Bill Gates
-
'ఆ నిర్ణయం నన్ను ఎంతగానో బాధించింది': బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు 'బిల్ గేట్స్' (Bill Gates).. 1975లో హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని విడిచిపెట్టినందుకు చాలా బాధపడినట్లు, ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. కాలేజీ రోజులు చాలా అద్భుతంగా గడిచాయని పేర్కొంటూ.. 'సోర్స్ కోడ్: మై బిగినింగ్' (Source Code: My Beginnings) అనే పుస్తకంలోని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.మనస్తత్వశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, చరిత్రకు సంబంధించిన తరగతులను హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంతగానో ఆస్వాదించాను. తెలివైన వ్యక్తులతో సమయం గడపడం నాకు చాలా ఇష్టం. రాత్రి సమయంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి చర్చించుకునే వాళ్ళం. 1975లో సాఫ్ట్వేర్ కంపెనీ మొదటి సీఈఓగా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు.. యూనివర్సిటీలో చదువు మానేయాల్సి వచ్చింది. ఆ నిర్ణయం నన్ను బాధించిందని బిల్ గేట్స్ అన్నారు. అయితే డిగ్రీ పూర్తి చేయడానికి మళ్ళీ యూనివర్సిటీకి వెళ్లాలనిపించినా.. అది సాధ్యం కాలేదు.బిల్ గేట్స్.. తన మిత్రుడు 'పాల్ అలెన్'తో కలిసి కంప్యూటర్ల కోసం ఓ కొత్త సాఫ్ట్వేర్ను సృష్టించగలిగితే, ఆ రంగంలో ముందంజలో ఉండవచ్చని భావించి.. రెండేళ్లు కృషి చేశారు. ఆ సమయంలో చదువును బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్నారు. కానీ కుదరకపోవడంతో.. చదువు మానేయాల్సి వచ్చింది. అయితే టెక్ ప్రపంచంలో అగ్రగామిగా ఎదిగారు.ఇదీ చదవండి: ఇలాంటి జాబ్ చేయడం సాధ్యమేనా?.. కంపెనీ ఆఫర్పై నెటిజన్లు ఫైర్!సోర్స్ కోడ్: మై బిగినింగ్ పుస్తకం విషయానికి వస్తే.. ఇది మొత్తం మూడు భాగాలుగా వచ్చే అవకాశం ఉంది. ఈ బుక్ మొదటి భాగంలో బిల్ గేట్స్ చిన్న నాటి విషయాలు, యూనివర్సిటీలో చదువు, ప్రయోగాలకు సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఉద్యోగం, మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించిన విషయాలతో పాటు.. మెలిందా గేట్స్తో వివాహం వంటి మరిన్ని విషయాలు.. ఆ తరువాత వచ్చే పుస్తకాల్లో ఉండే అవకాశం ఉంది.బిల్ గేట్స్ 2000లో పదవీవిరమణ చేసే వరకు మైక్రోసాఫ్ట్ సీఈఓగా సంస్థను ముందుకు నడియాపారు. ఆ సమయంలో కంప్యూటర్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు జరిగాయి. ఇదే బిల్ గేట్స్ను ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరుగా నిలబడేలా చేసింది. ప్రస్తుతం కంపెనీ విలువ మూడు ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. -
టెక్ బిలియనీర్ లవ్ స్టోరీ : స్టార్ హీరోయిన్తో లవ్? కానీ పెళ్లి మాత్రం!
ఆధార్ ఖర్చుపై సంచలన వ్యాఖ్యల్ని చేసిన హాట్మెయిల్ కో-ఫౌండర్ సబీర్ భాటియా ట్రెండింగ్లో ఉన్నాడు. ఇటీవల విడుదల చేసిన యూట్యూబ్ పాడ్కాస్ట్లో సబీర్ భాటియా ఆధార్ సహా టెక్నాలజీ అంశాలపై కీలక విషయాలు ప్రస్తావించారు. ఆధార్ కోసం చేసిన (1.3 బిలియన్ల ఖర్చును వృథా అని చెప్పడంతోపాటు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నాడు. ముఖ్యంగా అతని లవ్ స్టోరీ, పెళ్లి విడాకులు లాంటి అంశాలు నెట్టింట సందడిగా మారాయి. బాలీవుడ్ ప్రముఖులతో పరిచయాలు, చాలామంది స్టార్లతో డేటింగ్ చేయడం మొదలు, చాలా మంది మహిళలు తన పట్ల ఆకర్షితులయ్యేవారని, పెళ్లి చేసుకోవడానికి సుముఖంగా ఉండేవారని సబీర్ భాటియా చెప్పుకొచ్చాడు. అయితే వీటన్నంటికీ భిన్నంగా తన కుటుంబ స్నేహితురాలు, బైద్యనాథ్ గ్రూప్కు చెందిన తాన్యా శర్మతో ప్రేమలో పడినట్టు వెల్లడించాడు. (బెస్ట్ ఫ్రెండ్ సంగీత్ వేడుకలో రాధికా అంబానీ స్టెప్పులు)సబీర్ భాటియా చెప్పిన వివరాల ప్రకారం తాన్య శర్మ కుటుంబంతో తమ కుటుంబానికి ఎనిమిదేళ్లుగా పరిచయం. ఈ పరిచయంతోనే రెండు కుటుంబాలు తమ స్నేహాన్ని కుటుంబ సంబంధంగా మార్చుకోవాలని నిర్ణయించాయి. అలాగే నిజానికి సబీర్ తాన్యను ప్రేమిస్తున్నప్పటికీ, ఆమెను కోడలిగా తెచ్చుకోవాలనే కోరిక మాత్రం తల్లిదే. తల్లి కోరిక మేరకు ఆమెతో మాట్లాడిన తరువాత, ఆమె ప్రేమలో పడటం, జీవితాంతం ఆమెతో గడపాలని భావించాడు.దీంతో వీరి పెళ్లి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. సబీర్ భాటియా, తాన్య శర్మ జంట 2007, డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు.ఆ తర్వాత మలేషియాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. 2008, మార్చి 9న, మలేషియాలోని ప్రసిద్ధ లంకావి ద్వీపంలో గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. దాదాపు 270 మంది ప్రముఖులను వివాహానికి ఆహ్వానించారు. ఈ పెళ్లి కోసం సబీర్ మొత్తం లంకావి ద్వీపాన్నే బుక్ చేసుకున్నాడట.పెళ్లైన కొన్నాళ్లకు వీరికి ఒక పాప పుట్టింది. ఈ పాపకు 'అరియాన్నా' అనే పేరు పెట్టారు. తాన్యా గుడ్కేర్ ఫార్మాకు డైరెక్టర్ (బైద్యనాథ్ గ్రూప్ సోదరి సంస్థ గుడ్కేర్ ఫార్మా)గా ఉన్నారు. తాన్యా ముంబైలోని ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ నుండి మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ అలాగే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి కోర్సును కూడా చదివింది.అయితే పెళ్లైన ఐదేళ్లకు వీరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. 2013లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక కోర్టులో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత అరియాన్నా చిన్నది కనుక ఆమె కస్టడీ హక్కులు తల్లి తాన్యా శర్మకు అప్పగించారు. ఐశ్వర్యారాయ్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడట!అందాల ఐశ్వర్యం ఐశ్వర్య రాయ్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడట సబీర్. ఈ విషయంలో నటుడు సల్మాన్ ఖాన్తో పెద్ద పోటీయే ఉండేదట. 2001లో ఒక పార్టీలో వీరిద్దరి మధ్యా ఘర్షణ జరిగినట్టు కూడా వార్తలొచ్చాయి. అయితే ఈ పుకార్లను మీడియా ఊహాగానాలుగా భాటియా తోసిపుచ్చాడు.కాగా సబీర్ భాటియా 1996లో హాట్మెయిల్ను సృష్టించడం ద్వారా ఇమెయిల్ కమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. తన వ్యాపార భాగస్వామి జాక్ స్మిత్తో కలిసి, భాటియా తొలి వెబ్ ఆధారిత ఇమెయిల్ సేవలలో ఒకదాన్ని ప్రవేశపెట్టారు. అయితే స్థాపించిన 18 నెలలకే దీన్ని అమెరికన్ బిలియనీర్ బిల్ గేట్స్కు విక్రయించాడు. దీంతో రాత్రికి రాత్రే వేలకోట్లకు అధిపతియ్యాడు. ఈసొమ్ముతో మరిన్ని కంపెనీలను నిర్మించాడు. ఇది టెక్నాలజీ రంగంలో అతిపెద్ద, గేమ్-ఛేంజింగ్ ఒప్పందాలలో ఒకటిగా టెక్ వర్గాలు భావించాయి. ఈ డీల్ ద్వారా సబీర్ రూ. 3300 కోట్ల మొత్తాన్ని అందుకున్నాడు. దీన్నే ఇపుడు ఔట్లుక్గా పిలుస్తున్నారు. ప్రస్తుతం సబీర్ భాటియా AI-ఆధారిత అభ్యాస వేదిక, షోరీల్కు నాయకత్వం వహిస్తున్నాడు. -
నిక్కచ్చిగా తొలి పాతికేళ్ల ‘సోర్స్ కోడ్’!
