Akhil Akkineni
-
కాబోయే భార్యతో అఖిల్ అక్కినేని.. పెళ్లి పనులు మొదలైనట్టేనా?
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ గతేడాది నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించేందుకు రెడీ అయిపోయాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అక్కినేని నాగార్జున పంచుకున్నారు. అయితే అఖిల్ ఎంగేజ్మెంట్ తర్వాత నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత దూళిపాలను చైతూ పెళ్లాడారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇక అక్కినేని అభిమానులంతా అఖిల్ పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ ఏడాదిలోనే అఖిల్ పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెలలోనే అఖిల్- జైనాబ్ ఒక్కటి కాబోతున్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే మార్చి 24న గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది తాజా వీడియో. అఖిల్ అక్కినేని తనకు కాబోయే భార్య జైనాబ్ రవ్జీతో కలిసి ఎయిర్పోర్ట్లో కనిపించారు. దీంతో పెళ్లి పనులు మొదలైనట్లేనని కొందరు అభిమానులు భావిస్తున్నారు. ఇద్దరు కలిసి జంటగా వెళ్తున్న వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ అక్కినేని వారి చిన్న కోడలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. గతేడాది నవంబర్ 26న జైనాబ్ రావ్జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. అయితే వీరి పెళ్లికి సంబందించిన అధికారిక ప్రకటనైతే ఇంకా రావాల్సి ఉంది.ఇక సినిమాల విషయాకొనిస్తే.. అఖిల్ అక్కినేని 1994లో సిసింద్రీలో చైల్డ్ ఆర్టిస్ట్గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2 015 అఖిల్ మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి చిత్రాలతో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం సెలబ్రిటీ క్రికెట్ లీగ్తో బిజీగా ఉన్నారు అఖిల్. ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్ఫీ రవ్జీ కూతురే జైనాబ్.. ఆమెకు స్కిన్ కేర్కి సంబంధించిన కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, దుబాయి, లండన్లో జైనాబ్ పెరిగింది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్-జైనాబ్ త్వరలోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. Dhisti Teeyandra..😍😍Chinnodu ,Chinna Vadhina Merisipothunaru Iddharu ..😍#akhilakkineni & #zainabravdjee 👩❤️👨 pic.twitter.com/c9ovnyfnyc— 𝗖𝗵𝗮𝘆-𝗦𝗮𝗶 ⛓️ (@SaiNavabathula) February 18, 2025 Anna style vere level #Akhil6 #akhilakkineni pic.twitter.com/cfy3ZBOMUQ— SAITEJA VARMA (@Missile_Saiteja) February 18, 2025 -
బెంగళూరుకు తెలుగు వారియర్స్ కెప్టెన్.. తొలి మ్యాచ్కు రెడీ
సినీ, క్రీడా అభిమానులను అలరించే సెలబ్రిటీ క్రికెట్ లీగ్కు అంతా సిద్ధమైంది. బెంగళూరు చిన్నస్వామి స్డేడియం వేదికగా ఈ ఏడాది సీసీఎల్(CCL) ప్రారంభం కానుంది. దాదాపు 7 జట్లు ఈ సారి కప్ కోసం పోటీపడుతున్నాయి. తెలుగు వారియర్స్(Telugu Warriors) తన తొలి మ్యాచ్లో కన్నడ బుల్డోజర్స్ను ఢీకొట్టనుంది. ఇటీవలే హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని మాట్లాడారు. ఇప్పటికే నాలుగుసార్లు కప్ గెలిచామమని.. ఈ సారి కూడా ఛాంపియన్స్ అవుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.సీసీఎల్ తొలి మ్యాచ్ కోసం అక్కినేని అఖిల్ ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో అఖిల్ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ లీగ్ తొలి మ్యాచ్లో చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్ తలపడనుండగా.. ఆ తర్వాత జరిగే రెండో మ్యాచ్లో తెలుగు వారియర్స్ తన కప్ వేటను ప్రారంభించనుంది. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో కర్ణాటక బుల్డోజర్స్తో తలపడుతోంది.INDIA'S BIGGEST SPORTAINMENT EVENT CCL STARTS *TOMORROW*... The 11th season of #CelebrityCricketLeague [#CCL] starts on 8 Feb 2025... Witness the thrill as #India's leading stars clash on the cricket field.Watch LIVE on #SonyTen3 and #Hotstar.#CCL2025Live | #CCL2025 | #CCL11 pic.twitter.com/7NKrABg4Vc— taran adarsh (@taran_adarsh) February 7, 2025#AkhilAkkineni off to Bengaluru for the Telugu Warriors' first match in #CCL @AkhilAkkineni8 ❤️❤️❤️❤️❤️#Akhil6 pic.twitter.com/0FlVsPj29p— 𝐀𝐤𝐡𝐢𝐥𝐅𝐫𝐞𝐚𝐤𝐬_𝐅𝐂 (@AkhilFreaks_FC) February 7, 2025 -
తెలుగు వారియర్స్ టీమ్ జెర్సీ ఈవెంట్లో అక్కినేని అఖిల్ (ఫొటోలు)
-
ఐపీఎల్కు ముందే క్రికెట్ సమరం.. సిద్ధమంటోన్న అఖిల్ అక్కినేని
క్రికెట్ సంబరానికి అంతా సిద్ధమైంది. ఇన్ని రోజుల తెరపై అభిమానులను అలరించిన సినీ తారలు గ్రౌండ్లో అడుగుపెట్టనున్నారు. ఇప్పుడు నటనతో కాదు.. బ్యాట్, బాల్తో ఫ్యాన్స్ను ఆకట్టుకోనున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) సమరానికి సమయం ఆసన్నమైంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఫిబ్రవరి 8 నుంచి ఈ క్రికెట్ సమరం మొదలు కానుంది. ఈనేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్లో టాలీవుడ్ సినీ తారలకు చెందిన తెలుగు వారియర్స్ టీమ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈవెంట్లో జట్టు కెప్టెన్ అఖిల్ (Akhil Akkineni)తో పాటు తమన్, ఆది, అశ్విన్, రఘు, సామ్రాట్ పాల్గొన్నారు. జట్టు యజమాని సచిన్ జోషి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కినేని అఖిల్ మాట్లాడుతూ.. మేము నాలుగుసార్లు కప్ గెలిచామని వెల్లడించారు. ఈసారి మేమే ఛాంపియన్స్గా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.కాగా.. ఈ సీసీఎల్ లీగ్లో మొత్తం 7 సినీ సెలబ్రిటీ జట్లు తలపడనున్నాయి. చెన్నై రైనోస్, ముంబై హీరోస్, తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్, పంజాబ్ ది షేర్, బోజ్పురి దబాంగ్స్ పోటీ పడుతున్నాయి. ఈ నెల 8న బెంగళూరు వేదికగా ఈ టోర్నీ మొదలు కానుంది. ప్రస్తుతం జరుగుతున్న 11 వ సీజన్ జనవరి 31న హైదరాబాద్లోనే ప్రారంభం కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో షెడ్యూల్లో మార్పులు చేశారు.కాగా.. ఈ ఏడాది సీసీఎల్ టోర్నమెంట్ ఫిబ్రవరి 8న బెంగళూరులో ప్రారంభమై మార్చి 2 వరకు కొనసాగుతుంది. తొలి రోజు మ్యాచ్లో చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్, సాయంత్రం కర్ణాటక బుల్డోజర్స్ టీమ్.. తెలుగు వారియర్స్ను ఢీకొంటుంది. హైదరాబాద్లో ఈనెల 14,15 తేదీల్లో మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సీజన్లో కూడా అఖిల్ అక్కినేని తెలుగు వారియర్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఈ మ్యాచ్లన్నీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతాయి. సెమీ-ఫైనల్, ఫైనల్ మార్చి 1, 2 తేదీల్లో జరగనున్నాయి. #TFNExclusive: Actor @AkhilAkkineni8 and Music sensation @MusicThaman snapped at CCL Telugu Warrior event in Hyderabad!!🏏📸#AkhilAkkineni #Thaman #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/WDxjeEsr1S— Telugu FilmNagar (@telugufilmnagar) February 2, 2025 The excitement is building! ⏳ Just 6 days to go for A23 Rummy CCL 2025! 🏏🔥 Brace yourselves for an electrifying season where cinema meets cricket!🎟 Grab your tickets now: https://t.co/xvVGHVHEcj📺 Catch the action LIVE on Sony Sports Ten 3 & Disney+ Hotstar#A23Rummy… pic.twitter.com/lBRRZaiwyH— CCL (@ccl) February 2, 2025 -
అక్కినేని వారి మరో పెళ్లి సందడి.. శోభిత- నాగచైతన్యకే ఆ బాధ్యతలు..! (ఫోటోలు)
-
అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్ మ్యారేజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఇంట్లో మరో శుభకార్యం జరగనుంది. గతేడాది చైతూ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ఆయన వివాహమాడారు. అంతకుముందే అఖిల్ అక్కినేని సైతం ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. తాజాగా అఖిల్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఈ ఏడాది మార్చిలో అఖిల్ పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం అఖిల్, జైనాబ్ ఈ ఏడాది మార్చి 24న వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. అంటే మార్చి చివరి వారంలో అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి మొదలు కానుంది.అఖిల్ పెళ్లి వేడుక కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతేడాది నవంబర్ 26న జైనాబ్ రావ్జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కొంతకాలంగా డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఓ ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి తేదీకి సంబంధించి అక్కినేని ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చైతూ బాటలోనే అఖిల్..అయితే అఖిల్ పెళ్లి వేడుక కూడా హైదరాబాద్లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. చైతూ- శోభిత పెళ్లి మాదిరే అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా వీరి వివాహా వేడుక జరగనున్నట్లు టాక్. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందే నాగచైతన్య పెళ్లి వేడుక జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు స్థాపించినందున ఈ స్టూడియో నాగార్జున కుటుంబానికి సెంటిమెంట్గా కనెక్ట్ అయింది. అయితే మరోవైపు ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్కు కూడా వెళ్లే అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అదే జరిగితే టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్లో రిసెప్షన్ను నిర్వహించనున్నారు. అయితే పెళ్లి తేదీ, వేదికపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.ఇక సినిమాల విషయాకొనిస్తే.. అఖిల్ అక్కినేని 1994లో సిసింద్రీలో చైల్డ్ ఆర్టిస్ట్గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత2 015 అఖిల్ మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి చిత్రాలతో అభిమానులను మెప్పించారు. -
కొత్త సంవత్సరానికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పిన తారలు (ఫోటోలు)
-
తొలి సినిమానే వంద కోట్ల బడ్జెట్.. ‘మెగా’, ‘అక్కినేని’ హీరోలతో సాహసం!
దర్శకుడిగా తొలి అవకాశం కోసం చాలామంది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు. కానీ కొందరిని మాత్రం మొదటే బంపర్ ఆఫర్ వరిస్తుంది. ఏ రేంజ్ ఆఫర్ అంటే ఆ యువ దర్శకుల తొలి సినిమాలకే భారీ బడ్జెట్ కేటాయింపులు జరిగిపోతున్నాయి. అఖిల్ హీరోగా ఓ భారీ బడ్జెట్ మైథలాజికల్ మూవీ చేయనున్నట్లుగా ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. యూవీ క్రియేషన్స్, హోంబలే ఫిల్మ్స్ (కేజీఎఫ్, సలార్, కాంతార’ వంటి సినిమాలను నిర్మించిన సంస్థ) ఈ సినిమాను వంద కోట్ల భారీ బడ్జెట్తో తీయనున్నాయనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది.ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు అనిల్ తెరకెక్కించనున్నారు. అలాగే సాయి దుర్గా తేజ్ హీరోగా ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా రూపపొందుతోంది. ఈ సినిమాతో కేపీ రోహిత్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ కూడా వంద కోట్ల రూపాయలపైనే అని వినికిడి. నిఖిల్ హీరోగా ‘స్వయంభూ’ అనే భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాతో భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అలాగే కిశోర్ అనే యువ దర్శకుడికి రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, రవి అనే ఓ కొత్త దర్శకుడితో దుల్కర్ సల్మాన్ తెలుగులో ఓ సినిమా చేయనున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం.. -
కొత్త జంట చైతూ-శోభితకు ఏఎన్నార్ ఆశీర్వాదం! (ఫొటోలు)
-
అక్కినేని చిన్న కోడలు అఖిల్ కంటే వయసులో ఎన్నేళ్లు పెద్దో తెలుసా..?
