద వరి, సజ్జ, జొన్న, మొక్కజొన్న, కొర్ర, రాగి, పెసర, మినుము, కంది, వేరుశనగ, నువ్వులు, ఆముదం, మిర్చి, పసుపు, ఉల్లి పంటలకు, వాతావరణ ఆధారిత పథకం కింద వేరుశనగ, ప్రత్తి, టమాటా, నిమ్మ, దానిమ్మ, బత్తాయి, అరటి పంటలకు బీమా వర్తింపచేయనుంది. ప్రీమియం చెల్లించిన వారికే బీమారబీ–2024–25 సీజన్ నుంచి పంటల బీమాలో రైతులు స్వచ్చందంగా చేరాల్సిందేనని స్పష్టం చేసింది. రబీ సీజన్లో దిగుబడి ఆధారిత పథకం కింద వరి, జొన్న, మొక్కజొన్న, రాగి, పెసర, మినుము, వేరుశనగ, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, శనగ, రాజ్మా, మిర్చి, ఉల్లి, వాతావరణ ఆధారిత పథకం కింద జీడిమామిడి, టమాటా పంటలకు బీమా వర్తింపచేయనున్నారు. రబీ సీజన్లో బీమా చేయించుకోవాలంటే రైతుల వాటా ప్రీమియంను వారే చేయించాలని ప్రభుత్వం తెగేసి చెప్పింది. ప్రీమియం మొత్తంలో ఆహార ధాన్యాలు, నూనెగింజల పంటలకు 1.5 శాతం, వాణిజ్య, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం రైతులు స్వచ్ఛందంగా చెల్లిస్తేనే బీమా వర్తిస్తుందని పేర్కొంది. పీఎంఎఫ్బీవై లో పంటకోత ప్రయోగాల ఆధారంగా వాస్తవ దిగుబడి లెక్కించి హామీ దిగుబడి కన్నా తగ్గిన సందర్భంలో ఇన్సూ్యరెన్స్ యూనిట్ పరిధిలోని రైతులందరికీ నష్ట శాతం లెక్కించి బీమా పరిహారం చెల్లిస్తారు. పీఎంఎఫ్బీవై పథకాన్ని 9 క్లస్టర్స్ పరిధిలోనూ ఐదు బీమా కంపెనీలను, ఆర్డబ్ల్యూబీసీఐఎస్ పథకాన్ని ఐదు క్లస్టర్స్ పరిధిలో నాలుగు బీమా కంపెనీలను ఎంపిక చేసారు. -
రాష్ట్రంలో పంటల బీమా ప్రీమియం తక్షణమే చెల్లించండి... ఏపీ సీఎంను డిమాండ్ చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
పంటల బీమా ప్రీమియం 'తక్షణమే చెల్లించండి': వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఖరీఫ్ 2023–24 సీజన్కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ చెల్లించకపోవడంతో రైతులకు పంటల బీమా పరిహారం చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పంటల బీమా ప్రీమియం చెల్లించి రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ హామీ కింద పెట్టుబడి సాయంగా సీఎం చంద్రబాబు ఏటా రైతులకు ఇస్తామన్న రూ.20 వేలను వెంటనే చెల్లించాలన్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఆదివారం “ఎక్స్’లో ట్వీట్ చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే.. ఉచిత పంటల బీమాలో ఆదర్శంగా నిలిచాం.. ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియాన్ని మా ప్రభుత్వ హయాంలో ఏటా ఏప్రిల్–మే నెలల్లో చెల్లించి నష్టపోయిన రైతులను జూన్లో ఆదుకున్నాం. ఖరీఫ్లో పంటలు వేసే సమయానికి రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి సమర్థంగా పథకాన్ని అమలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన వెంటనే కేంద్రం కూడా తన వాటా విడుదల చేస్తుంది. అనంతరం సుమారు 30 రోజుల్లోగా బీమా కంపెనీ పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తుంది. ఇలా మా ప్రభుత్వ హయాంలో 54.55 లక్షల మంది రైతులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.7,802 కోట్లు అందించి అండగా నిలిచాం. తద్వారా ఉచిత పంటల బీమా విషయంలో మన రాష్ట్రం దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతతో రైతులకు తీవ్ర నష్టం.. 2023–24 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఎన్నికల కోడ్ కారణంగా ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మీ ప్రభుత్వం వెంటనే స్పందించి చెల్లించాల్సి ఉన్నప్పటికీ దాని గురించి పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ ప్రీమియం కట్టకపోవడంతో కేంద్రం కూడా తన వాటా ఇవ్వలేదు. ఇప్పటికే జూన్, జూలై మాసాలు గడిచిపోయాయి. ఆగస్టులో దాదాపు పక్షం రోజులు పూర్తి కావస్తున్నా మీ ప్రభుత్వంలో ఎలాంటి కదలికలేక పోవడం అత్యంత విచారకరం. ఈ సంవత్సరం కోస్తాలో అతివృష్టి, రాయలసీమలో కరువు వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికైనా మేలుకుని వెంటనే ఉచిత పంటల బీమా ప్రీమియం చెల్లించి రైతులకు బీమా పరిహారం చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మళ్లీ వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగే దుస్థితిరైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తామని సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్నారు. మీరిచ్చే పెట్టుబడి సహాయం కోసం రైతులంతా ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ దాదాపు పూర్తి కావస్తున్నా ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో కోవిడ్తో ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థలన్నీ కుదేలైనా మా ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా అన్నదాతలకు రైతు భరోసా అందించాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సీజన్లో రైతు భరోసా చెల్లించాం. ఆ విధంగా 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్లు పెట్టుబడి సహాయం అందించాం. ఇప్పుడు మళ్లీ రైతులు పెట్టుబడి డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ, వడ్డీ వ్యాపారులు చుట్టూ మళ్లీ తిరిగే దుస్థితి కల్పించారు. వెంటనే పెట్టుబడి సహాయం కింద రైతులకు మీరు ఇస్తానన్న డబ్బులతో పాటు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి 2023–24 పరిహారం సొమ్ము విడుదలకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గుర్తు పెట్టుకోండి చంద్రబాబూ! వైఎస్సార్ రైతు భరోసాతో పెట్టుబడి సాయం ఇలారైతుల సంఖ్య లబ్ధి రూ.కోట్లలో 53.58 లక్షలు 34,288 -
ఉచిత పంటల బీమాపై నీలి నీడలు
సాక్షి, అమరావతి: రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్లుగా విజయవంతంగా అమలు చేస్తోన్న వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు మంగళం పాడేందుకు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పంటల బీమాపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశం కాబోతోంది. రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత పంటల బీమా పథకంతో పాటు వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న పంటల బీమాపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ఐదేళ్లుగా విజయవంతంగా అమలవుతున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేస్తున్నట్టుగా తొలి సమీక్షలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం స్థానంలో 2019కి పూర్వం రైతుల భాగస్వామ్యంతో అమలైన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) తీసుకొస్తున్నట్టు స్వయంగా వెల్లడించారు. ఈ ప్రకటనకు కొనసాగింపుగా ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో ఉచిత పంటల బీమా పథకం స్థానంలో మెరుగైన బీమా పథకం కోసం అధ్యయనం పేరిట వ్యవసాయ, పౌర సరఫరాలు, ఆర్థిక శాఖా మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న క్రాప్ ఇన్సూ్యరెన్స్ చట్టాలపై ఈ కమిటీ సమగ్ర అధ్యయనం చేసి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేబినెట్లో తీర్మానించారు. పథకాలన్నీ మరింత మెరుగ్గా అమలు చేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం.. ఆ తర్వాత ఒక్కొక్కొటిగా వాటికి మంగళం పాడుతోంది.అత్యుత్తమ పథకంగా కొనియాడిన కేంద్రంప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న ఉచిత పంటల బీమా పథకం దేశంలోనే ది బెస్ట్ క్రాప్ ఇన్సూ్యరెన్స్ పథకమని కేంద్రమే అధికారికంగా ప్రకటించింది. ఇన్నోవేషన్ కేటగిరి కింద 2023లో అవార్డును సైతం అందించింది. ఏపీ స్ఫూర్తితో నోటిఫై చేసిన పంటలకు యూనివర్సల్ కవరేజి కల్పించేందుకు ఫసల్ బీమాలో పలు మార్పులు కూడా చేసింది. ఈ క్రాప్ నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్సల్ కవరేజి కల్పిస్తూ రైతులపై పైసా భారం పడకుండా 2019 రబీ నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. రూ.7802 కోట్ల పరిహారంఈ పథకం కింద రికార్డు స్థాయిలో దాదాపు 5 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పించడం ద్వారా 2.04 కోట్ల మంది రైతులకు ఉచితంగా బీమా రక్షణ కల్పించింది. ఐదేళ్లలో వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న 54.55 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7802.08 కోట్ల బీమా పరిహారం నేరుగా జమ చేసింది. 2023–24 సీజన్కు సంబంధించి రైతుల వాటాతో కలిపి ప్రీమియం రూపంలో రూ.1,384 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు చెల్లించ కుండా ఎగ్గొట్టాలనే ఆలోచనతో ఉన్న కూటమి ప్రభుత్వం రైతుల భాగస్వామ్యంతో పాత పంటల బీమాను పునరుద్దరిస్తున్నట్టుగా ప్రకటించింది. ఇందులో భాగంగానే ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సోమవారం భేటీ కానుంది. పైసా భారం పడకుండా ఐదేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలంటూ రాష్ట్రంలోని రైతులు, రైతు సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. -
బీమా పేరుతో భారం వేయవద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలకపార్టీ ఉచిత పంటల బీమాను మార్చే సాకుతో బీమా భారాన్ని రైతులపై వేసే యోచన విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు, వ్యవసాయ కార్మిక, కౌలురైతుల సంఘాల సంయుక్త సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విజయవాడలో నిర్వహించిన సంయుక్త సమావేశం వివరాలను ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి, ఏపీ వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, ఏపీ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు మంగళవారం మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమాను మార్చేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయతి్నస్తోందన్నారు. రైతుల భాగస్వామ్యం పేరుతో బీమా ప్రీమియం భారాన్ని రైతులపై వేసేందుకు ఈ ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. కరువు, వరదలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయే రైతులను ఆదుకునేందుకు ఉచిత పంటల బీమా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయాన్ని మరిచి రైతులపై భారం వేసే ప్రయత్నాలు చేస్తే రైతు ఉద్యమం తప్పదని చెప్పారు. ఈ విషయమై గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉద్యమం చేపడతామని, రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు రైతులు, కౌలురైతులు కదులుతారని తెలిపారు. రైతు, కౌలురైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సమన్వయంతో ఈ నెల 18, 19 తేదీల్లో గ్రామ సచివాలయాల్లో ‘సామూహిక రాయబారాల’ పేరుతో వినతిపత్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. 2023లో కరువు, తుపాన్లతో దెబ్బతిన్న పంటలకు పంటల బీమా పరిహారం రైతుల ఖాతాల్లో వేయాలని, కౌలు రైతులకు కూడా పంటల బీమా పరిహారం ఇవ్వాలని, రైతు సేవా (రైతు భరోసా) కేంద్రాలను బలపర్చాలని, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను రైతుసేవా కేంద్రాల ద్వారా అందించాలని, పెండింగులో ఉన్న ఉపాధి బిల్లులను వెంటనే ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో వినతిపత్రాలు ఇస్తామని వారు వివరించారు. -
పంటల బీమాకు ‘పాత’ర!
రూ.4 లక్షల బీమా పరిహారం అందుకున్నా..పసుపు, కంద, అరటి, తమలపాకు సాగు చేస్తుంటా. వైఎస్సార్ ఉచిత పంటల బీమా రైతులకు ఎంతో బాసటగా నిలిచింది. గత ఐదేళ్లలో పైసా ప్రీమియం చెల్లించకుండా రూ.4 లక్షలకు పైగా బీమా పరిహారం పొందా. రూ.2 లక్షల వరకు పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అందుకున్నా. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పరిహారం జమైంది. రైతాంగానికి ఎంతో ఆసరాగా ఉన్న పథకాన్ని రద్దు చేసి 2019కి ముందు ఉన్న విధానం అమలు చేయాలని నిర్ణయించడం సరికాదు. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి.– ముత్తిరెడ్డి శ్రీనివాసరావు, కిష్కిందపాలెం, బాపట్ల జిల్లాసాక్షి, అమరావతి: ఇన్నాళ్లూ తమపై పైసా భారం పడకుండా కష్టకాలంలో ఆదుకున్న డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు పాతరేసే దిశగా టీడీపీ సర్కారు సన్నద్ధం కావడం అన్నదాతల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ‘సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తాం.. ఏ ఒక్కటీ ఆపే ప్రసక్తే లేదు. ఇంకా మెరుగైన రీతిలో అమలు చేస్తాం’ అని ఎన్నికల ప్రచార సభల్లో హామీలిచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర కూటమి నేతలు వాటిని గాలికి వదిలేశారు. రైతులకు మేలు చేసే వ్యవసాయ సలహా మండళ్లను రద్దు చేసిన కూటమి సర్కారు కన్ను తాజాగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంపై పడింది. ఈ – క్రాప్ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్శల్ బీమా కవరేజ్ కల్పిస్తూ ఈ పథకం దేశానికే తలమానికంగా నిలిచింది. అయితే 2019కి ముందు అమలులో ఉన్న పాత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్టు తొలి సమీక్షలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన రైతన్నల గుండెల్లో గుబులు రేపింది. గత ఐదేళ్లుగా తాము కట్టాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి పైసా భారం లేకుండా ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ప్రారంభానికి ముందే నేరుగా తమ ఖాతాల్లో జమ చేసే పరిస్థితి ఇక ఉండదన్న ఆందోళన వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. టీడీపీ సర్కారు తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకుని ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఉద్యమ బాట పట్టక తప్పదని హెచ్చరిస్తున్నాయి.ఏళ్ల తరబడి ఎదురు చూపులు..1965లో కేంద్రం తెచ్చిన క్రాప్ ఇన్సూరెన్స్ బిల్లు ఆధారంగా ప్రవేశపెట్టిన మోడల్ ఇన్సూరెన్స్ పథకం వివిధ రూపాలు మార్చుకుని ప్రధాని ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై)గా 2016 నుంచి దేశవ్యాప్తంగా అమలవుతోంది. దీని ప్రకారం నోటిఫై చేసిన వ్యవసాయ పంటలకు ఖరీఫ్లో 2 శాతం, రబీలో 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున రైతులు ప్రీమియం చెల్లించగా మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాయి. అయితే ప్రీమియం భారం అధికంగా ఉండడంతో పాటు అవగాహన లేక పలువురు రైతులు సొంతంగా బీమా చేయించుకునేందుకు ముందుకొచ్చేవారు కాదు. రుణాలు తీసుకునే రైతులకు మాత్రం బ్యాంకులు ప్రీమియం రూపంలో నిర్దేశించిన మొత్తాన్ని మినహాయించుకొని మిగతాది అందచేసేవి. అయితే బీమా చేయించుకున్న వారు సైతం ఎంతొస్తుంది? ఎప్పుడొస్తుందో అంతుబట్టక ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.2014–19 పరిహారం రూ.3,411.20 కోట్లే చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడూ కేంద్ర పథకాలపై ఆధార పడడం మినహా అన్నదాతల సంక్షేమం కోసం తపించిన దాఖలాలు లేవు. 2014–19 మధ్య తొలి రెండేళ్లు వ్యవసాయ ఇన్సూరెన్స్కీమ్ (ఏఐఎస్), ఆ తర్వాత పీఎంఎఫ్బీవై అమలు చేశారు. ప్రీమియం రూపంలో 2014–19 మధ్యలో రైతులు తమ వాటాగా రూ.1249.90 కోట్లు చెల్లిస్తే, రాష్ట్ర ప్రభుత్వం రూ.1281 కోట్లు చెల్లించింది. హుద్హుద్ లాంటి పెను తుపాన్, కరువు కాటకాటకాలతో రూ.వేల కోట్ల పంటలను కోల్పోయిన రైతులకు 2014–19 మధ్య దక్కిన పరిహారం కేవలం రూ.3,411.20 కోట్లు మాత్రమే. పైసా భారం పడకుండా.. పాదయాత్ర హామీ మేరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 జూలై 8న వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు శ్రీకారం చుట్టారు. తొలి ఏడాది పీఎం ఎఫ్బీవైతో అనుసంధానించి అమలు చేశారు. 2019 ఖరీఫ్ సీజన్లో రూపాయి ప్రీమియంతో పథకానికి శ్రీకారం చుట్టగా అనంతరం ఆ భారం కూడా రైతులపై పడకూడదన్న ఆలోచనతో ఖరీఫ్–2020 నుంచి నోటిఫైడ్ పంటలకు ఉచితంగా బీమా కవరేజ్ కల్పించారు. క్లెయిమ్లు, సెటిల్మెంట్లు, చెల్లింపుల బాధ్యతను కూడా ప్రభుత్వం తన భుజాన వేసుకుంది. తొలి ఏడాది రైతుల వాటా (రూ.468 కోట్ల)తో కలిపి ప్రీమియం రూపంలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.971 కోట్లు బీమా కంపెనీలకు చెల్లించింది. యూనివర్సల్ కవరేజ్కు కేంద్రం ముందుకు రాకపోవడంతో 2020–21, 2021–22 సీజన్లలో పీఎం ఎఫ్బీవైతో సంబంధం లేకుండా మొత్తం బీమా పరిహారం ప్రభుత్వమే చెల్లించింది. 2022–23 నుంచి ఫసల్ బీమాతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. వాతావరణ ఆధారిత పంటలకు మాత్రం గత ప్రభుత్వం సొంతంగానే బీమా పరిహారం చెల్లించింది. ఈ క్రాప్ ప్రామాణికంగా.. ఈ క్రాప్తో పాటు ఈ కేవైసీ నమోదు ప్రక్రియ పూర్తి కాగానే గత ప్రభుత్వం ఉచిత పంటల బీమా పధకం వర్తించే నోటిఫై చేసిన పంటలకు (స్టార్) గుర్తుతో ప్రత్యేకంగా తెలియచేస్తూ రైతులకు భౌతిక రసీదు అందచేసింది. ‘డాక్టర్ వైస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద నోటిఫై చేసిన పంటకు ప్రీమియంను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి పంట బీమా చేసింది‘ అని అందులో స్పష్టంగా తెలియచేసింది. ఈ జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించి అభ్యంతరాలను పరిష్కరించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా పరిహారం అందచేసింది. ప్రీమియం రూపంలో రైతుల వాటాతో కలిపి 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3,022.26 కోట్లు కంపెనీలకు చెల్లించింది. 2019–24 మధ్య 1.91 కోట్ల హెక్టార్లకు బీమా కవరేజీ కల్పించగా 2.04 కోట్ల మంది రైతులకు బీమా రక్షణ లభించింది. రికార్డు స్థాయిలో పరిహారం.. 2014–19 మధ్య 30.85 లక్షల మందికి రూ.3411.20 కోట్ల పరిహారం చెల్లిస్తే 2019–24 మధ్య 54.55 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల బీమా పరిహారం అందింది. టీడీపీ హయాంలో 6.19 లక్షల మంది రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలు కూడా చెల్లించి గత సర్కారు అండగా నిలిచింది. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం చెల్లించిన బీమా మొత్తం కంటే రూ.3,273.64 కోట్ల మేర అదనంగా లబ్ధి చేకూర్చగా 13.81 లక్షల మంది రైతులు అదనంగా ప్రయోజనం పొందారు. ఏపీ బాటలో పలు రాష్ట్రాలు.. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని దేశంలోనే అత్యుత్తమ పంటల బీమా పథకంగా కేంద్రం గుర్తించింది. ఇన్నోవేషన్ కేటగిరి కింద ఉత్తమ బీమా పథకంగా ఎంపిక చేసింది. 2023 ఏప్రిల్ 14న కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందించారు. ఏపీ స్ఫూర్తిగా జాతీయ స్థాయిలో పీఎంఎఫ్బీవైలో పలుమార్పులు చేసినట్టుగా కేంద్రం ప్రకటించింది. ఏపీ తరహాలో మిగిలిన రాష్ట్రాలు కూడా అమలు చేయాలని సూచించింది. 2023–24 నుంచి మహారాష్ట్ర, మేఘాలయ, ఒడిశా, పుదుచ్చేరి తదితర రాష్ట్రాలు ఏపీ బాటలోనే రూపాయి ప్రీమియంతో పంటల బీమా అమలుకు శ్రీకారం చుట్టాయి. ఉచిత పంటల బీమా పథకాన్ని కేంద్రం సహా పలు రాష్ట్రాలు ప్రశంసించాయి. రూ.1,278.80 కోట్ల ప్రీమియం చెల్లింపులకు ఎగనామం.. 2023–24 సీజన్కు సంబంధించి బీమా కవరేజ్ పరిధిలోకి వచ్చిన అర్హుల జాబితాను గతంలోనే కేంద్రానికి పంపించారు. ఆ మేరకు రైతుల వాటాతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,278.80 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, ప్రభుత్వం మారడంతో ప్రీమియం చెల్లించాల్సిన బాధ్యత టీడీపీ సర్కారుపై ఉంది. అయితే పాత పద్ధతిలోనే పంటల బీమా అమలు చేస్తామని ప్రకటించడం ద్వారా 2023–24 సీజన్ ప్రీమియం చెల్లింపులు జరపవద్దని అధికారులకు సీఎం చంద్రబాబు సంకేతాలిచ్చారు. దీంతో 2023–24 సీజన్లో వర్షాభావం, వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు 2024–25 సీజన్ నుంచి రైతులే చెల్లించేలా చూడాలంటూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో వారిపై పెనుభారం పడనుంది. రైతులపై ఏటా రూ.800 కోట్లకుపైగా భారం ఏ పంటైనా సరే జిల్లాలో కనీసం ఐదువేల ఎకరాల్లో సాగైతేనే నోటిఫై చేస్తారు. నోటిఫై చేసిన పంట పెట్టుబడి ఖర్చులను బట్టి బీమా కంపెనీలు ప్రీమియం నిర్దేశిస్తాయి. ఉదాహరణకు వరికి ఎకరాకు రూ.40 వేలు ఖర్చవుతుంటే కనీసం 8 శాతం అంటే రూ.3,200 చొప్పున ప్రీమియం చెల్లిస్తేనే బీమా కవరేజ్ కల్పిస్తుంది. ఈ మొత్తంలో ఖరీఫ్లో అయితే 2 శాతం, రబీలో 1.5 శాతం చొప్పున రైతులు గతంలో చెల్లించగా మిగతాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించేవి. ఈ లెక్కన నోటిఫై పంటలకు రైతులు తమ వాటాగా ఏటా కనీసం రూ.800 కోట్లకు పైగా ప్రీమియం రూపంలో భరించాల్సి ఉంటుంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందని కౌలు రైతులు, సన్న, చిన్నకారు రైతులు సొంతంగానే ప్రీమియం చెల్లించాలి. వీరికి అవగాహన కల్పించకపోవడం, ఆర్ధిక భారం కారణంగా బీమాకు ముందుకు రావడం లేదు. దీంతో పంట నష్టపోతే విపత్తుల వేళ బీమా పరిహారం అందని దుస్థితి నెలకొంటుంది. వైఎస్సార్ రైతు భరోసాను హడావుడిగా అన్నదాతా సుఖీభవగా మార్చేసి రూ.20 వేలు ఇవ్వకుండా ఇప్పటికే సీజన్లో అన్నదాతలను ముంచేసిన టీడీపీ సర్కారు ఇప్పుడు ఉచిత పంటల బీమాను కూడా రద్దు చేసే దిశగా అడుగులు వేయడం పిడుగుపాటుగా మారింది.రూ.2.75 లక్షల పరిహారం ఇచ్చారువైఎస్సార్ ఉచిత పంటల బీమా అన్నదాతలను ఎంతో ఆదుకుంది. నోటిఫై చేసిన పంటలు ఈ క్రాప్లో నమోదైతే చాలు బీమా వర్తింపచేశారు. మాకు 20 ఎకరాల భూమి ఉంది. పత్తి, శనగ, ఉల్లి సాగు చేస్తుంటాం. 2019–20లో ఒక్క ఉల్లి పంటకే రూ.1.10 లక్షల బీమా పరిహారం వచ్చింది. ఆ తర్వాత రూ.70 వేలు, రూ.42 వేలు, రూ.53 వేలు చొప్పున వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.2.75 లక్షల బీమా పరిహారం అందింది. రూపాయి ప్రీమియం చెల్లించకపోయినా ఇంత భారీగా పరిహారం దక్కటం ఎంతో ఊరటనిచ్చింది. అన్నదాతలకు ఎంతగానో ఆసరాగా నిలిచిన ఈ ఉచిత పంటల బీమాను కొనసాగించాలి. 2019కి ముందు ఉన్న పంటల బీమా పథకాన్ని కొనసాగిస్తే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. –గౌర మహేశ్వరరెడ్డి, ఏ.గోకులపాడు, కర్నూలు జిల్లాపాత విధానం సరికాదు..30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. 2021 ఖరీఫ్లో అరటి పంట దెబ్బతినడంతో రూ.90 వేల పంటల బీమా పరిహారం నేరుగా నా ఖాతాలో జమ చేశారు. దళారుల ప్రమేయం లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. ఐదేళ్లూ పైసా కూడా మేం ప్రీమియం చెల్లించలేదు. మా వాటా కూడా ప్రభుత్వమే కట్టింది. చంద్రబాబు ప్రభుత్వం పాత విధానంలో పంటల బీమా అమలు చేస్తామని చెప్పడం సరికాదు.– గనివాడ సన్యాసినాయుడు, పెదమదుపాడ, విజయనగరం జిల్లారైతులు బీమా చేయించుకోలేరు2019కు ముందు టీడీపీ హయాంలో రైతులు బీమా చేయించుకుంటేనే నష్టపరిహారం వర్తించేది. రైతులలో చాలా మంది నిరక్షరాస్యులు ఉన్నందున అవగాహన లేక నష్టపోయే ప్రమాదం ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉచిత పంటల బీమాను అమలు చేసింది. 2021లో వర్షాలకు 80 సెంట్లు పొలంలో నష్టపోతే నేరుగా రూ.5,100 పరిహారం ఇచ్చారు. – డి. ప్రభాకర్, తాటితూరు, భీమిలి మండలంరూ.3.80 లక్షల పరిహారం వచ్చిందినేను పైసా ప్రీమియం చెల్లించకపోయినా 2021లో ఖరీఫ్లో పంట నష్టపోతే రూ.3.80 లక్షల బీమా పరిహారం జమైంది. గతంలో ప్రీమియం చెల్లించిన తర్వాత కూడా పరిహారం కోసం అధికారులు, కంపెనీల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వచ్చేది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ఎంతగానో ఉపయోగపడింది. ఈ పథకాన్ని కొనసాగించాలి.– వీరపురం భీమేష్, గడేకల్లు, అనంతపురం జిల్లారైతుల తరపున ఉద్యమిస్తాం..రైతులపై భారం పడకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాల్సిందే. పాత పద్ధతిలో పంటల బీమా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించటాన్ని ఖండిస్తున్నాం. పెరిగిన పెట్టుబడి ఖర్చులకు తోడు బీమా ప్రీమియం రైతులకు తలకు మించిన భారమవుతుంది. ప్రీమియం చెల్లించలేక బీమాకు మెజార్టీ రైతులు దూరమవుతారు. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించకుంటే ఉద్యమిస్తాం.– కె.ప్రభాకరరెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘంపాత పద్ధతితో తీవ్ర నష్టంగతంలో క్రాప్ లోన్ ఆధారంగా రైతులు సాగు చేసిన పంటలకు కాకుండా ఇష్టానుసారంగా ఇన్సురెన్స్ ఇచ్చేవారు. ఐదేళ్లుగా ఉచిత పంటల బీమా అమలు చేయడం వలన పైసా ప్రీమియం చెల్లించాల్సిన పని లేకుండా సాగు చేసిన పంటకు బీమా పరిహారం నేరుగా అందింది. ఈ పథకాన్ని కొనసాగించాలి. పాత పద్ధతితో తీవ్రంగా నష్టపోతాం.– ఎన్.రాజేశ్వరరెడ్డి, సింహాద్రిపురం, వైఎస్సార్ జిల్లా -
ఉచిత పంటల బీమా కొనసాగించాల్సిందే
సాక్షి, అమరావతి: రైతులపై భారం పడకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 2019కి ముందు ఉన్న పాత పద్ధతిలోనే పంటల బీమాను అమలుచేస్తామని వ్యవసాయ శాఖపై జరిగిన తొలి సమీక్షలో సీఎం చంద్రబాబు ప్రకటించడాన్ని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి. కృష్ణయ్య, కె. ప్రభాకర్రెడ్డి తప్పుబట్టారు. రైతుల భాగస్వామ్యంతో పంటల బీమా అమలుచేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. పెరిగిన పెట్టుబడి ఖర్చుల నేపథ్యంలో బీమా ప్రీమియం భారం భరించే స్థితిలో రైతుల్లేరని వారన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలుచేసినట్లుగానే రైతుల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. రైతులపై భారం లేకుండా ఉచిత పంటల బీమా అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రీమియం భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50శాతం చొప్పున భరించాలన్నారు. ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలకూ ఉచిత పంటల బీమా అమలుచేయాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ బీమా సంస్థలొద్దు.. పంటల బీమా అమల్లో ప్రైవేటు, కార్పొరేట్ బీమా సంస్థలను పక్కన పెట్టి ప్రభుత్వ రంగ బీమా సంస్థలను అనుమతించాలన్నారు. ప్రైవేట్ బీమా కంపెనీలు తమ లాభాల కోసం రైతులకు జరిగిన నష్టాన్ని తక్కువచేసి చూపి రైతులకు పంటల బీమా చెల్లించకుండా మోసం చేస్తున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వం కూడా తొలి మూడేళ్లూ తానే బాధ్యత తీసుకుని రైతులకు పంటల బీమా అమలుచేసిందని గుర్తుచేశారు.రెండేళ్లుగా కేంద్రం ఒత్తిడితో పంటల బీమాలోకి ప్రైవేట్, కార్పొరేట్ బీమా కంపెనీలను అనుమతించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఫలితంగా కొన్ని పంటలకు బీమా పరిహారం అందక రైతులు నష్టపోయారన్నారు. కరువు, తుపాను వంటి విపత్తులతోపాటు వాతావరణ ప్రభావంతో పంట దిగుబడి తగ్గిపోయిన పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ఈ పథకం దోహదపడుతుందన్నారు. పంట నష్టం అంచనాలో అధికారుల నివేదికల ఆధారంగా రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతులపై ప్రీమియం భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
మళ్లీ పాత పద్ధతిలోనే పంటల బీమా
సాక్షి, అమరావతి: ప్రస్తుతం ఉన్న ఉచిత పంటల బీమా పథకం స్థానంలో మళ్లీ పాత విధానంలో క్రాప్ ఇన్సూ్యరెన్స్ తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రైతు భాగస్వామ్యం లేకుండా పంటల బీమా స్వరూపాన్నే మార్చేశారని, ఇక నుంచి సాగు చేసే ప్రతీ రైతుకు భాగస్వామ్యం ఉండేలా పంటల బీమా విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పారు. ఖరీఫ్ పంటల సాగులో వ్యవసాయ శాఖ సన్నద్దతపై బుధవారం సచివాలయంలో వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు సాగునీటి విడుదల ప్రణాళికను సీఎం చంద్రబాబుకు వివరించారు. గోదావరి డెల్టాకు జూన్ 1న నీరు విడుదల చేశామని, ఈ రోజు (బుధవారం) పట్టిసీమ, పుష్కర, తాటిపూడి, పురుషోత్తంపట్నం ద్వారా నీటి విడుదల ప్రారంభించామని చెప్పారు. పులిచింతలలో నీటి లభ్యత లేదని, పట్టిసీమ ద్వారా వచ్చే నీటి ద్వారానే కృష్ణా డెల్టాకు సాగు నీరు ఇస్తామన్నారు. జూన్లో హీట్ వేవ్ ఉన్నప్పటికీ, ప్రస్తుతం వర్షాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సగటున 50 శాతం అదనపు వర్షపాతం నమోదైందని, కేవలం 45 మండలాల్లోనే లోటు వర్షపాతం ఉందన్నారు. సీజన్లో ఇప్పటి వరకు 4,14,490 ఎకరాలు సాగు జరగాల్సి ఉండగా 3,04,604 ఎకరాల్లో పంటలు సాగయ్యాయన్నారు. ఏపీలోనే రైతుల అప్పులెక్కువదేశంలో ఎక్కువ అప్పులు ఉండే రైతులు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ పరిస్థితి మారాలన్నారు. ప్రభుత్వ సబ్సిడీలు, పాలసీల ద్వారా సాగు ఖర్చులు తగ్గాలన్నారు. గతంలో క్రమం తప్పకుండా సాయిల్ టెస్ట్లు నిర్వహించి, రైతులకు పోషకాలు అందించే వాళ్లమన్నారు. రాయలసీమ జిల్లాల్లో సబ్సిడీపై పెద్ద ఎత్తున డ్రిప్, స్ప్రింక్లర్లు ఇచ్చామని చెప్పారు. ప్రాజెక్టుల నిర్వహణలో మళ్లీ ఉత్తమ విధానాలు అమలు చేయాలని సూచించారు. జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ను మళ్లీ ప్రోత్సíßæంచాలన్నారు. డ్రోన్లతో పురుగు మందుల పిచికారీపై అధ్యయనం చేయాలని, వాటి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. పంటలకు అధికంగా పురుగు మందులు కొట్టే విధానాలకు స్వస్తి పలకాలన్నారు. ఏ తెగులుకు ఏ మందు కొట్టాలి అనే విషయంలో అధికారులు రైతులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అన్ని పంట కాలువల్లో యుద్ధ ప్రాతిపదికన గుర్రపు డెక్క తొలగించాలని ఆదేశించారు. కృష్ణా నది నీటిని రాయలసీమకు ఎక్కువగా ఉపయోగించి, వృధాగా పోయే గోదావరి వరద నీటిని సద్వినియోగం చేసుకుని కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఆక్వా, హార్టికల్చర్కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. తీవ్ర నష్టాల్లో ఉన్న రైతులకు మళ్లీ భరోసా కల్పించేలా అధికారులు పని చేయాలని ఆదేశించారు. ఐఏఎస్ అధికారులు సైతం సచివాలయం నుంచి పొలాలకు వెళ్లి, రైతులతో నేరుగా మాట్లాడాలన్నారు. ఈ సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ, ఉద్యాన, ఇరిగేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఉచిత పంటల బీమాను కొనసాగించాల్సిందే
సాక్షి, అమరావతి: మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడుకు రాసిన లేఖను సంఘ అధ్యక్షుడు వి.కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శులు కె.ప్రభాకరరెడ్డి ఆదివారం మీడియాకు విడుదల చేశారు. రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయం వెంటనే రైతుల ఖాతాలకు జమ చేయాలని, రబీలో దెబ్బతిన్న పంటలకు సంబంధించి రైతులకు పరిహారం, సున్నా వడ్డీ రాయితీలను జమ చేయాలని, వ్యవసాయ విద్యుత్ మీటర్ల ఏర్పాటు జీవోను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘం కోరింది. రైతు భరోసా కేంద్రాలను అభివృద్ధి చేసి, రైతులకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావాలని, సొసైటీలకు పాలు పోసే రైతులకు లీటర్కు రూ.5, బోనస్ ఇవ్వాలని, మూతపడిన డెయిరీలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. మద్దతు ధరపై ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇవ్వాలని, ఆహార, పప్పుధాన్యాలు, వాణిజ్య, ఉద్యాన పంటలన్నిటికి మద్దతు ధరలు ప్రకటించాలని కోరింది. రబీలో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన రూ.1,600 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని, రైతుల చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని, అప్పుల పాలైన రైతులు బకాయిపడిన రూ.2 లక్షల వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని కోరింది.చక్కెర కర్మాగారాల్ని పునరుద్ధరించాలిరాష్ట్రంలోని 32 లక్షల కౌలు రైతులకు యజమాని సంతకంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు వారికి అవసరమైన బ్యాంక్ రుణాలు, ఇతర సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘం కోరింది. రాష్ట్రంలో మూతపడిన 25 చక్కెర కర్మాగారాలను వెంటనే పునరుద్ధరించాలని, పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి నిర్వాసితులకు పునరావాసం, నష్టపరిహారం పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేసింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని కోరింది. -
వరికి ని‘బంధనాలు’
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేయాలని నిర్ణయించిన పంటల బీమా పథకంలోని నిబంధనలు వరి రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఒక జిల్లాలో మొత్తం సాగువిస్తీర్ణంలో 25 శాతానికి మించి విస్తీర్ణమున్న పంటలను మాత్రమే గ్రామం యూనిట్గా పంటల బీమా పథకం అమలు చేయాలనే నిబంధన ఉంది. ఈ నిబంధన ప్రకారం సంగారెడ్డితోపాటు, వికారాబాద్, జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఏ ఒక్క పంట కూడా 25 శాతానికి మించి సాగు కావడం లేదు. దీంతో ఈ జిల్లాల్లో గ్రామం యూనిట్గా అమలు చేసే అవకాశం లేకుండాపోతోంది. ఈ వానాకాలం నుంచే కొత్త పథకం అమలు అధిక వర్షాలు, వడగండ్ల వానలు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా పంటల బీమా పథకం అమలు చేస్తారు. ఐదేళ్ల క్రితం నిలిపివేసిన ఈ పథకాన్ని పునరుద్ధరించాలని రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో భాగంగా ఈ వానాకాలం నుంచే రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. నిర్మల్లో వరితోపాటు, సోయా కూడా.. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో ఈ పంటల బీమా పథకం అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో వరి పంటను గ్రామం యూనిట్గా అమలు చేసేందుకు నిబంధనలు కలిసొస్తున్నాయి. నిర్మల్ జిల్లా వరితోపాటు, సోయా పంట కూడా గ్రామం యూనిట్గా అమలు చేసేందుకు వీలు కలుగుతోంది. మండలం యూనిట్ అయితే వరి రైతుకు నష్టం పంటల బీమా పథకం గ్రామం యూనిట్గా అమలు చేస్తేనే ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు క్లెయిమ్ (పరిహా రం) అందుతుంది. మండలం యూనిట్గా అమలు చేస్తే చాలామంది రైతులకు ఈ క్లె యిమ్ అందదు. ఎలాగంటే.. మండలం యూనిట్గా తీసుకుంటే అధిక వర్షాలుగానీ, వడగండ్ల వానగానీ, ఈదురుగాలుల వర్షం కారణంగా మండలవ్యాప్తంగా అన్ని గ్రామా ల్లో మొత్తం వరి పంట నష్టపోతే మాత్రమే రైతులకు పరిహారం అందుతుంది.మండలంలో కొన్ని గ్రామాల్లో పంట నష్టం జరిగి, మరికొన్ని గ్రామాల పరిధిలో నష్టం జరగకపోతే పంట నష్టపోయిన గ్రామాల రైతులకు కూడా పరిహారం అందదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఈ నిబంధనపై రైతు సంఘాలు పెదవి విరుస్తున్నాయి. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అన్ని జిల్లాలకు ఒకే విధంగా నిబంధనలను సరళీకృతం చేయాలని కోరుతున్నారు. -
‘పంటల బీమా’కి రూ.3 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం రూ.3 వేల కోట్లు ఖర్చు చేయనుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్లడించారు. ప్రభుత్వమే రైతుల ప్రీమియాన్ని చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ వానాకాలం పంటల సీజన్ నుంచే అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ మేరకు బుధవారం మంత్రి తుమ్మల ఒక ప్రకటన జారీచేశారు. తడిచిన ధాన్యాన్ని సైతం తమ ప్రభుత్వం సేకరిస్తుందని వివరించారు. గతంతో పోలిస్తే ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు జిల్లాకొక ఐఏఎస్ను నియమించి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని వివరించారు. తరుగు, తాలు పేరుతో కోతలు లేవని స్పష్టం చేశారు. గతంలో ప్రతి క్వింటాకు 7 నుంచి 10 కేజీల వరకు తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ జరిగిందనీ, ఈ దఫా మిల్లర్ల దోపిడీపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో కోతలకు మిల్లర్లు స్వస్తి చెప్పారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ప్రతి కింటాపై రైతుకు రూ.150 నుంచి రూ.200 రూపాయల వరకు అదనపు లబ్ధి చేకూర్చామని తెలిపారు. పంట అమ్ముకున్న ఐదు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు చేరుతుందని మంత్రి స్పష్టం చేశారు. గతంలో 45 రోజులు పట్టేదని, దాంతో రైతు ఎంతో వడ్డీ నష్ట పోయేవాడని గుర్తు చేశారు. భవిష్యత్లో దొడ్డు వడ్లకు కూడా రూ.500 బోనస్ తెలంగాణలో సన్న వడ్ల సాగును పెంచేందుకు ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించిందని మంత్రి తుమ్మల పునరుద్ఘాటించారు. రైతులు నాట్లేసుకునే సమయం దగ్గర పడిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన ఈ స్కీంను ప్రవేశపెట్టామని తెలిపారు. భవిష్యత్లో దొడ్డు వడ్లకు కూడా ఈ స్కీం వర్తింపచేస్తామని హామీనిచ్చారు. రాష్ట్రంలో దొడ్డు వడ్లు తినడం చాలా తగ్గిపోయిందనీ, పేదలు కూడా పెద్దోళ్లు తినే సన్న బియ్యం తినాలనే సంకల్పంతో రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి అన్ని హామీలను పూర్తి చేసి తీరుతామనీ, లేకుంటే ఓట్లే అడగబోమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. -
పంటల బీమాకు కేంద్రం ఓకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోనూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలులోకి రానుంది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అనుమతి కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. దీనికి కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. వచ్చే సీజన్ నుంచి అమలు చేయాలంటే తక్షణమే పథకాన్ని అమలు చేసే కంపెనీలను టెండర్ల ద్వారా ఆహ్వానించాలి. దీనికి నోటిఫికేషన్ జారీ చేయాలి. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇప్పుడు టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరి. పంటల బీమా పథకం ప్రారంభం అనేది ఎంతోమంది రైతులను ప్రభావితం చేయనున్నందున ఈసీ అనుమతి లేనిదే ముందుకు సాగలేమని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఈసీ అనుమతి ఇవ్వకుంటే ఈ పథకం వచ్చే సీజన్ నుంచి అమలు అయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని అంటున్నారు. క్లస్టర్ల వారీగా అమలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతులకు అనుకూలంగా లేదన్న భావనతో ఈ పథకం నుంచి 2020లో బయటకు వచ్చింది. అయితే ఏదో ఒక పంటల బీమా పథకం ఉండటమే మేలన్న భావన కొందరు రైతుల్లో ఉంది. దీంతో చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం పాత పథకాన్నే అమలు చేయనుంది. దీంతో ప్రకృతి వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ పథకాన్ని క్లస్టర్ల వారీగా అమలు చేయనున్నారు. గతంలో అప్పటి ప్రభుత్వం ఆరు క్లస్టర్లు ఏర్పాటు చేసింది. ఆ ప్రకారమే ఈసారి కూడా ముందుకు సాగే అవకాశాలున్నాయి. ప్రీమియం ఇలా... వానాకాలం సీజన్లో సాగుచేసే ఆహారధాన్యాల పంటలకు 2 శాతం ప్రీమియం రైతులు చెల్లించాలి. – పత్తి, మిర్చి సహా ఇతర వాణిజ్య, వాతావరణ ఆధారిత పంటలకు మాత్రం 5 శాతం రైతులు ప్రీమియం చెల్లించాలి. అయితే జిల్లాలను బట్టి, అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి ప్రీమియం రేటు మారుతుండేది. అయితే ఈసారి రైతు వాటా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని ఇప్పటికే పలువురు మంత్రులు ప్రకటించారు. కాబట్టి రైతులంతా ఈ పథకంలోకి వస్తారు. మరోవైపు ఈ పథకాన్ని అమలు చేసేందుకు జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలు ఏర్పాటు కానున్నాయి. దీనికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. బీమా అమలుకు సూచనలు పంటల బీమా పథకం రాష్ట్రంలో అమలు చేయాలంటే ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలని పలువురు అధికారులు, వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. – బీమా కంపెనీలు ప్రీమియం ధరలను ఏటేటా భారీగా పెంచుతుంటాయి. ఈ పద్ధతి మార్చాలి. – కంపెనీలు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం లేదు. జిల్లా స్థాయిలో అధికారులు ఉండటం లేదు. దీంతో రైతులకు బీమాపై అవగాహన కల్పించే పరిస్థితి లేకుండా పోయింది. – కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బీమా ప్రీమియం చెల్లించిన మూడువారాల్లోగా రైతులకు పరిహారం ఖరారు చేయాలి. గతంలో నెలల తరబడి ఆలస్యం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. – రైతుల ఫిర్యాదులు వినడానికి, పరిష్కరించడానికి కచ్చితమైన యంత్రాంగం జిల్లా, రాష్ట్రస్థాయిలో నెలకొల్పాలి. – చిన్నచిన్న అంశాలను ఆధారం చేసుకొని పంటల బీమాను రైతులకు అందకుండా చేస్తున్నారు. ఇది పథకం అమలును నీరుగారుస్తుంది. – వివిధ దశల్లో విధిస్తున్న షరతులు, నిబంధనల కారణంగా బీమా నష్టపరిహారం పొందడం గగనంగా మారింది. వీటిని మార్చాలి. -
వచ్చే ఖరీఫ్ నుంచి పంటలకు బీమా
ఖలీల్వాడి/నిజామాబాద్ /కామారెడ్డి నెట్వర్క్: వచ్చే ఖరీఫ్ నుంచి పంటలకు బీమా అమలు చేస్తామని, ప్రీమియం డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురు వారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వడగళ్ల వానలతో పంటలు దెబ్బ తిన్న రైతులను ఆదుకుంటామన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 40 వేల ఎకరాల వరకు నష్టం జరిగిందన్నారు. అధికారులు సర్వే పూర్తి చేసిన తర్వాత ఎకరానికి రూ.10 వేలు నష్ట పరిహారం అందిస్తామన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు ఆధికారంలో ఉన్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రుణమాఫీ, మహిళలకు జీరో వడ్డీ, దళితులకు మూడెకరాల పంపిణీ వంటి హామీలు ఇచ్చి అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకాలను అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే బీఆర్ఎస్ సర్కార్ రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. వీటికి రూ.60 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోందన్నారు. దీనికోసం మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మహా అయితే ఒక సీటు రావొచ్చునని అన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అ«ధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, ఎన్డీసీసీబీ చైర్మన్ రమేశ్రెడ్డి పాల్గొన్నారు. రైతులు అధైర్యపడవద్దు : వడగళ్ల వానలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండూర్, పెద్దవాల్గోట్ గ్రామాలు, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం లింగుపల్లి, భిక్కనూరు మండలం అంతంపల్లి, లక్ష్మీదేవునిపల్లి, జంగంపల్లి, బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామాల్లో పర్యటించారు. వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మంత్రి వెంట రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, ఎమ్మెల్యే భూపతిరెడ్డి తదితరులు ఉన్నారు. -
రైతులకు ఉచితంగా పంటల బీమా!
సాక్షి, హైదరాబాద్: రైతులు పైసా ఖర్చు చేయకుండా ప్రభుత్వమే ఉచితంగా పంటల బీమాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రాష్ట్రంలో రైతులు చెల్లించాల్సిన వాటా ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుందని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం సీజన్ నుంచి ఫసల్ బీమా పథకాన్ని తిరిగి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రైతులు చెల్లించాల్సిన ప్రీమియం చాలా ఎక్కువగా ఉన్నందున గత ప్రభుత్వం ఈ బీమా పథకం నుంచి బయటకు వచ్చింది. దీంతో కొంతకాలంగా రైతులకు పంటల బీమా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కొత్త సర్కారు రైతుల ప్రీమియం వాటాను తామే చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిసింది. క్లస్టర్ల వారీగా అమలు వ్యవసాయ శాఖ వర్గాల అంచనా ప్రకారం..రాష్ట్ర రైతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సీజన్లకు కలిపి దాదాపు రూ.2 వేల కోట్లు బీమా కంపెనీలకు ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అందులో రైతుల వాటా దాదాపు రూ.300 కోట్లు ఉంటుందని అంచనా. కాగా ఫసల్ బీమా పథకంలో చేరే విషయమై కేంద్ర ప్రభుత్వానికి త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయనుంది. పంటల బీమా పథకాన్ని క్లస్టర్ల వారీగా అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని జిల్లాలను ఆరు క్లస్టర్లుగా విభజిస్తారు. కాగా బీమా పథకంలో ఉన్న వివిధ రకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ పథకాన్ని అమలు చేస్తారు. అకాల వర్షాలతో నష్టపోతే ఒక రకమైన ప్రీమియం, కోత కోసి కల్లాల్లో ఉన్నప్పుడు వర్షం పడి నష్టం జరిగితే మరో రకమైన ప్రీమియం, దిగుబడి తక్కువ వస్తే అందుకు సంబంధించి మరో ప్రీమియం ఇలా వివిధ రకాలుగా పథకంలో వెసులుబాట్లు ఉన్నాయి. దీంతో ఏ క్లస్టర్లలో ఎటువంటి వాతావరణం ఉంటుందన్న దానికి అనుగుణంగా పథకాన్ని అమలు చేస్తారు. బీమా కంపెనీలు కోట్ చేసే ధరలను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నెలల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ రావడానికి ముందే పథకానికి సంబంధించి మార్గదర్శకాలు వెలువడనున్నాయి. -
పాత పద్ధతిలోనే పంటల బీమా
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ తరహాలో రాష్ట్రంలో సొంతంగా పంటల బీమా తీసుకురావాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వెనక్కి తగ్గింది. కొన్నేళ్ల కింద రాష్ట్రంలో అమలు చేసిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై)నే తిరిగి అమలు చేసేందుకు సిద్ధమైంది. దీనితో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందనుంది. నిజానికి 2020 వరకు రాష్ట్రంలో పీఎంఎఫ్బీవై అమలైంది. కానీ అప్పటి సర్కారు రైతులకు అనుకూలంగా లేదన్న భావనతో ఈ పథకం నుంచి బయటికి వచ్చింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఎలాంటి పంటల బీమా అమల్లో లేదు. పంట దెబ్బతిన్నప్పుడు రైతులు నష్టపోతున్నారు. ఏదో ఒక పంటల బీమా పథకం ఉంటే మేలన్న భావన చాలా మంది రైతుల్లో నెలకొని ఉంది. పంటల బీమాతో ప్రయోజనం రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులు ఉన్నారు. గతంలో పంటల బీమా పథకాలు అమల్లో ఉన్నప్పుడు సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల మంది బీమా చేయించేవారు. నేరుగా పంటల బీమా తీసుకోవడానికి రైతులు ముందుకు రావడంలేదని భావించిన సర్కారు.. బ్యాంకులు, సహకార సంఘాల్లో పంట రుణాలు తీసుకునే రైతులకు తప్పనిసరిగా పంటల బీమా చేయించే నిబంధన పెట్టింది. పంట రుణం ఇచ్చేప్పుడే బీమా ప్రీమియాన్ని మినహాయించుకొని మిగతా డబ్బులు రైతులకు ఇచ్చేవారు. ప్రకృతి విపత్తులు సంభవిస్తే రైతులకు ఎంతో కొంత నష్టపరిహారం వచ్చేది. 2012–13లో 10 లక్షల మంది పంటల బీమా చేయగా.. పంట నష్టపోయిన 1.80 లక్షల మందికి రూ.78.86 కోట్ల పరిహారం అందింది. 2013–14లో 8.52 లక్షల మంది బీమా చేయించగా.. 1.18 లక్షల మందికి రూ.56.39 కోట్ల పరిహారం వచ్చింది. 2015–16లో 7.73 లక్షల మంది బీమా చేస్తే.. ఆ ఏడాది పంట నష్టం ఎక్కువ జరగటంతో ఏకంగా రూ.441.79 కోట్ల నష్ట పరిహారం రైతులకు అందింది. ► 2016 వానాకాలం సీజన్ నుంచి దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఫసల్బీమా యోజన (పీఎంఎఫ్బీవై) పథకం అ మల్లోకి వచ్చింది. దీనికి చెల్లించే ప్రీమియంలో రైతులతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంతమేర సొ మ్మును తమ వాటాగా భరిస్తాయి. 2016–17లో 8.87 లక్షల మంది మంది రైతులు ఫసల్ బీమా చేయించగా.. 1.34 లక్షల మందికి రూ.111.33 కోట్ల పరిహారం వచ్చింది. ∙2018–19, 2019–20 సంవత్సరాల్లో రూ.960 కోట్ల పరిహారం రాష్ట్రానికి మంజూరైనా.. అందులో కొంతమేర మాత్రమే రైతులకు దక్కింది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ప్రీమియం చెల్లించకపోవటంతో ఈ పరిస్థితి నెలకొంది. బీమా ప్రీమియంపై కట్టడి తప్పనిసరి పంటల బీమా వల్ల లాభం ఉన్నా.. చాలా మంది రైతులు బీమా ప్రీమియం విషయంలో అసంతృప్తితో ఉన్నారు. బీమా కంపెనీలు భారీగా లాభాలు గడిస్తున్నా.. ప్రీమియం ధరలను పెంచుకుంటూ పోయాయని వాపోతున్నారు. తెలంగాణలో అప్పట్లో రబీలో చెల్లించే ప్రీమియం మొత్తం దాదాపు బీమా కంపెనీలను బాగు చేయడానికే అన్నట్టుగా అమలైందని.. ప్రైవేటు బీమా సంస్థలకు పంటల బీమా పథకంలో అవకాశం కల్పించడంతో పరిస్థితి మరింత దిగజారిందని విమర్శలు ఉన్నాయి. పీఎంఎఫ్బీవై కింద వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుములకు రెండు శాతం చొప్పున, పసుపు రైతులు ఐదు శాతం చొప్పున ప్రీమియం చెల్లించారు. ఇక పునరుద్ధరించిన వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి, మిరప, ఆయిల్పాం, బత్తాయి పంటలకు పంట రుణంలో 5 శాతాన్ని రైతులు ప్రీమియంగా చెల్లించారు. పైగా జిల్లా జిల్లాకు ప్రీమియం ధరలు మారుతుండేవి. ఉదాహరణకు 2018లో పెసరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో హెక్టార్కు రూ.24,165 చొప్పున, మిరపకు ఏకంగా రూ.38,715 చొప్పున ప్రీమియంగా ఖరారు చేయడం గమనార్హం. అంత దారుణంగా ప్రీమియం రేట్లు ఉండటంతో రైతులు కూడా పంటల బీమాపై తీవ్ర అసంతృప్తి చెందారు. తమకు పంటల బీమా వద్దని మొత్తుకున్నారు. ఈ క్రమంలోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమాను నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ అమల్లోకి తెస్తున్న నేపథ్యంలో.. బీమా ప్రీమియంపై కట్టడి అవసరమని, ఆ దిశగా వ్యవసాయశాఖ చర్యలు తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. -
పంటల భీమాపై డ్రామోజీ విషం
-
Fact Check: నమ్మక ద్రోహం నారా బాబుదే!
సాక్షి, అమరావతి: దేశంలో మరెక్కడా లేని విధంగా నోటిఫై చేసిన ప్రతి పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. లబ్ధి పొందిన రైతుల సంఖ్యను చూసినా, అందుకున్న పరిహారాన్ని పరిశీలించినా టీడీపీ హయాంతో పోలిస్తే ఇప్పుడు రెట్టింపు స్థాయిలో ప్రయోజనం చేకూరిందన్నది రామోజీకి మింగుడు పడకున్నా కాదనలేని సత్యం. అర్హులైన ప్రతి ఒక్కరికీ వెతికి మరీ పరిహారాన్ని అందిస్తూ పూర్తి పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ను స్ఫూర్తిగా తీసుకొని మెజార్టీ రాష్ట్రాలు ఇదే బాట పట్టాయి. చాలా రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయంటే అది బాగున్నట్లే కదా! చంద్రబాబు హయాంలో 6.19 లక్షల మంది అన్నదాతలకు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బీమా పరిహారాన్ని సీఎం జగన్ ప్రభుత్వమే చెల్లించింది. నిత్యం బాబు భజనలో మునిగి తేలుతున్న రామోజీ మాత్రం బాబోయ్ అన్నదాతలకు ద్రోహం చేస్తున్నారంటూ, ఉచిత పంటల బీమా పేరుతో కోతలు వేస్తున్నారంటూ గావు కేకలు పెడుతున్నారు!! రైతులపై పైసా భారం లేకుండా.. పంటల బీమా సీజన్వారీగా నోటిఫై చేసిన పంటలకు మాత్రమే వర్తిస్తుంది. గతంలో పీఎంఎఫ్బీవై కింద బ్యాంకు రుణం తీసుకున్న రైతులతోపాటు కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ప్రీమియం చెల్లించిన ఇతర అన్నదాతలకు మాత్రమే బీమాను వర్తింపచేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక 2019 నుంచి రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఈ క్రాప్ డేటా ఆధారంగా నోటిఫై చేసిన పంటలకు, సాగైన ప్రతీ ఎకరాకు యూనివర్సల్ కవరేజ్తో బీమా రక్షణ కల్పిస్తోంది. 2019–20లో పీఎంఎఫ్బీవైతో కలిసి ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయగా 2020–21, 2021–22 సీజన్లలో పరిహారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. ఈ క్రాప్ డేటాతో యూనివర్సల్ కవరేజ్ కల్పించేందుకు కేంద్రం అంగీకరించడంతో 2022–23 సీజన్ నుంచి పీఎంఎఫ్బీవైతో ఉచిత పంటల బీమాను అనుసంధానించి అమలు చేస్తున్నారు. హేతుబద్ధీకరణ కోసం.. బీమా పరిహారం తగ్గిన సందర్భాల్లో అధిక ప్రీమియం వసూలుతో వచ్చే ఆదాయం ద్వారా బీమా కంపెనీలు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రీమియం రేట్ల హేతుబద్ధీకరణకు రిస్క్ షేరింగ్ మోడళ్లను ప్రతిపాదించింది. వీటిలో ఒకటైన కప్ అండ్ క్యాప్ 80–110 మోడల్కు ప్రయోగాత్మకంగా తొలుత మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో 2020–21లో శ్రీకారం చుట్టగా తర్వాత పలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఈ మోడల్ను ఉచిత పంటల బీమా కింద 2023 – 24 వ్యవసాయ సీజన్ నుంచి దిగుబడి ఆధారిత çపంటల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కప్ అండ్ క్యాప్ (80–110) బీడ్ మోడల్ ద్వారా కంపెనీలకు చెల్లించాల్సిన ప్రీమియం హేతుబద్ధీకరిస్తారేగానీ రైతులకు చెల్లించాల్సిన బీమా పరిహారంలో ఎలాంటి కోతలు ఉండవు. కోతలు పెట్టడానికి చాన్స్ లేదు రాష్ట్రంలోని 9 క్లస్టర్ల పరిధిలో దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి 110 శాతం కన్నా ఎక్కువ నష్టం సంభవించిన సందర్భాల్లో ఆ అదనపు పరిహారం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ రైతులకు పూర్తి బీమా పరిహారాన్ని చెల్లిస్తుంది. ఇది పూర్తిగా బీమా కంపెనీలకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విధానపరంగా జరిగే వ్యవహారమే కానీ రైతులకు చెల్లించే బీమా పరిహారానికి సంబంధించింది కాదన్న విషయం రామోజీకి తెలియదు కాబోలు! ఇదంతా బీమా కంపెనీలకు అదనపు ప్రయోజనాన్ని నివారించే చర్యే తప్ప ఇందులో రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లదు. ఖరీఫ్లో 70.80 లక్షల ఎకరాలకు కవరేజ్ 2023 ఖరీఫ్లో 15 పంటలను దిగుబడి ఆధారంగా, ఆరు పంటలను వాతావరణ ఆధారంగా నోటిఫై చేసి ఉచిత బీమా వర్తింప చేశారు. 2023 – 24 రబీలో 13 పంటలను దిగుబడి ఆధారంగా, నాలుగు పంటలను వాతావరణ ఆధారంగా అక్టోబర్లో నోటిఫై చేసి ఉచిత బీమా వర్తింప చేశారు. 2023 ఖరీఫ్లో 93 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా నోటిఫై చేసిన పంటలకు సంబంధించి 70.80 లక్షల ఎకరాల్లో సాగైన వాటికి బీమా వర్తింప చేశారు. తద్వారా 34.70 లక్షల మంది రైతులు బీమా రక్షణ పొందారు. జాబితాలను అక్టోబర్ 31 నాటికి కేంద్రానికి కూడా పంపించారు. వీటిని నేషనల్ క్రాప్ ఇన్సూరెన్సు పోర్టల్లో నమోదు చేసిన తర్వాత రైతులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిన ప్రీమియం వాటాలను నిర్ధారిస్తారు. ఆ మేరకు రైతుల వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాను కలిపి బీమా కంపెనీలకు చెల్లిస్తుంది. ఆ తర్వాత కేంద్రం తమ వాటా జమ చేస్తుంది. తద్వారా బీమా కంపెనీలు అర్హత కలిగిన రైతుల ఖాతాలకు పరిహారం చెల్లిస్తాయి. ఇదే విధానాన్ని 2022 – 23లో అనుసరించారు. గతంలో ఎప్పుడు లేని విధంగా తదుపరి సంవత్సరం అదే సీజన్ ముగిసే నాటికి బీమా పరిహారం చెల్లిస్తున్నారు. ఏపీ బాటలోనే పలు రాష్ట్రాలు దిగుబడి ఆధారిత పంటల కోసం రిస్క్ షేరింగ్ మోడల్ను తమిళనాడుతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాలు కూడా ఈ ఏడాది నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నాయి. కర్ణాటక ఇప్పటికే ఖరారైన టెండర్లను సైతం రద్దు చేసి వచ్చే రెండేళ్లకు 80 –110 మోడల్ ద్వారా కొత్తగా టెండర్లకు వెళ్లేందుకు సిద్ధపడింది. పధకం అమలుకు సంబంధించి అన్ని వ్యవహారాలు పోర్టల్ ద్వారా పారదర్శకంగా జరుగుతాయి. మార్గదర్శకాలను అనుసరించి దిగుబడి ఆధారిత పంటలకు పంట కోత ప్రయోగాల ద్వారా నమోదయ్యే వాస్తవ దిగుబడుల ఆధారంగా లెక్కించిన బీమా పరిహారాన్ని చెల్లిస్తారు. వాతావరణ ఆధారిత పంటలకు వాతావరణంలో హెచ్చు తగ్గులను ప్రామాణికంగా తీసుకుని బీమా పరిహారం లెక్కిస్తారు. అలాగైతే ఉచితంగా ఎందుకిస్తుంది? వాతావరణ ఆధారిత పంటలకు పాత పద్ధతిలోనే టెండర్లను ఖరారు చేశారు. దేశంలోని ఏ రాష్ట్రం వాతావరణ ఆధారిత బీమా పధకంలో రిస్క్ షేరింగ్ మోడల్ను అమలు చేయడం లేదు. ఇక రామోజీ చెబుతున్నట్లుగా ఆర్థిక భారం తగ్గించుకోవడమే ప్రభుత్వ లక్ష్యమైతే.. అసలు ఉచిత పంటల బీమా పథకం అమలు ద్వారా యూనివర్సల్ కవరేజీ దిశగా అడుగులు వేసేదే కాదు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్లు పరిహారం మాత్రమే ఇవ్వగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 54.48 లక్షల మందికి రూ.7,802.05 కోట్లు పరిహారం అందచేసింది. గత సర్కారు హయాంతో పోలిస్తే ఇప్పుడు అదనంగా 23.63 లక్షల మంది లబ్ధి పొందగా పరిహారం పరంగా రూ.4,390.85 కోట్ల మేర అదనంగా రైతన్నలకు ప్రయోజనం చేకూరింది. -
రాష్ట్రంలోనూ పంటల బీమా!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమా పథకాన్ని అమలు చేసే యోచనలో ఉంది. రైతు యూని ట్గా దీని రూపకల్పనకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకొచ్చాక పంటల బీమా పథకంపై ఒక నిర్ణయానికి వస్తామని అధికారులు చెబుతున్నారు. వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఈ పథకం అమలు జరిగేలా కార్యా చరణ ఉంటుందన్నారు. పంటల బీమా అమలు లోకి వస్తే ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగే రైతులకు ఆర్థికసాయం చేసేందుకు వీలుంటుంది. పంటల బీమాలో రైతులు కొంత ప్రీమియం భరిస్తే, ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో తన వాటాగా చెల్లి స్తుంది. పంటల బీమాను అమలు చేసే కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారు. ఆ ప్రకారం కంపెనీలు పంట నష్టం జరిగితే రైతులకు పరిహారం ఇవ్వాలి. అయితే రైతులపై ఏమాత్రం ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వమే అంతా చెల్లిస్తేనే ప్రయోజన ముంటుందని అధికారులు అంటున్నారు. పంటల బీమా లేక రైతుల అవస్థ: కేంద్రం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఉంది. ఇది 2016–17 రబీ నుంచి ప్రారంభమైంది. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు దీనిని ఏర్పాటు చేశారు. 2019–20 వరకు ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగింది. అయితే ఈ పథకం కంపెనీలనే బాగుపర్చుతుందన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఫసల్ బీమా నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి విపత్తులకు పంట నష్టపోయిన రైతులు ఆర్థిక సాయం అందే అవకాశమే లేకుండా పోయింది. 2020–21 వానాకాలం, యాసంగి సీజన్లు కలిపి 9 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 2021–22లోనూ 12 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కానీ రైతులకు ఒక్కపైసా నష్టపరిహారం అందలేదు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో వడగళ్లు, భారీ వర్షాలకు జరిగిన పంట నష్టం జరిగింది. దాదాపు 10 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేయగా, చివరకు వ్యవసాయశాఖ 2.30 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు తేల్చింది. ఎకరాకు ప్రభుత్వం రూ.10 వేల చొప్పున రైతులకు రూ. 230 కోట్లు పరిహారంగా ప్రకటించింది. ఇక మొన్నటికి మొన్న ఈ నెల మొదటివారంలో రాష్ట్రంలో తుపాను కారణంగా వివిధ రకాల పంటలకు దాదాపు 5 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. కానీ రైతులకు ఎలాంటి ఆర్థిక చేయూత అందలేదు. వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడంలోనూ విఫలమైంది. ఇలా ప్రతీ ఏడాది రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. పంటల బీమాతోనే రైతులకు మేలు ఫసల్ బీమాకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక పంటల బీమా పథకం ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న దానిపై గత ప్రభుత్వ హయాంలోనే కసరత్తు జరిగింది. గ్రామం యూనిట్గా కాకుండా రైతు యూనిట్గా దీనిని ప్రవేశపెట్టాలని అనుకున్నారు. కానీ అమలుకు నోచుకోలేదు. ఇప్పటికే రెండు మూడు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలతో విసిగివేసారి బయటకు వచ్చి, సొంత పథకాలను రూపొందించుకున్నాయి. బెంగాల్ ప్రభుత్వం విజయవంతంగా సొంత పథకాన్ని అమలు చేస్తుంది. అక్కడ అధ్యయనం చేసి, ఆ ప్రకారం ముందుకు సాగాలని అధికారులు అనుకున్నారు. కానీ ఏదీ ముందుకు పడలేదు. కేంద్ర ఫసల్ బీమా పథకం వల్ల కంపెనీలకు లాభం జరిగిందనేది వాస్తవమే కావొచ్చు. కానీ ఎంతో కొంత రైతులకు ప్రయోజనం జరిగిందని కూడా రైతు సంఘాలు అంటున్నాయి. ► 2016–17లో తెలంగాణలో వివిధ కారణాలతో 1.58 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దీంతో 2.35 లక్షల మంది రైతులు రూ. 178 కోట్లు నష్టపరిహారం పొందారు. ► 2017–18లో వివిధ కారణాలతో 3.18 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో 4.42 లక్షల మంది రైతులు రూ. 639 కోట్లు పరిహారం పొందారు. ► 2018–19లో 1.2 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, 2.2 లక్షల మంది రైతులు రూ. 570 కోట్ల పరిహారం పొందారు. ► 2019–20లో 2.1 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, 3.24 లక్షల మంది రైతులు రూ. 480 కోట్ల పరిహారం పొందారు. ►ఫసల్ బీమా పథకం నుంచి తప్పుకున్న తర్వాత వ్యవసాయశాఖ నష్టం అంచనాలు వేయడం కూడా నిలిపివేసింది. దీంతో రైతులు నష్టపోతూనే ఉన్నారు. -
పొగాకుపైనా వితండవాదమేనా?