మహాకవి పోతన రచించిన ఒక పద్యం ‘ఒక సూర్యుండు సమస్త జీవులకు దానొక్కక్కడై తోచు’ అని మొదలవుతుంది. శత కోటీశ్వరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాకుడు బిల్ గేట్స్ను ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తారు. కొందరికి ఆయన తిరుగులేని విజయం సాధించిన కార్పొరేట్ దిగ్గజం. రాగల దశా బ్దాల్లో ప్రపంచాన్ని శాసించే సాంకేతికతను ముందే పసిగట్టి, అందుకోసం యాభైయ్యేళ్ల నాడే ఒక సంస్థను స్థాపించిన దార్శనికుడు. మరికొందరికి ఆయన దాతృత్వశీలి. తన స్వచ్ఛంద సంస్థ మెలిందా–గేట్స్ ఫౌండేషన్ ద్వారా వెనకబడిన దేశాల్లో ఎన్నో సేవా కార్యక్రమాల్లో, ఆరోగ్య పరిరక్షణలో పాటుపడుతున్న మహనీయుడు. కానీ అనేకులకు ఆయన అనుమానాస్పదుడు. ఆయన సేవా కార్యకలాపాల వెనక స్వప్రయోజనాలున్నాయని వారు సంశయిస్తారు. బిల్ గేట్స్ గురించి చాలా పుస్తకాలొచ్చాయి. అందులో ఆయన్ను కీర్తించినవీ ఉన్నాయి, తూర్పారబట్టినవీ ఉన్నాయి. కానీ ఇంతకూ బిల్ గేట్స్ ఎవరు? తన గురించి తాను చెప్పుకోవాల్సి వస్తే ఏం చెబుతారు? వీటన్నిటికీ జవాబుగా ఫిబ్రవరి 4న తన స్వీయచరిత్ర ‘సోర్స్ కోడ్–మై బిగినింగ్స్’ పుస్తకం వెలువరించారు. మొత్తం మూడు భాగాలుగా వచ్చే స్వీయచరిత్రలో ఇది తొలి భాగం. ఇందులో బాల్యం నుంచి తొలి పాతికేళ్ల ప్రస్థానం ఉంది. బిల్ గేట్స్ వరకూ పుస్తకం వచ్చిన సందర్భం అనేక విధాల ముఖ్యమైనది. ఆయనకు ఈ సంవత్సరంతో 70 ఏళ్లు వస్తాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ స్థాపించి 50 ఏళ్లవుతుంది. దివంగతుడైన ఆయన తండ్రికి ఇది శతజయంతి సంవత్సరం. ఏడాదిన్నర క్రితం తన గురించి తాను రాసుకోవాలనిపించిందని,ఇందులో తన ఎదుగుదలకు కారకులైన తల్లితండ్రుల గురించీ, కుటుంబం గురించీ, ఇద్దరు బాల్యస్నేహితుల గురించీ చెప్పాలనిపించిందని ఆయనే ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తన సమకాలీకులతో పోలిస్తే ఆయనెప్పుడూ కొన్ని దశాబ్దాల ముందు ఆలోచించేవారని బిల్ గేట్స్ గురించి ఇప్పటికే చాలామంది చెప్పారు. కానీ ఈ పుస్తకం కోసం ఆయన కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్లారు. ఒక మనిషి ఎదుగు దలకైనా, పతనానికైనా కుటుంబ ప్రభావం, పెంపకం ఎలా దోహద పడతాయో ఈ పుస్తకంలో వివరించారు. తండ్రికి కోపం తెప్పించిన సందర్భంస్వీయచరిత్ర రాయదల్చుకున్నవారికి నిజాయితీ ముఖ్యం. తన తప్పొప్పులన్నిటినీ నిర్భయంగా చెప్పగలిగినప్పుడే ఆత్మకథకు పూను కోవాలి. తాను మానవాతీతుడినన్న అహం ఉండకూడదు. తన ఎదు గుదల ఎలా సాధ్యమైందో, జీవితం ఏయే మలుపులు తిరిగిందో, తన ప్రతి అడుగులోనూ ఎవరెవరు అండదండలు అందించారో, ఎవరిపట్ల తాను నిర్దయగా వ్యవహరించాడో, ఆ తప్పును ఏ దశలో గుర్తించాడో, ఎలా సరిదిద్దుకున్నాడో చెప్పగలగాలి. ఈ చట్రంలో ఇమిడే స్వీయచరిత్రలు మనదగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తక్కువ. బిల్గేట్స్ తన గురించి తాను ఏం చెప్పుకుంటారన్న ఆసక్తి అందరిలో ఉంటుంది. తొలి భాగం ‘సోర్స్ కోడ్’ ఆ విషయంలో అందరి మన్ననలూ పొందే అవకాశం ఉంది. ఇది బాల్యం గురించే కనుక, ఆ దశలో ఆయన్ను వివాదాలు చుట్టుముట్టే అవకాశం లేదని అనుకుంటారు. కానీ బాల్య జీవితంలోని కొన్ని అంశాలను నిస్సంశయంగా చెప్పటం ద్వారా బిల్ ఫుల్మార్క్లు కొట్టేశారు. అది అమెరికా కనుక 1970ల నాటికే అందరికీ కంప్యూటర్ గురించి తెలిసిపోయింది. పర్సనల్ కంప్యూటర్ల వాడకమూ మొదలైంది. కాకపోతే ఇప్పటిలా నిత్యావసర వస్తువు కాదు. బాగా ధనవంతులకు మాత్రమే సాధ్యపడే విలాసవంతమైన ఉపకరణం. అలాగని బిల్ గేట్స్ తల్లిదండ్రులు నిరుపేదలు కాదు. వారి కుటుంబం ఇతరు లతో పోలిస్తే సుఖంగానే జీవనం సాగించేది. తండ్రి గేట్స్ సీనియర్ సమాజం పట్లా, కుటుంబం పట్లా ఎంతో నిబద్ధతతో ఉండేవాడని బిల్ గుర్తు చేసుకున్నారు. ఆచితూచి వ్యవహరించేవాడని, పిల్లల పట్ల దయతో, శ్రద్ధాసక్తులతో ఉండేవాడని రాశారు. ఆయన ఒకే ఒకసారి ఉగ్రుడయ్యాడట. అది కూడా తన లోపమేనని ఆయనంటారు.డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో విషయమై మూర్ఖంగా వాదించేసరికి ఉండబట్టలేక ఆయన గ్లాసులో ఉన్న నీటిని బిల్ గేట్స్ ముఖంపై చిమ్మారట. ‘థాంక్స్ ఫర్ ద షవర్’ అంటూ అక్కడి నుంచి బిల్ నిష్క్రమించారు. ‘ఎప్పుడూ ఎంతో శాంతంగా, ప్రేమగా ఉండే తండ్రిని నా ప్రవర్తన ద్వారా సహనం కోల్పోయేలా చేశాను’ అని బిల్ రాశారు. ‘చిన్నప్పుడంతా ‘జటిలమైన కొడుకు’గానే ఉండేవాడిని’ అంటారు. ‘ఇప్పుడైతే ఆ ప్రవర్తన చూసి కచ్చితంగా ఆటిజంతో బాధపడేవాడిగా పరిగణించివుండేవారు’ అని చెబుతారు. చిన్ననాడే మద్యపానం, గంజాయి, ఎల్ఎస్డీ వంటివి అలవా టైన సంగతి, వాటికి దూరమైన సంగతి కూడా బిల్ దాచుకోలేదు. కొన్ని విషయాల్లో తమ పిల్లాడు ఎందుకంత ఆలోచిస్తాడో, ప్రవర్తి స్తాడో తెలుసుకోవటానికి అవసరమైన పుస్తకాలు, ఇతరేతర సమా చారం తల్లితండ్రులకు ఉండేది కాదంటాడు. ‘పెద్దవాళ్లను కలవటం, వారితో చర్చించటం, వారి సలహాలు, సూచనలు పాటించడం అనే సంస్కృతిని అమ్మానాన్న, అమ్మమ్మ అలవాటు చేశారు. అందుకే ఎక్కడికి తీసుకెళ్లినా పెద్దవాళ్లతో చొరవగా మాట్లాడటం, వారిని ప్రశ్నలతో వేధించటం, సంతృప్తికరమైన జవాబు వచ్చేవరకూ ఆ ప్రశ్నల పరంపరను కొనసాగించటం అలవాటైంది. అది జీవితంలో ఎదగటానికి తోడ్పడింది’ అని బిల్ గేట్స్ అభిప్రాయపడతారు. ముఖ్యంగా అమ్మ, అమ్మమ్మ తనలో పోటీతత్వాన్ని ఎంతగానో పెంచారంటారు. తన జీవితంలో చోటుచేసుకున్న ఈ అంశాలను చెప్పటం అవి అందరికీ ఉపయోగపడతాయన్న ఉద్దేశమేనని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తన పుట్టుకే అయాచితంగా అదనపు హక్కు (ప్రివిలేజ్)ను ఇచ్చిందని నిజాయితీగా ఒప్పుకోవటం ప్రశసించ దగ్గది. అప్పటికే జాతిపరమైన విభేదాలతో నిలువునా చీలివున్న సియాటెల్ సమాజంలో తాను శ్వేతజాతిలో పుట్టడం, అందులోనూ మగవాడిని కావటం ఎంతో కలిసొచ్చిందని బిల్ స్వీయాభిప్రాయం. పుట్టుకతోనే ప్రతిభావంతులమని స్వోత్కర్షకు పోయేవారికి ఇదొక కనువిప్పు. మేము లేకుండా కంప్యూటర్ విప్లవమా?హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పేనాటికి బిల్ గేట్స్కూ, ఆయన బాల్యస్నేహితుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అలెన్కూ, 17 యేళ్లవయసులోనే మృత్యు వాత పడిన మరో స్నేహితుడు కెంట్ ఇవాన్స్కూ పర్సనల్ కంప్యూ టర్పై అవగాహన ఉంది. ఎయిత్ గ్రేడ్లో ఉన్నప్పుడు పాఠశాల కొచ్చిన కంప్యూటర్తో ఎక్కువ సమయం గడిపేందుకు కంప్యూ టర్లో బగ్స్ సృష్టించామని, అది కనిపెట్టి తననూ, ఇవాన్స్నూ వెళ్లగొట్టారని బిల్ గేట్స్ చెప్పారు. తర్వాత కాలంలో కంప్యూటర్లలో బగ్స్ గుర్తించి తొలగించే పనికి కుదిరి కొంత డబ్బు సంపాదించిన ఉదంతాలూ ఉన్నాయి. కంప్యూటర్ను నిర్వహించే సీసీసీ కంపెనీ మూతపడటంతో దాని నిర్వహణ భారాన్ని స్కూల్లో తనకు అప్పగిస్తే, మిత్రుడు అలెన్ సాయంతో దాన్ని పూర్తిచేశారు. తన తొలి వ్యాపార భాగస్వామిగా ఇవాన్స్ తనతో జతకట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంచాడని, అతని మరణం ఒక్కటే తన బాల్యంలో చోటుచేసుకున్న విషాదకర సంఘటనని ఆయన వివరి స్తారు. తమ ప్రమేయం లేకుండానే కంప్యూటర్ విప్లవం వెల్లువెత్తు తుందేమోనన్న ఆత్రుత గేట్స్కూ, అలెన్కూ ఉండేదంటే... తాము అందులో పాలుపంచుకుని ప్రముఖంగా ఎదగాలనుకున్నారంటే వారి తపన ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. అప్పుడే ఈ ఇద్దరు మిత్రులూ ఎంఎస్–డాస్ ఆపరేటింగ్ సిస్టమ్, బేసిక్ వంటి సాఫ్ట్వేర్ రూపకల్పనలు చేయ గలిగారు.ఇవాళ్టిరోజున మైక్రోసాఫ్ట్లో బిల్ గేట్స్ వాటాల విలువ 10,780 కోట్ల డాలర్లు. ప్రపంచంలో ఆయన 13వ అతి పెద్ద ఐశ్వర్యవంతుడు. 2021లో ఆయనతో విడిపోయిన మాజీ భార్య మెలిందా ఫ్రెంచ్ గేట్స్ వాటాలు 3,040 కోట్ల డాలర్ల పైమాటే. అన్నట్టు, దీని అనంతరం రాబోయే పుస్తకాల్లో చాలా వివాదాస్పద విషయాలుంటాయి. ‘సోర్స్ కోడ్’ విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలు గమనిస్తే ఆయన దేన్నీ దాచదల్చలేదని స్పష్టమవుతుంది. మిత్రుడు అలెన్ను దూరం చేసుకోవటం తప్పేనని అంగీకరించారు. మైక్రోసాఫ్ట్లో కొందరు మహిళా ఉద్యోగినులతో తన వివాహేతర సంబంధాలు, లైంగిక నేరాలకు పాల్పడ్డాడని ఆరోపణ లొచ్చిన ఫైనాన్షియర్ జెఫ్రీ ఎపిస్టీన్తో తనకున్న అనుబంధం, 27 ఏళ్ల వివాహబంధం అనంతరం భార్యతో విడాకులు, స్టీవ్ జాబ్స్తో పరిచయం, గొడవలు వంటి వ్యవహారాలపై బిల్ గేట్స్ అరమరికలు లేకుండా మాట్లాడారు. ఇంకా పర్యావరణం, ఏఐ వరకూ అభివృద్ధిపరిచిన సాంకేతికత, కరోనా మహమ్మారి, డోనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ల తీరుతెన్నులు వగైరాలు ఈ ఇంటర్వ్యూల్లో ప్రస్తావన కొచ్చాయి. కనుక రాబోయే రెండు భాగాల్లో వీటికి సంబంధించి మరిన్ని వివరాలందిస్తారని తెలుస్తూనే ఉంది. తెంపల్లె వేణుగోపాలరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడుvenujourno@gmail.com -
ఆమె నా అదృష్టం.. పెదవి విప్పిన బిల్ గేట్స్
అపర కోటీశ్వరుడు, తిరుగులేని విజయం సాధించిన కార్పొరేట్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) ఇటీవల వార్తల్లో నిలిచారు. మెలిందా ఫ్రెంచ్ నుండి విడాకులు తీసుకున్న దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత, బిల్ గేట్స్ ఇటీవల ది టైమ్స్ ఆఫ్ లండన్తో మాట్లాడుతూ తన నిర్ణయం పట్ల చింతిస్తున్నానని చెప్పారు. అయితే గతం నుంచి బయటకు వచ్చినట్లు కనిపిస్తున్నారు. దాతృత్వవేత్త పౌలా హర్డ్తో (Paula Hurd) ఆయన బంధంలో కొనసాగుతున్నారు. ఆమెతో ఉన్న సంబంధం గురించి మొదటిసారిగా బిల్ గేట్స్ పెదవి విప్పారు.తాజాగా ‘టుడే షో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పౌలాతో ఉన్న సంబంధాన్ని బిల్గేట్స్ బయటపెట్టారు. "పౌలా వంటి సీరియస్ గర్ల్ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం. మేము సరదాగా గడుపుతున్నాం. ఒలింపిక్స్కు వెళ్తున్నాం. ఇంకా మరెన్నో" అంటూ పేర్కొన్నారు. బిల్ గేట్స్ పౌలా హర్డ్ గురించి బహిరంగంగా మాట్లాడటం ఇదే మొదటిసారి అయినప్పటికీ, ఈ జంట తరచుగా అనేక కార్యక్రమాలలో కలిసి కనిపించారు.ఎవరీ పౌలా హర్డ్?పౌలా హర్డ్ (62)ను పౌలా కలుపా అని కూడా పిలుస్తారు. ఇది ఈమె తొలి పేరు. పౌలా గతంలో ఒరాకిల్ సీఈవో మార్క్ హర్డ్ను వివాహం చేసుకోగా 2019లో ఆయన అకాల మరణం చెందారు. పౌలా, మార్క్ వివాహం జరిగి 30 సంవత్సరాలు అయింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పౌలా హర్డ్ పరోపకారి. విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాలలో ప్రసిద్ధి చెందారు. కాగా బిల్ గేట్స్, మెలిందా ఫ్రెంచ్ వివాహం 27 సంవత్సరాల క్రితం జరిగింది. వారికి ముగ్గురు సంతానం ఉన్నారు. 2021లో వారు విడాకులు తీసుకున్నారు.బిల్ గేట్స్ ఆత్మకథ బిల్ గేట్స్(70) స్వీయ చరిత్ర ‘సోర్స్ కోడ్–మై బిగినింగ్స్’ (Source Code: My Beginnings) తాజాగా అమెరికా మార్కెట్లోకి విడుదలైంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ స్థాపించి 50 ఏళ్లవుతోంది. అదేవిధంగా, తన తండ్రి శత జయంతి సంవత్సరం. ఈ సందర్భాన తన ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులు, బాల్య స్నేహితుల గురించీ చెప్పాలనిపించినట్లు ఒక సందర్భంలో ఆయనే చెప్పారు.తన సమకాలికులతో పోలిస్తే బిల్ గేట్స్ ఎప్పుడూ కొన్ని దశాబ్దాలకు ముందు వెళ్లి ఆలోచిస్తారని చాలా మంది అంటుంటారు. అటువంటిది, ఆత్మ కథ కోసం ఆయన కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లారు. ఒక మనిషి ఎదుగుదల లేదా పతనాలకు కుటుంబం ప్రభావం ఎలా ఉంటుందో గేట్స్ ఈ పుస్తకంలో వివరించారు. తన స్వీయ రేఖా చిత్రం తాలూకూ స్కెచ్ ఎంతో శ్రద్ధగా గీసి, దానికి అవసరమైన రంగులద్ది ఎంతో ప్రతిభావంతంగా రూపొందించిన పెయింటింగ్లా ఉంది ఈ స్వీయచరిత్ర. తన తండ్రి గేట్స్ సీనియర్ కుటుంబం, సమాజం అంటే ఎంతో నిబద్ధతతో ఉండేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. పిల్లలంటే ఎంతో దయతో ప్రేమతో వ్యవహరించేవారని చెప్పారు. ఆయనకు ఒకే ఒకసారి బాగా కోపం వచ్చిందట. అది కూడా తన లోపమేనంటారు బిల్ గేట్స్. డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో విషయమై మూర్ఖంగా వాదించేసరికి ఉండబట్టలేక ఆయన గ్లాసులో ఉన్న నీటిని బిల్ గేట్స్పై ముఖంపై చిమ్మారట. వెంటనే ‘థాంక్స్ ఫర్ ది షవర్స్’అంటూ బిల్ అక్కడి నుంచి వెళ్లిపోయారట.ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ ఎప్పుడూ శాంతంగా ఉండే తన తండ్రి తన ప్రవర్తన ద్వారా సహనం కోల్పోయేలా చేశానని బిల్ రాశారు. ఎక్కడికి వెళ్లినా పెద్ద వాళ్లతో చొరవగా మాట్లాడటం, వారిని ప్రశ్నలతో వేధించడం, సంతృప్తి కరమైన జవాబు వచ్చే వరకు ప్రశ్నల పరంపరను కొనసాగించడం అలవాటైందని, జీవితంలో ఎదుగుదలకు అది ఎంతగానో తోడ్పడిందని ఆయన చెప్పుకున్నారు. -
CBN.. చెబితే నలుగురు నమ్మేలా ఉండాలి!