-
అఖిల్-జైనాబ్ నిశ్చితార్థం.. ఈ ఏడాది మాకెంతో ప్రత్యేకం: నాగార్జున
అక్కినేని వారి ఇంట త్వరలోనే శుభకార్యం జరగనుంది. వచ్చేనెల 4వ తేదీన నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల వివాహా వేడుక జరగనుంది. ఈ పెళ్లి పనులతో ఇరు కుటుంబాలు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అంతలోనే మరో సర్ప్రైజ్ ఇచ్చేశారు అక్కినేని ఫ్యామిలీ. నాగార్జున తనయుడు, హీరో అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. ముంబయికి చెందిన జైనాబ్ రవ్జీతో నిశ్చితార్థం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.అయితే మరోవారంలో నాగచైతన్య పెళ్లి జరగనుంది. దీంతో అఖిల్ పెళ్లి ఎప్పుడని అప్పుడే ఆరా తీయడం మొదలెట్టారు నెటిజన్స్. అయితే అఖిల్- జైనాబ్ల పెళ్లి 2025లోనే జరగనుందని నాగార్జున ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఈ ఏడాది తమకు ఎంతో స్పెషల్ అని కింగ్ తెలిపారు. ఓకే ఏడాదిలో అక్కినేని శతజయంతి ఉత్సవాలు, నాగచైతన్య- శోభితల పెళ్లి, అఖిల్ ఎంగేజ్మెంట్ జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే కాకుండా అఖిల్, జైనాబ్ రవ్జీల రిలేషన్పై నాగ్ మాట్లాడారు.నాగార్జున మాట్లాడుతూ..'అఖిల్ ఎంగేజ్మెంట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నా. జైనాబ్ అందమైన అమ్మాయి మాత్రమే అఖిల్కు సరైన జోడి. వారిద్దరు తమ జీవితాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నందుకు ఆనందంగా ఉంది. వారిద్దరి వివాహం 2025లోనే జరుగుతుంది" అని తెలిపారు. అఖిల్- జైనాబ్ల నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను ట్విటర్ ద్వారా పంచుకున్నారు నాగార్జున. కాగా.. నాగ చైతన్య, నటి శోభిత ధూళిపళ్ల వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరగనున్న సంగతి తెలిసిందే. -
హీరో అఖిల్తో ప్రేమ-నిశ్చితార్థం.. ఎవరీ జైనాబ్?
హీరో నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య-శోభితల పెళ్లి మరో వారం రోజుల్లో అంటే డిసెంబరు 4న జరగనుంది. ఇంతలోనే తన చిన్న కొడుకు అఖిల్ నిశ్చితార్థం జరిగిపోయిందని ప్రకటించారు. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయి తమ ఇంటికి కోడలు కాబోతుందని ప్రకటించారు. అంతా బాగానే ఉంది కానీ అసలు ఎవరీ అమ్మాయి? సినిమా నటి లేదా మోడల్ అనేది ప్రశ్నగా మారింది.(ఇదీ చదవండి: హమ్మయ్యా.. 'పుష్ప 2' షూటింగ్ ఇన్నాళ్లకు పూర్తి)అఖిల్ చేసుకోబోయే అమ్మాయి పేరు జైనాబ్ రవ్జీ అని.. ఈమె ఓ ఆర్టిస్ అని మాత్రమే బయటపెట్టారు. అంతకు మించి ఒక్క డీటైల్ కూడా చెప్పలేదు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈమెది హైదరాబాద్. కానీ లండన్, దుబాయిలో చదువంతా పూర్తి చేసిందట. హైదరాబాద్లోనే గతంలో రిఫ్లెక్షన్ పేరుతో ఆర్ట్ గ్యాలరీలో పెయింట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. అందులో ఈమె వేసిన మోడ్రన్, అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ని కూడా ప్రదర్శించారట.జైనాబ్ ప్రస్తుతం ముంబైలో నివసిస్తోందట. ఇన్ స్టాలో ఈమెకు ఖాతా ఉంది గానీ అది ప్రైవేట్లో ఉంది. అఖిల్ ఈమెని చాలా ఏళ్లుగా ప్రేమించాడని చెప్పారు కానీ వీళ్లిద్దరూ ఎక్కడ ఎప్పుడు పరిచయమైంది ప్రస్తుతానికి సస్పెన్స్. బహుశా ఏదైనా పెయింటింగ్ ఎగ్జిబిషన్లో వీళ్లిద్దరూ పరిచయమై, అది ప్రేమగా మారిందేమో? అలానే జైనాబ్.. అఖిల్ కంటే వయసులో పెద్దది అనే మాట కూడా వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతనేది తెలియాలి.(ఇదీ చదవండి: బిగ్బాస్ ఫేమ్, నటితో సిరాజ్ డేటింగ్?.. రూమర్లకు కారణం ఇదే!) View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
అక్కినేని ఇంట మరో పెళ్లి సందడి..అఖిల్ ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చిన అక్కినేని అఖిల్
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నిశ్చితార్థం చేసుకున్నాడు. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. హైదరాబాద్లోని నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ క్రమంలో అఖిల్.. తన నిశ్చితార్థం ఫొటోలని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసరికి అందరూ అవాక్కవుతున్నారు.(ఇదీ చదవండి: శివంగి మళ్లీ గెలుపు.. బిగ్బాస్ 8 తొలి ఫైనలిస్ట్ ఎవరంటే?)ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్ఫీ రవ్జీ కూతురే జైనాబ్ అని తెలుస్తోంది. ఈమెకు స్కిన్ కేర్కి సంబంధించిన కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, దుబాయి, లండన్లో ఈమె పెరిగింది. కొన్నాళ్ల క్రితంగా ప్రేమలో ఉన్న అఖిల్-జైనాబ్.. పెద్దల్ని ఒప్పించి ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే ఏడాది పెళ్లి ఉంటుందని అక్కినేని ఫ్యామిలీ ప్రకటించింది. ప్రస్తుతం అఖిల్ కాబోయే భార్య ఎవరా అని సోషల్ మీడియాలో అందరూ తెగ వెతికేస్తున్నారు. ఇకపోతే అఖిల్-జైనబ్ని ఆశీర్వదించాలని నాగార్జున అక్కినేని కోరారు. ఇదలా ఉండగా నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య-శోభిత.. డిసెంబరు 4న హైదరాబాద్లో వివాహం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీకి పెళ్లికళ వచ్చేసింది.(ఇదీ చదవండి: అమ్మాయిలకే 'సెకండ్ హ్యాండ్' లాంటి ట్యాగ్ ఎందుకు?: సమంత) -
ఒకే ఫ్రేమ్లో చిరు, నాగ్, మహేశ్.. ఇది కదా కావాల్సింది!
ఒకరిద్దరు స్టార్ హీరోలు ఒక చోట కనిపిస్తేనే అభిమానులు పండగ చేసుకుంటారు. అలాంటిది టాలీవుడ్ అగ్ర హీరోలందరూ ఒక్కచోట కనిపిస్తే ఇంకేమైనా ఉందా? సరిగ్గా అలాంటి అద్భుతమే జరిగింది.. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, సూపర్స్టార్ మహేశ్బాబు, గ్లోబల్ స్టార్ రామ్చరణ్, అఖిల్.. ఇలా అందరూ కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్టార్స్ అంతా ఒకేచోటఓ వ్యాపారవేత్త పుట్టినరోజు వేడుకకు వీళ్లంతా హాజరైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే హీరోలందరూ కలిసి భోజనం చేశారు. ఉపాసన, నమ్రత సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ అద్భుత కలయికకు మాల్దీవులు వేడుకగా నిలిచింది.సినిమా..సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడు. నాగార్జున కుబేర, కూలీ సినిమాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మహేశ్బాబు.. రాజమౌళి డైరెక్షన్లో సినిమా కోసం రెడీ అవుతున్నాడు.చదవండి: ఫైట్ యాక్షన్ సీక్వెన్స్.. సునీల్ శెట్టికి గాయాలు! -
లక్కీ భాస్కర్ డైరెక్టర్ పై మండి పడుతున్న నితిన్, అఖిల్
-
మెగాస్టార్కు ఏఎన్నార్ జాతీయ అవార్డ్.. హాజరైన టాలీవుడ్ సినీ ప్రముఖులు (ఫొటోలు)
-
తిరుపతి నేపథ్యంలో...
వాట్ నెక్ట్స్? అఖిల్ అక్కినేని చేయనున్న కొత్త చిత్రం గురించిన చర్చ ఇది. వార్తల్లో ఉన్న ప్రకారం అఖిల్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న సినిమా అని, ఈ చిత్రాన్ని అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నారని ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఇక మరో చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుందని భోగట్టా. కిరణ్ అబ్బవరం హీరోగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రాన్ని తెరకెక్కించిన మురళీ కిషోర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం.మురళి చెప్పిన కథ నాగార్జునకు నచ్చడంతో హోమ్ బేనర్లో నిర్మించాలని నిర్ణయించుకున్నారట. తిరుపతి నేపథ్యంలో పీరియాడిక్ మూవీగా రూపొందనుందని టాక్. ఈ చిత్రానికి ‘లెనిన్’ టైటిల్ అనుకుంటున్నారని భోగట్టా. అలాగే యూవీ క్రియేషన్స్లో నటించనున్న చిత్రానికి ‘ధీర’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఇది కూడా పీరియాడికల్ బ్యాక్డ్రాప్ మూవీ అట. ఇక అఖిల్ అయితే ఈ మధ్య మేకోవర్ అయ్యారు. ఈ మేకోవర్ ఏ సినిమా కోసం అనేది తెలియాల్సి ఉంది. -
మమ్మల్ని బలిపశువులను చేసింది: అక్కినేని అఖిల్
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పటికే చాలామంది తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో అఖిల్ అక్కినేని కూడా అమల చేసిన ట్వీట్నే షేర్ చేశాడు. అయితే, ఈ క్రమంలో తాజాగా ఆయన మరోసారి కొండ సురేఖపై ఘాటుగానే స్పందించారు.కొండా సురేఖ ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిది. కుటుంబ సభ్యుడిగా, సినీ ఇండస్ట్రీ సభ్యుడిగా నేను మౌనంగా ఉండలేను. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని శిక్షించాలి. ఆమె చేసిన నిరాధారమైన, హాస్యాస్పదమైన ప్రకటనలు అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయి. ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాలని భావించిన ఆమె తన నైతికత, సామాజిక సంక్షేమాన్ని మరచిపోవాలని నిర్ణయించుకుంది. ఆమె వ్యాఖ్యల వల్ల మా కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు కూడా బాధపడ్డారు. ఆమె స్వార్థపూరితంగా నడుచుకుంటుంది. రాజకీయ యుద్ధంలో ఆమె తన కంటే చాలా ఉన్నతమైన విలువలు, సామాజిక అవగాహన ఉన్న అమాయక వ్యక్తులపై సిగ్గు లేకుండా ఇలాంటి దాడి చేసి బలిపశువులను చేసింది. మన సమాజంలో ఆమెలాంటి వాళ్లకు చోటు, గౌరవం లేదు. ఎవరూ సహించలేని ఆమె తీరు ఎప్పటికీ క్షమించబడదు.' అని అఖిల్ అక్కినేని ఘాటుగా స్పందించారు.The baseless and ridiculous statements made by Konda Surekha are vulgar and disgusting. Being a public servant who is expected to protect the people she has decided to forget her morals and social welfare. The way she has acted is shameful and unforgivable. There are respected…— Akhil Akkineni (@AkhilAkkineni8) October 4, 2024 -
హిట్ సినిమా కొట్టిన తర్వాతే అఖిల్ మీ ముందుకొస్తాడు: నాగార్జున
తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని నేడు (సెప్టెంబర్ 20) ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ నిర్వహించిన ఓ వేడుకలో నాగార్జున మాట్లాడారు. తన తండ్రి నటించిన చిత్రాలను ఆయన మరోసారి గుర్తుచేసుకున్నారు.ఎంతో ఘనంగా జరిగిన ఆ ఈవెంట్లో అఖిల్ పాల్గొనలేదు. దీంతో కాస్త నిరుత్సాహపడిన ఫ్యాన్స్ నాగార్జునను ప్రశ్నించారు. అఖిల్ ఎక్కడ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో నాగార్జున రియాక్ట్ అయ్యారు. బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టే వరకూ అభిమానుల ముందుకు రానని అఖిల్ చెప్పినట్టుగా నాగార్జున తెలిపారు. దీంతో అభిమానులు భారీగా కేకలు, విజిల్స్ వేశారు.అభిమానులు చూపుతున్న ప్రేమను చూసి నాగర్జున ఆనందపడ్డారు. వారి గురించి ఆయన ఇలా చెప్పుకొచ్చారు. ' మీరు చూపించే అభిమానం, ఆశీస్సుల వల్లే మేము ఈ స్థానంలో ఉన్నాం. నేడు నాన్నగారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్న వారందరికీ నా ధన్యవాదాలు. ఈ సందర్భంగా కొందరు రక్తదానం చేశారు. ఇలా మీ ప్రేమను పొందడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సమయంలో నాన్నగారు ఉండుంటే చాలా బాగుండేది. నాన్నగారి శత జయంతి సందర్భంగా కొన్ని హిట్ సినిమాలు విడుదల చేస్తున్నాం. ఉచితంగా చూసి మీరందరూ ఆనందించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లతోపాటు పీవీఆర్లో కూడా ఈ చిత్రాలను ఉచితంగా చూడండి.' అని అభిమానులను నాగార్జున కోరారు.#ANR lives on ♥️ #NagarjunaAkkineni about #akhilakkineni at #ANR100 birthday celebration in Hyderabad pic.twitter.com/5ksfKaxBYC— ARTISTRYBUZZ (@ArtistryBuzz) September 20, 2024 -
అఖిల్ ఏజెంట్.. ఎట్టకేలకు వచ్చేస్తోంది!