సాక్షి, అమరావతి: రామోజీరావు, ఆయన విషపుత్రిక ‘ఈనాడు’కు నిత్యం ఒకటే ఎజెండా.. ‘కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకనర్హం’ అన్నట్టు.. రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్మడంలో రామోజీరావు వ్యవహారం కూడా ఇంతే. మోకాలికి, బోడి గుండుకు ముడివేసినట్టు ప్రతి అంశాన్ని ప్రభుత్వానికి అంటగడతారు. తాజాగా పొగాకును ప్రభుత్వం పంటల బీమాలో చేర్చలేదని.. ఈ–క్రాప్లో నమోదు కూడా చేయలేదని ఒక అబద్ధపు కథనంతో ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దిగారు. ‘పంటల బీమా లేదు.. ఈ–క్రాప్లో నమోదూ కాలేదు’ అంటూ ఒక విష కథనాన్ని సోమవారం ‘ఈనాడు’లో వండివార్చారు. దానిపై అసలు నిజాలు ఇవీ.. సాగు చేయాలంటే బోర్డు అనుమతి తప్పనిసరి పొగాకు.. వాణిజ్య పంట..పైగా నార్కోటిక్ ప్లాంట్. ఇదేమీ ఆహార పంటో, ఉద్యాన పంటో కాదు. అయినా సరే పొగాకుకు పంటల బీమా ఎందుకు వర్తింప చేయడం లేదంటూ ‘ఈనాడు’ వితండవాదం చేస్తోంది. పోనీ గత చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క పొగాకు రైతునైనా ఆదుకుందా అంటే అదీ లేదు. ఈ నాలుగున్నరేళ్లలో పొగాకు రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకొని ‘ఈనాడు’ విషప్రచారానికి ఒడిగడుతోంది. రాష్ట్రంలో పొగాకు సాధారణ విస్తీర్ణం 2.10 లక్షల ఎకరాలు. ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో సాగవుతోంది. సాధారణంగా ఏటా ఎన్ని మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి చేయాలో? ఆ మేరకు ఎన్ని ఎకరాల్లో పంటసాగు చేయాలో కేంద్ర పొగాకు బోరుŠడ్ నిర్ణయిస్తుంది. అనుమతికి మించి సాగు చేసినా, అదనపు ఉత్పత్తి సాధించినా అమ్ముకోవాలంటే బోర్డు అనుమతులు తప్పనిసరి. అనుమతించిన విస్తీర్ణాన్ని బట్టి ఖరీఫ్లో 50 వేల టన్నులు, రబీలో లక్షన్నర టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వమే కొనుగోలు.. కరోనా దెబ్బకు అంతర్జాతీయంగా పొగాకు రేట్లు పతనమైన సంగతి తెలిసిందే. పొగాకు వాణిజ్య పంటయినప్పటికీ రైతులెవ్వరూ నష్టపోకూడదని చరిత్రలో తొలిసారి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోళ్లను చేపట్టింది. 2019–20 సీజన్లో ఏపీ మార్క్ఫెడ్ ద్వారా 1,29,31,590 కిలోలు కొనుగోలు చేసింది. సగటున కిలోకు రూ.81 చొప్పున 29,228 మంది రైతుల నుంచి రూ.128.65 కోట్లతో కొనుగోళ్లు చేపట్టింది. అత్యధికంగా 7.11 మిలియన్ కిలోల ఎన్వోజీ గ్రేడ్, 4.37 మిలియన్ కిలోల ఎఫ్–05 గ్రేడ్ పొగాకును కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. అంతేకాదు..ఈ నాలుగున్నరేళ్లలో వివిధ రకాల వైపరీత్యాల వేళ అన్ని రకాల రైతులతోపాటే పొగాకు రైతులకూ నష్టపరిహారం చెల్లిస్తూనే వచ్చింది. కొనసాగుతున్న ఈ–క్రాప్ నమోదు.. పొగాకు పంటకాలం.. 100–120 రోజులు. రబీ సీజన్లో అక్టోబర్లో సాగు చేస్తారు. అయితే వర్షాభావ పరిస్థితులతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గడమే కాకుండా చాలా చోట్ల నవంబర్ నాటికి కూడా సాగు ప్రారంభం కాలేదు. సాధారణంగా ఏ పంటయినా సరే పంట వేసిన నెల తర్వాత ఈ–క్రాప్లో నమోదు చేసి ఫొటో అప్లోడ్ చేస్తారు. ఇలా ఏటా నమోదు చేస్తున్నారు. ప్రస్తుత రబీ సీజన్లో ఇప్పటికే 25 వేల ఎకరాల్లో సాగైన పొగాకు పంటను ఈ–క్రాప్లో నమోదు చేశారు. అయితే పంట నమోదు మొదలు పెట్టిన కొద్ది కాలానికే వచ్చిన మిచాంగ్ తుపాన్తో నీట మునిగిన ప్రాంతాల్లో నమోదు చేయడం కొంత కష్టతరంగా మారింది. దీంతో ఈ పంట బుకింగ్కు మినహాయింపునిచ్చారు. కాగా ఈ–క్రాప్ నమోదనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. నష్టపరిహారం కోసం ప్రతిపాదనలు సిద్ధం.. కాగా కరువు ప్రభావిత మండలాల్లో 1,600 ఎకరాల్లో పొగాకు పంట దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఆ మేరకు పంట నష్టపరిహారం(ఇన్పుట్ సబ్సిడీ) అందించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఇటీవల మిచాంగ్ తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో ప్రాథమికంగా 65 వేల ఎకరాల్లో పొగాకు పంట దెబ్బతిన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం పంట నష్టం తుది అంచనాల రూపకల్పన కోసం ఎన్యుమరేషన్ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. ఈ అంచనాలు కొలిక్కి వచ్చాక నిర్దేశించిన పరిహారాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంలో పొగాకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. వాస్తవాలు ఇలా ఉంటే రైతులను భయభ్రాంతులకు గురిచేసేలా ‘ఈనాడు’ దుష్ప్రచారం చేస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. దేశంలోనే బీమా ఎక్కడా లేదు.. రాష్ట్రంలో రైతులు సాగు చేసే దాదాపు అన్ని ప్రధాన పంటలకు వైఎస్సార్ ఉచిత పంటల బీమాను ప్రభుత్వం వర్తింపజేస్తోంది. ఖరీఫ్–2023లో 21 పంటలకు, రబీ–2023–24లో 17 పంటలకు బీమా వర్తింప చేస్తూ పూర్తి మార్గదర్శకాలతో నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అయితే పొగాకు పంట ఆహార భద్రతకు సంబంధించిన పంట కాదు...పైగా వీటి ఉత్పత్తుల వినియోగంతో దుష్పరిణామాల కారణంగా ఈ పంటకు రాష్ట్రంలోనే కాదు..దేశంలోనూ మరెక్కడా బీమా లేదు. నార్కోటిక్ ప్లాంట్గా గుర్తించిన కారణంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంబీఎంవై) ద్వారా నోటిఫై చేసిన పంటల జాబితాలోనూ పొగాకుకు చోటు దక్కలేదు. గతంలో మన రాష్ట్రంలో కూడా ఎప్పుడూ బీమా పథకం ద్వారా నోటిఫై చేసిన దాఖలాలు కూడా లేవు. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవతో పెనాల్టీ లేకుండా.. 2022–23లో 2.04 లక్షల హెక్టార్లలో సాగుకు, 142 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలుకు కేంద్ర పొగాకు బోర్డు అనుమతినిచ్చింది. అయితే మాండూస్ తుపాన్తో అన్ని పంటలు దెబ్బతినడంతో రైతులంతా రేటు బాగుందని పొగాకు సాగు చేశారు. ఫలితంగా 172 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయ్యింది. సాధారణంగా అనుమతికి మించి ఉత్పత్తి అయిన సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితులుంటే 5 శాతం పెనాల్టీతో కొనుగోలుకు కేంద్రం అనుమతినిస్తుంది. అలాంటిది సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ చూపడంతో పెనాల్టీ లేకుండా కొనుగోలుకు కేంద్రం అంగీకరించింది. దీంతో ఆ మేరకు రైతులు పొగాకును అమ్ముకోగలిగారు. -
పంటల బీమాపై రహస్యాలంటూ రామోజీ పనికిమాలిన రాతలు
-
Fact Check: తెలియక కాదు.. అతితెలివి!!
సాక్షి, అమరావతి: నూటికి నూరుశాతం రైతులంతా ఈ–క్రాప్ చేసుకున్నారు. ఆ జాబితాను అక్టోబరు నెలాఖరు నాటికే... అంటే దాదాపు నెల కిందటే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. జాతీయ పంటల బీమా పోర్టల్లో నమోదు కూడా పూర్తయింది. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వ సాంకేతిక బృందం పరిశీలించి... అనంతరం డేటాను ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) పోర్టల్లో ప్రదర్శిస్తారు. రాష్ట్రప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియంను కూడా నిర్ధారించేది అప్పుడే. దీనికి ఏప్రిల్ దాకా సమయం ఉంది. ఇక బీమా చెల్లింపులనేవి వచ్చే సీజన్ మొదలయ్యేలోగా... అంటే జూన్లోగా జరుగుతాయి. ఇదీ ప్రక్రియ. మరి రామోజీరావుకు అంత కంగారెందుకు? రైతులంతా నూటికి నూరుశాతం బీమా ఉందన్న ధీమాతో ఉంటే... రామోజీకెందుకు అంత గుబులు పుడుతోంది? ఎక్కడో కేంద్ర వెబ్సైట్లో ‘ఈనాడు’కు డేటా కనిపించకపోతే.. దానిక్కూడా ముఖ్యమంత్రి జగన్ను బాధ్యుడిని చేస్తూ దిగజారుడు రాతలు రాస్తున్నారంటే వీళ్లనేమనుకోవాలి? 2023 ఖరీఫ్ సీజన్లో ఈ–క్రాప్లో ఏకంగా 70.80 లక్షల ఎకరాల్లోని పంటల వివరాలు, సాగు చేసిన 34.70 లక్షల మంది రైతుల పేర్లు కేంద్రానికి ఎప్పుడో చేరాయి. ఆ సంగతి ‘ఈనాడు’కూ తెలుసు. కేంద్ర సాంకేతిక బృందం పరిశీలన పూర్తవకపోవడం వల్ల వెబ్సైట్లో వివరాలు అప్డేట్ కాకపోయి ఉండొచ్చు. దాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రంపై బురద జల్లాలనుకుంటున్న రామోజీరావు మానసిక స్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? కనీసం కేంద్రం ఆ వివరాలను ఇచ్చే వరకూ ఆగే ఓపిక కూడా లేదా? రాష్ట్రంలో రైతులపై రూపాయి కూడా బీమా ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వమే మొత్తం చెల్లిస్తున్న విషయాన్ని ఎన్నడైనా ప్రశంసించారా రామోజీ? నష్టపోయిన ప్రతి రైతు ఖాతాకూ నేరుగా బీమా మొత్తం జమవుతుండటాన్ని ఏనాడైనా గ్రహించారా? చంద్రబాబు నాయుడి హయాంలో జరగనివన్నీ ఇపుడు జరుగుతుండటాన్ని ఏనాడైనా గుర్తించారా అసలు? అభూత కల్పనలు.. కట్టు కథలతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లటమే ‘ఈనాడు’ పని. రైతులను గందరగోళపరిచి బాబుకు లబ్ధి చేకూర్చే ప్రయత్నమే గురువారం నాటి ‘ఉచిత బీమాపై జగన్నాటకం!’ కథనం. ఈ క్రాప్ నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతి పంటకు, సాగు చేసిన ప్రతి ఎకరాకు యూనివర్సల్ బీమా కవరేజ్తో రైతులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయటమంటే సెల్ఫ్గోల్ కొట్టుకోవటమేనన్న కనీస జ్ఞానం కూడా ‘ఈనాడు’కు లోపించటమే దారుణం. బాబు హయాంలో ఐదేళ్లూ కరువే.. అయినా!! చంద్రబాబు సీఎంగా ఉన్న ఐదేళ్లూ కరువు తాండవిస్తూనే వచ్చింది. పైపెచ్చు అప్పుడప్పుడూ వచ్చిన అకాల వర్షాలు రైతాంగాన్ని దారుణంగా దెబ్బతీశాయి. అయినా సరే... ఆ ఐదేళ్లలో చెల్లించిన బీమా పరిహారం కేవలంరూ.3,411 కోట్లు. అది కూడా 30.85 లక్షల మంది రైతులకు. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ‘డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకా’న్ని ప్రవేశ పెట్టారు. రైతు జేబు నుంచి పైసా చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తి ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ఈ పథకాన్ని రూపొందించారు. నూరుశాతం పంటల్ని ఈ క్రాప్లో నమోదు చేస్తూ.. నమోదైన ప్రతి ఎకరాకూ నష్టపోయిన పక్షంలో బీమా పరిహారం అందిస్తున్నారు. నిజానికి ఈ నాలుగున్నరేళ్లలో పెద్దగా కరువు లేదు. విపత్తులూ తక్కువే. అయినా సరే... ప్రతి ఎకరాకూ కవరేజీ ఉండటంతో ఈ నాలుగేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.7,802 కోట్ల బీమా పరిహారం అందింది. అంటే బాబు హయాంకన్నా దాదాపు ఒకటిన్నర రెట్లు అధికం. దీన్నిబట్టి బాబు హయాంలో బీమా ఏ స్థాయిలో అందిందో ఊహించుకోవచ్చు. కానీ రామోజీరావు ఎన్నడూ చంద్రబాబును ప్రశ్నించనే లేదు. పైపెచ్చు ఈ ప్రభుత్వంపై దారుణమైన విమర్శలు చేస్తూ అంతకంతకూ దిగజారిపోతున్నారు. ఇంత పారదర్శకంగా ఎక్కడా ఉండదు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి సీజన్లో నోటిఫై చేసిన పంటలకు బీమా వర్తింపజేస్తున్నారు. సామాజిక తనిఖీ, గ్రామ సభల అనంతరం ఈ–క్రాప్ జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. తొలుత డిజిటల్ రశీదులో సాగు చేసిన పంట వివరాలను రైతులకు పంపుతారు. ఈ క్రాప్తో పాటు ఈ కేవైసీ నమోదు పూర్తికాగానే భౌతిక రశీదులు ఇస్తారు. ఇందులో ఉచిత పంటల బీమా పథకం వర్తించే నోటిఫై చేసిన పంటలను (స్టార్ గుర్తుతో) ప్రత్యేకంగా తెలియజేస్తూ సంబంధిత సాగుదారు సంతకంతో ఇస్తారు. ఇందులో ‘డాక్టర్ వైస్సార్ ఉచిత పంటల బీమా పథకం’ కింద నోటిఫై చేసిన మీ పంటకు మీరు చెల్లించాల్సిన ప్రీమియం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి తద్వారా పంట బీమా చేయబడినద్ఙి అని స్పష్టంగా పేర్కొంటున్నారు. ఇదీ పారదర్శకత అంటే. సర్కారు చిత్తశుద్ధికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా? వైఎస్ జగన్ సర్కారుకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే నోటిఫై చేసిన పంటలకు సాగైన ప్రతి ఎకరాకు బీమా రక్షణ కల్పిస్తోంది. కేంద్ర నిబంధనల మేరకు ఏ జిల్లాలోనైనా కనీసం 2 వేల హెక్టార్లకు పైబడి సాగవ్వాలి. ఇది కొత్త నిబంధనేమీ కాదు. దశాబ్దాలుగా ఉన్నదే. మరింత మంది రైతులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ఈ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత వ్యవసాయ సీజన్ నుంచి మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చింది. గతంలో చంద్రబాబు ఏలుబడిలో ఒకే పంటకు కొన్ని చోట్ల దిగుబడి ఆధారంగా, మరికొన్ని చోట్ల వాతావరణ ఆధారంగా బీమా వర్తింపజేసేవారు. దీంతో ఒకేలా నష్టం వాటిల్లినా పరిహారంలో వ్యత్యాసంతో రైతులకు నష్టం జరిగేది. ఈ పరిస్థితిని చక్కదిద్ది నోటిఫై చేసిన పంటలు ఏ కేటగిరీ కింద సాగైనా ఒకే రీతిలో బీమా రక్షణ కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు. అంతే కాదు.. పెరిగిన సాగు విస్తీర్ణాన్ని బట్టి కొత్త పంటలను బీమా పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ సీజన్లో జిల్లాలవారీగా కవరేజ్ కల్పించే కంపెనీలతో పాటు నోటిఫైడ్ పంటల వివరాలు, పూర్తి మార్గదర్శకాలతో ఇటీవలే నోటిఫికేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఖరీఫ్లో మిరప, పసుపు, జొన్న పంటలకు దిగుబడి ఆదారంగా, పత్తి, వేరుశనగ పంటలకు వాతావరణ ఆధారంగా బీమా కవరేజ్ కల్పించారు. అలాగే దానిమ్మ, బత్తాయి, నిమ్మ, జీడిమామిడి, పంటలకు వాతావరణ ఆదారంగా బీమా కల్పించగా, కొత్తగా కొన్ని జిల్లాల్లో ఆముదం పంటకు కూడా బీమా రక్షణ కల్పించారు. ఇంతకంటే చిత్తశుద్ధి ఇంకేంకావాలి? పొరుగు రాష్ట్రాలు ఏపీ బాట పట్టడం కన్పించదా రామోజీ..! రైతులపై పైసా భారం పడకుండా నోటిఫై చేసిన పంటలన్నింటికీ ఈ క్రాప్ ఆధారంగా యూనివర్సల్ బీమా కవరేజ్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిగడించింది. ఉచిత పంటల బీమా పథకంగా జాతీయ స్థాయిలో కేంద్రం నుంచి అవార్డు కూడా లభించింది. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ఈ అత్యుత్తమ పథకాన్ని మిగతా రాష్ట్రాలూ ఇప్పుడు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఏపీ స్ఫూర్తితో 2023–24 వ్యవసాయ సీజన్ నుంచి కేవలం రూపాయి ప్రీమియంతో నోటిఫైడ్ పంటలు సాగు చేసే రైతులందరికీ బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, మేఘాలయ రాష్ట్రాలు ఇటీవలే ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్రాలూ ఏపీ బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నాయి. రైతులకు రక్షణ కల్పిస్తున్నది ఎవరు? చంద్రబాబు సీఎంగా ఉన్న 14 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రంలోకానీ, విభజన తర్వాత ఏర్పడ్డ ఏపీలో గానీ ఎన్నడూ రైతులకు ఉచిత పంటల బీమా కల్పించాలన్న ఆలోచనే చేయలేదు. అధిక ప్రీమియం చెల్లించాల్సి రావడంతో ఆర్థిక స్థోమత లేక లక్షలాది రైతులు బీమా చేయించుకోలేకపోయేవారు. భారీగా నష్టపోయేవారు. బీమా చేయించుకున్న వారికి కూడా ఏళ్ల తరబడి ఎదురు చూస్తే తప్ప పరిహారం ఇచ్చేవారు కారు. ఏ పంటకు ఎంత పరిహారం వచ్చేదో కూడా దాపరికమే. పైగా ఆయన హయాంలో 6.19 లక్షల మందికి బీమా సొమ్ము ఎగ్గొట్టారు. ఇలా ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల పంటల బీమా పరిహారాన్ని ౖసైతం చెల్లించి రైతుల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్న ఘనత సీఎం వైఎస్ జగన్దే. బాబు హయాంలో 2014–18 మధ్య 2.32 కోట్ల ఎకరాల్లో సాగైన పంటలకు బీమా కవరేజ్ కల్పించగా, 74.4 లక్షల మంది బీమా పరిధిలోకి వచ్చారు. ఈ ప్రభుత్వ పాలనలో 2019–23 మధ్య ఏకంగా 3.97 కోట్ల ఎకరాల్లో సాగైన పంటలకు, 170.34 లక్షల మంది రైతులకు బీమా రక్షణ కల్పించారు. అంటే రైతులను ఆదుకుంటున్నదెవరు? రైతును కుదేలు చేసిందెవరు? ఆ మాత్రం తెలుసుకోలేరా రామోజీరావు గారూ? -
కేసీఆర్ పాలనలో వ్యవసాయ విధ్వంసం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణను విత్తన భాండాగారంగా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని, కానీ రాష్ట్రాన్ని కల్తీ సీడ్బౌల్గా కల్వకుంట్ల కుటుంబం మార్చిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయ విధ్వంసం జరిగిందని విమ ర్శించారు. కల్తీ విధానాలపై ఉక్కుపాదం మోపుతా మని అసెంబ్లీలో, బయట సీఎం కేసీఆర్ పేర్కొన్న ప్పటికీ ఏ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన ‘రైతుగోస.. బీజేపీ భరోసా’ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం దండుగలా మారింది.. ‘వ్యవసాయ ఒక పండుగ అన్నారు కానీ కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండుగ అనే పరిస్థితి ఏర్పడింది. ఇన్పుట్ సబ్సిడీ, విత్తన సబ్సిడీ, పంటల బీమా పథకం అమలు చేయడం లేదు. గత తొమ్మిదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేయని కారణంగా లక్షలాది మంది రైతులు నష్టపోతున్నారు. ఇక వరి పంట వద్దని ప్రభుత్వమే చెబుతోంది. మరోవైపు వ్యవసాయ రుణాలు రావడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా వ్యవసాయ రుణాల మీద పావలా వడ్డీ ఇవ్వడం లేదు. రైతుబంధు అన్నింటికీ పరిష్కారంలా వ్యవహరిస్తోంది. అందరికంటే ఎక్కువగా కౌలు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆత్మహత్యల్లో 75 శాతం కౌలు రైతులవే ఉన్నాయి. ఐదేళ్లుగా రైతు రుణమాఫీ వాయిదా వేసి ఎన్నికలకు ముందు ప్రకటించారు. అయినా మెజార్టీ రైతులకు మాఫీ జరగలేదు. నాలుగున్నరేళ్లుగా వడ్డీలు, చక్రవడ్డీలు పెరిగిపోయి రూ.లక్ష అప్పు ఇప్పుడు రూ.2 లక్షలకు చేరింది. ధరణి పోర్టల్తో 20 లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు..’ అని కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని రకాలుగా సమస్యలను పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని అనేక ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ అవినీతినే మిగిల్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా కుటుంబం కోసం బీఆర్ఎస్, కల్వకుంట్ల కుటుంబం పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలన్నా, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలన్నా బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. -
Fact Check: మిరప పంటకు ‘ఈనాడు తెగులు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మిరప పంటకు ‘ఈనాడు తెగులు’ సోకింది. విత్తు నుంచి విక్రయం వరకు మిరప రైతులకు ప్రభుత్వం అండగా నిలవడం ఆ పత్రిక అక్కసుకు కారణమైంది. మిరప పంటపై ఓ అబద్ధాల కథనాన్ని అచ్చేసింది. ఎన్నడూ లేని విధంగా మిరప రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోంది. ఆర్బీకేల ద్వారా విత్తనాన్ని అందించడమే కాకుండా, పెట్టుబడి తగ్గించేందుకు, నాణ్యత పెంచేందుకు శిక్షణ ఇస్తోంది. ఆర్థికంగా, మార్కెట్పరంగా రైతుకు తోడ్పాటునందిస్తోంది. ప్రభుత్వ చర్యల ఫలితంగా మిరపకు రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. సాగు విస్తీర్ణమూ పెరుగుతోంది. వాస్తవాలు ఇలా ఉంటే మిరప రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఈనాడు మరోసారి అవాస్తవాలతో ‘ఎర్ర బంగారానికి.. అప్పులే దిగుబడి’ అంటూ అబద్ధాలను అచ్చేసింది. ఏటా పెరుగుతున్న సాగు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఎన్టీఆర్, బాపట్ల, నరసరావుపేట జిల్లాల్లో మిరప అత్యధికంగా సాగవుతుంది. కోల్డ్ స్టోరేజి యూనిట్లతో పాటు గుంటూరు మిర్చి యార్డు, ఐటీసీ వంటి బహుళ జాతి సంస్థలూ మిర్చి కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతులకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా అందిస్తోంది. వీటి ఫలితంగా మిరప క్వింటా రూ. 20 వేలకు పైగా ధర పలుకుతోంది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో మిరప పంటకు గడిచిన ఏడాదికన్నా అధికంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేసి అన్ని బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నారు. ఇలా ప్రభుత్వ మద్దతు, మంచి ధర కారణంగా ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఇటీవల రాయలసీమ జిల్లాల్లో కూడా మిరప విస్తీర్ణం పెరుగుతోంది. అనంతపురం జిల్లాలో బాడిగ రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా శిక్షణ మిరప పంటలో సమగ్ర సస్యరక్షణ కార్యక్రమాలను ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయం, గుంటూరు లాంలోని మిరప పరిశోధన స్థానం, ఐఐహెచ్ఆర్, బెంగళూరు శాస్త్రవేత్తల సహకారంతో మిరపలో నల్లి నివారణకు చర్యలు చేపట్టారు. రైతులకు శిక్షణ ఇస్తున్నారు. ఐటీసీ వంటి సంస్థల సహకారంతో నారు నుంచి కాయ కోసి ఎండబెట్టే వరకు నాణ్యమైన మిరప దిగుబడి కోసం మొబైల్ యాప్ ద్వారా 3 లక్షల మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. విచక్షణ రహితంగా పురుగు మందుల వినియోగాన్ని నిరోధించేందుకు ఆర్బీకేల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. మిరప పంటకు సోకే థ్రిప్స్ నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. నల్లతామర, జెమిని వైరస్ తెగుళ్ల నివారణపై ప్రతి 15 రోజులకోసారి అవగాహన కల్పిస్తునారు. మిరపలో అభ్యుదయ రైతుల అనుభవాలు, సూచనలను రైతు భరోసా చానల్లో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మిగతావారికి తెలియజేస్తున్నారు. నాణ్యమైన నారు కోసం నర్సరీల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ నర్సరీ చట్టం పగడ్బందీగా అమలు చేస్తున్నారు. షేడ్నెట్లలో మిరప నారు పెంపకం కోసం రైతులకు ఉద్యాన మిషన్ ద్వారా రాయితీలు అందిస్తున్నారు. ఉచిత పంటల బీమా.. పెట్టుబడి రాయితీ మిరప పంటను ఈ–క్రాపింగ్ చేసి, ఉచిత పంటల బీమా వర్తింపజేశారు. విపత్తుల్లో నష్టపోయిన మిరప రైతులకు అదే సీజన్లో పెట్టుబడి రాయితీ చెల్లిస్తున్నారు. మిరప పంటను వాతావరణ, దిగుబడి ఆధారిత పథకాల ద్వారా 2016 నుంచి వేర్వేరు జిల్లాల్లో నోటిఫై చేస్తున్నారు. అదే విధానాన్ని నేటికీ కొనసాగిస్తున్నారే తప్ప ఎలాంటి మార్పులు చేయలేదు. పంట కోత ప్రయోగాల ఆధారంగా వాస్తవ దిగుబడులను లెక్కించి హామీ దిగుబడికన్నా తగ్గితే బీమా పరిహారం మళ్లీ సీజన్ ప్రారంభానికి ముందే చెల్లిస్తున్నారు. 2019–20 నుంచి ఇప్పటి వరకు 1,49,180మంది రైతులకు రూ.566.05 కోట్ల బీమా పరిహారం చెల్లించారు. 2022 ఖరీఫ్లో ఎన్టీఆర్, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో దిగుబడి ఆధారిత పథకం కింద, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వాతావరణ ఆధారంగా నోటిఫై చేశారు. పంట కోత ప్రయోగాల ఫలితాల ఆధారంగా పరిహారం చెల్లించారు. 2023–24 సీజన్లో ఒకే రీతిలో పరిహారం లెక్కించేలా చర్యలు 2023–24 సీజన్లో కూడా మిరప పంటకు పంటల బీమా కవరేజ్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వాతావరణ, దిగుబడి ఆధారిత పథకాల ద్వారా ప్రస్తుతం అమలవుతున్న మిరప పంటను ఒకే విధంగా బీమా పథకంలో చేర్చేలా కొన్ని ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి టెక్నికల్ కమిటీలో పరిశీలించారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించి తగిన చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ప్రభుత్వం మిరప రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా ఈనాడు ప్రభుత్వంపై బురద జల్లేలా కథనాన్ని అల్లింది. -
జగనన్న మాకు ఇచ్చిన భరోసా.. వైయస్ఆర్ ఉచిత పంటల బీమా
-
జగనన్న వచ్చాకే ధైర్యంగా వ్యవసాయం చేయగలుగుతున్నాం
-
గత ప్రభుత్వంలో పంటలు నష్టపోయినా పట్టించుకోలేదు.. కానీ ఇప్పుడు అడగకుండానే సహాయం చేస్తున్నారు..!
-
డాక్టర్ వైయస్ఆర్ ఉచిత పంటల బీమా
-
బీమాపై సాగదీత.. రైతుకు ఏదీ భరోసా?
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు రైతుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. పంటలు పండి, చేతికొచ్చి అమ్ముకునేంత వరకు అంతా సజావుగా జరిగితేనే రైతులు ఊపిరి పీల్చుకునేది. మధ్యలో అధిక వర్షాలతో వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే మాత్రం కోలుకోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంట నష్టం జరిగితే బీమా కానీ, పరిహారం అందించే పరిస్థితి కానీ లేకపోవడం ఇందుకు కారణం. ఈ ఏడాది యాసంగిలో మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండు మూడు దఫాలుగా కురిసిన తీవ్రమైన వర్షాలు, వడగళ్ల వాన కారణంగా 10 లక్షల ఎకరాలకు పైగా పంటలకు నష్టం వాటిల్లినట్లు అనధికార అంచనా కాగా.. మార్చిలో 1.51 లక్షల ఎకరాలు, ఏప్రిల్లో 2.30 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టుగా నిర్ధారించిన ప్రభుత్వం.. ఆ మేరకు పరిహారం ఇవ్వాలని ప్రకటించింది. మిగిలిన వారికి ఎలాంటి సాయానికీ దిక్కులేకుండా పోయింది. ప్రభుత్వం పరిహారం ప్రకటించినప్పుడు ఆ సందర్భంలో జరిగిన పంట నష్టానికి మాత్రమేనని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే మున్ముందు జరిగే పంట నష్టాలకు ఇది వర్తించదని అర్థమవుతుండగా, ఈ సీజన్లో పంటలు సాగు చేస్తున్న రైతులను పరిహారానికి సంబంధించిన ఆందోళన వెంటాడుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకం నుంచి బయటకు... రాష్ట్ర రైతులకు అనుకూలంగా లేదన్న భావనతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ (పంటల) బీమా యోజన (పీఎంఎఫ్బీవై) పథకం నుంచి 2020లో రాష్ట్ర ప్రభుత్వం బయటకు వచ్చింది. కేంద్ర బీమా పథకాలు రైతులకు నష్టం చేకూర్చడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం వాటి నుంచి బయటకు వచ్చిందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే పంజాబ్, జార్ఖండ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు కూడా పీఎంఎఫ్బీవై నుంచి బయటకు వచ్చాయని ఆ వర్గాలు వివరిస్తున్నాయి. బీమా సంస్థలకే ఎక్కువ ప్రయోజనం? రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది రైతులున్నారు. గతంలో పంటల బీమా పథకాలు అమల్లో ఉన్నప్పుడు సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల మంది తమ పంటలకు బీమా చేయించేవారు. దీంతో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎంతో కొంత నష్టపరిహారం వచ్చేది. 2015–16లో 7.73 లక్షల మంది పంటల బీమా చేయగా, ఆ ఏడాది నష్టం ఎక్కువ జరగటంతో ఏకంగా రూ.441.79 కోట్ల నష్ట పరిహారం రైతులకు అందింది. 2016 వానాకాలం సీజన్ నుంచి దేశ వ్యాప్తంగా పీఎంఎఫ్బీవై పథకం అమలులోకి వచ్చింది. 2016–17లో 8.87 లక్షల మంది మంది రైతులు 7.33 లక్షల ఎకరాలకు ఈ పథకం కింద బీమా చేయించగా, 1.34 లక్షల మంది రైతులకు రూ.111.33 కోట్ల పరిహారం వచ్చింది. అలాగే 2018–19, 2019–20లో రూ.960 కోట్ల పరిహారం రాష్ట్రానికి మంజూరు కాగా.. అందులో కొంతమేరకు రైతులకు దక్కింది. అయితే కేంద్ర పథకం వల్ల రైతులకు జరిగే లాభం కంటే బీమా కంపెనీలకే ఎక్కువ ప్రయోజనం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కొందరు రైతులు కూడా బీమా పథకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు భారీగా లాభాలు గడిస్తున్నప్పటికీ ప్రీమియం ధరలను బీమా కంపెనీలు పెంచుకుంటూ పోయాయి. ప్రైవేటు సంస్థలకు సైతం పంటల బీమా పథకంలో అవకాశం కల్పించడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర పంటల బీమా పథకం నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ పథకం జాడేదీ? కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక పంటల బీమా పథకాన్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న దానిపై గతంలో వ్యవసాయశాఖ కసరత్తు చేసింది. రైతు యూనిట్గా దీన్ని ప్రవేశపెట్టాలని అనుకున్నారు. కానీ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం వ్యక్తిగత బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే రూ.5 లక్షల బీమా నగదు అందేలా చూస్తోంది. కానీ పంటల బీమా పథకంపై ఇంతవరకు ముందడుగు పడక పోవడం రైతుల్లో ఆందోళనకు కారణమవుతోంది. దేశంలో రెండు మూడు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలతో విసిగివేసారి బయటకు వచ్చి, సొంత పథకాలను రూపొందించుకోవడాన్ని రైతు సంఘాలు గుర్తు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. -
ఇది రైతు ప్రభుత్వం
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు తరఫున పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించింది. ఏ గ్రామంలో, ఏ రైతు, ఏ పంటను, ఎన్ని ఎకరాల్లో వేశారన్నది ఈ–క్రాప్ ద్వారా గుర్తించి ఇన్సూరెన్స్ పరిధిలోకి తెచ్చాం. ప్రతి ఆర్బీకే పరిధిలో బ్యాంకు రుణాలు తీసుకున్న, తీసుకోని రైతుల నోటిఫైడ్ పంటలన్నింటినీ ఉచిత బీమా పరిధిలోకి తీసుకొచ్చాం. తద్వారా ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ పరిహారం ఇప్పించాలనే తాపత్రయంతో అడుగులు ముందుకు వేశాం. ఇలాంటప్పుడు బీమా కంపెనీల నుంచి రైతులకు అందాల్సిన పరిహారం అందకూడదని ప్రభుత్వం ఎందుకు అనుకుంటుంది? అయితే, చంద్రబాబు, ఆయన గజ దొంగల ముఠా.. దుష్ట చతుష్టయంలోని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5.. వీళ్లందరి దత్తపుత్రుడు దుష్ప్రచారం చేస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రమూ చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందని, ఏ ఒక్క రైతుకూ కష్టం రానివ్వకుండా చూసుకుంటున్న సర్కారు ఇదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. నాలుగేళ్లలో రైతుల కోసం రూ.1.70 లక్షల కోట్లకు పైగా వ్యయం చేశామని గర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. పంటల బీమా పరిహారం మొదలు.. మద్దతు ధర వరకు వ్యవసాయ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తేవడం ద్వారా రైతుకు చేదోడు వాదోడుగా నిలిచామని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి (జూలై 8)ని పురస్కరించుకుని శనివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా 2022– ఖరీఫ్లో పంటలు నష్టపోయిన రాష్ట్రంలోని 10.20 లక్షల మందికి పైగా రైతులకు డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద రూ.1,117.21 కోట్ల పరిహారాన్ని కంప్యూటర్లో బటన్ నొక్కి వారి ఖాతాలకు జమ చేసే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. డాక్టర్ వైఎస్సార్కు ఘనంగా నివాళులర్పించిన తర్వాత అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడారు. మహానేత వైఎస్సార్ జయంతి రోజున అన్నదాతకు పాదాభివందనం చేస్తూ ఏటా రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. ‘నాన్న గారు గుర్తుకొచ్చినప్పుడల్లా రైతుల పట్ల ఆయన ఎలా స్పందించారన్నది గుర్తుకొస్తుంది. ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్మెంట్, లక్షల ఇళ్లు, ఆరోగ్యశ్రీ పథకం.. 104, 108 గుర్తుకొస్తుంది. కుయ్.. కుయ్.. కుయ్.. అన్న శబ్ధం కూడా గుర్తుకొస్తుంది’ అని అన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ, ఆయన చేసిన మంచి ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పారు. అందుకే ఆయన్ను గౌరవిస్తూ వ్యవసాయ, ఆరోగ్య, గృహ నిర్మాణ రంగాల్లో మనం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలకు డాక్టర్ వైఎస్సార్ పేరే పెట్టామని స్పష్టం చేశారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఆ ఐదేళ్లలో నోరెత్తలేదెందుకు? ► గత చంద్రబాబు ప్రభుత్వ ఐదేళ్లలో సగటున ప్రతి ఏటా 300 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించే పరిస్థితి. అంటే సగం రాష్ట్రంలో ఏటా కరువే. ఉమ్మడి అనంతపురం అంతా కరువుగానే కనిపించే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు ప్రభుత్వం పంట నష్టపోయిన రైతన్నలకు అరకొరగానే బీమా పరిహారం ఇచ్చింది. ఆ ఐదేళ్లలో కేవలం రూ.3,411 కోట్లు మాత్రమే. అది కూడా 30.85 లక్షల మంది రైతులకు మాత్రమే ఇచ్చింది. ► దేవుడి దయ వల్ల ఈ నాలుగేళ్లలో ఒక్క కరువు మండలం లేకున్నా.. అప్పుడప్పుడు అధిక వర్షాలు, ఇతర కారణాల వల్ల జరిగిన పంట నష్టాన్ని పరిగణలోకి తీసుకుని ఈ నాలుగేళ్లలో 54,48,000 మంది రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రూ.7,802 కోట్లు పరిహారంగా చెల్లించాం. ► చంద్రబాబు ఐదేళ్ల కరువు కాలంలో రైతులకు అందాల్సిన బీమా పరిహారం అందలేదని ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 ఏనాడూ నోరు మెదపలేదు. పైగా ఈ పెద్దమనిషి చంద్రబాబు రెయిన్ గన్తో కరువును పారదోలానంటూ ఫొటోలకు పొజులిస్తే.. కరువు వెళ్లిపోయిందని నిస్సిగ్గుగా రాశారు. ఇలాంటి దుర్మార్గులు మనం మంచి చేస్తుంటే మొసలి కన్నీరు కారుస్తున్నారు. వ్యవసాయం వ్యాపారం కాదని గుర్తించాలి ► ప్రణాళికా బద్ధంగా, ప్రాధాన్యతా క్రమంలో నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేసేలా అడుగులు వేస్తున్నాం. కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల కోసం రూ.542 కోట్లతో బీటీపీ ప్రాజెక్టుకు సంబంధించి.. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఎన్నికల కోసం టెంకాయ కొట్టి వదిలేశారు. దీని కోసం 1407 ఎకరాల భూసేకరణ చేస్తే తప్ప అడుగులు ముందుకు పడని పరిస్థితి. ఈ ప్రాజెక్టు కోసం రూ.208 కోట్లు రైతన్నల బ్యాంకు అకౌంట్లలోకి విడుదల చేస్తున్నాం. ► చంద్రబాబు హయాంలో ఆహార ధాన్యాల దిగుబడి 152 లక్షల టన్నులు ఉండేది. మన ప్రభుత్వంలో నాలుగేళ్లలో సగటున 13 లక్షల టన్నులు పెరిగి 165 లక్షల టన్నులకు చేరింది. ఈ నాలుగేళ్లలో రైతన్నలకు మంచి చేసేందుకు మీ బిడ్డ ప్రభుత్వం రూ.1,70,769 కోట్లు ఖర్చు చేసింది. ► రైతు చేస్తున్నది అన్నం పెట్టే వ్యవసాయం తప్ప వ్యాపారం కాదని పాలించే వాళ్లకు అర్థం కావాలి. రైతును మోసం చేయకూడదని, ప్రజలను మోసం చేయకూడదని పాలకుడికి ఒక నిబద్ధత ఉండాలి. అలాంటి నిబద్ధత, నైతికత ఉంటే ఆ మనిషిని, ఆ గుండెను ఒక వైఎస్సార్ అని, ఒక జగనన్న అంటారని సగర్వంగా తెలియజేస్తున్నా. అలాంటి నిబద్ధత, నైతికత లేకపోతే ఆ గుండెను, ఆ మనిషిని చంద్రబాబు నాయుడు అంటారు. 16 విప్లవాత్మక మార్పులు 1ఇన్సూరెన్స్: గ్రామ స్థాయిలో ఏ రైతన్నకు భారం పడకుండా ప్రతి పంటను ఈ–క్రాప్తో అనుసంధానం చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడం ద్వారా ఉచిత బీమా పథకం కిందకు తెచ్చాం. ఇలా మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదు. 2వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్: మూడు విడతల్లో వైఎస్సార్ రైతు భరోసా సాయం రూ.13,500 క్రమం తప్పకుండా ఇస్తున్నాం. ఈ నాలుగేళ్లలో 52.38 లక్షల మంది రైతులకు రూ.61,500 చొప్పున వారి ఖాతాల్లో నేరుగా జమ చేశాం. ఈ ఒక్క పథకం ద్వారా రూ.30,985 కోట్లు ఇచ్చాం. ఈ సొమ్ము చిన్న, సన్నకారు రైతులకు సంజీవనిలా ఉపయోగపడుతోంది. 3ఆర్బీకేలు: 10,778 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేశాం. ఇది దేశంలోనే అతిపెద్ద విప్లవాత్మక మార్పు. విత్తనం మొదలు పంట అమ్మకం వరకు.. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు.. సలహాలు సహా ప్రతి అడుగులోనూ రైతులకు అండగా, తోడుగా ఉంటూ వారిని చేయి పట్టుకొని నడిపిస్తున్న వ్యవస్థ గ్రామ స్థాయిలో కనిపిస్తోంది. దేశం మొత్తం మన రాష్ట్రానికి వచ్చి ఎలా జరుగుతోందని చూసి వెళ్తున్నారు. 4ఈ–క్రాప్: ఏ రైతు, ఏ పంట, ఎన్ని ఎకరాల్లో వేశాడన్నది గ్రామ స్ధాయిలో, ఆర్బీకే స్ధాయిలో స్పష్టంగా తెలిసిపోతుంది. దీని ఆధారంగా ఏ ఒక్క రైతు నష్టపోకుండా ప్రతి రైతుకు పారదర్శకంగా వడ్డీ లేని రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ చివరకు పంటల కొనుగోలులో కూడా మేలు జరుగుతోంది. 5పంట నష్టపరిహారం: ఏ సీజన్లో పంట నష్టం ఆ సీజన్ ముగియక మునుపే రైతుల చేతుల్లో పెడుతున్న ఏకైక ప్రభుత్వం మనదే. ఈ నాలుగేళ్లలో 22.74 లక్షల మంది రైతన్నలకు రూ.1,965 కోట్లు ఇచ్చాం. తద్వారా ఎక్కడా దళారులు, మధ్యవర్తులు, లంచాలు లేవు. నేరుగా అర్హులందరికీ మేలు జరుగుతోంది. 6సున్నా వడ్డీ: ఏ రైతు అయినా రుణం సకాలంలో చెల్లిస్తే ప్రోత్సాహం ఇస్తూ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇందులో మన రాష్ట్రం అగ్రగామి. గత ప్రభుత్వం సున్నా వడ్డీ, రుణ మాఫీ పథకాల్ని గాలికొదిలేసింది. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి చివరకు రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వకుండా రైతులను నిలువునా ముంచేసింది. ఆ అప్పులపై వడ్డీల మీద వడ్డీలు తడిసి మోపెడై రైతులు ఇబ్బందులు పడ్డారు. అలాంటి రైతులందరికీ మేలు చేస్తూ ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం కింద 73.88 లక్షల మందికి రూ.1,835 కోట్లు ఇచ్చింది. 7ధాన్యం కొనుగోలు: ధరలు రాకపోతే రైతులు నష్టపోకుండా ఆదుకోవడం కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. మిరప, పసుపు, ఉల్లి, చిరు ధాన్యాలు, అరటి బత్తాయి పంటలకూ కనీస మద్దతు ధర ప్రకటించాం. మార్కెట్లో రేటు తగ్గితే గ్రామ స్థాయిలో ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. దళారీ, మధ్యవర్తుల వ్యవస్థను పూర్తిగా తుడిచేశాం. చివరకి మిల్లర్లను కూడా తీసివేసి ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలుకు రూ.58,767 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇతర పంటల కొనుగోలుకు రూ.7,633 కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ధాన్యం సేకరణ బకాయిలు రూ. 965 కోట్లు మనమే చెల్లించాం. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.384 కోట్ల విత్తన బకాయిలూ ఇచ్చాం. చివరకు గత ప్రభుత్వం ఎగ్గొట్టిన కరెంటు బకాయిలు రూ.8,800 కోట్లు కూడా మనమే కట్టాం. 8నాణ్యమైన ఉచిత విద్యుత్: రైతన్నలకు పగటి పూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇందుకోసం రూ.1700 కోట్లతో ఫీడర్ల కెపాసిటీని అప్గ్రేడ్ చేశాం. ఇందుకు ఈ నాలుగేళ్లలో రూ.40,000 కోట్లు ఖర్చు చేశాం. మరో 30 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే పరిస్థితి ఉండేలా రూ.2.49కే వ్యవసాయ అవసరాల మేరకు 17వేల మిలియన్ యూనిట్లను సరఫరా చేసేటట్టుగా.. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఒప్పందం చేసుకున్నాం. ఆక్వా రైతులకూ యూనిట్ రూ.1.50కే ఇస్తున్నాం. ఇందుకు ఈ నాలుగేళ్లలో రూ.2,968 కోట్లు సబ్సిడీగా భరించాం. 9వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం : ఆర్బీకేల ద్వారా సన్న, చిన్నకారు రైతులకు సాగులో అవసరమయ్యే యంత్రాలను అందుబాటులో ఉంచాం. రూ.1,100 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని ప్రారంభించాం. దీనికోసం సబ్సిడీ రూపంలో రూ.400 కోట్లు ప్రభుత్వం భరించింది. 10భూ హక్కు పత్రాలు: వంద ఏళ్లకు పైగా చుక్కల భూములుగా మిగిలిపోయిన 2.06 లక్షల ఎకరాలకు సంబంధించి 87,560 మంది రైతన్నలకు సంపూర్ణ భూహక్కు పత్రాలు ఇచ్చాం. గతంలో ఎవరూ పట్టించుకోలేదు. 11పశు సంరక్షణ: పశుసంపద ద్వారా కూడా రైతులకు అదనంగా ఆదాయం పెరగాలని అడుగులు ముందుకు వేశాం. పశువుల కోసం కూడా 340 అంబులెన్స్లు తీసుకొచ్చాం. నియోజకవర్గానికి 2 చొప్పున ఈరోజు మనకు కనిపిస్తున్నాయి. 12జగనన్న పాల వెల్లువ: రైతులకు వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం పెంచేందుకు సహకార రంగానికి తోడుగా ఉండేటట్టుగా.. ప్రైవేట్ డెయిరీల గుత్తాధిపత్యానికి గండి కొడుతూ అమూల్ రంగ ప్రవేశం చేసేలా అడుగులు వేశాం. అమూల్ వచ్చిన తర్వాత రెండేళ్లలో 8 సార్లు రేట్లు పెంచారు. గేదె పాలు రూ.22, ఆవు పాలు రూ.11 అదనంగా పెరిగింది. 13చిరుధాన్యాలకు ప్రోత్సాహం: బియ్యం మాత్రమే కాకుండా చిరుధాన్యాలను (మిల్లెట్స్) ప్రోత్సహిస్తున్నాం. 8 జిల్లాల్లో ఇంటింటికీ రేషన్ ద్వారా చిరు ధాన్యాలు ఇవ్వడం మొదలు పెట్టాం. స్కూళ్లలో రాగిజావ ఇస్తున్నాం. 32 చిరుధాన్యాల ప్రాసెసింగ్ ప్లాంట్లు మొదలు పెట్టాం. చిరుధాన్యాలకు కనీస మద్దతు ధర ఉండేలా అడుగులు వేస్తున్నాం. ఒకవేళ ఆ ధర లేకపోతే ప్రభుత్వమే మార్కెట్లో జోక్యం చేసుకుని కొనుగోలు చేస్తుంది. 14సమగ్ర భూ సర్వే: వందేళ్ల తర్వాత సమగ్ర భూ సర్వే నిర్వహిస్తున్నాం. రైతులకు గ్రామ స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. వాళ్ల భూములన్నింటికీ సమగ్రంగా సరిహద్దులు ఏర్పాటు చేసి, సర్వే రాళ్లను పాతించి, రైతుల రికార్డులు అప్డేట్ చేయించి, వివాదాలకు తావులేకుండా రైతుల చేతిలో భూహక్కు పత్రాలు పెట్టే గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. 15గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు: రిజిస్ట్రేషన్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా 17 వేల రెవెన్యూ గ్రామాలకు గాను ఇప్పటికే 2 వేల రెవెన్యూ గ్రామాల్లోని సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రేషన్ సేవలు అందుతున్నాయి. 16మరింత పటిష్టంగా ఆర్బీకేలు: రాబోయే రోజుల్లో ఆర్బీకేలను ఇంకా పటిష్టపరచబోతున్నాం. ఆర్బీకే స్థాయిలోనే సాయిల్ టెస్టింగ్ చేయించబోతున్నాం. గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్ను కూడా ప్రతి రైతన్నకు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. వాటి ద్వారా రైతులు ఇంకా ఎక్కువ ధరకు అమ్ముకునే అవకాశం కల్పించడానికి జీఏపీ సర్టిఫికేషన్ తీసుకురాబోతున్నాం. నానో ఫెర్టిలైజర్స్ను తీసుకురాబోతున్నాం. తద్వారా డ్రోన్లు, ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. ఎరువులు ఎంత అవసరమో అంతే వేసేలా చూస్తాం. ఆర్బీకేల పరిధిలో ప్రైమరీ ప్రాసెసింగ్, జిల్లా కేంద్రాల్లో సెకండరీ ప్రాసెసింగ్ తీసుకువస్తున్నాం. అందుకు తగిన విధంగా గోదాములు ప్రారంభిస్తున్నాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో జరగబోయే గొప్ప మార్పులు. -
అత్యధిక బీమా పరిహారం ‘అనంత’కే
సాక్షి, అమరావతి: దేశమంతా ప్రశంసిస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంపై నిత్యం కాకి లెక్కలతో ఎల్లో మీడియా నినదిస్తుండగా రైతుల ముసుగులో టీడీపీ నేతలు రభస చేస్తున్నారు. రైతులపై పైసా భారం లేకుండా ఉచిత పంటల బీమాను అమలు చేయడంతోపాటు గత సర్కారు హయాంతో పోలిస్తే రెట్టింపు ప్రయోజనాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేకూరుస్తోంది. తాజాగా ఈనెల 8వ తేదీన మరోసారి రైతన్నలకు పరిహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో ఉలిక్కిపడ్డ రామోజీ యథావిధిగా బురద జల్లేందుకు ఉపక్రమించారు! పరిహారంపై రైతులెవరూ అభ్యంతరం చెప్పకున్నా పచ్చ ముఠాలను రోడ్లపైకి తీసుకొచ్చి పొలిటికల్ డ్రామాలకు తెరతీశారు! ఉరవకొండలో ఆందోళనకు ఉసిగొల్పారు! వారిలో సగం మంది టీడీపీ నాయకులే ఉన్నట్లు రామోజీ అత్యుత్సాహంతో తన పత్రికలోనే ప్రచురించారు!! వారం గడువిస్తే వచ్చిన అభ్యంతరాలు 123 ఖరీఫ్ 2022 సీజన్కు సంబంధించి 10.20 లక్షల మందికి రూ.1,117.21 కోట్ల పంటల బీమా పరిహారం మంజూరైంది. గత నెల 28వ తేదీ నుంచి ఆర్బీకేల్లో జాబితాలను ప్రదర్శిస్తున్నారు. పంటల విస్తీర్ణం, పరిహారం మంజూరుపై అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 4వ తేదీ వరకు వారం రోజుల పాటు గడువు ఇవ్వగా వచ్చిన అభ్యంతరాల సంఖ్య 123 మాత్రమే. అంటే 0.0001 శాతం కూడా లేదు. ఇక వాటిలో కూడా అత్యధికం సాంకేతికపరమైన అంశాలకు సంబంధించినవే. అంటే మంజూరైన బీమా పరిహారంపై రైతులకే కాదు రైతు సంఘాలకూ అభ్యంతరాలు లేవనే కదా అర్థం! ‘అనంత’లో అత్యధిక పరిహారం టీడీపీ నేతలు రోడ్డెక్కి రభస చేసిన అనంతపురం జిల్లాకే అత్యధిక పరిహారం మంజూరు కావడం గమనార్హం. ఒక్క అనంతపురం జిల్లాలో 1.37 లక్షల మందికి రూ.212.94 కోట్ల పరిహారం మంజూరైంది. ఇక రాయలసీమలోని 8 జిల్లాలను పరిశీలిస్తే 7.72 లక్షల మందికి రూ.835.08 కోట్ల పరిహారం మంజూరైంది. మంజూరైన పరిహారంలోనే కాదు.. లబ్ది దారుల్లో అత్యధికులు రాయలసీమ రైతన్నలే ఉన్నారు. అనంతపురం జిల్లాలో దిగుబడి ఆధారిత పత్తి, కంది, వరి, జొన్న, మొక్కజొన్న, మిరప పంటలకు బీమా వర్తింప చేశారు. పంట కోత ప్రయోగాల ఆధారంగా పత్తి పంటకు ఎన్నడూ లేనివిధంగా రూ.43.26 కోట్ల పరిహారం మంజూరు చేశారు. వాతావరణ ఆధారిత బీమాను బత్తాయి, దానిమ్మ, టమాటా, వేరుశనగ పంటలకు వర్తింప చేసి రూ.169.68 కోట్లు మంజూరు చేశారు. ఇందులో బత్తాయికి రూ.102.64 కోట్లు, వేరు శనగకు రూ.65.60 కోట్లు, టమాటాకి రూ.1.44 కోట్ల పరిహారాన్ని మంజూరు చేశారు. బత్తాయికీ బీమా రక్షణ గతంలో పంటల బీమా అందని ద్రాక్షే! అధిక ప్రీమియం చెల్లించలేక లక్షలాది మంది రైతులు విపత్తుల బారిన పడి ఏటా రూ.వేల కోట్ల పెట్టుబడిని నష్టపోయేవారు. కనీసం బీమా చేయించుకున్న వారికైనా పరిహారానికి దిక్కులేని దుస్థితి గత సర్కారు హయాంలో నెలకొంది. ఏళ్ల తరబడి పడిగాపులు కాస్తే అరకొరగా విదిల్చేవారు. అదికూడా ఏ పంటకు ఎంత పరిహారం వస్తుందో తెలియదు. ఇప్పుడు పైసా భారం పడకుండా రైతులకు ఎలాంటి వ్యయ ప్రయాసలకు తావులేకుండా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసే ప్రతీ దఎకరాకు ఈ– క్రాప్ ఆధారంగా ఉచిత పంటల బీమా అమలవుతోంది. గతంలో బీమా పరిధిలో లేని బత్తాయి తదితర పంటలకు సైతం బీమా రక్షణ కల్పిస్తున్నారు. బాబు బకాయిలనూ చెల్లించారు.. టీడీపీ హయాంలో ఐదేళ్లలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల పరిహారం ఇవ్వగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 44.28 లక్షల మందికి రూ.6,684.84 కోట్ల బీమా పరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాలకు జమ చేసింది. తాజాగా పంపిణీ చేయనున్న పరిహారాన్ని కూడా కలిపితే మొత్తం 54.48 లక్షల మందికి రూ.7,802.05 కోట్లు అందినట్లవుతుంది. తద్వారా టీడీపీ హయాంతో పోలిస్తే అదనంగా 23.63 లక్షల మంది లబ్ధి పొందగా పరిహారం పరంగా రూ.4,390.85 కోట్లు అదనంగా ప్రయోజనం చేకూరుతోంది. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని తరచూ చెప్పుకునే చంద్రబాబు అధికారంలో ఉండగా ఏనాడూ రైతులకు ఉచిత పంటల బీమా కల్పించాలనే ఆలోచన చేసిన పాపాన పోలేదు. టీడీపీ సర్కారు 6.19 లక్షల మందికి ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల పంటల బీమా పరిహారాన్ని సైతం చెల్లించి రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధిని చాటుకున్న ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుంది. -
రైతుకుంది ధీమా, రామోజీకే లేదు.. ఆందోళన ఎక్కువైనట్టుంది, అందుకే ఇలా!