దావోస్ పెట్టుబడుల విషయంలో తెలుగుదేశం, ఎల్లోమీడియాలు కలిసికట్టుగా ప్రజలను మోసం చేస్తూ దొరికిపోయారు. దావోస్కు వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది మిథ్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు.. తను చెప్పే మాటలన్నీ మిథ్యేనని తేల్చేశారు. దావోస్ నుంచి పెట్టుబడులు తీసుకు రాలేక పోయినందుకు కారణాలు విశ్లేషించుకుని తప్పులను సరిదిద్దుకోవల్సిన చంద్రబాబు, ఈ ఏడు నెలల్లోనే రాష్ట్రానికి నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి పారిశ్రామికవేత్తలను, ఆశ్చర్యపరిచారు!!. తమకు ఎవరికి కనపడకుండా ఎప్పుడు ఈ పెట్టుబడులు వచ్చి ఉద్యోగాలు వచ్చేశాయో తెలియక జనం విస్తుపోవాల్సి వస్తోంది ఇప్పుడు.. పోనీ.. నాలుగు లక్షల కోట్ల రూపాయల మొత్తానికి కట్టుబడి ఉన్నారా అంటే అలా చేయలేదు. మరుసటి రోజు టీడీపీ జాకీ మీడియా ఆంధ్రజ్యోతిలో ఏడు నెలల కాలంలో ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించిందని రాశారు. అంటే ఇది కూడా చంద్రబాబు ప్రకటనగానే చూడాలి!. రెండు రోజుల్లోనే రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెంచేశారు. అంతేకాదు.. నాలుగు లక్షల ఉద్యోగాలు కూడా వచ్చేశాయని బోగస్ వార్తలు రాసేశారు. దీనిని బట్టే టీడీపీ, ఎల్లో మీడియా ఎంత బాహాటంగా ప్రజలను చీట్ చేస్తోందో అర్దం అవుతోందని పలువురు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.నిజంగానే ఈ ఏడు నెలల కాలంలో ఆ స్థాయిలో పెట్టుబడులు వచ్చి ఉంటే,ఇంకా కోట్లు ఖర్చు చేసి దావోస్ వెళ్లవలసిన అవసరం ఏమి ఉంటుంది? చంద్రబాబు తన మీడియా సమావేశంలోకాని, గవర్నర్ ప్రసంగంలో కాని మరో మాట చెప్పారు. ఏపీ బ్రాండ్ కు ఊపు వచ్చిందని, దావోస్ లో అది స్పష్టంగా కనిపించిందని తెలిపారు. ఏపీ బ్రాండ్ ఏమిటి? రెడ్ బుక్ బ్రాండా?లేక చేసిన హామీలు అమలులో వైఫల్యం చెందిన బ్రాండా? దావోస్ కు వెళ్తే పెట్టుబడులు రావని, పెట్టుబడులు వస్తాయని ఎవరైనా అనుకుంటే అది నెగిటివ్ ఆలోచన అట.మీడియా ఆ భావన నుంచి బయటకు రావాలని కూడా ఆయన హితబోద చెబుతున్నారు. దావోస్ లో నెట్ వర్క్ కోసం వెళ్లారట. దావోస్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాకపోయినా, ఆ కంపెనీల సీఈవోలు ఏపీకి భవిష్యత్తులో వస్తారట. అంటే చంద్రబాబు ,మంత్రి లోకేష్ లు దావోస్ లో చేసిన ప్రకటనలను పారిశ్రామికవేత్లలు నమ్మలేదని ఒప్పుకున్నట్లే కదా!. ఇంతకుముందు పలుమార్లు దావోస్ వెళ్లారు కదా!ఆ రోజుల్లో ఏమని ప్రచారం చేశారు.తాను కాబట్టి దావోస్ వెళ్లి పెట్టుబడులు సాధించుకుని వస్తున్నానని చెప్పేవారా? కాదా?వాటిలో ఎన్ని వచ్చాయి?ఎన్ని రాలేదు?అన్నది వేరే సంగతి. కనీసం ఇన్వెస్టర్లకు కొంతైన నమ్మకం కుదిరితేనే కదా వారు MoUలు చేసుకోవడానికి ముందుకు వచ్చేది. అది కూడా లేకపోబట్టే కదా ఈసారి పెట్టుబడులు తేలేకపోయారు. మహారాష్ట్రకు 15 లక్షల కోట్ల మేర, తెలంగాణకు 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.వాటిని మాత్రం చంద్రబాబు స్వాగతిస్తున్నారట.ఆ ఎంవోయూలే మిథ్య అయితే ఆ రాష్ట్రాలకు కూడా అదే వర్తించాలి కదా!. పైగా ఇప్పుడు దావోస్ భేటీకి ముందే పెట్టుబడులు వచ్చాయని జాకీ మీడియాతో వార్తలు రాయించడం ఆత్మ వంచన కాదా!పైగా చంద్రబాబు ఎదురుదాడి చేశారు. సింగపూర్ ప్రభుత్వంపై కేసులుపెట్టి వేధించారని ఆయన తప్పుడు ఆరోపణ చేశారు. ఎక్కడ ఎవరిపై కేసు పెట్టారో చెప్పాలి కదా!ఆయన మిత్రుడు సింగపూర్ లో మంత్రిగా ఉన్న ఈశ్వరన్ ను ఆ దేశ ప్రభుత్వం పదవినుంచి తొలగించడమే కాదు.. ఏకంగా జైలులో పెట్టింది.దానికి వైసిపి కారణమా?లేక ఆయన అవినీతి కారణమా?. అమరావతిలో కూడా సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోందటూ అబద్దపు ప్రచారం చేసి ,అక్కడి ప్రైవేటు కంపెనీలు కొన్నిటికి వందల ఎకరాల భూములు కట్టబెట్టింది అవాస్తవమా?. కాని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్దగా లేదని భావించిన సింగపూర్ కంపెనీలు జారుకున్నాయి. మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా!. మళ్లీ పిలిచి వారికి భూములు ఇస్తామని ఎందుకు చెప్పడం లేదు?వారు పెట్టిన దారుణమైన షరతులకు అంగీకరిస్తామని కూడా చంద్రబాబు ధైర్యంగా చెప్పగలరా?. జగన్ టైంలో రాష్ట్ర ఇమేజీ కోల్పోయిందట. ఇప్పుడు పునరుద్దరిస్తున్నారట. జగన్ పోర్టులు కట్టి, మెడికల్ కాలేజీలు కట్టి, ఊరూరా సచివాలయ, ఆస్పత్రుల ,రైతు భరోసా కేంద్రాల భవనాలు నిర్మిస్తే ఏపీ ఇమేజీ దెబ్బతిందా?లేక ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే కాక,కొత్తగా జగన్ టైమ్ లో వచ్చిన మెడికల్ కాలేజీలు,సీట్లు తమకుఅక్కర్లేదని కేంద్రానికి లేఖ రాయడం వల్ల ఇమేజీ పోయిందా?జగన్ ప్రభుత్వపరంగా నిర్మించిన పోర్టులను ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు సన్నద్దం అవడం వల్ల రాష్ట్రానికి నష్టం రావడం లేదా?. ఏపీ బ్రాండ్ సత్తా అంటూ కొన్ని పెట్టుబడులను ఎల్లో మీడియా ఉదహరించింది. గ్రీన్ హైడ్రోజన్ హబ్ కోసం 1.85 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయట.వీటిలో మెజార్టీ పెట్టుబడులు జగన్ టైమ్ లో వచ్చినవి కాదా?. అయినా నిస్సిగ్గుగా కూటమి అధికారంలోకి వచ్చాక పెట్టుబడి వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు.NTPC సంస్థ జగన్ టైమ్ లోనే రెన్యుబుల్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడికి ఒప్పందం చేసుకున్నది నిజం కాదా? ఇక ఆర్సెనర్ మిట్టలో స్టీల్ ప్లాంట్ ద్వారా 1.35 లక్షల కోట్లు వచ్చేసినట్లు చెబుతున్నారు.ఇంతకన్నా పచ్చి అబద్దం ఉందా?అసలు ఇంతవరకు ఎమ్.ఓ.యు అయినా కుదిరిందా?చంద్రబాబు కోరినట్లు ఆ కంపెనీకి ఇనుప ఖనిజం రవాణాకు సంబంధించిన ఆదేశాలను కేంద్రం ఇచ్చిందా?బిపిసిఎల్ కంపెనీ ప్రతిపాదన కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే వచ్చింది. అయినా ఇప్పుడు కూడా రావడం మంచిదే.కాని అసలు మొదలే కాకముందే 95 వేల కోట్లు వచ్చేసినట్లు కలరింగ్ ఇవ్వడం ఏమిటి?. ఒకవైపు ప్రభుత్వపరంగా ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతూ, మరోవైపు ప్రైవేటు రంగంలో రాని ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రచారం చేస్తే ఏపీ ప్రజలకు ఏమి లాభం జరుగుతుంంది. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేమని చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం, పెట్టుబడుల విషయంలోను తమ వైఫల్యాలను జగన్ ప్రభుత్వంపై నెట్టేసి కాలక్షేపం చేస్తోంది. మైక్రోసాప్ట్ భాగస్వామి బిల్ గేట్స్ తో సమావేశం గురించి ఒక ఆసక్తికరమైన విశ్లేషణ వచ్చింది. పదేళ్ల క్రితం కూడా బిల్ గేట్స్ తో భేటీ అయినప్పుడు ఏ అంశాలు మాట్లాడారో,దాదాపు అలాంటి వాటినే ఇప్పుడు కూడా మాట్లాడుకున్నారట. మైక్రోసాప్ట్ డేటా సెంటర్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని అప్పుడు కోరారు. ఇప్పుడు మళ్లీ కోరారు.అంటే చంద్రబాబు ఎప్పుడో కోరినా మైక్రోసాఫ్ట్ ఎందుకు ఏపీకి రాలేదు?. హైదరాబాద్ లో తనను చూసే వచ్చిందని చెప్పారు కదా?ఇప్పుడు ఎందుకు తేలేకపోయారు?. బిల్ గేట్స్ను ఏపీలో ఐటీ సలహామండలికి నాయకత్వం వహించాలని, లేదా సభ్యుడిగా ఉండాలని కోరారట. దానికి గేట్స్ స్పందించలేదట!. అయినా ఏపీ గురించే వారిద్దరూ మాట్లాడుకున్నట్లు, అంతర్జాతీయ స్థాయిలో ఏదో చేద్దామని అనుకున్నట్లు కబుర్లు చెప్పుకున్నారట. డ్రోన్ ల ద్వారా వ్యవసాయం ఇప్పటికే జరుగుతుంటే దాని గురించి చర్చించుకున్నారట.ఆరోగ్య రంగంలో ఏదో చేస్తారట. అసలు ఏమి చేస్తారో చెప్పకుండా ఏదేదో మాట్లాడుకుంటే ఎవరైనా నమ్ముతారా?. చివరికి జగన్ టైమ్ లో నిర్మించిన విశాఖ ఐటీ ఐకానిక్ భవనాన్ని, జగన్ ప్రభుత్వం చేపట్టిన పోర్టులను చూపించి అదేదో తమ ఘనతగా చెప్పుకోవడం మినహా తాము సాధించింది ఏమిటన్నది మాత్రం చంద్రబాబు,లోకేష్ లు చెప్పుకోలేకపోయారు. కాకపోతే రెండు రోజులలోనే నాలుగు లక్షల కోట్ల నుంచి ఆరు లక్షల కోట్లకు పెట్టుబడులను పెంచేసి కాగితాలపై రాసేసుకున్న ఘనత మాత్రం కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
భారత్ ఒక ప్రయోగశాల