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన ఫుల్ యాక్షన్ చిత్రం ఏజెంట్. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా మెప్పించింది.అయితే ఈ మూవీ విడుదలై ఏడాది పూర్తయిన ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. గతంలో సోనీలివ్లో స్ట్రీమింగ్కు రానుందని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. ఈ నెలలో మరోసారి ఏజెంట్ సినిమా ఓటీటీకి వస్తోందంటూ టాక్ వినిపించింది. ఈసారి కూడా అభిమానులకు నిరాశే ఎదురైంది.తాజాగా చివరికీ బుల్లితెరపై సందడి చేసేందుకు ఏజెంట్ సిద్ధమైంది. ఈనెల 28న రాత్రి 8 గంటలకు గోల్డ్మైన్స్ టీవీ ఛానెల్లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని గోల్డ్మైన్స్ టెలీఫిల్మ్స్ ట్విటర్ ద్వారా పంచుకుంది. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు డైరెక్ట్గా టీవీల్లో చూసే అవకాశం దక్కింది. అయితే ఇది కేవలం హిందీ వర్షన్లో మాత్రమే టీవీల్లో సందడి చేయనుంది. #Agent (Hindi) @AkhilAkkineni8 | 28th July Sun 8 PM | Tv Par Pehli Baar Only On #Goldmines Tv Channel @mammukka #DinoMorea #SakshiVaidya @GTelefilms pic.twitter.com/UyBDijRU9f— Goldmines Telefilms (@GTelefilms) July 15, 2024 -
మూడు పాన్ ఇండియా మూవీస్ ని రెడీ చేస్తున్న అక్కినేని వారసుడు ...!
-
ఓటీటీకి అఖిల్ ఏజెంట్.. మళ్లీ ఏమైంది?
అక్కినేని హీరో అఖిల్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ఏజెంట్. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రాన్ని రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ సినిమా విడుదలైన ఏడాది పూర్తయినా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు. పెద్ద పెద్ద సినిమాలే రిలీజైన 50 రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. గతంలో పలుసార్లు డేట్స్ అనౌన్స్ చేసినప్పటికీ స్ట్రీమింగ్కు రాకపోవడంతో అఖిల్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కాగా.. ఏజెంట్ ఓటీటీ రైట్స్ సోని లివ్ కొనుగోలు చేసింది. ఈ నెలలో ఓటీటీ రావచ్చని ఫ్యాన్స్ భావించారు. కానీ స్ట్రీమింగ్ తేదీపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల ఏజెంట్ సినిమాను సెప్టెంబరు 29న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు పోస్టర్ విడుదల చేసింది. దీంతో అఖిల్ ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. కానీ ఆ తర్వాత సోనిలివ్ తమ సోషల్ మీడియాలో ఖాతా నుంచి ఏజెంట్ ప్రీమియర్ పోస్టర్ లను తొలగించింది. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరులో స్ట్రీమింగ్ అవుతుందో.. లేదో వేచి చూడాల్సిందే. మరోవైపు అఖిల్ ధీర అనే చిత్రంలో నటిస్తున్నారు. -
ఏడాది తర్వాత ఓటీటీకి ఏజెంట్.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
టాలీవుడ్ యంగ్ అఖిల్ అక్కినేని, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫుల్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్ చిత్రం ఏజెంట్. ఈ చిత్రం గతేడాది థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. సురేందర్ 2 సినిమా, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.కాగా.. ఈ మూవీ ఏప్రిల్ 28, 2023 థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏజెంట్ ఓటీటీకి రాలేదు. దీంతో అభిమానులు ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో చాలాసార్లు స్ట్రీమింగ్కు వస్తుందని భావించినా అలా జరగలేదు. అయితే తాజాగా జూలైలో ఓటీటీకి స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం సోనీ లివ్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్గా నటించగా.. వరలక్ష్మి శరత్కుమార్, మురళీ శర్మ, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. -
ఓటీటీలోకి 'ఏజెంట్' సినిమా.. ట్వీట్ చేసిన నిర్మాత
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్.. లీడ్ రోల్లో నటించిన చిత్రం 'ఏజెంట్'. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. గతేడాది ఏప్రిల్ నెలలో వచ్చిన ఈ సినిమాలో అఖిల్కు జోడీగా యంగ్ బ్యూటిఫుల్ నటి సాక్షి వైద్య నటించారు. ఒక సినిమా థియటర్లోకి వచ్చాక కనీసం 50 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీ రిలీజ్కు నోచుకోలేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు ఇదొక శుభవార్త అనే చెప్పవచ్చు. ఎప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్బంగా ఎజెంట్ నిర్మాత అనిల్ సుంకర శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దీంతో అఖిల్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. ముందు ఏజెంట్ సినిమాను ఓటీటీలో విడుదల చేయండి అంటూ కామెంట్లు చేశారు. దీంతో అనిల్ సుంకర రిప్లై ఇచ్చారు. ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ దక్కించుకున్నట్లు అనిల్ తెలిపారు. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను. అతి త్వరలోనే ఏజెంట్ సినిమా సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతుందని అనిల్ ట్వీట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతుంది. గత ఏడాది ఏప్రిల్ 28న రిలీజైన ఈ మూవీ సుమారు రూ. 85 కోట్లతో తెరకెక్కినట్లు సమాచారం. కానీ ఇందులో పది శాతం కలెక్షన్స్ కూడా సినిమా రాబట్టలేకపోయింది. దీంతో నిర్మాత అనిల్ సుంకరకు భారీగా నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎజెంట్లో మలయాళ టాప్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. దీంతో మలయాళంలో కూడా సినిమాను విడుదల చేశారు. కానీ అక్కడ కూడా డిజాస్టర్గా మిగిలిపోయింది. ఏజెంట్ మూవీతో సాక్షి వైద్య హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అనిల్ సుంకర చేసిన ట్వీట్తో ఏజెంట్ ఓటీటీ విషయంపై మళ్లీ వార్తలు వైరల్ అవుతున్నాయి. I already informed couple of times. We sold the digital to B4U and they to Sony. Hopefully they will do it asap. https://t.co/5k0aFYKZbB — Anil Sunkara (@AnilSunkara1) April 8, 2024 -
సలార్లో అఖిల్ అక్కినేని.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ సతీమణి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'సలార్' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించి తాజాగా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వానికి.. ప్రభాస్, పృథ్వీరాజ్ల యాక్షన్ సీన్స్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సలార్ పార్ట్-2 ఉంటుందని ఇప్పటికే ప్రకటన వచ్చేసింది. దానికి 'సలార్ శౌర్యాంగపర్వం' అనే టైటిల్ కూడా రివిల్ అయిపోయింది. సలార్ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని అతిథి పాత్రలో కనిపించనున్నారంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది. అఖిల్ లుక్తో పాటు అతని బాడీ కూడా బాలీవుడ్ హీరోలకు ఏం తక్కువ కాదు అన్నట్టుగా ఉంటుంది. అఖిల్ భారీ యాక్షన్ సీన్స్లలో దుమ్ములేపగలడు. దీంతో సలార్ పార్ట్ 2లో అఖిల్ ఎంట్రీ దాదాపు ఖాయం అని నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై ప్రశాంత్ నీల్ సతీమణి లిఖితా రెడ్డి తాజాగా స్పందించారు. అవన్నీ పూర్తిగా వదంతులు మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లు అడిగడంతో క్లారిటీ ఇచ్చారు. సలార్లో దేవా తండ్రి పాత్ర ఎవరు పోషిస్తున్నారు..? తన తండ్రిని రాజమన్నార్ చంపాడనే విషయం దేవాకు తెలుసా..? అని చాలామంది అడిగిన ప్రశ్నకు ఆమె రివీల్ చేయలేదు.. సమాధానాల కోసం తాను కూడా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. 'సలార్' గ్లింప్స్లో చూపించిన జురాసిక్ పార్క్ డైలాగ్ గురించి ఆమె చాలా ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. శౌర్యాంగపర్వం విడుదలయ్యాకు ఆ డైలాగ్ కరెక్టా? కాదా? అనేది తెలుస్తుందని తెలిపారు. అంతేకాకుండా పండిట్ రోల్ కూడా సలార్లో కొంత మాత్రమే రివీల్ చేసినట్లు ఆమె చెప్పారు. -
గాయపడ్డ టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్.. ఇంతకీ ఏమైంది?