సాక్షి, అమరావతి: ప్రజలకు, రైతులకు మేలు చేసే పథకాలు, కార్యక్రమాలను ఎవరైనా స్వాగతిస్తారు. నిలువెల్లా విషం నింపుకున్న పచ్చ పత్రికలు తప్ప. ప్రజల, రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై రోజూ ఏదో విధంగా విషం కక్కడమే ఆ పత్రికల విధానం. ఇందుకు నిదర్శనమే అన్నదాతలకు ఎంతో మేలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంపై ఈనాడు పత్రిక రాస్తున్న అసత్య కథనాలు. దేశం మొత్తం మెచ్చిన ఈ పథకంపై వాస్తవాలకు విరుద్ధంగా రోజుకో కథతో రైతులను గందరగోళ పరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులపై పైసా భారం పడకుండా ఈ పథకాన్ని అందిస్తోంది. మొత్తం భారమంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. రికార్డు స్థాయిలో బీమా పరిహారం అందిస్తూ అన్నదాతకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. దెబ్బతిన్న పంటల నమూనా సేకరణ కూడా అత్యంత పారదర్శకంగా జరుగుతుంది. నమూనాలను రైతు ఎదుటే అధికారులు సేకరిస్తారు. దానికి సంబంధించిన వివరాలు కూడా అక్కడే సేకరిస్తారు. ఈ ప్రక్రియ మొత్తానికి సంబంధించి రైతు సంతకం కూడా తీసుకుంటారు. తద్వారా రైతులకు ఎటువంటి అనుమానాలు లేకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియ మొత్తం నిర్వహిస్తారు. పంట నమూనా సేకరణ, బీమా పరిహారం చెల్లింపు, పంటలకు సంబంధించి ఇతరత్రా విషయాల్లో రాష్ట్రంలోని ప్రతి రైతూ ధీమాగా ఉన్నాడు. ధీమా లేనిది రామోజీకే. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రారన్న ఆందోళనతో అడ్డగోలుగా అబద్ధాలు రాసేస్తున్నారు. అదే ధోరణిలో పంటల ఉచిత బీమాపై ఈనాడులో ఓ తప్పుడు కథనాన్ని అచ్చేశారు. ఈ కథనంలో వాస్తవమెంతుందో ఒక్కసారి పరిశీలిద్దాం. ఆరోపణ : ఇదేనా మీరిచ్చే ధీమా? వాస్తవం : చంద్రబాబు హయాంలో తొలి రెండేళ్లు వ్యవసాయ బీమా పథకం, ఆ తర్వాత పీఎంఎఫ్బీవై అమలు చేశారు. 2014–16 మధ్య వ్యవసాయ బీమా పథకం కింద 6.92 లక్షల మందికి రూ. 887.69 కోట్లు, 2016–19 మధ్య పీఎంఎఫ్బీవై కింద 23.93 లక్షల మందికి రూ.2,523.51 కోట్ల చొప్పున ఐదేళ్లలో సుమారు 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల పరిహారం ఇచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే 44.28 లక్షల మందికి రూ.6,684.84 కోట్ల పరిహారం ఇచ్చింది. తాజాగా ఖరీఫ్–2022 సీజన్కు 10.20 లక్షల మందికి మరో రూ.1,117.21కోట్ల పరిహారం ఇవ్వబోతోంది. అంటే నాలుగేళ్లలో 54.48 లక్షల మందికి రూ.7802.05 కోట్ల పరిహారం రైతులకు ఇచ్చినట్టవుతుంది. అంటే టీడీపీ హయాంలో ఏటా సగటున రూ.682 కోట్ల పరిహారం ఇస్తే, వైఎస్ జగన్ ప్రభుత్వం ఏటా సగటున రూ.1,950.51 కోట్ల పరిహారం ఇచ్చింది. బాబు హయాంలో ఏటా సగటున 6.17 లక్షల మంది లబ్ధి పొందితే, వైఎస్ జగన్ ప్రభుత్వం ద్వారా ఏటా సగటున 13.62 లక్షల మంది లబ్ధి పొందారు. అంటే చంద్రబాబు హయాంలోకంటే ఈ నాలుగేళ్లలో రెట్టింపు సంఖ్యలో రైతులు బీమా పరిహారం పొందారు. ఆరోపణ : ప్రీమియం చెల్లింపులో గోప్యత ఎందుకు? వాస్తవం : పీఎంఎఫ్బీవై కింద 2016–18 మధ్య రైతులు వారి వాటాగా రూ.753.70 కోట్లు చెల్లిస్తే బాబు ప్రభుత్వం చెల్లించింది కేవలం రూ.912 కోట్లు మాత్రమే. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం 2019–20లో రైతుల వాటాతో కలిపి రూ. 971 కోట్లు చెల్లించింది. ఆ తర్వాత రెండేళ్లు బీమా కంపెనీలతో సంబంధం లేకుండా రైతులు నష్టపోయిన పరిహారాన్ని పూర్తిగా ప్రభుత్వమే చెల్లించింది. 2022–23లో కేంద్రం దిగి రావడంతో పీఎంఎఫ్బీవైతో కలిపి ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. దిగుబడి ఆధారిత పంటల కోసం ఖరీఫ్–2022 సీజన్కు రైతుల వాటాతో కలిపి రూ.1,213.37 కోట్లు ప్రభుత్వమే బీమా కంపెనీలకు చెల్లించింది. వాతావరణ ఆధారిత పంటలకు గతంలో మాదిరిగానే పరిహారం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఈ గణాంకాలు చాలు ఎవరి హయాంలో రైతులకు ధీమా లభించిందో చెప్పడానికి. ఆరోపణ : మరీ ఇంత తక్కువ పరిహారమా? వాస్తవం : ఎకరాకు కంది పంటకు రూ.828, వేరు శనగకు రూ.1,106, పత్తికి రూ.1,815 మాత్రమే ఇచ్చారంటూ చేసిన ఆరోపణలో వాస్తవమే లేదు. ఎందుకంటే వాతావరణ ఆధారిత బీమా పథకంలో అసాధారణ పరిస్థితుల వల్ల కలిగే నష్టాన్నే పరిహారంగా ఇస్తారు. ఖరీఫ్– 2022 అనూకూల వాతావరణ పరిస్థితులు నమోదవడంతో బీమా పరిహారం వాస్తవ డేటాను అనుసరించి వర్తింపజేశారు. వాస్తవ దిగుబడుల ఆధారంగా సగటున కంది పంటకు రూ.10,158, వేరుశనగకు రూ.2,444, పత్తికి రూ.4,036 చొప్పున చెల్లిస్తున్నారు. ఎక్కడయితే నిబంధనల మేరకు ఎక్కువ పరిహారం వర్తించలేదో దానిని మాత్రమే హైలెట్ చేస్తూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం ఈనాడుకే చెల్లింది. ఆరోపణ: ఆర్బీకేల్లో కనిపించని జాబితాలు వాస్తవం : బీమా పరిహారానికి అర్హత సాధించిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీ కోసం సంబంధిత ఆర్బీకేల్లో గత నెల 28వ తేదీ నుంచి ప్రదర్శిస్తున్నారు. పంట నష్టం జరగని కారణంగా అర్హులెవరూ లేకపోవడంతో కొన్ని ఆర్బీకేల్లో జాబితాలు ప్రదర్శించలేదు. రోజూ ఆర్బీకేలను సందర్శిస్తున్న రైతులు ఈ జాబితాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు కేవలం 160 అభ్యంతరాలు మాత్రమే వచ్చాయంటే, ఈనాడుకు తప్ప రైతుల్లో ఎలాంటి గందరగోళం, అయోమయం లేదన్నది సుస్పష్టం. ఆరోపణ : దానిమ్మ రైతులను దగా చేశారు వాస్తవం : దానిమ్మ పంటను అనంతపురం జిల్లాలో వాతావరణ ఆ«ధారిత పంటల బీమా పథకం కింద పరిగణనలోకి తీసుకున్నారు. అయితే వాతావరణ అంశాలకు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఆ జిల్లాలో పరిహారం వర్తించలేదు కాబట్టే జాబితాలో ఆ పంట వివరాలు పొందుపర్చలేదు. ఆరోపణ : రైతుల లెక్క ఇలా చేశారు వాస్తవం: ఒక రైతు పేరుతో 2, 3, 4 సెంట్ల చొప్పున వేర్వేరు ఐడీలు నమోదు చేసి ముగ్గురు రైతులుగా పేర్కొన్నారు. ఇలా 10.20 లక్షల మంది రైతులను చూపారంటూ అవగాహన లేని ఆరోపణ చేశారు. వాస్తవానికి రైతులకు చెందిన ప్రతి సర్వే నంబరు పరిధిలో అతను సాగు చేసిన పంటలను ఈ పంటలో నమోదు చేశారు. రికార్డుల పరంగా, సర్వే నంబర్ వారీ ప్రచురించిన జాబితాల ప్రకారం చూసుకుంటే లబ్ధి పొందిన రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఆర్బీకేలవారీగా లబ్ధిదారులను లెక్కించి 10.20 లక్షల మందిగా నిర్ధారించారు. ఆరోపణ : పంట నష్టపోయినా బీమా ఇవ్వలేదు వాస్తవం : ఏదైనా పంట నష్టం జరిగితే వెంటనే రైతు వారీగా నష్టం అంచనా వేసి 33 శాతం కన్నా ఎక్కువ నష్టపోయిన సందర్భంలో ఇన్పుట్ సబ్సిడీ వర్తిస్తుంది. అయితే బీమా పరిహారానికి మార్గదర్శకాలు పూర్తిగా నోటిఫై చేసిన పంటకు, నోటిఫై చేసిన యూనిట్కు మాత్రమే వర్తిస్తాయి. ఇన్పుట్ సబ్సిడీ మాదిరిగా కంటితో చూసి ధ్రువీకరించి పరిహారం లెక్కింపు ఉండదు. శాస్త్రీయ పద్ధతిలో పంట కోత ప్రయోగాలు నిర్వహించి వచ్చిన దిగుబడి హామీ దిగుబడికన్నా తక్కువ వస్తే, ఆ లోటు శాతాన్ని బీమా మొత్తంతో గణించి పరిహారంగా ఇస్తారు. అదే వాతావరణ ఆధారిత బీమా పథకంలో వివిధ వాతావరణ అంశాల ఆధారంగా బీమా పరిహారం చెల్లిస్తారు. ఈనాడు ఈ వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్టుగా, తోచినట్టుగా అసత్యాలు అచ్చేసింది. ఆరోపణ : దాటవేత వైఖరి ఎందుకు? వాస్తవం: 17 జిల్లాలకు వాతావరణ బీమా వర్తింపచేయాల్సి ఉండగా, 9 జిల్లాలను తప్పించారన్న ఆరోపణలో వాస్తవం లేదు. దిగుబడి ఆధారిత పంటల బీమా కింద 25 జిల్లాల్లో 17 పంటలు, వాతావరణ ఆధారిత పంటల బీమా పరిధిలో 17 జిల్లాల్లో 8 పంటలను నోటిఫై చేశారు. వాతావరణ ఆధారిత బీమా కింద 16 జిల్లాలకు పరిహారం మంజూరైంది. జిల్లాలవారీగా పరిహారం వివరాలు విడుదల చేసినా కళ్లుండీ కబోదిలా 9 జిల్లాలకు సున్నా అంటూ అడ్డగోలు ఆరోపణలు చేసింది ఈనాడు. -
పారదర్శకంగా పంటల బీమా
సాక్షి, అమరావతి: రైతుపై పైసా భారం లేకుండా ఈ–పంటలో నమోదే ప్రామాణికంగా ఉచిత పంటల బీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వ్యవసాయ శాఖ కమిషనర్ చేవూరు హరికిరణ్ స్పష్టం చేశారు. ‘ఉచిత పంటల బీమా.. అంతా మాయ’ శీర్షికన ఈనాడు ప్రచురించిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో సాగవుతున్న వ్యవసాయ, ఉద్యాన పంటలను జాయింట్ అజమాయిషీ కింద ఈ పంటలో నమోదు చేయడంతోపాటు 93 శాతం రైతుల బయోమెట్రిక్ అథంటికేషన్ పూర్తి చేశామన్నారు. ఈ–క్రాప్ నమోదు చేసి ప్రతి రైతుకు రసీదు కూ డా ఇస్తున్నామన్నారు. కొత్తగా ఎవరి పేర్లను చేర్చడం, తీ సేయడం కానీ చేయడం లేదన్నారు. ఖరీఫ్–2022 సీజన్కు సంబంధించి 10.20 లక్షల మంది అర్హత పొందితే. వారికి రూ.1, 117.21 కోట్ల బీమా పరిహారాన్ని జూలై 8న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పంపిణీ చేస్తా్తర న్నారు. ఈ పథకం ద్వారా గడిచిన నాలుగేళ్లుగా లబ్ధి పొందుతున్న రైతులను అయోమయానికి గురిచేయాలన్న ఏకైక లక్ష్యంతో ఈనాడు నిత్యం అబద్ధాలను అచ్చు వేస్తోందన్నారు. 30 వేల పంట కోత ప్రయోగాలు చేశాం దిగుబడి ఆధారిత పంట నష్టం అంచనాలను లెక్కించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల పంట కోత ప్ర యోగాలు చేసినట్టు హరికిరణ్ పేర్కొన్నారు. వాతా వరణ ఆధారిత పంట నష్టం అంచనా కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,817 వాతావరణ కేంద్రాల్లో నమోదైన సమాచారాన్ని (అధిక/లోటు వర్షపాతం, ఉష్ణోగ్రతలు) పరిగణనలోకి తీసుకుని బీమా పరిహారాన్ని లెక్కించామన్నారు. సత్యదూరమైన ఇలాంటి కథనాలతో రైతులను గందరగోళానికి గురి చేయడం మానుకోవాలని హితవు పలికారు. -
ఆర్బీకేల్లో పంటల బీమా జాబితాలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్–2022 సీజన్లో పంటల్ని నష్టపోయిన రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జూలై 8వ తేదీన నిర్వహించే రైతు దినోత్సవం రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి నష్టపరిహారాలను జమ చేయనున్నారు. పంట నష్టపోయిన రైతుల జాబితాలను ఆర్బీకేల్లో గురువారం నుంచి ప్రదర్శిస్తున్నారు. జూలై 3వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి.. అనంతరం తుది జాబితాలను ప్రకటిస్తారు. 10.20 లక్షల మంది రైతులకు పరిహారం ఖరీఫ్–2022 సీజన్లో దిగుబడి ఆధారిత పంటలకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనతో కలిపి ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తుండగా.. వాతావరణ ఆధారిత పంటలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు చేస్తోంది. నోటిఫై చేసిన దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి రైతుల వాటాతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను బీమా కంపెనీలకు చెల్లించింది. ఖరీఫ్–2022 సీజన్లో పంటలు నష్టపోయిన వారిలో 10.20 లక్షల మంది అర్హత పొందగా.. వీరికి రూ.1,117.21 కోట్ల పరిహారం చెల్లించాలని లెక్క తేల్చారు. దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి రూ.572.59 కోట్లు, వాతావరణ ఆధారిత పంటలకు సంబంధించి రూ.544.62 కోట్లు చెల్లించాలని లెక్కతేల్చారు. అర్హుల జాబితాలను సామాజిక తనిఖీ నిమిత్తం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. పంట విస్తీర్ణం తదితర అంశాలపై ఏదైనా అభ్యంతరాలుంటే సంబంధిత ఆర్బీకేలో జూలై 3వ తేదీ వరకు లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకోవచ్చు. -
సబ్సిడీ పథకాలకు మంగళం.. విత్తనాలు, పనిముట్లపై సబ్సిడీ ఎత్తివేత
ఇచ్చోడ(బోథ్): జిల్లాలోని అన్నదాతలు కోటి ఆశలతో వానాకాలం పంటల సాగు మొదలుపెట్టారు. మృగశిర కార్తె ప్రవేశంతో పొలం బాట పట్టారు. అయితే రైతులకు సర్కారు నుంచి ప్రోత్సాహం లభించడంలేదు. ప్రత్యామ్నాయ లాభాసాటి పంటలు వేయాలని ప్రభుత్వం సూచనలు చేస్తూనే రాయితీపై విత్తనాలు, రుణమాఫీ, వ్యవసాయ పని ముట్లు, అందించే పథకాలు క్రమంగా కనుమరుగు చేస్తోంది. రైతుబంధు పథకం వచ్చిన తర్వాత సబ్సిడీ పథకాలన్నీ ఎత్తేయడంతో రైతులు విత్తనాల నుంచి మొదలు వ్యవసాయ పనిముట్ల వరకు పూర్తి గా సొమ్ము చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో రైతన్నకు సాగు భారంగా మారుతోంది. రూ.8.5 కోట్ల అదనపు భారం జిల్లాలో పత్తి పంట తర్వాత అత్యధికంగా సాగయ్యే పంట సోయా. గతంలో ప్రభుత్వం సోయా విత్తనాలను రైతులకు 50 శాతం సబ్సిడీపై అందజేసేది. కానీ మూడేళ్లుగా సబ్సిడీ పూర్తిగా నిలిపేసింది. దీంతో పూర్తి ధర చెల్లించి రైతులు బహిరంగ మార్కెట్లో విత్తనాలు కొనుగోలు చేయాల్సివస్తోంది. సబ్సిడీ ఎత్తివేతతో జిల్లా రైతులపై రూ.8.5 కోట్ల అదనపు భారం పడుతోంది. జాడలేని పంటల బీమా వాతావరణ ఆధారిత పంటల బీమా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. కొన్నేళ్ల నుంచి పత్తి పండిస్తున్న రైతులు అతివృష్టి, అనావృష్టి కారణంగా దిగుబడులు రాక త్రీవంగా నష్టపోతున్నారు. వారికి లబ్ధిచేకూర్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆరేళ్ల కిత్రం వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టాయి. పథకంలో 80 శాతం మంది రైతులు చేరారు. రెండేళ్ల క్రితం అతివృష్టితో నష్టపోయిన రైతులు ఎకరాకు రూ.12 వేల చొప్పున పరిహారం పొందారు. ఆతర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులు పరిహారానికి నోచుకోవడంలేదు. ‘యంత్రలక్ష్మి’కి మంగళం రైతులు ఆధునిక వ్యవసాయం చేసేందుకు సాగులో యాంత్రీకరణ పెంచేందుకు ప్రభుత్వం యంత్రలక్ష్మి పథకాన్ని ప్రవేశ పట్టింది. దీని ద్వారా చిన్న సన్న కారు రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, రొటోవేటర్లు, నాగళ్లు, పవర్స్ప్రేలు, యంత్రాలు రాయితీపై అందించేది. యంత్ర లక్ష్మి పధకాన్ని పూర్తిగా ఎత్తివేసింది. దీంతో రైతులు పనిముట్లు సైతం బయట మార్కెట్లో కొనుగోళ్లు చేయాల్సి వస్తోంది. రద్దయిన పావలా వడ్డీ పంటలపై తీసుకున్న రుణాలు మార్చి 30లోపు చెల్లించిన వారికి గతంలో పావలా వడ్డీ మాత్రమే వసూలు చేసేవారు. మిగితా వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది. మూడేళ్ల కిత్రం పావలా వడ్డీని ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో రైతులకు పంట రుణాలపై వడ్డీ భారం తప్పడంలేదు. అటకెక్కిన రుణమాఫీ 2018 డిసెంబర్ 11 లోపు రైతులు తీసుకున్న రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నాలుగేళ్లు దాటినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఇప్పటి వరకు కేవలం 20 వేల మంది రైతులకు సంబంధించిన కేవలం రూ.39 వేలలోపు రుణాలు మాత్రమే మాఫీ చేశారు. మరో 80 వేల మంది రైతుల రుణాలు మాఫీ కావాల్సి ఉంది. విత్తనాలు సబ్సిడీపై అందించాలి విత్తనాలు సబ్సిడీపై అందించక పోవడంతో చిన్న సన్న కారు రైతులపై అదనపు భా రం పడుతోంది. రైతులకు సంబంధించిన పథకాలపై ప్రభుత్వం పునరాలోచించాలి. విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై అందించాలి. – బొర్రన్న, రైతు స్వరాజ్యవేదిక జిల్లా అధ్యక్షుడు -
Fact Check: ఆతృతతో రామోజీ వికృత రాతలు
సాక్షి, అమరావతి: రాక్షస ఆలోచనలతో నిండిపోయిన రామోజీ మెదడుకు వాస్తవాలు బయటికొస్తాయనే భయం ఏకోశానా లేదు. రైతులపై పైసా భారం పడకుండా నోటిఫై చేసిన పంటలకు సంబంధించి సాగుచేసిన ప్రతీ ఎకరాకు ఈ–క్రాప్ ఆధారంగా బీమా కవరేజ్ను కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే ఆ పండు ముసలి ప్రాణం కడుపుమంటతో రగిలిపోతోంది. యూనివర్సిల్ కవరేజ్ విషయంలో ఏపీని స్ఫూర్తిగా కేంద్రం కూడా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంతో కలిసి ఫసల్ బీమాను అమలుచేస్తోంది. పలు రాష్ట్రాలు కూడా ఈ విషయంలో ఏపీ బాటపట్టాయి. కానీ, క్షుద్ర రాతలతో అబద్ధాలను అడ్డగోలుగా అచ్చేసే రామోజీకి ఇవన్నీ తెలిసినా కణకణాన ఓర్వలేనితనం ఆయన్ను రోజురోజుకీ దిగజారుస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గడిచిన నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 44.66 లక్షల మందికి రూ.6,684.84 కోట్ల పరిహారం అందించింది. కానీ, ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతున్న రామోజీ నిత్యం ఈ పథకంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. రైతులను గందరగోళ పర్చేలా ‘ఏది బీమా?’ అంటూ తాజాగా ఈనాడు ఎంతో ఆతృతతో మరో అబద్ధాల సంకలనాన్ని అచ్చేసింది. నిజానికి.. ఖరీఫ్–21 సీజన్కు సంబంధించి 15.61 లక్షల మందికి రూ.2,977.82 కోట్ల పరిహారం అందించిన రాష్ట్ర ప్రభుత్వం.. పరిహారం ఇంకా అందని వారెవరైనా మిగిలి ఉన్నారేమోనని దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హులను గుర్తించి ఈ నెల 14న మరో 9 వేల మందికి రూ.90 కోట్ల పరిహారం జమచేసి రైతులపట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంది. కానీ, ఇవేమీ పట్టించుకోని ఈనాడు విషం కక్కడమే పనిగా పెట్టుకుంది. ఫిల్్మసిటీ కోటలో కాలుజాపుకుని ఇంకెన్నాళ్లు ఈ ఎల్లో జర్నలిజం చేస్తారు? మీ కథల్ని ప్రజలు నమ్మే రోజులు పోయాయని తెలుసా? ‘ఏది బీమా?’పై ఇదీ నిజం.. చదవండి రామోజీ.. ఆరోపణ: బీమా హుళక్కేనా? వాస్తవం: ఈ–పంట నమోదు జరిగిన వెంటనే రైతుల మొబైల్కు ఎస్ఎంఎస్ రూపంలో మెస్సేజ్లు పంపడమే కాదు.. ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తికాగానే ప్రతీ రైతుకు భౌతిక రశీదులు అందించారు. వీటి ప్రామాణికంగానే పంట ఉత్పత్తుల కొనుగోళ్లతో పాటు వ్యవసాయ రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, పంటల బీమా, పంట నష్టపరిహారం వంటి ఇతర సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. సాగు చేసిన పంటలలో నోటిఫై చేసిన పంటలకు బీమా రక్షణ కల్పిస్తున్నారు. ఈ వివరాలన్నీ ఆ రశీదుల్లో స్పష్టంగా పొందుపరుస్తున్నారు. ఈ విషయంలో రైతుల్లో ఎలాంటి గందరగోళంలేదు. ఈనాడుకు తప్ప. ఆరోపణ: ఆ పంటలకు బీమా కవరేజ్ ఏదీ? వాస్తవం: నాసిరకం విత్తనాలవల్ల పంటలు దెబ్బతిన్నా, ఆశించిన దిగుబడులు రాకపోయినా, వాతావరణం వల్ల పంటలు దెబ్బతిన్నా నోటిఫై పంటలకు బీమా పరిహారం అందిస్తారు. పత్తి, మిరప, ఉల్లి తదితర పంటలన్నీ నోటిఫైడ్ పంటలే. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. ప్రీమియం చెల్లించిన రైతులకు మాత్రమే కవరేజ్ ఉండేది. అధికారులు, బీమా కంపెనీల చుట్టూ చెప్పులరిగేలా తిరిగితే కానీ పరిహారం సొమ్ములు దక్కేవి కావు. అది కూడా అరకొరగానే. కానీ, నేడు రైతులపై పైసా భారం పడకుండా నాలుగేళ్లుగా పంటల బీమా పరిహారం ఇస్తున్నారు. ఆరోపణ : అన్నదాతను ఆదుకోవడంలో అలసత్వమేలా? వాస్తవం: పంటల పరిహారం చెల్లింపులో ఈనాడు చెబుతున్నట్లుగా ఎలాంటి గందరగోళంలేదు. యూనివర్సల్ కవరేజ్ విషయంలో కేంద్రం దిగిరావడంతో ఖరీఫ్–22 సీజన్కు సంబంధించి దిగుబడి ఆధారిత పంటలకు పీఎంఎఫ్బీవై–డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలుచేస్తుండగా వాతావరణ ఆధారిత పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా వైఎస్సార్ ఉచిత బీమా పథకం కింద కవరేజ్ కల్పిస్తోంది. నోటిఫై చేసిన దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు రైతుల వాటాను కూడా ప్రభుత్వం చెల్లించింది. మే నెల వరకు వాతావరణ ఆధారిత పంటల బీమా కవరేజీ కొన్ని పంటలకు మిగిలి వున్నందువలన బీమా పరిహారం లెక్కింపు తదనుగుణంగా పూర్తికావస్తోంది. ఖరీఫ్ సీజన్ మొదలై రెండు వారాలైనా ఖరీఫ్–2022 సీజన్కు సంబంధించి పంటల బీమా పరిహారం చెల్లింపుపై రైతులకు ఎలాంటి సమాచారం లేదనడంలో వాస్తవంలేదు. ఈ విషయంలో ప్రభుత్వం అసలు కసరత్తు చేయడంలేదని ఆరోపించడం హాస్యాస్పదం. ఆరోపణ: ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? వాస్తవం: జూలై 8న ఖరీఫ్–22 సీజన్కు సంబంధించిన పంటల బీమా పరిహారాన్ని జమచేస్తామని సీఎం జగన్ స్వయంగా రైతుభరోసా ఇచ్చిన జూన్ 1నే ప్రకటించారు. ఎందుకంటే జూలై 8న రైతు దినోత్సవంతో పాటు వైఎస్సార్ జయంతి కూడా. కనుక ఇది ఇస్తారన్న సంగతి అందరికీ తెలుసు. అయినా, ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ దానిని ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకా ఇవ్వలేదని రాయడం సబబేనా? ఇక.. ముందే చెప్పినట్లుగా ఆ తేదీకి సీఎం ఇచ్చేస్తే మేం చెప్పాం కాబట్టే ఇచ్చారని డబ్బా కొట్టుకునేందుకేనా ఈ రాతలు? మరోవైపు.. పంటల బీమాకు అర్హుల జాబితా మదింపు జరుగుతోంది. ఈ నెలాఖరులోగా జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఆ తర్వాత ఆన్లైన్లో అభ్యంతరాలను స్వీకరించి వాటిని జూలై మొదటి వారంలో పరిష్కరిస్తారు. ఆ వెంటనే తుది జాబితాలను ఆర్బీకేల ద్వారా ప్రదర్శిస్తారు. ఆరోపణ: అమ్మఒడి కోసం జాప్యం చేస్తున్నారు.. వాస్తవం: 2016 నుంచి పీఎంఎఫ్బీవై అమలవుతోంది. అంతకుముందు వ్యవసాయ బీమా పథకం కింద బీమా కవరేజ్ కల్పించేవారు. గడిచిన సీజన్కు సంబంధించి చెల్లించాల్సిన బీమా పరిహారాన్ని గతంలో ఆగస్టు నెలాఖరులోపు ఇచ్చిన దాఖలాలే లేవు. పలు సీజన్లలో సెప్టెంబర్లో కూడా ఇచ్చారు. అది కూడా కంపెనీల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తేకానీ పరిహారం దక్కేది కాదు. కానీ, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గడిచిన సీజన్కు సంబంధించిన పరిహారాన్ని మరుసటి ఏడాది ఆ సీజన్ ప్రారంభమయ్యేలోగా అర్హుల జాబితాలను ప్రకటించి జూన్–జూలైలో పరిహారం అందిస్తున్నారు. ఈ వాస్తవాలను విస్మరించి అమ్మఒడి కార్యక్రమం ఉన్నందున పంటల బీమా పరిహారం జూలై లేదా ఆగస్టులో ఇచ్చే అవకాశం ఉందంటూ చేతికొచ్చినట్లు రాయడం ఈనాడుకే చెల్లింది. ఆరోపణ : ఈకేవైసీ అంటూ కొత్త మెలిక పెట్టారు.. వాస్తవం: మొదట్లో ఈ–క్రాప్లో నమోదు చేయించుకుంటే చాలని, ఆ తరువాత ఈ–కేవైసీ చేయించుకుంటేనే పరిహారం ఇస్తామని మెలిక పెట్టిందనడంలో కూడా వాస్తవంలేదు. నోటిఫై చేసిన పంటలకు బీమా వర్తింపజేసేందుకు జారీచేసిన నోటిఫికేషన్లో రైతు తన ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణ చెయ్యాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు పత్రికాముఖంగా రైతులకు విజ్ఞప్తి చేయడమే కాదు.. ఆర్బీకేల ద్వారా ఈ–కేవైసీ నమోదు చేసుకోవాలని రైతులకు వివరించారు. చెల్లించాల్సిన క్లెయిమ్స్ను ఆధార్ ఆధారిత నగదు బదిలీ ద్వారా నేరుగా రైతు ఖాతాలకు జమచేస్తున్నందున ఈ–కేవైసీని ప్రామాణికంగా తీసుకుంటున్నారు.ఈ వాస్తవాలను కప్పిపుచ్చి రైతులను గందరగోళ పరిచేలా తప్పుడు వార్తలు రాయడం, విషం కక్కడం ఈనాడుకు నిత్యకృత్యమైపోయింది. -
Fact Check: అర్హులకు పరిహారం జమచేస్తే నిందలా?
‘సంక్షేమ ఫలాలు అందని అర్హులెవరైనా ఉంటే వెతికి మరీ వారికి నేరుగా అందిస్తుంటే ఎవరైనా అభినందించాలిగానీ ఈనాడు మాత్రం పనిగట్టుకుని బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. వాస్తవాలు తెలుసుకోకుండా బటన్ నొక్కిన ఏడాదికి ఖాతాల్లో సొమ్ము అంటూ తప్పుడు కథనాన్ని వండివార్చింది’.. అంటూ వ్యవసాయ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో ఖండించింది. రైతులపై పైసా భారం పడకుండా నోటిఫైడ్ పంటలను సాగుచేసిన ప్రతీ ఎకరాకు డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి బీమా కల్పిస్తోంది. ఈ–క్రాప్లో నమోదు ప్రామాణికంగా ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. అర్హత పొందిన వారికి తరువాత ఏడాది సీజన్ ప్రారంభమయ్యేలోగా పరిహారం చెల్లిస్తున్నారు. ఇలా గడిచిన నాలుగేళ్లుగా 44.66 లక్షల మందికి రూ.6,684.84 కోట్ల బీమా పరిహారం చెల్లించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఖరీఫ్–2021 సీజన్లో అర్హత పొందిన 15.61 లక్షల మంది రైతులకు గతేడాది జూన్ 14న రూ.2,977.82 కోట్లు జమచేసింది. ఒక సీజన్కు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో పరిహారం అందించడం చరిత్రలో ఇదే తొలిసారి. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అర్హులైన ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే ఉద్దేశంతో పరిహారం అందని వారి నుంచి, ఆర్బీకేల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హత సాధించిన మేరకు ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది. అయితే, కొన్ని సంశయాత్మక ఖాతాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పునఃపరిశీలన చేశారు. అందులో అర్హత పొందిన వారికి సంబంధించిన విస్తీర్ణానికి గతంలో ఏమైనా చెల్లింపులు జరిగాయా లేదా అని కూడా పునఃపరిశీలన చేశారు. ఒకటి రెండుసార్లు క్షేత్రస్థాయిలో పునఃపరిశీలన తర్వాత అన్ని వి«ధాలుగా అర్హత పొందిన వారి జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించారు. ఇలా అర్హత పొందిన 9 వేల మందికి ఈనెల 14న రూ.90 కోట్లు జమచేశారు. తొలుత అర్హత పొందిన వారిలో వీరు కేవలం 0.2 శాతం మాత్రమే. వాస్తవాలిలా ఉంటే.. సాంకేతిక కారణాలతో ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన జాప్యాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుని బీమా పరిహారం ఏడాదికి జమచేసినట్లుగా వాస్తవాలను మరుగున పరిచేలా ప్రచురించిన వార్తను ఖండిస్తున్నట్లు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. -
రైతుబంధు చూపి అన్నిటికీ కోత
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతుల జీవన శైలి మారిపోయిందంటూ సీఎం కేసీఆర్ గొప్పులు చెప్పుకుంటున్నారని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఒక్కో రైతుకు రూ.10 వేల సాయం అందిస్తుంటే, కేంద్రం ఒక్కో రైతుకు ఎరువుల రాయితీ రూపంలో ఎకరానికి రూ.18,254 ఇస్తోందని చెప్పారు. రైతుబంధు పథకాన్ని చూపి పంట నష్టానికి పరిహారం, పంటల బీమా తదితరాలన్నిటికీ కోతపెట్టిన ముఖ్యమంత్రి.. రైతులను తీవ్ర నష్టాలపాలు చేశారని విమర్శించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అకాల వర్ష బాధితులకు అందని సాయం అకాల వర్షాలతో రాష్ట్రంలోని రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, కానీ సీఎం కేసీఆర్ రైతులకు ఎలాంటి సాయం చేయలేదని కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంటల బీమా పథకం ద్వారా సాయం అందుతుండగా.. తెలంగాణలో ఈ పథకం అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో పరిపాలనను సలహాదారులకు అప్పగించిన సీఎం.. తాను మహారాష్ట్రలోని బీఆర్ఎస్ బ్రాంచ్ ఆఫీస్లో బిజీగా గడుపుతున్నారన్నారు కేసీఆర్ తనకు తాను దేశ్ కీ నేత అని చెప్పుకుంటున్నారని, ఫ్లెక్సీలు పెట్టుకున్నంత మాత్రాన దేశ్ కీ నేత కాలేరని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ను ఎంఐఎం పార్టీ నడిపిస్తోందని విమర్శించారు. అక్కడ ఒక్క వార్డు మెంబర్ గెలిచినందుకే సంబరపడుతున్నారన్నారు. హామీలన్నీ తుంగలో తొక్కారు..: సీఎం అవ్వకముందు కేసీఆర్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని కేంద్రమంత్రి విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మొదట్లోనే వారిని మోసం చేశారన్నారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్, వైద్యం, మౌలిక వసతులు, గ్రామ పంచాయతీల అభివృద్ధి, మున్సిపాలిటీల అభివృద్ధి.. ఏ విషయంలోనూ మాట నిలబెట్టుకోలేదన్నారు. అలాంటి ముఖ్యమంత్రి మహారాష్ట్రకు వెళ్లి ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ డిజిటల్ విప్లవం తీసుకురావడంతో పాటు సంక్షేమ పథకాలు వందకు వంద శాతం పేదలకు అందేలా చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాయితీ కింద ట్రాక్టర్లు ఇస్తుంటే వాటిని బీఆర్ఎస్ నాయకులు వారి బంధువులకు ఇచ్చుకున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీల వల్ల ఉత్పత్తి పెరుగుతోందని, కేంద్రం నిర్మాణాత్మకంగా సబ్సిడీని అందిస్తోందని కిషన్రెడ్డి చెప్పారు. ఎరువుల సబ్సిడీతో కౌలు రైతులకు లాభం చేకూరుతుందన్నారు. ధాన్యం కొనుగోలు ఒక్క కేంద్ర ప్రభుత్వం బాధ్యతే కాదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కానీ తెలంగాణలో మాటల గారడీతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని కేంద్రమంత్రి విమర్శించారు. అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారు రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణను కేవలం అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారని, ఈ నోట్ల రద్దులో తమ ప్లాన్ తమకు ఉందని కిషన్రెడ్డి చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ప్రభావం తెలంగాణలో ఏమాత్రం ఉండదన్నారు. కాంగ్రెస్కు తెలంగాణలో భవిష్యత్తు లేదని, ఇక్కడ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ మాత్రమేనని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, ప్రస్తుతం దీనికి అవకాశం లేదని చెప్పారు. కవిత అరెస్టు మా చేతుల్లో లేదు ఎమ్మెల్సీ కవిత అరెస్టు అంశం తమ చేతుల్లో లేదని కిషన్రెడ్డి అన్నారు. ఇది ఈ కేసును పరిశోధిస్తున్న సీబీఐ పరిధిలోని అంశమని చెప్పారు. సీబీఐ వద్ద పక్కా ఆధారాలు ఉన్నందునే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్టు చేశారన్నారు. అదే విధంగా అవినీతికి పాల్పడిన కర్ణాటకకు చెందిన బీజేపీ శాసన సభ్యుడిని కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. 27న పరేడ్ గ్రౌండ్స్లో లక్షమందితో యోగా మహోత్సవం ప్రతి మనిషి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంచే సాధనంగా యోగాను ప్రపంచం గుర్తించిందని, ఐక్యరాజ్యసమితితో పాటు 200కు పైగా దేశాల్లో యోగా ప్రజల జీవితాల్లో భాగమైందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 25 రోజుల కౌంట్ డౌన్గా సికింద్రాబాద్లోని పెరేడ్గ్రౌండ్స్లో ఈనెల 27న ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం టూరిజం ప్లాజాలో మీడియాతో ఆయన మాట్లాడారు. కౌంట్డౌన్ యోగా కార్యక్రమానికి హైదరాబాద్ జంట నగరాల నుంచి సుమారు లక్ష మంది వరకు హాజరవుతారని భావిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రులతో పాటు యోగా సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. జూన్ 21 కి వంద రోజుల ముందు నుంచే దేశంలోని ప్రజలందరినీ ఇందుకోసం సన్నద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ను కూడా ఆహ్వానించాం మే 27వ తేదీ ఉదయం 5 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో జరిగే యోగా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని కిషన్రెడ్డి కోరారు. సీఎం కేసీఆర్కు కూడా ఆహా్వనం పంపినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయడం లేదు
-
Fact Check: దగా చేసింది ఎవరో తెలియదా రామోజీ ?
సాక్షి, అమరావతి: పచ్చ పత్రిక ఈనాడు విషపు రాతలు విపత్తులకంటే ప్రమాదకరంగా ఉన్నాయి. నిత్యం ఉషోదయంతో అబద్ధాలు నినదించే రామోజీకి క్షేత్ర స్థాయిలో వ్యవసాయ సంస్కరణల యజ్ఞం కనిపించట్లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయంలో తీసుకొచ్చి విప్లవాత్మక మార్పులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. రైతులపై పైసా భారం పడకుండా డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తున్నారు. వాస్తవానికి రైతులకు అన్ని రకాలుగా దగా చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. టీడీపీ హయాంలో సగటున 20.28 లక్షల మంది రైతుల పంటలకు మాత్రమే బీమా కవరేజ్ ఉండేది. అదీ సకాలంలో చెల్లించేవారు కాదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ నాలుగేళ్ల పాలనలో 1.66 కోట్ల మంది రైతులకు బీమా కల్పించారు. ఒక్క 2022–23 సంవత్సరంలోనే 54.11 లక్షల మందికి పంటల బీమా రక్షణ క ల్పించారు. ఇది ఓ రికార్డు. పంట కోత ప్రయోగాల ఆధారంగా వేసే దిగుబడి అంచనాకంటే.. వాస్తవ దిగుబడులు ఏమాత్రం తగ్గినా తదుపరి సీజన్ ప్రారంభం కావడానికి ముందే వైఎస్ జగన్ ప్రభుత్వం బీమా పరిహారం చెల్లిస్తోంది. ఈవేమీ పట్టని ఈనాడు ఉచిత బీమాపై అసత్య కథనంతో విషం కక్కింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ– క్రాప్ నమోదు ఆధారంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు 2020 –21 సంవత్సరంలో రూ. 1,739 కోట్లు, 2021 –22 లో రూ. 2,978 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం రైతులకు చెల్లించింది. అదీ.. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసింది. గడిచిన నాలుగేళ్లలో ఉద్యాన పంటలకు రూ.423.73 కోట్లు పెట్టుబడి రాయితీని రైతుల ఖాతాల్లో జమ చేసింది. మామిడి పంట నష్టపోయిన 4,197 రైతులకూ రూ. 4.97 కోట్లు పెట్టుబడి రాయితీ అందించింది. రబీ 2022–23 సీజన్కి పంటల బీమా కింద పంటలను నోటిఫై చేయలేదన్న మాటాఉత్త అబద్ధమే. వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలుకు 2022–23 రబీలో ఈ– క్రాప్ నమోదు పూర్తయిన రైతుల వివరాలను కేంద్ర ప్రభుత్వానికి, బీమా కంపెనీలకు ఈ ఏడాది మార్చిలోనే పంపించింది. నేషనల్ క్రాప్ ఇన్సూ్యరెన్స్ పోర్టల్లో నోటిఫికేషన్ డిజిటైజేషన్ కూడా పూర్తయింది. కేంద్ర ప్రభుత్వ సాంకేతిక బృందం రైతువారీ వివరాల పరిశీలన తర్వాత పీఎంఎఫ్బీవై పోర్టల్లో రబీ డేటా ప్రదర్శిస్తుంది. పంటల బీమాను సరళతరం చేసింది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. బీమా అన్నది రైతుకు గుది బండగా మారకుండా, బ్యాంకు రుణంతో సంబంధం లేకుండా ఈ–క్రాప్లో నమోదైతే చాలు ప్రతి ఎకరాకూ బీమా వర్తింపజేస్తోంది. రైతుపై భారం లేకుండా పూర్తి ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. బీమా కంపెనీలు గడువులోగా పరిహారం చెల్లించేలా పర్యవేక్షిస్తోంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమాను కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించింది. రాష్ట్రంలో రైతులకు బీమా పరిహారాన్ని తదుపరి సీజన్ ప్రారంభానికి ముందే చెల్లిస్తోంది. మిర్చి పంటకు బీమాను గతంలో మాదిరిగానే యథాతథంగా అమలు చేస్తోంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద మిర్చి పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు సకాలంలో పరిహారం చెల్లిస్తోంది. 2019–20లో 58,968 మంది రైతులకు రూ.90.24 కోట్లు, 2020–21లో 19,983 మంది రైతులకు రూ.36.02 కోట్లు, 2021–22లో 70,229 మంది రైతులకు రూ.439.78 కోట్లు చెల్లించింది. 2023–24లో బీమాకు మిర్చి పంట కవరేజీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. బీమా కవరేజ్, పరిహారం ఇలా.. తెలుగుదేశం పార్టీ పాలనలో ఐదేళ్లలో 74.37లక్షల మంది రైతులకు బీమా కవరేజ్ అయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన నాలుగేళ్లలో 1.67 కోట్ల మంది రైతులు బీమా కవరేజ్ పరిధిలోకి వచ్చారు. టీడీపీ హయాంలో 2.32 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పిస్తే, ఈ నాలుగేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 3.24 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పించింది. టీడీపీ హయాంలో 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్ల బీమా పరిహారం ఇస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటివరకు 44.66 లక్షల మందికి రూ.6,488.84 కోట్ల బీమా పరిహారం అందజేసింది. బీమా కవరేజ్ పొందిన రైతులు, విస్తీర్ణం (లక్షల ఎకరాల్లో) ఇలా.. -
అత్యుత్తమ బీమా పథకం ‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని దేశంలోనే అత్యుత్తమ పంటల బీమా పథకంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ – క్రాప్ ప్రామాణికంగా యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ప్రకటించింది. రైతులపై పైసా కూడా భారం పడకుండా నోటిఫైడ్ పంటలకు 100 శాతం బీమా కల్పిస్తున్న రాష్ట్రమని ఏపీపై ప్రశంసలు కురిపించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై)పై చత్తీస్ఘడ్లోని రాయపూర్లో గురువారం ప్రారంభమైన జాతీయ స్థాయి వర్కుషాపులో ‘ఇన్నోవేషన్ కేటగిరి’ కింద ఉత్తమ బీమా పథకంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ఎంపిక చేశారు. ఈమేరకు కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి మనోజ్ ఆహూజా చేతుల మీదుగా రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ చేవూరు హరికిరణ్ ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. 44 నెలల్లో రూ.6,684.84 కోట్ల పరిహారం.. నోటిఫై చేసిన పంటలకు సంబంధించి సాగు చేసిన ప్రతి ఎకరాకూ ఈ– క్రాప్, ఈ –కేవైసీ ప్రామాణికంగా ఖరీఫ్ 2020 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. గతంలో గరిష్టంగా 25.86 లక్షల హెక్టార్లలో పంటలకు బీమా కవరేజ్ కల్పించగా ప్రస్తుతం ఏకంగా 60 లక్షల హెక్టార్లలో కవరేజ్ వర్తింపచేశారు. 2018–19 సీజన్లో గరిష్టంగా రూ.1263 కోట్ల పరిహారం చెల్లించగా ఖరీఫ్ 2021 సీజన్కు సంబంధించి రికార్డు స్థాయిలో రూ.2,977.82 కోట్ల పరిహారం అందించారు. 44 నెలల్లో 44.28 లక్షల మంది రైతులు రూ.6,684.84 కోట్ల పరిహారాన్ని అందుకున్నారు. ఈ – క్రాప్ ప్రామాణికంగా యూనివర్సల్ కవరేజ్ కల్పించేందుకు కేంద్రం ముందుకు రావడంతో 2022–23 సీజన్ నుంచి పీఎంఎఫ్బీవైతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఖరీఫ్ 2022 సీజన్కు సంబంధించి ఇప్పటికే నూరు శాతం ఈ – క్రాప్తో పాటు 97 శాతం ఈ – కేవైసీతో రికార్డు సృష్టించారు. ఏపీ స్ఫూర్తితో మార్పులు: అహూజా ఆంధ్రప్రదేశ్ను స్ఫూర్తిగా తీసుకుని జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో పలు మార్పులు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ ఆహూజా వెల్లడించారు. పంటల బీమా అమలులో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని వర్కుషాప్లో ఆయన ప్రశంసించారు. రైతులపై పైసా భారం పడకుండా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించడం నిజంగా గొప్ప ఆలోచనన్నారు. నాలుగేళ్లుగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఏపీ ప్రభుత్వం సాధించిన విజయాన్ని కేంద్రం గుర్తించిందన్నారు. ఏపీ తరహాలోనే సీజన్ ముగియకుండానే బీమా పరిహారాన్ని అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసేలా కసరత్తు జరుగుతోందన్నారు. పంటల బీమా పథకంతో పాటు రైతు సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంకితభావాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. వర్కుషాప్లో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, బీమా కంపెనీల ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అన్నదాతకు అందుబాటులో ‘న్యాయం’
సాక్షి, హైదరాబాద్ /జనగామ: కార్మికులు, మహిళలు, బాలలు, ఖైదీలు.. ఇలా సమాజంలోని పలు వర్గాలకు న్యాయ సహాయం చేసే కేంద్రాలు దేశంలో చాలా ఏర్పాటయ్యాయి. కానీ తొలిసారిగా రైతులకు న్యాయ సహాయం అందించేందుకు కూడా ఓ కేంద్రం ఏర్పాటు కానుంది. బమ్మెర పోతన హలం పట్టిన నేల దేశ చరిత్రలో ఈ నూతన అధ్యాయానికి వేదికవుతోంది. పోతానామాత్యుడి స్వగ్రామమైన తెలంగాణలోని జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో ‘అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్’మొదలవుతోంది. నల్సార్ విశ్వవిద్యాలయం, తెలంగాణ లీగల్ సర్విసెస్ అథారిటీ, లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఈ క్లినిక్ ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యన్ ఈ రైతు న్యాయ సేవా కేంద్రాన్ని వర్చువల్గా ప్రారంభించనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పీవీ సంజయ్కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.నవీన్రావు, నల్సార్ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకృష్ణదేవరావులు పాల్గొననున్నారు. ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోన్న ఈ కేంద్రం ద్వారా రైతులకు మెరుగైన సేవలందించగలిగితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆలోచన మేరకు దేశ వ్యాప్తంగా ఈ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లు ఏర్పాటవుతాయని న్యాయ, భూచట్టాల నిపుణులు చెపుతున్నారు. అన్ని అంశాల్లో రైతుకు సహకారం దుక్కి దున్నేనాటి నుంచి తన పంటను మార్కెట్లో అమ్ముకునే వరకు రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించే విషయంలో అవసరమైన న్యాయ సాయం అందించడమే ధ్యేయంగా బమ్మెర గ్రామంలో ఈ ‘అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్’ఏర్పాటవుతోంది. భూ సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వల్ల నష్టం వాటిల్లిన సమయంలో, మార్కెట్లో మోసాలు చోటు చేసుకుంటే, పంటల బీమా అమలు కానప్పుడు.. ఇలా ప్రతి సందర్భంలోనూ రైతులకు అవసరమైన న్యాయ సాయాన్ని ఈ కేంద్రం ద్వారా అందించనున్నారు. న్యాయ సేవలను అందించడంతో పాటు రైతు, భూ చట్టాలపై అవగాహన కల్పి చడం, రైతులను చైతన్యపర్చడం లాంటి కార్యక్రమాలను కూడా ఈ కేంద్రాల ద్వారా నిర్వహించనున్నారు. గ్రామంలోని రైతులకు వ్యవసాయ సలహాలు, న్యాయ సాయం ఉచితంగా అందించనున్నారు. ఇందుకోసం పారా లీగల్ కార్యకర్త అందుబాటులో ఉంటారు. రైతుల సమస్యలను నమోదు చేసుకునే ఈ కార్యకర్త సదరు వివరాలను నల్సార్, లీగల్ సర్విసెస్ అథారిటీ, లీఫ్స్ సంస్థలకు పంపనున్నారు. నల్సార్ విద్యార్థులు వాటిని పరిశీలించి సహాయాన్ని అందిస్తారు. రాష్ట్రంలోని 25 న్యాయ కళాశాలలకు చెందిన విద్యార్థులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసే ప్రయత్నం జరుగుతోంది. దీంతో పాటు రైతులకు చట్టాలపై అవగాహన కల్పి చేందుకు గాను క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. గత 17–18 ఏళ్లుగా భూ సమస్యలపై పనిచేస్తోన్న లీఫ్స్ సంస్థ మరికొంత వ్యవసాయ చట్టాల అమలుపై గ్రామీణ స్థాయిలో పనిచేయనుంది. రైతులకు న్యాయ సేవల దిశగా మొదటి ప్రయత్నం రైతులకు చట్టాలతో అవసరం పెరిగింది. కానీ వారి అవసరాలు తీర్చే స్థాయిలో సౌకర్యాలు పెరగలేదు. న్యాయ సేవలూ అందుబాటులో లేవు. అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ మొదటి ప్రయత్నం. ఇది విజయవంతం అయితే బమ్మెరే కాదు దేశమంతటా ఇలాంటి సేవలు అందించే బ్లూప్రింట్ తయారవుతుంది. – లీఫ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు, భూచట్టాల నిపుణుడు సునీల్కుమార్ -
పంటల బీమాపై పచ్చ రాతలు
-
అది ఉత్తుత్తి కథనం.. భ్రమలో రామోజీ! ‘ఈనాడు’ రోత రాతలు
సాక్షి, అమరావతి: ఒకే అబద్ధాన్ని పదే పదే చెబితే అదే నిజమని ప్రజలు నమ్మేస్తారనే భ్రమలో రాజగురువు రామోజీ తప్పుడు కథనాలను వండి వార్చడమే పనిగా పెట్టుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతుంటే నిత్యం విషం కక్కుతూ చంద్రబాబుకు మేలు చేయడమే అజెండాగా పెట్టుకుంది ఈనాడు. డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రైతులపై పైసా భారం పడకుండా ప్రభుత్వం అమలు చేస్తోంటే.. రైతుల్లో అపోహలు సృష్టించేందుకు ‘ఉచిత బీమా ఉత్తిదే’ అంటూ శనివారం ఓ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. తండ్రీకొడుకులు ఊరూరూ తిరుగుతున్న నేపథ్యంలో వారు మాట్లాడటానికి సరుకు అందిస్తూ ఇలా దిగజారుడు కథనాలను అచ్చేస్తోంది. ఆరోపణ : పంట అంతటికీ బీమా లేదు వాస్తవం: నోటిఫై చేసిన పంటలకు గాను సాగు చేసిన ప్రతీ ఎకరాకు ఈ–క్రాప్, ఈ–కేవైసీ ప్రామాణికంగా 2020 ఖరీఫ్ నుంచి ప్రభుత్వం ఉచిత పంటల బీమా అమలు చేస్తోంది. ఆ సీజన్ మళ్లీ ప్రారంభం కాకముందే నష్టపోయిన ప్రతి ఎకరాకు, ప్రతి రైతుకు పరిహారం అందిస్తోంది. పంటల బీమా అమలులో ఎలాంటి కోతల్లేకుండా యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తోన్న మొట్టమొదటి రాష్ట్రంగా ఏపీ నిలిచిందని వివిధ వేదికలపై కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఏపీని మోడల్గా తీసుకోవాలని పదేపదే చెబుతున్నారు. ఇప్పటికే ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీని మోడల్గా తీసుకొని తమ రాష్ట్రాల్లోని రైతులందరికీ పూర్తి స్థాయిలో బీమా రక్షణ కల్పించే దిశగా అడుగులేస్తున్నాయి. ఆరోపణ : అంచనా అంతుపట్టట్లేదు వాస్తవం: పంటల బీమా నమోదు గతంలో చాలా సంక్లిష్టంగా, ప్రీమియం చెల్లింపు భారంగా ఉండేది. కనీస అవగాహన, ఆర్థిక స్థోమత లేక నిర్ధారించిన గడువులోగా ప్రీమియం చెల్లించలేక లక్షలాది మంది రైతులు పంటల బీమాకు దూరంగా ఉండే వారు. చేయించుకున్న వారు పరిహారం కోసం అధికారులు, బీమా కంపెనీల చుట్టూ ఏళ్ల తరబడి ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. ఈ పరిస్థితిలో మార్పు తేవాలన్న దృఢ సంకల్పంతో తీసుకొచ్చిందే డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం. గతంలో ఎన్నడూ లేని విధంగా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ లబ్ధిదారుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. అభ్యంతరాలు స్వీకరించి అర్హత ఉన్న ప్రతి రైతుకు పరిహారం అందేలా ఏర్పాట్లు చేశారు. 2014–15లో కేవలం 6.39 లక్షల హెక్టార్లలో సాగైన పంటలకు మాత్రమే బీమా కవరేజ్ కల్పిస్తే, 2021–22లో ఏకంగా 54.95 లక్షల హెక్టార్లలో సాగైన పంటలకు పూర్తి స్థాయిలో బీమా వర్తింప చేశారు. పరిహారం చెల్లింపు విషయాన్ని పరిశీలిస్తే 2014–15లో కేవలం 1.03 లక్షల మందికి రూ.132.24 కోట్లు చెల్లిస్తే, 2021–22లో ఏకంగా 15.61 లక్షల మందికి రూ.2,977.82 కోట్ల పరిహారం చెల్లించారు. ఇందులో గత ప్రభుత్వం 6.19 లక్షల మందికి ఎగ్గొట్టిన రూ.715.48 కోట్లు కూడా ఉంది. 2014–19 మధ్య 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్లు చెల్లిస్తే, 2019–22 మధ్య 44.28 లక్షల మందికి రూ.6,684.84 కోట్ల బీమా పరిహారం రైతులకు అందజేశారు. ఈ లెక్కన 2014–15తో పోల్చుకుంటే బీమా కవరేజ్ తొమ్మిది రెట్లు పెరగ్గా, పరిహారం చెల్లింపు ఏకంగా 22 రెట్లు పెరిగింది. ఆరోపణ : ఈ ప్రభుత్వం నిబంధనలు మార్చింది వాస్తవం: పంటల బీమా అమలు కోసం ఏటా ఖరీఫ్, రబీ సీజన్లకు ముందుగానే టెక్నికల్ కమిటీ సూచనల మేరకు మార్గదర్శకాలను రూపొందిస్తారు. వాటికనుగుణంగా జిల్లాల వారీగా ఎంపిక చేసిన పంటలకు దిగుబడి, వాతావరణ ఆధారంగా నోటిఫై చేస్తారు. దిగుబడి ఆధారంగా నోటిఫై చేసిన పంటలకు పంట కోత ప్రయోగాల ద్వారా వచ్చే వాస్తవ దిగుబడులు ఆధారంగా నష్టాన్ని అంచనా వేసి ఆ మేరకు పరిహారం చెల్లిస్తుంటారు. ఇక వాతావరణం ఆధారంగా నోటిఫై చేసిన పంటలకు నిర్ణీత గడువులోగా వాతావరణ అంశాల హెచ్చు తగ్గుదల ఆధారంగా నష్టాన్ని అంచనా వేసి ఆ మేరకు బీమా పరిహారం చెల్లిస్తుంటారు. 15 ఏళ్లుగా ఇదే విధానం కొనసాగుతోంది. మిరప పంట విషయానికి వస్తే 2016 నుంచి వాతావరణ బీమా వర్తింప చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా ఇదే రీతిలో బీమా కవరేజ్ కల్పిస్తున్నారే తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఎలాంటి మార్పులు తీసుకురాలేదు. ఆ మేరకు గడిచిన సీజన్లో వైపరీత్యాలతో పాటు నల్లతామర పురుగు ప్రభావం వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించారు. నాటి సంగతేమిటి రామోజీ టీడీపీ హయాంలో కల్తీ విత్తనాలు, గులాబీ తెగులు ప్రభావంతో ఏటా లక్షలాది మంది పత్తి రైతులు నష్ట పోయినా ఏనాడు ప్రభుత్వ పరంగా పైసా పరిహారం విదిల్చిన దాఖలాలు లేవు. నాడు రైతుల వెతలపై ఈనాడు సింగిల్ కాలమ్ రాసిన పాపానపోలేదు. ఇప్పుడేదో రైతులకు అన్యాయం జరిగి పోయిందంటూ గగ్గోలు పెట్టడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో అనుసంధానం చేసి.. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ 2023–24 సీజన్ నుంచి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్గదర్శకాల రూపకల్పన కోసం జిల్లాల వారీగా 2023–24 సీజన్కు ఎంపిక చేసిన పంటలకు బీమా కవరేజ్ కోసం ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. రాష్ట్ర స్థాయి కమిటీ మార్గదర్శకాలను అనుసరించి అత్యధిక విస్తీర్ణానికి బీమా రక్షణ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందు కెళ్తోంది. ఇలా నష్టపోయిన ప్రతి ఎకరాకు, ప్రతి రైతును ఆదుకోవడమే లక్ష్యంగా చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే రైతులను గందరగోళ పర్చేలా విషపురాతలు రాయడం చంద్రబాబు మేలు కోసమేనని ఎవరికి తెలియదు? -
తెలంగాణలో కొత్తగా పంటల బీమా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా పంటల బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వానికి వ్యవసాయశాఖ ప్రతిపాదించింది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో అందుకు దాదాపు రూ. 500 కోట్ల మేర నిధులు కేటాయించాలని నివేదించినట్లు సమాచారం. బడ్జెట్లో కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడితే వచ్చే వానాకాలం సీజన్ నుంచి దీన్ని అమలు చేస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన నుంచి 2020లో వైదొలిగాక రాష్ట్రంలో ఎలాంటి పంటల బీమా పథకం అమలు కావడంలేదు. దీంతో పంట నష్టం జరిగినా రైతులకు పరిహారం అందని పరిస్థితి నెలకొంది. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో వ్యవసాయ శాఖ సొంత పంటల బీమాపై దృష్టిసారించింది. బెంగాల్ తరహాలో...: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న తరహాలోనే రాష్ట్రంలోనూ బీమా పథకాన్ని అమలు చేసే అవకాశముంది. దీనిపై సీఎం కేసీఆర్ గతంలోనే అసెంబ్లీలో ప్రకటన చేశారు. బెంగాల్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మార్పులు చేసి బంగ్లా సస్య బీమా యోజన పేరుతో సొంత పథకం తీసుకొచి్చంది. నాలుగేళ్లుగా దీన్ని అమలు చేస్తోంది. బెంగాల్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆలుగడ్డ, చెరకు పంట విలువలో 4.85 శాతాన్ని ప్రీమియంగా రైతుల నుంచి వసూలు చేస్తుండగా, ఆహార ధాన్యాలు, వంట నూనెలకు సంబంధించిన పంటలకు రైతుల తరఫున పూర్తి ప్రీమియంను బెంగాల్ ప్రభుత్వమే భరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ సొంతంగా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని సర్కారు భావిస్తోంది. అంతేగాక రైతు యూనిట్గా బీమా పథకాన్ని తీసుకురావాలన్న అంశంపై కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు బీమా కంపెనీల దోపిడీ... పంటల బీమా విషయంలో బీమా కంపెనీలు ఇప్పటివరకు లాభాలను పెంచుకోవడంపైనే ఎక్కువగా దృష్టి సారించాయి. లాభాలు గణనీయంగా ఉన్నా ఏటా ప్రీమియం రేట్లను భారీగా పెంచేవి. 2013–14లో రైతులు, ప్రభుత్వం కలిపి పంటల ప్రీమియంగా రూ. 137.60 కోట్ల మేర చెల్లిస్తే రైతులకు క్లెయిమ్స్ కింద అందింది కేవలం రూ. 56.39 కోట్లే. ఆ ఏడాది 8.52 లక్షల మంది రైతులు ప్రీమియం చెల్లిస్తే కేవలం 1.18 లక్షల మంది రైతులే లబ్ధి పొందారు. 2012–13 వ్యవసాయ సీజన్లో 10 లక్షల మంది రైతులు రూ. 145.97 కోట్ల ప్రీమియం చెల్లిస్తే కేవలం 1.80 లక్షల మంది రైతులకు రూ. 78.86 కోట్ల మేర పరిహారం లభించింది. 2015–16లో మాత్రం 7.73 లక్షల మంది రైతులు రూ. 145.71 కోట్లు ప్రీమియం చెల్లిస్తే బీమా సంస్థలు రూ. 441.79 కోట్లను పరిహారంగా ఇచ్చాయని వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. 2016–17లో మళ్లీ బీమా కంపెనీలకే లాభాలు సమకూరాయి. ఆ ఏడాది 9.75 లక్షల మంది రైతులు రూ. 294.29 కోట్లు చెల్లిస్తే 2.35 లక్షల మంది రైతులకు రూ. 178.49 కోట్లు పరిహారం లభించింది. కేంద్ర పథకంతో లాభం లేదని... బీమా కంపెనీలు భారీ లాభాలు గడిస్తున్నా ప్రీమియం ధరలు ఎందుకు పెంచుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. ముఖ్యంగా తెలంగాణలో రబీలో చెల్లించే ప్రీమియం మొత్తం దాదాపు బీమా కంపెనీలను బాగు చేయడానికే అన్నట్లుగా అమలైంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ప్రైవేటు బీమా కంపెనీలకు అవకాశం కల్పించడంతో ఈ పరిస్థితి మరింత దిగజారింది. పీఎంఎఫ్బీవై కింద వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుములకు రైతులు 2 శాతం, పసుపు రైతులు 5 శాతం ప్రీమియం చెల్లించాలి. పునరుద్ధరించిన వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి, పత్తి, మిరప, ఆయిల్పాం, బత్తాయి పంటలకు పంట రుణంలో 5 శాతం రైతు ప్రీమియం కట్టాలి. జిల్లా జిల్లాకు ప్రీమియం ధరలు మారుతుంటాయి. అలాగే కేంద్ర పథకంలో గ్రామాన్ని యూనిట్గా కాకుండా మండలాన్ని యూనిట్గా తీసుకోవడంతో పెద్దగా ప్రయోజనం లేదన్న భావన నెలకొంది. వడగళ్లు, పెనుగాలులకు పంట నష్టపోతే తక్షణం 25 శాతం పరిహారం ఇవ్వాలనే నిబంధనను ప్రైవేటు బీమా కంపెనీలు అమలు చేయకపోవడం, అధిక సంఖ్యలో రైతులకు పరిహారం అందేలా కేంద్ర పథకం లేదన్న భావనతో 2020 నుంచి రాష్ట్ర ప్రభుత్వం దాన్నుంచి బయటకు వచ్చింది. -
'సుగ్గి' శానా తగ్గింది!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: మూడేళ్లుగా మంచి వర్షాలు.. పచ్చని పంటలు.. పండిన పంటకు గిట్టుబాటు ధర.. వైపరీత్యాలతో నష్టపోతే పంటల బీమాతో అండగా నిలుస్తున్న సర్కారు.. విత్తనం నుంచి విక్రయం వరకూ రైతన్నకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ భరోసా కల్పిస్తుండటంతో వలసలు ఆగిపోయి కరువు సీమ కళకళలాడుతోంది. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని ఐదు నియోజకవర్గాల పరిధిలో 381 పంచాయతీల్లో చాలా గ్రామాల్లో గతంలో ఏటా 2 లక్షల మందికిపైగా పనుల కోసం ‘సుగ్గి’ (వలస) వెళ్లేవారు. మూడేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారింది. వలస వెళ్లేవారి సంఖ్య 90 శాతానికి పైగా తగ్గింది. అక్కడక్కడా కొన్ని పల్లెల్లో వెళుతున్నా పనుల్లేక మాత్రం కాదు. తమ పొలాల్లో పనులు పూర్తి చేసుకుని మిగతా రోజుల్లో ఎక్కువ కూలీ వస్తుందనే ఉద్దేశంతో గుంటూరు జిల్లాతోపాటు తెలంగాణ ప్రాంతానికి పత్తి చేలలో పనులకోసం వెళుతున్నారు. స్థానికంగా రోజుకు రూ.300 చొప్పున కూలీ లభిస్తుండగా తెలంగాణ, గుంటూరులో పత్తి తీస్తే కిలోకు రూ.14 చొప్పున చెల్లిస్తున్నారు. ఒక వ్యక్తి రోజుకు క్వింటం నుంచి 120 కిలోలు పత్తి తీస్తారు. దీంతో రూ.1,400–1,680 వరకు కూలీ రావడంతో పనులు లేని సమయాల్లో వెళ్లి వస్తుంటారు. ఇక కర్ణాటక, కేరళ వలస వెళ్లేవారి సంఖ్య పూర్తిగా ఆగిపోయింది. కోసిగి, పెద్దకడుబూరు, నందవరం, మంత్రాలయం, ఎమ్మిగనూరుతో పాటు పలు మండలాలను ‘సాక్షి’ ప్రతినిధి పరిశీలించగా కేరళ, కర్నాటకకు వలసవెళ్లిన కుటుంబం ఒక్కటీ కనిపించలేదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో ఇది స్పష్టం చేస్తోంది. నిశ్చింతగా సాగు ఆదోని డివిజన్లో 2.5 ఎకరాల లోపు ఉన్న రైతులు 60% మంది, ఐదెకరాలలోపు ఉన్నవారు 29 శాతం మంది ఉన్నారు. ఇక్కడి భూములన్నీ వర్షాధారమే. కర్నూలు జిల్లాలో 2021 ఖరీఫ్లో పంట నష్టపోయిన 2.84 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ.339.60 కోట్లు జమ అయ్యాయి. ఈ ప్రాంతంలో పత్తి, ఉల్లి, మిరప అధికంగా సాగు చేస్తారు. ఐదేళ్లక్రితం 2 లక్షల ఎకరాల్లో సాగైన పత్తిని ఈ ఏడాది 7 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు. అక్షరాస్యతలో అట్టడుగున.. కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన ఆదోని డివిజన్ అభివృద్ధితోపాటు అక్షరాస్యతలో అత్యంత వెనుకబడి ఉంది. మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండల జనాభా (2011 లెక్కల ప్రకారం) 69,275 కాగా అక్షరాస్యత 28.4 శాతం మాత్రమే. నిరక్షరాస్యతలో రాష్ట్రంలో మొదటి స్థానం, దేశంలో మూడో స్థానంలో ఉండే మండలం కూడా ఇదే. అయితే ఇప్పుడు అమ్మఒడి, జగనన్న విద్యా కానుక లాంటి పథకాల వల్ల పిల్లలను చదివించుకోవాలన్న తపన ప్రతి ఒక్కరిలో నెలకొంది. పల్లెల్లో ప్రతి చిన్నారి బడిబాట పట్టారు. ఆదోని అభివృద్ధికి ‘ఆడా’ ఆదోని డివిజన్ వెనుకబాటుతనాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడా’ (ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటు చేస్తూ 2022 జనవరి 12న జీవో నెంబర్ 7 జారీ చేసింది. ఆదోని, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు పరిధిలోని 381 పంచాయతీలను ప్రత్యేక ప్రాంతంగా గుర్తించి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసింది. అందరికీ భూమి కల్పించాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఎత్తిపోతలతో సస్యశ్యామలం మంత్రాలయం నియోజకవర్గంలో ఐదు ఎత్తిపోతలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హోలి, ఐరనగల్లు, కందుకూరు, కగ్గల్లు, బసాపురం ఎత్తిపోతల పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇవి పూర్తయితే 10 వేల ఎకరాలకు సాగునీరు, 20 గ్రామాలకు తాగునీరు అందుతుంది. పులికనుమ రిజర్వాయర్కు ఇప్పటికే తుంగభద్ర నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. దీని పరిధిలో 3 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. గురు రాఘవేంద్రతో పాటు దిద్ది, మాధవరం, బసలదొడ్డి, వగురూరు ఎత్తిపోతల ద్వారా ఇప్పటికే సాగునీరు అందుతోంది. ఆర్డీఎస్, వేదవతి పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. జన్మలో సూడలే.. నాకు ఆరెకరాల పొలం ఉంది. 9 మంది పిల్లలు. 8 మంది ఆడబిడ్డలే. ఒక పాపోడు. 14 ఏళ్ల కిందట నా భర్త చనిపోవడంతో పొలం సూసు కుంటా బతుకుతాండా. ఏం గిట్టుబాటు కాలే. ఆరెకరాల్లో మిరప, ఉల్లి ఏసినా. తెగుళ్లతో పంట రాలే. ఏం అర్థకాకుండా ఉంటి. సీఎం జగన్ రూ.2.07 లక్షలు బీమా డబ్బులు అకౌంట్లో ఏసినాడు. నా జన్మలో ఎప్పుడూ ఇంత బీమా సొమ్ము సూడలే. ఆ డబ్బుతో బోరు వేయించుకున్నా. నీళ్లు పడినాయి. వాన వచ్చినా, రాకున్నా నీళ్లకు దిగుల్లే. నిబ్బరంగా పంట ఏత్తా.. ఇంకో ఇషయం సారూ. నాకు ఏటా రైతుభరోసా లెక్క కూడా పడతాంది. – హంపమ్మ, చింతకుంట భయం లే! నాకున్న నాలుగెకరాల్లో మిరప, ఉల్లి వేసినా. పంట దెబ్బతింది. కొంత చేతికొచ్చింది. రూ.81 వేలు బీమా వచ్చింది. నా జీవితంలో ఇంత బీమా సొమ్ము ఎప్పుడూ రాలే. ఇంత లెక్క రావడం ఇదే ఫస్టు. తెగుళ్లు వచ్చి పంట పోయిందనే దిగుల్లేదు. మల్లా ధైర్యంగా పంట ఏత్తా. దేవుని దయతో పండితే పంట వత్తాది.. లేకపోతే దిగుల్లేకుండా బీమా లెక్క వత్తాది. రైతు భరోసా కూడా వత్తాది. అప్పుడు మాదిరి భయం లే! – సుంకయ్య, చింతకుంట, కోసిగి మండలం -
సొంతంగా పంటల బీమా పథకం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చే పనిలో నిమగ్నమైంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న తరహాలోనే ఇక్కడ కూడా బీమా పథకాన్ని అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో ఆ రాష్ట్రానికి అధికారుల బృందాన్ని పంపించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకం నుంచి బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి పథకం అమలుకావడంలేదు. దీంతో పంట నష్టం జరిగినా రైతులకు ఎలాంటి పరిహారం అందని పరిస్థితి నెలకొంది. ప్రకృతి విపత్తులతో రైతులు వేల కోట్ల రూపాయల పంటలను నష్టపోవడం.. రైతులు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ సొంత పంటల బీమాను ప్రవేశపెట్టడంపై దృష్టిసారించింది. రైతుబంధుతోనే సరి.. రాష్ట్రంలో రైతుబంధు కింద రైతులకు ఆర్థిక సాయం అందుతున్న విషయం తెలిసిందే. ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఏడాదికి రెండు సార్లు రైతులకు ప్రభుత్వం సాయం చేస్తోంది. అందువల్ల ప్రత్యేకంగా పంట నష్టపరిహారం అవసరంలేదన్న భావన వ్యవసాయ శాఖ వర్గాల్లో నెలకొంది. కానీ ఈ వైఖరిపై రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాగా, కేంద్ర ప్రభుత్వ పథకంలో గ్రామాన్ని యూనిట్గా కాకుండా మండలాన్ని యూనిట్గా తీసుకోవడంతో పెద్దగా ప్రయోజనం లేదన్న భావన నెలకొంది. వడగండ్లు, పెనుగాలులకు పంట నష్టపోతే తక్షణం 25 శాతం పరిహారం ఇవ్వాలనే నిబంధనను ప్రైవేటు బీమా కంపెనీలు అమలుచేయక పోవడం, అధిక సంఖ్యలో రైతులకు పరిహారం అందేలా కేంద్ర పథకం లేదన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం దాని నుంచి బయటకు వచ్చింది. ఈ తరుణంలో పశ్చిమబెంగాల్లో అమలు చేస్తున్న పథకంతో ఎక్కువ మందికి పరిహారం అందుతోందని అధికారుల పరిశీలనలో తేలింది. ఈ నేపథ్యంలో బెంగాల్ తరహాలో పంటల బీమా పథకం అమలుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. మూడేళ్లుగా బెంగాల్లో సొంత బీమా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో మార్పులు చేసి బంగ్లా సస్య బీమా యోజన (బీఎస్బీ) పేరుతో సొంత పథకం తీసుకొచ్చింది. మూడేళ్లుగా దీనిని అమలు చేస్తోంది. బెంగాల్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆలుగడ్డ, చెరకు పంట విలువలో 4.85 శాతాన్ని ప్రీమియంగా రైతుల నుంచి వసూలు చేస్తుండగా, ఆహార ధాన్యాలు, వంట నూనెలకు సంబంధించిన పంటలకు రైతుల తరఫున పూర్తి ప్రీమియంను బెంగాల్ ప్రభుత్వమే భరిస్తోంది. ఈ నేపథ్యంలో బెంగాల్ తరహాలో రాష్ట్రంలో కూడా సొంతంగా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని సర్కారు భావిస్తోంది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోనూ బెంగాల్ తరహాలో పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖకు సూచించింది. -
పంటల బీమాలో ఏపీ ఆదర్శం
సాక్షి, అమరావతి: రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ తెలిపారు. యూనివర్సల్ కవరేజ్ కింద నోటిఫైడ్ పంటలను సాగు చేసే రైతులందరికీ వర్తింపజేస్తున్నామని చెప్పారు. పంటల బీమా అమల్లో ఏపీ ప్రభుత్వ సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ముంబైలో రెండ్రోజుల పాటు జరిగిన నాలుగో ఇండియా క్రాప్ ఇన్సూరెన్స్ మార్కెట్ సెమినార్లో ‘మెరుగైన భవిత కోసం పంటల బీమా – సాంకేతిక భాగస్వామ్యం’ అనే అంశంపై జరిగిన చర్చలో స్పెషల్ కమిషనర్ మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకనుగుణంగా ఉచిత పంటల బీమాను అమలు చేస్తున్నామన్నారు. సీజన్ ముగియకుండానే పంటల బీమా పరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు తెలిపారు. ఈ–పంట ఆధారంగా రాష్ట్రంలో సాగవుతున్న ప్రతి ఎకరా పంటను నమోదు చేయడమే కాదు.. రైతులందరికీ పూర్తి స్థాయిలో రక్షణ కల్పించేలా ఉచిత పంటల బీమా పథకాన్ని మూడేళ్లుగా అమలుచేస్తున్నట్టు చెప్పారు. గడిచిన మూడేళ్లలో 44.66 లక్షల మంది రైతులకు రూ.6,884.84 కోట్ల పరిహారాన్ని జమ చేశామన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం స్ఫూర్తితో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమల్లో పలు మార్పులు తీసుకొచ్చారని వెల్లడించారు. ఈ ఏడాది నుంచి వైఎస్సార్ ఉచిత పంటల బీమా–పీఎంఎఫ్బీవై పథకాలను అనుసంధానం చేసి దిగుబడి ఆధారిత పంటలకు అమలు చేస్తున్నామని, వాతావరణ ఆ«ధారిత పంటలకు మాత్రం గతంలో మాదిరిగా కంపెనీలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే క్లెయిమ్లు సెటిల్ చేస్తుందని హరికిరణ్ వివరించారు. -
AP: పక్కాగా పంటల బీమా
సాక్షి, అమరావతి: రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. దిగుబడి ఆధారిత పంటలకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఖరారు కాగా వాతావరణ ఆధారిత పంటలపై కంపెనీలు ముందుకు రాకపోవడంతో గతంలో మాదిరిగానే నష్ట పరిహారం భారాన్ని పూర్తిగా భరించి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. మూడేళ్లుగా ఈ–క్రాప్ డేటా ఆధారంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. టీడీపీ హయాంలో ఐదేళ్లలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల బీమా పరిహారం మాత్రమే చెల్లించగా 6.19 లక్షల మందికి ఎగ్గొట్టారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక గత సర్కారు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలతో కలిపి మూడేళ్లలో 44.66 లక్షల మంది రైతులకు రూ.6,884.84 కోట్ల పరిహారాన్ని అందచేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పారదర్శక విధానాలకు గుర్తింపుగా ఈ క్రాప్ డేటా ప్రామాణికంగా రైతులందరికీ పంటల బీమా వర్తింపచేసేలా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తెచ్చింది. 2022–23 సీజన్ నుంచి ప్రధాని ఫసల్ బీమాతో వైఎస్సార్ ఉచిత పంటల బీమాను అనుసంధానించి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆర్బీకేల్లో ఈ–క్రాప్ డేటా గ్రామం, మండలం, జిల్లా యూనిట్గా నోటిఫై చేసిన దిగుబడి ఆధారిత 17 పంటలు, వాతావరణ ఆధారిత 8 పంటల బీమా కవరేజ్ కోసం సెపె్టంబర్లో ఇన్సూరెన్స్ కంపెనీలను టెండర్లకు ఆహ్వానించారు. దిగుబడి ఆధారిత పంటల కవరేజ్ కోసం బిడ్డింగ్లో పాల్గొన్న ఎల్–1 కంపెనీల్లో 18 కంపెనీలను ఎంపిక చేసి 9 క్లస్టర్లను అప్పగించారు. సామాజిక తనిఖీల్లో భాగంగా ఈ క్రాప్ డేటాను ఈనెల 31వ తేదీ వరకు ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు. రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది జాబితాను నవంబర్ 2వ తేదీన ప్రదర్శిస్తారు. తుది జాబితా ఆధారంగానే నోటిఫై చేసిన దిగుబడి ఆధారిత పంటల కవరేజ్ కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు రైతుల వాటా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తుంది. వాతావరణ ఆధారిత పంటల కవరేజ్ కోసం ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకు రాకపోవడంతో గతంలో మాదిరిగానే డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద క్లైమ్స్ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. -
సొంత బీమా.. ప్రైవేటు హంగామా
సాక్షి, హైదరాబాద్: వర్షాలు..వరదలు..పంటలకు తీవ్ర నష్టం..రైతన్నకు కష్టం. పరిహారం అందకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రైతులు పంటల బీమా వైపు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని నిలిపివేయడం, గత రెండేళ్లుగా పరిహారం అందకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు బీమా కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. సొంతంగానే తమ పంటలకు బీమా చేయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు కంపెనీలు తమ ఏజెంట్లను రైతుల వద్దకు పంపుతూ వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. రైతుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని ఇష్టారాజ్యంగా ప్రీమియం వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. రైతులకు అవగాహన కల్పించేందుకు, ప్రైవేటు కంపెనీలను నియంత్రించేందుకు వ్యవసాయ శాఖ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో పంట నష్టం జరిగినప్పుడు కొన్ని కంపెనీలు కొర్రీలు పెడుతూ పరిహారం అసలు ఇవ్వకపోవడమో, ఇచ్చినా తక్కువ ఇవ్వడమో చేస్తున్నాయన్న ఆరోపణలు కూడా విన్పిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు దాదాపు లక్షన్నర మంది రైతులు ప్రైవేట్లో పంటల బీమా తీసుకున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. 2016–17 నుంచి పీఎంఎఫ్బీవై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ వాటాలు చెల్లించేలా పంటల బీమా పథకం ఎప్పట్నుంచో అమలవుతోంది. అయితే 2016–17లో ఈ పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై)గా రూపుదిద్దుకుంది. ఈ పథకం కింద టెండర్ల ద్వారా ఖరారు చేసిన ప్రీమియం సొమ్ములో రైతులు వానాకాలం పంటలకు గరిష్టంగా 2 శాతం, యాసంగికి 1.5 శాతం, వాణిజ్య, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లించాలి. మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం కట్టాలి. వడగళ్ల వానలు, అకాల వర్షాలు, తుపాన్లు, వరదలు, సహజంగా జరిగే అగ్ని ప్రమాదాలు వంటి వాటివల్ల జరిగే పంట నష్టాలకు ఈ బీమా పరిహారం అందుతుంది. అయితే 2020 వానాకాలం సీజన్ నుంచి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛందం చేసింది. రెండేళ్లుగా అందని పరిహారం.. పీఎంఎఫ్బీవై వల్ల పెద్దగా ప్రయోజనం లేదని తెలంగాణ సర్కారు భావించింది. ప్రైవేట్ బీమా కంపెనీలు రైతులకు సక్రమంగా పరిహారం అందజేయడం లేదన్న వాదనలూ వచ్చాయి. పైగా రైతుబంధు పథకం అమలు చేస్తున్నందున మళ్లీ పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లించాల్సి రావడం భారమని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇలా అనేక కారణాలతో ఈ పథకం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైదొలిగింది. అలాగని సొంత బీమా పథకాన్నైనా ప్రారంభించలేదు. దీంతో రెండేళ్లుగా రైతులకు పంట నష్టం జరిగినా పరిహారం దక్కడం లేదు. బిహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, జార్ఖండ్ వంటి కొన్ని రాష్ట్రాలు ఈ పథకం స్థానంలో తమ సొంత పథకాలను ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్ కూడా కేవలం రూపాయి ప్రీమియంతో ఉచితంగా కేంద్ర పథకాన్ని అమలు చేస్తోంది. వానాకాలం సీజన్లో 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం! ఈ ఏడాది వానాకాలం సీజన్లో దాదాపు నెల రోజుల పాటు తీవ్రమైన వర్షాలతో పంటలు నీట మునిగాయి. పత్తి వంటి పంటలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. మొత్తంగా దాదాపు 10 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని స్థానికంగా అంచనా వేశారు. కానీ పంటల బీమా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇవ్వడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది. గత రెండేళ్లుగా పరిహారం అందకపోవడం, వానాకాలంలో పెద్దయెత్తున పంట నష్టం జరిగినా సాయం అందే పరిస్థితి లేకపోవడంతో, గత్యంతరం లేక రైతులే సొంతగా పంటల బీమా చేయించుకుంటున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకునే రైతులను కంపెనీలు పంటల బీమాలో చేర్చుతున్నాయి. ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా ప్రీమియం వసూలు చేస్తున్నాయి. -
ఆంధ్ర మిర్చి రైతుకు అండగా...