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ యథాలాపంగా చెప్పిన ఒక వాక్యం వివాదాస్పదమైంది. తరచూ భారత్ను పొగిడే బిల్గేట్స్ ఒక్కసారిగా భారత్ను ప్రయోగశాలతో పోల్చడమేంటని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రీడ్ హాఫ్మన్తో నిర్వహించిన ఒక పాడ్కాస్ట్ చర్చావేదికలో భారత ప్రస్థానాన్ని బిల్గేట్స్ ప్రస్తావించారు. ‘‘ జనాభాపరంగా అతిపెద్దదైన భారత్లోనూ ఆరోగ్యం, పోషకాహారం, విద్యారంగాలు అభివృద్ధిబాటలో పయనిస్తున్నాయి.భారతీయులు సుస్థిరాభివృద్ధిని మాత్రమేకాదు సుస్థిర ప్రభుత్వా దాయాలను సమకూర్చుకుంటున్నారు. వచ్చే 20 ఏళ్లలో అక్కడి ప్రజలు మరింత పురోభివృద్దిని సాధించగలరు. భారత్ వెలుపల కంటే భారత్లో తమను తాము నిరూపించుకునేందుకు ఆ దేశం నిజంగా ఒక ప్రయోగశాల. అమెరికా వెలుపల మా అతిపెద్ద కార్యాలయం భారత్లోనే ఉంది. ప్రపంచంలో మరెక్కడా పైలట్ ప్రాజెక్టులు మేం చేపట్టినా మా భాగస్వాములు మాత్రం ఇండియా నుంచే ఉంటున్నారు. మీరుగనక భారత్కు వెళ్లి అక్కడి వీధుల్లో గమనిస్తే ఆదాయంలో చాలా తారతమ్యాలు ఉన్న వ్యక్తులు కోకొల్లలుగా కనిపిస్తారు. అయినా సరే మీరు అక్కడి వైవిధ్యాన్ని ఆస్వాదించగలరు’’ అని అన్నారు. వెల్లువెత్తిన విమర్శలుభారత్ను ప్రయోగశాలగా పోల్చడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ‘‘ తమ ప్రయోగాత్మక ఔషధాలను ప్రయోగించడానికి భారత్ను ఒక ల్యాబ్లాగా వాడుకుంటున్నారు. అయినాసరే ఇలాంటి పెద్దమనుషులు మనల్ని గినీ పందుల్లా వాడుకునేందుకు మన ప్రభుత్వాలే అనుమ తిస్తున్నాయి. దిగ్భ్రాంతికరం. సిగ్గుపడాల్సిన విషయం’’ అని సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘మా దేశం మీకొక ప్రయో గశాల అనుకుంటున్నారా?. అయితే దేశం విడిచి వెళ్లిపొండి’ అని ఒక నెటిజన్ వ్యాఖ్యా నించారు. ‘‘ బిల్గేట్స్ భారతీయ మీడియా మొదలు విపక్షం, అధికార పక్షం ద్వారా ప్రతి వ్యవస్థనూ తనకు అనుకూలంగా మార్చుకుందన్నారు. మనమెప్పుడు మేల్కొంటామో’’ అని ఇంకో నెటిజన్ ఆవేదన వ్యక్తంచేశారు. -
ఆగర్భ శ్రీమంతుల భూగర్భ స్వర్గాలు
వర్తమాన ప్రపంచం శాంతిధామంగా ఏమీ లేదు. ఇప్పటికే చాలా దేశాలు యుద్ధాలు, అంతర్యుద్ధాలు, ఘర్షణలతో రావణకాష్ఠంలా రగులుకుంటున్నాయి. అణ్వాయుధాలను అమ్ములపొదిలో దాచుకున్న ధూర్తదేశాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగించడానికైనా వెనుకాడబోమని అడపా దడపా హెచ్చరికలు చేస్తూ, మిగిలిన దేశాలకు దడ పుట్టిస్తున్నాయి. ఈ పరిస్థితులు మరింతగా ముదిరితే, మూడో ప్రపంచయుద్ధం ముంచుకొచ్చినా రావచ్చు. యుద్ధంలో ఏ దేశమైనా తెగబడి అణ్వాయుధాలను ప్రయోగిస్తే, జరగరాని అనర్థాలు జరగవచ్చు. అణ్వాయుధ దాడులు జరిగిన చోట సామాన్యులు బతికి బట్టకట్టే అవకాశాలు కల్ల! అయితే, అణ్వాయుధాల దాడులు జరిగినా, క్షేమంగా బతికి బట్టకట్టడానికి వీలుగా ఆగర్భ శ్రీమంతులు ముందస్తుగా భూగర్భ స్వర్గాలను నిర్మించుకుంటున్నారు.గడచిన శతాబ్దం స్వల్ప వ్యవధిలోనే రెండు ప్రపంచ యుద్ధాలను చవి చూసింది. ఈ రెండు యుద్ధాలు గడచిన శతాబ్ది పూర్వార్ధంలోనే జరిగాయి. రెండు యుద్ధాలు ముగిసిన తర్వాత కూడా వివిధ దేశాల మధ్య అనేక యుద్ధాలు, కొన్ని దేశాల్లో అంతర్యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడైనా ముంచుకు రావచ్చనే ముందుచూపుతో కొందరు ఆగర్భ శ్రీమంతులు ఇప్పటికే భూగర్భ దుర్గాలను నిర్మించుకున్నారు. మరికొందరు శ్రీమంతులు అదే పనిలో ఉన్నారు. బయటి నుంచి చూస్తే, అవి మామూలు నేలమాళిగల్లాగానే కనిపిస్తాయి. లోపలికి అడుగుపెడితే తెలుస్తుంది, వాటి అసలు సంగతి. అవి మామూలు నేలమాళిగలు కావు, కట్టుదిట్టమైన భూగర్భ దుర్గాలు. అణ్వాయుధాలకు కూడా చెక్కుచెదరవు. భూకంపాల వంటి పెను విపత్తులు సంభవించినా, అవి తట్టుకోగలవు. వాటి లోపల ఉన్న వారికి ఎలాంటి ముప్పు ఉండదు. ప్రళయం వచ్చి, ప్రపంచం అంతమైపోయినంత పని జరిగినా, వాటిలో ఉండేవారు నిక్షేపంగా, క్షేమంగా ఉండగలరు. ఈ భూగర్భ దుర్గాల లోపలి సౌకర్యాలను, విలాసాలను పరిశీలిస్తే, ఇవి భూగర్భ దుర్గాలు మాత్రమే కాదు, భూగర్భ స్వర్గాలు అనక తప్పదు.ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి భూగర్భ స్వర్గాలు ఎన్ని ఉన్నాయో కచ్చితమైన లెక్క ఏదీ లేదు. కొందరు సంపన్నులు బాహాటంగా ఇలాంటివి నిర్మించుకుంటుంటే, మరికొందరు అత్యంత గోప్యంగా రహస్య ప్రదేశాలలో నిర్మించుకుంటున్నారు. పలు దేశాలు అత్యవసర పరిస్థితుల్లో అణ్వాయుధాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో కొన్ని బహిరంగ నిర్మాణాలనే కట్టుదిట్టం చేశాయి. ఉదాహరణకు ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్లోని భూగర్భ మెట్రో మార్గంలో ఉన్న మెట్రో స్టేషన్లన్నింటినీ అణ్వాయుధ దాడులను తట్టుకునేలా నిర్మించారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికన్ ప్రభుత్వం రాజధాని వాషింగ్టన్ డీసీ పరిసరాల్లో అణ్వాయు«ధ దాడులను తట్టుకునే భూగృహ స్థావరాలను నిర్మించింది. దేశంలోని అత్యున్నత వ్యక్తులకు రక్షణ కల్పించేందుకు వీటిని నిర్మించింది. అమెరికాలోని జంట భవంతులపై 2001 సెప్టెంబర్ 11న ఉగ్రవాద దాడి తర్వాత ‘కంటిన్యూయిటీ ఆఫ్ గవర్నమెంట్’ (ప్రభుత్వ కొనసాగింపు) పథకం కింద ఇలాంటి మరిన్ని భూగృహ స్థావరాల నిర్మాణానికి నిధుల కేటాయింపులు ప్రారంభించింది. ప్రమాదాలు ఎదురైనప్పుడు పౌరుల సంగతి పట్టించుకోకుండా, ప్రభుత్వం తనను తాను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తోందని విమర్శిస్తూ, గారెట్ గ్రాఫ్ అనే జర్నలిస్టు ‘రేవెన్ రాక్: ది స్టోరీ ఆఫ్ యూఎస్ గవర్నమెంట్స్ సీక్రెట్ ప్లాన్ టు సేవ్ ఇట్సెల్ఫ్– వైల్ ది రెస్ట్ ఆఫ్ అజ్ డై’ అనే పేరుతో పుస్తకం రాశాడు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని రేవెన్ రాక్ మౌంటెయిన్ కాంప్లెక్స్లో అమెరికా ప్రభుత్వం ‘కంటిన్యూయిటీ ఆఫ్ గవర్నమెంట్’ పథకం కింద ఇలాంటి భూగృహ స్థావరాలను నిర్మించింది. ఇవి జనాలకు తెలిసిన స్థావరాలు. ఇలాంటి రహస్య భూగృహ స్థావరాలు కూడా ఉండి ఉండవచ్చనే అనుమానాలు కూడా జనాల్లో ఉన్నాయి. అణ్వాయుధ యుద్ధాలు సంభవిస్తే, ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను గాలికొదిలేస్తాయనే ఎరుక కలిగిన అపర కుబేరులు కొందరు ముందు జాగ్రత్తగా ప్రళయ భీకర పరిస్థితుల్లోనూ చెక్కు చెదరకుండా, బతికి బయటపడటానికి వీలుగా భూగర్భ స్వర్గాలను సొంత ఖర్చులతో నిర్మించుకుంటున్నారు. వీటి కోసం వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి భూగర్భ స్వర్గాలను నిర్మించుకున్న ఆగర్భ శ్రీమంతుల కథా కమామిషూ ఒకసారి చూద్దాం..బిల్ గేట్స్ ఇళ్లన్నింటిలోనూ భూగృహాలుమైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరు. ప్రస్తుతం ఆయన వాషింగ్టన్ మెడీనా ప్రాంతంలోని 66,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించుకున్న భవంతిలో నివాసం ఉంటున్నారు. ఈ ఇంటితో పాటు ఆయనకు దాదాపు అరడజనుకు పైగా విలాసవంతమైన భవంతులు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెల్ మార్, రాంకో శాంటా ఫే, ఇండియన్ వెల్స్ ప్రాంతాల్లోను; ఫ్లోరిడాలోని హోబ్ సౌండ్, వెల్లింగ్టన్ ప్రాంతాల్లోను; మోంటానా బిగ్స్కై ప్రాంతంలోను బిల్ గేట్స్కు సొంత భవంతులు ఉన్నాయి. ఈ భవంతులు అన్నింటిలోనూ సమస్త సౌకర్యాలతో అత్యంత విలాసవంతమైన సురక్షిత భూగృహాలు ఉన్నాయి. అణ్వాయుధ దాడులు జరిగినా, బయటి ప్రపంచంలో మహమ్మారులు వ్యాపించినా, భూకంపాలు, సునామీలు, తుఫానులు వంటి ప్రకృతి విపత్తులు తలెత్తినా చెక్కుచెదరని విధంగా వీటిని నిర్మించుకున్నారు. ఎలాన్ మస్క్ సైబర్ హౌస్ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, ‘టెస్లా’, ‘స్పేస్ ఎక్స్’ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తన కోసం అత్యంత సురక్షితమైన ‘సైబర్ హౌస్’ నిర్మించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సైబర్ హౌస్ను ఎప్పుడు ఎక్కడ నిర్మించ నున్నారనే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. అయితే, ఎలాన్ మస్క్ ఆలోచనలకు అనుగుణంగా రష్యన్ డిజైనర్ లెక్స్ విజెవ్స్కీ సైబర్ హౌస్ నమూనాకు రూపకల్పన చేశారు. అత్యంత దృఢమైన, స్వయం సమృద్ధి కలిగిన బహుళ అంతస్తుల భూగృహంగా దీనిని డిజైన్ చేశారు. అణ్వాయుధ దాడులకు చెక్కు చెదరకుండా ఉండటం ఒక్కటే దీని విశేషం కాదు, వైరస్లు, బ్యాక్టీరియాలు వంటి సూక్ష్మజీవుల నుంచి కూడా పూర్తి రక్షణ కల్పించేలా తీర్చిదిద్దారు. విద్యుదుత్పాదన కోసం సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్ వంటి వసతులతో పాటు, మంచినీటి సరఫరా కోసం వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, ఎలాంటి ఆయుధాలకైనా చెక్కుచెదరని ఎయిర్లాక్ డోర్స్, మెటల్ రోల్ షట్టర్స్ తదితర వసతులతో సైబర్ హౌస్ను నిర్మించనున్నారు. సైబర్ హౌస్ డిజైన్ మూడేళ్ల కిందటే పూర్తయినా, దీని వాస్తవ నిర్మాణం ఇంకా కార్యరూపం దాల్చాల్సి ఉంది.హవాయి దీవిలో జూకర్బర్గ్ భూగృహం‘ఫేస్బుక్’ అధినేత మార్క్ జూకర్బర్గ్ హవాయి దీవుల్లోని ఒకటైన కావాయి దీవిలో 1400 ఎకరాల స్థలాన్ని 100 మిలియన్ డాలర్లకు (రూ.843 కోట్లు) కొనుగోలు చేశారు. ఇందులోని ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత సురక్షితమైన భూగర్భ స్థావరాన్ని నిర్మించుకుంటున్నారు. ఈ నిర్మాణాన్ని అత్యంత రహస్యంగా చేపట్టినా, నిర్మాణంలో ఉన్న భూగృహం ఫొటోలు మీడియాకు చిక్కాయి. ఈ స్థలంలోనే నిర్మిస్తున్న రెండు వేర్వేరు భవంతుల నుంచి ఈ భూ గృహానికి చేరుకోవడానికి సొరంగ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహార సరఫరాకు అంతరాయం లేనివిధంగా ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు, నిరంతర మంచినీటి సరఫరా కోసం వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, కీబోర్డు ద్వారా పనిచేసే సౌండ్ప్రూఫ్ తలుపులు, ద్వారాలు, హైస్పీడ్ ఎలివేటర్లు, మెకానికల్ రూమ్, స్విమింగ్ పూల్, జిమ్, సినిమా థియేటర్ వంటి విలాసవంతమైన సౌకర్యాలతో దీని నిర్మాణం సాగిస్తున్నట్లు సమాచారం. అన్ని రకాల ప్రమాదాల నుంచి రక్షణ కల్పించగల ఈ భూగృహ నిర్మాణానికి 270 మిలియన్ డాలర్లు (రూ.2,278 కోట్లు) ఖర్చు కాగలదని అంచనా.