అక్కినేని యంగ్ హీరో అఖిల్ గాయపడ్డాడు. తాజాగా 'సలార్' సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఇందులో అఖిల్ కనిపించాడు. కాకపోతే ఎడమ చేతికి కట్టు ఉండటంతో పెద్ద దెబ్బ తగిలిందని అర్థమైంది. అసలు ఇంతకీ అఖిల్ చేతికి ఏమైంది? 'సలార్' సక్సెస్ పార్టీలో ఈ కుర్ర హీరో కనిపించడానికి కారణమేంటనేది చూద్దాం. గతేడాది డిసెంబరు 22న థియేటర్లలోకి వచ్చిన 'సలార్' సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ క్రమంలోనే మొన్నీమధ్య బెంగళూరులో గ్రాండ్ సక్సెస్ పార్టీ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు. అదే టైంలో అయ్యగారు అఖిల్ కూడా కనిపించాడు. కాకపోతే చేతికి కట్టుతో కనిపించడంతో గాయం విషయం బయటపడింది. (ఇదీ చదవండి: Salaar OTT: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?) అయితే అఖిల్.. గతేడాది 'ఏజెంట్' మూవీతో వచ్చాడు. ఘోరమైన డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే యువీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ కొత్త దర్శకుడితో అఖిల్ సినిమా అని అప్పట్లో అన్నారు. ఇది నిజమో కాదో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే యువీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ సొంత సంస్థనే. అలా అఖిల్కి ఆహ్వానం అంది ఉండొచ్చు. అలా 'సలార్' సక్సెస్ సెలబ్రేషన్స్లో కనిపించి ఉండొచ్చు. ఇక గాయం విషయానికొస్తే.. బయటకు చెప్పకుండా అఖిల్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడేమో. ఈ క్రమంలోనే గాయమై ఉండొచ్చని అంటున్నారు. మరి ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. చేతికి కట్టు చూస్తే పెద్ద గాయంలానే కనిపిస్తుంది. మరి ఎప్పుడైందో ఏమో? (ఇదీ చదవండి: రూ.100 కోట్ల వసూళ్లు దాటేసిన 'హనుమాన్'.. ఆ విషయమైతే చాలా స్పెషల్) -
అయ్యగారు ఈసారైనా ఓటీటీలోకి వస్తారా..?
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్.. లీడ్ రోల్లో నటించిన చిత్రం 'ఏజెంట్'. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. గతేడాది ఏప్రిల్ నెలలో వచ్చిన ఈ సినిమాలో అఖిల్కు జోడీగా యంగ్ బ్యూటిఫుల్ నటి సాక్షి వైద్య నటించారు. ఒక సినిమా థియటర్లోకి వచ్చాక కనీసం 50 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీ రిలీజ్కు నోచుకోలేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు ఇదొక గుడ్న్యూస్ అనే చెప్పవచ్చు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్కు ఉన్న చిక్కులు అన్నీ తొలగిపోయాయని తెలుస్తోంది. దీంతో జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా 'ఏజెంట్' చిత్రాన్ని 'సోని లివ్' ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా వల్ల సుమారు రూ. 30 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దీంతో ఏజెంట్ చిత్రాన్ని ఓటీటీ సంస్థలు కూడా తీసుకునేందుకు పెద్దగా ముందుకు రాలేదు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందంటూ పలు మార్లు వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల మళ్లీ బ్రేక్ పడుతూ వచ్చింది. ఈసారైనా జనవరి 26న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా..? అంటూ సోషల్మీడియాలో సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ సినిమాలోని అనవసరమైన సన్నివేశాలను తొలగించి.. మంచి సన్నివేశాలను జోడించి కొత్త వెర్షన్ను విడుదల చేయాలనే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నారట. -
నెలలోపే ఓటీటీ వస్తుంటే.. ఈ సినిమాలకేమైంది?
ప్రస్తుత సినిమా ప్రపంచంలో ఓటీటీలదే హవా. తమ అభిమాన స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడొస్తాయా అని చూస్తున్నారు అభిమానులు. సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే.. ఏ ఓటీటీలో వస్తుంది? ఏ రోజు స్ట్రీమింగ్ అవుతుందని తెలుసుకోవాలని తహతహలాడుతుంటారు. పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలు, బ్లాక్ బస్టర్స్ సైతం నెల తర్వాతే ఓటీటీల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రిలీజై నెలల గడుస్తున్నా కొన్ని సినిమాలు ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. ఇంతకీ ఆ సినిమాలేవీ? ఎందుకు రాలేదు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం. అఖిల్ ఏజెంట్… అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. ఏప్రిల్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో కనిపించారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ను సోనీ లివ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అసలు కథేంటంటే? రామకృష్ణ అలియాస్ రిక్కీకి రా(RAW) ఏజెంట్ కావాలనేది కల. దానికోసం మూడుసార్లు పరీక్ష రాసి పాస్ అయినా రిజెక్ట్ అవుతాడు. మహాదేవ్(మమ్ముట్టి) రా చీఫ్. భారతదేశాన్ని టార్గెట్ చేసిన ది గాడ్ (డినో మోరియా)ని అంతం చేయాలనేది ఈయన లక్ష్యం. అందుకోసం ఓ మిషన్ ప్లాన్ చేస్తాడు. అనుకోకుండా ఈ మిషన్లో భాగమవుతాడు. ఇంతకు మహాదేవ్.. రిక్కీకి ఏం చేయమన్నాడు? రిక్కీ రా ఏజెంట్ కల నేరవేరిందా? మహాదేవ్ మిషన్ పూర్తయిందా? లేదా? అన్నదే 'ఏజెంట్' స్టోరీ. నయనతార కనెక్ట్… లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కనెక్ట్. థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టిన ఈ మూవీ ఓటీటీలో మాత్రం రిలీజ్ కాలేదు. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్లో థియేటర్లలో విడుదలైంది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఈ మూవీని నిర్మించాడు. కనెక్ట్ ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ సినిమా మాత్రం ఇప్పటివరకు ఓటీటీ రిలీజ్ కాలేదు. ఆదా శర్మ.. ది కేరళ స్టోరీ ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ.. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం రిలీజ్ నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఓటీటీకి రావడం లేదు. సెన్సిటివ్ కంటెంట్ కావడంతోనే ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. -
అఖిల్పై రూ. 100 కోట్లు.. కొత్త డైరెక్టర్తో ప్రయోగం!
సినిమా ఫలితం ఎలా ఉన్నా.. టాలీవుడ్ మార్కెట్లో అఖిల్ అక్కినేనికి ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఒక్క హిట్ పడితే చాలు..అఖిల్ స్టార్ హీరో అయిపోవడం ఖాయం. కానీ దురదృష్టవశాత్తు..అఖిల్ ఖాతాలో ఇప్పటి వరకు ఓ భారీ హిట్ లేదు. భారీ అంచనాలు పెట్టుకున్న ‘ఏజెంట్’ డిజాస్టర్గా నిలిచింది. దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రానికి రూ. 10 కోట్ల కలెక్షన్స్ కూడా రాలేదు. అంతేకాదు.. ఓటీటీ స్ట్రీమింగ్ సైతం వివాదంలో చిక్కుకొని..ఇప్పటికీ రిలీజ్ కాలేదు. దీంతో అఖిల్ కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే ఏజెంట్ ఫలితాన్ని మర్చిపోయి..కొత్త సినిమాపై దృష్టిపెడుతున్నాడట. రూ. 100 కోట్లతో కొత్త సినిమా ఏజెంట్ రిలీజై ఆరు నెలలు దాటినా..అఖిల్ కొత్త సినిమాను ప్రకటించలేదు. అయితే యూవీ క్రియేషన్స్ బ్యానర్లో అఖిల్ తదుపరి సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీతో అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఫ్లాప్ హీరో, కొత్త డైరెక్టర్ అయినప్పటికీ..దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్తో ప్రయోగం చేయబోతోంది యూవీ క్రియేషన్స్. ప్రస్తుతం అఖిల్కు టాలీవుడ్ మార్కెట్లో ఉన్న విలువ కంటే ఇది చాలా ఎక్కువ. కంటెంట్పై ఉన్న నమ్మకంతోనే రూ. 100కోట్లు పెట్టడానికి కూడా నిర్మాతలు భయపడడం లేదట. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. 2025లో రిలీజ్? అఖిల్ కొత్త సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారట. నాగార్జున సైతం ఈ చిత్రాన్ని దగ్గరుండి చూసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నా సామిరంగ, బిగ్బాస్ 7 షోతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఆయన ఫ్రీ అయిపోతారు. అప్పుడు మరోసారి కథ విని..ఫైనల్ వెర్షన్ని లాక్ చేస్తారట. ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లనుంది. 2025లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
మరింత అందంకోసం సర్జరీ చేయించుకున్న అఖిల్ !
-
అక్కినేని అఖిల్ గురించి వైరల్ అవుతున్న న్యూస్!
అఖిల్ అక్కినేని నటించిన 'ఏజెంట్' చిత్రం తర్వాత ఆయన మళ్లీ కొత్త సినిమాను ప్రకటించలేదు. భారీ యాక్షన్, స్పై థ్రిల్లర్గా 'ఏజెంట్' తెరకెక్కింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్తో కనిపించడం కోసం ఆయన కొన్నినెలలపాటు శ్రమించారు. కానీ ఏజెంట్ అంతగా ప్రేక్షకులను మెప్పించలేదు. ఎజెంట్ సినిమాలో అఖిల్ హాలీవుడ్ హీరోలకు ధీటుగా కనిపిస్తాడు. అతని ప్రధాన బలం హైట్, అందుకు తగ్గట్టు ఆయన మెయిన్టైన్ చేస్తున్న సిక్స్ ప్యాక్.. ఏజెంట్ స్క్రిప్టు పక్కాగా ఉండుంటే భారీ హిట్ అయిండేది. ఇదే విషయాన్ని ఆ చిత్ర నిర్మాత బహిరంగంగానే చెప్పాడు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) తాజాగా అక్కినేని అఖిల్కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ఓ కాస్మోటిక్ సర్జరీ చేయించుకుంటున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే హాలీవుడ్ హీరోలా ఉన్న అఖిల్ మరింత అందంగా కనిపించడానికి తన ముఖానికి స్వల్ప సర్జరీ చేయించుకుంటున్నారని సమాచారం. తన ముక్కుకు సంబంధించి కొన్ని మెరుగులు దిద్దుతున్నారట. దీనికోసం ఆయన విదేశాలకు వెళ్తున్నారని టాక్. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అఖిల్ ఏజెంట్ తర్వాత పక్కా ప్లాన్తో ఒక ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఈ సినిమాకు అనిల్ కూమార్ అనే కొత్త దర్శకుడు డైరెక్షన్ చేయనున్నారని తెలుస్తోంది. అనిల్ గతంలో సాహో, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. ఈ సినిమాకు ధీర అనే టైటిల్ కూడా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తుందని వార్తల వస్తున్నాయి. ఆమె ప్రస్తుతం జూ.ఎన్టీఆర్ దేవర చిత్రంలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
రాజమౌళి పరివేక్షణలో అఖిల్ సినిమా..