చిన్న, సన్నకారు రైతులకు సాధికారితను అందించడంతో పాటు అనూహ్య మార్కెట్ ఒడిదుడుకుల నుంచి వారిని కాపాడేందుకు వెజిటబుల్ సీడ్స్ ఉత్పత్తిదారు సిన్జెన్టా ఇండియా ముందుకొచ్చింది. దీనిలో భాగంగా గుంటూరులోని మిర్చి పంట రైతుల కోసం అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా (ఏఐసీ)తో ప్రత్యేకమైన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో రైతులు తమ పంట దిగుబడికి సహేతుకమైన ధరలను పొందగలరు. అంతేకాకుండా మార్కెట్లో ధరలు గణనీయంగా పడిపోయినప్పటికీ నష్టాల బారిన పడకుండా కాపాడుకోగలరని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ బీమా పధకాన్ని ప్రారంభించిన సందర్భంగా సిన్జెన్టా ఇండియా చీఫ్ సస్టెయినబిలిటీ ఆఫీసర్ డాక్టర్ కె సీ రవి మాట్లాడుతూ ‘‘ చిన్న కమతాల రైతులకు మార్కెట్లో ధరల హెచ్చుతగ్గుల నుంచి కాపాడేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. దీనిద్వారా వారు తమ ఆదాయానికి భద్రత పొందగలరు మరియు వారు కోరుకున్న పంటను సాగు చేసుకునే అవకాశమూ లభిస్తుంది. ఈ పథకం మిర్చి పంట సాగు చేస్తున్న రైతులకు ఓ గొప్ప తోడ్పాటుగా నిలువనుంది. దాదాపు 80% ఎండుమిర్చి వేలం గుంటూరు ఏపీఎంసీని పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించడానికి సరైన వేదిక’’ అన్నారు. ‘‘తమ వర్కింగ్ క్యాపిటల్ను తిరిగి పొందడంతో పాటుగా పంట ఉత్పత్తిలో ఎదురయ్యే ఖర్చులనూ సెటిల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రైతులు తాము పండించిన పంటను సుదీర్ఘకాలం పాటు విక్రయించకుండా ఉండలేరు. అయితే మార్కెట్లో డిమాండ్–సరఫరా నడుమ అంతరాల కారణంగా మార్కెట్లో నిత్యావసరాల ధరలలో హెచ్చుతగ్గులు వల్ల రైతులు నష్టపోయే అవకాశాలూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో తాము పెట్టుబడి పెట్టిన డబ్బును సురక్షితంగా ఉంటుందంటేనే రైతులు ఎలాంటి ఆందోళన లేకుండా ఉంటారు. స్థిరమైన మార్కెట్ ధరను పొందడం ద్వారా రైతులు పంట ఎంపికలో సరైన నిర్ణయాలను తీసుకోగలరు’’ అని ఏఐసీ సీఎండీ ఎంకె పొద్దార్ అన్నారు. -
‘పంటల బీమా’లోనూ విషపు నాట్లు
చంద్రబాబు కాకుండా సీఎం కుర్చీలో ఇంకొకరు ఉంటే తన ప్రాణం ఎంతలా కొట్టుకుంటుందో ఈనాడు రామోజీరావు మళ్లీ నిరూపించుకున్నారు. చంద్రబాబు తన పాలనలో కనీసం ఊహకు కూడా తట్టని రీతిలో వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అమలుచేస్తుంటే కడుపు మంటతో రగిలిపోతున్న ఈనాడు.. నిత్యం అక్షరం అక్షరంలో అసత్యాలు, అభూత కల్పనలు నింపి పాఠకుల మీదకు వదులుతోంది. రైతుల పంటల బీమాకు సంబంధించి టీడీపీ హయాంలో కంటే మిన్నగా అన్నదాతలకు ప్రస్తుత ప్రభుత్వం మేలు చేస్తున్నా రామోజీ పెడబొబ్బలకు అంతులేకుండాపోతోంది. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎక్కడా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి మించింది లేదని బీమా రంగ నిపుణులు కితాబిస్తుంటే.. ఈనాడు మాత్రం జనాల మెదళ్లలో విషపు నాట్లు వేస్తోంది. ఊసరవెల్లి సైతం సిగ్గుతో తలదించుకునేలా ఉన్న రామోజీ తాజా వంటకం ‘పంటల బీమా అగమ్యగోచరం’పై నిజానిజాలు ఇవిగో.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1965లో కేంద్రం తీసుకొచ్చిన క్రాప్ ఇన్సూరెన్స్ బిల్లు ఆధారంగా తెచ్చిన మోడల్ ఇన్సూరెన్స్ పథకం ఆ తర్వాత వివిధ రూపాలు మార్చుకుని ప్రస్తుతం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) పథకంగా అమలవుతోంది. అధిక ప్రీమియంతో ఇందులో చేరేందుకు సన్న, చిన్నకారు రైతులు ఆసక్తిచూపే వారుకాదు. ఆర్థిక స్థోమత, అవగాహనలేక లక్షలాది మంది రైతులు తమ పంటలకు బీమా చేయించుకోలేక విపత్తుల బారిన ప్రతిసారీ రూ.వేల కోట్ల పెట్టుబడిని నష్టపోయే వారు. అలాగే, బీమా చేయించుకున్న వారు సైతం ఆ సొమ్ములు ఎంతొస్తాయో.. ఎప్పుడొస్తాయో? తెలీక ఏళ్ల తరబడి నిరీక్షించేవారు. టీడీపీ హయాంలో కూడా కేంద్ర పథకాలపై ఆధారపడి పంటల బీమా వర్తింపజేశారే తప్ప ఏనాడు సన్న, చిన్నకారు రైతులకు లబ్ధిచేకూర్చాలనే ఆలోచన చేయలేదు. దీంతో గడచిన టీడీపీ ఐదేళ్ల పాలనలో సగటున 20.28 లక్షల మంది రైతులు మాత్రమే 23.57 లక్షల హెక్టార్లకు బీమా చేయించుకోగలిగే వారు. తొలి రెండేళ్లు వ్యవసాయ ఇన్సూరెన్స్ స్కీమ్, ఆ తర్వాత పీఎంఎఫ్బీవై అమలుచేశారు. దీనికింద 2016–17లో 20.44 లక్షల హెక్టార్లు (17.79 లక్షల మంది), 2017–18లో 24.28 లక్షల హెక్టార్లు (18.22 లక్షల మంది), 2018–19లో 25.99 లక్షల హెక్టార్లకు (24.83 లక్షల మంది) బీమా చేయించుకోగలిగారు. ప్రీమియం రూపంలో ఈ మూడేళ్లలో రైతులు చెల్లించిన ప్రీమియం.. 2016–17లో రూ.347.96 కోట్లు, 2017–18లో రూ.261.29 కోట్లు, 2018–19లో రూ.262.42 కోట్లు చెల్లించారు. హుద్హుద్ వంటి పెను తుపానుతో సహా కరువు కాటకాలతో రూ.వేల కోట్ల పంటలను కోల్పోయిన రైతులకు టీడీపీ ఐదేళ్లలో దక్కిన పరిహారం రూ.30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్లు మాత్రమే. 2014–16 మధ్య అగ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 5.38 లక్షల మందికి రూ.671.94 కోట్ల బీమా దక్కితే.. 2016–19 మధ్య పీఎంఎఫ్బీవై కింద 25.47లక్షల మందికి రూ.2,739.26కోట్ల బీమా దక్కింది. కానీ, ఈ వాస్తవాలపై ఈనాడులో ఏనాడు చిన్న వార్త కూడా రాసిన పాపాన పోలేదు. పైసా భారం పడకుండా ఉచితంగా బీమా.. ఇక రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 జూలై 8న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. ‘ఈ–పంట’లో నమోదే ప్రామాణికంగా పైసా భారం పడకుండా రైతులందరికీ వర్తింపజేస్తోంది. క్లెయిమ్ సెటిల్మెంట్లు, చెల్లింపుల బాధ్యతను కూడా తన భుజాన వేసుకుంది. ఈ తరహా స్కీమ్ దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడాలేదని బీమా రంగ నిపుణులే చెబుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఐసీఎల్) ఏర్పాటుచేసి చరిత్ర సృష్టించింది. ఈ–పంటలో నమోదైన నోటిఫైడ్ పంటలకు సీజన్ ముగియకుండానే బీమా పరిహారం అందిస్తోంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 2019–20 సీజన్లో 45.96 లక్షల హెక్టార్లు సాగుచేసిన 49.81 లక్షల మంది బీమా పరిధిలోకి రాగా, వారితో బీమా చేయించగలిగారు. అదేవిధంగా 2020–21లో 61.75 లక్షల హెక్టార్లు సాగుచేసిన 71.30 లక్షల మందీ బీమా పరిధిలోకి వచ్చారు. టీడీపీ హయాంతో పోల్చుకుంటే 198.57 శాతం రైతులు.. 128.51 శాతం విస్తీర్ణం పెరిగింది. ఇక టీడీపీ ఐదేళ్లలో 30.85 లక్షల మందికి కేవలం రూ.3,411.20 కోట్ల పరిహారం మాత్రమే చెల్లిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలోనే ఏకంగా 44.66 లక్షల మందికి రూ.6,684.84 కోట్ల పంటల బీమా చెల్లించింది. అంతేకాక.. టీడీపీ హయాంలో 6.19 లక్షల మంది రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలు కూడా చెల్లించి అండగా నిలిచింది. కానీ, ఇవేమీ రామోజీకి కన్పించడంలేదు. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం చెల్లించిన బీమా మొత్తం కంటే రూ.3,273.64 కోట్ల మేర అదనంగా లబ్ధిచేకూర్చగా, 13.81 లక్షల మంది రైతులు అదనంగా ప్రయోజనం పొందారు. రికార్డు స్థాయిలో పరిహారం ఇవ్వడమే నేరమా? సాధారణంగా నోటిఫై చేసిన పంటలకు దిగుబడి, వాతావరణ ఆధారంగానే నష్టాన్ని అంచనా వేసి బీమా పరిహారం ఇస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇలా దిగుబడి ఆధారంగా 22, వాతావరణ ఆధారిత 9 పంటలకు బీమా వర్తిస్తుంది. గ్రామం, మండలం, జిల్లా యూనిట్గా నోటిఫై అయిన దిగుబడి ఆధారిత పంటలకు గడిచిన ఏడేళ్ల సగటు దిగుబడి కంటే వాస్తవ దిగుబడి తక్కువగా ఉంటే నిర్ధేశించిన పరిహారాన్ని చెల్లిస్తారు. అలాగే.. వర్షపాతం, ఉష్ణోగ్రతలు, తేమ, గాలి, డ్రైస్పెల్ వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని సగటు దిగుబడి కంటే తక్కువ దిగుబడి వచ్చే వాతావరణ ఆధారిత పంటలకు బీమా చెల్లిస్తారు. ఈ వాస్తవాలు ఈనాడుకు తెలియనివి కాదు. ఇక ఖరీఫ్–21లో రికార్డుస్థాయిలో 15.61 లక్షల మంది రైతులకు 36.99 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న 26 పంటలకు రూ.2,977.82 కోట్ల పరిహారాన్ని ప్రస్తుత వైఎస్సార్సీపీ సర్కారు అందించింది. ఈ సీజన్లో దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి 8.48 లక్షల మంది రైతులకు రూ.2,143.85 కోట్ల మేర బీమా చెల్లిస్తే, వాతావరణ ఆధారిత పంటలకు సంబంధించి 7.13 లక్షల మంది రైతులకు రూ.833.97 కోట్ల పరిహారం చెల్లించారు. అలాగే, ఖరీఫ్–21లో సాగైన నోటిఫైడ్ పంటల విస్తీర్ణంలో దాదాపు సగానికిపైగా విస్తీర్ణానికి పరిహారం దక్కింది. ఇలా ఒక సీజన్లో ఇన్ని లక్షల మంది రైతులకు ఇంత పెద్దఎత్తున పరిహారం ఇచ్చిన దాఖలాలు రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. కానీ, ఇవేమీ రామోజీకి కనిపించవు. కారణం చంద్రబాబు సీఎంగా లేరు కాబట్టి. వాస్తవాలు ఇలా కళ్లెదుట కన్పిస్తుంటే.. టీడీపీ హయాంలో అరకొరగా పరిహారం దక్కినా నోరుమెదపని రామోజీ నేడు ఏదో జరిగిపోయిందంటూ గగ్గోలు పెడుతూ నిత్యం రోతరాతలతో రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు. సీజన్ ముగిసే వరకు ఈ పంట నమోదుతో పాటు ఈ–కేవైసీకి అవకాశం కల్పించినప్పటికీ ఈ–పంట, ఈ–కేవైసీకి పొంతన లేదంటూ కాకిలెక్కలతో పొంతన లేని రాతలు రాస్తున్నారు. పంటల బీమాలో అగమ్యగోచరమేమీ లేదు ఖరీఫ్–2021 సీజన్కు సంబంధించి జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం నోటిఫై చేసిన పంటలను సాగుచేస్తూ ఈ–పంటలో నమోదై ఈ–కేవైసీ చేయించుకున్న సాగుదారులందరికీ డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని వర్తింపజేశాం. సాగుచేసిన పంట వివరాలు, ఆధార్ వివరాలతో పాటు ఆర్బీకేల్లో తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలని రైతులను చైతన్యపర్చాం. ఈ–పంటలో నమోదైన జాబితాను రైతుభరోసా కేంద్రాల్లో ప్రదర్శించాం. పారదర్శకతపై ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? గుంటూరు జిల్లాలో వర్షాధారంగా సాగుచేసిన మిరపపంటను వాతావరణ బీమా పథకం ద్వారా కొత్తగా ఈ ఏడాది గుర్తించినట్లుగా అవాస్తవాలను ప్రచురించడం సరికాదు. వాస్తవానికి 2016 నుంచే మిరపను వర్షాధార పంటగా ప్రకటించారు. దీంతో ఆ పంటకూ వాతావరణ ఆధారంగానే బీమా పరిహారం లెక్కించి మార్గదర్శకాలకు అనుగుణంగా చెల్లించాం. ఈ జాబితాలను సంబంధిత ఆర్బీకేల్లో ప్రదర్శించాం. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పంటల బీమా పరిహారాన్ని విడుదల చేసి రైతులను ఆర్థికంగా ఆదుకుంటే తప్పుడు కథనాలతో రైతులను గందరగోళపర్చడం సరికాదు. – చేవూరు హరికిరణ్, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ -
AP:వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం
సాక్షి, అమరావతి/సాక్షి, పుట్టపర్తి: ఏరువాకతో సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించనున్నారు. 2021 ఖరీఫ్లో వైపరీత్యాలు, చీడపీడల వల్ల పంట నష్టపోయిన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం వారి ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో జరిగే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా పంటల బీమాకు ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తోంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద రైతన్నలపై ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం పడకుండా చూస్తోంది. సాగు చేసిన ప్రతి ఎకరాన్ని ఆర్బీకేల ద్వారా ఈ–క్రాప్లో నమోదు చేయించి బీమా రక్షణ కల్పిస్తోంది. బీమా పరిహారం సొమ్ము కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఒక సీజన్ పంటల బీమా మరుసటి ఏడాది అదే సీజన్ రాకముందే క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. గతంలో అస్తవ్యస్తం.. నేడు పూర్తి పారదర్శకం గత ప్రభుత్వంలో పంట నష్టాల అంచనా అశాస్త్రీయంగా ఉండేది. అయిన వారికే పరిహారం అందేది. రైతన్నలు ప్రభుత్వ ఉద్యోగుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా పరిహారం అందుతుందో లేదో తెలియని దుస్ధితి. దళారులను ఆశ్రయించి, లంచాలు ఇస్తే అరకొరగా అందేది. ఇప్పుడా పరిస్థితి లేదు. చీడ పీడలు, అకాల వర్షాలు, వరదలు, కరువు కాటకాల వల్ల ఏ కష్టమొచ్చినా, ఏ నష్టం జరిగినా ఆదుకోవాలన్న తపనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులకు అన్ని విధాలుగా అండదండగా నిలుస్తున్నారు. పైసా భారం పడకుండా ఆర్బీకేల ద్వారానే ఈ–క్రాప్లో నమోదే ప్రామాణికంగా పంటల బీమా వర్తింపజేస్తున్నారు. పంట వేసినప్పుడే ఈ క్రాప్లో నమోదు చేయించి రసీదు ఇస్తున్నారు. పంట నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేస్తున్నారు. దీంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ బీమా అందుతోంది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గ్రామ సచివాలయంలో అర్హుల జాబితా ప్రదర్శిస్తున్నారు. వైపరీత్యాల వల్ల ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, దళారుల చుట్టూ తిరగాల్సిన అవస్థలు రైతన్నలకు తప్పాయి. టీడీపీ ప్రభుత్వం కంటే మిన్నగా సాయం టీడీపీ ఐదేళ్ల పాలనలో 30.85 లక్షల మంది రైతులకు రూ.3,411.2 కోట్ల బీమా పరిహారాన్ని అందించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలతో కలిపి ఇప్పటికే 28.67 లక్షల మందికి రూ.3,707.02 కోట్ల బీమా పరిహారం అందించింది. తాజాగా ఖరీఫ్–2021లో నష్టపోయిన రైతులకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారం అందిస్తోంది. దీంతో కలిపితే 44.28 లక్షల మంది లబ్ధిదారులకు రూ.6,684.84 కోట్లు లబ్ధి చేకూర్చింది. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో రైతులకు అన్ని పథకాలూ కలిపి రూ. 1,27,823 కోట్లు సాయంగా నేరుగా అందించింది. నేడు చెన్నే కొత్తపల్లికి సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో పర్యటించనున్నారు. 2021 ఖరీఫ్ పంటల బీమా పరిహారాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఆయన ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 10.50 గంటలకు చెన్నే కొత్తపల్లి చేరుకుంటారు. 10.50 నుంచి 11.05 గంటల మధ్య స్థానిక నేతలను కలుస్తారు. 11.15 నుంచి 12.45 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. వేదికపై రైతులతో ముఖాముఖి నిర్వహించి, అనంతరం ప్రసంగిస్తారు. తర్వాత పంటల బీమా మెగా చెక్ను రైతులకు అందజేస్తారు. మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి బయల్దేరి 2.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
పంటకు పూచీ మాది.. రైతులకు అండగా ఏపీ సర్కార్
ఆరుగాలం కష్టించి వ్యవసాయం చేసే రైతులకు అనునిత్యం ఆందోళనే. విత్తనం వేశాక మొలక రాకపోతే.. పూత, కాయ దశలో తెగుళ్లు ఆశిస్తే.. తీరా పంట చేతికందే దశలో ఏ వర్షానికో తడిసిపోతే.. ఇలా దినదిన గండంగా గడపాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఉండేది. ప్రస్తుతం రాష్ట్రంలో రైతు పక్షపాత ప్రభుత్వం ఉండటంతో అన్నదాతల్లో ఆ దిగులు పోయింది. ప్రతి పంటకూ రైతుకు రూపాయి ఖర్చు లేకుండా బీమా చేయిస్తోంది. సగటు దిగుబడి కంటే తక్కువగా వచ్చినప్పుడు అండగా నిలిచి ఆదుకుంటోంది. ఇందుకోసం ఏకంగా ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించింది. 2021 ఖరీఫ్కు సంబంధించి కనీవినీ ఎరుగని రీతిలో రైతులకు భారీగా బీమా సొమ్ము అందజేస్తోంది. సాక్షి, అమరావతి: వరదలు, తుపాన్లు, అకాల వర్షాలతో పాటు చీడపీడలతో ఖరీఫ్–2021 సీజన్లో నష్ట పోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రికార్డు స్థాయిలో 15.61 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.2,977.82 కోట్ల పంటల బీమా పరిహారం అందిస్తోంది. లబ్ధిదారుల జాబితాలను ఇప్పటికే ఆర్బీకేల్లో ప్రదర్శించింది. అనంతపురం జిల్లా సీకే పల్లిలో మంగళవారం జరిగే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా బీమా సొమ్ము పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పంటల బీమా గతంలో సన్న, చిన్నకారు రైతులకు అందని ద్రాక్షగా ఉండేది. కొద్దిపాటి అవగాహన ఉన్న బడా రైతులకు మాత్రమే దాని గురించి అవగాహన ఉండేది. దీంతో ఆర్థిక స్తోమత, అవగాహన లేక లక్షలాది మంది చిన్న రైతులు తాము పండించిన పంటలకు బీమా చేయించుకోలేక విపత్తుల బారినపడి ప్రతిసారి ఆర్థికంగా నష్టపోయే వారు. బీమా చేయించుకున్న వారు సైతం బీమా సొమ్ము ఎప్పుడొస్తుందో.. ఎంతొస్తుందో తెలియక ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసేవారు. కానీ నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. రైతులపై పైసా భారం పడకుండా నోటిఫై చేసిన ప్రతి పంటకు ప్రభుత్వం బీమా కల్పిస్తోంది. సీజన్ ముగియ కుండానే బీమా పరిహారం చెల్లిస్తూ అండగా నిలుస్తోంది. ఈ పంటే ప్రామాణికంగా పంటల బీమా గతంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా కింద ఆహార, నూనెగింజల పంటలకు ఖరీఫ్లో 2 శాతం, రబీలో 1.5 శాతం, సీజన్తో సంబంధం లేకుండా ఉద్యాన, వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియం రైతులు చెల్లించాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని మారుస్తూ.. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు పైసా భారం పడకుండా రైతులకు పరిహారం అందించే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం 2019 జూలై 8న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ–పంటలో నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, ప్రతీ ఎకరాకు ఉచిత బీమా కల్పిస్తోంది. క్లైయిమ్ సెటిల్మెంట్లు, చెల్లింపుల బాధ్యతను కూడా తన భుజాన వేసుకుంది. గత ప్రభుత్వంలో కంటే మిన్నగా.. ► టీడీపీ హయాంలో ఏటా సగటున 20 లక్షల మంది రైతులు, 23.57 లక్షల హెక్టార్లు బీమా పరిధిలోకి వస్తే, గత మూడేళ్లలో సగటున 60.35 లక్షల మంది రైతులు, 53.86 లక్షల హెక్టార్లు బీమా పరిధిలోకి వచ్చాయి. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 2019–20 సీజన్లో పైసా భారం పడకుండా 49.81 లక్షల మంది రైతులకు చెందిన 45.96 లక్షల హెక్టార్లకు బీమా చేయించగలిగారు. ► 2020–21లో 71.30 లక్షల మంది రైతులకు సంబంధించి 61.75 లక్షల హెక్టార్లలో పంటలు బీమా పరిధిలోకి వచ్చాయంటే ఏ స్థాయిలో పెరుగుదల నమోదైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంతో పోల్చుకుంటే రైతుల పరంగా 198.57 శాతం, విస్తీర్ణ పరంగా 128.51 శాతం పెరిగింది. ► చెల్లించిన క్లైమ్ల విషయానికి వస్తే టీడీపీ ఐదేళ్లలో 30.85 లక్షల మంది రైతులకు రూ.3,411.2 కోట్ల బీమా చెల్లిస్తే, గత ప్రభుత్వ బకాయిలతో కలిపి గడిచిన మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 29.05 లక్షల మంది రైతులకు రూ.3,707.02 కోట్ల మేర బీమా అందించింది. ► 6.19 లక్షల మంది రైతుల రూ.715.84 కోట్ల గత ప్రభుత్వ బకాయిలను సైతం చెల్లించి సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. తాజాగా ఖరీఫ్ –2021కు సంబంధించి 15.61 లక్షల మంది రైతులకు రూ.2,977.82 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ► మొత్తంగా గత మూడేళ్లలో 44.61 లక్షల మంది రైతులకు రూ.6,684.84 కోట్ల మేర లబ్ధి చేకూర్చినట్లయింది. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం చెల్లించిన బీమా మొత్తం కంటే రూ.3,273.64 కోట్ల మేర అదనంగా లబ్ధి చేకూర్చగా, 13.81 లక్షల మంది రైతులు అదనంగా ప్రయోజనం పొందారు. చరిత్రలో ఇదే తొలిసారి ఒక సీజన్కు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో పంటల బీమా పరిహారం అందించిన చరిత్ర గతంలో లేదు. 2021 ఖరీఫ్ సీజన్లో రికార్డు స్థాయి విస్తీర్ణంలో పంటలు సాగవ్వగా.. అకాల వర్షాలు, తుపాన్లు వరదల వల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందించాలన్న సంకల్పంతో ప్రత్యేక బృందాల ద్వారా గ్రామ స్థాయిలో అంచనా వేసిన పంట నష్టం ఆదారంగా పరిహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – చేవూరు హరి కిరణ్, ప్రత్యేక కమిషనర్, వ్యవసాయ శాఖ -
రేపు పంటల బీమా పరిహారం విడుదల
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతల కోసం డాక్టర్ వైఎస్సార్ పంటల బీమా పథకం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు పంటల బీమా పరిహారం విడుదల చేయనున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. దీనివల్ల 15.15 లక్షల మందికి రూ.1820.23 కోట్ల లబ్ది చేకూరనుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కన్న బాబు మాట్లాడుతూ.. ‘‘రేపు 11.59 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1310 కోట్లు జమ చేస్తాం. 3,56,093 మందికి సంబంధించి బయోమెట్రిక్, ఇతర సాంకేతిక సమస్యలొచ్చాయి.. సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించి వారి ఖాతాల్లో.. జూన్ మొదటివారంలో రూ.510.23 కోట్లు జమ చేస్తాం’’ అన్నారు. ‘‘ఖరీఫ్లో 21 రకాల పంటలకు వాతావరణం ఆధారంగా.. 9 రకాల పంటలకు సంబంధించి 35.75 లక్షల హెక్టార్లకు బీమా కల్పించాం.ఇప్పటివరకు 11,58,907 మంది లబ్దిదారుల వివరాలు బ్యాంక్కు చేరాయి’’ అని కన్నబాబు తెలిపారు. చదవండి: గోదాముల టెండర్లకు గ్రీన్సిగ్నల్ -
శరవేగంగా ఆర్బీకే భవనాలు
సాక్షి, అమరావతి: గ్రామ స్థాయిలోనే రైతన్నలకు విత్తనాల నుంచి పంట విక్రయాల దాకా అన్ని సేవలను అందించేందుకు ఏర్పాటైన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 10,408 రైతు భరోసా కేంద్రాలకు కొత్త భవనాల నిర్మాణాలను రూ.2,299.60 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఈ భవనాలన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది జూలై 8వతేదీ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పుట్టిన రోజు సందర్భంగా జూలై 8వ తేదీన ఆర్బీకే భవనాలను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో గడువుకు ముందుగానే రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను పూర్తి చేసేలా అధికారులు సన్నద్ధమయ్యారు. ఇటీవల స్పందన సమీక్ష సందర్భంగా రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతన్నలకు శాశ్వత ఆస్తి... రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే 607 కేంద్రాల నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. 3,081 రైతు భరోసా కేంద్రాల పనులు చివరి స్థాయిలో ఉన్నాయి. మరో 6,720 భవనాలు బేస్మెంట్ స్థాయి నుంచి గ్రాండ్ ఫ్లోర్ శ్లాబు దశలో ఉన్నాయి. ఆర్బీకే భవనాల నిర్మాణంతో రైతులకు ఉన్న ఊరిలోనే శాశ్వత ఆస్తి సమకూరనుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అన్నీ సొంత ఊరిలోనే అందుతున్నాయి. గతంలో రైతులు వాటి కోసం పొలం పనులు మానుకుని మండల కేంద్రాలు, డివిజన్ కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. రోజంతా పడిగాపులు కాస్తూ క్యూల్లో నిలబడి కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ దుస్థితి తొలగిపోయింది. రైతులు తమకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతులు భరోసా కేంద్రాల్లో ఆర్డర్ ఇస్తే ఇంటి గుమ్మం వద్దే అందచేసే సదుపాయం కల్పించారు. -
ఏపీ: పంటల బీమా కోసం రూ.2,586.60 కోట్లు విడుదల
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద ఖరీఫ్–2020 సీజన్కు సంబంధించి అర్హులైన రైతులకు బీమా సొమ్ము చెల్లించేందుకు రూ.2,586.60 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తాన్ని రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఈ నెల 25న ఆధార్తో లింక్ చేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఈ మేరకు అర్హుల జాబితాలు సిద్ధం చేసి పంపిణీకి ఏర్పాట్లు చెయ్యాలని వ్యవసాయ శాఖ కమిషనర్ను ఆదేశించారు. చదవండి: ఏపీ: రూ.1,200 కోట్లతో 30 నైపుణ్య కళాశాలలు వ్యాక్సిన్ కోసం ఎంత ఖర్చుకైనా సిద్ధమే -
పంటల బీమా అమలుకు ముమ్మర కసరత్తు
సాక్షి, అమరావతి: 2020 ఖరీఫ్లో సాగైన పంటలకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం చెల్లింపునకు రంగం సిద్ధమవుతోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో సీజన్ ముగిసే లోగానే పంటల బీమా సొమ్ము రైతుల చేతుల్లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతులపై పైసా ఆర్థిక భారం పడకుండా ఈ–పంట నమోదు ప్రామాణికంగా అమలు చేస్తోన్న ఈ పథకం కోసం వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. నోటిఫై చేసిన పంటల బీమా సొమ్మును మే నెలలో చెల్లించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం తలపెట్టిన పంట కోత ప్రయోగాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయనున్నారు. గతంలో ఏదైనా ఒక సీజన్లో నోటిఫైడ్ పంటలకు చెల్లించాల్సిన బీమా సొమ్మును ఏడాదికో రెండేళ్లకో చెల్లించేవారు. అది కూడా కొంత మంది రైతులకు మాత్రమే. అవగాహన లేక కొందరు, ఆర్థిక భారంతో మరికొందరు పంటల బీమాకు దూరంగా ఉండడం వల్ల అన్నదాతలు ఏటా తీవ్రంగా నష్ట పోయేవారు. రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు చేయలేని రీతిలో ఉచిత పంటల బీమా పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. నోటిఫై చేసిన పంటలకు సంబంధించి ఈ క్రాప్లో నమోదైన ప్రతి ఎకరాకు బీమా వర్తింప చేస్తోంది. గతేడాది జూన్ 26వ తేదీన 2018–19 రబీ పంటలకు సంబంధించి 5.94 లక్షల మంది రైతులకు రూ.596.40 కోట్లు, 2019 ఖరీఫ్ పంటలకు సంబంధించి 9.48 లక్షల మందికి రూ.1,252 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఇక నుంచి సీజన్ ముగియకుండానే రైతుల చేతికి బీమా సొమ్ము చేతికందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందు కోసం గతేడాది రూ.101 కోట్ల వాటా ధనంతో ఏపీ జనరల్ ఇన్స్రూ?న్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఐసీఎల్) ఏర్పాటు చేసింది. 88.4 శాతం ప్రయోగాలు పూర్తి ► 2020 ఖరీఫ్లో సాగైన పంటలకు సంబంధించి దిగుబడి ఆధారంగా 21 రకాల పంటలు, వాతావరణం ఆధారంగా 9 రకాల పంటలను పంటల బీమా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 8వ తేదీన నోటిఫై చేసింది. ► రాష్ట్రంలో ఏయే జిల్లాల్లో ఏయే పంటలకు బీమా వర్తింప చేస్తున్నారో వాటి జాబితాను కూడా వెల్లడించింది. గత ఖరీఫ్లో 90,13,924 ఎకరాల్లో వ్యవసాయ, 22,54,221 ఎకరాల్లో ఉద్యాన పంటలు ఈ క్రాప్లో నమోదు కాగా, నోటిఫై చేసిన దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి 36,656 పంటకోత ప్రయోగాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ► ఇప్పటి వరకు 32,413 ప్రయోగాల (88.4 శాతం)ను పూర్తి చేశారు. కాగా నోటిఫై చేసిన సజ్జలు, మినుములు, పెసలు, వేరుశెనగ, మొక్కజొన్న, కొర్రలు, రాగులు, ఆముదం, ఉల్లి, మిరప, పసుపు, పొద్దుతిరుగుడు పంట కోత ప్రయోగాలు నూరు శాతం పూర్తయ్యియి. ► వరిలో 27,926 పంట కోత ప్రయోగాలకు 27,241 ప్రయోగాలు (97.5 శాతం) పూర్తి చేశారు. పత్తి (ఐ) 62.2 శాతం, పత్తి (యూఐ) 49.3, జొన్నలు 44.8, పత్తి 44.2, కందులు 46.7, చెరకు (మొక్క) 37.7, చెరకు (రాటూన్) 47 శాతం ప్రయోగాలు పూర్తయ్యాయి. మిగిలినవి నెలాఖరులోగా పూర్తి చేస్తారు. ఎలా అంచనా వేస్తారంటే.. ► దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి పంట కోత ఫలితాల ఆధారంగా బీమా యూనిట్ పరిధిలో ‘వాస్తవ దిగుబడి’ని అంచనా వేస్తారు. ► ఏడు సీజన్లలో ఉత్తమమైన ఐదు సీజన్ల సరాసరి దిగుబడిని ‘హామీ దిగుబడి’గా భావించి దాని కంటే ‘వాస్తవ దిగుబడి’ తక్కువగా ఉన్నట్టుగా గుర్తించిన సందర్భంలో నష్ట పరిహార స్థాయిని లెక్కిస్తారు. ఆ మేరకు బీమా పరిహారం చెల్లిస్తారు. ప్రస్తుతం దిగుబడి అంచనాలను మదింపు చేసే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ► వాతావరణ ఆధారిత పంటలకు సంబంధించి ఏపీఎస్డీపీఎస్, ఐఎండీ వాతావరణ కేంద్రాలు, రాష్ట్ర ప్రభుత్వ మండల స్థాయి రెయిన్ గేజ్ స్టేషన్ల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరిస్తారు. వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలి ఉధృతి, తేమ వంటి అంశాల ఆధారంగా పరిహారాన్ని లెక్కిస్తారు. మేలో జమ చేసేందుకు సన్నాహాలు ఈ నెలాఖరులోగా పంటకోత ప్రయోగాలు పూర్తవుతాయి. మదింపు ప్రక్రియ పూర్తికాగానే దిగుబడి, వాతావరణ పంటల బీమా లబ్ధిదారుల జాబితాలను సామాజిక తనిఖీల కోసం రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తారు. అర్హత గల అన్ని క్లైయిమ్లకు సంబంధించిన బీమా సొమ్మును ఖరీఫ్–2021 ప్రారంభానికి ముందే మే నెలలో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
ప్రభుత్వం తరఫున పంటల బీమా కంపెనీ
సాక్షి, అమరావతి: పంటల బీమా కోసం ప్రభుత్వం తరఫున బీమా కంపెనీ ఏర్పాటుపై సత్వరం చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. రైతులకు 2020–21 ఖరీఫ్ బీమా సొమ్ము ఏప్రిల్లో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, మే నెలలో ఈ ఏడాది రైతు భరోసా తొలివిడత ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. రైతులు ఎక్కడా మోసాలకు గురికాకుండా వారికి అండగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే స్పష్టం చేశానని, ఇందుకోసం ప్రత్యేకంగా జిల్లాకో రైతు భరోసా పోలీసు స్టేషన్లపై ఆలోచన చేయాలని ఆదేశించినట్లు గుర్తు చేశారు. దీనిపై పోలీసు విభాగంతో సమన్వయం చేసుకోవాలని వ్యవసాయశాఖకు సూచించారు. వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏం చెప్పారంటే.. కౌలు రైతుల చట్టంపై వివరించాలి.. పొలంబడిలో భాగంగా కౌలు రైతుల కోసం చేసిన చట్టంపై అవగాహన కల్పించాలి. సాగు ఒప్పంద పత్రం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే విషయాన్ని వివరించాలి. ఆర్బీకేల్లో దీనికి సంబంధించిన వివరాలతో పోస్టర్లు ఏర్పాటు చేయాలి. ఆర్బీకేల్లో రైతులకు ఎలాంటి కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయో తెలియచేసేలా హోర్డింగ్స్ ఉండాలి. విలేజ్ క్లినిక్స్, గ్రామ సచివాలయాల కార్యక్రమాలకు సంబంధించి కూడా హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలి. దీనివల్ల ప్రజలకు మెరుగైన అవగాహన కలుగుతుంది. సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి.. సేంద్రీయ వ్యవసాయంపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. ఆర్బీకేల పరిధిలో పంటల కొనుగోళ్లు సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? అనే అంశంపై నిరంతర పర్యవేక్షణ చేయాలి. మిల్లర్లే నేరుగా ఆర్బీకేల వద్దకు వచ్చి కొనుగోలు చేయాలన్న సందేశం గట్టిగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్రం చేసిన వ్యవసాయ, ఆక్వా చట్టాల ఉల్లంఘన జరగకుండా చూడాలి. జనతా బజార్లపై ప్రతిపాదనలు జనతా బజార్ల ఏర్పాటుకు సంబంధించి రూపొందించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా అధికారులు వివరించారు. ఐదు వేల జనాభా ఉన్న చోట 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో జనతా బజార్లు ఏర్పాటు కానున్నాయి. 50 వేల నుంచి 2 లక్షల జనాభా ఉన్నచోట 5 వేల నుంచి 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జనతా బజార్లు ఏర్పాటవుతాయి. బయట మార్కెట్లో కన్నా తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు జనతా బజార్లలో లభించాలని, అప్పుడే లక్ష్యం నెరవేరుతుందని సీఎం స్పష్టం చేశారు. రైతులకు కనీస మద్దతు ధరలు లభించాలని, మరోవైపు వినియోగదారులకు సరుకులు తక్కువ ధరకు లభించేలా ఉండాలన్నారు. జనతా బజార్ల ద్వారా అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. ఏపీ అమూల్ ప్రాజెక్టు, ఆక్వా హబ్లపై సమీక్ష ఏపీ అమూల్ ప్రాజెక్టు, ఆక్వా హబ్ల ఏర్పాటుపై సీఎం జగన్ సమీక్షించారు. మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు, నిధుల సమీకరణ కోసం తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించారు. సమీక్షలో అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకారశాఖ స్పెషల్ సెక్రటరీ వై.మధుసూదన్రెడ్డి, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిషనర్ పి.యస్. ప్రద్యుమ్న, ఏపీ డీడీసీ ఎండీ అహ్మద్బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పీఎం ఫసల్ బీమా యోజనకు రూ.16వేల కోట్లు
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పిఎంఎఫ్బివై) పథకానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రూ.16,000 కోట్లు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2021-22 బడ్జెట్ లో 305కోట్లు ఎక్కువగా కేటాయించారు. దేశంలోని వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వ తన నిబద్ధతను తెలియజేస్తుందని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ అభిప్రాయపడింది. ఈ పథకం ద్వారా రైతుల విత్తనాలు వేసిన దగ్గర నుంచి పంటకోతకు వచ్చే వరకు ఆ పంటకు రక్షణ లభిస్తుంది. పిఎంఎఫ్బివై ప్రయోజనాలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులు భీమా చేసిన పంటలకు నష్టం కలిగితే దీని ద్వారా భీమా అందిస్తారు. ప్రకృతి విపత్తు కారణంగా రైతు పంట నాశనమైతే వారికి ఈ పథకం కింద భీమా లభిస్తుంది. ఖరీఫ్ పంటలో 2శాతం, రబీ పంటకు 1.5శాతం, హార్టికల్చర్ కు 5శాతం రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్ల క్రితం 13 జనవరి 2016న భారత ప్రభుత్వం పీఎం ఫసల్ బీమా యోజన పథకాన్ని పీఎం తీసుకొచ్చింది.(చదవండి: భవిష్యత్ ఇంధనంగా హైడ్రోజన్) కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద పంట బీమా పథకం ఇది. ప్రీమియం విషయంలో మూడో అతిపెద్ద బీమా పథకం. ప్రతి ఏడాది 5.5 కోట్లకు పైగా రైతుల దరఖాస్తులు చేసుకుంటారు. ఈ పథకానికి రైతులు ఎవరైనా దరఖాస్తు చేయొచ్చు. అన్ని రకాల ఆహార పంటలకు ఇది వర్తిస్తుంది. పంట నష్టపోయిన రైతులు 72 గంటల్లో దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్కు లేదా క్రాప్ ఇన్స్యూరెన్స్ యాప్లో రిపోర్ట్ చేయాలి. అర్హులైన రైతుల బ్యాంకు అకౌంట్కు బీమా డబ్బులు వస్తాయి. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను https://pmfby.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. -
కేంద్రంతో మాట్లాడే బాధ్యత మాది: సీఎం జగన్
ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. ఈ విషయాన్ని నిస్సందేహంగా చెబుతున్నా. విత్తనాలు మొదలు పంట అమ్ముకునే వరకూ అండగా ఉంటున్నాం. మంచి మనసుతో రైతులకు మేలు చేయాలనే ఆలోచనతో గత 18 నెలలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. పంటల బీమాలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. రైతులకు గుదిబండ కాకుండా వారి తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. ఏకంగా 50 లక్షల మంది రైతులకు చెందిన కోటి 14 లక్షల ఎకరాలకు బీమాను వర్తింప చేస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పంటల బీమా పట్ల రైతుల్లో విశ్వసనీయత కల్పించామని, పంట నష్టపోతే ఇప్పుడు పంటల బీమా పరిహారం వస్తుందనే నమ్మకం వారిలో కలిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. గతంలో పంటల బీమాపై నమ్మకం లేదని, అందుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణమని తెలిపారు. నష్టపోయిన రైతులకు బీమా కల్పించకపోగా, ప్రీమియం పేరుతో వందల కోట్ల రూపాయల భారం వారిపై మోపిందన్నారు. రైతుల కష్టాలను పాదయాత్రలో స్వయంగా తన కళ్లతో చూశానని, అందుకే పంటల బీమా విధానంలో సమూల మార్పులు తీసుకువచ్చామని చెప్పారు. 2019 సీజన్కు సంబంధించి పంటలు కోల్పోయిన 9.48 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి రూ.1,252 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లో పంటల బీమా లబ్ధిదారులైన రైతులనుద్ధేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నాడు మూడు భాగాలుగా.. ► గతంలో ఇన్సూరెన్స్ పరిస్థితి దారుణం. ఇన్సూరెన్స్ ప్రీమియంను రైతులు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వేర్వేరుగా మూడు భాగాల్లో కట్టేవారు. దీంతో రైతుల తరఫున సంప్రదించడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి. దీంతో ఇన్సూరెన్స్ సక్రమంగా వచ్చేది కాదు. అందువల్ల చాలా తక్కువ మంది రైతులు బీమా చేయించే వారు. పాదయాత్రలో రైతుల కష్టాలన్నీ స్వయంగా చూశాను. 2012 ఏడాదికి సంబంధించిన ఇన్సూరెన్స్ రాలేదు. మన ప్రభుత్వం వచ్చాక వారికి ప్రీమియం చెల్లించింది. కేంద్ర ప్రభుత్వం, ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ఆ బీమా పరిహారం ఇప్పించాం. ► 2016–17, 2017–18, 2018–19 వరకు రైతులు ఏటా సగటున రూ.290 కోట్ల ప్రీమియమ్ మాత్రమే కట్టారు. అప్పటి ప్రభుత్వం తన వాటాగా సగటున చెల్లించిన ప్రీమియం కేవలం రూ.393 కోట్లు మాత్రమే. ► 2016–17లో 17.79 లక్షల మంది రైతులు, 2017–18లో 18.22 లక్షలు, 2018–19లో 24.83 లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఏటా సగటున 20 లక్షల మంది రైతులు కూడా బీమా చేయించుకోని పరిస్థితి. అడుగడుగునా అండగా నిలుస్తున్నాం ► మన ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక అన్ని విధాలా రైతులకు అండగా నిలిచింది. అందుకే రైతులు కట్టాల్సిన ప్రీమియం వాటా రూ.468 కోట్లతో పాటు, ప్రభుత్వ వాటా రూ.503 కోట్లు.. రెండూ కలిపి రూ.971 కోట్ల ప్రీమియం చెల్లించింది. ► ఇప్పుడు మన ప్రభుత్వం అక్షరాలా 49.80 లక్షల మంది రైతుల తరపున ప్రీమియం కడుతోంది. అప్పట్లో మూడేళ్లలో సగటున కేవలం 23.57 లక్షల హెక్టార్లు మాత్రమే బీమా పరిధిలోని వస్తే, ఇప్పుడు 45.96 లక్షల హెక్టార్లు, అంటే 1.14 కోట్ల ఎకరాలను ఇన్సూరెన్స్ పరిధిలోకి తెచ్చాం. ► విత్తనం వేసినా పంట పండని పరిస్థితులు ఉన్నప్పుడు, కరువు, వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు త్వరితగతిన పరిహారం అందేలా మన ప్రభుత్వం మనసు పెడుతోంది. ఇన్సూరెన్స్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే బాధ్యతను కూడా ప్రభుత్వ భుజస్కంధాలపై వేసుకున్నాం. ఇందుకు ఈ రోజు రైతులకు ఇస్తున్న ఈ పంటల బీమా పరిహారమే ఉదాహరణ. ► బీమా పరిహారాన్ని డిసెంబర్ 15వ తేదీన రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని కలెక్టర్ల కాన్ఫరెన్స్లో, అసెంబ్లీ సమావేశాలకు ముందు క్యాబినెట్ సమావేశంలో చెప్పాం. ఇవాళ ఆ మాట నిలబెట్టుకున్నాం. ఆర్బీకేలతో అన్ని విధాలా భరోసా ► రాష్ట్రంలో ఇవాళ 10,641 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) గ్రామ సచివాలయాలకు అనుసంధానమై పని చేస్తున్నాయి. అన్ని పంటల ఈ–క్రాపింగ్ జరుగుతోంది. ఆ వివరాలను ఆర్బీకేలలో ప్రదర్శిస్తున్నాం. ► ఏ సీజన్లో జరిగిన పంట నష్టంపై అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తున్నాం. ఇటీవల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఈ నెల 31న ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తాం. ► ఈ–క్రాప్లో నమోదైన ప్రతి రైతుకు లాభం ఉంటుంది. రైతుల బీమా కూడా కట్టి, ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తున్నాం. ఈ–క్రాప్ ద్వారా చాలా వేగంగా పరిహారం ఇచ్చే వీలుంటుంది. కులం, మతం, రాజకీయం చూడకుండా అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తున్నాం. ► 2020 ఖరీఫ్ పంట కోతలు వచ్చే ఏడాది జనవరిలో పూర్తి అయితే, పంట నష్టపోయిన రైతులకు సంబంధించి ఫిబ్రవరిలో నివేదిక తీసుకుని.. మార్చి, ఏప్రిల్లోనే బీమా పరిహారం ఇస్తాం. ఆ డబ్బు వారికి వచ్చే ఖరీఫ్కు ఉపయోగపడుతుంది. రంగు వెలిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నాం. ఇది చరిత్రలో తొలిసారి. గ్రేడెడ్ ఎమ్మెస్పీ ఇచ్చి ఆ కార్యక్రమం అమలు చేస్తాం. రైతులకు ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో మంత్రులు కె.కన్నబాబు, సి.వేణుగోపాలకృష్ణ, ఏపీ అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, రైతులు పాల్గొన్నారు. మీరే మా ధైర్యం భారీ వర్షాలు వచ్చినా, బీమా సొమ్ము అందుతుందని ధీమాగా ఉన్నాం. మేము అడగక ముందే మీరు అన్నీ ఇచ్చేస్తున్నారు. నాకు, మా అమ్మకు, చెల్లికి పంటల బీమా కింద రూ.1 లక్షా 69 వేలు అందింది. గతంలో పరిహారం వస్తుందో రాదో తెలీదు. వచ్చినా అరకొరే. మీ హయాంలో వ్యవసాయం పండగలా ఉంది. మీరే మా ధైర్యం. ఆర్బీకేల వల్ల ఎంతో ఉపయోగం ఉంటోంది. మా మండలానికి రూ.5 కోట్ల 26 లక్షల బీమా సొమ్ము వచ్చింది. జిల్లాలో ఇదే అత్యధికం. – కె.వీరరాజు, పెదపూడి, తూర్పు గోదావరి మీరు చల్లగా ఉండాలి నాకు పంట నష్టం కింద రూ.7 వేలు వచ్చింది. ఇది వరకు విత్తనాల కోసం అనంతపురానికి రెండు, మూడు రోజులు తిరగాల్సి వచ్చేది. మీ పుణ్యమా అని మాకు ఆ బాధ తప్పింది. విత్తనం మొదలు పంట అమ్మకం వరకు మీరు మాకు అండగా నిలుస్తున్నారు. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా కానుక, పింఛన్లు.. ఇలా అన్నీ అందుతున్నాయి. మీరు చల్లగా ఉండాలి. మా కరువు జిల్లాను గుర్తించి కొత్తగా మూడు రిజర్వాయర్లు కడుతున్నందుకు ధన్యవాదాలు. – వెంకటలక్ష్మి, నర్సినీకుంట, రాప్తాడు మండలం, అనంతపురం రైతును నిలబెట్టిన ఏకైక సీఎం మీరే రైతు దేశానికి వెన్నెముక అని చాలా మంది పోసుకోలు కబుర్లు చెప్తారు. వరుస కరువులు, అతివృష్టి వల్ల రైతు వెన్నెముక వంగిపోయే పరిస్థితుల్లో.. మీరు రైతు వెన్నెముకను నిటారుగా నిలబెట్టారు. ఇలా చేయగలిగిన ఏకైక ముఖ్యమంత్రి మీరే. దేశంలో ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడు. నాకు నాలుగూ ముక్కాలెకరా పొలం ఉంది. గత ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.8 వేల ప్రీమియం చెల్లించాల్సి ఉండగా, నేను కేవలం ఒక్క రూపాయి మాత్రమే కట్టాను. ఇప్పుడు నాకు రూ.40 వేల పరిహారం వచ్చింది. వర్షాలకు పంట నష్టపోతే నెలకే పరిహారం ఇచ్చిన ఘనత మీదే. – తిరుమలరెడ్డి, వీఎన్ పల్లి, వైఎస్సార్ కడప అందరి గుండెల్లో చిరస్థాయిగా.. నేను దళిత రైతుని. నాలుగెకరాల పొలంలో సాగు చేస్తున్నాను. గత ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి. మన ప్రభుత్వం వచ్చాక రైతు కేవలం ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించేలా మీరు నిర్ణయం తీసుకున్నారు. మా మండలంలో 4,700 మంది రైతులకు రూ.4 కోట్ల 90 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చింది. నాకు రూ.4,065 వచ్చింది. రైతులందరి తరఫున మీకు ధన్యవాదములు. మీరు అమలు చేస్తున్న పథకాల వల్ల ప్రతి ఒక్కరి గుండెల్లో మీరు చిరస్థాయిగా నిల్చిపోతారు. – అడిపి సుందరకుమార్, యర్రగొండ పాలెం, ప్రకాశం జిల్లా -
వైఎస్సార్ పంటల బీమాను ప్రారంభించిన సీఎం జగన్
-
వైఎస్సార్ పంటల బీమాను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వం అన్నదాతను ఆదుకునేందుకు అధిక ప్రాధాన్యమిస్తోంది. వైఎస్సార్ పంట బీమాతో రైతాంగానికి భరోసా కల్పిస్తోంది. వాతావరణ పరిస్థితులతో సక్రమంగా దిగుబడి పొందలేని రైతులకు పరిహారం చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీమా సొమ్మును ఆయా కర్షకుల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2019 సీజన్లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు దాదాపు రూ.1,252 కోట్ల బీమా పరిహారం దక్కనుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్నొక్కి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ మెత్తాన్ని జమచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... 'వైఎస్సార్ పంటల బీమా పథకంతో మరో అడుగు ముందుకు వేశాం. గతంలో పంటల బీమా పథకంలో చేరేందుకు రైతులు నిరాకరించేవారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల ప్రీమియం కూడా.. ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం తీసుకున్నాం. 2019లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు.. రూ.1252 కోట్ల బీమా సొమ్మును అందిస్తున్నాం. ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులకు గుదిబండ కాకూడదు. పంట నష్టం జరిగితే బీమా వస్తుందన్న నమ్మకం రైతుల్లో కలగాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత పంటల బీమాను అందిస్తున్నాం. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు రైతు కూడా ప్రీమియం చెల్లించాల్సి ఉండేది. కానీ బీమా సొమ్ము ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి.. ఇప్పుడు ఆ పరిస్థితులను పూర్తిగా మార్చాం. రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరుపున బీమా ప్రీమియం చెల్లిస్తున్నాం. గతంలో 20 లక్షల మంది రైతులకు మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలో ఉంటే.. ఇప్పుడు 57 లక్షల మంది రైతులు పంటల బీమా పథకంలో నమోదయ్యారు. కోటి 14 లక్షల ఎకరాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చాం. గ్రామ సచివాలయాలతో ఆర్బీకేలను అనుసంధానం చేశాం. గ్రామంలోని ప్రతి ఎకరా ఈ-క్రాపింగ్లో నమోదవుతోంది' అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇదే తొలిసారి.. గతంలో చంద్రబాబు సర్కార్ ఎప్పుడూ పంటలు కోల్పోయిన రైతులకు సకాలంలో బీమా సొమ్ము చెల్లించలేదు. పైగా రైతులపై ప్రీమియం పేరుతో వందల కోట్ల రూపాయల భారం మోపింది. దీంతో రైతులు బీమా సౌకర్యం పొందలేకపోయారు. రైతన్నల బాధకు చలించిపోయిన సీఎం వైఎస్ జగన్ దేశంలో ఎక్కడా లేని విధంగా వారిపై పైసా కూడా ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వమే పూర్తి ఖర్చు భరించేలా నిర్ణయం తీసుకున్నారు. రైతుల తరఫున బీమా సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తూ ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నారు. 2019 సీజన్లో పంట నష్టానికి ఏడాది తిరగకముందే బీమా పరిహారాన్ని రైతుల ఖాతాలకు జమ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. చదవండి: (అగ్రి గోల్డ్ బాధితులకు తీపి కబురు) పారదర్శకతకు పెద్దపీట ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామంలో సాగు చేసిన పంటల వివరాలను ఈ–క్రాప్లో నమోదు చేసి బీమా సౌకర్యం కల్పిస్తోంది. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు ఆ నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించే ఏర్పాటు చేసింది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ.. రైతులు స్వయంగా పరిశీలించుకునేందుకు వీలుగా రైతు భరోసా కేంద్రాల్లో ఈ–క్రాప్ వివరాలతో సహా లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించారు. 2019–20లో 49.81 లక్షల మంది రైతులకు చెందిన 45.96 లక్షల హెక్టార్లకు పంటల బీమాను వర్తింప చేసింది. ఇందుకోసం రైతులు చెల్లించాల్సిన రూ.468 కోట్ల ప్రీమియంను కూడా ప్రభుత్వమే భరిస్తూ మొత్తం రూ.971.23 కోట్లు చెల్లించింది. -
నేడు 9.48 లక్షల రైతుల ఖాతాలకు ఉచిత పంటల బీమా పరిహారం
సాక్షి, అమరావతి: రైతన్నలకు పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సీఎం వైఎస్ జగన్ రంగం సిద్ధం చేశారు. ఆరుగాలం కష్టపడి.. తీరా పంట చేతికొచ్చే సమయానికి అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, తదితర ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి కోల్పోయిన రైతులకు ధీమా కల్పించే వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి ముఖ్యమంత్రి మంగళవారం శ్రీకారం చుట్టనున్నారు. 2019 సీజన్లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు దాదాపు రూ.1,252 కోట్ల బీమా పరిహారాన్ని అందించనున్నారు. మంగళవారం సీఎం తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. రాష్ట్రంలో ఇదే తొలిసారి.. గతంలో చంద్రబాబు సర్కార్ ఎప్పుడూ పంటలు కోల్పోయిన రైతులకు సకాలంలో బీమా సొమ్ము చెల్లించలేదు. పైగా రైతులపై ప్రీమియం పేరుతో వందల కోట్ల రూపాయల భారం మోపింది. దీంతో రైతులు బీమా సౌకర్యం పొందలేకపోయారు. రైతన్నల బాధకు చలించిపోయిన సీఎం వైఎస్ జగన్ దేశంలో ఎక్కడా లేని విధంగా వారిపై పైసా కూడా ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వమే పూర్తి ఖర్చు భరించేలా నిర్ణయం తీసుకున్నారు. రైతుల తరఫున బీమా సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తూ ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నారు. 2019 సీజన్లో పంట నష్టానికి ఏడాది తిరగకముందే బీమా పరిహారాన్ని రైతుల ఖాతాలకు జమ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. పారదర్శకతకు పెద్దపీట ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామంలో సాగు చేసిన పంటల వివరాలను ఈ–క్రాప్లో నమోదు చేసి బీమా సౌకర్యం కల్పిస్తోంది. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు ఆ నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించే ఏర్పాటు చేసింది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ.. రైతులు స్వయంగా పరిశీలించుకునేందుకు వీలుగా రైతు భరోసా కేంద్రాల్లో ఈ–క్రాప్ వివరాలతో సహా లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించారు. 2019–20లో 49.81 లక్షల మంది రైతులకు చెందిన 45.96 లక్షల హెక్టార్లకు పంటల బీమాను వర్తింప చేసింది. ఇందుకోసం రైతులు చెల్లించాల్సిన రూ.468 కోట్ల ప్రీమియంను కూడా ప్రభుత్వమే భరిస్తూ మొత్తం రూ.971.23 కోట్లు చెల్లించింది. -
రేపు ఉచిత పంటల బీమా చెల్లింపు