జెఫ్ బెజోస్ ఇళ్లలో భూగృహాలు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఇప్పటికే ఫ్లోరిడా పరిధిలోని ఇండియన్ క్రీక్ దీవిలో మూడు భవంతులను నిర్మించుకున్నారు. ఈ మూడింటిలోనూ ఆయన సురక్షితమైన భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. వీటి కోసం బెజోస్ 237 మిలియన్ డాలర్లు (రూ.1,999 కోట్లు) ఖర్చు చేశారు. ఇదే దీవిలో ఇవాంకా ట్రంప్, ట్రాన్స్ఫార్మర్కో వ్యవస్థాపకుడు, సియర్స్ మాజీ సీఈవో అమెరికన్ అపర కుబేరుల్లో ఒకరైన ఎడ్డీ లాంపెర్ట్, అమెరికన్ ఫుట్బాల్ క్రీడాకారుడు టామ్ బ్రాడీ, గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ ష్మీడ్, ఏకాన్ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు కార్ల్ ఏకాన్ తదితరులు సైతం ఇండియన్ క్రీక్ దీవిలో జెఫ్ బెజోస్ తరహాలోనే భూగర్భ స్థావరాలతో కూడిన ఇళ్లను నిర్మించుకున్నారు.భూగృహ నిర్మాణరంగంలో కంపెనీల పోటాపోటీభూగృహ నిర్మాణరంగంలో పలు కంపెనీలు పోటాపోటీగా నిర్మాణాలు సాగిస్తున్నాయి. అణ్వాయుధ దాడులు, ప్రకృతి విపత్తులు సహా ఎలాంటి ముప్పునైనా తట్టుకుని నిలిచే భూగర్భ గృహాల నిర్మాణానికి కొత్త కొత్త నమూనాలకు రూపకల్పన చేస్తూ, అమిత సంపన్నులను తమ వైపుకు ఆకట్టుకుంటున్నాయి. న్యూక్లియర్ బంకర్ కంపెనీ, ఓపిడమ్ బంకర్స్, అట్లాస్ సేఫ్ సెల్లార్, సీబీఆర్ఎన్ షెల్టర్స్, స్పార్టమ్ సర్వైవల్ సిస్టమ్స్, యూఎస్ఏ బంకర్ కంపెనీ, రైజింగ్ ఎస్ బంకర్స్ వంటి కంపెనీలు కట్టుదిట్టమైన భూగర్భ నిర్మాణాలకు ప్రసిద్ధి పొందాయి. ఇవి భారీ ఎత్తున దేశ దేశాల్లో నిర్మాణాలను సాగిస్తున్నాయి. రైజింగ్ ఎస్ బంకర్స్ ఇటీవలి కాలంలో దాదాపు పది బంకర్లను న్యూజీలండ్లో ఏర్పాటు చేసింది. మిగిలిన కంపెనీలు కూడా ఇందుకు దీటుగా దేశ దేశాల్లో భూగర్భ స్థావరాల నిర్మాణాలను సాగిస్తున్నాయి. యుద్ధాలు, విపత్తులపై భయాందోళనలు ఉన్న సంపన్నులు కోట్లాది డాలర్లు వెచ్చిస్తూ వీటి ద్వారా తమ కోసం ప్రత్యేకమైన స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.ఆ దేశంలో ఇంటింటా భూగృహంప్రపంచవ్యాప్తంగా భూగృహాల సంఖ్యలో స్విట్జర్లండ్ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఆ దేశంలో దాదాపు ప్రతి ఇంటా సురక్షితమైన భూగృహం ఉంటుంది. ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం నిర్మించిన పబ్లిక్ బంకర్లు, నివాస భవనాల్లోని ప్రైవేటు బంకర్లు సహా స్విట్జర్లండ్లో 3.70 లక్షలకు పైగా బంకర్లు ఉన్నట్లు అంచనా. అనుకోకుండా దేశంపై అణ్వాయుధ దాడులు జరిగితే, దేశ పౌరుల్లో ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించడానికి వీలుగా స్విట్జర్లండ్ ప్రభుత్వం ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసుకుంది. స్విట్జర్లండ్లోని ప్రతి భూగర్భ స్థావరం అత్యంత కట్టుదిట్టమైన రక్షణ కల్పిస్తుంది. దాదాపు ఏడువందల మీటర్ల దూరంలో 12 మెగాటన్నుల అణుబాంబులు పేలినా చెక్కుచెదరని రీతిలో వీటిని నిర్మించడం విశేషం. సురక్షితమైన బంకర్ల నిర్మాణంలో స్విట్జర్లండ్కు దాదాపు ఆరు దశాబ్దాలకు పైబడిన చరిత్ర ఉంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో– 1963 నుంచి స్విట్జర్లండ్ ప్రభుత్వం అణ్వాయుధ దాడులను తట్టుకునే భూగర్భ స్థావరాల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, విరివిగా నిర్మాణాలను చేపట్టింది. అణ్వాయుధ దాడుల పట్ల మరే దేశంలోనూ లేని సంసిద్ధతను కేవలం స్విట్జర్లండ్లో మాత్రమే చూడవచ్చు. విపత్కర పరిస్థితుల్లో పౌరుల ప్రాణాలకు కూడా భరోసా కల్పించే ఏకైక దేశం స్విట్జర్లండ్ మాత్రమేనని చెప్పుకోవచ్చు.భూగర్భ స్వర్గాల నిర్మాతఅమెరికన్ వ్యాపారవేత్త ల్యారీ హాల్ భూగర్భ స్వర్గాల నిర్మాణంలో ప్రసిద్ధుడు. భవన నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న ల్యారీ హాల్, సంపన్నుల కోసం అణ్వాయుధాలను తట్టుకునే భూగృహాలను కొన్నేళ్లుగా నిర్మిస్తున్నారు. ఆయన తన కోసం కాన్సస్ ప్రాంతంలో స్వయంగా భూగర్భ స్వర్గాన్ని నిర్మించుకున్నారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కాన్సస్ ప్రాంతంలో అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూగర్భ క్షిపణి స్థావరాన్ని ల్యారీ హాల్ 2008లో 20 మిలియన్ డాలర్లకు (రూ.168.75 కోట్లు) కొనుగోలు చేశారు. తర్వాత దీనిని తన అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుకున్నారు. బయటి నుంచి చూస్తే, గుమ్మటంలా కనిపించే ఈ భూగృహంలో నేలకు దిగువన పదిహేను అంతస్తుల భవంతిని నిర్మించారు. ఇందులో హైస్పీడ్ ఎలివేటర్లు, నిత్యావసర సరుకులతో కూడిన జనరల్ స్టోర్, సినిమా థియేటర్, పిల్లలు చదువుకోవడానికి తరగతి గది, లైబ్రరీ, స్విమింగ్ పూల్, జిమ్, స్పా, వంట గదులు, భోజనశాలలు, కూరగాయలను పండించుకోవడానికి తగిన పొలం, చేపలు, రొయ్యల పెంపకానికి ఒక కొలను వంటి సమస్త సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడం విశేషం. విలాసవంతమైన సురక్షిత భూగృహాలను నిర్మించడంలో ల్యారీ హాల్ నైపుణ్యం తెలుసుకున్న సంపన్నులు చాలామంది ఆయన ద్వారానే తమ కోసం ప్రత్యేక భూగృహాలను ఇప్పటికే నిర్మించుకున్నారు. ఇంకొందరు నిర్మించుకుంటున్నారు.సంపన్నుల చూపు.. న్యూజీలండ్ వైపుప్రపంచంలోని అమిత సంపన్నుల్లోని చాలామంది భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు న్యూజీలండ్ను ఎంపిక చేసుకుంటున్నారు. అమెరికన్ వ్యాపారవేత్త, పేపాల్ వ్యవస్థాపకుడు పీటర్ థీల్ న్యూజీలండ్ దక్షిణ ప్రాంతంలోని దీవిలో 73,700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భూగర్భ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికి స్థలాన్ని కూడా ఎంపిక చేసుకున్నారు. దీనివల్ల దీవిలోని పరిసరాల సౌందర్యం దెబ్బతింటుందనే కారణంగా న్యూజీలండ్ ప్రభుత్వం 2022లో పీటర్ థీల్కు అనుమతి నిరాకరించింది. న్యూజీలండ్లో భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్, ఓపెన్ ఏఐ అధినేత శామ్ ఆల్ట్మన్ వంటి వారు సైతం న్యూజీలండ్లో భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వీరే కాకుండా, అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, హాలీవుడ్ గాయని జూలియో ఇగ్లేసీయస్ సహా పలువురు సంపన్నులు న్యూజీలండ్లో భూగర్భ స్థావరాల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారు. -
టెక్ మొగల్ మెచ్చిన స్ట్రీట్ ఫుడ్ : ఫ్యాన్స్ను కట్టిపడేస్తూ వీడియో వైరల్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్ బిల్ గేట్స్ మరోసారి వార్తల్లో నిలిచారు. న్యూయార్క్లోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్లో ఒక వీధి వ్యాపారి వద్ద హాట్ డాగ్ను ఆస్వాదిస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో సందడి చేస్తోంది.స్ట్రీట్ ఫుడ్ పట్ల తనకున్న ప్రేమను చాటుకుంటూ బిల్గేట్స్ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. న్యూయార్క్లో స్ట్రీట్ ఫుడ్ హాట్ డాగ్ను ఆస్వాదిస్తున్న తాజా వీడియో ణాల్లో ఇది వైరల్ అయ్యింది. "మీరు హాట్డాగ్ తినలేదూ అంటు న్యూయార్క్ వెళ్లనట్టే" అని క్యాప్షన్తో ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పటికే 20 లక్షలకు పైగా వ్యూస్ లక్షల లైక్స్ను సొంతం చేసుకుంది. నెటిజనులు రకరకాల కమెంట్లతోపాటు, టెక్ మొగల్ను ప్రశంసల్లో ముంచెత్తారు. వావ్, బిలియనీర్లు కూడా మంచి హాట్ డాగ్ని ఇష్టపడతారు!, ఆయనకూడా మనలాగే! గేట్స్ హాట్ డాగ్ అభిమాని అని కొందరు వ్యాఖ్యానించగా, మరికొందరు హాస్య భరితంగా, "బిల్ మస్టర్డ్ లేదా కెచప్ను ఇష్టపడతారా?"అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates)కాగా స్ట్రీట్ ఫుడ్ ఆస్వాదించడం బిల్గేట్స్కు ఇదే తొలిసారి కాదు తాను ఏ నగరంలో ఉన్నాడో ప్రపంచానికి తెలియజేయడానికి ఆహారాన్ని ఒక మాధ్యమంగా ఎంచుకోవడం బిల్ గేట్స్కు బాగా అలవాటు. ఆ నగరానికి అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాన్ని గుర్తించి, దాన్ని సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేస్తారు.. ఈ సంవత్సరం ప్రారంభంలో, భారతదేశ పర్యటన సందర్భంగా, సోషల్ మీడియాఇన్ఫ్లుయెన్సర్ చాయ్వాలా చాయ్ సిప్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సోయా ఆకుతో బరువు తగ్గొచ్చు.. ఇంకా ఆశ్చర్యకర ప్రయోజనాలు -
ఆ 'కల' కోసం కాలేజీ వదిలేసి.. చివరకు..