-
ఓటీటీలోకి 'ఏజెంట్'.. ఐదు నెలల తర్వాత ఆ రోజే రిలీజ్
ఏ సినిమా అయినా మహా అయితే నెల.. లేదంటే నెలన్నరలోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ అక్కినేని హీరో అఖిల్ నటించిన 'ఏజెంట్' మాత్రం పత్తా లేకుండా పోయింది. అప్పుడెప్పుడో ఏప్రిల్ చివర్లో థియేటర్లలోకి వచ్చింది. ఆ తర్వాత వెంటనే ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకున్నా.. దాన్ని అలా వదిలేశారు. దీంతో అందరూ ఆ మూవీ గురించి మర్చిపోయారు. ఇన్నాళ్లకు ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఏమైంది? దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్తో తీసిన యాక్షన్ మూవీ 'ఏజెంట్'. అయితే రిలీజ్కి ముందు అంచనాలు బాగానే ఉండటంతో.. హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఘోరంగా బోల్తా కొట్టింది. పదుల కోట్ల నష్టాన్ని నిర్మాతకు మిగిల్చింది. దీంతో డిజిటల్ హక్కులు కొనుగోలు చేసిన సోనీ లివ్.. ఓటీటీ రిలీజ్ విషయంలో వెనకడుగు వేసింది. (ఇదీ చదవండి: సమ్మోహనుడా పాట షూటింగ్లో దర్శకుడితో గొడవ, ఏడ్చేసిన హీరోయిన్!) ఐదు నెలల తర్వాత అయితే మే 19నే తొలుత ఓటీటీ రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఆ సమయానికి విడుదల చేయలేదు. అప్పుడు ఇప్పుడు అనుకుంటూ వచ్చారు కానీ పూర్తిగా పక్కనబెట్టేశారు. దీంతో అందరూ 'ఏజెంట్' గురించి మర్చిపోయారు. ఇలాంటి టైంలో సెప్టెంబరు 29 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీలివ్ అధికారికంగా ప్రకటించింది. అంటే దాదాపు ఐదు నెలల తర్వాత ఓ సినిమా ఓటీటీలోకి రానుంది. ఇది నిజంగా విశేషమే. కథేంటి? రామకృష్ణ అలియాస్ రిక్కీకి రా(RAW) ఏజెంట్ కావాలనేది కల. దానికోసం మూడుసార్లు పరీక్ష రాసి పాస్ అయినా రిజెక్ట్ అవుతాడు. మహాదేవ్(మమ్ముట్టి) రా చీఫ్. భారతదేశాన్ని టార్గెట్ చేసిన ది గాడ్ (డినో మోరియా)ని అంతం చేయాలనేది ఈయన లక్ష్యం. అందుకోసం ఓ మిషన్ ప్లాన్ చేస్తాడు. అనుకోకుండా ఈ మిషన్లో భాగమవుతాడు. ఇంతకు మహాదేవ్.. రిక్కీకి ఏం చేయమన్నాడు? రిక్కీ రా ఏజెంట్ కల నేరవేరిందా? మహాదేవ్ మిషన్ పూర్తయిందా? లేదా? అన్నదే 'ఏజెంట్' స్టోరీ. (ఇదీ చదవండి: ఓటీటీలో సూపర్హిట్ లవ్ స్టోరీ.. ఫ్రీగా చూసేయండి!) The wait is over! Brace yourself for the wild adrenaline rush! The Agent starring Mammotty and Akhil Akkineni will be streaming on Sony LIV from 29th Sept.#SonyLIV #AgentOnSonyLIV #Agent @AkhilAkkineni8 @mammukka @DirSurender @sakshivaidya99 @AnilSunkara1 pic.twitter.com/zYL0ljh8M1 — Sony LIV (@SonyLIV) September 22, 2023 -
నువ్వు నా కొడుకు కాబట్టి...అఖిల్ పై నాగార్జున ఫన్నీ కామెంట్స్
-
చాలా స్ట్రెస్ గా ఉంది నాన్న..!
-
అమ్మ మీద చిరాకు పడతావ్ ఏంట్రా..? అక్కినేని నాగార్జున
-
నిన్ను చూస్తే జెలస్ ఉందిరా : అక్కినేని నాగార్జున
-
మిస్టర్ మజ్ను గురించి అక్కినేని నాగార్జున సూపర్ ఫన్ ఇంటర్వ్యూ అఖిల్ తో
-
నిన్న అఖిల్...ఈ రోజు నిఖిల్...మీరు మారిపోయారయ్యా
-
ఫ్లాప్స్ తట్టుకోలేక యూ టర్న్ తీసుకున్న అక్కినేని బ్రదర్స్
-
ఓటీటీలో అఖిల్ 'ఏజెంట్' మూవీ వాయిదా.. స్ట్రీమింగ్ అప్పుడే
అక్కినేని అఖిల్ తాజాగా నటించిన చిత్రం ఏజెంట్. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్గా నటించింది. స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అఖిల్ కెరీర్లో మరో ఫ్లాప్గా మిగిలింది. మేకోవర్ కోసం చాలా కష్టపడిన అఖిల్కు ఏజెంట్ తీవ్ర నిరాశనే మిగిల్చింది. తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్తో ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్పై మరో కన్ఫ్యూజన్ వచ్చి పడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు(మే19)నుంచే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు కూడా సోనీలివ్ ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. చదవండి: షూటింగ్లో ప్రమాదం.. సల్మాన్ఖాన్కు గాయాలు అయితే మళ్లీ ఏమైందో ఏమో కానీ ఏజెంట్ స్ట్రీమింగ్ను వాయిదా వేసింది. థియేటర్ రిలీజ్కు, ఓటీటీ విడుదలకు కనీసం 20 రోజుల గ్యాప్ కూడా లేకపోవడంతో మరో వారం పాటు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. మే26న ఏజెంట్ మూవీ ఓటీటీలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. Were is #Agent OTT RELEASE MAY 19 @SonyLIV @SonyLIVHelps pic.twitter.com/gLANHasQ1S — OTTGURU (@OTTGURU1) May 19, 2023 -
ఏజెంట్పై ఫలితంపై అఖిల్ రియాక్షన్..
అక్కినేని అఖిల్, సాక్షి వైద్యం జంటగా నటించిన చిత్రం ఏజెంట్. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. తాజాగా ఈ చిత్రం రిజల్ట్పై అఖిల్ స్పందించారు. తన ఫ్యాన్స్, ఏజెంట్ మూవీ నటీనటులను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు. అఖిల్ తన ట్వీట్లో రాస్తూ.. 'ఏజెంట్ సినిమాకి ప్రాణం పోయడం కోసం తమ జీవితాలను అంకితం చేసిన నటీనటులు, సిబ్బందికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు. మేము మా స్థాయిలో ఉత్తమంగా ప్రయత్నించాం. కానీ దురదృష్టవశాత్తూ ఈ చిత్రం తెరపై మేము కోరుకున్న విధంగా మెప్పించలేదు. మేము మీ కోసం మంచి చిత్రాన్ని అందించలేకపోయాము. నాకు పెద్ద సపోర్ట్గా నిలిచిన నిర్మాత అనిల్కు ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమాపై నమ్మకం ఉంచిన డిస్ట్రిబ్యూటర్లందరికీ.. మాకు ఎంతో సపోర్ట్ చేసిన మీడియాకు ధన్యవాదాలు. నేను పని చేయడానికి కారణం మీరిచ్చే ప్రేమ, శక్తి . నన్ను నమ్మిన వారి కోసం బలంగా తిరిగి వస్తా.' అంటూ నోట్ విడుదల చేశారు. pic.twitter.com/MxG9cT5c19 — Akhil Akkineni (@AkhilAkkineni8) May 15, 2023 -
మరో తెలుగు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన జాన్వీ కపూర్!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్ సరసన ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో జాన్వీకపూర్ టాలీవుడ్కి పరిచయం కానుంది. ఈ మూవీ సెట్స్పై ఉండగానే ఈ అందాల తార ఇప్పుడు తెలుగులో మరో అవకాశాన్ని దక్కించుకుంది. అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీలో జాన్వీని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. యూవీ క్రియేషన్స్ అఖిల్తో ఓ భారీ బడ్జెట్ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ధీర అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ దాదాపుగా ఫిక్స్ అయ్యిందట. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తుంది. ఇక రామ్చరణ్తో బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమాలోనూ హీరోయిన్గా జాన్వీని ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ లెక్కన NTR30 రిలీజ్ అనంతరం ఈ భామకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తుంది. -
ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లో అఖిల్ కొత్త సినిమా.. టైటిల్ ఇదే!
కేరీర్లో సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తున్న అఖిల్ అక్కినేనికి ప్రతిసారి నిరాశే మిలుగుతుంది. భారీ అంచాలు పెట్టుకున్న ‘ఏజెంట్’ ఇటీవల విడుదలై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలనుకున్నాడు అఖిల్. కానీ ఆయన ప్రయత్నం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అఖిల్ కెరీర్లోనే భారీ డిజాస్టర్ మూవీగా ఏజెంట్ నిలిచింది. (చదవండి: ‘తొలిప్రేమ’ తర్వాత అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను: వాసుకి) అయితే సినిమా ఫలితాన్ని పట్టించుకోకుండా.. తన తర్వాత చిత్రంపై ఫోకస్ పెట్టాడు ఈ అక్కినేని హీరో. ‘సాహో’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన అనిల్ కుమార్ ఇటీవల అఖిల్కు ఓ కథ వినిపించారట. అది తనకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడట. ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లోని ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుందని టాక్. (చదవండి: చైతూ నా దగ్గర ఆ ప్రామిస్ తీసుకున్నాడు: వెంకట్ ప్రభు ) అంతేకాదు ఈ చిత్రానికి ‘ధీర’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఫిల్మ్నగర్లో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. మరి ఈ చిత్రంతోనైనా అఖిల్ సాలిడ్ హిట్ కొడతాడో లేదో చూడాలి. -
అక్కినేని కుటుంబాన్ని వెంటాడుతున్న ఫ్లాపులు.. స్పందించిన చై!
అక్కినేని ఫ్యామిలీకి బ్యాడ్ టైం నడుస్తోంది. ఇటీవలి కాలంలో వారు నటించిన సినిమాలేవీ విజయం సాధించలేదు. నాగార్జున మొదలు నాగ చైతన్య, అఖిల్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. సక్సెస్ పదం విని చాలాకాలమే అయింది. గతేడాది నాగార్జున, చైతన్య కలిసి నటించిన బంగార్రాజు చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నాగార్జున నటించిన 'ది ఘోస్ట్', చైతన్య 'థాంక్యూ', అఖిల్ 'ఏజెంట్'.. సినిమాలన్నీ చతికిలపడ్డాయి. ఈ క్రమంలో అక్కినేని ఫ్యాన్స్ అంతా ఓ సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో కస్టడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచేందుకు సిద్ధమయ్యాడు నాగచైతన్య. మే 12న కస్టడీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ సమావేశంలో చైతూకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 'అక్కినేని అభిమానులు ఏడాదికాలంగా స్ట్రాంగ్ కమ్బ్యాంక్ కోసం ఎదురుచూస్తున్నారు. అన్నీ నిరాశాజనకమైన ఫలితాలే వస్తున్నాయి. అభిమానులకు ఏం చెప్పదలుచుకున్నారు?' అని ఓ పాత్రికేయుడు చైను ప్రశ్నించాడు. దీనికి యువసామ్రాట్ స్పందిస్తూ.. 'అభిమానులకు మేము ఎప్పుడూ సక్సెస్నే ఇవ్వాలనుకుంటాం. వారు మాపై ఎంతో ప్రేమాభిమానాలను చూపిస్తారు. ఎల్లప్పుడూ మద్దతుగా నిలబడతారు. వారికి మేము బహుమతిగా మంచి సినిమాను మాత్రమే ఇవ్వగలం. మా కుటుంబం నుంచి వచ్చిన గత కొన్ని సినిమాలు వర్కవుట్ అవలేదు. అనుకున్న ఫలితాలు రాలేదు. ఈ కెరీర్లో ఎత్తుపల్లాలు సహజమే! అందరూ దాన్ని అంగీకరించక తప్పదు. త్వరలోనే ఈ బ్యాడ్టైం ముగిసిపోతుంది. మళ్లీ మేము హిట్ ట్రాక్ ఎక్కుతాం. కస్టడీతోనే అది ప్రారంభమవుతుంది. నాకు ఆ నమ్మకముంది' అని చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. చదవండి: టార్చర్, రోజూ నన్ను కొట్టి హింసించేవాడు: నటి సర్జరీ వికటించడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయా: ప్రియాంక చోప్రా -
మా నాన్న స్టోరీ వినలేదు.. నాన్న కథ విన్నారు
-
ఇప్పటికే డైరెక్టర్ ని వెనకేసుకొస్తున్న ఏజెంట్ ప్రొడ్యూసర్
-
'ఏజెంట్ ఫ్లాప్'..డిప్రెషన్లోకి అఖిల్? ఒంటరిగా దుబాయ్కి..
అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాకొట్టింది. స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఆశించనంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్తో డిజాస్టర్ అనిపించుకుంది. అఖిల్ కెరీర్లో మరో ఫ్లాప్ వచ్చి చేరింది. ఏజెంట్ సినిమా కోసం అఖిల్ సుమారు రెండేళ్లు కష్టపడ్డాడు. జిమ్లో గంటల కొద్దీ శ్రమించి లుక్ మొత్తం మార్చుకున్నాడు. ఈ సినిమాతో సాలిడ్ హిట్ వస్తుందనుకుంటే ఊహించని విధంగా దెబ్బ పడింది. చదవండి: అభిమానిని తోసేసిన షారూక్ ఖాన్.. మండిపడుతున్న నెటిజన్స్ దీనికి తోడు సోషల్ మీడియాలోనూ విమర్శలు, ట్రోలింగ్తో అఖిల్ కాస్త డిప్రెషన్కు వెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో దాన్నుంచి బయటపడేందుకు సింగిల్గా దుబాయ్కు వెకేషన్కు వెళ్లిపోయాడు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. చదవండి: VD12: రౌడీ హీరోతో శ్రీలీల.. ఘనంగా సినిమా ప్రారంభం -
క్షమించండి తప్పంతా మాదే
-
Agent OTT Release: మూడు వారాల్లో ఓటీటీలోకి ఏజెంట్, మరీ ఇంత త్వరగానా?
ఏజెంట్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు అఖిల్ అక్కినేని. కానీ చివరకు ఆ సినిమా ఫ్లాప్ టాక్ మూటగట్టుకోవడంతో తన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఈ సినిమా పరాజయానికి బాధ్యత వహిస్తూ నిర్మాత అనిల్ సుంకర సోషల్ మీడియా వేదికగా సినీప్రియులకు క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే! తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఓటీటీలో ఏజెంట్ స్ట్రీమింగ్ డేట్ గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతుండటంతో ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీలివ్ స్పందించింది. ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. మే 19 నుంచి సోనీలివ్లో ప్రసారం కానున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజైన ఏజెంట్ మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుందా? అని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. కాగా ఏజెంట్ సినిమాతో సాక్షి వైద్య హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీలో డినో మోరియా విలన్గా నటించాడు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఐటం సాంగ్ చేసింది. హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు. #AGENT Streaming On from May 19 Sony LIV Platform Telugu | Kannada | Malayalam | Tamil #AgentOnSonyLIV pic.twitter.com/gzCm5hktuS — Filmy Corner (@filmycorner9) May 3, 2023 చదవండి: బ్రో, నా కిడ్నీ తీసుకుంటావా? షారుక్ తనయుడిపై ట్రోలింగ్ -
ఏజెంట్ సినిమా ఎఫెక్ట్ తో రూట్ మార్చిన అక్కినేని ఫ్యామిలీ
-
పూజా హెగ్డేతో డేట్కు వెళ్లాలనుంది : అఖిల్ అక్కినేని
అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్గా నటించింది. భారీ బడ్జెట్తో గ్రాండ్గా రిలీజైన ఈ చిత్రం ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఫలితంగా రిలీజైన తొలిరోజే నెగిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఫలితంగా అఖిల్ కెరీర్లో ఇంకో డిజాస్టర్గా ఏజెంట్ మిగిలిపోయింది. చదవండి: (ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్ను ఆపేసిన పోలీసులు.. వీడియో వైరల్) ఇక సినిమా ఫెయిల్యూర్పై స్వయంగా నిర్మాత అనిల్ సుంకర కూడా బౌండ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కి వెళ్లాం, తప్పు జరిగింది అంటూ ఓపెన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రీసెంట్గా సుమ షోకి గెస్టుగా వెళ్లిన అఖిల్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఏ హీరోయిన్గా డేట్కి వెళ్తారు అని అడగ్గా.. ఏమాత్రం ఆలోచన లేకుండా పూజా హెగ్డే అంటూ ఠక్కున సమాధానం చెప్పాడు. ఇక హీరో రామ్చరణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, హార్ట్బీట్ అంటూ పేర్కొన్నాడు. ఇక నాగార్జునకు తెలియకుండా గోడదూకి వెళ్లానని, ఇప్పటికీ ఆయనకు ఈ విషయం తెలియదంటూ సీక్రెట్ బయటపెట్టేశాడు అఖిల్. చదవండి: బ్రేకప్ అయినా ఇంకా నేనే కావాలని కోరుకుంటున్నాడు: నటి -
ఏజెంట్ కోసం అఖిల్ కష్టాలు.. తెలిస్తే షాక్ అవుతారు ...
-
ప్రతి ఒక్కరినీ క్షమాపణలు కోరుతున్నాం: ఏజెంట్ నిర్మాత
అక్కినేని అఖిల్, సాక్షి వైద్య జంటగా నటించిన చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ సారైనా అఖిల్ హిట్ కొడతాడని భావించినా అభిమానులకు నిరాశ తప్పలేదు. అయితే తాజాగా ఈ మూవీ ఫలితంపై టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు. ఏజెంట్ మూవీ ఫ్లాప్కు పూర్తి బాధ్యత తమదేనని వెల్లడించారు. (ఇది చదవండి: కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో) అనిల్ సుంకర ట్వీట్లో రాస్తూ.. 'ఏజెంట్ మూవీపై వస్తున్న విమర్శలకు మాదే పూర్తి బాధ్యత. ఇది ఒక పెద్ద టాస్క్ అని తెలుసు. కానీ దాన్ని జయించగలమని అనుకున్నాం. ఈ ప్రాజెక్ట్ ప్రారంభించడంలో పొరపాట్లు చేశాం. కొవిడ్ వల్ల మరిన్ని ఇబ్బందులు పడ్డాం. అయితే దీనికి ఎలాంటి సాకులు నేను చెప్పదలచుకోలేదు. చాలా పెద్ద మిస్టేక్ చేశాం. ఈ సినిమాతో చాలా నేర్చుకున్నాం. మరోసారి ఇలాంటివీ పునరావృతం కాకుండా చూసుకుంటాం. మా చిత్రబృందంపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరినీ క్షమాపణలు కోరుతున్నాం. రాబోయే ప్రాజెక్టుల్లో ఇలాంటి నష్టం జరగకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తాం.' అని పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మించగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి-2 బ్యానర్స్పై తెరకెక్కించారు. (ఇది చదవండి: ‘ఏజెంట్’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..?) We have to take the entire blame for #Agent. Though we know its an uphill task, we thought of conquering but failed to do so as we did a blunder starting the project without a bound script & innumerable issues including covid followed. We don't want to give any excuses but learn… — Anil Sunkara (@AnilSunkara1) May 1, 2023 -
కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అఖిల్, హీరోయిన్గా జాన్వీ!
యంగ్ హీరో అఖిల్ నటించిన ఏజెంట్ థియేటర్లలో సందడి చేస్తోంది. కాగా ఆయన నటించనున్న తర్వాతి చిత్రం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడు అనిల్ ఇటీవల అఖిల్కు ఓ కథ చెప్పారు. ఈ స్టోరీ నచ్చడంతో అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ మూవీ నిర్మించనుందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెల్లడి కానుందనే టాక్ ఫిలిం నగర్లో వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ను చిత్రయూనిట్ సంప్రదించారని భోగట్టా. కాగా అఖిల్ ఇటీవల నటించిన ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే! భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఏజెంట్తో హిట్ కొట్టాన్న అఖిల్ గురి తప్పడంతో ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెంచాడు. చదవండి: కానిస్టేబుల్ పరీక్షలో బలగం ప్రశ్న -
విజయ్ దేవరకొండ, అఖిల్ కెరీర్ని దెబ్బ తీసిన ‘బామ్మర్ది’!
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నాయి. దీంతో బడా హీరోలతో పాటు యంగ్ స్టార్స్ కూడా పాన్ ఇండియాపై ఫోకస్ పెట్టారు. వాటిలో చాలా వరకు విజయవంతం అయ్యాయి. కానీ ఓ రెండు చిత్రాలు మాత్రం భారీ అంచనాలతో విడుదలై.. అట్టర్ ఫ్లాప్ చిత్రాలుగా మారాయి. అవే విజయ్ దేవరకొండ ‘లైగర్’, అఖిల్ ‘ఏజెంట్’. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’పై బాలీవుడ్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రచార చిత్రాలు.. ప్రమోషన్ కార్యక్రమాలు చూసి మరో తెలుగు సినిమా.. పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టినా.. తర్వాత రోజు నుంచి చతికిల పడింది. భారీ బడ్జెట్తో తెరరెక్కిన లైగర్.. బయ్యర్లకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. (చదవండి: సోషల్ మీడియాలో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రష్మిక) ఇక ఈ నెల 28న విడైదలైన ‘ఏజెంట్’పై కూడా అలాంటి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమాతో అఖిల్ పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ విడుదలైన తొలి రోజు ఈ మూవీ డిజాస్టర్ టాక్ని సొంతం చేసుకుంది. లైగర్ కోసం విజయ్ దేవరకొండ.. ఏజెంట్ కోసం అఖిల్ చాలా కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్ కూడా చేశారు. అయితే తమ కష్టానికి తగ్గ కథను ఎంచుకోవడంలో ఇద్దరు విఫలమయ్యారు. అందుకే రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. (చదవండి: మండుటెండలో తిరుగుతున్నా, ఎవరూ ఇల్లు అద్దెకివ్వడం లేదు: నటి) అయితే ఈ రెండు చిత్రాల డిజాస్టర్ వెనుక ‘బామ్మర్ది’ ఉన్నాడనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఎవరీ బామ్మర్ది అంటే.. ఈ రెండు చిత్రాల్లో ‘సాలా’ అనే పదం బాగా హైలెట్ అయింది. సాలా అంటే హిందీలో బామ్మర్ది అని అర్థం. దీన్ని తెలుగులో బూతు పదంగానూ వాడుతున్నారు. ఇలాంటి పదాలను బాగా ఇష్టపడే పూరి జగన్నాథ్.. లైగర్కి ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనే ట్యాగ్ లైన్ తగిలించారు. ఇక ఏజెంట్లో సురేందర్ రెడ్డి హీరో క్యారెక్టర్ని ‘వైల్డ్ సాలా’ అంటూ పరిచయం చేయించాడు. ఈ రెండింటిలోనూ ‘సాలా’ కామన్గా ఉంది. రెండూ డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో టాలీవుడ్కి ‘సాలా’ పదం అచ్చిరావడంలో లేదని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది సిల్లీ సెంటిమెంట్. కంటెంట్లో బలం లేకపోవడంతో రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. అయితే టాలీవుడ్లో సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. నిజంగా సాలా పదం అచ్చిరాదేమో అని భావించేవాళ్లు కూడా ఉంటారు. మరి భవిష్యత్తులో ‘సాలా’తో సాలిడ్ హిట్ కొడతారో లేదా సెంటిమెంట్తో ఆ పదమే వాడడానికి భయపడతారో చూడాలి. -
‘ఏజెంట్’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..?