సాక్షి, అమరావతి: ఆరుగాలం కష్టపడి తీరా పంట చేతికొచ్చే సమయానికి అతివృష్టి, అనావృష్టి, వరదలు, కరవు కాటకాలు, చీడపీడలు ఇతర ప్రకృతి వైపరీత్యాలతో కలిగే పంట దిగుబడి నష్టాలతో కుదేలవుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కొండంత అండలా నిలుస్తోంది. సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్రలో రైతుల కష్టాలు, కడగండ్లు స్వయంగా చూసిన సీఎం వైఎస్ జగన్, ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. ఆ మేరకు రైతులను ఆదుకునే విధంగా ‘డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా’ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2019 సీజన్లో పలు కారణాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం వారికి బీమా పరిహారం అందజేస్తోంది. అందులో భాగంగా రేపు (మంగళవారం) 9.48 లక్షల రైతులకు ఏకంగా రూ.1252 కోట్ల పరిహారం అందుతోంది. క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పటికే ఒక పరిహారం: 2018–19 రబీ పంటల బీమా ప్రీమియంకు సంబంధించి అప్పటి ప్రభుత్వం బకాయి పడిన రూ.122.61 కోట్లు చెల్లించిన ఈ ప్రభుత్వం, నాటి పంటల నష్టానికి సంబంధించి బీమా కంపెనీల నుంచి క్లెయిమ్లు వచ్చేలా చేసింది. ఆ మేరకు ఈ ఏడాది జూన్ 26న, బీమా కంపెనీలు రాష్ట్రంలో 5.94 లక్షల రైతులకు రూ.596.36 కోట్ల క్లెయిమ్స్ విడుదల చేశాయి. ఆనాడు కూడా క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కిన సీఎం వైఎస్ జగన్, రైతుల ఖాతాల్లో నేరుగా ఆ బీమా పరిహారం జమ చేశారు. పైసా కూడా భారం లేకుండా: దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా భారం లేకుండా పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తోంది. భూమి సాగు చేస్తూ, ఈ–క్రాప్లో రైతులు నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలో చేర్చి, రైతుల తరపున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తోంది. పూర్తి పారదర్శకత: గ్రామంలో సాగు చేసిన పంటల వివరాలను వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ–క్రాప్లో నమోదు చేసి బీమా సదుపాయం కల్పించడంతో పాటు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు ఆ వివరాలు అంచనా వేసి, బీమా పరిహారం అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.ఈ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తూ, పథకంలో లబ్ధిదారులైన (అర్హులైన) రైతుల జాబితాలను, పూర్తి వివరాలతో గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం–ప్రీమియం: 2019 సీజన్లో పంటల బీమా కింద రైతులు కట్టాల్సిన రూ.468 కోట్ల ప్రీమియమ్తో పాటు, ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన రూ.503 కోట్లు కూడా కడుతూ, మొత్తం రూ.971 కోట్ల ప్రీమియమ్ను ప్రభుత్వం బీమా కంపెనీలకు చెల్లించింది. గత ప్రభుత్వ హయాంలో..: రైతుల పంటల బీమా కోసం ప్రీమియంగా గత ప్రభుత్వం తన వాటాగా ఏడాదికి కేవలం రూ.393 కోట్ల ప్రీమియమ్ మాత్రమే చెల్లించింది. అదే ఈ ప్రభుత్వం గత ఏడాది (2019)కి సంబంధించి ఏకంగా రూ.971.23 కోట్ల ప్రీమియం చెల్లించింది. -
పంటల బీమా.. రైతుకు ధీమా
గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల బక్కచిక్కిన రైతును ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, వ్యవసాయాన్ని పండగలా మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కర్షకులు నష్టపోకూడదని.. గత ఏడాది రూపాయి ప్రీమియానికే బీమా వర్తింపజేసిన ఆయన ఈ ఏడాదీ అదీ కట్టనవసరం లేదని, ప్రభుత్వమే పూర్తిమొత్తం చెల్లిస్తుందని అభయం ఇచ్చారు. ఫలితంగా హలధారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్కు జేజేలు పలుకుతున్నారు. ఆకివీడు: గత ఏడాది వైఎస్సార్ పంటల బీమా పథకంలో భాగంగా రూపాయి బీమా ప్రీమియంతో రైతులకు ఆసరాగా నిలిచిన ప్రభుత్వం ఈ ఏడాది మరో అడుగు ముందుకు వేసింది. ఈ ఏడాది రైతులు రూపాయి కూడా కట్టనవసరం లేదని స్పష్టం చేసింది. వైఎస్సార్ పంటల ఉచిత బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. గత ఏడాది రూపాయి ప్రీమియంతో బీమా సౌకర్యాన్ని జిల్లాలో 2,36,912 మంది వినియోగించుకున్నారు. వీరిలో వరి, చెరుకు రైతులు ఉన్నారు. వీరు 1,19,717.5 హెక్టార్లలో సేద్యం చేశారు. అయితే ఈ ఏడాది ప్రీమియం సొమ్ము మొత్తం ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంది. ఈ–క్రాప్లో నమోదైన ప్రతి రైతుకూ బీమా సదుపాయం వర్తింపజేసింది. అంతేకాదు. వరి, చెరుకుతోపాటు ఉద్యానాల సాగు, మత్స్య పెంపకం రైతులకూ బీమా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఈ ఖరీఫ్ సీజన్లో ఈ–క్రాప్ ఆధారంగా జిల్లాలోసాగు చేపట్టిన వరి, చెరకు, ఉద్యాన పంటలు, మత్స్యపెంపకానికి ఉచిత బీమా సౌకర్యం కల్పించింది. ఫలితంగా జిల్లాలో సుమారు 2.25 లక్షల హెక్టార్లలో వరి సాగుతోపాటు మరో 2 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేస్తున్న సుమారు 6.11 లక్షల మందికి ఉచిత బీమా వర్తిస్తోంది. గతంలో బీమా ప్రీమియం అధికం గత ప్రభుత్వాల హయాంలో పంటల బీమా సౌకర్యం కోసం రైతుల వద్ద నుంచి అత్యధిక ప్రీమియం వసూలు చేసేవారు. 2017–18లో ఎకరాకు రూ.560, 2018–19లో ఎకరాకు రూ.480 చొప్పున ప్రీమియం వసూలు చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్.జగన్మోహన్రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ఏడాది ఖరీఫ్ సాగులో పంటల బీమాకు ఎకరాకు రూపాయి మాత్రమే ప్రీమియం వసూలు చేశారు. చాలామంది రైతులు అదీ కట్టకపోవడంతో ఈ ఏడాది ఉచిత ప్రీమియం అమలు చేసి రైతును బలోపేతం చేసేందుకు వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు. గతంలో క్లెయిమ్ల సొమ్ము ఇవ్వలేదు : గత ప్రభుత్వ హయాంలో రైతులు ప్రకృతి వైపరీత్యాలకు గురైతే పంటల బీమా అమలులో ఉన్నా.. రైతులకు క్లెయిమ్ సొమ్మును అందించలేదు. ప్రభుత్వం పట్టించుకోలేదు. సీఎం జగన్ ఇటీవల గత ప్రభుత్వంలో రావాల్సిన క్లెయిమ్ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకోవడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తుపాన్లు, అధిక వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని మంజూరు చేయలేదు. అభినందనీయం గత ప్రభుత్వాల హయాంలో ప్రకృతి వైపరీత్యాలు వస్తే రైతులకు చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా తుపా న్లు, భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం ఉచిత బీమా ప్రక టించడం అభినందనీయం. గత ప్రభుత్వాలు బకాయి పెట్టిన ఇన్పుట్ సబ్సిడీని ఇస్తే రైతులకు మేలు జరుగుతుంది. – మల్లారెడ్డి శేషమోహనరంగారావు, కిసాన్ సంఘ్ రాష్ట్ర ప్రతినిధి, అప్పారావుపేట ఇక ధీమాగా.. ఉచిత బీమా ఇవ్వడం రైతులకు నిజంగా ధీమా కలి్పంచినట్లే. వరి రైతులతోపాటు చేపల పెంపకందారులకు, ఇతర పంటలకు ఉచిత బీమా కలి్పంచడం నిజంగా అభినందనీయం. రైతులందరికీ ఇది శుభవార్త. సీఎం జగన్కు ధన్యవాదాలు. – కట్రెడ్డి కుసుమేశ్వరరావు, చేపల రైతు, పెదకాపవరం, ఆకివీడు మండలం ఈ–క్రాప్ విధానంతో ఉచిత బీమా ఈ–క్రాప్ విధానం ద్వారా ఉచిత బీమా సౌకర్యం కలి్పంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనలు, ఇతర వివరాలు అందాల్సి ఉంది. గత ఏడాది ఖరీఫ్లో రూపాయి ప్రీమియంతో రూ.51.97 కోట్లను 2,36,912 మంది రైతులు చెల్లించారు. – ఎం.డీ.గౌసియా బేగం, వ్యవసాయ సంచాలకులు, ఏలూరు -
రైతులు రూపాయి కడితేచాలు
పంటల బీమా ప్రీమియం చెల్లింపునకు సంబంధించి వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాం. గ్రామ సచివాలయాల్లో సర్వేయర్, రెవెన్యూ, వ్యవసాయ సహాయకుల సంయుక్త పర్యవేక్షణలో ఈ–క్రాపింగ్ నమోదు చేస్తున్నాం. ఆ వెంటనే పంటల ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. రైతు కేవలం ఒక్క రూపాయి ప్రీమియం కడితే చాలని నిర్ణయించాం. మిగతా మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రైతుల పంటల బీమా ప్రీమియం చెల్లింపులో సమూల మార్పులు చేశామని, అందులో భాగంగా రైతులపై ఏ మాత్రం భారం పడకుండా ప్రభుత్వమే పూర్తి ప్రీమియం చెలిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. రైతుల నుంచి నామమాత్రంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే వసూలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతులకు నష్టం చేకూరిస్తే, తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి అన్నదాతలకు మేలు చేస్తోందన్నారు. 2018–19 రబీ పంటల బీమా ప్రీమియంకు సంబంధించి అప్పటి ప్రభుత్వం బకాయి పడిన రూ.122.61 కోట్లను ఈ ప్రభుత్వం చెల్లించింది. దీంతో అప్పటి పంట నష్టానికి సంబంధించి బీమా కంపెనీలు రూ.596.36 కోట్ల క్లెయిమ్స్ విడుదల చేశాయి. ఈ మొత్తాన్ని రాష్ట్రంలో 5.94 లక్షల మంది రైతుల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా జమ చేశారు. ఆ నగదును బ్యాంకులు పాత బాకీల కింద జమ చేసుకోకుండా, అన్ ఇన్కమ్బర్డ్ ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన వివిధ జిల్లాల్లో లబ్ధిదారులైన రైతులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నాటి ప్రభుత్వం నిర్లక్ష్యం ► వ్యవసాయ పంటల బీమా విషయంలో మా ప్రభుత్వం ఏం చేస్తోందో అందరికీ తెలిసేలా చేస్తున్నాం. గత ప్రభుత్వం 2018–19 రబీ సీజన్లో బీమా ప్రీమియం చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ► నిజానికి బీమా ప్రీమియంను కొంత రైతు చెల్లిస్తాడు.. మిగిలింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా సీజన్ ప్రారంభంలో నెల రోజుల్లోనే బీమా ప్రీమియం చెల్లింపులు జరుగుతాయి. అలా జరిగినప్పుడే రైతులకు బీమా పరిహారం సమయానికి అందుతుంది. ► కానీ 2018–19కి సంబంధించిన రబీ బీమా ప్రీమియం రూ.122.61 కోట్లు గత ప్రభుత్వం చెల్లించలేదు. రైతులు, కేంద్ర ప్రభుత్వం తమ వంతు ప్రీమియం చెల్లించాయి. కానీ రాష్ట్రం సరైన సమయంలో చెల్లింపులు చేయకపోవడం వల్ల రైతులకు ఇన్సూరెన్స్ ప్రీమియం రాని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల రైతులకు ఎక్కువ నష్టం జరిగింది. ఆ బకాయిలు మేము చెల్లించాం ► ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలని, సకాలంలో రైతులకు సహాయం అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది. బీమా అధికారులతో చర్చలు జరిపి, 2018–19 కి సంబంధించిన బకాయిలు రూ.122.16 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ► దీంతో ఈ రోజు 5.94 లక్షల మంది రైతులకు రూ.596.36 కోట్ల పరిహారం అందిస్తున్నాం. బీమా పరిహారం సొమ్మును పాత అప్పులకు జమ చేసుకోకుండా కలెక్టర్లు అందరూ బ్యాంకర్లతో మాట్లాడాలని ఆదేశించాం. రైతులకు అన్ని విషయాల్లో అండగా ఉంటాం ► రైతు భరోసా సొమ్ము ఇవ్వడం నుంచి రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పడం, ఈ–క్రాపింగ్, ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్, పంట రుణాలు రాని వారికి రుణాలు ఇప్పించే కార్యక్రమం వరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ► రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇస్తున్నాం. రైతు వేసే పంటకు సంబంధించి నిపుణులతో సూచనలు, సలహాలు, రైతు పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పించడం వంటి విషయాల్లో పూర్తిగా అండగా ఉంటాం. ఇందుకోసం సమూల మార్పులు తీసుకొచ్చాం. ► గత ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని గమనించండి. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్ల ఇదంతా చేయగలగుతున్నాను. ► ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్కుమార్, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, బీమా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ డబ్బులు వస్తాయనుకోలేదు.. ‘ఆ బీమా మొత్తం వస్తుందనుకోలేదు.. మీ చలవ వల్లే ఆ సొమ్ము అందింది. మీరు ఇచ్చిన భరోసాతో రైతులు ఉత్సాహంగా వ్యవసాయం చేస్తున్నారు. ఎప్పటికీ మీరే సీఎంగా ఉండాలి’ అని పలువురు రైతులు వైఎస్ జగన్తో అన్నారు. 2018–19 రబీ బీమా బకాయి సొమ్ము రూ.596.36 కోట్లను శుక్రవారం సీఎం విడుదల చేసిన సందర్భంగా వివిధ జిల్లాల నుంచి పలువురు రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. అన్నీ కలసి వస్తున్నాయి.. కరోనా సమయంలో కూడా మీరు ఇస్తున్న ఈ పరిహారం మాకెంతో మేలు చేస్తుంది. గత ప్రభుత్వంలో ఎంతో నష్టపోయాం. 2018లో ఇన్సూరెన్సు కట్టినా పరిహారం రాలేదు. ఇక వస్తుందనుకోలేదు. అలాంటిది ఇవాళ నాకు రూ.1.26 లక్షల పరిహారం వచ్చింది. రైతు భరోసా కింద రూ.13,500 సహాయం అందింది. గ్రామ సచివాలయ వ్యవస్థ చాలా గొప్పగా పని చేస్తోంది. మాకు అమ్మ ఒడిలో సహాయం కూడా అందింది. మీ హయాంలో సకాలంలో వర్షాలు పడుతున్నాయి. అన్నీ కలసి వస్తున్నాయి. కలకాలం మీరే సీఎంగా ఉండాలి. – జయరామిరెడ్డి, జయవరం, ప్రకాశం జిల్లా మీరు చరిత్రలో నిలిచిపోతారు.. నేను 2018లో బజాజ్ కంపెనీకి ప్రీమియం కట్టాను. కానీ పరిహారం రాలేదు. ఇప్పుడు మీ కృషితో బీమా సొమ్ము రూ.28,178 వచ్చింది. రైతు భరోసా కేంద్రంలో లబ్ధిదారుల జాబితాలో నా పేరు పెట్టారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాది మెట్ట ప్రాంతం. పంటలు పండకపోతే బీమానే దిక్కు. అది మీరు గమనించే ఉచిత బీమా కల్పిస్తున్నారు. రైతులకు ఉదారంగా సాయ పడే విషయంలో గతంలో రాజశేఖరరెడ్డి గారిని చూశాం. మళ్లీ మిమ్మల్ని చూస్తున్నాం. రైతు భరోసా కేంద్రాలు రైతులకు దేవాలయాల వంటివి. మీరు చరిత్రలో నిలిచిపోతారు. – భాస్కర్రెడ్డి, వీరపునాయనిపల్లె మండలం, వైఎస్సార్ కడప జిల్లా రైతులు ఆశ్చర్యపోతున్నారు మీరు ఇచ్చిన హామీలు మాత్రమే కాకుండా గత ప్రభుత్వ బకాయిలు కూడా ఇస్తున్నారు. చాలా పంటలను బీమా పరిధిలోకి తీసుకువచ్చారు. ఎంత భారమైనా భరిస్తున్నారు. శనగ రైతులకు కూడా ఎంతో ప్రయోజనం కల్పించారు. రైతు భరోసా కేంద్రాలు బాగా పని చేస్తున్నాయి. సాయంత్రం కాగానే రైతులు అక్కడ కూర్చుని అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు. గతంలో ఏ సీఎం చేయని విధంగా మీరు చేస్తున్నారని రైతులు ఆశ్చర్యపోతున్నారు. – కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు పంటలు పండించడానికి భయపడే పరిస్థితిలో మీరు ఇస్తున్న భరోసాతో రైతులు మళ్లీ సాగు చేస్తున్నారు. మీరు వ్యవసాయ రంగానికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు విప్లవాత్మకమైనవి. రైతుల పట్ల మీకు ప్రేమ, ఆప్యాయత ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు ఎంతో మేలు చేస్తున్నారు. – పోతుల సునీత, ఎమ్మెల్సీ ఇంత బీమా సొమ్ము ఇదే మొదటిసారి గతంలో ప్రీమియం కట్టినా ఏనాడూ రూ.4 వేలకు మించి రాలేదు. ఇవాళ నాకు లక్ష రూపాయల వరకు వచ్చింది. ఇంత పెద్ద మొత్తంలో పంటల బీమా పరిహారం పొందడం జీవితంలో మొదటిసారి. గత ప్రభుత్వ హయాంలో ఏనాడూ రైతులకు ఇంతగా న్యాయం జరగలేదు. రైతు భరోసా ద్వారా రూ.13,500 వస్తోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా మంచి సేవలందుతున్నాయి. ఉన్న ఊళ్లోనే విత్తనాలు, పురుగు మందులు ఇస్తున్నారు. ఇప్పుడు బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే కడతామంటోంది. ఈ పాలనను సువర్ణాక్షరాలతో లిఖించుకోవచ్చు. – పురుషోత్తం, మాంభట్టు, తడ మండలం, నెల్లూరు జిల్లా -
రైతులు రూపాయి కడితే చాలు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: తమది రైతు పక్షపాత ప్రభుత్వమని ఇప్పటికే నిరూపించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక ముందడుగు వేశారు. 2018–19 రబీ పంటల బీమా ప్రీమియంకు సంబంధించి గత సర్కారు బకాయి పడిన రూ.122.61 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. దీంతో అప్పటి పంట నష్టానికి సంబంధించి బీమా కంపెనీలు రూ.596.36 కోట్ల క్లెయిమ్స్ విడుదల చేశాయి. ఈ మొత్తాన్ని రాష్ట్రంలో 5.94 లక్షల మంది రైతుల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 2019–2020 నుంచి రైతులందరికీ ఉచితంగా వైఎస్సార్ పంటల బీమా అమలు చేస్తామని తెలిపారు. అదే విధంగా రైతు వేసిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పిస్తామని పునురుద్ఘాటించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. రైతు భరోసా కేంద్రంలోనే ఇ– క్రాపింగ్ నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా.. గ్రామ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్, రెవిన్యూ అసిస్టెంట్లు, సర్వేయర్ కలిసి ఇ– క్రాపింగ్ రిజిస్టర్ చేసి.. వెంటనే ఇన్సూరెన్స్ను కట్టేలా ఏర్పాటు చేస్తారన్నారు. రైతులు రూపాయి కడితే చాలు.. వారి తరఫున ప్రభుత్వమే ప్రీమియం కడుతుందని.. బీమా పరిహారం పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కాగా పంటల బీమాను ఇ–క్రాప్తో అనుసంధానించడం ద్వారా ఖరీఫ్ 2019లో 25.73 లక్షలు.. 2019–20 రబీలో 33.03 లక్షల మందికి మొత్తంగా 58.76లక్షలమందికి ఉచితంగా పంటల బీమా సౌకర్యం అందనుంది.(పనులను పరుగెత్తించాలి) సమూల మార్పులు తీసుకువచ్చాం.. ‘‘గత ప్రభుత్వ హయాంలో బీమా పరిస్థితి ఎలా ఉండేదో.. ఇవాళ మనం చేస్తున్న కార్యక్రమం ద్వారా తెలుస్తోంది. రైతులు ప్రీమియం చెల్లించిన తర్వాత, మిగిలిన వాటాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సగం, కేంద్ర ప్రభుత్వం సగం చెల్లించాలి. సీజన్ ప్రారంభం కాగానే ప్రీమియం చెల్లింపు జరగాలి. అప్పుడే రైతుకు పరిహారం సక్రమంగా అందుతుంది. అయితే గత ప్రభుత్వం బీమా చెల్లించకపోవడం వల్ల రైతులకు ఇన్సూరెన్స్ ప్రీమియం రాని పరిస్థితి వచ్చింది. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే మనం అధికారంలోకి వచ్చాక బీమా కంపెనీలతో చర్చలు జరిపి, అవ్వాళ్టి ప్రీమియంను చెల్లించి, దాదాపు 5.95 లక్షల మంది రైతులకు ఇవాళ బీమా చెల్లించడం జరుగుతోంది. గత ప్రభుత్వం హయాంలో మాదిరి రైతులు నష్టపోయే పరిస్థితి రాకూడదని సమూలంగా మార్పులు తీసుకువచ్చాం. రైతులు కట్టాల్సిన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తోంది. దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులు కారణంగా ఇదంతా చేయగలుగుతున్నాం. ఈ డబ్బును పాత అప్పులకు జమచేసుకోకుండా అన్ ఇన్కంబర్డ్ ఖాతాల్లో ఈ బీమా డబ్బును జమ చేస్తున్నాం’’ అని సీఎం జగన్ తెలిపారు.(‘సీఎం జగన్ పథకాలు పలు రాష్ట్రాలకు ఆదర్శం’) మీకు రుణపడి ఉంటాం: రైతులు పంటల బీమా సొమ్ము విడుదల చేసే క్రమంలో సీఎం జగన్ వివిధ జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. ఈ క్రమంలో రైతు సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశపెట్టిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై రైతులు ప్రశంసలు కురిపించారు. గతంలో ఎప్పుడు పంట నష్టం జరిగినా బీమా అందలేదని.. ఇంత పెద్ద మొత్తంలో బీమా సొమ్ము పొందడం ఇదే తొలిసారి అని హర్షం వ్యక్తం చేశారు. ఆపదలో ఆదుకున్న ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామన్నారు. అదే విధంగా రైతు భరోసా వల్ల పెట్టుబడికి ఇబ్బందులు తొలిగాయని.. పెట్టుబడి కోసం రైతులెవరూ ఇప్పుడు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లడం లేదంటూ హర్షం వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాల వల్ల నకిలీ విత్తనాలు, ఎరువుల బెడద తప్పిందని కృతజ్ఞతలు తెలిపారు. -
సీఎం వైఎస్ జగన్ చొరవ.. వారి నిరీక్షణకు తెర
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో కడప జిల్లా రైతుల నిరీక్షణకు తెరపడింది. ఎనిమిదేళ్ల కిందటి రబీ పంటల బీమా క్లెయిములకు ఎట్టకేలకు చెల్లింపులు జరిగాయి. 24,641 మంది రైతులకు బీమా కంపెనీ రూ. 119.44 కోట్లు చెల్లించింది. ఈమేరకు క్యాంపు కార్యాలయంలో రైతుల ఖాతాలకు కంపెనీ ద్వారా నేరుగా సొమ్ము చెల్లిస్తూ సీఎం వైఎస్ జగన్ బటన్ ప్రెస్ చేశారు. అనంతరం సంబంధిత రైతులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కడప జిల్లాలోని తొండూరు, సింహాద్రిపురం, వీరపునాయనిపల్లె, వేంపల్లె, పులివెందుల, వేముల, కమలాపురం మండలాలకు చెందిన రైతులు ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఎనిమిదేళ్ల నిరీక్షణకు ముగింపు పలికినందుకు రైతులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా ప్రభావం ఉన్న సమయంలో కూడా డబ్బులు ఇవ్వడం సంతోషకరమని అన్నారు. అరటి పంట విక్రయాల్లో సమస్యలు తీరాయా? లేదా? అని సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా రైతులను ప్రశ్నించారు. (చదవండి: సీఎం జగన్ చేతల మనిషి, ప్రచారానికి దూరం..) అయితే, వ్యాపారస్తులతో చర్చించి రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా సంబంధిత పోలీసు అధికారులు కూడా సహకరిస్తున్నారని తెలిపారు. ఢిల్లీ, కాన్పూర్ వంటి మార్కెట్లకు ఇక్కడ నుంచి అరటి పంట వెళ్తుందని అధికారులు సీఎంకు చెప్పారు. ప్రస్తుతం అక్కడ మార్కెట్లు తెరుచుకున్నాయని, సరుకును బయటకు పంపుతున్నామని తెలిపారు. రైతులకు మంచి రేటు వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. (చదవండి: కరోనా కట్టడిలో ఏపీ ముందంజ) -
కష్టం చూడాలి.. నష్టం ఆపాలి
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాల్లో గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏలు)గా పని చేస్తున్న సిబ్బందిని రైతు మిత్రులుగా వ్యవహరించేలా వ్యవసాయ శాఖ శిక్షణ ఇస్తోంది. కర్షకుల సమస్యలు, ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. సలహాదారులుగా మెలిగేలా సంసిద్ధం చేస్తోంది. వ్యవసాయ శాఖకు జవాబుదారీగా ఉంటూ.. తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరవేస్తూ నష్టాలను నివారించి.. ప్రతి రైతు లాభాల బాట పట్టేలా వీఏఏలను కార్యోన్ముఖుల్ని చేస్తోంది. ఇందుకు సంబంధించి వీఏఏల విధులను వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. వీరి ప్రధాన బాధ్యతలను ఆరు విభాగాలుగా వర్గీకరిస్తూ మాన్యువల్ను ఖరారు చేసింది. వీటిలో సాధారణ విధులు, డేటా సేకరణ, విస్తరణ విధులు, నాణ్యమైన ఉత్పాదకాల పంపిణీ, పంట నష్టం లెక్కింపు, పంటల బీమాపై అవగాహన వంటి విధులు ఉన్నాయి. విధులివీ - వీఏఏలు గ్రామ పంచాయతీ ప్రధాన కార్యాలయాల్లోనే ఉండి వ్యవసాయ శాఖ అప్పగించే పనులకు జవాబుదారీగా వ్యవహరించాలి. ఉదయం వేళ క్షేత్ర సందర్శన చేయాలి. వ్యవసాయ శాఖ, గ్రామ సచివాలయ సమావేశాలకు హాజరుకావాలి. శాఖాపరమైన రికార్డులను కచ్చితత్వంతో నిర్వహించాలి. - రైతుల సామాజిక, ఆర్థిక సర్వే, భూ వినియోగం, నీటి వనరులు, పంటల విస్తీర్ణం, దిగుబడి వంటి వివరాలను సేకరించాలి. వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి సమీకృత గ్రామ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలి. అన్నిరకాల పంటలను ఎలక్ట్రానిక్ బుకింగ్ చేయాలి. డిమాండ్కు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల లభ్యతను పర్యవేక్షించాలి. - మట్టి నమూనాల సేకరణ, భూసార పరీక్షలతో పాటు చేలల్లో వేసే పంట, వాతావరణ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలి. ఆదాయ పెంపు సహా వ్యవసాయ శాఖ పథకాలను అమలు చేయాలి. కిసాన్ మేళాలకు రైతులు ఎక్కువగా హాజరయ్యేలా చూడాలి. పంట ఉత్పాదకత పెంపు, ఆహార ఉత్పత్తుల శుద్ధి, అదనపు విలువ జోడింపు వంటి మార్కెటింగ్ మెళకువలపై నమూనా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి. గ్రామాల్లోని బ్లాక్ బోర్డులపై ఎప్పటికప్పుడు తాజా వ్యవసాయ సమాచారాన్ని రాస్తుండాలి. అర్హులైన రైతులకు శాఖాపరమైన సహాయం అందుతుందో లేదో పర్యవేక్షించాలి. అవసరమైతే సిఫార్సు చేయాలి. చీడ పీడలపై ఎప్పటికప్పుడు వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేయడం, వ్యవసాయ పనిముట్లు, పరికరాలు, యంత్రాలను కస్టమ్ హైరింగ్ సెంటర్ల (సీహెచ్ఎల్) ద్వారా కర్షకులకు లభ్యమయ్యేలా చూడాలి. - రైతులకు సబ్సిడీపై ఇచ్చే అన్నిరకాల ఉత్పాదకాలు, విపత్కర పరిస్థితుల్లో తక్షణ విత్తన పంపిణీ జరిగేలా చూడాలి. డాక్టర్ వైఎస్సార్ సమగ్ర వ్యవసాయ పరీక్షా ప్రయోగశాలల్లోని సేవలను ప్రతి రైతు వినియోగించుకునేలా చైతన్యపరచాలి. నాణ్యతలేని ఉత్పత్తులు చలామణి అవుతుంటే వెంటనే మండల వ్యవసాయాధికారికి నివేదించాలి. - వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారాన్ని రైతులకు ఫోన్ల ద్వారా అందించి అప్రమత్తం చేయాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాన్ని సకాలంలో అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదించాలి. యుద్ధప్రాతిపదికన ప్రకృతి విపత్తుల సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి. - వివిధ పథకాల అమలులో వ్యవసాయ అధికారులకు సహకరించాలి. పంటల బీమా, సంస్థాగత రుణాలు, ఇతర సేవలపై కౌలు రైతులు, రుణాలు పొందని రైతులకు అవగాహన కల్పించాలి. వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడంలో సహకరించాలి. -
బీమా ‘పంట’ పండటంలేదు!
న్యూఢిల్లీ: పంటల బీమా (క్రాప్ ఇన్సూరెన్స్) అంటే.. బీమా కంపెనీలు భయపడిపోతున్నాయి! ప్రకృతి విపత్తుల కారణంగా పరిహారం కోరుతూ భారీగా క్లెయిమ్లు వస్తుండటం, ఫలితంగా ఈ విభాగంలో వస్తున్న భారీ నష్టాలతో కంపెనీలు పునరాలోచనలో పడుతున్నాయి. దీంతో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పటికే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) పథకం కింద క్రాప్ ఇన్సూరెన్స్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ సైతం ఈ విభాగం నుంచి తప్పుకున్నట్టు డేటా తెలియజేస్తోంది. అయినా, కొన్ని కంపెనీలు మాత్రం ఈ విభాగం పట్ల ఆశావహంగానే ఉన్నాయి. పీఎం ఎఫ్బీవై కింద 2018–19 ఆర్థిక సంవత్సరంలో వసూలైన స్థూల ప్రీమియం రూ.20,923 కోట్లు. కాగా, బీమా కంపెనీలకు పరిహారం కోరుతూ వచ్చిన క్లెయిమ్ల మొత్తం రూ.27,550 కోట్లుగా ఉంది. ప్రభుత్వరంగంలోని రీఇన్సూరెన్స్ సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (జీఐసీఆర్ఈ) సైతం తన క్రాప్ ఇన్సూరెన్స్ పోర్ట్ఫోలియోను భారీ నష్టాల కారణంగా తగ్గించుకోవడం గమనార్హం. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ డేటాను పరిశీలిస్తే.. చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ స్థూల ప్రీమియం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో 91 శాతం తగ్గిపోయి రూ.5.26 కోట్లుగానే ఉన్నట్టు తెలుస్తోంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థకు వచ్చిన స్థూల ఆదాయం రూ.211 కోట్లుగా ఉంది. పెరిగిన స్థూల ప్రీమియం పంటల బీమా విభాగంలో అన్ని సాధారణ బీమా కంపెనీలకు స్థూల ప్రీమియం ఆదాయం ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో పెరగడం గమనార్హం. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.15,185 కోట్లతో పోలిస్తే 26.5 శాతం వృద్ధి చెంది రూ.19,217 కోట్లకు చేరుకుంది. ‘‘క్రాప్ ఇన్సూరెన్స్ మంచి పనితీరునే ప్రదర్శిస్తోంది. కొన్ని విభాగాల్లో క్లెయిమ్ రేషియో ఎక్కువగా ఉంది. అయినప్పటికీ చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ విభాగంపై బుల్లిష్గానే ఉన్నాయి’’అని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ సంస్థల పెద్దపాత్ర క్రాప్ ఇన్సూరెన్స్లో నష్టాల పేరుతో ప్రైవేటు కంపెనీలు తప్పుకున్నా కానీ, ప్రభుత్వరంగ బీమా సంస్థలు పెద్ద పాత్రే పోషిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే నేషనల్ ఇన్సూరెన్స్, న్యూఇండియా ఇన్సూరెన్స్ కొన్ని ప్రైవేటు సంస్థలతోపాటు పంటల బీమాలో వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. ప్రభుత్వరంగ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ అధిక మొత్తంలో క్రాప్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని సొంతం చేసుకుంటోంది. కాగా, ఈ ఏడాది ఎలాంటి క్రాప్ బీమా వ్యాపారాన్ని నమో దు చేయబోవడంలేదని రీ ఇన్సూరెన్స్ చార్జీలు దిగిరావాల్సి ఉందని ఐసీఐసీఐ లాంబార్డ్ ఎండీ, సీఈవో భార్గవ్ దాస్ గుప్తా వ్యాఖ్యానించారు. ఈ రంగంలో పరిస్థితులు ఇలా.. ► ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం పరిధిలో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ క్రాప్ ఇన్సూరెన్స్ వ్యాపారం నుంచి తప్పుకుంది. ► చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ సైతం ఈ విభాగం నుంచి తప్పుకున్నట్టు డేటా తెలియజేస్తోంది. ► అధిక నష్టాలు, పరిహారం కోరుతూ భారీగా వస్తున్న క్లెయిమ్లు. ► ప్రభుత్వరంగ రీఇన్సూరెన్స్ సంస్థ జీఐసీఆర్ఈ సైతం తన క్రాప్ పోర్ట్ఫోలియోను తగ్గించుకుంది. ► ప్రభుత్వరంగ నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ మాత్రం ఈ వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. ► ప్రపంచవ్యాప్తంగా చూస్తే... అమెరికా, చైనా తర్వాత అతిపెద్ద పంటల బీమా మార్కెట్ మనదే కావడం గమనార్హం. -
ఎంపీ చొరవతో బీమాకు కదలిక
సాక్షి, కడప: పంట బీమా సొమ్ము కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న రైతుకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి చొరవతో ఇది సాధ్యపడనుంది. 2012 రబీ సీజన్లో చాలామంది బుడ్డశనగ సాగు చేశారు. చీడపీడలు, తీవ్ర వర్షాభావం, అకాల వర్షాల కారణంగా పంట దిగుబడి రాకుండా పోయింది. ఫలితంగా రైతులకు నష్టం వాటిల్లింది. పంట నష్టంపై బీమా చెల్లించలేదు. నాటి నుంచి నేటి వరకూ ఎంపీ అవినాష్రెడ్డి ఈ సమస్యపై సుదర్ఘ పోరాటం చేస్తూనే ఉన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, వ్యవసాయ బీమా కంపెనీ డైరెక్టర్ బూటానీలను పలుపర్యాయాలు కలిసి విన్నవించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర వాటా చెల్లించనందున, సాగు తేదీలు తప్పుగా రాసినందున బీమా చెల్లించలేక పోయామని అప్పట్లో అవినాష్రెడ్డికి బీమా కంపెనీ డైరెక్టర్ చెప్పారు. రాష్ట్ర వాటా చెల్లించాలని టీడీపీ ప్రభుత్వంపై ఆయన పలు సందర్భాల్లో ఒత్తిడి చేశారు. అయినా గత ప్రభుత్వం స్పందించలేదు. ఎంపీ వినతిని పెడచెవిన పెట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎంపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఒత్తిడి పెంచారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని, రాష్ట్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులను ఆయన ఇటీవల కలిశారు. ప్రీమియం చెల్లింపుపై కేంద్ర వ్యవసాయ బీమా కంపెనీతో చర్చించారు. ఆ చర్చలు ఫలప్రదమయ్యాయి. ఎంపీ చిరకాల ప్రయత్నాలు కొలిక్కి రానున్నాయి. త్వరలోనే ప్రభుత్వం బీమాకు సంబంధించి రాష్ట్ర వాటా చెల్లించనుందని సమాచారం. 2012నాటి బుడ్డశనగ బీమా చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం, బీమా కంపెనీ కూడా ముందుకు వచ్చాయి. జిల్లాలోని 20,655 మంది రైతులకు బుడ్డశనగ బీమా చెల్లింపు వల్ల లబ్ధి చేకూరుతుందని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సాక్షికి చెప్పారు. త్వరలోనే సుదీర్ఘ ప్రయత్నానికి తెరపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. -
అన్నదాత పై అ‘బీమా’నం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం రైతులకు ధీమా ఇస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ నుంచే దీనిని అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించగా.. పంటల్ని బీమా చేయించుకునే కర్షకుల సంఖ్య పెరుగుతోంది. ఈ పథకం కింద అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయే రైతుల్ని, కౌలు రైతుల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే వారి తరఫున బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లిస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధానమంత్రి పంటల బీమా పథకం (పీఎంఎఫ్బీవై), ఆధునీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్డబ్ల్యూబీసీఐఎస్) అమల్లో ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో కొన్ని పంటలకు ఆర్డబ్ల్యూబీసీఐఎస్ పథకాన్ని అమలు చేస్తుండగా.. అన్ని జిల్లాలలో పీఎంఎఫ్బీవైని అమలు చేస్తున్నారు. రుణాలు పొందే రైతుల నుంచి బ్యాంకులే రూపాయి చొప్పున మినహాయించుకుని బీమా కంపెనీలకు చెల్లిస్తాయి. రుణాలు తీసుకోని రైతులు మీ సేవా కేంద్రంలో రూపాయి చెల్లించి రైతు పేరు, సాగు చేస్తున్న పంట, సాగు విస్తీర్ణం, భూమి వివరాలను నమోదు చేయించుకుంటే సరిపోతుంది. రైతుల తరఫున బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.1,163 కోట్లను కేటాయించింది. ప్రతి రైతుకూ లబ్ధి పంటల వారీగా బీమా సంస్థలు నిర్ణయించిన ప్రకారం రైతులు ప్రీమియం విలువలో 2 నుంచి 5 శాతం సొమ్ము చెల్లిస్తే.. మిగతా మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున చెల్లించేవి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం మేరకు రైతులపై భారం పడకుండా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. దీనివల్ల రాష్ట్రంలో పంట వేసే ప్రతి రైతూ లబ్ధి పొందే అవకాశం ఉంది. ప్రస్తుత అంచనా ప్రకారం రాష్ట్రంలో 65 లక్షలకు పైగా రైతులు ఉన్నారు. వీరిలో 15.36 లక్షల మంది కౌలు రైతులు ఉంటారని అంచనా. రైతులతోపాటు కౌలు రైతుల తరఫున కూడా ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం చెల్లిస్తుంది. బీమా ప్రీమియం చెల్లింపునకు తొలుత జూలై 31 వరకే గడువు విధించగా.. ఆగస్టు చివరి వరకు పొడిగించారు. ఇప్పటికే 14.42 లక్షల మందికి వర్తింపు రాష్ట్రంలో ఇప్పటివరకు పంటల బీమా చేయించుకున్న రైతుల సంఖ్య 14.42 లక్షలకు చేరిందని, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హెచ్.అరుణ్కుమార్ చెప్పారు. ఉచిత బీమా పథకంలో చేరేందుకు రైతులు ఆసక్తి చూపడం శుభపరిణామమని పేర్కొన్నారు. రైతులు ఈ పథకాన్ని ఎంత వినియోగించుకుంటే అంత మంచిదన్నారు. కేవలం ఒక్క రూపాయితో బీమా పొందే సౌకర్యం దేశంలో బహుశా ఆంధ్రప్రదేశ్లోనే తొలిసారి ప్రవేశపెట్టినట్టు వివరించారు. -
ఒక్క రూపాయితో.. పంట బీమా..!
సాక్షి, పుల్లలచెరువు (ప్రకాశం): రైతులను ఐదేళ్లుగా కరువు వెంటాడుతోంది. వేసిన పంట వేసినట్లే ఎండిపోతోంది. అయినా పంటలపై ఆశ చావని అన్నదాత అప్పోసోప్పో చేసి పంటల సాగు చేసి చేతులు కాల్చుకుంటూనే ఉన్నారు. అయితే విపత్తుల సమయంలో అన్నదాతకు ఆసరా లేకుండా పోతోంది. కరువు నేపథ్యంలో పండలు ఎండిపోతే వారిని ఆదుకునే వారే కరువయ్యారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకువచ్చింది. రైతు ఒక్క రూపాయి చెల్లించి పేరు నమోదు చేసుకుంటే ప్రభుత్వమే ప్రీమియం మొత్తం చెల్లించి రైతుకు సాగు చేసే పంటకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా చేపట్టిన ఈ కార్యక్రమం రైతులకు వరం లాంటిదని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. 80 వేల ఎకరాల్లో పంటల సాగు.. నియోజకవర్గంలోని పుల్లలచెరువు, త్రిపురాంతకం, వైపాలెం, దోర్నాలు, పెద్దారవీడు మండలలాల్లో దాదాపు 75 వేల మంది రైతులు 80వేల ఎకరాల్లో పంటలను సాగు చేస్తున్నారు. ఈ మండలాల్లో ప్రధానంగా పత్తి, మిరప, వరి ఇతర పంటలను సాగు చేస్తుంటారు. ప్రకృతి విపత్తులు, ఇతరత్రా కారణాలతో రైతులు నష్టపోతుంటారు. ఈ నష్టపోయిన రైతులను ప్రభుత్వాలు బీమా పథకాల ద్వారా ఆదుకుంటాయి. ఇటీవల ప్రభుత్వం రైతులు ఒక్క రూపాయ చెల్లిస్తే చాలు బీమా వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఉపయోగం.. రైతన్నల పంట నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వాతావరణ ఆధారిత బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ప్రవేశపెట్టాయి. వీటి ద్వారా 2019–20 సంవత్సరానికి గాను పంటల బీమా నమోదు పక్రియను ప్రారంభించింది. బ్యాంకుల నుంచి రుణాలు పొందిన రైతులకు తమ ఖాతాల ద్వారా ఆయా బ్యాంకులు బీమా కంతు చెల్లిస్తాయి. బ్యాంకుల నుంచి అప్పు తీసుకోని రైతులు ఈ పథకంలో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. వాతావరణ ఆధారిత బీమా పథకం పత్తి, మిరప పంటలకు వర్తిస్తుంది. ఈ నెల 31 గడువు ముగియనుంది. ప్రధానమంత్రి ఫసల్బీమా యోజనా పథకం కింద కంది, మినుము పంటలకు ఈ నెల 31తో, వరికి ఆగస్టు 31తో గడువు ముగుస్తుంది. నమోదు చేసుకోవడం ఇలా.. రైతులు ఒక్క రూపాయ చెల్లించి సమీపంలోని మీసేవా, కంప్యూటర్ సెంటర్లలో నమోదు చేసుకోవచ్చు. రైతులు తప్పనిసరిగా వారి పాసుపుస్తకం, ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా పాసుపుస్తకంల జిరాక్సులను తీసుకుని ఆయా కేంద్రాలకు వెళ్లి రైతులు ఫసల్ బీమా కోసం నమోదు చేసుకోవాలి. ఒక్క రూపాయితో బీమా వర్తింపు బీమా కంపెనీలకు అవసరమైన మొత్తంను చెల్లించేందుకు ప్రభుత్వమే ముందుకు వచ్చింది. రైతన్న ఎకరానికి ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు. వాతావరణ ఆధారిత బీమాలో పత్తి పంట సాగుచేస్తే ఎకరానికి రూ 1.600, మిర్చికి ఎకరానికి రూ.3,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించడానికి సిద్ధమైంది. ఫసల్బీమాలో కంది పంటకు ఎకరానికి రూ.360, మినుముకు రూ.280, వరికి రూ.640లు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుందని వ్యవసాయాదికారులు చెబుతున్నారు. ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు.. రైతులు సాగు చేసిన పంటలు ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితుల్లో కొంత మేరకు నష్టపోతుంటారు.ఆ నష్టా నుంచి రైతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు వాతావరణ ఆధారిత బీమా, ప్రధానమంత్రి ఫసల్బీమా పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాయి. వీటికి రైతులు ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే ఇస్తుంది. ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – జవహర్లాల్నాయక్, వ్యవసాయాధికారి -
ఉచిత పంటల బీమాపై రైతుల్లో కొరవడిన అవగాహన
సాక్షి, అమరావతి:వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంపై రైతుల్లో అవగాహన కొరవడటంతో ఆశించిన మేర బీమా చేయించుకునేందుకు అన్నదాతలు ముందుకు రావడం లేదు. ఇప్పటికే రైతులు సాగు చేసే పంటలకు సంబంధించి ప్రీమియం కింద కేవలం రూపాయి చెల్లిస్తేచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలన్నర్ర సమయం కావొస్తున్నా పంటలకు బీమా చేయించేందుకు రైతులు ముందుకు రావడం లేదు. ప్రధానంగా బీమా చెల్లింపుపై రైతులకు అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరుగుతోంది. గతంలో భారంగా ప్రీమియం చెల్లింపు..! గతేడాది వరకు పంటల రకాలను బట్టి ప్రీమియం చెల్లించాల్సి ఉండేది. గతంలో వరి ఎకరానికి సుమారు రూ.700 వరకు రైతు ప్రీమియం రూపంలో చెల్లించేవారు. అలాగే పత్తికి రూ.1800, టమాటాకు రూ. 2,200, పసుపు పంటకు రూ.4 వేల వరకు ప్రీమియం ఉండేది. అప్పులు చేసి పంటలు సాగు చేసే రైతులకు పంట బీమా విషయం తలకు మించి భారంగా ఉండేది. దీంతో చాలా మంది రైతులు పంటలకు ప్రీమియం చెల్లించేందుకు పెద్దగా ఆసక్తి కనబరిచేవారు. రూపాయికే బీమా వర్తింపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రంగంపై ప్రధానంగా దృష్టి సారించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను తన పాదయాత్రలో విని, తెలుసుకున్న ఆయన రైతులకు అండగా ఉండేందుకు నడుం బిగించారు. ఇందులో భాగంగానే వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రకటించారు. రైతులు కేవలం రూపాయి చెల్లిస్తే చాలు పంటలకు అవసరమైన ప్రీమియాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఫలితంగా రైతులపై ప్రీమియం భారాన్ని తొలగింది. మీ సేవా కేంద్రాల్లో రూపాయి చెల్లించి నమోదు చేసుకుంటే సరిపోతుంది. రైతు వాటాను వ్యవసాయశాఖ జమ చేస్తుంది. పేరు, సాగు చేసిన పంట, విస్తీర్ణం, భూమి వివరాలు నమోదు చేయించుకుంటే చాలు. కానీ, క్షేత్రస్థాయిలో ఈ పథకంపై రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 30 నుంచి 40 శాతం మంది మాత్రమే..! జిల్లాలో ఇప్పటిదాకా పంటల బీమా నామమాత్రంగానే అమలవుతోంది. పంటల వారీగా బీమా సంస్థలు నిర్ణయించిన ప్రీమియాన్ని చెల్లించేందుకు రైతులు ఆసక్తి కనబరిచే వారు కాదు. గతేడాది సాధారణ సాగు విస్తీర్ణం 3.15 లక్షల హెక్టార్లు కాగా, ఇందులో కేవలం 35 శాతం పంటలకు మాత్రమే రైతులు బీమా చేయించారు. పంటలకు ప్రీమియం రుసుము అధికంగా ఉండడం, ఒక వేళ ప్రీమియం చెల్లించినా పంట నష్టపోయిన సమయంలో బీమా సంస్థల కొర్రీల వల్ల రైతులకు పరిహారం సక్రమంగా అందేది కాదు. ఈ కారణాలతో బీమా చేయించేందుకు రైతులు ముందడుగు వేసేవారు కాదు. 31 చివరి తేదీ.. మొక్కజొన్న, పెసర, కంది, మిర్చి, పత్తి, వేరుశనగ, చెరుకు తదితర పంటలకు ఈ నెల 31వ తేదీ తుది గడువు. వరి పంటకు బీమా చెల్లించేందుకు ఆగస్ట్ 21 తుది గడువు. వరి తప్పితే మిగిలిన పంటలకు ప్రీమియం (రూ.1) చెల్లించేందుకు కేవలం తొమ్మిది రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 30 శాతం మంది రైతులే ప్రీమియం రుసుము చెల్లించి, పంట వివరాలు నమోదు చేసినట్లు తెలిసింది. అవగాహన కల్పిస్తున్నాం.. పంటల బీమా అంశంపై రైతులకు ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నాం. ఉచిత పంటల బీమా పథకాన్ని వంద శాతం మంది రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. – టి.మోహనరావు, జేడీఏ -
అన్నదాతకు పంట బీమా
ఆరుగాలం శ్రమించే అన్నదాతకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నడుం బిగించింది. విపత్తుల సమయంలో పంట నష్టపోయిన రైతులను ఆదుకునే చర్యలు చేపట్టింది. పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించేలా బడ్జెట్లో కేటాయింపులు చేసింది. రైతులకు పంటల ధీమాను కల్పించింది. జిల్లాలో 1,86,825 హెక్టార్లలో సాగుచేసే పంటకు బీమా వర్తించనుందన్న వ్యవసాయాధికారుల ప్రకటనలతో రైతులు సంబర పడుతున్నారు. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం వచ్చిందని... వ్యవ‘సాయం’తో ఆర్థిక కష్టాలు తొలగుతాయని ఆశపడుతున్నారు. సాక్షి, చీపురుపల్లి(విజయనగరం) : వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోంది. అందరికీ అన్నంపెట్టే రైతన్నను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. విపత్తుల సమయంలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునే చర్యలకు శ్రీకారం చుట్టింది. రైతులు పంటలు పండించకపోతే పట్టెడు అన్నం కూడా దొరకదని... రైతులకు ప్రభుత్వమే పూర్తిస్థాయిలో ప్రయోజనాలు కల్పిస్తుందని సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఆ మేరకు పంట బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని వెల్లడించారు. విపత్తుల సమయంలో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. తొలిబడ్జెట్లోనే ప్రీమియం చెల్లించేందుకు రూ.1163 కోట్లు నిధులు కేటాయించారు. దీంతో విజయనగరం జిల్లాలో 1,86,825 హెక్టార్లలో వివిధ రకాల పంటలు పండిస్తున్న రైతులకు ధీమాను కలిగించారు. అయితే, ఆరుతడి పంటలకు జూలై 31, వరి పంటకు ఆగస్టు 15 లోగా పంటల బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంది. జిల్లాలో సాగులో ఉన్న పంటల వివరాలను వ్యవసాయాధికారులు సేకరించారు. ‘ఈ పంట యాప్’లో నమోదుచేయాలి. ఈ ప్రక్రియను వ్యవసాయ ఉన్నతాధికారులు వేగవంతం చేయాలి. గడువులోగా పంటల వివరాలు నమోదు చేయకుంటే రైతుల కు నష్టం తప్పదన్న అభిప్రా యం వ్యక్తమవుతోంది. వ్యవసాయశాఖ ఈ పంట యాప్ తో పాటు గణాంకశాఖ ఆధ్వర్యంలో క్రాప్ బుకింగ్ చేసే పద్ధతి కూడా ఉంది. ఆ వివరా లు ఆధారంగా కూడా ప్రభుత్వం ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది. అయి తే, గణాంకశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న క్రాప్ బుకింగ్లో అరొకర వివరాలు ఉంటున్నాయని, దీంతో మిగిలిన రైతులు నష్టపోతారన్న వాదన వినిపిస్తోంది. ఉదాహరణకు చీపురుపల్లి నియోజకవర్గంలో 7 వేల హెక్టార్లలో మొక్కజొన్న పండిస్తున్న నేపథ్యంలో గణాంకశాఖ 2 వేల హెక్టార్లులో మాత్రమే పంటను చూపిస్తున్నారు. దీంతో మిగిలిన రైతులకు నష్టం కలగడమే కాకుండా అధికారుల అలసత్వం కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. పంటల బీమా గడువు దగ్గర పడుతోంది.... పంటల బీమా కోసం ప్రీమియం చెల్లించాల్సిన గడువు దగ్గరపడుతోంది. ఆరుతడి పంటలకు జూలై 31లోగా, వరి పంటకు ఆగస్టు 15లోగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ‘ఈ పంట యాప్’ ద్వారా వ్యవసాయశాఖ, క్రా>ప్ బుకింగ్ పద్ధతిలో గణాంకశాఖలు పంటల సాగు వివరాలను నమోదు చేయాలి. ఇంతవరకు వ్యవసాయశాఖ ఈ పంట యాప్ అందుబాటులోకి రాలేదు. ఈ పంట యాప్ రాగానే పంటల నమోదును త్వరితగతిన చేపడతాం. – ఎన్.వి.వేణుగోపాల్, సబ్ డివిజినల్ అసిస్టెంట్ డైరెక్టర్, చీపురుపల్లి -
పంటల బీమాకు కంపెనీల ఖరారు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో పంటల బీమాను అమలు చేసేందుకు కంపెనీలను ఖరారు చేసినట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. పంటల బీమా అమలు, పెండింగ్ క్లెయిమ్స్పై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019–20 సంవత్సరానికి ఇఫ్కో టోక్యోకు రెండు క్లస్టర్లు, ఏఐసీకి నాలుగు క్లస్టర్లు అప్పగించామన్నారు. అలాగే పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో టమాటా పంటను చేర్చామన్నారు. 2019– 20 ఏడాదిలో ఖరీఫ్, రబీలకు కలిపి 15 రోజుల్లో నోటిఫికేషన్ ప్రకటిస్తామన్నారు. ప్రస్తుత రబీకి నమోదు చేసుకున్న రైతుల పంటలు వడగండ్ల వాన వల్ల దెబ్బతిన్నట్లయితే, విపత్తు సంభవించిన 72 గంటలలో ఇన్సూరెన్స్ కంపెనీలకు తెలియపరచాలన్నారు. 2017–18 ఖరీఫ్, రబీ క్లెయిమ్స్ల చెల్లిం పుల నిర్దేశిత గడువు ఈ నెల 20వ తేదీగా నిర్ణయించామన్నా రు. స్థానిక విపత్తుల సమాచారాన్ని నివేదించేందుకు టోల్ ఫ్రీ నంబర్లు ఏఐసీ –18005992594, బజాజ్ అలయెంజ్ –18002095959కు ఫోన్ చేయవచ్చన్నారు. -
పంటల బీమాకు జగన్ పూచీ!
అది 2018, అక్టోబర్ 11 రాత్రి.. తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాపై విరుచుకుపడింది. గంటల వ్యవధిలోనే వేలాది మంది రైతులు సర్వస్వాన్నీ కోల్పోయి కట్టు బట్టలతో మిగిలారు. 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులు, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కురిసిన కుండపోత వర్షానికి వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. అటువంటి వారిలో శ్రీకాకుళం జిల్లా గార గ్రామానికి చెందిన బడగల నర్సింహమూర్తి ఒకరు. ఆయన తనకున్న రెండెకరాల్లో సాంబమసూరి వరిని సాగు చేస్తున్నాడు. పొట్ట దశలో ఉంది. మంచి దిగుబడి వస్తుందనుకుంటున్న దశలో వచ్చిన ఈ తుపాను ఆయన్ను మరింత నిరుపేదగా మార్చింది. భారీ నష్టాల పాల్జేసింది. ఇలా ఎందరో.. మరెందరో.. రేయనక.. పగలనక.. కష్టమనక.. అప్పులనక.. ఒళ్లు హూనం చేసుకొని ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలు వచ్చి నష్టపోవడంతో రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి సాగు భారమై చాలామంది కాడి కింద పడేస్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి అయితే మరింత దయనీయం. ఈ పరిస్థితుల్లో స్వాతంత్య్రం వచ్చిన మూడేళ్ల తర్వాత భారతీయ పార్లమెంటు బీమా పథకాన్ని ప్రారంభించబోతున్నట్టు ప్రకటిస్తే అది గాడిన పడడానికి 22 ఏళ్లు పట్టింది. 1972లో పంటల బీమా పథకం ప్రారంభమైతే ఇప్పటికీ ఆ సంఖ్య 3 కోట్లకు దాటకపోవడం గమనార్హం. రాష్ట్రంలోనైతే ఈ సంఖ్య 16 లక్షలకు మించలేదు. దేశంలో ఈవేళ సుమారు 12 కోట్లకు పైగా రైతు కుటుంబాలు ఉన్నట్టు కేంద్రం ఇటీవల ప్రకటించింది. బీమాకు ఎందుకింత ప్రాధాన్యత..? ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్ గిట్టుబాటు లేక, ఆర్థిక ఇక్కట్లతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దశలో ఈ పథకానికి ప్రాధాన్యం వచ్చింది. రైతులకు ఆసరాగా నిలవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రధాన మంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను అమలు చేస్తోంది. సాగు చేసిన పంటలకు అనుగుణంగా స్వల్ప మొత్తంలో ప్రీమియం చెల్లిస్తే విపత్తుల కారణంగా పంట నష్టపోయిన సందర్భాల్లో బీమా వర్తిస్తుంది. తిత్లీ, హుద్హుద్, ఫైలిన్ వంటి తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయే అన్నదాతలకు పంటల బీమా పథకం ఉడతాభక్తిగా తోడ్పడుతుంది. బ్యాంకుల నుంచి రుణం తీసుకునే రైతులకు పంటల బీమాను అనివార్యం చేశారు. ఏ పంటకు రుణం తీసుకుంటున్నారో ఆ పంటకు బ్యాంకులే ప్రీమియంను మినహాయించి ప్రభుత్వం గుర్తించిన బీమా కంపెనీలకు చెల్లిస్తాయి. బ్యాంకు నుంచి అప్పు తీసుకోని రైతులు, వాస్తవ సాగుదార్లయిన కౌలు రైతులు సైతం స్వయంగా ఫసల్ బీమా పథకంలో చేరే అవకాశం ఉన్నా, చేరుతున్న వారి సంఖ్య పరిమితమే. కౌలు రైతులు వ్యవసాయ శాఖ, రెవెన్యూశాఖ జారీ చేసిన పంట సాగు ధ్రువపత్రం, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ ప్రతులను అధికారులకు అందజేసి బీమా చెల్లించవచ్చు. అతివృష్టి, అనావృష్టితో పంటలకు తీవ్ర నష్టం జరిగితే నిబంధనల మేరకు బీమా చెల్లిస్తారు. అగ్ని ప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, తుపాను తదితర ప్రతికూల వాతావరణం వల్ల జరిగిన పంటనష్టాన్ని పంటకోత ప్రయోగాల యూనిట్ దిగుబడుల అంచనా ప్రకారం చెల్లిస్తారు. పంట కోత తరవాత పొలంలో ఉంచిన పంటకు 14 రోజుల వరకూ అకాల వర్షాలకు, తుపానువల్ల నష్టం వాటిల్లితే వ్యవసాయ క్షేత్రం నుంచి బీమా రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ప్రధాన మంత్రి పంటల బీమా కింద రైతులు ఖరీఫ్లో 2 శాతం, రబీలో 1.5 శాతం ప్రీమియం చెల్లించాలి. అదే ఉద్యానపంటల రైతులతే 5 శాతం చెల్లించాలి. మిగతా మొత్తాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం చెల్లిస్తాయి. అయితే, ఈ పథకంపై రైతుల్లో సరిగ్గా అవగాహన లేకపోవడం, బీమా కంపెనీల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం కారణంగా ఎక్కువమంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. 2016 ఖరీఫ్లో రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా, ఆర్.డబ్లు్య.బి.సి.ఐ.ఎస్. కింద 15.09 లక్షల మంది రైతులు మాత్రమే బీమా చేయించుకున్నారు. అంటే, రాష్ట్రంలో సుమారు 85 లక్షల మంది వరకు రైతులు ఉన్నారనుకుంటే కనీసం నాలుగోవంతు కూడా పంటల బీమాను చెల్లించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా కింద చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాలను చెల్లించకపోవడం వల్లే రైతులకు సకాలంలో బీమా పరిహారాన్ని చెల్లించలేకపోతున్నామని కంపెనీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి నవరత్నాలలో భాగంగా వైఎస్సార్ రైతుభరోసా పథకాన్ని ప్రకటించారు. ఇందులో ఒక ముఖ్యమైన అంశం రైతులకు ఉచిత పంటల బీమా. పంటల బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పని లేదని వైఎస్ జగన్ రైతులకు భరోసా ఇచ్చారు. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రైతులు తమ వాటా కింద ప్రస్తుతం ఖరీఫ్లో చెల్లిస్తున్న 2 శాతం, రబీలో చెల్లించే 1.5 శాతం మొత్తాన్నీ రాష్ట్రప్రభుత్వమే చెల్లిస్తుంది. బీమా బాధ్యతను తానే తీసుకొని రైతులకు మేలు చేస్తుంది. ఏదయినా విపత్తు సంభవించినప్పుడు రైతులకు బీమా కంపెనీల నుంచి క్లెయిమ్ వచ్చేలా చేస్తుంది. రైతులను ఆదుకుంటుంది. అలా చేయడం వల్ల అన్నదాతలందరికీ ఆలంబన దొరుకుతుంది. గట్టి మేలు జరుగుతుంది. ఇటీవల ప్రకటించిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకాన్ని దేశ వ్యాప్తంగా ఎంతగా కీర్తిస్తున్నారో వైఎస్ జగన్ ప్రకటించిన ఈ ఉచిత బీమా పథకాన్ని రైతు ప్రముఖులు అంతగా కొనియాడుతున్నారు. – ఎ. అమరయ్య, చీఫ్ రిపోర్టర్, సాక్షి -
ఎట్టకేలకు అంగీకారం!