మైక్రొసాఫ్ట్ కో-ఫౌండర్.. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరైన 'బిల్ గేట్స్' గురించి అందరికి తెలుసు. అయితే తన కలలను సాకారం చేసుకోవడానికి చదువుకునే రోజుల్లోనే ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.బిల్ గేట్స్ చదువుకునే రోజుల్లో.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడానికి కాలేజీ విద్యను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని వెల్లడించారు. నిజానికి బిజినెస్ చేయాలనే ఉద్దేశ్యంతో కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసిన వ్యక్తుల జాబితాలో బిల్ గేట్స్ మాత్రమే కాకుండా.. స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్బర్గ్, ఇలాన్ మస్క్ మొదలైనవారు ఉన్నారు.ప్రతి ఇంట్లోని డెస్క్పైన కంప్యూటర్ కలిగి ఉండాలి అనేది బిల్ గేట్స్ కల. ఈ వైపుగానే అడుగులు వేశారు. నేడు ఆ కల నిజమైంది. ప్రారంభంలో తాను హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చినప్పుడు బిలియనీర్ అవుతానని ఊహించలేదని అన్నారు.ఇదీ చదవండి: సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే.. 1970లలో బిల్ గేట్స్ అతని స్నేహితుడు పాల్ అలెన్ కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పట్టు వదలకుండా దీనిపైనే శ్రమించారు. తన 20వ ఏట మొత్తం మైక్రోసాఫ్ట్ కోసం పనిచేసినట్లు గేట్స్ చెప్పారు. వారాంతాలు, సెలవులు వంటివన్నీ మరచిపోయే అనుకున్న లక్ష్యం దిశగానే అడుగులు వేశారు. అనుకున్నది సాధించారు. నేడు మైక్రోసాఫ్ట్ వాల్యూ సుమారు మూడు ట్రిలియన్ డాలర్లు. -
రానున్నది మరో మహమ్మారి.. బిల్గేట్స్ ఆందోళన
ప్రపంచం వచ్చే 25 ఏళ్లలో అత్యంత భారీ యుద్ధాన్నో లేక కోవిడ్ కంటే ప్రమాదకరమైన మరో మహమ్మారినో ఎదుర్కొనబోతోందని ఆందోళన చెందుతున్నారు మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్గేట్స్. ఇవే ఆందోళనలు తనకు నిద్ర లేకుండా చేస్తున్నాయని ఓ తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.వాతావరణ విపత్తులు, పెరిగిపోతున్న సైబర్ దాడులపై ప్రజలను హెచ్చరించిన బిల్గేట్స్.. తనను రెండు ఆందోళనలు అత్యంత కలవరపెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అందులో ఒకటి రానున్న మహా యుద్ధం కాగా మరొకటి కోవిడ్ను మించిన మహమ్మారి.‘ప్రపంచంలో ప్రస్తుతం చాలా అశాంతి నెలకొంది. ఇది మహా యుద్ధాన్ని రేకెత్తించవచ్చు. ఒక వేళ ఆ యుద్ధం నుంచి బయటపడినా రాబోయే 25 సంవత్సరాలలో మరొక మహమ్మారి విజృంభించే అవకాశం ఉంటుంది’ అని బిల్గేట్స్ పేర్కొన్నారు.ఒకవేళ మహమ్మారి విజృంభిస్తే.. కోవిడ్కు మించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉటుందని, దీనికి దేశాలు సిద్ధంగా ఉన్నాయా అనే ప్రశ్న తనను వేధిస్తోందన్నారు. అమెరికా విషయాన్ని తీసుకుంటే కోవిడ్ సమయంలో మిగిలిన దేశాల కంటే మిన్నగా ఉంటుందని, ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని అందరూ భావించారని కానీ అంచనాలను అందుకోలేకపోయిందని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి..బిల్ గేట్స్ 2022లో “తదుపరి మహమ్మారిని నివారించడం ఎలా ” అనే పుస్తకాన్ని కూడా రాశారు. 2020 కోవిడ్ సమయంలో వివిధ దేశాల సన్నద్ధత లోపాలను ఆయన ఈ పుస్తకంలో ప్రస్తావించారు. బలమైన క్వారంటైన్ విధానాలు, వ్యాధి పర్యవేక్షణ, టీకా పరిశోధన, అభివృద్ధి వంటి వాటిపై దేశాలకు పలు సూచనలు సైతం చేశారు. -
జీవిత పాఠాలు నేర్పిన గురువులు
మీలో ఆశలు రేకిత్తించి వాటిని సాధించేందుకు ఓదారి చూపే ప్రతి వ్యక్తి గురువే. అలా అందరి జీవితాల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది గురువులు తారసపడుతారు. అలాంటి వారి సలహాలు, సూచనలు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడుతాయి. అలా గురువుల సాయంతో కొందరు వ్యాపారాల్లో స్థిరపడి మరెందరికో ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి వ్యాపార దిగ్గజాలు తమ గురువుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.వారెన్బఫెట్జీవితంలో కష్టనష్టాలు వారెన్బఫెట్కి అనేక పాఠాలు నేర్పాయి. తన తండ్రి హోవార్డ్ బఫెట్, కోచ్ బెంజమిన్ గ్రాహం, భార్య సుసాన్ బఫెట్ నుంచి ఎన్నో ఆర్థికపాఠాలు నేర్చుకున్నట్లు ఆయన చెప్పారు. సొంతంగా డబ్బు సంపాదించడం ఎలాగో తన తండ్రి నుంచి నేర్చుకున్నట్లు తెలిపారు. పెట్టుబడి నిర్వహణకు సంబంధించిన ఎన్నో విషయాలు ఆయన నేర్పించారని పేర్కొన్నారు.బిల్గేట్స్మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్గేట్స్ తనకు వారెన్బఫెట్ ఎన్నో విషయాల్లో మార్గనిర్దేశం చేశారని చెప్పారు. హార్వర్డ్ యూనివర్సిటీలో మధ్యలో చదువు మానేసిన తర్వాత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఆ సమయంలో వారెన్బఫెట్ దీర్ఘకాల లక్ష్యాలతో డబ్బు ఎలా సంపాదించాలో నేర్పించినట్లు చెప్పారు.జెఫ్బెజోస్అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్బెజోస్ వారెన్బఫెట్, జేపీ మోర్గాన్ ఛైర్మన్ జామీ డిమోన్, డిస్నీ సీఈఓ బాబ్ ఇగర్లను తన గురువులుగా భావిస్తున్నట్లు చెప్పారు. వారెన్బఫెట్ తన పుస్తకాల్లో ఎన్నో విషయాలు పంచుకుంటారని, దాదాపు అన్నింటిని చదవడానికి ఇష్టపడతానని బెజోస్ అన్నారు. సంక్షిష్టమైన కంపెనీ ద్వారా పెట్టుబడి పెడుతూ డబ్బు ఎలా సంపాదించాలో డిమోన్ను చూసి నేర్చుకోవాలన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలను ఎలా నెరవేర్చుకోవాలో ఇగర్ ద్వారా తెలుసుకున్నానని చెప్పారు.ఇలాన్మస్క్ఎక్స్(ట్విటర్), టెస్లా, స్పేస్ఎక్స్ వంటి కంపెనీల అధినేత ఇలాన్మస్క్ స్పేస్ఎక్స్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ జిమ్ కాంట్రెల్ను గురువుగా భావిస్తారు. మస్క్ కంపెనీలో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు కాంట్రెల్ మెంటార్గా వ్యవహరిస్తున్నారు. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్జాబ్స్ పుస్తకాలు ఇప్పటికీ చదువుతున్నట్లు మస్క్ చెప్పారు. అవి తనకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయని వివరించారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్, నికోలా టెస్లా, థామస్ ఎడిసన్, ఐసాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ పుస్తకాలు ఎంతో ప్రేరణ ఇస్తాయన్నారు.ఇదీ చదవండి: 2.75 లక్షల ఫోన్ నంబర్లకు చెక్మార్క్ జుకర్బర్గ్మెటా వ్యవస్థాపకులు మార్క్ జుకర్బర్గ్ యాపిల్ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్ను ఎంతో ఆరాధించేవారు. మేనేజ్మెంట్ నిర్వహణతోపాటు కంపెనీకి ప్రత్యేకంగా బ్రాండింగ్ ఎలా తీసుకురావాలో స్టీవ్ దగ్గరి నుంచి నేర్చుకున్నట్లు మార్క్ తెలిపారు. -
స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ రెజ్యూమ్స్: ఫోటోలు చూశారా?
యాపిల్ కో-ఫౌండర్ స్టీవ్ జాబ్స్, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ రెజ్యూమ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని వారు 18ఏళ్ల వయసులో ఉన్నప్పుడు క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. టెక్ ప్రపంచంలో ఎవరికివారే అన్నట్టు ఎదిగిన వీరి రెజ్యూమ్స్ ఇక్కడ చూడవచ్చు.స్టీవ్ జాబ్స్ రెజ్యూమ్ ప్రకారం, ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీపై మక్కువ ఉందని తెలుస్తోంది. ఇది 1973లో రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో తనకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉందని ప్రస్తావించారు.ఇక బిల్ గేట్స్ రెజ్యూమ్ గమనిస్తే.. ఇది 1971లో క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కోబాల్ట్, బేసిక్, పీడీపీ-10, పీడీపీ-8, సీడీసీ-6400 వంటి కంప్యూటర్లతో సహా వివిధ ప్రోగ్రామింగ్ భాషలలో తనకు అనుభవం ఉన్నట్లు వెల్లడించారు. అందులోనే తన జీతం అప్పట్లో 15000 డాలర్లుగా ప్రస్తావించారు. 970లలో ఒక విద్యార్థికి ఇది చాలా ఎక్కువ శాలరీ అనే చెప్పాలి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రెజ్యూమ్స్ ఎంతోమంది నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. దీనిపైన కొంతమంది తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.Steve Jobs and Bill Gates’ resumes at age 18: pic.twitter.com/tFTltp80jM— Jon Erlichman (@JonErlichman) August 27, 2024 -
పారిస్ ఒలింపిక్స్లో బిల్గేట్స్ అల్లుడు..
ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఒలింపిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ విశ్వ క్రీడా పోటీలను ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ పోటీలపై అందరికన్నా ఉత్సాహంగా ఉంది మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్ కుటుంబం. కారణం ఆయన అల్లుడు ఈ పారిస్ ఒలింపిక్స్లో పోటీ పడుతుండటం.బిల్ గేట్స్ అల్లుడు, నాయెల్ నాసర్ ఈజిప్ట్ దేశం తరఫున ఈ గ్రాండ్ ఈవెంట్లో పోటీ పడుతున్నారు. నాసర్ ప్రొఫెషనల్ ఈక్వెస్ట్రియన్. మెలిందా, బిల్ గేట్స్ల పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్ను ఆయన వివాహం చేసుకున్నారు. ఒలింపిక్స్ పాల్గొంటున్న తన అల్లుడిని ఉత్సాహపరుస్తూ.. ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్లో మెలిందా ఫ్రెంచ్ గేట్స్ మద్దతు తెలియజేశారు.నాసర్ ప్రొఫెషనల్ ఈక్వెస్ట్రియన్. అంతర్జాతీయ పోటీలలో ఈజిప్ట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒలింపిక్ అథ్లెట్. ఈజిప్షియన్ తల్లిదండ్రులకు చికాగోలో జన్మించారు. కువైట్లో పెరిగారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. ఐదు సంవత్సరాల వయస్సు నుంచే గుర్రపు స్వారీ పట్ల మక్కువ పెంచుకున్న నాసర్ అనేక ప్రపంచ ఈవెంట్లలో పాల్గొన్నారు. బిల్, మెలిందా గేట్స్ల పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్ను 2021లో వివాహం చేసుకున్నారు. వీరికో పాపాయి కూడా పుట్టింది. -
పాలు లేకుండా వెన్న.. ఇది కదా టెక్నాలజీ అంటే!