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటెట్ మూవీ ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఏప్రిల్ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సారి ‘అయ్యగారి’కి పక్కా హిట్ వస్తుందని అక్కినేని అభిమానులు ఆశపడ్డారు. కానీ వారి కోరిక నెరవేరలేదు. తొలిరోజు ఈ ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫ్లాప్ టాక్ను సొంతం చేసుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు తక్కువ వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రం ఫస్ట్డే ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ. 7 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే సాధించింది. అందులో తెలుగు రాష్ట్రాలలోనే రూ.4 కోట్లు వసూలు చేయడం గమనార్హం. (చదవండి: కొడుకుపై ట్రోలింగ్.. తొలిసారి రియాక్ట్ అయిన అమల అక్కినేని) ఇక ప్రాంతాల వారిగా చూస్తే నైజాంలో 1.33 కోట్లు, సీడెడ్ - రూ. 64 లక్షలు, ఉత్తరాంధ్ర - రూ. 54 లక్షలు, ఈస్ట్ - రూ. 29 లక్షలు, వెస్ట్ - రూ. 30 లక్షలు, గుంటూరు - రూ. 52 లక్షలు, కృష్ణా - రూ. 22 లక్షలు, నెల్లూరు - రూ. 16 లక్షలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.అఖిల్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్(సుమార్ రూ.80 కోట్లు)తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వైడ్గా రు. 37 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే రు. 38 కోట్ల షేర్ వస్తేనే అఖిల్ బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కుతాడు. (చదవండి: బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన పీఎస్ 2.. ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే..) కానీ తొలి రోజే ఇంత తక్కువ వసూళ్లను రాబట్టిందంటే.. బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమేనని ట్రేడ్ పండితులు అంటున్నారు. అయితే అఫీషియల్గా ఫస్ట్ డే వసూళ్ల వివరాలు రాకపోయినా, ఈ రిపోర్ట్స్ చూస్తే మాత్రం నిజంగానే అఖిల్ కెరీర్లో ఏజెంట్ అతిపెద్ద డిజాస్టర్గా కాబోతున్నట్లు తెలుస్తుంది. కాగా, ఈ మూవీలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి, డినో మోరియా ప్రధాన పాత్రలు పోషించారు. సాక్షి వైద్య హీరోయిన్ కాగా, హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు. -
కొడుకుపై ట్రోలింగ్.. తొలిసారి రియాక్ట్ అయిన అమల అక్కినేని
అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా నిన్న(శుక్రవారం)గ్రాండ్గా రిలీజైన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై యాక్షన్థ్రిల్లర్గా విడుదలైన ఈ సినిమా తొలిరోజే నెగిటివ్ టాక్ను తెచ్చుకుంది. అఖిల్ వంద శాతం ఈ సినిమా కోసం కష్టపడినా కథ, స్క్రీన్ ప్లే బాలేకపోవడంతో ఏజెంట్ సినిమాను, అఖిల్ను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. చదవండి: అదిరిపోయిన విజయ్ ఆంటోని 'బిచ్చగాడు-2' ట్రైలర్ రిలీజ్కు ముందు భారీ హైప్ క్రియేట్ చేసినా సినిమా ఏమాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఏజెంట్ మూవీపై వస్తున్న ట్రోలింగ్పై అఖిల్ తల్లి అమల అక్కినేని తొలిసారిగా స్పందించారు.ట్రోలింగ్ అనేది ఇన్సెక్యూరిటీస్ వల్ల వస్తుంటుంది. కానీ అవి విజయానికి దోహదపడుతుంటాయి. నిన్న ఏజెంట్ సినిమా చూసి నిజంగానే చాలా ఎంజాయ్ చేశాను. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయి..కానీ మీరు ఓపెన్ మైండ్తో చూస్తే కశ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నేను వెళ్లిన హాల్ మొత్తం నిండిపోయింది. అందులో ఎక్కువగా ఆడవాళ్లు, అమ్మలు, అమ్మమ్మలు ఉన్నారు. యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు వాళ్లంతా అరుపులు, కేకలతో బాగా ఎంజాయ్ చేశారు. ఒకటి మాత్రం చెప్పగలను.. అఖిల్ నెక్ట్స్ చేయబోయే సినిమా మరింత బెటర్గా ఉంటుంది అంటూ అమల తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు. చదవండి: ప్రియురాలితో నటుడి సహజీవనం, రెండోసారి గర్భం దాల్చిన మోడల్ View this post on Instagram A post shared by Amala Akkineni (@akkineniamala) -
ఆ ఓటీటీలో ఏజెంట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గత చిత్రాల్లో రొమాంటిక్గా కనిపించిన అఖిల్ ఏజెంట్ సినిమాలో అందుకు భిన్నంగా వైల్డ్గా కనిపించేందుకు ప్రయత్నించాడు. స్పై థ్రిల్లర్ యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ కంటే ఎక్కువగా నెగెటివ్ టాకే వస్తోంది. దీంతో హీరో అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందని అభిమానులు బాధపడుతున్నారు. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అంతంతమాత్రమే స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీలివ్ ఇదివరకే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే కదా! తాజాగా ఏజెంట్ మూవీ నెల లోపే ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే మే నెలాఖరులోపు సోనీలివ్లో ఏజెంట్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. వీలైతే మే మూడో వారంలోపే ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. ఇక ఏజెంట్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో మమ్ముట్టి కీలక పాత్ర పోషించాడు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించగా అనిల్ సుంకర నిర్మించారు. చదవండి: స్టార్ హీరోతో హీరోయిన్ లవ్.. నటుడి విరహవేదన.. ఇన్నాళ్లకు స్పందించిన నటి -
ఏజెంట్ మూవీ పబ్లిక్ టాక్ వీడియో
-
‘ఏజెంట్’మూవీ ట్విటర్ రివ్యూ
మాస్ ఇమేజ్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు అఖిల్ అక్కినేని. తొలి సినిమా కోసం మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ని ఎంచుకొని భారీ బడ్జెట్తో ‘అఖిల్’ని తీశాడు.అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో తన పంథాని మార్చి లవర్ బాయ్గా మారాడు. అయినా కూడా పెద్ద సెక్సెస్ని అందుకోలేకపోయాడు. చివరి మూవీ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్` ఓ మోస్తరు విజయం సాధించింది. అయినా కూడా లవర్ బాయ్గా ఉండేందుకు అఖిల్ ఇష్టపడటం లేదు. మాస్ హీరోగా నిరూపించుకోవడానికి ఈ సారి ‘ఏజెంట్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్పై థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రానికి `కిక్` ఫేమ్ సురేందర్రెడ్డి దర్శకుడు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంతో కొత్త అమ్మాయి సాక్షి వైద్య హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 28) ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ఏజెంట్’కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలు ట్విటర్లో చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. Jus Now I have completed my Show .it was kutha ramp for masses . justification has been done for tha tag #wildsale ..🥵🥵🥵🙏🙏🙏 will be first 100cr share from Tier 2 Those whoever wants to take screen shot they can ...#Agent — Pawanfied (@OnlyPSPK_) April 28, 2023 ట్విటర్లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమాలో యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయని అంటున్నారు. యాక్షన్ పరంగా అఖిల్ ఆకట్టుకున్నాడని చెబుతున్నారు. కానీ కథ బలంగా లేదని కామెంట్ చేస్తున్నారు. ఫస్టాఫ్ కొంత ఫర్వాలేదు కానీ సెకండాఫ్ కొంపముంచిందని నెటిజన్స్ అంటున్నారు. అఖిల్ వన్ మ్యాన్ షో అని కామెంట్ చేస్తున్నారు. #Agent what a mess..Surender Reddy completely lost it..feel sorry for Akhil..not even one department was decent..bgm was horrible and the graphics are awful..the film looks incomplete..I am not sure if DI is complete…it had a dark shade throughout.. Disaster. — akhil_maheshfan2 (@Maheshfan_1) April 28, 2023 Akhil One man Show 💥💥💥 Action Sequences Mathram 👌👌👌 Love story 😢😢😢 Songs 😢😢😢 BGM 🥵 Interval And Climax KCPD 💥💥💥 Negetive Reviews patinchukovadhu Movie Bagundhi 👍👍 Rating:3/5 #Agent #AkhilAkkineni pic.twitter.com/UUwvOYhVez — Srinivas (@srinivasrtfan2) April 28, 2023 Interval bang that's a wild ride @DirSurender mark 1st half and that looks good Especially Action scenes and dailogues 🔥🔥#Agent — RAVANNAsura (@Karthik70504619) April 28, 2023 #Agent An engaging Spy Action Film! Akhil is extra ordinary in this movie and can see his hard work and dedication in action sequences and comedy scenes, cinematography and BGM are main highlights of the movie. Surendra reddy delivers a hit again after SyeRaa. pic.twitter.com/DwhK91ZbYO — Johnnie Walker (@roopezh) April 28, 2023 #Agent: 👉#Agent is such a terrible film. In recent times, Telugu Film Industry has not produced such a bad film 👉It’s a third-rate film because of the medicore direction and predictable plot 👉#AkhilAkkinen’s transformative efforts are futile#AgentReview #Mammootty — PaniPuri (@THEPANIPURI) April 28, 2023 #Agentreview from USA premiere : Excellent Response💥💥💥 Great action episodes Akhil's terrific screen presence 💥💥 Awesome screenplay Never Before Songs Kummesayi, WildSaale Song Mind-blowing🥵 Full of suspense n twists. ⭐⭐⭐⭐/5#AkhilAkkineni #Agent #BlockbusterAgent 🔥💥 — RAVANNAsura (@Karthik70504619) April 28, 2023 Interval bang that's a wild ride @DirSurender mark 1st half and that looks good Especially Action scenes and dailogues 🔥🔥#Agent — RAVANNAsura (@Karthik70504619) April 28, 2023 -
ఆ ఆఫర్ స్కామ్ అనుకున్నాను
‘‘తెలుగులో నా తొలి సినిమా ‘ఏజెంట్’. మంచి సినిమాతో పరిచయం కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు సాక్షీ వైద్య. అఖిల్ హీరోగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో రూ΄పొందిన చిత్రం ‘ఏజెంట్’. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో సాక్షీ వైద్య మాట్లాడుతూ – ‘‘వృత్తి రీత్యా నేను ఫిజియోథెరపిస్ట్ని. కోవిడ్ సమయంలో ఖాళీగా ఉండటం ఇష్టం లేక సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ చేశాను. అవి వైరల్ అయ్యాయి. ఆ తర్వాత నా స్నేహితుల సలహా మేరకు కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను. కొన్ని అవకాశాలు వచ్చినా నచ్చలేదు. కాగా ‘ఏజెంట్’ ప్రొడక్షన్ టీమ్ నుంచి ఒకరు ఫోన్ చేసి హీరోయిన్ చాన్స్ గురించి చెప్పారు. ఈ ఆఫర్ను నేను మొదట్లో స్కామ్ అనుకున్నాను. కానీ ముంబైలో ఉన్న ఓ కాస్టింగ్ డైరెక్టర్ ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పెద్ద బేనర్ అని, పెద్ద దర్శకుడు, పెద్ద స్టార్ అని చెప్పగానే హైదరాబాద్ వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను. ‘ఏజెంట్’ కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రంలో పైలెట్ పాత్రలో కనిపిస్తాను. ‘ఏజెంట్’ నాకు మంచి అనుభూతిని ఇచ్చింది. ప్రస్తుతం వరుణ్ తేజ్తో ‘గాంఢీవదారి అర్జున’ చేస్తున్నాను’’ అన్నారు. -
డైరెక్షన్ ఆలోచన ఉంది
‘‘ఏజెంట్’ ఒక యాక్షన్ ఫిల్మ్. ముగ్గురు ఏజెంట్స్ మధ్య జరిగే కథ ఇది. కథ భిన్నంగా ఉంటుంది. భావోద్వేగాలు కూడా బలంగా ఉంటాయి. అఖిల్ కెరీర్లో ‘ఏజెంట్’కి ముందు, ‘ఏజెంట్’కి తర్వాత అనేలా ఉంటుంది. విజువల్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి. ప్రేక్షకులకు గొప్ప అనుభూతి ఇచ్చే చిత్రం ఇది’’ అని నిర్మాత అనిల్ సుంకర అన్నారు. అఖిల్ అక్కినేని, సాక్షీ వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనిల్ సుంకర మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు యంగ్ హీరోలు డూప్ లేకుండా చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఒక నిర్మాతగా సేఫ్టీ చూసుకోమని యాక్షన్ కొరియోగ్రాఫర్కి చెప్తాను. ఈ మధ్య విజయవాడలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో అఖిల్ దాదాపు 170 అడుగుల ఎత్తు నుంచి దూకాడు. రోప్స్ కట్టినప్పటికీ రిస్క్ ఎందుకని నేను వద్దన్నాను. అయితే అఖిల్ చేస్తానన్నాడు. క్రెడిట్ అంతా తనకే దక్కుతుంది. ‘ఏజెంట్’లో ప్రేక్షకులు ఇలాంటి సాహసాలు చాలా చూస్తారు. ఇది భారీ స్పాన్ ఉన్న సినిమా. ఇందులో గంటన్నర కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉంటాయి. అందుకే చాలా సమయం పట్టింది. ‘ఏజెంట్’ని ముందు తెలుగులో రిలీజ్ చేసి, రెండో వారం నుంచి ఇతర భాషల్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం. హిందీలో ఇప్పటికే డబ్బింగ్ పూర్తయింది. నాకు దర్శకత్వం చేసే ఆలోచన ఉంది. నా డైరెక్షన్లో స్పై జోనర్లో సినిమా ఉంటుంది. మా 14 రీల్స్ బ్యానర్లో ఈ ఏడాది బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి. ప్రస్తుతం చిరంజీవిగారితో నిర్మిస్తున్న ‘భోళా శంకర్’ సినిమా యాక్షన్ సీన్స్ జరుగుతున్నాయి. ఆగస్ట్ 11న ఈ సినిమా విడుదలకి డేట్ ఫిక్స్ చేశాం’’ అన్నారు. -
వరంగల్లో ‘ఏజెంట్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక
-
షూటింగ్లో నటితో అసభ్యంగా ప్రవర్తించిన అఖిల్? అసలు విషయమిదే!