సాక్షి ప్రతినిధి, కడప: న్యాయంగా రావాల్సిన బీమా అందలేదు. రైతులకు అండగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. ప్రత్యక్ష పోరాటం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చినా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపలేదు. వెరసి రైతులకు నిరీక్షణ తప్పలేదు. వైఎస్సార్సీపీ ప్రత్యక్ష పోరాటంతో ఆలస్యంగానైనా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వానికి అంగీకార లేఖ రాస్తూ నిర్ణయం తీసుకుంది. రైతులు వారి వారి పంటలకు బీమా చెల్లించుకునే వెసులుబాటు ఉంది. ప్రీమియం చెల్లించిన తర్వాత బాధ్యత ఇన్య్సూరెన్సు కంపెనీలదే. బీమా చెల్లించాల్సిన సమయంలో దరఖాస్తులు సక్రమంగా పూరించలేదని అర్హులైన రైతులకు బీమా చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. రైతులకు తెలియక చేసిన తప్పులకు శిక్ష విధిస్తారా... అంటూ వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. వివిధ దశల్లో ప్రత్యక్ష ఆందోళన చేసింది, తుదకు ఆపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ధర్నా చేపట్టారు. ఆపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లోపించింది. రెండున్నరేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించేందుకు అంగీకరిస్తూ లేఖలో వెల్లడించిన వైనమిది. జిల్లాలో 2012–13 పంటలబీమాకు శనగ, పొద్దుతిరుగుడు పంటలకు రైతులు బీమా ప్రిమియం చెల్లించారు. 76,750 మంది బీమా చెల్లించగా వారిలో 21,965 క్లైయిమ్లను అగ్రికల్చర్ ఇన్య్సూరెన్సు కంపెనీ (ఏఐసీ) తిరస్కరించింది. అందులో ప్రధానంగా 20,655 దరఖాస్తులు పంటలు సాగుచేసిన తేది పొందుపర్చలేదని పంటల బీమా మంజూరు చేయకుండా తిరస్కరించింది. వారిలో 16,889 మంది బుడ్డశనగ, 3,766 మంది పొద్దుతిరుగుడు రైతులు ఉన్నారు. వారందరికీ పంటల బీమా మంజూరు చేయకుండా తిరస్కరించింది. ఈపరిస్థితుల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వారికి అండగా అత్యంత చిత్తశుద్ధితో వైఎస్సార్సీపీ పోరాటాన్ని ఎంచుకుంది. కడప మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డి ఏఐసీ అధికారులతో అనేక పర్యాయాలు చర్చించారు. అదేవిధంగా వ్యవసాయశాఖ కమిషనర్తో సైతం మంతనాలు చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిసి హైదరాబాద్లోని ఏఐసీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. రాష్ట్ర పరిధిలో ఉన్న అడ్డంకులను చేధించుకుని ఏఐసీ జీఎం రాజేశ్వరి ద్వారా ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితోనూ, కేంద్ర వ్యవసాయశాఖ జాయింట్ సెక్రెటరీతోనూ ప్రత్యేకంగా పలుమార్లు కలుస్తూ ఐదేళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న అవస్థలను వివరిస్తూ, ప్రత్యేక సమావేశాల ద్వారా వ్యవహారాన్ని కొల్కి తెచ్చారు. ఆమేరకు 2016 మార్చి 10న కేంద్రప్రభుత్వం లేఖ రాసింది. పెండింగ్లో ఉన్న ఆ క్లైయిమ్స్ రాష్ట్రప్రభుత్వ వాటానిమిత్తం అంగీకారం కోరింది. ఇలాంటి తరుణంలో తక్షణమే స్పందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లుగా నిర్లక్ష్యం ప్రదర్శించింది. 2018 సెప్టెంబర్ 19న అగ్రికల్చర్ స్పెషల్ సెక్రెటరీ డి.మురళీధర్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి అంగీకార లేఖ రాశారు. చిత్తశుద్ధి పోరాటం చేసిన ఫలితమే... పంటలకు బీమా ప్రీమియం చెల్లించిన తర్వాత కూడా రైతులకు బీమా మంజూరు కాకపోవడంపై వైఎస్సార్సీపీ రైతులకు అండగా నిలిచింది. చిత్తశుద్ధితో అడుగడుగునా వైఎస్సార్సీపీ ప్రత్యక్ష పోరాటం చేసిన నేపథ్యంలో తక్షణమే స్పందిస్తే ఆ పార్టీకి మంచిపేరు వస్తుందని కావాలనే రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే వైఎస్సార్సీపీ నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వంలోనైనా శనగ రైతులకు పంటల బీమా చెల్లింపు చేస్తామని ప్రజాసంకల్పయాత్రలో సైతం ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ పోరాట ఫలితంగా ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం లేఖకు స్పందిస్తూ అంగీకార లేఖ రాసింది. గతంలో కూడా ఇలాంటి విపత్కర పరిస్థితిని రైతులు చవిచూశారు. 2012–13 రబీ పంటల బీమా మంజూరు చేయడంలో ఏఐసీ నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఎంపీ హోదాలో పలుమార్లు పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లడం, స్వయంగా ఇన్సూరెన్సు అధికారులను కలవడంతో రూ.132కోట్లు మంజూరు చేస్తూ ఏఐసీ నిర్ణయం తీసుకుంది. తొలివిడతగా 17,161మంది శనగ రైతులకు రూ.88 కోట్లు బీమా మొత్తం జమ అయింది. రెండో విడతగా 11,286 మంది శనగ రైతులకు రూ.44కోట్లు బీమా మొత్తం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పట్లో శనగరైతులు సైతం కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని కృషిని కొనియాడుతూ వచ్చారు. తక్షణమే పరిహారం అందించకుండా దాదాపు నాలుగు వారాలు అధికారపార్టీ నేతలు అడ్డుకున్నారు. ‘అమ్మ పెట్టదు...అడుక్కోనివ్వదు’ అన్నట్లుగా వ్యవహరించారు. తాజాగా 2012–13 రబీ పంటల బీమా దరకాస్తులు పూరించడంలో పంట సాగుచేసిన తేది పొందుపర్చలేదనే కారణంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారులు త్వరలో శుభవార్త వినే అవకాశం ఉంది. -
పరిహారం ఆలస్యం చేస్తే జరిమానా
సాక్షి, హైదరాబాద్: పంటల బీమా సొమ్ము కోసం ఎదురుచూసే రైతులకు శుభవార్త. బీమా క్లెయిమ్ సెటిల్ చేయకుండా ఆలస్యం చేస్తూ రైతులను ఏడిపించే పరిస్థితికి కేంద్రం చెక్ పెట్టింది. అందుకు సంబంధించి బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) కింద రైతులకు బీమా పరిహారం క్లెయిమ్స్ సెటిల్ చేయడంలో ఆలస్యం చేస్తే బీమా కంపెనీలు, సంబంధిత రాష్ట్రాలకు జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదలచేస్తూ ఆయా రాష్ట్రాలకు పంపించింది. సెటిల్మెంటు చేయడంలో నిర్ణీతకాల పరిమితి రెండు నెలలు దాటితే 12 శాతం వడ్డీ రైతులకు చెల్లించాలని బీమా కంపెనీలను ఆదేశించింది. అలాగే కంపెనీల విన్నపం మేరకు తమ వాటా సబ్సిడీ సొమ్ము చెల్లించడంలో మూడు నెలలకు మించితే రాష్ట్రాలు 12 శాతం వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే రబీ సీజన్ నుంచి అమలవుతాయని కేంద్రం ప్రకటించింది. అలాగే రైతులకు సక్రమంగా బీమా సేవలు అందించడంలో విఫలమయ్యే కంపెనీలను రద్దు చేయాలని ఆదేశించింది. ఇదిలావుండగా ఏడాదంతా సాగయ్యే ఉద్యాన పంటలను కూడా పీఎంఎఫ్బీవై పథకంలోకి తీసుకొస్తూ మరో నిర్ణయం తీసుకుంది. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తారు. అలాగే అడవి జంతువుల దాడిలో పంటకు నష్టం వాటిల్లితే దానికి కూడా బీమా వర్తింపజేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే దీన్ని కూడా పైలట్ ప్రాజెక్టుగా అమలుచేస్తారు. డూప్లికేషన్ను నివారించేందుకు బీమా పరిహారంలో ఆధార్ లింక్ను తప్పనిసరిగా అమలుచేయనున్నారు. కంపెనీలు తాము వసూలు చేసే ప్రీమియం సొమ్ములో 0.5 శాతాన్ని బీమాపై రైతులను చైతన్యం చేయడానికి ఖర్చు చేయాలని కేంద్రం ఆదేశించింది. తాజా మార్గదర్శకాలు ఈ పథకంలో ప్రస్తుతం నెలకొన్న లోపాలను సరిదిద్దేందుకు తీసుకున్నవేనని కేంద్రం స్పష్టం చేసింది. -
పంటల బీమాకు కంపెనీల తూట్లు
సాక్షి, హైదరాబాద్: రైతులను పంటల బీమా పరిధిలోకి తీసుకురావడంలో బీమా కంపెనీలు విఫలం అవుతున్నాయి. ఇప్పటివరకు 50 లక్షల ఎకరాలకు పైనే ఖరీఫ్ పంటలు సాగైతే కనీసం ఐదు లక్షల ఎకరాల రైతులను కూడా బీమా పరిధిలోకి తీసుకు రాలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా వాతావరణ ఆధారిత పంటల బీమా కింద పత్తి పంట వస్తుంది. రాష్ట్రంలో 40 శాతం పైగా ఇదే సాగవుతోంది. ఇప్పటికే 37 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. అటువంటి పత్తికి పంటల బీమా ప్రీమియం గడువు ఈ నెల 15తో ముగిసింది. కానీ పత్తి బీమా ప్రీమియం చెల్లించని రైతులు లక్షలాది మంది ఉన్నారు. దాదాపు 15 లక్షల మందికి పైగా రైతులు పత్తి సాగు చేస్తే, లక్షన్నర మందిని కూడా బీమా పరిధిలోకి తీసుకు రాలేదన్న విమర్శలున్నాయి. అన్ని పంటలకు కలిపి ఇప్పటివరకు కేవలం 2 లక్షల మంది రైతుల నుంచే ప్రీమియం చెల్లించినట్లు సమాచారం. పైగా ఈ నెలలో వరుసగా 14, 15వ తేదీల్లో బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఈ విషయంలో ముందే మేల్కొనాల్సిన వ్యవసాయశాఖ గడువు ముగిసిన తరువాత బీమా కంపెనీలకు రెండు రోజులు పెంచాలని కోరింది. అయితే అప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ, జాతీయ వ్యవసాయ బీమా కంపెనీలు ఈ నెల 17 వరకు పెంచేందుకు అంగీకరించాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ రాసిన లేఖకు ఏఐసీ సుముఖత వ్యక్తం చేసినా మిగతా రెండు కంపెనీలు గడువు పెంచేందుకు ససేమిరా అన్నాయి. ఇలా బీమా కంపెనీలు రైతుతో ఆడుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. బ్యాంకుల సహకారం సున్నా... మన రాష్ట్రంలో మొత్తం ఆరు క్లస్టర్లుగా పంటల బీమా అమలు చేస్తున్నారు. ఇందులో ఈ వానాకాలం బీమాను రెండు క్లస్టర్లను వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ) అమలు చేస్తుండగా, ఎన్ఐసీ మూడు, టాటా ఒక క్లస్టర్లో అమలు చేస్తున్నాయి. ఏఐసీ పత్తికి రెండ్రోజుల పొడిగింపునకు అంగీకరించినప్పటికీ ఆ పరిధిలోని రైతులకు తెలియజేయడంలో వ్యవసాయశాఖ వైఫల్యం చెందింది. ఫలితంగా ఆ క్లస్టర్ పరిధిలో 10 జిల్లాల్లోని రైతులు నష్టపోయారుఇటు బ్యాంకులపై ఒత్తిడి పెంచి రుణాలు ఇప్పించడంలోనూ అలసత్వం ప్రదర్శించగా, రుణం తీసుకోని రైతులను ప్రీమియం కట్టేలా అవగాహన కూడా కల్పించలేకపోయారు. వాస్తవంగా ఖరీఫ్లో పంట రుణాలు రూ.25 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు బ్యాంకులు రూ.6 వేల కోట్లలోపే ఇచ్చాయి. వాస్తవంగా ఖరీఫ్ సాధారణ విస్తీర్ణంలో ఇప్పటివరకు సగంపైనే సాగైతే, రుణాలు మాత్రం నాలుగో వంతు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో బ్యాంకు రుణాల ద్వారా పంటల బీమా ప్రీమియం చెల్లించలేని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా జూన్లోపే రుణాలు ఇవ్వాల్సి ఉండగా, బ్యాంకులు ఇప్పటివరకు రైతులను సతాయిస్తున్నాయి. అటు బీమా కంపెనీలు, ఇటు బ్యాంకులు రైతులను బీమా పరిధిలోకి తీసుకు రానీయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నాయి. 50 శాతం బీమా లక్ష్యానికి సమస్యలు.. మన రాష్ట్రంలో సాగయ్యే భూమిలో బీమా పరిధిలోకి వచ్చే భూమి కేవలం 20 శాతం వరకే ఉంటుంది. ఒక్కోసారి అది 15 శాతానికే పరిమితమవుతోంది. అయితే కేంద్రం ఈ ఏడాది బీమా పరిధిలోకి 50 శాతం భూమిని తీసుకురావాలన్న నిబంధన పెట్టింది. కానీ అది ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మన రాష్ట్రంలో 2016లో వానాకాలం, యాసంగిలతో కలిపి 1.39 కోట్ల ఎకరాలు సాగు కాగా, కేవలం 20.95 లక్షలు మాత్రమే బీమా పరిధిలోకి వచ్చింది. అంటే సాగులో 15 శాతమే. అలాగే 2017లో వానాకాలం, యాసంగిలతో కలిపి మొత్తం 1.41 కోట్ల ఎకరాలలో సాగు కాగా 30 లక్షల ఎకరాలు బీమా పరిధిలోకి వచ్చింది. అంటే 21 శాతం. ఈసారి అంత మొత్తంలో రావడం కష్టమేనని అధికారులే పేర్కొనడం గమనార్హం. దీంతో ఈ ఏడాది 50 శాతమైనా బీమా పరిధిలోకి తీసుకు రావాలన్న లక్ష్యం నీరుగారే ప్రమాదముంది. పరిహారం చెల్లింపుల్లో నిబంధనలు పక్కాగా పాటించని బీమా కంపెనీలు, గడువు తేదీల విషయంలో మాత్రం మరోలా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటికే పత్తి పంటకు గులాబీ పురుగు సోకితే పరిహారం రావడం లేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. -
కౌలు రైతుల కష్టాల సాగు!
సాక్షి, అమరావతి: - శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం పోతయ్యవలసకు చెందిన దలి రేయన్నఓ కౌలు రైతు. రుణ అర్హత పత్రం(ఎల్ఇసీ) ఉంది. గ్రామసభలో పంట రుణానికి దరఖాస్తు ఇచ్చాడు. మూడేళ్లుగా ఇదే తంతు. ఇంతవరకు పంట రుణం లేదూ, పంటల బీమా కూడా లేదు. - ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి ఓ చిన్న సన్నకారు రైతు. ఆయనకున్న రెండున్నర ఎకరాలకు తోడు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగుచేస్తుంటాడు. పంట హామీగా రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా, ఎంతో మందితో చెప్పించినా బ్యాంకులు పట్టించుకోవడంలేదు. - కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం వెల్దిపాడు గ్రామానికి చెందిన లక్ష్మణస్వామి కూడా ఓ కౌలు రైతు. కౌలుదారుల చట్టం ప్రకారం అన్ని పత్రాలతో బ్యాంకుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దీంతో కౌలు రైతుల సంఘం సభ్యులతో ఆందోళనకు దిగి ఎట్టకేలకు బ్యాంకు నుంచి రుణం పొందారు. ..పంట రుణం పొందడానికి కౌలు రైతులు పడుతున్న ఇక్కట్లకు ఇవన్నీ సాక్ష్యాధారాలు. వారికి రుణం పెద్ద ఫార్స్గా మారింది. వ్యవసాయ శాఖ చెప్పేదానికి.. ఆచరణలో జరుగుతున్న దానికి ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. రుణ అర్హత పత్రాలు లేవు, సాగు ధృవీకరణ పత్రాలు కానరావు. మరోవైపు.. భూ యజమానులు పట్టాదార్ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్ ఇవ్వరు.. ఇన్ని ఇక్కట్ల మధ్య రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం ఉన్న 17 లక్షల మంది కౌలు రైతులు కాడీ మేడీ పట్టారు. 2011 భూ అధీకృత చట్టం ప్రకారం ఎటువంటి హామీ లేకుండా రూ.లక్ష రుణం ఇచ్చేందుకు అవకాశం ఉన్నా బ్యాంకులు పెద్దగా ముందుకు రావడంలేదు. దీంతో రుణాలు అందుతున్న వారి సంఖ్య 3.59 లక్షల మందికి మించడంలేదు. మరోవైపు.. 7–8 వేల కోట్ల రూపాయలను కౌలు రైతులకు రుణాల కింద ఇస్తామని చెబుతున్నా గత ఏడాది (ఖాతాల సర్దుబాటు సహా)ఇచ్చింది కేవలం రూ.2,600 కోట్లే. దీని ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో సాగు, రైతుల వివరాలు.. సాగు విస్తీర్ణం : 80,96,441 హెక్టార్లు రాష్ట్రంలో రైతుల సంఖ్య : 72,21,118 షెడ్యూల్డ్ కులాల రైతుల సంఖ్య : 7,13,038 షెడ్యూల్డ్ తెగల రైతుల సంఖ్య : 3,87,053 షెడ్యూల్డ్ కులాల రైతులు సాగు చేస్తున్న విస్తీర్ణం : 5,12,932 హెక్టార్లు షెడ్యూల్డ్ తెగల రైతులు సాగు చేస్తున్న విస్తీర్ణం : 4,77,432 హెక్టార్లు షెడ్యూల్డ్ కులాల చేతుల్లో సరాసరి విస్తీర్ణం : 1.80 హెక్టార్లు షెడ్యూల్డ్ తెగల చేతుల్లో సరాసరి విస్తీర్ణం : 3.08 హెక్టార్లు కౌలు రైతుల వివరాలు ఇలా.. – రాష్ట్రంలో వాస్తవ సాగుదారులు : 44 లక్షలకు పైగా – వీరిలో కౌలుదారులు : 32 లక్షల మందికి పైగా – ప్రభుత్వం చెబుతున్న లెక్క : 17 లక్షలు – కౌలుదారుల్లో అసలు భూమి లేనివారు : 7.5 లక్షల మంది – ఎకరం, అర ఎకరం లోపు : 8 లక్షలు – 3 నుంచి 5 ఎకరాల లోపు రైతులు : 7 నుంచి 8 లక్షల మధ్య (వీళ్లు 3 నుంచి 5 ఎకరాల వరకు కౌలుకు తీసుకుంటారు) – 20 ఎకరాల వరకు భూమి ఉండే రైతులు : సుమారు 10 లక్షల మంది(వీళ్లు కూడా మరో 20 ఎకరాల వరకు కౌలు చేస్తుంటారు) కౌలు రైతుకు రుణం ఇవ్వాలంటే.. – రుణ అర్హత పత్రం – పట్టాదార్ పాస్బుక్ – టైటిల్ డీడ్ – సాగు ధృవీకరణ పత్రం ఎదురయ్యే సమస్యలు.. – చాలామంది కౌలు రైతులు ఎటువంటి లిఖిత పూర్వక ఒప్పందం లేకుండా భూమిని కౌలుకు తీసుకుంటారు – కౌలు రైతుకు పంట రుణం ఇవ్వాలంటే భూమి యజమాని రుణం తీసుకోకుండా ఉండాలి – పట్టాదార్ పుస్తకం ఇచ్చేందుకు యజమాని ఇష్టపడడు. టైటిల్ డీడ్ అసలే ఇవ్వడు. అందువల్ల కౌలు రైతుకు పంట రుణం అసాధ్యంగా మారింది మరి ఎలా ఇవ్వొచ్చు.. – భూ యజమానికి రుణం కావాలంటే భూమి హామీగా ఇవ్వొచ్చు – కౌలు రైతుకు పంట హామీతో ఇవ్వొచ్చు – కౌలు రైతు, అసలు రైతు మధ్య సమన్వయం ఉండాలి – సమన్వయపరిచేలా రైతు సంఘాలు చొరవ తీసుకోవాలి చట్టం ఏమి చెబుతోంది? 2011 భూ అధీకృత సాగుదారుల చట్టం ప్రకారం ఎల్ఇసీ కార్డు, పంట హామీపై లక్ష రూపాయల వరకు కౌలు రైతులకు రుణం ఇచ్చే అవకాశం బ్యాంకర్లకు ఉంది. వ్యక్తిగత పూచీకత్తుగా వేసిన పంటను పరిగణించవచ్చు. పెట్టుబడి రాయితీ, మార్కెటింగ్ సౌకర్యాలు వంటివి కూడా కౌలు రైతుకు ఇచ్చే అవకాశం ఉంది. అయితే, అది ఆయా బ్యాంకర్ల చిత్తశుద్ధి, రైతుసంఘాల సంఘటిత శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఎల్ఇసీ కార్డులు ఉన్నప్పుడే రుణం పొందడానికి, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా, పంట నష్టపరిహారం పొందడానికి అర్హులు. ప్రస్తుత పరిస్థితి ఇదీ.. – 2018–19లో 6,13,639 మంది కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలు ఇచ్చి రుణాలు ఇవ్వాలన్నది ప్రతిపాదన – కానీ, ఇప్పటివరకు 1,72,892 మందికి మాత్రమే కొత్తకార్డులు ఇచ్చారు – 2018–19లో 5.50 లక్షల మంది కౌలు రైతులకు పంట సాగు ధృవీకరణ పత్రాలు జారీ చేయాలన్నది లక్ష్యం – ఈ ఏడాది పంట రుణాల లక్ష్యం : రూ.76,207 కోట్లు – దీర్ఘకాలిక రుణాల లక్ష్యం : రూ.30,108.71కోట్లు – ఇప్పటివరకు కౌలుదారులకు ఇచ్చినట్టు అధికారులు చెబుతున్న రుణాలు : రూ.624 కోట్లు – అనంతపురం, కర్నూలు, విజయనగరం, విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో కౌలు రైతులకు ఇంతవరకు నయాపైసా ఇవ్వలేదు. -
పంటల బీమా ప్రీమియం గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: పత్తి సహా ఇతర పంటల బీమా ప్రీమియం గడువును పెంచుతూ వ్యవసాయశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి సోమవారం జిల్లా వ్యవసాయాధికారులను ఆదేశించారు. గతంలో వ్యవసాయశాఖ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మిర్చి పంటకు ప్రీమియం చెల్లించేందుకు ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు గడువుగా నిర్ధారించారు. పత్తి పంటకు ఏప్రిల్ 1 నుంచి జూలై 15 వరకు గడువుగా పెట్టారు. ఆయిల్పామ్కు జూలై 14, బత్తాయికి ఆగస్టు 9వరకు గడువుగా ప్రకటించారు. తాజాగా ఆ తేదీలను పొడిగించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రైతుల నుంచి బీమా ప్రీమియం వసూలు చేయాలని ఆదేశించినట్లు పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకునే రైతుల నుంచి పంటల బీమా ప్రీమియాన్ని మినహాయించే పద్ధతిలో పట్టాదారు పాసు పుస్తకాలనే ప్రామాణికంగా తీసుకోవద్దన్నారు. ఇప్పటివరకు రైతుబంధు చెక్కులు తీసుకున్న ప్రతీ రైతుకూ ప్రీమియం చెల్లించటానికి అవకాశం కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు. ఖరీఫ్ సీజన్కు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై), పునరుద్ధరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్డబ్లు్యబీసీఐఎస్), యూనిఫైడ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీం (యూపీఐఎస్)లు అమలుకానున్నాయి. ఆయా బీమా పథకాలను జాతీయ బీమా కంపెనీ (ఎన్ఐసీ), టాటా ఏఐజీ సాధారణ బీమా కంపెనీ, వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ)లు అమలుచేస్తాయి. -
రైతుల కోసం నాలుగంచెల వ్యూహం
న్యూఢిల్లీ: 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి తమ ప్రభుత్వం నాలుగంచెల వ్యూహాన్ని అమలు చేస్తోందని సోమ వారం ప్రధాని మోదీ చెప్పారు. ‘పెట్టుబడి వ్యయం తగ్గించడం, వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర కల్పించడం, సాగు సమయంలోనూ, పంట చేతికొచ్చాక నష్టాలను అరికట్టడం, రైతుల ఆదాయ మార్గాలను పెంచడం.. అనే 4 వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయడం ద్వారా రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలనుకుంటున్నాం’ అని మోదీ అన్నారు. గతంలో రైతులు బలవంతంగా, అశాస్త్రీయ పద్దతుల్లో వ్యవసాయం చేయాల్సి వచ్చేదని, యూరియా కోసం రైతులు లాఠీ చార్జీలను భరించాల్సి వచ్చేదని ప్రధాని గుర్తు చేశారు. తామొచ్చాక వేప పూతతో ఉన్న యూరియాను తీసుకువచ్చామని, దీనివల్ల దిగుబడి పెరిగిందన్నారు. రైతులకు ఇప్పుడు సమగ్ర పంట బీమా పథకం అందుబాటులో ఉందన్నారు. వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగ కల్పనపై విపక్షాల రాద్ధాంతం తమ ప్రభుత్వం ఉపాధి కల్పనలో విఫలమైందంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. ఉపాధి కల్పనకు సంబంధించి నమ్మదగిన గణాంకాలు మన దగ్గర లేవన్నారు. సరైన గణాంకాలు లేకపోవడం వల్ల తమకిష్టమొచ్చినట్లుగా విమర్శలు చేసేందుకు విపక్షాలకు అవకాశం లభిస్తోందని స్వరాజ్య పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.‘గత కర్ణాటక ప్రభుత్వం తమ హయాంలో 53 లక్షల ఉద్యోగాలు కల్పించామంది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం గత హయాంలో 68 లక్షల ఉద్యోగాలు చూపించామంది. రాష్ట్రాలు ఉద్యోగాలు ఈ స్థాయిలో కల్పిస్తూ ఉంటే.. దేశంలో ఉపాధి కల్పన జరగడం లేదని ఎలా చెబుతారు?’ అని ప్రశ్నించారు. నవీన భారత దేశంలోని కొత్త ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగ కల్పనను లెక్కించే విశ్వసనీయ వ్యవస్థ లేదన్నారు. ‘దేశవ్యాప్తంగా గ్రామీణ స్థాయిలో దాదాపు 3 లక్షలమంది ఔత్సాహికులు కామన్ సర్వీస్ సెంటర్లను నిర్వహిస్తూ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వ సాయం పొందిన స్టార్ట్ అప్ కంపెనీలు దాదాపు 15 వేలున్నాయి. అవి సాధ్యమైన స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఈపీఎఫ్ఓ లెక్కల ప్రకారమే గత సంవత్సరం సంఘటిత రంగంలో 70 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. సెప్టెంబర్ 2017–ఏప్రిల్ 2018 మధ్య 41 లక్షల మంది ఉద్యోగాలు పొందారు. సంఘటిత రంగంలోనే 8 నెలల్లో 41 లక్షల ఉద్యోగాలు లభిస్తే.. అసంఘటితరంగంలో వచ్చిన కొత్త ఉద్యోగాల సంఖ్యను మీరే ఊహించండి’ అని అన్నారు. ‘ముద్ర పథకం కింద 12 కోట్ల రుణాలిచ్చాం. ఒక రుణం కనీసం ఒక్కరికైనా ఉపాధి కల్పిస్తుంది కదా!’ అన్నారు. ఆర్థిక వేత్త హయాంలోనే సర్వనాశనం యూపీఏ హయాంలో స్వయానా ఆర్థికవేత్త అయిన ఒక ప్రధాని, అన్నీ తనకు తెలుసని భావించే ఆర్థిక మంత్రి సారథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభ స్థాయికి చేరిందన్నారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నపుడు అస్థిర ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా ఉండేదని గుర్తు చేశారు. యూపీఏ వైఫల్యాలపై రాజకీయం చేయాలనుకోలేదని, అందువల్లనే నాటి ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై అప్పుడు శ్వేతపత్రం తీసుకురాలేదని వివరించారు. రాజనీతి(రాజకీయ ప్రయోజనాలు) కన్నా రాష్ట్రనీతి(దేశ ప్రయోజనాలు) ముఖ్యమని భావించానన్నారు. శాంతికి భారత్ కీలకం ప్రస్తుత అస్థిర ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు భారత్ కీలక పాత్ర పోషించగలదని మోదీ పేర్కొన్నారు. పలు దేశాల్లోని భారతీయ రాయబారులను ఉద్దేశించి న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. 3 రోజుల పాటు జరిగిన భారత రాయబారుల సదస్సులో చివరిరోజైన సోమవారం మోదీ పాల్గొన్నారు. సదస్సులో భారత విదేశాంగ విధాన ప్రాధాన్యతలపై ప్రతినిధులు చర్చించారు. కార్యక్రమంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఆ శాఖ సహాయమంత్రులు, పలువురు సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో, వివిధ అంతర్జాతీయ సంస్థల్లోని విభాగాల్లో కీలక విధులు నిర్వరిస్తున్న భారతీయ అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. -
పత్తికి ధీమా ఏదీ?
సాక్షి, హైదరాబాద్: పంటల నష్టపోతే రైతులను ఆదుకోవాల్సిన పంటల బీమా పథకం ప్రహసనంగా మారుతోంది. పత్తికి గులాబీ పురుగు సోకి నష్టం జరిగినా బీమా అందడం లేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా స్పందన లేదు. దీంతో బీమా వర్తించక రైతులు గగ్గోలు పెడుతున్నారు. గత ఖరీఫ్లో రాష్ట్రంలో 97.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా 47.72 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. అంటే రాష్ట్రంలో సాగైన పంటల్లో సగం మేర పత్తి పంటే కావడం గమనార్హం. అయితే పత్తిపై గులాబీ పురుగు దాడి చేసింది. దీంతో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్టు గుర్తించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక కూడా పంపింది. గులాబీ రంగు పురుగు ఉధృతి కారణంగా పత్తికి తీవ్ర నష్టం వాటిల్లిందని వివరించింది. కానీ వారికి పంటల బీమా కింద పరిహారం అందే పరిస్థితి లేదని.. అందువల్ల ఆ పథకంలో మార్పులు చేసి, పత్తి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కోరింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై), ఆధునీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్డబ్ల్యూబీసీఐఎస్)లను కలిపి మరో పథకాన్ని తీసుకురావాలని సూచించింది. గులాబీ రంగు పురుగు సోకిన పత్తి దిగుబడి, వాతావరణం రెండింటినీ లెక్కలోకి తీసుకొని నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. కానీ కేంద్రం నుంచి ఎటువంటి స్పందనా రాలేదని రాష్ట్ర వ్యవసాయ శా>ఖ వర్గాలు చెబుతున్నాయి. మూడో వంతు దిగుబడి నష్టం.. గతేడాది 3.30 కోట్ల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ వర్గాలు అంచనా వేశాయి. కానీ గులాబీ పురుగు, ఇతర కారణాలతో 2 కోట్ల క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదని చెబుతున్నాయి. గులాబీ పురుగుతో పత్తికి భారీగా నష్టం జరిగినట్టు ఈ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. సగటున ఎకరాకు 10–12 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి ఉండాలి. కానీ గులాబీ పురుగు కారణంగా.. గత ఖరీఫ్లో చాలాచోట్ల ఆరేడు క్వింటాళ్లకు మించి ఉత్పత్తి కాలేదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇంత నష్టం జరిగినా రైతులకు నష్టపరిహారం అందించే పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు. గులాబీ రంగు పురుగు వల్ల దెబ్బతిన్న పంటకు పరిహారం ఇవ్వకపోతే బీమా ప్రీమియం చెల్లించి ఏం ప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్కు సంబంధించి పత్తి పంటకు బీమా ప్రీమియం చెల్లించేందుకు వచ్చే నెల 15వ తేదీ వరకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో ఆలోగానే గులాబీ పురుగు సమస్యకు బీమా వర్తించేలా నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
రైతు సంక్షేమానికే తొలి ప్రాధాన్యత: మోదీ
బెంగళూరు: కర్ణాటకలోని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వం రైతు సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించిందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. పంటల బీమా పథకాన్ని అమలు చేయలేకపోయిందని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతు సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు. ఈ నెల 12న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ కిసాన్ మోర్చా కార్యకర్తలతో బుధవారం ప్రధాని ‘నరేంద్రమోదీ యాప్’ ద్వారా ముఖాముఖి నిర్వహించారు. ‘విత్తనాల కొనుగోలు నుంచి విక్రయం దాకా (బీజ్ సే బజార్ తక్) రైతుకు సాయపడటమే ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప రైతు నేత. ఆయన అపార అనుభవం, అంకితభావం కేంద్రం విధానాలకు తోడై రాష్ట్రంలో వ్యవసాయరంగానికి కొత్త ప్రేరణ ఇచ్చినట్లవుతుంది. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చి యువత కూడా సాగును వృత్తిగా స్వీకరించేలా చేస్తాం’ అని అన్నారు. -
3 కంపెనీలకు ఖరీఫ్ పంటల బీమా
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్లో రాష్ట్రంలో పంటల బీమాను అమలు చేసేందుకు మూడు కంపెనీలను వ్యవసాయశాఖ ఎంపిక చేసింది. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించగా 13 కంపెనీలు బిడ్లను దాఖలు చేశాయి. వాటిలో తక్కువ కోట్ చేసిన జాతీయ బీమా కంపెనీ (ఎన్ఐసీ), వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ), టాటా బీమా కంపెనీలను ఎంపిక చేసింది. వాటి ఆమోదం కోరుతూ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కానీ కంపెనీలు ఎంతెంత కోట్ చేశాయన్న వివరాలను వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించడంలేదు. అయితే వరి, పత్తి పంటలకు సంబంధించి గతేడాదికంటే అధికంగా పంటల బీమా ప్రీమియం ధరలు పెరిగాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఎన్ఐసీకి మూడు క్లస్టర్లు... రాష్ట్రంలో పంటల బీమా అమలుకు ప్రభుత్వం ఆరు క్లస్టర్లను ఏర్పాటు చేసింది. ఒకటో క్లస్టర్లో ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాలున్నాయి. రెండో క్లస్టర్లో నిర్మల్, నిజామా బాద్, కామారెడ్డి, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాలున్నాయి. మూడో క్లస్టర్లో పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ జిల్లాలున్నాయి. నాలుగో క్లస్టర్లో ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలు ఉన్నాయి. ఐదో క్లస్టర్లో భద్రాద్రి, వరంగల్ (అర్బన్), వరంగల్ (గ్రామీణ), వనపర్తి జిల్లాలున్నాయి. ఆరో క్లస్టర్లో మేడ్చల్, మహ బూబ్నగర్, జోగుళాంబ గద్వాల్, వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాలున్నాయి. ఇందులో ఎన్ఐసీకి ఒకటి, రెండు, ఆరో క్లస్టర్లను వ్యవసాయశాఖ కేటాయించింది. ఏఐసీకి నాలుగు, ఐదో క్లస్టర్లను, టాటాకు మూడో క్లస్టర్ను కేటాయించింది. ఖరీఫ్ ఆహారధాన్యా ల పంటలకు రైతుల నుంచి రెండు శాతం ప్రీమియాన్ని రైతులు చెల్లించాలి. పత్తి, మిర్చి సహా ఇతర వాణిజ్య, వాతావరణ ఆధారిత పంటలకు 5 శాతం ప్రీమియం రైతులు చెల్లించాలి. అయితే జిల్లాలను, అక్కడి వాతావరణ పరిస్థితులనుబట్టి ప్రీమియం రేటు మారుతుంటుంది. పత్తికి గులాబీరంగు పురుగు సోకి పంట నాశనమైతే మాత్రం బీమా కంపెనీలు పరిహారం చెల్లించడం లేదు. -
రబీ పంటల బీమా ఖరారు
సాక్షి, హైదరాబాద్: రబీలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్బీవై), పునర్వ్యవస్థీకరించిన వాతావరణ పంటల బీమా పథకాలను అమలు చేసేందుకు వ్యవసాయశాఖ బుధవారం నోటిఫికేషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 30 జిల్లాలను ఆరు క్లస్టర్లుగా విభజించి ఐదు ప్రైవేటు కంపెనీలకు పంటల బీమా అమలుచేసే బాధ్యత అప్పగించింది. ఒక్కో క్లస్టర్లో ఐదు జిల్లాలను చేర్చారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోని రైతులు ఇష్టమైతేనే బీమా తీసుకోవచ్చు. బ్యాంకు రుణాలు తీసుకునే రైతులు తప్పనిసరిగా పంటల బీమా ప్రీమియాన్ని చెల్లించాల్సిందే. పీఎంఎఫ్బీవై పథకంలో వరి, జొన్న, మొక్కజొన్న, పెసర, మినుములు, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఎర్ర మిరప, ఉల్లిగడ్డ, నువ్వుల పంటలకు బీమా అమలుచేస్తారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బీమా మొత్తాన్ని ఖరారు చేస్తారు. -
గత ఖరీఫ్ బీమా రూ. 158 కోట్లు
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది ఖరీఫ్లో రైతులు చెల్లించిన పంటల బీమాలకు సంబంధించిన పరిహారం సొమ్ము విడుదలైంది. మొత్తం 1.95 లక్షల మంది రైతులకు రూ. 158.58 కోట్లు పరిహారంగా చెల్లించాలని పలు బీమా కంపెనీలు తేల్చాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద రూ. 95.25 కోట్లు, వాతావరణ ఆధారిత పంటల బీమా కింద రూ. 63.33 కోట్లు ఇవ్వనున్నారు. సొమ్మును వచ్చే నెల 9వ తేదీలోగా రైతులకు చెల్లించాలని వ్యవసాయశాఖ బుధవారం ఆదేశించింది. ఈ మేరకు కంపెనీలు, అధికారులతో ఆ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి సమీక్ష నిర్వహించారు. -
పెరిగిన వేరుశనగ సాగు
4.10 లక్షల హెక్టార్లకు చేరుకున్న విస్తీర్ణం మరో 1.10 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు అనంతపురం అగ్రికల్చర్: వేరుశనగ పంట విస్తీర్ణం 4.10 లక్షల హెక్టార్లకు పెరిగింది. వ్యవసాయశాఖ తాజాగా తయారు చేసిన నివేదిక ప్రకారం వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 6.04 లక్షల హెక్టార్లు కాగా...ప్రస్తుతం 4.10 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. ఇందులో నీటి వసతి కింద 12 వేల హెక్టార్లు, వర్షాధారంగా 3.98 లక్షల హెక్టార్లలో విత్తుకున్నారు. మరో 1.10 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఇతరత్రా పంటలు సాగులో ఉన్నాయి. మొత్తమ్మీద ఈ ఖరీఫ్లో 8.01 లక్షల హెక్టార్ల సాధారణ సాగుకు గానూ ఇప్పటివరకు అన్ని పంటలు కలిపి 5.20 లక్షల హెక్టార్లు సాగులో ఉన్నాయి. ఇంకా ప్రత్యామ్నాయ పంటలు వేసే అవకాశం ఉన్నందున విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. వేరుశనగ తర్వాత 48 వేల హెక్టార్లలో కంది, 30,100 హెక్టార్లలో పత్తి , 10,600 హెక్టార్లలో మొక్కజొన్న, 6,600 హెక్టార్లలో ఆముదం, 2,200 హెక్టార్లలో జొన్న, 2,700 హెక్టార్లలో సజ్జ , 1,600 హెక్టార్లలో కొర్ర, 1,100 హెక్టార్లలో ఉలవ వేశారు. ఇక వరి పంట ప్రస్తుతానికి 3,400 హెక్టార్లలో నాట్లు వేయగా ఇది మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. -
పంటల బీమాపై ప్రచారం చేయండి
జిల్లా వ్యవసాయాధికారులకు పోచారం ఆదేశం సాక్షి, హైదరాబాద్ : పంటల బీమా ప్రాధాన్యం, గడువు తేదీలను గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల్లో రుణం పొందిన, పొందని రైతులు పంటల బీమా సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం ఆయన జిల్లా వ్యవసాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసార«థి, కమిషనర్ జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే 18వ తేదీ నాటికి రైతు సమగ్ర సర్వే నివేదికను తమకు పంపాలని ఆదేశించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని సమగ్రంగా అమలు చేయాలని, ప్రణాళికాబద్ధంగా రైతులకు లబ్ధి చేకూర్చాలని సూచించారు. రుణమాఫీ సొమ్ము ఇప్పటివరకు రైతు ఖాతాల్లో జమ చేయకుంటే తక్షణమే జమ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. పంట నష్టపరిహారం రైతు ఖాతాకు చేరేలా చూడాలని అన్నారు. సూక్ష్మ సేద్యంలో ఉద్యాన పంటలకు ప్రాధాన్యం... సూక్ష్మ సేద్య పరికరాల మంజూరులో ఉద్యాన పంటలకు అధిక ప్రాధాన్యం కల్పించాలని వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీ కల్పిస్తున్నందున దీనిపై విస్తృత ప్రచారం కల్పిస్తూ దరఖాస్తు చేసుకున్న వారందరికీ లబ్ధి చేకూరేలా చూడాలని అన్నారు. ఎప్పటికప్పుడు పంట ప్రణాళిక, పంటల నిర్వహణకు సంబంధించిన సూచనలను సమయానుకూలంగా రైతులకు అందించాలని సూచించారు. శనివారం ఆయన ఉద్యానశాఖ జిల్లా అధికారులు, సూక్ష్మ సేద్య కంపెనీల ప్రతినిధులతో సమీక్షించారు. సమీక్షలో ఉద్యాన కమిషనర్ ఎల్.వెంకట్రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏదో ఒకటే..!
► బీమాకు ఇన్పుట్ సబ్సిడీకి లింకు ► మరోసారి రైతులపై సర్కారు చిన్నచూపు ► అన్నదాతలకు తప్పని ఇబ్బందులు టీడీపీ సర్కార్ రైతులను మొదటినుంచి నయవంచనకు గురిచేస్తోంది. రుణమాఫీ విషయంలో మాట తప్పిన సీఎం.. ఇప్పుడు పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీలపై వారిని నిలువునా ముంచేందుకు సిద్ధమయ్యారు. ఒకవైపు అన్నదాతకు మేలు చేసే ప్రభుత్వమని చెబుతూనే మరోవైపు వారిని చిన్నచూపు చూస్తున్నారు. వేంపల్లె : పంటల బీమా అందిన వారికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు వీల్లేదని..అందుకు సంబంధించిన ఆదేశాలను ప్రభుత్వం జిల్లాస్థాయి ఉన్నతాధికారులకు పంపింది. దీంతో అధికారులు ఆయా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతుల వివరాలను సేకరిస్తున్నారు. ఎవరికైతే పంటల బీమా వస్తుందో.. ఆ రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా కేవలం బీమాతో సరిపెట్టాలనే యోచనలో ఉన్నారు. ఈనెల 19వ తేదీనుంచి సంబంధిత పత్రాలు గ్రామ సభల ద్వారా ఇస్తామని అధికారులు చెబుతూనే.. అందులో మొత్తానికి సంబంధించిన కాలం ఖాళీగా ఉంచారు. బ్యాంకుల వివరాలు ఇచ్చిన తర్వాత రైతుకు ఇన్పుట్ సబ్సిడీ అందుతుందా.. పంటల బీమా చేతికి వస్తుందా.. లేదా అనే విషయాన్ని గమనించి ఆ కాలాన్ని పూరించనున్నారు. 2016 ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.77కోట్లు పత్తి, వేరుశనగ, కంది, వరి పంటలకు మంజూరైంది. వేరుశనగకు రూ.62కోట్లు, మిగతా పంటలకు రూ.15కోట్లు వచ్చింది. అయితే ఇన్పుట్ సబ్సిడీకి, పంటల బీమాకు లింక్ పెట్టారు. ఉదాహరణకు హెక్టార్కు ఇన్పుట్ సబ్సిడీ రూ.15.. 2హెక్టార్లకు రూ.30వేలు ఉందనుకుందాం. బ్యాంకులో తీసుకున్న పంట రుణానికి రూ.40వేలు బీమా వస్తే ఆ రైతుకు ఇన్పుట్ సబ్సిడీ అందే పరిస్థితి లేదు. కేవలం బీమా మొత్తంతోనే సరిపెట్టుకోవాలి. ఇక వాతావరణ బీమా వేరుశనగ పంటకు మాత్రమే రూ.56కోట్లు మంజూరైంది. ఇదెక్కడి న్యాయం రైతులు బ్యాంకులో తీసుకున్న పంట రుణం రూ.10వేలకు రూ.400నుంచి రూ.500 లెక్కన బీమా మొత్తాన్ని చెల్లిస్తారు. పంటల బీమా సంస్థలు ప్రైవేట్ సంస్థలుగా ఉన్నాయి. రైతులు తమ సొంత డబ్బులను బీమా ప్రీమియం కింద చెల్లిస్తే దీనికి, ఇన్పుట్ సబ్సిడీకి లింక్ పెట్టడం ఏమిటని రైతులు మండిపడుతున్నారు. రుణమాఫీ విషయంలో మాట తప్పిన చంద్రబాబు మరోసారి రైతులపై ఉక్కుపాదం మోపుతున్నారని.. ఇది ఎంతవరకు సమంజసమని అంటున్నారు. ఈవిషయమై ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వంపై పోరాటం చేయాలని రైతులు కోరుతున్నారు. పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ మొత్తాలు ఇప్పుడే రైతులకు అందే పరిస్థితి కనిపించలేదు. సుమారు మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. జిల్లాలో 61మంది రైతులు ఉన్నారు. వీరి వివరాలను ఆయా బ్యాంకులనుంచి వ్యవసాయశాఖాధికారులు తెప్పించుకోవాలి. వీరికి పంటల బీమా ఏ మేరకు పోతుందో పరిశీలించాలి. తర్వాత బీమా రూ.30వేలలోపు ఉన్న రైతులను ఎంపిక చేసి ఇన్పుట్ సబ్సిడీ అందించనున్నారు. చంద్రబాబు మాత్రం మంగళవారం ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేస్తున్నామని చెప్పినా.. రైతులకు మాత్రం అందే పరిస్థితిలేదు. రైతులంటే చంద్రబాబుకు చులకన.. సీఎం చంద్రబాబుకు రైతులంటే చులకన. వర్షాభావంతో అల్లాడుతుంటే ఆదుకోకుండా ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం మంచిపద్దతి కాదు. ఇన్పుట్ సబ్సిడీ, బీమా రెండు దక్కితే కానీ రైతులు పంటలు సాగు చేసే పరిస్థితి లేదు. –ఎస్.మధుసూదన్రెడ్డి(రైతు), నాగూరు రైతులు క్షమించరు.. చంద్రబాబు ప్రభుత్వాన్ని రైతులు క్షమించే పరిస్థితిలేదు. మోసపూరిత విధానాలతో ఇబ్బంది పెడుతున్నారు. మోసం చేస్తే పుట్టగతులు ఉండవు. ఇప్పటికైనా నిర్ణయాన్ని మార్చుకోవాలి. ఇన్పుట్ సబ్సిడీ, బీమాకు రెండూ అందజేయాలి. –సి.చిన్నగంగన్న(రైతు), కత్తలూరు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి.. ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా పంపిణీ విషయంపై ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆదేశాలు అందాయి.రెండు హెక్టార్లకు ఇన్పుట్ సబ్సిడీ రూ.30వేలు రైతుకు అందుతుంది. ఈ మొత్తం అందే వారికి బీమా వస్తే ఇన్పుట్ సబ్సిడీ రాదు. ఇప్పటికే బ్యాంకులనుంచి వివరాలు తెప్పించుకుంటున్నాం. ఈనెల 19వ తేదీ నుంచి పత్రాలు రైతులకు అందజేసి ఎవరికి ఎంత మొత్తంలో అందుతుందో ఆయా మండల వ్యవసాయాధికారులు తెలియజేస్తారు. ప్రభుత్వ ఆదేశాలను తాము తప్పకుండా పాటించాల్సి ఉంది. – ఠాగూర్ నాయక్ (వ్యవసాయ శాఖ జేడీ), కడప -
'టీడీపీ నిర్వాకం వల్లే భీమా రాలేదు'
కడప: టీడీపీ సర్కార్ నిర్వాకం వల్లే 2012 సంవత్సరానికి రావాల్సిన పంటల భీమా సొమ్ము రాలేదని కడప పార్లమెంట్ సభ్యుడు అవినాష్రెడ్డి ఆరోపించారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంలో ఏపీ ప్రభుత్వం తాత్సారం చేసినందువల్లే రైతులకు రావాల్సిన పంటల భీమా నగదు విడుదల కాలేదని చెప్పారు. ఫలితంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్రానికి వెంటనే లేఖ రాసి 2012 సంవత్సరానికి రావాల్సిన పంటల భీమా సొమ్ము వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు -
బీమా పరిధిలోకి 40 శాతం పంటలు
సాక్షి, హైదరాబాద్: పంటల బీమాను రైతులకు మరింత చేరువ చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) ద్వారా మరింత పరిహా రం అందేలా చర్యలు చేపడుతున్నామని.. అందులో భాగంగా 2017–18 వ్యవసా య సీజన్లో బీమా కవరేజీ 40 శాతం లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించింది. అలాగే 2018–19 నాటికి 50 శాతానికి చేరుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇటీవల ఢిల్లీలో రెండ్రోజులపాటు జరిగిన రాష్ట్రాల వ్యవసాయ ఉన్నతాధికారుల సదస్సులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ జగన్మోహన్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఏడాది నుంచి బీమాకు ఆధార్ను అనుసం ధానం చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 2016–17 ఖరీఫ్లో 6.70 లక్షల మంది రైతులు బీమా ప్రీమియం చెల్లించారు. మొత్తం 14.47 లక్షల ఎకరాల్లో పంటలకు బీమా చేశారు. అంటే 15 శాతం సాగు భూమికి మాత్రమే బీమా చేయించినట్లయింది. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద పత్తికి ప్రీమియం చెల్లించే గడువును జూలై 15వ తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. గతంలో ఈ గడువు జూన్ 14 వరకే ఉండేది. ఇక ఇతర పంటలకు జూలై 31ని, వరికి ఆగస్టు 31ని ప్రీమియం చెల్లింపు గడువుగా నిర్ణయించారు. -
రైతులకు శఠగోపం!
⇒పంటల బీమాతో పెట్టుబడి రాయితీ ముడి ⇒రూ.500 కోట్లు నష్టపోనున్న అన్నదాతలు ⇒అనంతపురం జిల్లా వేరుశనగ రైతులకు రూ.370 కోట్లు నష్టం అమరావతి: రాష్ట్రంలో కరువుబారిన పడి అల్లాడుతున్న రైతుల నెత్తిన మరోమారు శఠగోపం పెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పంటల బీమాకు, పెట్టుబడి రాయితీకి ముడిపెట్టి అన్నదాతలకు రూ.500 కోట్లు ఎగవేసేందుకు కుట్ర పన్నింది. 2016 ఖరీఫ్ సీజన్కు సంబంధించిన పెట్టుబడి రాయితీ ఇవ్వకుండా మొండిచేయి చూపేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ మౌఖిక ఆదేశాల మేరకు పంటల బీమా, పెట్టుబడి రాయితీ కలిపి ఇచ్చేందుకు అధికారులు నివేదిక రూపొందించినట్లు సమాచారం. దీనివల్ల కరువుకు మారుపేరైన రాయలసీమ రైతులు దారుణంగా నష్టపోవాల్సి వస్తుంది.ఒక్క అనంతపురం జిల్లా వేరుశనగ రైతులే రూ.370 కోట్లకుపైగా పెట్టుబడి రాయితీని కోల్పోవాల్సి వస్తుందని అంచనా. హక్కులను హరించడమే పంటల బీమా, పెట్టుబడి రాయితీని ముడిపెట్టడ మంటే రైతుల హక్కులను హరించడమే. రైతులు ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ చేసుకుంటే వచ్చేది పంటల బీమా. విపత్తుల వల్ల పంట దెబ్బతింటే మళ్లీ సాగు చేసుకోవడానికి చట్టబద్ధంగా ఇవ్వాల్సింది పెట్టుబడి రాయితీ. రెండింటినీ పొందే హక్కు రైతులకు ఉంది. అయితే, పంట కోల్పోయిన రైతులకు ఏదైనా ఒకదాని కిందే పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘‘ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోకపోతే ఈ ఏడాది రైతులకు జరిగే నష్టం రూ.500 కోట్లు. ఇది ఈ ఏడాదికే పరిమితం కాదు. ఏటా రైతులు ఇలాగే నష్టపోవాల్సి వస్తుంది. అందువల్ల దీనికి వ్యతిరేకంగా పోరాడాలి’’ అని పేర్కొంటున్నారు. హెక్టార్కు గరిష్టంగా రూ.15,000 ప్రస్తుతం విపత్తుల వల్ల వేరుశనగ పంట దెబ్బతింటే హెక్టార్కు రూ.15 వేలు పెట్టుబడి రాయితీ అమల్లో ఉంది. గత ఖరీఫ్లో రాయలసీమలో వేరుశనగ పంట 90 శాతానికి పైగా ఎండిపోయింది. బీమా కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి హెక్టార్కు గరిష్టంగా రూ.16,000 చెల్లించాలని లెక్కగట్టారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులకు చెల్లించేందుకు బీమా సంస్థ రూ.576 కోట్లు మంజూరు చేసింది. అయితే, ప్రభుత్వం పంటల బీమా, పెట్టుబడి రాయితీ కలిపి హెక్టార్కు రూ.15,000 చొప్పున చెల్లించాలని నివేదికలు రూపొందించింది. ఒక రైతుకు పంటల బీమా హెక్టార్కు రూ.11,000 వచ్చిందనుకుంటే దానికి రూ.4,000 పెట్టుబడి రాయితీ కలిపి రూ.15,000 చెల్లిస్తారు. బీమానే రూ.15,000 వస్తే పెట్టుబడి రాయితీ అస్సలు ఇవ్వరు. పంటల బీమా, పెట్టుబడి రాయితీని కలపడమంటే బీమా చేసిన వారిని, చేయని వారిని ఒకే గాటన కట్టినట్లవుతుందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అంటున్నారు. రూ.576 కోట్ల పంటల బీమా మంజూరైనప్పటికీ ఇంకా రైతులకు చెల్లించకపోవడానికి కారణం పెట్టుబడి రాయితీని ఎగ్గొట్టాలని నిర్ణయించడమేనని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మాట మార్చిన చంద్రబాబు నాయుడు హరియాణా ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా నేతృత్వంలోని ముఖ్యమంత్రుల సాధికార కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం రైతులకు పెట్టుబడి రాయితీతో సంబంధం లేకుండా హెక్టార్కు రూ.15,000 నష్టపరిహారం చెల్లించాలంటూ ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు నాయుడు 2010లో హైదరాబాద్లో దీక్ష చేశారు. దీనికి జాతీయ స్థాయి నేతలను సైతం ఆహ్వానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నష్టపరిహారం అంశాన్ని మర్చిపోయారు. పైపెచ్చు పంటల బీమా, పెట్టుబడి రాయితీకి ముడిపెట్టారు. రెతన్నలకు అన్యాయం చేస్తున్నారు. వేర్వేరుగానే ఇవ్వాలి.. ‘‘ప్రస్తుత విధానం ప్రకారం రైతులకు పెట్టుబడి రాయితీ, పంటల బీమాను వేర్వేరుగానే ఇవ్వాలి. పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా పెట్టుబడి రాయితీని పెంచాలి. ప్రస్తుతం ఇస్తున్న పెట్టుబడి రాయితీ సాగు ఖర్చులకు ఏమాత్రం సరిపోదు. ఖర్చులకు సమానంగా పెట్టుబడి రాయితీని నిర్ధారించాలి. పెట్టుబడి రాయితీ, పంటల బీమాను కలిపేయొద్దు’’ – రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెబుతారు ‘‘పంట నష్టపోగానే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవడానికి ఇవ్వాల్సింది పెట్టుబడి రాయితీ. రైతులు ప్రీమియం చెల్లించినందుకు వచ్చేది పంటల బీమా. విపత్తుల వల్ల పంటలు దెబ్బతిన్నందుకు ఇవ్వాల్సింది నష్ట పరిహారం. నష్ట పరిహారం ఎటూ ఇవ్వడం లేదు. ఎప్పటి నుంచో వేర్వేరుగా ఇస్తున్న పంటల బీమా, పెట్టుబడి రాయితీని కలిపేసి, రైతులకు ఒక్కటే ఇవ్వాలని నిర్ణయించడం దారుణం. పెట్టుబడి రాయితీ గురించి అడిగితే వారంలో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఇప్పుడు కొత్త నాటకం మొదలుపెట్టిన ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెబుతారు’’ – నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు -
పంట బీమాపై రైతుల అనాసక్తి
⇒ ఈ రబీలో బీమా చేయించిన రైతులు లక్షన్నర మందే ⇒ కేంద్ర వ్యవసాయ శాఖ నివేదిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటల బీమా పై రైతులు అనాసక్తి చూపుతున్నారు. ఈ విషయంలో దేశంలోని వివిధ రాష్ట్రాల కంటే తెలంగాణ వెనుకబాటులో ఉంది. 2016–17 రబీ సీజన్లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై), వాతావరణ ఆధా రిత పంటల బీమా పథకం (డబ్ల్యూబీసీ ఐఎస్) ద్వారా రాష్ట్రంలో కేవలం 1.56 లక్షల మంది రైతులు మాత్రమే బీమా చేయించు కున్నారు. అందులో బ్యాంకు రుణం తీసుకు నే రైతులు 1.46 లక్షల మంది కాగా.. రుణం తీసుకోని రైతులు 10 వేల మంది ఉన్నారు. వీరు రూ.34.26 కోట్లు ప్రీమియం చెల్లించా రని కేంద్ర వ్యవసాయ శాఖ మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మొత్తంగా 7.7లక్షల ఎకరాలకు బీమా చేయించారు. ఈసారి ప్రైవేటు కంపెనీలే బీమా చేయించడంతో రైతులు ముందుకు రాలేదని తెలుస్తోంది. ముందున్న పక్క రాష్ట్రాలు.. దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 36.26 లక్షల మంది రైతులు రబీలో పంటల బీమా చేయించారు. ఆ తర్వాత రాజస్థాన్లో 30.76 లక్షల మంది, మధ్యప్రదేశ్లో 28.80 లక్షల మంది, బిహార్లో 11.54లక్షల మంది రైతులు పంటల బీమా చేయించారు. హరి యాణాలోనూ 5.75లక్షల మంది, అలాగే తమిళనాడులో 15.19 లక్షల మంది, కర్ణాటక లో 11.72 లక్షల మంది, మహారాష్ట్రలో 8.05 లక్షల మంది బీమా చేయించారు. ఏపీలోనూ 1.44 లక్షల మంది రైతులే పంట బీమా చేయించారు. నష్టపరిహారం సకాలంలో రాక పోవడంతో రైతులు ఆసక్తి చూపడంలేదని అధికారులు చెబుతున్నారు. -
ఉచిత గ్యాస్కు ఆధార్ తప్పనిసరి
ఆధార్నంబర్ లేని మహిళలు మే 31లోగా దరఖాస్తు చేసుకోవాలి న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత వంటగ్యాస్ (ఎల్పీజీ) కనెక్షన్ పొందాలనుకునే నిరుపేద మహిళలు తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. గత ఏడాది అక్టోబర్లో ఎల్పీజీ సబ్సిడీలు పొందే ప్రతిఒక్కరికీ విశిష్ట గుర్తింపు సంఖ్యను తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. తాజాగా దారిద్య్రరేఖకు దిగువున ఉన్న కుటుంబాల మహిళలు ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు కూడా ఆధార్ను తప్పనిసరి చేసింది. స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందజేసే లక్ష్యంతో.. మూడేళ్లలో ఐదు కోట్ల మంది నిరుపేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు గత ఏడాది ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై)కు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఓ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పీఎంయూవై కింద ప్రయోజనం పొందాలని భావించే లబ్ధిదారు ఆధార్ నంబర్ను కలిగి ఉన్నట్టుగా ధ్రువీకరణ పత్రం సమర్పించాలని లేదా ఆధార్ కోసం నమోదు చేసుకోవాలంది. ఆధార్ లేనివారు మే 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. పంట బీమాకూ... న్యూఢిల్లీ: రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచి పంటల బీమా పొందే రైతులకు ఆధార్ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తమ ఈ నిబంధనకు కట్టుబడి ఉండాలని కేంద్ర వ్యవసాయ శాఖ గ్రామీణ ఆర్థిక సంస్థల(ఆర్ఎఫ్ఐ)కి ఆదేశాలు జారీచేసింది. ‘వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న పంటల బీమా సౌకర్యం పొందుతున్న రైతులంతా 2017 ఖరీఫ్ నుంచి ఆధార్ వివరాలు సమర్పించాలి’ అని ఆదేశాల్లో పేర్కొన్నారు. రైతులు బ్యాంకును సందర్శించినపుడు లేదా రుణాలు మంజూరు చేసే సమయంలో ఆధార్ సమర్పించేలా వారిని ఒప్పించాలని బ్యాంకులను కోరారు. ఆధార్ లేని రైతులు దాన్ని పొందే వరకూ బ్యాంక్ పాస్బుక్, ఓటర్ గుర్తింపు కార్డు, ఉపాధి హామీ కార్డు, ఆధార్ దరఖాస్తు కాపీతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గుర్తింపు కార్డులను చూపి బీమా ప్రయోజనాలు పొందవచ్చన్నారు. -
రైతు యూనిట్గా పంటల బీమా
• అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం ఒప్పుకుంది • ఈ సీజన్ నుంచే అమలు: పోచారం సాక్షి, హైదరాబాద్: గతేడాది రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్లు చేసిన తీర్మానం ప్రకారం రైతు యూనిట్గా పంటల బీమా అమలు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒప్పుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆ మేరకు ఈ సీజన్ నుంచే వ్యక్తిగతంగా పంట నష్టపోతే రైతుకు బీమా పరిహారం అందుతుందన్నారు. అందువల్ల రైతులు ప్రీమియం చెల్లించడానికి వెనుకాడవద్దని విజ్ఞప్తి చేశారు. వడగళ్లు, అకాల వర్షాలు, కోత తర్వాత పంటకు నష్టం వాటిల్లితే రైతు యూనిట్గా పంటల బీమా అందుతుందన్నారు. ఆదర్శ రైతు సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో రైతు దినోత్సవం జరిగింది. పోచారం మాట్లాడుతూ... రైతు యూనిట్గా పంటల బీమాకు కేంద్రం అంగీకరించడం తెలంగాణ ప్రభుత్వ ఘనతేనన్నారు. అలోవేరా, ఉసిరి వంటి ఔషధ పంటలు పండించడానికి... వాటిని కొనుగోలు చేయడానికి పతంజలి సంస్థ ముందుకు వచ్చిందన్నారు. ఈ మేరకు రాందేవ్బాబాతో ఎంపీ కవిత చర్చలు జరిపారన్నారు. అలోవేరా, ఉసిరి ప్రాసెసింగ్కు హైదరాబాద్లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు పతంజలి ముందుకు వచ్చిందన్నారు. కోటి ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రభుత్వం అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిందన్నా రు. రాబోయే రోజుల్లో రైతులకు 24 గంటల కరెంటును ఉచితంగా ఇస్తామన్నారు. వెయ్యి ఏఈవో పోస్టుల భర్తీ కొత్తగా వెయ్యి వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో) పోస్టుల భర్తీ చేపడుతామని పోచారం వెల్లడించారు. కొందరు కోర్టుకు వెళ్లడంతో ప్రక్రియ నిలిచిందని, కోర్టు తదుపరి ఉత్తర్వులు రాగానే భర్తీ చేస్తామన్నారు. యాసం గిలో 12లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా... ప్రస్తుతం తమ వద్ద 9 లక్షల మెట్రిక్ టన్నులు సిద్ధంగా ఉన్నాయన్నారు. సూక్ష్మసేద్యం కోసం రైతుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని... వారందరికీ సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం నాబార్డు రుణం రూ.874 కోట్లు సహా మొత్తం రూ.1,092 కోట్లు ఖర్చు చేయనుందని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఉద్యాన సంస్థలో ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాలనగానే రాజకీయ విమర్శలు పెరిగాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తిట్టుకునేది.. కొట్టుకునేది ఏమైనా ఉంటే బయటే చూసుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతులకు మంత్రి అవార్డులు అందజేశారు. ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్రావు, రసమయి బాలకిషన్, కర్నె ప్రభాకర్, ఎల్.వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పంట బీమాకు ని‘బంధనాలు’!
• పీఎంఎఫ్బీవైతో ఆశించిన ప్రయోజనం లేదు: పోచారం • బీజేపీ అభ్యంతరం.. పోచారం క్షమాపణకు డిమాండ్ సాక్షి, హైదరాబాద్: పాత పంటల బీమా పథకంలో సవా లక్ష నిబంధనలతో రైతులకు ప్రయోజనం కలగలేదని, కేంద్రం కొత్తగా అమల్లోకి తెచ్చిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) పథకం కూడా ఆశించిన ప్రయోజనాన్ని కలిగించలేకపోతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పథకం ద్వారా రిలయన్స్, బజాజ్ తదితర 16 ప్రైవేటు బీమా కంపెనీలను కేంద్రం ప్రోత్సహించిందన్నారు. రాష్ట్రంలో పీఎంఎఫ్బీవై అమలుపై బీజేపీ సభ్యులు కిషన్రెడ్డి, కె.లక్ష్మణ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో లేవనెత్తిన ప్రశ్నలకు పోచారం సమాధానమిచ్చారు. రైతులకు ప్రయోజనం కలిగించేందుకు నిబంధనలను సవరించాలని కేంద్రాన్ని కోరారు. పీఎంఎఫ్బీవై లోపాలను పోచారం ఎండగట్టడంపై బీజేపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పోచారం క్షమాపణ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. -
అందని రుణం.. దక్కని బీమా!