వెన్న కావాలంటే పాలు ఉండాల్సిందే అంటారు ఎవ్వరైనా.. అయితే వెన్న కోసం పాలు ఏ మాత్రం అవసరం లేదంటోంది కాలిఫోర్నియాకు చెందిన 'సావోర్' (Savor) కంపెనీ. ఇంతకీ ఇది నిజమైన వెన్నెనా? తినడానికి పనికొస్తోందా? దీన్ని ఎలా తయారు చేశారనే ఆసక్తికర విషయాలు ఇక్కడ చూసేద్దాం..కాలిఫోర్నియాకు చెందిన సావోర్ కంపెనీ పాలు లేదా మరే ఇతర పాల ఉత్పత్తులను ఉపయోగించకుండా వెన్నని సృష్టించే ప్రక్రియను అభివృద్ధి చేసింది. ఈ కంపెనీ టెక్ దిగ్గజం, బిలినీయర్ బిల్ గేట్స్ మద్దతుతో నడుస్తున్నట్లు సమాచారం.సావోర్.. వెన్నను కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్, ఆక్సిజన్ కలయికతో వెన్నను సృష్టిస్తోంది. ఇది సాధారణ వెన్న మాదిరిగానే అదే రుచిని కలిగి ఉంటుందని పేర్కొంది. ఈ కంపెనీ ఐస్క్రీమ్, చీజ్, పాలతో సహా పలు ఉత్పత్తులకు పాల రహిత ప్రత్యామ్నాయాలను రూపొందించడానికి ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగానే వెన్నను తయారు చేసింది.సాంప్రదాయ పాల వనరులపై ఆధారపడకుండా, వాయువులను ఉపయోగించి కొవ్వు అణువులను అభివృద్ధి చేయడానికి కంపెనీ థర్మోకెమికల్ ప్రక్రియను ఉపయోగిస్తుంది. గ్రీన్హౌస్ వాయువులు పశు పరిశ్రమ నుంచి సుమారు 14.5 శాతం వెలువడుతున్నట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఈ శాతాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలని సూచించింది.పశు పరిశ్రమ నుంచి వచ్చే ఉద్గారాలను తగ్గించడానికి సరైన మార్గం.. మాంసం, పాల ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడమే. దీనిని దృష్టిలో ఉంచుకుని సావర్ పాల అవసరం లేకుండానే వెన్నను విజయవంతంగా తయారు చేసింది. నిజమైన వెన్నలో కేజీకి 16.9 కేజీ కార్బన్ డై ఆక్సైడ్కు సమానమైన కార్బన్ ఉంటుంది. పాల అవసరం లేకుండా చేసిన వెన్న కేజీకి 0.8 గ్రామ్స్ CO2 కంటే తక్కువ కార్బన్ పాదముద్రను కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఈ వెన్న రుచి చాలా బాగుందని బిల్గేట్స్ ఓ వీడియోలో పేర్కొన్నారు. -
విడాకుల తరువాత హ్యాపీగా ఉన్నాను - బిల్ గేట్స్ మాజీ భార్య
మెలిందా ఫ్రెంచ్ గేట్స్ ఇటీవల మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ నుంచి తాను విడాకులు తీసుకోవడానికి సంబంధించి కొన్ని వివరాలను వెల్లడించారు. 2021లో విడాకులు తీసుకున్న మెలిందా అంతకు ముందు పరిస్థితులను గురించి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.2021 కంటే ముందే తాను బిల్ గేట్స్ నుంచి విడిపోయినట్లు, ఆ తరువాత 2021లో అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు చెప్పారు. మెలిందా విడాకులను భయంకరమైనవిగా వివరించారు. విడాకులు తీసుకున్న తరువాత జీవితం చాలా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.ఇప్పుడు నేను నా పనులను నేనే చేసుకుంటున్నాను. మెడికల్ స్టోరుకు వెళ్లడం, రోజూ నిత్యావసర సరుకులు తెచ్చుకోవడం, నచ్చిన చోట తినడం వంటివి హ్యాపీగా చేసుకుంటున్నాను. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను విడాకుల తరువాత పొందుతున్నాని మెలిండా అన్నారు.27ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికిన మెలిండా గేట్.. విడాకుల తరువాత 'బిల్ అండ్ మెలిండా గేట్ ఫౌండేషన్' నుంచి కూడా బయటకు వచ్చేసారు. ప్రస్తుతం మెలిండా తన ముగ్గురు పిల్లల గురించి ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. బిల్ అండ్ మెలిండా గేట్ ఫౌండేషన్ నుంచి బయటకు వచ్చిన తరువాత అంతర్జాతీయ స్థాయిలో మహిళా సాధికారత కోసం పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ముప్పు తప్పదా.. బిల్ గేట్స్ ఏంచెప్పారు?
చాట్జీపీటీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో మానవ ఉద్యోగాలకు ముప్పు తప్పదన్న భయాలు మొదలయ్యాయి. కోడ్ రాయడం దగ్గర నుంచి కవిత్వం రాయడం వరకు అన్నీ పనులూ కృత్రిమ మేధ చేసేస్తుండటంతో మానవ ఉద్యోగాలను ఇది భర్తీ చేస్తుందన్న ఆందోళనలు సర్వత్రా పెరుగుతున్నాయి.ఇప్పుడు ఏఐ నిమిషాల్లో కోడ్ రాయగలదు కాబట్టి తమ ఉద్యోగాలు పోతాయేమోనని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానం గురించి, ప్రపంచంపై దాని ప్రభావం గురించి తరచుగా ఉత్సాహాన్ని వ్యక్తం చేసే మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆందోళన చెందుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఊరట కలిగించే విషయాన్ని చెప్పారు. కామత్ పాడ్కాస్ట్ సిరీస్ "పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్" ప్రారంభ ఎపిసోడ్ కోసం గేట్స్ జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్తో కలిసి పాల్గొన్నారు. 30 నిమిషాల పాటు జరిగిన సంభాషణలో గేట్స్, కామత్ మైక్రోసాఫ్ట్ లో తొలినాళ్లను, వివిధ పరిశ్రమలపై, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరివర్తన ప్రభావాన్ని వివరించారు.సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ముప్పు లేదుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరుగుతున్నప్పటికీ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాల భవిష్యత్తుపై గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్పాదకతను పెంపొందించడానికి, విద్యా ట్యూటర్లుగా సేవలందించడానికి కృత్రిమ మేధ సామర్థవంతంగా పనిచేస్తుందన్నారు. దీనికి సంబంధించి భారత్తోపాటు యూఎస్లో విజయవంతమైన ప్రాజెక్టులను ఆయన ఉటంకించారు. ఇక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల స్థానాన్ని కృత్రిమ మేధ భర్తీ చేస్తుందన్న ఆందోళనలను ప్రస్తావిస్తూ అలాంటి భయాలను "అలారలిస్ట్" అని తోసిపుచ్చారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు డిమాండ్ బలంగానే ఉంటుందని, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల అవసరం ఇంకా ఉందని, అది ఆగదని స్పష్టం చేశారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ ఏదో ఒక రోజు అనేక ఉద్యోగాలను భర్తీ చేయగల స్థాయికి చేరుకుంటుందని గేట్స్ అంగీకరించినప్పటికీ, వచ్చే ఇరవై సంవత్సరాలలో ఇది సంభవించే అవకాశాలను ఆయన తోసిపుచ్చారు. శ్రామిక శక్తిపై కృత్రిమ మేధ దీర్ఘకాలిక ప్రభావాన్ని అంచనా వేయడంలో కొంత అనిశ్చితి ఉందన్న ఆయన.. ఇది సంక్లిష్టమైన సమస్య అని, దీనిని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. -
బఫెట్ నుంచి ఆ పాఠం ముందే నేర్చుకోవాల్సింది..
బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నప్పుడు సమయపాలనకు అత్యంత విలువనిచ్చేవారు. ప్రతి సెకనుకూ ఆయన షెడ్యూల్ వేసుకునేవారు. అదే విజయానికి మార్గమని నమ్మేవారు. అలాంటి బిల్ గేట్స్.. అది తప్పని చాలా ఏళ్ల తర్వాత తెలుసుకున్నారు. వారెన్ బఫెట్ నుంచి ఆ పాఠం ముందే నేర్చుకోవాల్సిందని చెబుతున్నారు.."విజయవంతం కావడానికి మీరు మీ షెడ్యూల్లోని ప్రతి సెకనును నింపాల్సిన అవసరం లేదు. ఇది గ్రహించడానికి నాకు చాలా సమయం పట్టింది" అని గేట్స్ మెటా థ్రెడ్స్ యాప్లో పోస్ట్ చేశారు. వారెన్ బఫెట్ రూపొందించుకున్న తేలికపాటి క్యాలెండర్ను నిశితంగా పరిశీలించి ఉంటే ఈ పాఠాన్ని ఇంకా చాలా త్వరగా నేర్చుకునేవాడినని రాసుకొచ్చారు.మైక్రోసాఫ్ట్ సీఈఓగా తన 25 ఏళ్ల పదవీకాలంలో బిల్ గేట్స్ సమయానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చేవారు. రోజులోని ప్రతి నిమిషాన్ని షెడ్యూల్ చేస్తూ తన సమయాన్ని మైక్రోమేనేజ్ చేశారు. సిబ్బందికి అర్థరాత్రి వర్క్ రిక్వెస్ట్లు పంపడంలో ఆయన ప్రసిద్ధి చెందారు. అయితే 2017లో చార్లీ రోజ్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వారెన్ బఫెట్ తో కలిసి గేట్స్ ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. అలుపెరగని ఈ విధానమే విజయానికి మార్గమని ఆయన గతంలో విశ్వసించారు. అయితే, బఫెట్ తేలికపాటి షెడ్యూల్ చూసిన తరువాత, బిల్ గేట్స్ తన భావను సమీక్షించుకోవడం మొదలుపెట్టారు."వారెన్ తన క్యాలెండర్ను చూపించడం నాకు గుర్తుంది. దానిలో ఏమీ లేని రోజులు అతనికి ఉన్నాయి" అని బిల్ గేట్స్ అన్నారు. బఫెట్ షెడ్యూల్ తనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిందన్నారు. మీ షెడ్యూల్లో ప్రతి నిమిషాన్ని నింపడం మీ సీరియస్నెస్కు నిదర్శనం కాదు. బఫెట్ భావన ఏంటంటే "కష్టపడి కాదు.. తెలివిగా పనిచేయండి". సైన్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది.'ఈ పాఠం నేర్చుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. మీరు అంతకాలం వేచి ఉండవద్దు' అని ఆయన అన్నారు. "ఇష్టమైనవారితో బంధాలను పెంపొందించుకోవడానికి, సక్సెస్ను ఆనందించడానికి, నష్టాల నుంచి కోలుకోవడానికి తగిన సమయాన్ని తీసుకోండి. అవసరమైనప్పుడు విరామం తీసుకోండి" అని బిల్ గేట్స్ సూచిస్తున్నారు. -
ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల జాబితా (ఫొటోలు)
-
డిజిటల్ టెక్నాలజీకి పెద్దపీట