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా గురించి పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తాజాగా అఖిల్ ఏజెంట్ మూవీలో ఓ ప్రత్యేక సాంగ్లో ఆమె కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే తనకు తాను సెన్సార్ బోర్డ్ మెంబర్గా చెప్పుకునే వివాదస్పద సినీ క్రిటిక్ ఉమైర్ సంధుపై బాలీవుడ్ నటి ఆగ్రహం వ్యక్తం చేసింది. అతను చేసిన ఫేక్ ట్వీట్పై ఊర్వశి ఫైర్ అయింది. ఇలాంటి ఫేక్ పోస్ట్ చేసినందుకు అతనిపై పరువునష్టం దావా వేసినట్లు తెలిపింది బాలీవుడ్ బ్యూటీ. ఈ మేరకు తన ఇన్స్టాలో ఓ పోస్ట్ చేసింది. అసలు ట్వీట్లో ఏముంది? అఖిల్ అక్కినేని.. ఊర్వశి రౌతేలాతో ఏజెంట్ మూవీ షూట్లో అసభ్యంగా ప్రవర్తించాడని ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ను చూసిన బాలీవుడ్ భామ ఇది ఫేక్ అంటూ కొట్టిపారేసింది. అంతటితో వదలకుండా అతనిపై విమర్శల దాడి చేసింది. నువ్వు జర్నలిస్టే కాదంటూ చురకలంటించింది. ఇలాంటి ఫేక్ వార్తలు తమ కుటుంబానికి చాలా అసౌకర్యంగా కలిగించాయని ఊర్వశి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయంలో ఊర్వశి రౌతేలా అభిమానులు మద్దతుగా నిలిచారు. #AkhilAkkineni “ Harassed ” Bollywood Actress #UrvashiRautela during Item Song Shoot of #Agent in Europe. As per her, He is very immature kind of actor & feeling uncomfortable working with him. pic.twitter.com/4MR48Vtgxc — Umair Sandhu (@UmairSandu) April 18, 2023 View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
అఖిల్ బాబు కామెడీ అయ్య బాబోయ్..
-
అఖిల్ 'ఏజెంట్' ప్రీ రిలీజ్ ఈవెంట్కు వచ్చేది ఎవరో తెలుసా?
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏకే ఇంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తుంది. తొలిసారి భారీ యాక్షన్ మూవీతో రంగంలోకి దిగిన అఖిల్ ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. బ్యాక్ టూ బ్యాక్ ఈవెంట్స్తో బాక్సాఫీస్ వద్ద బాగానే బజ్ క్రియేట్ చేశారు. ఈనెల 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో వరంగల్లో ఈరోజు(ఆదివారం)ప్రీ రిలీజ్ ఈవెంట్కు అంతా సిద్దమయ్యింది. అయితే ఈ వేడకకు టాలీవుడ్ బిగ్ స్టార్స్ పేర్లు మొదట వినిపించినా ఇప్పటివరకు కార్లిటీ రాలేదు. ఫైనల్గా కింగ్ నాగార్జున గెస్టుగా రానున్నట్లు మేకర్స్ తెలిపారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. The Massive Pre-Release Event of #AGENT will be graced by the one & only KING @IamNagarjuna 🔥 TOMORROW from 6PM onwards at Rangaleela Maidanam, Warangal 💥💥#AgentOnApril28th @AkhilAkkineni8 @mammukka @sakshivaidya99 @DirSurender @AnilSunkara1 @AKentsOfficial @shreyasgroup pic.twitter.com/Zted60TqH9 — AK Entertainments (@AKentsOfficial) April 22, 2023 -
ఆ విషయం తెలిశాక అమ్మ ఎమోషనల్ అయ్యింది : అఖిల్
‘‘30 ఏళ్లకు పైగా మా నాన్నగారు (నాగార్జున) ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లో ఆయనకు మంచి గ్రిప్ ఉంది. నాకేమైనా సందేహాలు ఉంటే ఆయన్ని అడిగి తెలుసుకుంటాను. అయితే ఫలానా స్క్రిప్ట్ ఓకే చేయలా? వద్దా అని అడగను. అలా చేస్తే నా కెరీర్ తాలూకు ఒత్తిడిని నాన్నపై పెట్టినట్లు ఉంటుంది. ఆయన ప్రమేయం ఎక్కువగా ఉంటే ఓ వ్యక్తిగా నేను ఎదగలేకపోవచ్చు. అందుకే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాను. ఈ కారణంగానే ‘ఏజెంట్’ స్క్రిప్ట్ను నాన్నతో షేర్ చేయలేదు’’ అన్నారు అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటింన చిత్రం ‘ఏజెంట్’. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మింన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అఖిల్ చెప్పిన విశేషాలు. ఆ ఒక్క సెంటిమెంట్ ఫాలో అవుతున్నా! ♦ నాకు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. నా గత చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ టైమ్లో సూరిగారు (సురేందర్ రెడ్డి) ‘ఏజెంట్’ కథ చెప్పారు. నాకూ నచ్చింది. దాంతో వెంటనే అనౌన్స్ చేశాం. అయితే స్క్రిప్ట్ పూర్తి కావడానికి, నా లుక్ మార్చుకోవడం, లాక్డౌన్ వంటి వాటి వల్ల ఈ సినిమా ఆలస్యమైంది. ♦ ‘ఏజెంట్’లో నేను రామకృష్ణ (రిక్కీ) అనే పాత్ర చేశాను. రిక్కీ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ‘ఏజెంట్’ ఒక మంచి స్పై డ్రామా. సురేందర్ రెడ్డిగారు ప్రతిదీ ఫైన్ ట్యూన్ చేస్తారు. నేను ఆయన్ను బ్లైండ్గా ఫాలో అయ్యాను. ఇక సెకండాఫ్లో వచ్చే టార్చర్ సీన్ కోసం చాలా కష్టపడ్డాను. ♦సాధారణంగా నేను సెంటిమెంట్స్ను నమ్మను. అయితే ఏప్రిల్ 28న ‘అడవి రాముడు’, ‘పోకిరి’, ‘బాహుబలి’ వంటి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు విడుదలయ్యాయి. ఇలాంటి హిట్ సినివలు విడుదలైన ఏప్రిల్ 28న ‘ఏజెంట్’ సినిమా విడుదల అవుతోంది. ఈ సెంటి మెంట్ను మాత్రం ఫాలో అవుతున్నాను. ♦నాన్నగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నా కల. అది నాన్నగారి వందో సినిమా అయితే నాకు ఇంకా సంతోషం. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. కానీ నాకు తెలిసి అలాంటి స్క్రిప్ట్ ఏదీ ఫైనలైజ్ కాలేదు. ‘ఏజెంట్’ సినిమా ట్రైలర్ చూసి, నేను చాలా కష్టపడ్డానని తెలిసి మా అమ్మగారు (అక్కినేని అమల) ఎమోషన్ అయ్యారు. -
మూవీ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించడానికి నానా కష్టాలు పడుతున్న అఖిల్, తేజ్
-
Agent Movie: సముద్ర తీరాన ఏజెంట్ మూవీ స్పెషల్ ఇంటర్వ్యూ (ఫొటోలు)
-
Agent కటౌట్ ఒకే...
-
Akhil Akkineni : పెళ్లిపై స్పందించిన అఖిల్
-
తన రిలేషన్ షిప్ స్టేటస్ బయటపెట్టేసిన అఖిల్ అక్కినేని
అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్.సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ కెరీర్లో తొలిసారి పాన్ ఇండియా చిత్రంగా వస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా కాకినాడలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల్ మాట్లాడుతూ పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కొంతకాలంగా అఖిల్ పెళ్లిపై పలు వార్తలు వస్తున్నాయి. తాజాగా పెళ్లెప్పుడు అని అభిమాని అడిగిన ప్రశ్నకు అఖిల్ సమాధానిమిస్తూ..“అప్పుడే పెళ్లి చేసుకోమంటారా?” అంటూ ఫన్నీగా బదులిచ్చాడు. ప్రస్తుతం సింగిల్గానే ఉన్నానంటూ తన రిలేషన్షిప్పై క్లారిటీ ఇచ్చాడు. -
అఖిల్ ఏజెంట్ కి దెబ్బేస్తున్నారు..100 కోట్ల సినిమా పరిస్థితి ఏంటి ?
-
నాగచైతన్య-శోభిత డేటింగ్ చేస్తున్నారా? అఖిల్ ఏమన్నాడంటే..
సమంతతో విడిపోయిన తర్వాత అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రూమర్స్పై ఇంతవరకు అటు చై, శోభిత దూళిపాళ స్పందించకపోయినా వారి ప్రేమ వ్యవహారం మాత్రం ఫిల్మ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతూనే ఉంది. రీసెంట్గా లండన్లోని ఓ రెస్టారెంట్లో వీరిద్దరు కలిసున్న ఓ ఫోటో లీక్ అయ్యి ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో చై-శోభితల రిలేషన్షిప్ నిజమేనంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ వ్యవహారంపై అఖిల్ అక్కినేని స్పందించారు. ఏజెంట్ మూవీ ప్రెస్మీట్లో భాగంగా పాల్గొన్న అఖిల్కు.. ''మీ అన్నయ్య నాగచైతన్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు. ఎవరో అమ్మాయితో ఫొటోలో కనిపించి(శోభిత దూళిపాళను ఉద్దేశిస్తూ) నెట్టింట హాట్టాపిక్గా మారాడు. మరి మీ పరిస్థితి ఏంటి''?అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దానికి అఖిల్ బదులిస్తూ..'నా పరిస్థితి ఏజెంట్ మూవీ. రెండేళ్లుగా జుట్టు, బాడీని మెయిన్టైన్ చేయడమే సరిపోయింది. నా దృష్టి మొత్తం సినిమాలపైనే' అంటూ బదులిచ్చాడు. ప్రస్తుతం అఖిల్ చేసిన ఆ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. -
రిపోర్టర్స్ ముక్కు సూటి ప్రశ్నలకు అఖిల్ స్మార్ట్ ఆన్సర్స్
-
హీరోయిన్ సాక్షి మాటలకూ అఖిల్,సురేందర్ రెడ్డి ఎలా నవ్వుతున్నారో చూడండి..
-
హీరోయిన్ సాక్షిని చాలా సార్లు తిట్టాను ఇంకా కొట్టడం ఏంటి..!
-
మెంటల్ గా, ఫిసికల్ గా నా లైఫ్ ని మొత్తం మార్చేసింది...