* ప్రధానమంత్రి పంటల బీమా పథకం గడువు పూర్తి * 35 శాతం కూడా పంట రుణాలు ఇవ్వని బ్యాంకులు సాక్షి, హైదరాబాద్: పంటల బీమా ప్రమాదంలో పడింది. బ్యాంకులు సహకరించకపోవడంతో అది రైతుకు ధీమా ఇవ్వలేకపోతోంది. ఖరీఫ్లో బ్యాంకులు పూర్తిస్థాయిలో పంట రుణాలు ఇవ్వకపోవడంతో అనేకమంది రైతులు బీమా ప్రీమియం చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు పంటల బీమాను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ప్రధానమంత్రి పంటల బీమా పథకం(పీఎంఎఫ్బీవై) కోసం రైతులు చెల్లించాల్సిన ప్రీమియం గడువు ఆదివారం ముగి యడంతో వ్యవసాయశాఖ ఆందోళన చెందుతోంది. బ్యాంకు నుంచి పంట రుణం తీసుకున్నా, తీసుకోకపోయినా గడువులోగా ప్రీమియం చెల్లించిన రైతుల పంటలకే బీమా వర్తిస్తుంది. బ్యాంకులు 35 శాతం మంది రైతులకు కూడా రుణాలు ఇవ్వలేదు. అయితే, రైతులందరికీ రుణాలు ఇచ్చినా, ఇవ్వకున్నా వారి రుణ ఖాతాల నుంచి ప్రీమి యం సొమ్మును జూలై 31లోగా మినహా యించుకోవాలని కేంద్రం బ్యాంకులకు సూచించింది. వెంటనే ప్రీమియం సొమ్ము ను మినహాయించుకున్నట్లు రైతు రుణఖాతాలో రాయాలని పేర్కొంది. అయితే ఎన్ని బ్యాంకులు అలా మినహాయించుకున్నట్లు రాశాయో ఎవరికీ తెలియదు. కొన్నిచోట్ల పంట రుణాలు ఇవ్వడంలో విఫలమైనా, పంటల బీమా కోసం మాత్రం రైతు ఖాతాల్లోంచి ప్రీమియం సొమ్ము మినహాయించుకున్నట్లు సమాచారం. రూ. 6 వేల కోట్లకు మించని రుణాలు ఈ ఖరీఫ్లో రైతులకు రూ.17,460 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ, ఇప్పటివరకు రూ.6 వేల కోట్లకు మించి ఇవ్వలేదని వ్యవసాయశాఖ పేర్కొంది. పంట రుణం తీసుకున్న 35 శాతం మంది నుంచే పూర్తిస్థాయిలో బీమా ప్రీమియం సొమ్మును బ్యాంకులు మినహాయించాయి. రుణమాఫీ పథకం మూడో విడత కింద రూ.4,250 కోట్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 2019.99 కోట్లే విడుదల చేసిందని, రుణమాఫీ నిధులు త్వరగా రాకపోవడం వల్లే పంట రుణాల పంపిణీలో జాప్యం జరిగిందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఖరీఫ్ పంట రుణాల పంపిణీకి సెప్టెంబర్ 30 వరకు గడువుందని బ్యాంకులు చెబుతున్నాయి. రైతు చెల్లించాల్సిన ప్రీమియం సొమ్మును బ్యాంకులు ముందస్తుగా బీమా కంపెనీలకు చెల్లించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పచ్చ సైంధవులు..!
♦ మూడేళ్లుగా పంటల బీమా కోసం రైతుల ఎదురుచూపులు ♦ కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి నేతృత్వంలో అవిశ్రాంత పోరాటం ♦ రూ.44కోట్లు మంజూరైనా ఖాతాలకు జమకాకుండా పెండింగ్ ♦ వైఎస్సార్సీపీకి పేరు వస్తుందని టీడీపీ నేతల కొర్రి దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లుగా శనిగ రైతుల పరిస్థితి తయారైంది. కేంద్రం నుంచి బీమా ప్రీమియం నిధులు మంజూరైనా రైతుల ఖాతాలకు జమకాకుండా టీడీపీ అడ్డుపుల్ల వేస్తోంది. రైతులకు న్యాయంగా దక్కాల్సిన బీమా కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తే.. వచ్చిన మొత్తాన్ని రైతుల ఖాతాలకు జమ కాకుండా జిల్లాకు చెందిన పచ్చనేతలు ముగ్గురు రైతుల పాలిట సైంధవులుగా నిలిచారు. వైఎస్ఆర్సీపీకి ఆ క్రెడిట్ దక్కుతుందని దాదాపు నెలరోజులుగా రూ.44కోట్లు రైతుల ఖాతాకు పడకుండా చక్రం తిప్పుతున్నారు. సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో 2012-13 సంవత్సరానికి శనగ రైతులకు రావాల్సిన పంటలబీమా పరిహారం ఇంతవరకూ అందలేదు. మూడేళ్లుగా ఆ డబ్బుల కోసం రైతులు ఎన్నో పోరాటాలు చేస్తూ వచ్చారు. చెల్లించిన ప్రీమియంకు బీమా దక్కక ఆవేదనలో ఉన్న రైతులకు వెస్ఆర్సీపీ అండగా నిలిచింది. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఈ విషయమై ఏఐసీ అధికారులతో అనేక పర్యాయాలు చర్చించారు. అదేరీతిలో వ్యవసాయశాఖ కమిషనర్తో మంతనాలు చేపట్టారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఏఐసీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఇలా రాష్ట్ర పరిధిలో ఉన్న అడ్డంకులను చేధించుకుని ఏఐసీ జీఎం రాజేశ్వరీ ద్వారా ఢిల్లీలోని కేంద్రకార్యాలయానికి ప్రతిపాదనలు పంపించారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితోనూ, కేంద్ర వ్యవసాయశాఖ జాయింట్ సెక్రెటరీతోనూ ప్రత్యేకంగా కలిసి సమస్య వివరించారు. ఈ నేపథ్యంలో రూ.132కోట్లు మంజూరుకు ఏఐసీ నిర్ణయం తీసుకుంది. తొలివిడతగా 17,161మంది శనగ రైతులకు రూ.88 కోట్లు బీమా మొత్తం జమ అయింది. రెండవ విడతగా 11,286 మంది రైతులకు రూ.44కోట్లు బీమా మొత్తం జూన్ 21న మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతోరైతులు సైతం కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని కృషిని కొనియాడారు. అడ్డుచక్రం సంధించిన ఆ ముగ్గురు.. బీమా ప్రీమియం అన్నదాతల ఖాతాల్లో జమయితే వైఎస్సార్సీపీకీ పేరు వస్తుందని ‘పచ్చ’నేతలకు కన్నుకుట్టింది. ఇంకేముంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాకుండా అడ్డుపుల్ల వేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన ముగ్గురు నేతలు అడ్డుచక్రం సంధించారు. దాదాపు నాలుగువారాలు గడుస్తున్నా రైతులకు ఖాతాకు జమకాకుండా వ్యూహాత్మకంగా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై టీడీపీ కండువా కప్పుకున్న ఓ ఎమ్మెల్యే, సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ప్రజాతీర్పు వికటించిన నాయకుడు, కాంట్రాక్టర్గా ఉంటూ కొత్తగా రాజకీయ ప్రవేశం చేసి జిల్లాలో ముఖ్యబాధ్యతలు నిర్వహిస్తున్న నేత, ఈ వ్యవహారంలో ఒక్కటయ్యారని సమాచారం. వీరు ముగ్గురు ఓ మంత్రి ద్వారా అడ్డుచక్రం వేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపులో నిర్లక్ష్యం పంటబీమా విషయమై ఏఐసీకి వాటా చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రనిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. చిత్తశుద్ధితో చేపట్టిన పోరాటంతో, ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఏఐసీ సీఎండీ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రప్రభుత్వం తన వాటాను చెల్లిస్తూ హైదరాబాద్లో ఉన్న ఏఐసీ జీఎం నుంచి ప్రతిపాదనలు పంపాల్సి ఉంది. ప్రభుత్వం వాటా చెల్లించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఇప్పటీకీ ఏఐసీ సిఎండి కార్యాలయానికి 21 వేల రైతుల దరఖాస్తుల ప్రతిపాదనలు చేరడం లేదని సమాచారం. మంజూరైన బీమా రైతుల ఖాతాకు జమకాకుండా అడ్డుకోవడంప రైతులు, రైతు సంఘాలు తప్పుబడుతున్నాయి. ఇప్పటికైనా రైతుల కోసం, రైతుల పక్షానా అధికారపార్టీ నేతలు నిలవాలని పలువురు కోరుతున్నారు. -
పనికిరాని పంటలబీమా పథకాలు: జీవన్రెడ్డి
జగిత్యాల అగ్రికల్చర్: పంటల బీమా పథకాలు రైతులకు పనికిరాకుండా ఉన్నాయని సీఎల్పీ ఉపనేత టి.జీవన్రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల సింగిల్విండో ఆధ్వర్యంలో ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంపై సోమవారం ఒక్క రోజు శిక్షణ సద స్సు జరిగింది. దీనికి హాజరైన ఆయన మాట్లాడుతూ, కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత బీమా పథకాల గురించి గ్రామీణ రైతులకు తెలియడం లేదన్నారు. పంటనష్టం జరిగినప్పుడు రైతువారీగా అంచనా వేయాలని అసెంబ్లీలో మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కంపెనీలకు, బ్యాంకులకు లాభం చేయడానికే బీమా పథకాలని ఆరోపించారు. -
మొక్కుబడి చర్చ!
♦ హడావుడిగా సాగిన జెడ్పీ సర్వసభ్య సమావేశం ♦ కీలక అంశాలపై మొక్కుబడి చర్చతో సరిపెట్టిన వైనం ♦ సభ్యులడిగిన ప్రశ్నలకు లభించని సమాధానాలు ♦ పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీ జాప్యంపై సభ్యుల ఫైర్ ♦ ప్రైవేటు బడులకు అనుమతులు ఇవ్వొద్దని డిమాండ్ ♦ వైద్య, ఆరోగ్యంపై ప్రజాప్రతినిధుల కస్సుబుస్సు ఈ సారి జెడ్పీ సమావేశం చప్పగా సాగింది. అన్ని అంశాలపైనా మొక్కుబడి చర్చే జరిగింది. కీలకాంశాలపై ఎక్కువ సమయం వెచ్చించలేకపోయారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా, వైద్య, ఆరోగ్యశాఖలో సమస్యలు, ప్రభుత్వ బడుల్లో సౌకర్యాల లేమి.. తదితర అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించినప్పటికీ అధికారులు వాటిపై సరైన సమాధానం చెప్పలేకపోయారు. గురువారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. చైర్పర్సన్ సునీతారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి, కలెక్టర్ రఘనుందన్రావు తదితరులు హాజరయ్యారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా జెడ్పీటీసీ సభ్యులు స్థాయీ సంఘం మీటింగ్లకు హాజరుకావడం లేదు. కేవలం అధికారులే వస్తున్నారు. కోరం కూడా ఉండట్లేదు. ముందు మీ డ్యూటీ సరిగా చేస్తే అధికారులను ప్రశ్నించొచ్చు. - జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఇకపై ప్రైవేటు స్కూళ్లకు కొత్తగా అనుమతులు ఇవ్వొద్దు. క్షేత్రస్థాయిలో జరిగే అన్ని అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారమివ్వాలి. ప్రతి పథకంలోపారదర్శకత ఉండాలి. - మంత్రి మహేందర్రెడ్డి పాలీహౌస్లో సాగు విధానం లాభదాయకం. అయితే ఈ పద్ధతిపై అవగాహన చేసుకుని ముందుకెళ్లాలి. లాభనష్టాలకు రైతులదే బాధ్యత. - కలెక్టర్ రఘునందన్రావు పాలీహౌస్ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తాం. సరైన పద్ధతిలో సాగు చేపట్టకపోవడం వల్లే నష్టాలు. - మంత్రి మహేందర్రెడ్డి ‘పాలీహౌస్’లపై దుమారం.. పాలీహౌస్ సాగు లాభదాయకమని అధికారులు తప్పుడు సహాలిస్తున్నారని.. వాటిని ఏర్పాటు చేసిన పేద రైతులెవరూ లాభపడలేదని ఎమ్మెల్యేలు యాదయ్య, సంజీవరావు, జెడ్పీటీసీ సభ్యుడు జంగారెడ్డి, ఎంపీపీ నిరంజన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వారికి మద్దతుగా బాలేష్ తదితరులు గొంతుకలిపారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా : వరుస కరువుతో అతలాకుతలమైన రైతుకు కనీసం పెట్టుబడి రాయితీ సైతం ఇవ్వకపోవడంపై జెడ్పీటీసీ సభ్యులు జంగారెడ్డి, బాలేష్ తీవ్రంగా మండిపడ్డారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇప్పటికీ ఆర్థిక సాయం అందకుంటే సాగు పనులు ముందుకెలా వెళ్తాయన్నారు. ఇందుకు జేడీఏ జగదీష్ స్పందిస్తూ ఇన్పుట్ సబ్సిడీపై ప్రభుత్వం ఇంకా ఆదేశాలు ఇవ్వలేదన్నారు. వికారాబాద్లో పత్తి రైతులకు నష్టపరి హారం ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే కాలె యాద య్య ప్రస్తావించగా.. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, తీర్పు రాగానే అమలు చేస్తామని జేడీ ఏ పేర్కొన్నారు. యాంత్రీకరణ కింద పంపిణీ చేసే పరికరాలకు సంబంధించి కనీస సమాచారం ఇవ్వడంలేదంటూ పలువురు లేవనెత్తగా.. స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారమిస్తామని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. పంట లు వేయకముందే బీమా ప్రీమియం చెల్లించడాన్ని ఎమ్మెల్యే సంజీవరావు తప్పుబట్టారు. ప్రైవేటుకు కత్తెర వేయండి.. ప్రభుత్వ పాఠశాలల్లో అన్నివిధాలా అర్హులైన టీచర్లున్నప్పటికీ.. పిల్లల సంఖ్య ఎందుకు తగ్గుతోందని ఎమ్మెల్యే సంజీవరావు ప్రస్తావించారు. పలుచోట్ల సింగిల్ డిజిట్లో విద్యార్థులుంటే.. అవి మూసివేతదిశగా వెళ్తున్నాయన్నారు. డీఈఓ రమేష్ స్పందిస్తూ ప్రస్తుతం బడిబాట సాగుతోందని, పలుచోట్ల ఇంగ్లిష్ మీడియం డిమాండ్ ఉందన్నారు. ఈక్రమంలో ప్రస్తుత వార్షిక సంవత్సరంలో 382 పాఠశాలల్లో ఆంగ్లమాద్యమం ప్రారంభిస్తున్నామని, విద్యార్థుల సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రైవేటు బడుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదని, అందుబాటులో ప్రభుత్వ పాఠశాలలుంటే ప్రైవేటుకు ఎలా అనుమతులిస్తారని ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, సంజీవరావు, యాచారం జెడ్పీటీసీ సభ్యుడు కర్నాటి రమేష్గౌడ్ ప్రశ్నించగా.. డీఈఓ స్పందిస్తూ కొత్తగా అనుమతులివ్వడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పర్యవేక్షణ లేకపోవడంతో పరపతి పడిపోతున్నదని ఎంపీపీ నిరంజన్రెడ్డి అన్నారు. అన్ని మండలాల్లో రెగ్యులర్ ఎంఈఓలుంటే పరిస్థితి మారుతుందని పేర్కొనగా.. సర్వీసు రూల్స్ అంశం రాష్ట్రపతి వద్దకు చేరిందని డీఈఓ బదులిచ్చా రు. ఉద్యానవనశాఖ ద్వారా రైతుకు పరి హారం ఇచ్చిన సంగతి ప్రజాప్రతినిధులకు చెప్పకపోవడంపై ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, క్రిష్ణారెడ్డి, కిషన్రెడ్డి తదితరులు డీడీ బాబుపై మండిపడ్డారు. దీంతో ఆయన స్పందిస్తూ ప్రజాప్రతినిధులకు పరిహారం పంపిణీ జాబితా ఇస్తానన్నారు. వైద్యశాఖకు చికిత్స చేద్దాం.. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ గాడితప్పిందని ఎమ్మె ల్యే సుధీర్రెడ్డి మండిపడ్డారు. పర్యవేక్షణ కొరవడడంతో ఆస్పత్రుల్లో వైద్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల వైద్యుల హాజరుశాతం అసంతృప్తిగా ఉందని.. ఇది జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి అసమర్థతకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ మహేశ్వరంలో వందపడకల ఆస్పత్రి సంగతేమైందంటూ మెడికల్ అధికారులను నిలదీశారు. ఇబ్రహీంపట్నం సివిల్ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ వ్యవహారశైలి బాలేదని ఎంపీపీ నిరంజన్రెడ్డి ప్రస్తావించగా.. డీఎంహెచ్ఓ స్పందిస్తూ ఆమె తనకంటే సీనియర్ అని.. వైద్యశాఖ సంచాలకులు మాత్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సమాధానం చెప్పగా.. సభ్యులు మరింత ఆగ్రహించారు. ఇంతలో మంత్రి జోక్యం చేసుకుంటూ తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పలు ఆస్పత్రుల్లో అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయకపోవడం డీఎంహెచ్ఓ నిర్లక్ష్యమని పలువురు ఎంపీపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
రైతు యూనిట్ గా పంటల బీమా
♦ వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు వర్తింపు: పోచారం ♦ మూడు వ్యవసాయ సంస్థల వెబ్సైట్లు ప్రారంభించిన మంత్రి సాక్షి, హైదరాబాద్: వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు రైతు యూనిట్గా బీమా చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దడంలో భాగంగా తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ, తెలంగాణ విత్తన సంస్థ, ఆయిల్ఫెడ్ వేర్వేరుగా రూపొందించిన వెబ్సైట్లను బుధవారం మంత్రి ఆవిష్కరించారు. వెంటనే రూ.49.52 లక్షల సొమ్మును ఆన్లైన్లో 200 మంది రైతులకు విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సబ్సిడీపై ఇస్తున్న విత్తనానికి ఉన్న సీలింగ్ను ఎత్తేయడం వల్ల అదనంగా మరో రూ.130 కోట్ల మేరకు ఖర్చవుతుందని, దీనికి సీఎం అంగీకరించారని చెప్పారు. నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున ఒక్కో విత్తన కంపెనీ విత్తన ఉత్పత్తి రైతులకు సాయం చేసేందుకు, దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చాయన్నారు. వరి విత్తన రైతుకు కూడా బ్రీడర్ సీడ్పై సబ్సిడీ ఇస్తామన్నారు. విత్తన రైతులకు ఇక నుంచి ఆన్లైన్ ద్వారానే నగదు చెల్లింపులుంటాయన్నారు. గ్రీన్హౌస్, సబ్సిడీపై ట్రాక్టర్లు, సూక్ష్మసేద్యం తదితర వాటిల్లో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీపోను రైతు చెల్లించాల్సిన సొమ్ముకు సహకార బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తామని పోచారం వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న 906 సహకార సంఘాల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తామన్నారు. ఎరువులు, విత్తనాలను మండల వ్యవసాయాధికారి, సహకార సంఘానికి చెందిన ప్రతినిధి కలసి రైతులకు సబ్సిడీపై అందజేస్తారన్నారు. ప్రస్తుతం ఎరువులు 2.76 లక్షల టన్నుల బఫర్ స్టాకు ఉందన్నారు. ఈ సహకార సం ఘాల ద్వారానే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందేలా చూస్తామన్నారు. ఆ ప్రకారం వ్యవసాయ, సహకార శాఖలను అనుసంధానం చేస్తామన్నారు. పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్, మొక్కజొన్న, కంది తదితర పంటలు వేయాలని రైతులకు మంత్రి సూచించారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి, ఉన్నతాధికారులు ప్రియదర్శిని, ఎ.మురళి, కేశవులు, కోడూరు రవీందర్రావు, మురళీధర్, విత్తన కంపెనీల అధిపతులు భాస్కర్రావు, ఏఎస్ఎన్ రెడ్డి, సంపత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుల నిలదీత... వెబ్సైట్ల ప్రారంభ కార్యక్రమంలో కొందరు రైతులు మంత్రి పోచారాన్ని నిలదీశారు. వరంగల్ జిల్లాకు చెందిన ఒక రైతు తనకు నేషనల్ సీడ్స్ నుంచి 6 నెలలుగా డబ్బులు రావడంలేదని పేర్కొన్నారు. మరో రైతు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో రైతులకు బోనస్ ఇస్తుంటే.. తెలంగాణలో ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో పుట్టడమే తాము చేసుకున్న దురదృష్టమా అని మంత్రిని నిలదీశారు. కంది విత్తనానికి సరైన ధర లేదని మరో రైతు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. -
2012 నాటి బీమా కోసం.. ఇంకా ఎదురుచూపులు!
ఎప్పుడో 2012 సంవత్సరం నాటి పంట బీమా ఇప్పటికీ రైతులకు సరిగా అందకపోవడంతో వాళ్లు ఎదురుచూపులు చూడాల్సి వస్తోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం నాటి ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. వైఎస్ఆర్ జిల్లాలో 55వేల మంది శనగరైతులు బీమా కోసం ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు. సాధారణంగా 2012 రబీ అంటే, కనీసం 2013 నాటికన్నా రావాలని, కానీ ఇప్పుడు 2016 గడిచిపోతున్నా చాలామందికి ఆ బీమా సొమ్ము రాలేదని.. ఇప్పుడు కూడా దీనిపై మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. వ్యవసాయ బీమా కార్పొరేషన్లపై ఒత్తిడి తెస్తే, రెండు నెలల క్రితం 29వేల మందికి సంబంధించి రూ. 132 కోట్లు విడుదల చేశారని, కానీ అందులో కూడా రూ. 95 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లోకి వెళ్లాయని.. మిగిలిన రూ. 37 కోట్ల విషయం ఏమైందో తెలియదని చెప్పారు. దాని సంగతి అలా ఉంటే, 55 వేల మంది రైతుల్లో మిగిలిన 26వేల మంది పరిస్థితి మరింత దయనీయంగా ఉందని వైఎస్ జగన్ అన్నారు. సాధారణంగా రైతులు ప్రీమియం చెల్లించేటపుడే వాళ్ల దరఖాస్తులో తప్పులుంటే తెలియజేయాలని, అలాగే తిరస్కరించడానికి తగిన కారణాలుంటే ఒకటి లేదా రెండు నెలల్లో తిప్పి పంపేయాలని అన్నారు. కానీ ఇక్కడ మాత్రం.. 2012 రబీకి సంబంధించి మాత్రం ఇప్పటికి మూడున్నరేళ్లయిన తర్వాత.. ఇప్పుడు వాళ్ల దరఖాస్తుల్లో తప్పులు చూపిస్తున్నారని, ఇది ఎంతవరకు ధర్మమని ప్రశ్నించారు. వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు తదితర నియోజకవర్గాలకు సంబంధించి ఈ సమస్య ఉందని ఆయన తెలిపారు. అయితే సమయానికి వ్యవసాయశాఖ మంత్రి సభలో లేకపోవడంతో, సమస్యను నోట్ చేసుకున్నానని, సంబంధిత మంత్రికి తెలియజేస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమాధానం చెప్పారు. -
త్వరలో తీపి కబురు!
♦ క్రాప్ ఆన్ డేట్ కారణంగా పెండింగ్లో ఉన్న 2012 రబీ బీమా దర ఖాస్తులకు క్లియరెన్స్ ♦ 17 వేల మంది రైతులకు ఊరట.. 2వ జాబితాలో 7వేల మందికి అప్రూవల్ ♦ ఏఐసీ జీఎంతో ఎంపీ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి సమావేశం ♦ సీఎండి జోసెఫ్తో ఫోన్లో చర్చించిన ఎంపీ సాక్షి ప్రతినిధి, కడప : పంటల బీమా కోసం మూడేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న 17 వేల మంది రైతులకు చెందిన సమస్యకు పరిష్కారం లభించింది. హైదరాబాద్లో సోమవారం ఏఐసీ (అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) జీఎం రాజేశ్వరితో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి సమావేశమై 2012 రబీ బీమా గురించి చర్చించారు. ‘2012లో చెల్లించిన ప్రీమియంకు బీమా చెల్లించకుండా రైతులను క్షోభకు గురిచేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 25 వేల మంది రైతులు నిరీక్షిస్తున్నారు. ఎప్పటి కి పరిష్కారం చూపిస్తారు.. రైతులకు బీమా చెల్లించేందుకు మీకు ఇంకెంత సమయం కావాల’ని ఇన్సూరెన్స్ కంపెనీ జనరల్ మేనేజర్ను ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యే పి రవీంద్రనాథరెడ్డి నిలదీశారు. 2012-13 సంవత్సరానికి చెందిన రబీ సీజన్ పంటల బీమా తొలి జాబితాలో 28 వేల మంది రైతులకు రూ.132 కోట్లు మంజూరైంది. మరో 25 వేల మంది రైతులకు మంజూరు కాలేదు. వారి క్లైయిమ్స్ పెండింగ్లో ఉండిపోయాయి. ఈ విషయమై ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వ్యవసాయ శాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి, ఎఐసీ జీఎం రాజేశ్వరితో ఇప్పటికే పలుమార్లు చర్చించారు. 17 వేల మంది రైతులకు చెందిన దరఖాస్తుల్లో క్రాప్ ఆన్ డేట్ నమోదు చేయలేదని పెండింగ్లో ఉంచారు. వీటిపై అగ్రికల్చర్ కమిషనర్ ధనుంజయరెడ్డి మండలాల వారిగా క్రాప్ ఆన్ డేట్ రైతుల జాబితాను ఏఐసీ కార్యాలయానికి అందించారు. ఆ మేరకు నెలలోపు రైతులకు బీమా మంజూరు చేయాలని అధికారికంగా లేఖ సైతం రాశారు. మూడు రోజుల క్రితం రాసిన ఆ లేఖను సోమవారం ఎంపీ, ఎమ్మెల్యేల సమక్షంలో ఏఐసీ జీఎం రాజేశ్వరి న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి సిఫార్సు చేశారు. దాంతో 17 వేల మంది రైతులకు చెందిన సమస్యకు పరిష్కారం లభించింది. 17 వేల మంది రైతులకు చెందిన పంటల బీమాను మంజూరు చేయాలని ఏఐసీ సీఎండీ జోసెఫ్తో ఎంపీ అవినాష్రెడ్డి ఫోన్ ద్వారా చర్చించారు. ప్రధాన కార్యాలయం నుంచి వీలైనంత త్వరగా పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు. రెండవ జాబితాగా 7 వేల పైచిలుకు మంది రైతులకు చెందిన దరఖాస్తులకు అప్రూవల్ ఇచ్చామని సీఎండి ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. ఎంపీ, ఎమ్మెల్యేల కృషి ఫలితంగా రైతులకు త్వరలో తీపి కబురు అందనుంది. -
ఖరీఫ్ నుంచి కొత్త బీమా
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మార్గదర్శకాల విడుదల సాక్షి, హైదరాబాద్: రుణ కొలబద్ద (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్)కు సమానంగా రైతులకు పంటల బీమా సొమ్ము చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందుకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎం ఎఫ్బీవై) అమలు మార్గదర్శకాలను తాజాగా ప్రకటించింది. అలాగే ఈ కొత్త బీమా పథకాన్ని వచ్చే ఖరీఫ్ నుంచే అమలు చేయాలని వ్యవసాయ బీమా కంపెనీ(ఏఐసీ) రాష్ట్ర వ్యవసాయశాఖకు బుధవారం లేఖ రాసింది. ఖరీఫ్, రబీ సీజన్లలో ఏ జిల్లాలో, ఏ పంటలకు రైతులు ఎంత బీమా ప్రీమియం చెల్లించాలో కూడా అందులో ప్రస్తావించింది. నేరుగా చెల్లించే అవకాశం వ్యవసాయంలో సుస్థిర ఉత్పత్తి సాధనే లక్ష్యం గా కొత్త బీమా పథకాన్ని ఏర్పాటు చేశారు. గుర్తించిన పంటలన్నింటికీ ఇతర రైతులతోపాటు కౌలు రైతులు కూడా ఈ బీమాకు అర్హులు. అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాల నుంచి రక్షణ కల్పిస్తుంది. సేద్యం ఖర్చులకూ బీమా ఉంది. సాగులో ఉన్నా, పంట వేయకపోయినా, కోతకు వచ్చినా, కోత తర్వాత వచ్చే కష్టనష్టాలకు బీమా ఉంటుంది. పీఎంఎఫ్బీవైను అమలుచేయడంలో నోడల్ ఏజెన్సీగా జాతీయ వ్యవసాయ బీమా పథకం(ఎన్ఏఐఎస్) లేదా జాతీయ పంటల బీమా కార్యక్రమం(ఎన్సీఐపీ) వ్యవహరిస్తుంది. ఇప్పటివరకు 9-12 శాతం వరకున్న ప్రీమియాన్ని 1.5 శాతం, 2శాతానికి తగ్గించడంవల్ల రైతుపై ప్రీమి యం భారం తగ్గనుంది. బ్యాంకుల్లో రుణాలు తీసుకోని రైతులు బీమా ప్రీమియం చెల్లింపును వారి ఇష్టానికే వదిలేశారు. రుణాలు తీసుకునే రైతులందరికీ ఈ బీమాను తప్పనిసరి చేశారు. రుణం తీసుకోని రైతులు బీమా కోసం ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. బ్యాంకు ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలి. సీజన్ మధ్యలో నష్టం జరిగితే... సీజన్ మధ్యలో కరువు, వరదలు తదితర ప్రకృతి వైపరీత్యాలు సంభవించి 50 శాతం కంటే తక్కువ ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేసిన తక్షణమే రైతులకు 25 శాతం వరకు బీమా పరిహారాన్ని కంపెనీలు అందజేస్తాయి. నష్టం అంచనాను బీమా కంపెనీ సహా రాష్ట్ర ప్రభుత్వం కలసి చేస్తాయి. ప్రభుత్వరంగ బీమా సంస్థతో సహా ప్రైవేటు బీమా కంపెనీలూ ఈ పథకాన్ని అమలుచేస్తాయి. రాష్ర్టంలో జిల్లాల వారీగా రైతులు చెల్లించాల్సిన ప్రీమియం శాతాలను ఏఐసీ వ్యవసాయ శాఖకు పంపింది. ఉదాహరణకు ఖరీఫ్లో వరికి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు 5 శాతం, కరీంనగర్ జిల్లాలో 2.40 శాతం, ఖమ్మం జిల్లాలో 3, మహబూబ్నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల రైతులు 2 శాతం చొప్పున సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకం కింద చెల్లించాల్సి ఉంటుంది. జాతీయ వ్యవసాయ బీమా పథకం కింద వరి, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర పంటలకు అన్ని జిల్లాల రైతులు 2.5 శాతం చొప్పున, పత్తికి మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 13 శాతం ప్రీమియాన్ని రైతులు చెల్లించాలి. ఇది అత్యధికం. ఖరీఫ్కు జూలై 31, రబీకి డిసెంబర్ 31 బీమా ప్రీమియం చెల్లింపునకు ఖరీఫ్కు జూలై 31, రబీలో డిసెంబర్ 31లను గడువు తేదీలుగా ప్రకటించారు. ప్రీమియంలో ఇచ్చే సబ్సిడీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. పంటల సీజన్ ప్రారంభమైన సమయంలోనే బీమా కంపెనీలకు ప్రభుత్వాలు 50 శాతం వరకు ముందే ప్రీమియం సొమ్ము చెల్లిస్తాయి. -
రైతులకు రెట్టింపు లాభం
2022 కల్లా అమలు చేస్తామన్న ప్రధాని * పంట బీమా విధివిధానాల ఆవిష్కరణ * ఏప్రిల్ 14న ఈ-అగ్రి ప్రారంభం సెహోర్ (మధ్యప్రదేశ్): భారతదేశంలో అన్నదాతలకు 2022 కల్లా రెట్టింపు లాభాలు తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని సెహోర్లో ‘కిసాన్ కల్యాణ్ మేళా’లో పాల్గొన్న ప్రధాని.. ఇటీవలే ప్రకటించిన జాతీయ పంట బీమా పథకానికి సంబంధించిన విధివిధానాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంట బీమాకు సంబంధించిన పలు వివరాలను ప్రధాని రైతులకు వివరించారు. పంట నష్టం విషయం తెలియగానే బీమా మొత్తంలో 25 శాతం చెల్లిస్తారని.. మిగిలిన మొత్తాన్ని వీలైనంత త్వరలో చెల్లిస్తారని ప్రధాని తెలిపారు. పంట వేసిన 14 రోజుల్లోపల నష్టం జరిగినా దాన్ని బీమాకు వర్తింపచేస్తామన్నారు. గతంలో 20 శాతం మంది రైతులకు మాత్రమే ప్రభుత్వ పాలసీలు అందేవని.. వీటిని తక్షణమే కనీసం 50 శాతం మందికి అందించాలనేది తమ ప్రభుత్వ ఆశయం అని మోదీ చెప్పారు. ‘పంట బీమా పథకాన్ని వాజ్పేయి ప్రారంభించారు. యూపీఏ అధికారంలోకి వచ్చాక.. రైతులకు ఈ పథకంపై నమ్మకం పోయింది. ఓవైపు విపత్తులతో నష్టపోతున్నా.. పంట బీమాపై వ్యతిరేక భావనతోనే ఉన్నారు’ అని మోదీ అన్నారు. ఒకసారైనా బీమా తీసుకుని ప్రయత్నించండని అన్నదాతలను కోరారు. 2022 కల్లా రైతులకు రెట్టింపు లాభం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంట ఉత్పత్తిని పెంచటం ద్వారా దేశీయ అవసరాలను తీర్చటంతోపాటు.. విదేశాలకు ఎగుమతి చేసుకోవటంపైనా దృష్టిపెట్టాలన్నారు. వాతావరణ మార్పులతో నష్టపోతున్న రైతులకు అండగా నిలిచేందుకు కేంద్రం వివిధ పథకాలను అందుబాటులోకి తెస్తోందని ప్రధాని తెలిపారు. భూసార కార్డుల పథకం, ప్రధానమంత్రి నీటిపారుదల పథకం, సేంద్రియ వ్యవసాయంతోపాటు.. చెరకు రైతులకోసం వీలైనంత ఎక్కువ యూరియా, ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాలను అందుబాటులోకి తేవటంపై ప్రధాని వివరించారు. దీంతో పాటు ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ-అగ్రి వేదికను ప్రారంభించనున్నట్లు ప్రధాని వెల్లడించారు. దీని ద్వారా.. రైతులు తాము పండించిన పంటను దేశంలో ఎక్కడ మంచి రేటు వస్తే అక్కడ అమ్ముకోవచ్చన్నారు. అంతా మొబైల్ ఫోన్ ద్వారానే జరుగుతుందని ప్రధాని తెలిపారు. జాతీయ వ్యవసాయ మార్కెట్ను ప్రారంభించి.. దేశవ్యాప్తంగా ఉన్న 585 మార్కెట్లను 2018 వరకు విడతల వారిగా ఒకేవేదికపైకి తీసుకువస్తామన్నారు. కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర ఇలాంటి హోల్సేల్ మార్కెట్ల ఏర్పాటుకోసం ఇప్పటికే ప్రతిపాదలను పంపాయని తెలిపారు. ‘నేను రైతు వ్యతిరేకినని విమర్శిస్తున్నారు. నాకేం ఇబ్బంది లేదు. రైతుల కోసం తీసుకొస్తున్న ఈ పథకాన్ని ఎవరూ విమర్శించే ధైర్యం చేయరు’ అని అన్నారు. -
సగం మంది రైతులకు చేరాలి
♦ పంట బీమా పథకంపై ప్రధాని మోదీ ♦ రెండేళ్లలో లక్ష్యం సాధించాలని పిలుపు విశాఖ ‘ఫ్లీట్ రివ్యూ’ దేశ నేవీ చరిత్రలోనే అద్భుతమని మన్కీ బాత్లో వ్యాఖ్య న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పంట బీమా పథకంపై రైతుల్లో అవగాహన పెంచి రెండేళ్లలో 50 శాతం అన్నదాతలకు బీమా వర్తింపచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో (ఈ ఏడాది తొలి రేడియో ప్రసంగం) ఆదివారం మాట్లాడుతూ.. ‘దేశంలో రైతు గురించి చాలా మాట్లాడతారు. చర్చల్లోకి వెళ్లటం మనకు అనవసరం. కానీ ఇప్పుడు రైతు చాలా సమస్యల్లో ఉన్నాడు. ప్రకృతి విపత్తులు వచ్చినపుడు వారి శ్రమంతా వృథా అవుతుంది. ఇలాంటప్పుడు ఆయనకు సాంత్వన చేకూర్చేది పంట బీమా ఒక్కటే’ అని అన్నారు.. చాలా ఏళ్లుగా దేశంలో పంటబీమాపై చర్చ జరుగుతోందని.. కానీ, 20-25 శాతం మందికే దీని లబ్ధి అందుతోందన్నారు. ఈ సంఖ్యను రెండేళ్లలో 50 శాతానికి చేర్చేలా రైతులను చైతన్యపరిచే కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం కావాలని దేశ ప్రజలను మోదీ కోరారు. నాట్లు వేసిన 15 రోజుల్లో ప్రకృతి విపత్తులు వచ్చినా, అన్నదాతకు బీమా అందుతుంది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించటం ద్వారా ఈ బీమా వీలైనంత త్వరగా రైతుకు చేరేలా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. జనవరి 16న ప్రారంభించిన ‘స్టార్టప్ ఇండియా’తో యువతలో కొత్త శక్తి, చైతన్యం, ఉత్సాహం కనబడుతోందని.. లక్షల సంఖ్యలో యువత ఇందులో పాల్గొనేందుకు తమ పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. ‘గతంలో స్టార్టప్ అంటే ఐటీ రంగానిదే అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పడు వ్యవసాయం మొదలుకుని ప్రతి రంగంలో స్టార్టప్లు వస్తున్నాయి. ఈ పథకం కింద అపారమైన అవకాశాలున్నాయి’ అని చెప్పారు. సిక్కిం పర్యటనలో ఇద్దరు ఐఐఎం విద్యార్థులు సేంద్రియ పద్ధతుల్లో ఔషధ మొక్కలను పెంచుతూ.. అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తున్నారని.. మరో వ్యక్తి ఆన్లైన్ ద్వారా భోజనం పంపుతున్నారని.. మరో యువకుడు పశువులకు నాణ్యమైన దాణా ఇవ్వటంపై పనిచేస్తున్నారని.. ఇలా చాలామంది యువత స్టార్టప్లో భాగంగా చేస్తున్న కార్యక్రమాలను తనకు పంపిస్తునారని ప్రధాని వెల్లడించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల్లు, గుళ్లు, మసీదులు, చర్చిల్లో స్వచ్ఛతను పాటించటంతోపాటు.. వాటి చిత్రాలను తనకు పంపించాలని ప్రజలను కోరారు. ‘మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30న దేశ ప్రజలంతా సరిగ్గా 11గంటలకు రెండు నిమిషాలపాటు మౌనం పాటిస్తే.. దానినుంచి ఎంత శక్తి వస్తుందో ఊహించగలమా?’ అని మోదీ అన్నారు. దేశ వ్యాప్తంగా ఖాదీ దుస్తుల వినియోగంపై అవగాహన పెరిగిందని.. ప్రత్యేకంగా యువత ఖాదీ దుస్తులను ఎక్కువగా వినియోగిస్తున్నారని ప్రధాని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒక జత ఖాదీ దుస్తులను బీరువాలో ఉంచుకుంటే బాగుంటుందన్నారు. ఫిబ్రవరి 4నుంచి 8 వరకు విశాఖపట్టణంలో జరిగే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ గురించి మాట్లాడుతూ.. వివిధ దేశాల నేవీ బలగాలు, నౌకలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయని.. దేశ నేవీ చరిత్రలోనే ఇదో గొప్ప కార్యక్రమమన్నారు. ఆడపిల్లపై ఆలోచన మారుతోంది.. బాలికల మరణాల్లో భారతదేశంలోనే అత్యంత దారుణమైన లింగ నిష్పత్తి రికార్డున్న (775:1000) హరియాణాలో పరిస్థితిలో గణనీయమైన మార్పు కనబడుతోందని మోదీ తెలిపారు. ‘బేటీ బచావ్, బేటీ పఢావ్’ పథకం ప్రచారంతో సమాజంలో వచ్చిన మార్పుకు ఇదో నిదర్శనమన్నారు. హరియాణా ప్రభుత్వాన్ని ప్రధాని అభినందించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లో చాలా చోట్ల ఆడపిల్లల చేతుల మీదుగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి.. ‘బాలిక’కు సరైన గౌరవాన్ని అందించాయని ప్రశంసించారు. గతేడాది ఆడపిల్లలు పుట్టిన కుటుంబాలకు రిపబ్లిక్డే పరేడ్ చూసేందుకు హరియాణా ప్రభుత్వం ఆహ్వానించి మొదటి వరుసలో కూర్చోబెట్టిందన్నారు. ఉగ్రదాడులు జరగొచ్చన్న హెచ్చరికలను పక్కనపెట్టి దేశవ్యాప్తంగా ప్రజలు రిపబ్లిక్ డేను ఘనంగా నిర్వహించారని మోదీ అభినందించారు. -
కొత్త పంట బీమా రైతుకు వరం: మోదీ
న్యూఢిల్లీ: గతంలో వచ్చిన పంట బీమా పథకాలు విజయవంతం కాలేదని.. అందుకే రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదని ప్రధాని మోదీ తెలిపారు. రైతు సమస్యలపై ఇంతవరకు ఎప్పుడూ రానంత పకడ్బందీగా.. భారీగా ప్రభుత్వ భాగస్వామ్యంతో తక్కువ ప్రీమియం చెల్లింపునకే.. ఎక్కువ బీమాను అందించే ఈ పథకంతో సమస్యల్లో ఉన్న అన్నదాతకు మేలు జరుగుతుందన్నారు. జనవరి 13న ఈ పథకాన్ని ప్రధాని ప్రారంభించడం తెలిసిందే .‘ప్రకృతి విపత్తుల వల్ల జరుగుతున్న నష్టం నుంచి అన్నదాతను బయటపడేసేందుకు, పడిపోతున్న మార్కెట్ ధరలనుంచి కాపాడేందుకు మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అందుకే మీ సమస్యల పరిష్కారం కోసం ఇలాంటి పథకాలను ప్రవేశపెడుతున్నాం’ అని రైతులకు రాసిన బహిరంగ లేఖలో ప్రధాని పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వ పథకాల అమలు, బడ్జెటింగ్, స్వచ్ఛభారత్ అమలు, గంగానది ప్రక్షాళనపై పలు ప్రభుత్వ విభాగాల సెక్రటరీల బృందం ప్రధానికి తమ నివేదికను అందజేసింది. -
రైతులకు పండుగ కానుక
బీమా పథకంపై మోదీ న్యూఢిల్లీ: కొత్త పంట బీమా పథకం రైతుల జీవితాల్లో భారీ మార్పు తీసుకువస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తంచేశారు. ‘రైతు సోదర, సోదరీమణులారా! మీరు లోఢి, పొంగల్, బిహు వంటి పండుగలు జరుపుకునే సమయంలో.. ప్రధానమంత్రి పంట బీమా పథకం రూపంలో ప్రభుత్వం మీకు ఒక కానుక ఇచ్చింది’ అని ఆయన బుధవారం ట్విటర్ వ్యాఖ్యల ద్వారా పేర్కొన్నారు. పంటల బీమా పథకాలు తగినంతమంది రైతులకు ప్రయోజనం కలిగించటంలో విఫలమయ్యాయంటూ.. కొత్తగా ప్రకటించిన పథకం చిన్నకారు రైతులు సహా అన్ని వర్గాల రైతులకూ వర్తించేలా చూడాలని సీపీఎం డిమాండ్ చేసింది. పార్టీ అనుబంధ రైతు సంస్థ అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి మొల్లా మీడియాతో మాట్లాడుతూ.. ధనిక రైతులే ఇప్పటివరకూ బీమా ప్రయోజనాలు పొందుతున్నారని.. కౌలు రైతులనూ ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని కోరారు. -
పంట బీమాపై కేంద్ర కేబినెట్ చర్చ
న్యూఢిల్లీ: పంట బీమా పథకంపై కేంద్ర కేబినెట్ చర్చించింది. ఈ విషయంలో కీలకమైన ప్రీమియం విషయంపై పలువురు మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా చర్చించారు. గతేడాది వ్యవసాయ పంట బీమా పథకాన్ని ప్రవేశపెట్టగా.. అప్పడు దీనిపై జరిగిన చర్చలలో ప్రీమియం రేటు విషయంలో మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఆహార ధాన్యాలు, నూనె గింజటపై 2.5 శాతం, ఉద్యానపంటలకు 5 శాతం ప్రీమియమ్ చెల్లించాలని మంతిత్వ శాఖ ప్రతిపాదించగా.. అన్ని పంటలకు సమానంగా 1-1.5 శాతం ప్రీమియం ఉండాలని కొందరన్నారు. దీనిపై బుధవారం కూడా చర్చ జరిగింది. వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ కొత్త పంట బీమా పథకంపై ప్రజెంటేషన్ ఇచ్చి.. దీని వల్ల రైతులకు కలిగే లాభాన్ని కూడా వివరించినట్లు తెలిసింది. 2.2-5 శాతం ప్రీమియం చెల్లించటం వల్ల కేంద్రంపై రూ.8 నుంచి 11 వేల కోట్ల భారం పడుతుందనే భావన వ్యక్తమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో మరింత భారం మోయటం కష్టమని ఆర్థిక శాఖ చెప్పిది. కాగా, ప్రపంచ వ్యాక్సిన్ సంస్థ (గావీ) 2016-2021 మధ్యకాలంలో భారత్లో కొత్త టీకాలను ప్రవేశపెట్టే ఒప్పందానికి ప్రతిపాదన చేసింది. బుధవారం ప్రధానితో గావీ సీఈవో సేథ్ బర్క్లీ సమావేశమయ్యారు వచ్చే ఐదేళ్లలో భారత్కు 500 మిలియన్ డాలర్ల (రూ.3.3వేల కోట్లు) విలువైన టీకాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మరోపక్క జమ్మూకశ్మీర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని మోదీ తనను కలిసిన కశ్మీర్ యువతతో అన్నారు. -
బీమా.. ఏదీ ధీమా?
కరువులో రైతులకు చేయూతనివ్వని పంటల బీమా * 2014-15 ఖరీఫ్లో రాష్ట్ర రైతాంగానికి తీవ్ర అన్యాయం * తీవ్రంగా నష్టపోయినా నామమాత్రంగా పరిహారం * రూ. 1,596 కోట్లకు బీమా చేస్తే.. ఇచ్చింది రూ. 77 కోట్లే * ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న బీమా కంపెనీలు * పరిహారంపై ఏటికేడు రైతుల్లో సన్నగిల్లుతోన్న ఆశలు * బీమా చేయించడమే దండగ అని భావించే పరిస్థితి * ప్రభుత్వపరంగానూ అన్నదాతలకు అందని తోడ్పాటు * ప్రీమియంపై కర్ణాటకలో 90 శాతం రాయితీ... * రాష్ట్రంలో ఇస్తున్నది 10 శాతమే సాక్షి, హైదరాబాద్: కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న రైతన్నలకు ‘బీమా’ ధీమా కరువైంది. వర్షాభావంతో పంటలు నష్టపోయినా.. కనీస పరిహారం కూడా అందని దుస్థితి నెలకొంది. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, మరోవైపు బీమా కంపెనీల తెంపరితనం కలసి అన్నదాతల కడుపుకొడుతున్నాయి. బీమా కంపెనీలు రైతులు భారీగా చెల్లిస్తున్న ప్రీమియం సొమ్మును దండుకుని.. ఏదో కొద్ది మందికి నామమాత్రపు పరిహారాన్ని విదిలిస్తున్నాయి. చివరికి బీమా చేయించడమే దండగ అని రైతులు భావించే పరిస్థితికి కారణమవుతున్నాయి. చివరికి అటు పంటలూ నష్టపోయి, ఇటు అప్పులూ పెరిగిపోయి ఏం చేయాలో తెలియని ఆవేదనలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుతున్నది కొంతే: రాష్ట్రంలో పంటల బీమా పథకం రైతులకు ఏమాత్రం చేయూత ఇవ్వడం లేదు. రైతులు చెల్లిస్తున్న ప్రీమియం సొమ్మును మింగేయడానికే బీమా కంపెనీలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులు వివిధ పంటలకు వందల కోట్ల రూపాయలకు బీమా చేస్తే... అందుతున్న పరిహారం పదుల కోట్లలోనే ఉండడం గమనార్హం. దీంతో బీమా ప్రీమియం చెల్లించడానికి చాలా మంది రైతులు ముందుకు రావడంలేదు. రైతుకు చేయూత ఏదీ?: రాష్ట్రంలో జాతీయ వ్యవసాయ బీమా పథకం, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం, మెరుగుపరిచిన జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకం అమలవుతున్నాయి. వీటికోసం రైతులు రెండు రకాలుగా ప్రీమియం చెల్లిస్తారు. కొందరు నేరుగా ప్రీమియం చెల్లిస్తే.. మరికొందరు బ్యాంకు రుణం తీసుకున్నప్పుడే ప్రీమియం సొమ్మును బ్యాంకులు మినహాయిస్తాయి. ఈ ప్రీమియంలో ప్రభుత్వం 10 శాతం రాయితీ ఇస్తోంది. అదే కర్ణాటక ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రీమియంపై 90 శాతం రాయితీ ఇస్తుండడం గమనార్హం. అసలు రాష్ట్రంలో చాలా మంది రైతులు పంటల బీమాకు ప్రీమియం చెల్లిస్తున్నా... పంట నష్టపోయినప్పుడు తగిన స్థాయిలో పరిహారం అందడం లేదు. దీంతో రైతులు బీమా చేయించడంపై ఆసక్తి కోల్పోతున్నారు. రాష్ట్రంలో ఏటా 55 లక్షల మంది వరకు రైతులు పంటలు వేస్తారు. కానీ బీమా ప్రీమియం చెల్లిస్తున్న వారి సంఖ్య ఏడెనిమిది లక్షలకు మించడం లేదు. 2014-15 ఖరీఫ్లో 3.87 లక్షల మంది రైతులు రూ. 1,596.94 కోట్లకు బీమా చేశారు. ఆ ఖరీఫ్ సీజన్లో తీవ్రస్థాయిలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ప్రకటించకపోయినా.. కలెక్టర్లు పంపిన నివేదిక ప్రకారం 300 పైగా మండలాల్లో రైతులు భారీగా నష్టపోయారు. కానీ గత ఏడాది బీమా కంపెనీ నుంచి కేవలం 1.21 లక్షల మంది రైతులకు రూ. 77.22 కోట్ల పరిహారం మాత్రమే మంజూరైంది. దారుణమైన విషయం ఏమిటంటే... గత ఏడాది రైతుల నుంచి పెద్ద సంఖ్యలో బీమా దరఖాస్తులు వచ్చినా... సకాలంలో ప్రక్రియ పూర్తి చేయలేక దాదాపు 10 వేల దరఖాస్తులను వెనక్కి పంపారు. ఆ రైతులెవరూ కనీస బీమా సొమ్ముకు నోచుకోలేదు. బీమా కంపెనీల అధికారులు తమ నిర్లక్ష్యాన్ని బయటకు పొక్కనీయకుండా.. ఆ దరఖాస్తులు సరిగా లేవంటూ సాకులు చూపడంపై విమర్శలు వచ్చాయి. ఇదే నిర్లక్ష్యం గత ఖరీఫ్లోనూ కనిపించింది. ఏ సంవత్సరం కూడా రైతులకు పూర్తిస్థాయిలో బీమా పరిహారం చెల్లిస్తున్న దాఖలాలు లేవు. రైతుకు భారంగా ప్రీమియం బీమా లెక్కలు చాలా చిత్రంగా ఉంటాయి. గ్రామం, మండలం యూనిట్గా వివిధ రకాల బీమాలు ఉన్నాయి. ఒక పంట గ్రామం మొత్తం నష్టపోతేనే పరిహారం ఉంటుంది. మరో పంట మండలం మొత్తం నష్టపోతేనే పరిహారం ఉంటుంది. ఇక బీమా ప్రీమియం కూడా రైతులకు భారంగానే ఉంటోంది. ఉదాహరణకు వరి సాగు చేసే రైతు రబీలో ఎకరాకు రూ. 509 ప్రీమియం చెల్లించాలి. ఒక్కో జిల్లాలో ఇది ఒక్కోరకంగా ఉంటుంది. వరంగల్ జిల్లాలో మిరప సాగు చేసే రైతు ఎకరాకు రూ. 1,804 ప్రీమియం చెల్లించాలి. మరోవైపు ప్రీమియం చెల్లించినా పంట నష్టపోతే పరిహారం దక్కడం లేదన్న ఆందోళన రైతులను వెన్నాడుతోంది. దీంతో 55 లక్షల మంది రైతులు పంటలు వేస్తుంటే... ప్రీమియం చెల్లిస్తున్నవారి సంఖ్య ఏడెనిమిది లక్షలకు మించడం లేదు. ప్రీమియం సొమ్ము చెల్లించడమే దండగగా వారు భావిస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్న రైతులు కూడా బ్యాంకుల అధికారులను బతిమాలుకుని ప్రీమియం సొమ్మును మినహాయించకుండా చూసుకుంటున్నారు. మరోవైపు ఒకే బీమా కంపెనీకి పంటల బీమా బాధ్యతను అప్పగించడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని అధికారులు అంటున్నారు. ఒకే కంపెనీ కాబట్టి ప్రశ్నించే నాథుడే లేకుండా పోయారని, బీమా కంపెనీ గుత్తాధిపత్యం రైతులకు నష్టం కలిగిస్తోందని ఆరోపణలున్నాయి. ఐదేళ్లలో రైతులు చేసిన బీమా మొత్తం, పొందిన పరిహారం వివరాలు.. ఏడాది రైతులు బీమా మొత్తం పొందిన పరిహారం లబ్ధిపొందిన రైతులు (రూ.కోట్లలో) (రూ.కోట్లలో) 2010-11 8.88 లక్షలు 2,585.37 25.94 1.06 లక్షలు 2011-12 11.99 లక్షలు 3,867.9 252.15 4.56 లక్షలు 2012-13 8.45 లక్షలు 3,810.9 78.99 1.80 లక్షలు 2013-14 8.41 లక్షలు 3,784.66 32 1.28 లక్షలు 2014-15(ఖరీఫ్) 3.87 లక్షలు 1,596.94 77.22 1.21 లక్షలు -
ధీమాలేని బీమా
పరిహారం... పరిహాసం ఏళ్ల తరబడి అన్నదాతల నిరీక్షణ నేటికీ అందని 2012-13 పరిహారం పరిహారం పరిహాసమవుతోంది. అన్నదాతలకు పంటల బీమా అందని ద్రాక్షగా మిగులుతోంది. చెప్పులరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా బీమాకు నోచుకోక వేలాది మంది రైతులు గగ్గోలు పెడుతున్నారు. బీమా కంపెనీల ఉదాశీనత..ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఏఏటికాయేడు పంటల బీమా చెల్లించేందుకు అన్నదాతలూ వెనుకడుగు వేసుస్తున్నారు. విశాఖపట్నం : జిల్లాలో నాలుగేళ్లుగా పంటల బీమాకు నోచుకునే రైతులను వేళ్లమీద లెక్కించవచ్చు. గతేడాది ఒక్క రైతు కూడా పరిహారం పొందిన పాపానపోలేదు. బీమా విషయమై అన్నదాతలకు అవగాహన కల్పించడంలో అధికారుల వైఫల్యమే ఈ పరిస్థితికికారణం. గతంలో ప్రీమియం చెల్లించిన రైతులు చేతికంది వచ్చిన పంటను నష్టపోయినప్పటికీ నేటికీ పరిహారం అందని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో ఏటా2.74 లక్షలహెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి. నాలుగున్నర లక్షలమంది రైతులున్నారు. ఐదేళ్లుగా వరుసగా ప్రకృతి విపత్తుల బారినపడి రైతులు నిలువునా నష్టపోయారు. అవగాహన లేమి వల్ల రైతులు ప్రీమియం చెల్లించకపోవడంతో దెబ్బతిన్న పంటలకు బీమా దక్కని పరిస్థితి నెలకొంది. కాగా 2012-13లో కూడా ఇదే రీతిలో పంటలు విపత్తుల బారిన పడి నాశనమయ్యాయి. ఆ ఏడాది జిల్లాలో వరిసాగు చేసిన విస్తీర్ణంలో 6,128.71 ఎకరాలకు సంబం ధించి 9865 మంది రైతులు పంటల బీమా కింద ఎకరాకు రూ.320 చొప్పున ప్రీమియం చెల్లించారు. ఈ లెక్కన రైతులు రూ.32,93,522 చెల్లించారు. అదే విధంగా 89.77 ఎకరాలకు సంబంధించి 131 మంది రైతులు ఎకరాకు రూ.933 చొప్పున రూ.2,65,854 ప్రీమియం మొత్తాన్ని చెల్లించారు. ఈ లెక్కన ఆ ఏడాది 6217.98 ఎకరాల కోసం 9996 మంది రైతులు రూ.35,59,376 చెల్లించారు. బీమా చేయించుకుంటే పంటలు దెబ్బతింటే వరికి ఎకరాకు రూ.26,520, చెరకకు ఎకరాకు రూ.72,040చొప్పున బీమా పరిహారం చెల్లిస్తారు. ఈ లెక్కన దెబ్బతిన్న 9996 మంది రైతులకు 6217.98 ఎకరాలకు సంబంధించి రూ.16,25,33,389 బీమా సొమ్ము చెల్లించాల్సి ఉంది. కానీ నేటికి ఒక్కపైసా కూడా మంజూరు కాని దుస్థితి నెలకొంది. జిల్లాలో 39 మండలాల పరిధిలో ఈ రైతులుంటే కేవలం మూడే మూడు మండలాల పరిధిలో పంటలు దెబ్బతిన్న రైతులకు మాత్రం బీమా సొమ్ము మంజూరు చేశారు. ఈ విధంగా వి.మాడుగుల మండలంలో 2921 మంది రైతులకు 1273.51 ఎకరాలకు రూ.9,54,287లు, బుచ్చెయ్యపేటలో 2952 మంది రైతులకు 1114.89 ఎకరాలకు 30,46,882, రాంబిల్లి మండలంలో 17 మంది రైతులకు 24.37 ఎకరాలకు రూ.6,46,292 చొప్పున మొత్తం ఈ మూడు మండలాలపరిధిలోని రైతులకు రూ.3,74,66,659లు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మండలాల్లో ప్రీమియం చెల్లించిన రైతుల జాబితాలను ఆధార్, పట్టాదార్ పా్స్ పుస్తకాలు ఇతర వివరాలను సమర్పించాల్సిందిగా ఏడాది క్రితంప్రభుత్వం కోరినట్టు వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. కానీ ఏ ఒక్క రైతుకు పైసా కూడా నేటికీ విడుదల చేయని దుస్థితి. ఇన్స్యూరెన్స్ కంపెనీలు బీమాసొమ్ము విడుదల చేసినా ప్రభుత్వం మాత్రం చెల్లించకుండా కాలయాపన చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఈ మూడు మండలాల రైతులే కాదు..జిల్లావ్యాప్తంగా ప్రీమియం సొమ్ము చెల్లించిన రైతులు కూడా బీమా సొమ్ము కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని నాలుగేళ్లుగా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బాధిత రైతులకు బీమా సొమ్ము చెల్లించడంతో పాటు కనీసం రబీలోనైనా పంటల బీమాపై అన్నదాతలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. -
పంటలబీమా దరఖాస్తు గడువు పెంపు
హైదరాబాద్: ఖరీఫ్ సీజన్లో జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం గడువు పెంచింది. సెప్టెంబరు 15 వరకు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన రైతులు ఈ బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని రకాల పంటలు సాగుచేసే రైతులకు ఈ అవకాశం ఉంది. -
ప్రయోజనం లేని పంటల బీమా ఎందుకు?
లోపభూయిష్టంగా పాలసీ: హరీశ్రావు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పంటల బీమా పాలసీ లోపభూయిష్టంగా ఉందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఆయన బ్యాంకర్లు, ఇన్సూరెన్స్, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్యాంకర్లు బలవంతంగా ఇన్సూరెన్స్ పాలసీని రైతులపై మోపుతున్నారని, ఈ పదేళ్ల కాలంలో ఏ ఒక్క రైతుకైనా ఇన్సూరెన్స్ చెల్లించిన దాఖలాలు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. ‘ రైతు పొందిన రుణంలో 13 శాతం ప్రీమియం రూపంలో పోతే ఇక రైతు చేతికి ఏమి వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ భారాన్ని రైతుల మీద ఎందుకు బలవంతంగా రుద్దుతున్నారని హరీశ్రావు బ్యాంకర్లను నిలదీశారు. కాగా చంద్రబాబు విభజన చట్టం చదవలేదా? అని మంత్రి ప్రశ్నించారు. హైదరాబాద్లో ఉంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని బలహీన పరిచేందుకు కుట్రలు చేసింది బాబు కాదా? అని అడిగారు. తెలంగాణ సమాజంపై కుట్రలు చేస్తున్నారని అన్నారు. -
బీమా లేదు..ధీమా లేదు
- ఎకరాకూ దక్కని వైనం - ముగిసిన పంట బీమా గడువు - అధికారుల వైఫల్యం - ఆందోళనలో అన్నదాతలు సాక్షి, విశాఖపట్నం: అన్నదాతలకు ధీమా లేకుండా పోతుంది. ఏటా విరుచుకుపడే ప్రకృతి వైపరీత్యాలు..కరువు కాటకాల బారినపడే పంటలకు బీమా లేకుండా పోతుంది. ప్రభుత్వ ఉదాశీనత, శాఖల మధ్య సమన్వయ లోపం..ముఖం చాటేస్తున్న బ్యాంకర్ల పుణ్యమాని ఏ ఒక్క రైతు బీమా పొందలేని పరిస్థితి ఉంది. ప్రకృతి వైపరీత్యాల బారిన పడి నష్టపోయిన రైతుకు వెన్నదన్నుగా నిలిచేందుకు బీమా పథకం నేడు అక్కరకు రాకుండా పోతోంది. గతేడాది హుద్హుద్ వల్ల సర్వం తుడుచుకుపెట్టుకుపోయినా ఇన్పుట్సబ్సిడీ వచ్చిందే కానీ బీమా రాలేదు. ఈ పథకం పట్ల రైతుల్లో ఆశించిన స్థాయిలో ఆసక్తి లేకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుత ఖరీఫ్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఒక్క ఎకరానికీ బీమా వర్తించలేదు. ఏరైతూ బీమా ప్రీమియం చెల్లించలేని దుస్థితి ఏర్పడడం ఇదే తొలిసారి అని అధికారులే అంగీకరిస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం 5,12,285 ఎకరాలు. ఇందులో 2,57,670 ఎకరాల్లో వరి, 94,570 ఎకరాల్లో చెరుకు, 56,535 ఎకరాల్లో రాగి పంటలు సాగు చేస్తుండగా, ఇతర పంటలన్నీ మరో 1,3,510 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. చెరకుతో పాటు వరిపంటలకు మాత్రమే పంట బీమా వర్తిస్తుంది. ఈ రెండింటి విస్తీర్ణమే మూడొంతులుంటుంది. 80 శాతం మంది ఈ పంటలే పండిస్తుంటారు. అయినా సర్కార్ పంట బీమా పథకం అమలు పట్లపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శి స్తోంది. నాలుగేళ్లుగా కవరైన సాగు విస్తీర్ణమే ఇందుకు నిదర్శనం. 2014-15లో అతి కష్టమ్మీద 3 వేల ఎకరాల విస్తీర్ణానికి మాత్రమే బీమా కల్పించారు. ఈ ఏడాది ఒక్క ఎకరాకు కూడా బీమా కల్పించ లేదు. ఒక్క రైతు కూడా ఒక్కరూపాయి ప్రీమియం చెల్లించలేదు. వరికైతే ఎకరాకు పెద్దరైతు రూ.522లు, సన్నకారు రైతు 470లు, చెరకుకైతే రూ.2806, రూ.2229, మొక్క జొన్న కైతే రూ.277లు, రూ.249 చొప్పున ప్రీమియం చెల్లించాలి. జూలై-31తో గడువు ముగిసినా ఎవరూ ప్రీమియం చెల్లించిన వైనం లేదు. హుద్హుద్ విరుచుకుపడిన గతేడాదితో సహా గడిచిన నాలుగేళ్లలో బీమా చేయించుకున్న ఏ ఒక్క రైతుకు ఒక్క ఎకరాకు కూడా బీమా సొమ్ము విడుదల కాలేదు. 2012-2014 మధ్య పంటల బీమా చేయించుకున్న రైతులకు సుమారు రూ.8కోట్ల మేర బీమా మొత్తం రావాల్సి ఉంది. ఒక్క పైసా విడుదల కాకపోవడం కూడా రైతుల్లో ఈపథకం పట్ల నిరాశ కలిగించింది. రైతులను చైతన్య పర్చడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. ఎకరాకు ఎంత కట్టాలి..ఎప్పటిలోగా చెల్లించాలి అనేది ఏ వ్యవసాయాధికారి మా వద్దకు వచ్చి చెప్పిన పాపానపోలేదని రైతులు వాపోతున్నారు. కరువుఛాయలు తరుముకొస్తున్నాయి. మరొక పక్క రోజుకో వాయుగుండం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇటువంటి తరుణంలో ఏ దశలో పంట ను కోల్పోవల్సి వస్తుందో తెలియని పరిస్థితి. -
బీమా లేదు..ధీమా లేదు
ఎకరాకూ దక్కని వైనం ముగిసిన పంట బీమా గడువు అధికారుల వైఫల్యం ఆందోళనలో అన్నదాతలు విశాఖపట్నం: అన్నదాతలకు ధీమా లేకుండా పోతుంది. ఏటా విరుచుకుపడే ప్రకృతి వైపరీత్యాలు..కరువు కాటకాల బారినపడే పంటలకు బీమా లేకుండా పోతుంది. ప్రభుత్వ ఉదాశీనత, శాఖల మధ్య సమన్వయ లోపం..ముఖం చాటేస్తున్న బ్యాంకర్ల పుణ్యమాని ఏ ఒక్క రైతు బీమా పొందలేని పరిస్థితి ఉంది. ప్రకృతి వైపరీత్యాల బారిన పడి నష్టపోయిన రైతుకు వెన్నదన్నుగా నిలిచేందుకు బీమా పథకం నేడు అక్కరకు రాకుండా పోతోంది. గతేడాది హుద్హుద్ వల్ల సర్వం తుడుచుకుపెట్టుకుపోయినా ఇన్పుట్సబ్సిడీ వచ్చిందే కానీ బీమా రాలేదు. ఈ పథకం పట్ల రైతుల్లో ఆశించిన స్థాయిలో ఆసక్తి లేకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుత ఖరీఫ్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఒక్క ఎకరానికీ బీమా వర్తించలేదు. ఏరైతూ బీమా ప్రీమియం చెల్లించలేని దుస్థితి ఏర్పడడం ఇదే తొలిసారి అని అధికారులే అంగీకరిస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం 5,12,285 ఎకరాలు. ఇందులో 2,57,670 ఎకరాల్లో వరి, 94,570 ఎకరాల్లో చెరుకు, 56,535 ఎకరాల్లో రాగి పంటలు సాగు చేస్తుండగా, ఇతర పంటలన్నీ మరో 1,3,510 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. చెరకుతో పాటు వరిపంటలకు మాత్రమే పంట బీమా వర్తిస్తుంది. ఈ రెండింటి విస్తీర్ణమే మూడొంతులుంటుంది. 80 శాతం మంది ఈ పంటలే పండిస్తుంటారు. అయినా సర్కార్ పంట బీమా పథకం అమలు పట్లపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శి స్తోంది. నాలుగేళ్లుగా కవరైన సాగు విస్తీర్ణమే ఇందుకు నిదర్శనం. 2014-15లో అతి కష్టమ్మీద 3 వేల ఎకరాల విస్తీర్ణానికి మాత్రమే బీమా కల్పించారు. ఈ ఏడాది ఒక్క ఎకరాకు కూడా బీమా కల్పించ లేదు. ఒక్క రైతు కూడా ఒక్కరూపాయి ప్రీమియం చెల్లించలేదు. వరికైతే ఎకరాకు పెద్దరైతు రూ.522లు, సన్నకారు రైతు 470లు, చెరకుకైతే రూ.2806, రూ.2229, మొక్క జొన్న కైతే రూ.277లు, రూ.249 చొప్పున ప్రీమియం చెల్లించాలి. జూలై-31తో గడువు ముగిసినా ఎవరూ ప్రీమియం చెల్లించిన వైనం లేదు. హుద్హుద్ విరుచుకుపడిన గతేడాదితో సహా గడిచిన నాలుగేళ్లలో బీమా చేయించుకున్న ఏ ఒక్క రైతుకు ఒక్క ఎకరాకు కూడా బీమా సొమ్ము విడుదల కాలేదు. 2012-2014 మధ్య పంటల బీమా చేయించుకున్న రైతులకు సుమారు రూ.8కోట్ల మేర బీమా మొత్తం రావాల్సి ఉంది. ఒక్క పైసా విడుదల కాకపోవడం కూడా రైతుల్లో ఈపథకం పట్ల నిరాశ కలిగించింది. రైతులను చైతన్య పర్చడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. ఎకరాకు ఎంత కట్టాలి..ఎప్పటిలోగా చెల్లించాలి అనేది ఏ వ్యవసాయాధికారి మా వద్దకు వచ్చి చెప్పిన పాపానపోలేదని రైతులు వాపోతున్నారు. కరువుఛాయలు తరుముకొస్తున్నాయి. మరొక పక్క రోజుకో వాయుగుండం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇటువంటి తరుణంలో ఏ దశలో పంట ను కోల్పోవల్సి వస్తుందో తెలియని పరిస్థితి. -
అన్నదాత సమస్యలపై ఆందోళన
- బీమా, రాయితీల విడుదలలో జాప్యం - సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి - రుణమాఫీ కొందరికే - బీకేఎస్ నాయకులు కడప సెవెన్రోడ్స్ : జిల్లా రైతులకు పెండింగ్లో ఉన్న పంటల బీమా, ఇన్ఫుట్ సబ్సిడీ తక్షణమే విడుదల చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బీసీ ఓబుల్రెడ్డి డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై శుక్రవారం బీకేఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2012-13లో శనగ పంటకు ప్రకటించిన బీమాను వెంటనే రైతుల ఖాతాలకు జమ చేయాలన్నారు. పొద్దుతిరుగుడు పంటకు సంబంధించిన బీమా కూడా ఇవ్వాలని పేర్కొన్నారు. 2011 నుంచి 2015 వరకు రైతులకు ఇవ్వాల్సిన అన్ని రాయితీలను విడుదల చేయాలన్నారు. 60 ఏళ్లు దాటిన ప్రతి రైతుకు నెలకు రూ.3 వేలు చొప్పున పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. ధర్నాకు ఎమ్మెల్యేల మద్దతు: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్రెడ్డి ధర్నాకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతులకు రుణమాఫీ ప్రకటించినప్పటికీ అది అస్తవ్యస్తంగా ఉందన్నారు. కొందరికి మాఫీ కావడం, మరికొందరికి కాకపోవడం వల్ల సమస్యలు ఏర్పడ్డాయన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్ని రకాల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోసం జరిగే ఆందోళనల్లో తమ పార్టీ ముందుభాగాన ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యే ఎస్బీ అంజాద్బాషా మాట్లాడుతూ రైతుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోందన్నారు. బీమా, పెట్టుబడి రాయితీలు, విత్తనా లు, రుణాలు, ఎరువులు వంటి అనేక సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని వివరించారు. దేశానికి అన్నం పెడుతున్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో బీకేఎస్ జిల్లా అధ్యక్షు డు సి.మాధవరెడ్డి, నాయకులు రామకృష్ణారెడ్డి, ఎం.జనార్దన్రెడ్డి, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. -
పంట బీమా.. దక్కని ధీమా
పంట రుణాల లక్ష్యం నెరవేరేనా? రెన్యువల్ చేస్తేనే మళ్లీ అప్పు రైతులపై రుణమాఫీ ప్రభావం ఈ నెల 30తో ముగియనున్న ప్రీమియం గడువు పంట బీమా చెల్లింపు గడువు దగ్గర పడుతోంది. బ్యాంకర్ల నుంచి పంట రుణాలు ఇంకా మంజూరు కాలేదు. రుణాల కోసం వెళ్లిన అన్నదాతలను రెన్యువల్ చేయించుకోవాలని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. రెన్యువల్ చేస్తున్నవారికి కొత్త రుణాలు మంజూరు చేసినట్లు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ రుణ లక్ష్యంలో సగం కూడా పూర్తికాలేదు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఏడాది బీమా ధీమా దక్కదని ఆందోళన చెందుతున్నారు. మచిలీపట్నం : ప్రభుత్వ సాచివేత ధోరణి రైతుల పాలిట శాపంగా మారింది. సకాలంలో పంట రుణాలు అందక అన్నదాతలు సతమతమవుతున్నారు. ఒకటి, రెండు రోజులుగా వాతావరణం అనుకూలించటంతో వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. అయితే పంట రుణాలు సకాలంలో అందకపోవటంతో రైతులు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రూ.2,396 కోట్లను పంట రుణాలుగా అందజేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటివరకు రూ.1,260 కోట్లు మాత్రమే అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో నాలుగు లక్షల మంది రైతులు ఉండగా 1.78 లక్షల మందికి వీటిని అందజేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ నెల 30 నాటికి పంట బీమా ప్రీమియం చెల్లించేందుకు తుది గడువుగా ఉంది. పూర్తిస్థాయిలో రుణాలు అందకపోవటంతో రైతులు పంట బీమా ప్రీమియం చెల్లించలేని పరిస్థితి నెలకొంది. మాఫీ మాయ.. అప్పుల్లో అన్నదాత టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత జిల్లాలో 7.03 లక్షల మంది రైతులు రూ.9,137 కోట్ల పంట రుణాలు తీసుకున్నారని గుర్తించారు. వీటన్నింటినీ రుణమాఫీ కింద రద్దు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అనంతరం వివిధ కారణాలు చూపి రుణాలు రద్దు చేయకుండా నిలిపివేశారు. ప్రభుత్వం ప్రకటించిన మొదటి విడత రుణమాఫీ జాబితాలో 2 లక్షల 84 వేల మంది రైతులకు రూ.997 కోట్లు మాఫీ జరిగినట్లు చూపారు. అందులోనూ రూ.326 కోట్లు విడుదల చేశారు. రెండో విడత జాబితాలో లక్షా 40 వేల మంది రైతులకు రూ.440 కోట్లు రుణమాఫీ జరిగినట్లు చూపారు. అందులో రూ.188 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఒకటి, రెండు జాబితాల్లో రుణమాఫీ జరగని రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా 70 వేలకు పైగా వచ్చాయి. ఈ నెలాఖరు నాటికి మూడో విడత రుణమాఫీ జాబితాను ప్రకటిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తొలుత రుణాలు మొత్తం మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఆ తర్వాత రూ.50 వేల లోపు ఉన్న రుణాలే పూర్తిగా మాఫీ చేస్తామని పేర్కొంది. ఆచరణలో అనేకమంది రైతులకు అదీ అమలు కాలేదు. రూ.50 వేల కన్నా పైబడి రుణం ఉంటే మొదటి విడతగా 20 శాతం రైతు ఖాతాలో జమ చేసి మిగిలిన బకాయిని రానున్న నాలుగు సంవత్సరాల్లో మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రక్రియ వలన రైతులకు ఒనగూరే ప్రయోజనం లేకపోగా వడ్డీ రూపంలో అదనపు భారం పడుతోంది. కాగితాల పైనే రెన్యువల్ టీడీపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నమ్మి రుణాలు సకాలంలో చెల్లించని రైతులంతా ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. బ్యాంకుల వద్దకు పంట రుణం కోసం వెళితే పాత బకాయి చెల్లిస్తే.. వెంటనే రుణం మంజూరు చేస్తామని బ్యాంకు అధికారులు ఖరాకండీగా చెబుతున్నారు. రుణం చెల్లించకున్నా రెన్యువల్ చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు. రెన్యువల్ చేయించాలంటే 10-1 అడంగల్ కాపీ, శిస్తు రసీదు కావాలని కోరుతున్నారు. రైతు తాను తీసుకున్న రుణం చెల్లించకపోవటంతో రెన్యువల్ చేసినట్లు చూపి ఈ ఏడాది కొత్తగా రుణం ఇచ్చినట్లు కాగితాలపై రాస్తున్నారు. అంతే తప్ప రైతులకు ఒక్క రూపాయి నగదు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. అధికారులు అందజేసినట్లు చెబుతున్న రూ.1,260 కోట్ల రుణాల్లో 90 శాతం ఈ తరహావేనని రైతులు అంటున్నారు. ఉదాహరణకు చిన్నాపురం కేడీసీసీ బ్యాంకు పరిధిలో ఐదు పీఏసీఎస్లు ఉన్నాయి. ఈ సంఘాల్లో పంట రుణాల కింద రూ.11 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. గురువారం ఈ బ్రాంచిని సందర్శించిన ఓ ఉన్నతాధికారి ఈ రూ.11 కోట్లలో రూ.10 కోట్లను రెన్యువల్ చేసి రైతులకు పంట రుణాలు ఇచ్చినట్లుగా చూపాలని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. పీఏసీఎస్లతో పాటు వాణిజ్య బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని రైతులు అంటున్నారు. పంట రుణాల మంజూరులో జాప్యం జరిగితే ఈ ఏడాది చాలా మంది రైతులు పంట బీమా ప్రీమియం చెల్లించే అవకాశాన్ని కోల్పోతారని, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని పంట బీమా ప్రీమియం చెల్లింపు గడువును పెంచాలని రైతులు కోరుతున్నారు. -
పంటల బీమా గోవిందా!
ఈ నెల 9తో ముగిసిన ప్రీమియం చెల్లింపు గడువు గడువు పెంచాలని కేంద్రానికి వ్యవసాయ శాఖ లేఖ హైదరాబాద్: వాతావరణ ఆధారిత పంటల బీమా పరిధిలోకి వచ్చే పత్తి, మిరప పంటల రైతులు ఈసారి పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం నెలకొంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తమకు అక్కరకు వచ్చే పంటల బీమాను రైతులు ఈ నెల 9తో ముగిసిన గడువులోగా చెల్లించలేకపోవడమే అందుకు కారణం. వాస్తవానికి రైతులు బ్యాంకుల నుంచి కొత్త రుణాలు తీసుకొని ప్రీమియం చెల్లించాలనుకున్నా సర్కారు రెండో విడత రుణమాఫీ సొమ్మును సగమే చెల్లించడంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వలేదు. ఫలితంగా రైతులు బీమా సొమ్ము చెల్లించలే ని పరిస్థితి ఏర్పడింది. రుతుపవనాలు సకాలంలో వచ్చి వర్షాలు కురవడంతో ఈ ఖరీఫ్లో రైతులు పెద్ద ఎత్తున పంటల సాగు మొదలుపెట్టారు. ఇప్పటివరకు మొత్తం 54.77 లక్షల ఎకరాల్లో పంటల సాగు మొదలవగా అందులో అత్యధికంగా 32.77 లక్షల ఎకరాల్లో పత్తి, 3 వేల ఎకరాల్లో మిరప సాగు మొదలైంది. కానీ గత 20 రోజుల నుంచి వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయా రైతులకు వాతావరణ బీమా ప్రయోజనకరంగా ఉండేది. కానీ ఈసారి అత్యధిక శాతం మంది రైతులు వాతావరణ ఆధారిత బీమాకు నోచుకునే పరిస్థితి దాటిపోయింది. పత్తి పంటకు సంబంధించి వాతావరణ ఆధారిత బీమా ప్రీమియానికి ఈ నెల 5న గడువు ముగియగా మిరపకు 9న గడువు ముగిసింది. అప్పటివరకు రైతులందరికీ కలిపి బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ. 1,200 కోట్లకు మించలేదు. అందువల్ల చాలా మంది ప్రీమియం చెల్లించలేకపోయారు. తెలంగాణలో బ్యాంకు రుణాలు పొందే రైతులు దాదాపు 41 లక్షల మంది వరకు ఉంటారు. వారు కాకుండా రుణాలు తీసుకోనివారు మరో 20 లక్షల మంది వరకు ఉండొచ్చని అంచనా. వీరంతా ప్రీమియం చెల్లిస్తారు. వీరిలో ఇప్పటివరకు నాలుగైదు శాతానికి మించి బీమా ప్రీమియం చెల్లించలేదని సమాచారం. ఈ నేపథ్యంలో వాతావరణ ఆధారిత బీమా ప్రీమియం గడువు పెంచాలని కోరుతూ వ్యవసాయశాఖ కేంద్రానికి లేఖ రాసింది. వచ్చే నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని కోరింది. కేంద్రం అనుమతిస్తే ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది. లేకుంటే అంతే సంగతులు. -
పంటల బీమా అందేనా..?
రాజాపేట : వాతావరణ ఆధారిత పంటల బీమా ఏడాది గడిచినా రైతులకు అందలేదు. మండలంలో 816 మంది రైతులు 1,475 ఎకరాల పత్తిపంటతోపాటు బత్తాయిపై బీమా ప్రీమియం చెల్లించారు. ఇందుకుగాను రూ.9. 75లక్షలను బ్యాంక్ డీడీ రూపంలో యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించారు. వాతావరణ ఆధారిత బీమా కిందఎకరానికి రూ.510 ప్రీమియం చెల్లిస్తే ఇందుకుగాను పంట పూర్తిగా నష్టం వాటిల్లితే ఎకరాకు రూ.10,400 బీమా పరిహారం చెల్లిస్తారు. బత్తాయి పంటకు ఎకరాకు రూ.792 చెల్లిస్తే నష్టపరిహారం కింద రూ.16వేలు చెల్లిస్తారు. గత ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులకు పూర్తిగా పంటనష్టం వాటిల్లింది. ఈ మేరకు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పంటనష్టాన్ని అంచనావేసి నివేదక సమర్పించారు. నేటివరకు బీమా వర్తించలేదు. ఖరీఫ్ సాగుకు అక్కరొస్తాయనుకుంటే.. బీమా డబ్బులు వస్తే తాము ఈఏడు ఖరీఫ్ సీజన్లోనైనా పెట్టుబడి పెట్టుకుందామనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. అధికారులకు బీమా విషయమై ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం బీమా డబ్బులు చెల్లింపుపై వాయిదాలుచెపుతు దాట వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తమకు రావాల్సిన పంటల బీమా డబ్బులు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. బీమా డబ్బులు త్వరలో చెల్లిస్తాం : ఏఓ వాతావరణ ఆధారిత బీమా డబ్బులు రైతులకు త్వరలోనే చెల్లిస్తామని ఏఓ ఏ.స్వాతి తెలిపారు. బీమా చెల్లించేందుకు రాజాపేట మండలాన్ని ప్రకటించారు. పంటల ప్రీమియం చెల్లించిన ప్రతీ రైతుకు బీమాకు సంబంధించిన బాండ్లతోపాటు పరిహారం కూడా అందజేస్తామని పేర్కొన్నారు. -
రైతు యూనిట్గా పంటల బీమా
ఐసీఏఆర్ సమావేశంలో కేంద్రాన్ని కోరిన మంత్రి పోచారం ఉద్యాన వర్సిటీకి కేంద్రం హామీ వ్యవసాయానికి ‘ఉపాధి హామీ’ సాక్షి, హైదరాబాద్: రైతును యూనిట్గా తీసుకుని పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఢిల్లీలో జరిగిన భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్) 86వ వార్షిక సర్వసభ్య సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమావేశానికి ముందు ఉదయం మంత్రి నివాసంలో, అనంతరం కృషిభవ న్లో కేంద్ర వ్యవసాయశాఖమంత్రి రాధామోహన్సింగ్తో పోచారం రెండుసార్లు భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హార్టికల్చర్ వర్సిటీ నిర్మాణం సహా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరులు సమావేశంలో మాట్లాడారు. రైతు యూనిట్గా పంటల బీమాను అమలు చేసేందుకు పార్లమెంటులో చట్టం తీసుకురావాలని, సర్వే నంబర్ల ఆధారంగా బీమా చె ల్లింపు ఉండాలని విజ్ఞప్తి చేశారు. ‘కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ సహాయం చేయాలని కోరాం. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో వ్యవసాయం నిర్వీర్యం కావడంతో రైతులు పట్టణ ప్రాంతాలకు వలస పోతున్నారని, వీరంతా తిరిగి గ్రామాలకు వచ్చేలా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశాను.’ అని తెలిపారు. రాష్ట్రానికి ఉద్యాన వర్సిటీని మంజూరు చేస్తున్నట్లు కేంద్రమంత్రి చెప్పారన్నారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని కోరినట్టు చెప్పారు. వ్యవసాయ, పాడిపరిశ్రమ, మత్స్యశాఖలు అమలు చేస్తున్న వివిధ పథకాలను సమావేశంలో పోచారం వివరించారు. ఎన్ఆర్ఈజీఏను వ్యవసాయానికి అనుసంధానిస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందని ప్రతిపాదించగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్టు పోచారం తెలిపారు. -
రైతన్నలకు తీపి కబురు!
►రెండువారాలల్లో పంటల బీమా వర్తింపు ►ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి స్పష్టం చేసిన ఏఐసీ సీఎండీ ►2012 నుంచి ఎదురుచూస్తున్న రైతన్నలు సాక్షి ప్రతినిధి, కడప : రెండేళ్లుగా ఎదురుచూస్తున్న రైతన్నలకు త్వరలో తీపి కబురు అందనుంది. రబీ పంటలకు పంటల బీమా చేసిన రైతులకు ఇన్సూరెన్సు కంపెనీ చెల్లింపులు చేసేందుకు సమాయత్తం అవుతోంది. ఆమేరకు ఏఐసీ సీఎండీ జోసెఫ్ కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి తెలిపారు. ఇదివరకే ఆయన రెండు పర్యాయాలు పంట ల బీమా విషయమై సీఎండీతో స్వయం గా చర్చించారు. న్యూడిల్లీలో ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సోమవారం మరోమారు సీఎండీతో 2012 రబీ పం టల బీమాపై చర్చించారు. పొద్దుతిరుగుడు, శనిగ పంటలకు చెందిన సుమా రు 80 వేల మంది రైతులు రూ.8.57 కోట్లు ప్రీమియం చెల్లించారని తెలపా రు. రెండేళ్లుగా ఎదురుచూపులే మినహా పంటల బీమా రైతులకు అందలేదని సీఎండీకి వివరించారు. ఇప్పటికే తాను సైతం రెండు పర్యాయాలు స్వయంగా వివరించానని గుర్తు చేశారు. ఇన్సూరెన్సు కంపెనీని రైతన్నలు ఆపద కోస మే ఆశ్రయించారని తెలిపారు. రెండేళ్లు పూర్తి అయినా బీమా దక్కకపోవడం, ఇప్పటికీ జాప్యం చేయడం తగదని వివరించారు. స్పందించిన సీఎండీ రెండు లేదా మూడు రోజుల్లో రాష్ట్ర ఇన్సురెన్స్ కార్యాలయం నుంచి తుది నివేదికలు ఏఐసీ కార్యాలయానికి చేరుతాయని తెలిపారు. వాటిని పరిశీలించి వారం లేదా పది రోజులకు మంజూరు చేస్తామని, ఈమారు జాప్యం అయ్యే అవకాశం లేదని తెలిపారు. ఇంకో రెండు వారాల్లో 2012 రబీ పంటలకు చెందిన ఇన్సూరెన్సు రైతన్నలకు దక్కనుంది. ఆ మేరకు న్యూఢిల్లీ నుంచి వైఎస్ అవినాష్రెడ్డి సాక్షికి ఫోన్లో ధ్రువీకరించారు. -
పంటల బీమా ప్రీమియం గడువు పెంపు
జేడీఏ సుబ్బారావు నెల్లూరు(అగ్రికల్చర్): రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం గడువును 2014 డిసెంబర్ 31 నుంచి 2015 జనవరి 15వ తేదీ వరకు పొడిగించిందని వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ కేవీ సుబ్బారావు(8886614211) తెలిపారు. మెరుగుపరిచిన జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకం వివరాలను శనివారం ఆయన ‘సాక్షి’కి తెలిపారు. రబీలో పంటలను సాగు చేస్తున్న రైతులు బీమా ప్రీమియాన్ని సకాలంలో చెల్లించాలన్నారు. ఆయా బ్యాంకుల నుంచి రుణాలు పొందిన రైతుల వద్ద నుంచి బ్యాంక్ అధికారులే నేరుగా ప్రీమియం కట్టించుకుంటున్నందున వీరు ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. బ్యాంక్ రుణం తీసుకోని రైతులు వరి పంటకు బీమా ప్రీమియం చెల్లించేందుకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు పేర్కోన్నారు. ఆసక్తి గల రైతులు అఐఇ ైఊ ఐూఈఐఅ, అగీఐ, ఏడఛ్ఛీట్చఛ్చఛీ, అఛిఛిౌఠ్ట ూౌ. 008010200023922 బ్యాంక్ పేర డీ.డీలను తీసి ఆయా మండల వ్యవసాయ అధికారి ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. యునెటైడ్ ఇండియన్ ఇన్సూరెన్సు కంపెనీ, నెల్లూరు శాఖ పేర కూడా డీ.డీలను తీసుకోవచ్చని తెలిపారు. కాంట్రాక్టు ప్రాతిపదికన 120 ఎంపీఈఓ పోస్టుల భర్తీ వ్యవసాయ శాఖలో బహుళ ప్రయోజక విస్తరణాధికారుల (ఎంపీఈఓ) పోస్టులను నెలకు రూ.8వేల గౌరవ వేతనంపై తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలను చేపట్టినట్లు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కేవీ.సుబ్బారావు తెలిపారు. స్థానిక వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లననుసరించి పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అభ్యర్థుల వయసు 2015 జులై ఒకటో తేదీ నాటికి 40 సంవత్సరాలు మించరాదన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే వయోపరిమితిలో ఐదేళ్లు సడలింపు ఉంటుందని తెలిపారు. అభ్యర్థుల విద్యార్హతలకు మూడు కేటగిరిలలో గుర్తింపు ఇవ్వనున్నట్లు చెప్పారు. బీఎస్సీ(అగ్రి, ఉద్యానవనం, మెట్ట వ్యవసాయం) వారికి కేటగిరి- 1గా, వ్యవసాయంలో పాలిటెక్నిక్ డిప్లొమా, డిప్లొమా సీడ్ టెక్నాలజీ, సస్యరక్షణ, సేంద్రియ సాగు గుర్తింపు కలిగిన కోర్సులను కేటగిరి-2గా, వృక్షశాస్త్రంలో పట్టభద్రులు, బీఎస్సీ(బీజెడ్సీ) కోర్సు పూర్తి చేసిన వారిని కేటగిరి-3గా గుర్తిస్తామన్నారు. 80 శాతం మార్కులు వారి విద్యార్హత సాధించిన మార్కులు నుంచి, 20 శాతం మార్కులు మౌఖిక పరీక్షల ఆధారంగా నియామకాలు ఉంటాయన్నారు. స్థానిక అభ్యర్థులకు 80 శాతం, స్థానికేతరులకు 20 శాతం పోస్టులు కేటాయించినట్లు చెప్పారు. అర్హతకలిగినవారు అభ్యర్థి పేరు, తండ్రిపేరు, పుట్టిన తేదీ, కులం, వికలాంగుల కేటగిరి, విద్యార్హత ఉత్తీర్ణత శాతం మార్కులు, స్వస్థలం, నాలుగు నుంచి పదో తరగతి వరకు చదివిన వివరాలు, ప్రస్తుత చిరునామా, శాశ్వత చిరునామా వివరాలను దరఖాస్తులో పూరించాలన్నారు. గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన ఎస్ఎస్సీ, విద్యార్హత, కులం, స్టడీ సర్టిఫికెట్ల జెరాక్సు కాపీలను దరఖాస్తు ఫారంతో జత చేయాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 15వ తేదీ లోపు నెల్లూరు మినీబైపాస్ రోడ్డులోని తమ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. పోస్టుల వివరాలు: మొత్తం 120 పోస్టులు ఉన్నాయి. ఓసీ జనరల్-40, మహిళలు-18, ఎక్స్ సర్వీస్ మెన్లో జనరల్-1, ఉమెన్-2, వికలాంగులకు-4, ఎస్సీ జనరల్- 12, మహిళలు-6, ఎస్టీ జనరల్- 4, మహిళలు- 3, బీసీ ఏలో జనరల్-6, మహిళలు-3, బీసీ బీలో జనరల్-6, మహిళలు-5, బీసీ సీలో మహిళలు-2, బీసీ డీలో జనరల్-5, మహిళలు-3 పోస్టులుగా నిర్ణయించారు. రబీ 2014-15 రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం పంటలు బీమా చేయు మొత్తం {పీమియం రైతులు చెల్లించాల్సిన (ఎకరాకు) శాతం {పీమియం 1.వరి రూ.25,481.00 2.00 రూ.510.00 -
పసుపు పంటకు ధీమా లేనట్లే!
బాల్కొండ : పంటల బీమాలో పలు మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. పసుపు రైతులను మాత్రం పట్టించుకోలేదు. నూతన వ్యవసాయ పంటల బీమా పథకంలో పసుపు ప్రస్తావన లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.గతంలో ప్రకృతి బీభత్సం వల్ల పంటలకు నష్టం జరిగినప్పుడు జిల్లా యూనిట్గా తీసుకుని బీమా క్లయిమ్ చెల్లించేవారు. కానీ కొత్త రాష్ట్రంలో మార్పులు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. వరికి గ్రామం యూనిట్గా తీసుకున్న సర్కార్.. పొద్దుతిరుగుడు, పెసర, వేరుశనగ, మొక్కజొన్న, మిర్చి, కంది, తదితర తొమ్మిది పంటలకు మండలాన్ని యూనిట్గా తీసుకోవాలని ఆదేశించింది. ఈ తొమ్మిది పంటల్లో పసుపు లేదు. దీంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందుతుందన్న ధీమా లేకుండా పోయింది. గతంలో పంట రుణాలు మంజూరు చేసే సమయంలో బ్యాంకర్లు బీమా ప్రీమియం మినహాయించుకుని రుణం ఇచ్చేవారు. ఎకరానికి రూ. 6 వేల బీమా ప్రీమియం వసూలు చేసేవారు. కానీ పంట నష్టపోయినా ఏనాడూ బీమా క్లయిమ్ అందలేదు. అప్పట్లో జిల్లాను యూనిట్గా తీసుకుని బీమా చేయడం వల్లే పరిహారం అందలేదు. జిల్లాలో 50 శాతం కంటే ఎక్కువగా పంట దెబ్బతింటేనే అప్పట్లో బీమా క్లయిమ్ చెల్లించేవారు. దీంతో ఎప్పుడూ రైతులకు పంట ప్రమాద బీమా డబ్బులు అందలేదు. ప్రస్తుతం పంట బీమాలో మార్పులు చేయడం వల్ల కొంత మేలు జరగవచ్చని రైతులు పేర్కొంటున్నారు. కానీ పసుపు రైతులకు ఆ సౌకర్యం కల్పించ లేదు. నిజమాబాద్ జిల్లాలో ఆర్మూర్ సబ్ డివిజన్లో అత్యధికంగా పసుపు పంటను సాగు చేస్తారు. సుమారు 20 వేల హెక్టార్లకుపైగా ఈ పంట సాగవుతుంది. ఎకరం విస్తీర్ణంలో పంట సాగుకు లక్ష రూపాయలనుంచి లక్షా 20 వేల రూపాయల వరకు పెట్టుబడులు అవసరం అవుతాయి. ఇంత పెట్టుబడి పెట్టి సాగు చేసే పంటకు బీమా రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
గ్రామం యూనిట్గా బీమా
* రబీ సీజన్ నుంచే అమలు చేయనున్న ప్రభుత్వం * జాతీయ పంటల బీమా పథకం పేరు మార్పు * వరి మినహా ఇతర 9 రకాల పంటలకు మండలం యూనిట్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి సాగు చేస్తున్న రైతులకు ఊరట కలగనుంది. ఈ రబీ సీజన్ (2014-15) నుంచి గ్రామం యూనిట్గా పంటల బీమాను అందించ నున్నారు. వరి పంటకు గ్రామం యూనిట్గా, మిగిలిన జొన్న (వర్షాధార), మొక్క జొన్న, పెసర, మినుము, శనగ, వేరుశనగ, పొద్దు తిరుగుడు, మిరప, ఉల్లి పంటలకు మండలం యూనిట్గా బీమా అందించనున్నారు. ఈ పథకంలో బ్యాంకుల నుంచి రుణాలు పొందిన రైతులకు, రుణాలు తీసుకోని రైతులకూ ప్రయోజనం చేకూర్చేలా జాతీయ పంటల బీమా కార్యక్రమం (ఎన్సిఐపి), లో మార్పులు చేర్పులు చేశారు. దీనికి సవరించిన జాతీయ వ్యవసాయ పంటల బీమా (ఎంఎన్ఎఐఎస్) పథకంగా పేరు మార్చారు. ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీ వరకు రుణాలు పొందిన, పొందని రైతులు బీమా సౌకర్యం పొందడానికి అర్హులు. ఈ ఏడాది రబీ నుంచే అమలు చేయనున్న కొత్త పథకాన్ని భారత వ్యవసాయ బీమా కంపెనీ (ఎఐసి) అమలు బాధ్యతలు చూస్తుంది. పంటల దిగుబడి, పంట కోత ప్రయోగాలు, సాధారణ పంటల అంచనా సర్వే ఆధారంగా కేంద్రం బీమా చెల్లింపులు చేస్తుంది. బీమా వర్తించే పంటలనూ గుర్తించారు. వరి, జొన్న (వర్షాధార) పంటలను తొమ్మిది జిల్లాల్లో, మొక్క జొన్న పంటను నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో, పెసర పంటకు ఆదిలాబాద్ , ఖమ్మం, మినుము పంటకు నల్లగొండ, ఖమ్మం జిల్లాలు, శనగ పంటకు మెదక్, మహబూబ్నగర్ జిల్లాలు, వేరుశనగ పంటకు నిజామాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలను, పొద్దు తిరుగుడు పంటకు నిజామాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలు, మిర్చి పంటకు వరంగల్, ఖమ్మం, ఉల్లి పంటకు రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాలను ఎంపిక చేశారు. ఆయా జిల్లాల్లో పేర్కొన్న పంటలకే పంటల బీమా వర్తించనుంది. బీమా సౌకర్యం పొందడానికి కూడా అవకాశం కల్పించారు. పంటల వివరాలు, బీమా పొందడానికి అవసరమైన విధి విధానాలను ప్రకటిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు (జీవో ఆర్టీ నం:231)ను విడుదల చేసింది. ఈ ప్రకటనను రాష్ట్ర గెజిట్లో కూడా ప్రచురించనున్నారు. -
పంట బీమా సొమ్ముకు ఎసరు !
► రైతుల వివరాలు కోరిన ప్రభుత్వం ► తలమునకలవుతున్న బ్యాంకర్లు ► రుణమాఫీలో మరో కొత్త మెలిక ► రూ. 25.78 కోట్లు విడుదల ► అన్నదాతల్లో తీవ్ర ఆందోళన రుణమాఫీ భారం తగ్గించుకునేందుకు యత్నం రుణమాఫీ... ఈ మాట వింటేనే రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. రోజుకో మాట...పూటకో నిబంధన విధిస్తున్న సర్కారు చర్యలకు ఇప్పటికే బెంబేలెత్తిపోతున్న రైతులకు ‘పంటబీమా’ రూపంలో మరో షాక్ తగలనుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రైతుల పేరున అరకొర వచ్చిన పంట బీమా సొమ్మును సైతం రుణమాఫీలో జమచేస్తారనే ప్రచారం జరుగుతుండడంతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి... మచిలీపట్నం : రుణమాఫీలో మరో అంకానికి తెరలేచింది. రుణమాఫీ భారాన్ని మరింత తగ్గించుకునేందుకు ప్రభుత్వం పంటబీమా సొమ్ముకు ఎసరు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. దీని కోసం ఆయా బ్యాంకుల నుంచి ఏ రైతుపేరున ఎంత భూమి ఉంది, పంటబీమా సొమ్ము ఎంత వచ్చింది తదితర వివరాలు పంపాలని ప్రభుత్వం బ్యాంకర్లను కోరింది. దీంతో ప్రభుత్వం కుటుంబానికి రూ.1.50 లక్షల రుణమాఫీలో నుంచి పంట బీమా సొమ్మును తగ్గించి రుణమాఫీ చేసే ఆలోచనలో ఉందని బ్యాంకు అధికారులే చెబుతున్నారు. రుణమాఫీకి సంబంధించి గతంలో 35 అంశాలలో వివరాలను పంపాలని ఆయా బ్యాంకులను కోరిన ప్రభుత్వం... తాజాగా మరో రెండు అంశాలను చేర్చి ఆ వివరాలను కూడా పంపాలని కోరినట్లు తెలిసింది. దీంతో రైతు పేరున వచ్చిన పంట బీమా సొమ్మును రుణమాీఫీలో జమచేస్తారనే ప్రచారం జరుగుతుండడంతో రైతుల్లో అయోమయం నెలకొంది. వాస్తవానికి రైతులకు సంబంధించి పంటబీమా సొమ్ము సెప్టెంబరు నెలలోనే విడుదల కావాల్సి ఉందని ప్రభుత్వం ఈ సొమ్మును ప్రభుత్వ ఖాతాలోకి జమ చేయాలని కోరడం... ఇన్సూరెన్స్ కంపెనీలు ఇందుకు నిరాకరించాయని విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే పంటబీమా సొమ్ము విడుదల్లో జాప్యం జరిగిందనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ కోరికను ఇన్సూరెన్స్ కంపెనీలు మన్నించకుండా నేరుగా రైతు ఖాతాలోనే పంట బీమా సొమ్ము జమ చేస్తామని ప్రకటించి గత నెల 19వ తేదీనే బీమా సొమ్మును విడుదల చేసింది. పంటబీమాకు సంబంధించిన నగదు ఆయా బ్యాంకులకు చేరి రైతుల ఖాతాల్లో జమ అయ్యింది. ఈ తరుణంలో పంట బీమా వచ్చిన రైతు పేరు, అతని పేరున ఎంత భూమి ఉంది, పంట బీమా సొమ్ము ఎంత వచ్చింది తదితర వివరాలను పంపాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వివరాలను ప్రభుత్వం అడగడంతో వీటిని పూర్తి చేసే పనిలో బ్యాంకు అధికారులు తలమునకలై ఉన్నారు.రుణమాఫీ సంగతేమో గానీ ఈ మాఫీ వ్యవహారం రోజుకో రకంగా విధిస్తున్న నిబంధనలు బ్యాంకులకు తలబొప్పి కట్టిస్తున్నాయని పలువురు బ్యాంకు అధికారులు వ్యాఖ్యానించడం గమనార్హం. రూ. 25.78 కోట్ల పంట బీమా విడుదల.... 2013 నవంబరులో సంభవించిన హెలెన్, లెహర్ తుపానుల ప్రభావానికి కురిసిన భారీవర్షాలు, ఈదురుగాలుల కారణంగా జిల్లాలో చేతికొచ్చే దశలో ఉన్న పంటలు భారీగా దెబ్బతిన్నాయి. రైతులు పంట రుణాలు తీసుకున్న సమయంలో పంటబీమా ప్రీమియం చెల్లించిన జాబితాలను అనుసరించి జిల్లాలోని 16 మండలాల్లోని 4,217 మంది రైతులకు రూ. 25.78 కోట్లు పంట బీమాగా మంజూరైంది. ఈ నగదు ఆయా బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నుంచి బ్రాంచ్లలో ఉన్న రైతుల ఖాతాల్లోకి చేరింది. రుణమాఫీలో నుంచి రూ. 25.98 కోట్లను తగ్గిస్తారా లేక ఈ నగదును రుణమాఫీగానే జమ కడతారా అనే అంశంపై రైతుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. బ్యాంకు లావాదేవీలకు సంబంధించి 171వ చట్టాన్ని అనుసరించి బీమా సొమ్మును రైతులు తీసుకున్న రుణంలో నుంచి మినహాయించవచ్చుననే నిబంధన ఉందని, దీనిని సాకుగా చూపి రుణమాఫీలో ఎంతో కొంత వెసులుబాటు పొందేందుకు ఈ అస్త్రాన్ని ప్రయోగించనుందనే వాదన అటు బ్యాంకు అధికారులు, ఇటు రైతుల నుంచి వినబడుతోంది.ప్రభుత్వం కోరిన విధంగా రైతుకు సంబంధించిన వివరాలు, పంట బీమాగా ఎంత నగదు వచ్చింది తదితర వివరాలు తయారు చేసేందుకు కొంత జాప్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ వివరాలన్నీ వచ్చాకే రుణమాఫీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా బుధవారం రుణమాఫీకి సంబంధించిన జాబితాలను బ్యాంకుల వద్ద ప్రదర్శించాల్సి ఉందని, ఇటీవల పంట బీమా సొమ్ము వివరాలు ప్రభుత్వం కోరడంతో మళ్లీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు జాబితాలను బ్యాంకుల వద్ద ప్రదర్శించే అవకాశం లేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారం పూర్తయ్యాక మళ్లీ ఎలాంటి అడ్డంకులు ప్రభుత్వం సృష్టిస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
రబీలోనూ ఖరీఫ్ కథే
నోటితో పలకరించి నొసటితో వెక్కిరించడమంటే ఇదే..! వర్షాభావంతో ఖరీఫ్లో నిండా మునిగిన రైతన్నకు రబీలో సాంత్వన చేకూర్చతామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో వరికి గ్రామం యూనిట్గానూ.. వేరుశెనగ, మిర్చి పంటలకు మండలం యూనిట్గానూ సవరించిన పంటల బీమా పథకం(ఎమ్ఎన్ఏఐఎస్) వర్తింపజేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బీమా ప్రీమియం డిసెంబర్ 31లోపు చెల్లించాలని పేర్కొంది. కానీ.. బ్యాంకర్లు పంట రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తుండడంతో ప్రీమియం చెల్లించలేని దుస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ⇒ రబీలో వరికి గ్రామం యూనిట్గా ‘సవరించిన పంటల బీమా’ అమలు ⇒ వేరుశెనగ, మిర్చి పంటలకు మండలం యూనిట్గా బీమా వర్తింపునకు ఉత్తర్వులు ⇒ బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు ప్రీమియం చెల్లించలేని దుస్థితి సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఖరీఫ్ తరహాలోనే రబీలోనూ రైతులకు బీమా ధీమా దక్కకుండా పోతోంది. జిల్లాలో రబీలో 36,338 హెక్టార్లలో వరి, 14,092 హెక్టార్లలో వేరుశెనగ, 1,936 హెక్టార్ల లో మిర్చి పంటలను రైతులు సాగుచేస్తారని వ్యవసాయ అధికారులు అంచనావేశారు. రబీలో 1,77,386 మంది రైతులకు రూ.920.7 కోట్లను పంట రుణాలుగా పంపిణీ చేయాలని బ్యాంకర్లకు ప్రభుత్వం నిర్ధేశించింది. కానీ.. ఇప్పటిదాకా కేవలం 14,232 మంది రైతులకు రూ.42 కోట్ల రుణాలను మాత్రమే పంపిణీ చేసి బ్యాంకర్లు చేతులు దులుపుకున్నారు. నీటి లభ్యతను సాకుగా చూపి తెలుగుగంగ ఆయకట్టులో ప్రభుత్వం ఇప్పటికే క్రాప్ హాలిడే ప్రకటించింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చెరువులు, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులకు జలకళ కొరవడింది. బోరు బావులు ఎండి ఖరీఫ్లో నష్టపోయిన రైతన్న ఆర్థిక సంక్షోభంతో రబీ పంటల సాగుకు సాహసించలేని దుస్థితి నెలకొంది. పంట రుణాలను మాఫీచేసి, కొత్త రుణాలతో రబీ సాగుకు ఊతమివ్వాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. రుణ మాఫీపై ప్రభుత్వం పాత పాటే పాడుతోంది. కొత్త రుణాలు ఇచ్చేలా అధికారులపై ఒత్తిడి తేవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. బ్యాంకర్ల నుంచి పంట రుణాలు ఇప్పిం చలేని ప్రభుత్వం.. రబీలో వరి పంటకు గ్రామం యూనిట్గా, వేరుశనగ, మిరప పంటలకు మండలం యూనిట్గా సవరించిన పంటల బీమా పథకాన్ని వర్తింపజేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. పంట రుణాలు బ్యాంకర్లు ఇచ్చేటపుడే బీమా ప్రీమియం మినహాయించుకోవడం ఆనవాయితీ. రుణాలే బ్యాంకర్లు ఇవ్వని నేపథ్యంలో.. రైతులు ప్రీమియం ఎలా చెల్లిస్తారన్నది సర్కారుకే ఎరుక. ప్రభుత్వ చిత్తశుద్ధిలోపం.. బ్యాంకర్ల సహాయ నిరాకరణ వల్ల రబీ సాగు విస్తీర్ణం ఘోరంగా పడిపోయింది. వరి పంట కేవలం 14,169 హెక్టార్లు, వేరుశనగ 3,763 హెక్టార్లు, మిరప పంట 306 హెక్టార్లకే పరిమితమైంది. 2011 వరకూ ఖరీఫ్లో వేరుశనగ పంటకు జిల్లాలో గ్రామం యూనిట్గా పంటల బీమా పథకం అమలయ్యేది. దీనిని రద్దు చేసి, వాతావరణ బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతోండటంతో పంటల బీమా పథకంలోనే మార్పులు చేసి సవరించిన పంటల బీమా పథకాన్ని రబీలో అమల్లోకి తెచ్చింది. సవరించిన పంటల బీమా పథకంలో త్రెష్హోల్డ్ ఈల్డ్(ఐదేళ్ల సగటు దిగుబడిలో 80 శాతం కన్నా తక్కువ నష్టం వాటిల్లితే.. ఆ నష్టానికి పరిహారం చెల్లించడం) 80 శాతానికి పెంచారు. ఇది వర్షాభావ ప్రాంతంలోని రైతులకు అనుకూలమైన నిర్ణయమని వ్యవసాయ శాస్త్రవేత్తలు స్పష్టీకరిస్తున్నారు. రబీ తరహాలోనే ఖరీఫ్లో వేరుశనగ పంటకు గ్రామం యూనిట్గా సవరించిన పంటల బీమా పథకాన్ని అమలుచేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. -
భరోసా.. కాదు భయం
కడప అగ్రికల్చర్: రైతుకు ధీమా ఇవ్వాల్సిన పంటల బీమా పథకం వివిధ కారణాలతో రైతుకు అందని ద్రాక్ష సామెతలా తయూరైంది. ఎప్పటికప్పుడు ఊరిస్తుందే కాని ఆ పథకం ప్రయోజనాలు రైతుకు దక్కుతున్నది అంతంత మాత్రమే. ఈ ఏడు కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో బీమా రైతు చేజారిపోయేలానే ఉంది. అటు ఖరీఫ్లోను, ఇటు రబీలోను ప్రధాన పంటలకు జాతీయ వ్యవసాయాధారిత పంటల బీమాను అమలు చేస్తున్నా, దానికి సంబందించి ప్రీమియం చెల్లించే ప్రకటనలు సకాలంలో వెలువడక పోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉంటున్నారు. రెండు సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోక పోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ఏటా రబీలో అక్టోబరు నెలలో సాగు చేసే పంటలకు బీమా ప్రీమియం రైతులు చెల్లించేందుకు జాతీయ వ్యవసాయాధారిత పంటల బీమా కంపెనీ అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్రంలో ఉన్న బీమా కంపెనీ శాఖకు ఉత్తర్వులు పంపుతుంది. కానీ పంటల సాగు చేసి నెలరోజలు గడచినా ఇంతవరకు ఎలాంటి మార్గదర్శకాలు ప్రకటించపోవడంతో పథకం అందే పరిస్థితి కనిపించడంలేదు. జిల్లాలో ఈ రబీలో రైతులు వ్యవసాయాధారంగా బుడ్డశనగ, పొద్దుతిరుగుడు, ధనియాలు, జొన్న, మొక్కజొన్న, పత్తి పంటలతో పాటు పలు రకాల పంటలను సాగు చేశారు. ఈ పంటలకు వాతావరణ పరిస్థితులు అనుకూలించకనో, పురుగుల వల్లనో చలిమంచు అధికంగా కురచడం వల్లనో ఏదో రక ంగా పంట దెబ్బతింటే అందుకు తగ్గ పరిహారం చెల్లించేలా పంటల బీమా అమలులో ఉంది. కానీ రెండు సంవత్సరాలు ఈ బీమా ఉన్నా... లేనట్లేనని రైతులు, రైతు సంఘాలు దుయ్యబడుతున్నాయి. రబీ పంటలు సాగు చేసి రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రబీలో పంటలను సాగు చేసిన రైతులు నేరుగా బ్యాంకుల ద్వారా ప్రీమియంను కంపెనీకి చెల్లిస్తారు. పంట దెబ్బతిన్న తరుణంలో రైతులు మండల వ్యవసాయాధికారికి, మండలంలోని గణాంక అధికారికి పిర్యాదు చేస్తే వారు పంటను పరిశీలించి బీమా కంపెనీకి తగిన ఫోటోలు తీసి కంపెనీకి పంపుతారు. దాని ఆధారంగా పంటల బీమా వస్తుంది. కానీ దీనికి సంబందించి విధి విధానాలనే ఇంతవరకు కంపెనీ ప్రకటించలేదు. దీనిపై ప్రభుత్వం కూడా ఏ మాత్రం పట్టించుకోలేదని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈ రబీలో బుడ్డశనగ సాధారణ సాగు 88964 హెక్టార్లకుగాను, 44612 హెక్టార్లలో సాగైంది. అలాగే పొద్దుతిరుగుడు సాధారణ సాగు 41816 హెక్టార్లకుగాను 3935 హెక్టార్లలో సాగైంది. ఈ పంటలకు బీమా చేసుకునేందుకు అవకాశం ఉంది. గత ఏడాది తీవ్రంగా నష్టపోయిన రైతులు...: గత ఏడాది ఈ సీజన్లో పంట సాగు చేసిన నెలన్నరకు బీమా చేసుకోండని ప్రకటన జారీ చేశారు. అయితే రైతులు పంటసాగు విస్తీర్ణ పత్రాలు, 1-బి, టెన్ ఒన్ అడంగల్ను వీఆర్ఏల నుంచి రాయించుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. ఆన్లైన్ సౌకర్యాలు ఉన్నా సమయం తక్కువగా ఉండడంతో మారుమూల గ్రామాల నుంచి రైతులు జిల్లా సరిహద్దుల వరకు పోయి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించే రోజుకు పొలంపై పంట నెలరోజుల లోపు మాత్రమే ఉండాలి. బీమా కంపెనీకి ప్రీమియాన్ని రైతు చెల్లించవచ్చంటూ ఆలస్యంగా ప్రకటన జారీ చేసింది. దీంతో రైతులు అవకాశం వచ్చిందని జిల్లాలో మొత్తం 27825 మంది రైతులు 2,11,14,658 రూపాయలు బీమా కంపెనీకి తమ వాటాగా చెల్లించారు. అయితే ఆలస్యంగా చెల్లించారని, పంట సాగు చేసి నెలన్నర దాటిందని కంపెనీ నిబందనలు ఒప్పుకోవని చావుకబురు పంపడంతో రైతు తీవ్రంగా నష్టపోయారు. ఇందులో పంటకు సరైన సమయంలో 66 మంది రైతులు రూ.51,240ల ప్రీమియం చెల్లించారని వారే అర్హులని తేల్చి చెప్పింది. దీంతో రైతులకు బీమా కంపెనీపై ఆగ్రహం కట్టలు తెంచుకుని ఆందోళనలకు దిగిన ఫలితం లేకుండా పోయింది. దీనిపై ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు ఇప్పటికి దుయ్యబడుతున్నారు. పంట బీమా ప్రీమియం చెల్లించాలని ఎదురు చూస్తున్నాం... శనగ పంటను సాగు చేశాం. పంటల బీమా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అధికారులు ఇంత వరకు చెప్పలేదు. పంటకు నష్టం వచ్చినప్పుడు ఆదుకుంటుందని ఆశిస్తున్నా, ఇప్పటికీ ఏమీ చెప్పలేదు. ఏప్పుడు చెబుతారో ఏం తెలియకుండాది. -ఏకాంబరం,బుడ్ఢశనగ రైతు, చిన్న పసుపుల గ్రామం, పెద్దముడియం మండలం నిరుడు దెబ్బతిన్నాం...ఈసారైనా సక్రమంగా చెబుతారో...లేదో? నిరుడు బుడ్డశనగకు బీమాకు ప్రీమియం చెల్లించాం. తీరా సమయం దాటిపోయాక, మీరు కట్టిన ప్రీమియం ఆలస్యమైందని చెప్పి అటు ప్రభుత్వం, ఇటు కంపెనీవాళ్లు తప్పించుకున్నారు. దీంతో చాలా నష్టపోయినాం. ఇప్పుడైన, ఈసారైన సక్రమంగా కట్టించుకుంటారోలేదో. -గుర్రప్ప, శనగరైతు, ఉప్పలపాడు, పెద్దముడియం మండలం. -
ఆ బీమా సొమ్మూ బ్యాంకులకే..!
అంతవరకు 20% రుణమాఫీ కూడా లేదు రూ. 300 కోట్ల పంటల బీమా సొమ్ము కోసం సర్కారు ఎదురుచూపులు ఇప్పటికే రూ.338 కోట్లు రైతుల రుణ బకాయిల కింద జమేసుకున్న బ్యాంకులు హైదరాబాద్: రైతుల రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా సొమ్ముతో ముడిపెడుతోంది. కేంద్రం నుంచి వచ్చే బీమా మొత్తం కోసం ఎదురుచూస్తూ చివరకు 20 శాతం రుణమాఫీ విషయంలోనూ జాప్యం చేస్తోంది. చంద్రబాబునాయుడు ఇచ్చిన రుణమాఫీ హామీతో రైతులు తాము తీసుకున్న రుణాలను తిరిగి బ్యాంకులకు చెల్లించలేదు. ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయకపోవడంతో.. ఇప్పటివరకు రెండు దశల్లో వచ్చిన పంటల బీమా సొమ్మును రైతుల రుణ బకాయిల కింద బ్యాంకులు జమ చేసుకున్నాయి. త్వరలో మరో రూ.300 కోట్ల పంటల బీమా సొమ్ము కేంద్రం నుంచి రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని కూడా రైతుల రుణ బకాయిల కింద బ్యాంకులు జమ చేసుకున్న తర్వాతనే 20 శాతం రుణ మాఫీ అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వ పెద్దలున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవలి కాలంలో 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ పంటల బీమా సొమ్ము రూ.68 కోట్లు వచ్చింది. ఆ సొమ్మును రైతులకివ్వకుండా రుణ బకాయిల కింద బ్యాంకులు జమ చేసుకున్నాయి. అలాగే 2013-14 ఆర్థిక సంవత్సరం ఖరీఫ్ పంటల బీమా సొమ్ము కింద తొలి విడతగా రూ.270 కోట్లను కేంద్రం ఇటీవల విడుదల చేసింది. ఆ సొమ్మునూ బ్యాంకులు జమ చేసుకున్నాయి. కాగా రెండో దశ కింద ఈ ఖరీఫ్కు చెందిన మరో రూ.300 కోట్లను కేంద్రం విడుదల చేయాల్సి ఉంది. అది విడుదలైతే ఆ మొత్తాన్ని కూడా బ్యాంకులు రైతుల రుణ బకాయిల కింద జమ చేసుకున్న తరువాతనే 20 శాతం రుణ మాఫీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. 20 శాతం రుణ మాఫీలో సుమారు ఏడు లక్షల నుంచి పది లక్షల మంది రైతుల రుణాలు పూర్తిగా తీరిపోతాయని, ఆ తర్వాత బీమా సొమ్ము వస్తే రైతులకే దక్కుతుంది కాబట్టి.. బీమా సొమ్ము వచ్చిన తరువాతనే 20 శాతం మాఫీ చేయాలనే ఎత్తుగడ ప్రభుత్వం వేసిందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ నేపథ్యంలో.. 20 శాతం రుణ మాఫీ కూడా చేయకుండా జాప్యం చేస్తే త్వరలో వచ్చే రూ.300 కోట్లను బ్యాంకులు జమ చేసుకుంటాయని, ఆ మేరకు ప్రభుత్వంపై భారం తగ్గుతుందని సర్కారు భావిస్తున్నట్టుగా అధికార వర్గాలు పేర్కొన్నాయి. అందువల్లే అన్ని వివరాలు ఉండి మాఫీకి అర్హులైన రైతుల ఖాతాలు 40 లక్షలని తేలినప్పటికీ.. కనీసం ఆ జాబితాలను కూడా బహిర్గతం చేయకుండా పంటల బీమా సొమ్ము వచ్చిన తర్వాత వెల్లడించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేని సమయంలో అర్హులైన జాబితాలను ప్రకటిస్తే అర్హులు కాని రైతులు నిరసన వ్యక్తం చేస్తారని, అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతాయని ప్రభుత్వం భావించింది. ఈ కారణంగా కూడా సీఎం జపాన్ పర్యటన ముగించుకుని వచ్చేవరకు రైతుల జాబితాలను బహిరంగ పరచరాదనే నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా జాబితాలను బ్యాంకు బ్రాంచీలకు పంపించి ఒకసారి సరిచూసి పంపాల్సిందిగా కోరాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇలా సీఎం వచ్చే వరకు కథ నడపాలని యత్నిస్తున్నారు. -
'రుణమాఫీ ఎందుకు వాయిదా వేస్తున్నారు'
హైదరాబాద్: వ్యవసాయ రుణమాఫీని ఎందుకు వాయిదా వేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. 5 నెలల పాలనలో ఒక్కరూపాయైనా రైతుకు రుణం ఇప్పించారా అని నిలదీశారు. పంటల బీమా కట్టకుండా అన్నదాత గొంతు కోశారని ధ్వజమెత్తారు. రైతులకు రుణం ఇప్పించకపోతే విత్తనాలు, ఎరువులు ఎలి కొంటారని ప్రశ్నించారు. రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితిలో మిగిలిన విద్యుత్ ను రాష్ట్ర మిగులు విద్యుత్ కింద జమకట్టిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ఎద్దేవా చేశారు. -
ఆ మాటలనడానికి సిగ్గు లేదా ?!
-
రుణమాఫీ లేక పంటలకు ఇన్సూరెన్స్ కూడా రాని స్థితి
-
పంటల బీమా సొమ్ము సర్కారుకు ఇవ్వలేం
* రైతుల ఖాతాలకే జమ.. స్పష్టం చేసిన బ్యాంకర్లు * 2013-14లో పంటల బీమా కింద రావాల్సింది రూ. 650 కోట్లు * రుణ మాఫీలో భాగంగా ఖజానాకు జమ చేయాలన్న సర్కారు * అలా సాధ్యం కాదని సర్కారుకు బీమా సంస్థ, బ్యాంకర్ల వెల్లడి సాక్షి, హైదరాబాద్: రైతు పంటల బీమా సొమ్ము ను రుణ మాఫీలో భాగంగా సర్కారు ఖజానాకు జమ చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇటు వ్యవసాయ పంటల బీమా కంపెనీతో పాటు అటు బ్యాంకర్లు కూడా సర్కారు ఖజానాకు ఇవ్వలేమని ప్రభుత్వానికి తేల్చిచెప్పాయి. ఏపీలో 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పంటల బీమా కిం ద రూ. 650 కోట్లు రావాల్సి ఉంది. రుణ మాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన షరతుల్లో ఈ పంటల బీమా సొమ్మును సర్కారు జమ చేసుకుంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే. ఒక్కో రైతు కుటుంబం ఎన్ని రుణాలు తీసుకున్నప్పటికీ ఒక్కో కుటుంబానికి లక్షన్నర రూపాయ లు మాత్రమే మాఫీ చేస్తామని షరతు విధించిన విషయం తెలిసిందే. లక్షన్నర మాఫీ చేస్తున్నం దున పంటల బీమా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని, రైతులకు ఇవ్వబోమని షరతుల్లో పేర్కొన్నారు. అందులో భాగంగానే పం టల బీమా సొమ్ము వస్తే ఆ మొత్తాన్ని సర్కారు ఖజానాకు ఇవ్వాలని బ్యాంకర్లను, వ్యవసాయ పంటల బీమా కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిపై బ్యాంకులు, పంటల బీమా కంపెనీ స్పందిస్తూ అలా చేయటం సాధ్యం కాదని స్పష్టంచేశాయి. వ్యవసాయ పంటల బీమా కంపెనీ నుంచి ఆయా రైతుల పేరుమీదనే బీమా సొమ్ము వస్తుందని, అందువల్ల ఆయా రైతుల ఖాతాలకే బీమా సొమ్ము జమ చేస్తామని బ్యాంకులు స్పష్టంచేశాయి. వాస్తవంగా పంటల బీమా ప్రీమియాన్ని ఆయా పంటల వారీగా 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం, మరో 25 శాతం కేంద్ర ప్రభుత్వం, మిగతా 50 శాతం రైతులు చెల్లిస్తారు. ఏకంగా 50 శాతం ప్రీమియం రైతులు చెల్లిస్తున్నప్పటకీ ఆ బీమా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ కింద మినహాయించుకోవడం ఎంతవరకు సమంజశం అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పంటల బీమా గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించడం సాధ్యం కాదని వ్యవసాయ పంటల బీమా సంస్థ స్పష్టంచేసింది. -
ఏదీ బీమా..?
పంట రుణాల మాఫీపై ప్రభుత్వ వైఖరితో బీమా కోల్పోయిన రైతులు బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రీమియం చెల్లించలేని దుస్థితి కరవుతో ఖరీఫ్ పంటలను నష్టపోయిన రైతులు ఆందోళనలో అన్నదాతలు రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది రైతుల పరిస్థితి..! పంట రుణాల మాఫీపై ప్రభుత్వం రోజుకో విధానం పూటకో మాట చెబుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వకపోవడంతో వాతావరణ, పంటల బీమా ప్రీమియం చెల్లించలేని దుస్థితి రైతులది. తీవ్ర దుర్భిక్షం వల్ల ఖరీఫ్ పంటను నష్టపోయిన రైతులకు బీమా ధీమా లేకుండా పోవడంతో ఆందోళన చెందుతున్నారు. తిరుపతి: జిల్లాలో ఖరీఫ్లో వర్షాధారంగా 1.85 లక్షల హెక్టార్లలో వేరుశెనగ, మరో 1.5 లక్షల హెక్టార్లలో వరి, చెరకు, కంది తదితర పం టలు సాగుచేశారు. వేరుశెనగకు వాతావరణ బీమా.. వరి, కంది, చెరకు పంటలకు సవరించిన పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం అమలుచేస్తోంది. వాతావరణ బీమా ప్రీమియం చెల్లింపు గడువు సెప్టెంబర్ 15, సవరించిన పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును ఆగస్టు 30గా జాతీయ వ్యవసాయ బీమా సంస్థ నిర్ణయించింది. ఈ ఏడాది ఖరీఫ్లో రూ.2,793 కోట్ల ను పంట రుణాలుగా పంపిణీ చేయాలని బ్యాంకర్లు నిర్ణయిం చారు. పంట రుణాలను పంపిణీ చేసేటపుడే బీమా ప్రీమియంను బ్యాంకర్లు మినహాయించుకుని జాతీయ వ్యవసాయ బీమా సంస్థకు చెల్లిస్తారు. అయితే, జిల్లాలో రూ.11,180.25 కోట్లను బ్యాంకులకు పంట రుణాల రూపంలో 8.15 లక్షల మంది రైతులు బకాయిపడ్డారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఆ రుణాలన్నీ మాఫీ అవుతాయని రైతులు చెల్లించలేదు. అధికారంలోకి వచ్చాక పంట రుణాల మాఫీపై చంద్రబాబు స్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడంతో ఏ ఒక్క రైతుకు కొత్తగా రుణాలను బ్యాంకర్లు పంపిణీ చేయలేదు. వేరుశెనగ పంటకు హెక్టారుకు రూ.1375ను ప్రీమియంగా జాతీయ వ్యవసాయ బీమా సంస్థ నిర్ణయించింది. ఈ ప్రీమియంలో రూ.687.50 రైతు చెల్లిస్తే.. తక్కిన రూ.687.50 ప్రభుత్వం చెల్లిస్తుంది. వరి పంటకు సవరించిన పంటల బీమా పథకం ప్రీమియంగా పంట రుణం మొత్తంలో 3.3 శాతం చెల్లించాలి. ఇందులో ప్రభుత్వం 1.30 శాతం.. రైతు రెండు శాతం చెల్లించాలి. కందికి రైతు 5.6 శాతం.. ప్రభుత్వం 8.40 శాతం, చెరకుకు ప్రభుత్వం 1.6 శాతం.. రైతు రూ.2.4 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. బీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగిసినా పంటల రుణాల మాఫీపై చంద్రబాబు స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదు. ఫలితంగా బ్యాంకర్లు రుణం ఇవ్వకపోవడంతో రైతులు వాతావరణ బీమా, సవరించిన పంటల బీమా పథకం ప్రీమియంలను చెల్లించలేకపోయారు. కేవలం 2,318 మంది రైతులు మాత్రమే సొంతంగా బ్యాంకర్ల ద్వారా జాతీయ వ్యవసాయ బీమా సంస్థకు ప్రీమియం చెల్లించారు. తీవ్రమైన దుర్భిక్షం వల్ల ఖరీఫ్లో సాగుచేసిన వేరుశెనగ పంట తీవ్ర నష్టాలను మిగిల్చింది. కంది పంటదీ అదే దుస్థితి. చెరకు, వరి దిగుబడులపై దుర్భిక్షం తీవ్ర ప్రభావం చూపనుంది. వరుస కరవులతో కొట్టుమిట్టాడుతున్న రైతులను ఖరీఫ్ పంటలు ముంచాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రైతుకు కనీసం బీమా ధీమా కూడా దక్కకుండా పోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. -
పంటల బీమా అవకతవకలపై ముగిసిన విచారణ
సిద్దిపేట రూరల్ : రైతులు పంటల బీమా కోసం చెల్లించిన డబ్బులో కొంత మొత్తాన్ని ఆదర్శ రైతులు స్వాహా చేసినట్లు తేలింది. దీంతో సిద్దిపేట మండలం తోర్నాల గ్రామంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న పంటలబీమా అవకతవకల విచారణ బుధవారం తెరపడింది. రూరల్ ఎస్ఐ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద రైతుల సమక్షంలో విచారణ జరుపగా, గ్రామంలో 232 మంది రైతులు 43 హెక్టార్లకు చెల్లించిన బీమా డబ్బులో కొంత మొత్తాన్ని ఆదర్శ రైతులు సొంతానికి వాడుకున్నట్లు తేలింది. ఆదర్శ రైతులు పంటల బీమా పేరుతో చిన్న, సన్నకారు రైతుల నుంచి వసూలు చేసిన రూ.22,490, పెద్ద రైతుల నుంచి వసూలు చేసిన రూ. 3,200 వాడుకున్నట్లు విచారణలో తేలింది. ఈ సందర్భంగా ఏఈఓ హన్మంతారెడ్డి మాట్లాడుతూ, పంటల బీమా డబ్బుల అవకతవకలపై నాలుగు రోజులుగా విచారణ చేయగా, ఆదర్శరైతుల బండారం బయట పడిందన్నారు. గ్రామంలో 373 మంది రైతులు మొక్కజొన్న పంటకు బీమా చేయించుకోగా, ఆదర్శ రైతులు చిన్న, సన్నకారు రైతుల నుంచి రూ. 237, పెద్ద రైతుల నుంచి రూ. 263 చొప్పున వసూలు చేశారు. అయితే పంటల బీమా కోసం రైతులు చెల్లించిన డబ్బులను డీడీ తీయాల్సిన ఆదర్శరైతులు అవకతవకలకు పాల్పడ్డారు. రైతుల పొలం విస్తీర్ణాన్ని తక్కువగా చూసి బీమా డబ్బు చెల్లించారని ఏఈఓ తెలిపారు. ఈ అవకతవకలన్నీ బయటపడడంతో ఆదర్శ రైతులు తమ తప్పులు ఒప్పుకుని స్వాహా చేసిన సొమ్ము తిరిగి చెల్లిస్తామని ఒప్పుకున్నట్లు ఏఈఓ పేర్కొన్నారు. అంతకుముందు గ్రామ పంచాయతీ వద్ద జరిగిన విచారణలో సందర్భంగా గ్రామానికి చెందిన శీలం బాబు అనే వ్యక్తి గ్రామ ఎంపీటీసీ యొదుల్ల నర్సింలును బహిరంగంగా దూషించారని, దీంతోఎంపీటీసీ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పరమేశ్వర్గౌడ్ ఉన్నారు.