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై తనకెంతో ఆసక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. టెక్నాలజీలో తాను నిపుణుడిని కాకపోయినా దానిపై చిన్నపిల్లలకు ఉండే ఉత్సుకత తనకు కూడా ఉందని తెలిపారు. అదేసమయంలో టెక్నాలజీకి తాను బానిస కాలేదని వివరించారు. ప్రధాని మోదీ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్తో ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో శుక్రవారం ‘చాయ్ పే చర్చ’ నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు విద్య, వైద్యం, వ్యవసాయం, వాతావరణ మార్పులు, మహిళా సాధికారత, కృత్రిమ మేధ వంటి కీలక అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఆయా రంగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతిని బిల్గేట్స్కు తెలియజేశారు. ఇండియాలో వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో నూతన సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. బిల్గేట్స్తో మోదీ ఇంకా ఏం చెప్పారంటే... కృత్రిమ మేధ.. మంత్రదండం కాదు ‘‘నేడు డిజిటిల్ ప్రజా మౌలిక సదుపాయాల అవసరం చాలా ఉంది. డిజిటల్ టెక్నాలజీపై ప్రజలకు అవగాహన పెంచాలి. కృత్రిమ మేధ(ఏఐ) వంటి శక్తివంతమైన సాంకేతికత దురి్వనియోగమయ్యే ప్రమాదం పొంచి ఉంది. నైపుణ్యం లేని వ్యక్తుల చేతుల్లో ఇలాంటి టెక్నాలజీ పడితే దుష్పరిణామాలు తప్పవు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలి. నియమ నిబంధనలు అమలు చేయాలి. ఏఐతో సృష్టించే కంటెంట్లో వాటర్మార్క్ను జోడించాలి. ఏఐతో సృష్టించే డీప్ఫేక్ల విషయంలో అప్రమత్తత అవసరం. ఏఐని అన్నీ సాధించిపెట్టే మంత్ర దండంగా చూడొద్దు. అంటే కృత్రి మేధ విలువను తగ్గించడం నా ఉద్దేశం కాదు. గత ఏడా ది జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో ఏఐని నేను ఉపయోగించుకున్నా. పలు కార్యక్రమా ల్లో నా ప్రసంగాలను వేర్వేరు భాషల్లో ప్రసా రం చేయడానికి ఈ టెక్నాలజీ తోడ్పడింది. భూగోళాన్ని కాపాడుకోవాలి వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా పెను సవాళ్లు విసురుతున్నాయి. భూగోళాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. విద్యుత్ లేదా ఉక్కు వినియోగాన్ని అభివృద్ధికి కొలమానంగా చూపుతున్నారు. ఈ ధోరణి కచ్చితంగా మారాలి. విద్యుత్, ఉక్కు విచ్చలవిడి ఉత్పత్తి వల్ల పర్యావరణానికి చేటు తప్పదన్న సంగతి మర్చిపోవద్దు. ఇకపై గ్రీన్ జీడీపీ, గ్రీన్ ఎంప్లాయ్మెంట్ వంటి పరిభాషను ఉపయోగించాలి. వస్తువుల పునఃశుద్ధి, పునరి్వనియోగం ఇండియాలో చాలా సహజం. ఇప్పుడు నేను ధరించిన జాకెట్ రీసైకిల్ చేసిన ఉత్పత్తే. టెక్నాలజీ అంటే కేవలం సేవలను విస్తరించడానికే కాదు, సామాన్య ప్రజల జీవితాలను మరింత సులభతరం చేయాలని నేను నమ్ముతున్నా. తృణధాన్యాల సాగుకు ప్రాధాన్యం గత ఏడాది ఇండియాలో జీ20 సదస్సు నిర్వహించిన తర్వాత వాతావరణ మార్పులపై యుద్ధంలో వేగం పెరిగింది. వాతావరణ మార్పులను ఎదుర్కోవాలంటే మన జీవన శైలిని పర్యావరణ హితంగా మార్చుకోవాలి. ప్రకృతి, పర్యావరణహితమైన నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలి. విద్యుత్ను వృథా చేస్తే, నీటిని విచ్చలవిడిగా ఉపయోగిస్తే అనుకున్న లక్ష్యం సాధించలేం. తక్కువ నీరు అవసరమయ్యే తృణధాన్యాల సాగును పెంచడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. తృణధాన్యాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాం. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పెద్ద ముప్పుగా మారింది. త్వరలో కొలువుదీరే మా నూతన ప్రభుత్వ హయాంలో మహిళలకు.. ముఖ్యంగా బాలికలకు సరై్వకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తాం. సాంకేతిక ప్రజాస్వామీకరణ పునరుద్పాతక ఇంధన రంగంలో మేము శరవేగంగా దూసుకెళ్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్ తయారీలో మరింత అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తున్నాం. ‘సాంకేతిక ప్రజాస్వామీకరణ’ మా విధానం. డిజిటల్ విప్లవంలో గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట వేశాం. ఈ రంగంలో అందరికీ సమాన అవకాశాలు కలి్పస్తున్నాం. డిజిటల్ విప్లవానికి సామాన్య ప్రజలే నాయకత్వం వహించాలన్నది మా ఆకాంక్ష. ఆ దిశగా ‘డ్రోన్ దీదీ’ పథకాన్ని ప్రవేశపెట్టాం. నమో యాప్లో సెల్ఫీ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఇండియా చూపుతున్న చొరవను, వేగాన్ని బిల్గేట్స్ ప్రశంసించారు. ఈ విషయంలో ఇతర దేశాలకు మార్గదర్శిగా మారిందని కొనియాడారు. కృత్రిమ మేధను తాను ఉపయోగించుకుంటున్న తీరును గేట్స్కు మోదీ తెలియజేశారు. తన సెల్ఫోన్ను గేట్స్కు ఇచ్చి, అందులోని ‘నమో’ యాప్ ద్వారా సెల్ఫీ తీయాలని కోరారు. అందులోని టెక్నాలజీతో పాత ఫొటోలూ కనిపిస్తాయని అన్నారు. గతంలో తామిద్దరం దిగిన ఫొటోలను గేట్స్కు చూపించారు. -
ఇప్పటికీ తన విధానమే పాటిస్తున్నాం..: బిల్గేట్స్
యాపిల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్కు టెక్ ప్రపంచంలో ఎల్లప్పుడూ ప్రత్యేకస్థానం ఉంటుంది. కంపెనీ సమావేశాలు ఏర్పాటు చేసినా, కొత్త ఉత్పత్తులు విడుదలైనా ఆయన చేసే ప్రసంగం, తన వ్యవహారశైలి అందరినీ కట్టిపడేసేది. తాజాగా ఇదే విషయాన్ని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వెల్లడించారు. బహిరంగ వేదికలపై స్టీవ్ జాబ్స్లా తాను వ్యవహరించలేనని, ఆయన చాలా సహజంగా ప్రవర్తిస్తూ ఎదుటి వారిని తన మాటలతో ఆకట్లుకునేవారని గేట్స్ ఓ పాడ్కాస్ట్లో తెలిపారు. ఈ సందర్భంగా బిల్గేట్స్ మాట్లాడుతూ.. ‘స్టీవ్ జాబ్స్ చాలా సహజంగా ఉంటారు. స్టేజ్పై మాట్లాడటానికి ముందు ఆయన రిహార్సల్స్ చూడటం ఎంతో సరదాగా ఉంటుంది. కొన్నిసార్లు వేదికపై మాట్లాడుతుంటే అప్పటికప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఆ స్థాయిని నేను ఎప్పటికీ అందుకోలేను. మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన తొలి నాళ్లలో వాటి ఉత్పత్తుల గురించి వివిధ రకాల వ్యక్తులకు వివరించడమే కీలక ప్రక్రియగా ఉండేది. విద్య, వైద్యం, ఏఐకి సంబంధించి మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల గురించి అభిప్రాయ సేకరణ కోసం ఇప్పటికీ కొన్నిసార్లు స్టీవ్ జాబ్స్ అనుసరించే కమ్యూనికేషన్ విధానాన్నే పాటిస్తున్నాం’ అని చెప్పారు. కంపెనీకి సంబంధించి నూతన ఉత్పత్తుల విడుదలతో పాటు, ఇతర సమావేశాల్లో ప్రసంగించేందుకు స్టీవ్ చాలా రోజుల ముందు నుంచి సిద్ధమయ్యేవారట. ఈ విషయాన్ని 2015లో విడుదలైన ‘బికమింగ్ స్టీవ్ జాబ్స్’ అనే పుస్తకంలో రచయితలు బ్రెంట్ ష్లెండర్, రిక్ టెట్జెలీలు వెల్లడించారు. తామా గతంలో ఒక రోజంతా స్టీవ్ జాబ్స్తో ఉన్నామని పుస్తకంలో తెలిపారు. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? కీలక మార్పులు చేసిన బ్యాంకులు చిన్న ప్రజెంటేషన్ కోసం ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని, స్లైడ్స్కు ఎలాంటి రంగులు వాడాలి? స్టేజ్పై తన వ్యవహారశైలి ఎలా ఉండాలి? ఎక్కడ స్పాట్ లైట్ పడాలి? ఇలా ప్రతి విషయంలో ఎంతో ప్రణాళికతో వ్యవహరించేవారని వివరించారు. -
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సెలబ్రెటీల స్పెషల్ ఫొటోలు..
-
బిల్గేట్స్కు చాయ్, ప్రధాని మోదీకి కూడా చాయ్ : డాలీ చాయ్వాలా
భారత్ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్గేట్స్ సోషల్ మీడియా స్టార్, డాలీ చాయ్వాలా వద్దకు వెళ్లి చాయ్ తాగిన వీడియో వైరల్ అయింది. దీంతో మరోసారి మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన సునీల్ పాటిల్ వార్తల్లోకి వచ్చేశాడు. ఈ సందర్భంగా చాయ్వాలా చేసిన కమెంట్స్ విశషంగా నిలుస్తున్నాయి. బిల్ గేట్స్ డాలీ చాయ్వాలా మీట్పై మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. విదేశం నుంచి వ్యక్తి అని మాత్రం అనుకున్నా.. కానీ ఆయన బిట్ గేట్స్ అని అస్సలు తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. అందరికీ ఇచ్చినట్టే అతనికీ టీ ఇచ్చాను. తరువాత నాగ్పూర్కి తిరిగి వచ్చాక తాను ఎవరకి టీ ఇచ్చిందీ గుర్తించానని తెలిపాడు. బిల్ గేట్స్ తన దగ్గరికి వచ్చి 'వావ్, డాలీకి చాయ్' అన్నారని గుర్తు చేసుకున్నారు. పనిలో బిజీగా ఉండి, ఆయన తన పక్కనే ఉన్నా, తాను అస్సలు మాట్లాడలేక పోయానని చెప్పాడు. దక్షిణాది సినిమాలు చూస్తా.. వాటినుంచే స్టైల్స్ నేర్చుకున్నా.. వెరైటీ టీ అందిస్తూ ‘నాగ్పూర్ కా డాలీ చాయ్గా మారా’ అంటూ తన స్టయిల్ గురించి వెల్లడించాడు. అంతేకాదు 'భవిష్యత్తులో ప్రధాని నరేంద్రమోదీకి కూడా టీ అందించాలనుకుంటున్నా అంటూ తన మనసులోని కోరికను బైట పెట్టాడు. కాగా సునీల్ పాటిల్ టీస్టాల్తో ఉపాధిని వెదుక్కోవడమే కాదు, తన డ్రెస్సింగ్ స్టైల్, టీ తయారీలోనూ సూపర్ స్టార్ రజినీకాంత్ను అనుకరిస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. ‘డాలీ చాయ్ వాలా’ పేరుతో ఇన్ స్టాగ్రామ్లో కూడాసెలబ్రెటీగా మారిపోయిన సంగతి తెలిసిందే. #WATCH | Nagpur (Maharashtra): Microsoft Co-founder Bill Gates posted a video, in which he can be seen enjoying Dolly's tea. Dolly Chaiwala says, "I was not aware at all I thought that he was a guy from a foreign country so I should serve him tea. The next day when I came back… pic.twitter.com/hicI3vY31y — ANI (@ANI) February 29, 2024 -
డాలీ చాయ్వాలాతో బిల్ గేట్స్: ఏఐ వీడియోనా? ఇంటర్నెట్ ఫిదా
మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత బిల్గేట్స్ భారత పర్యటనలో మరోసారి తన స్పెషాల్టీని చాటుకున్నారు. భారత దేశ ఆవిష్కరణలపై ఎప్పటిలాగానే ప్రశంసలు కురిపించారు. పాపులర్ నాగ్పూర్ డాలీ చాయ్ వాలా టీ స్టాల్ను సందర్శించిన ఆయన ఇక్కడి టీకి ఫాదా అయిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన డాలీ చాయ్ వాలా ‘వన్ చాయ్ ప్లీజ్’ అంటూ బిల్గేట్స్ టీ అడిగి మరీ తాగారు. అంతే చాయ్వాలా టీకి బిల్ గేట్స్ ఫిదా అయిపోయారు. ఈ క్రమంలో ‘‘ఇండియాలో ఎక్కడికెళ్లినా అక్కడ ఆవిష్కరణలను కనుగొనవచ్చు- సాధారణ కప్పు టీ తయారీలో కూడా!’’ అంటూ ఒక వీడియోషేర్ చేశారు. బిల్గేట్స్ సింప్లిసిటీకి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఇది ఏఐ సృష్టి కాదు కదా అని ఒక యూజర్, "ఇది డీప్ఫేకా’’ అని కూడా ఒక వినియోగదారు ఆశ్చర్యపోవడం విశేషం. దీనికి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా సరదాగా కమెంట్ చేశాయి. జొమాటో బిల్ గేట్స్కి స్పెషల్ ఆఫర్ కూడా ఇచ్చేసింది. అలాగే బిల్ ఎంత స్విగ్గీ స్పందించింది. నాగ్పూర్లో వెరైటీ, స్టయిలిష్ టీతో డాలీ చాయ్వాలా బాగా ఫ్యామస్. 10వేల మందికి పైగా ఫాలోవర్లున్నారంటేఈ చాయ్వాలా స్పెషల్ ఎంటో అర్థం చేసుకోవచ్చు. కాగా బిల్ గేట్స్ తన పర్యటనలో భాగంగా ఒడిశాలోని భువనేశ్వర్లో బిల్గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. ముఖ్యంగా హైదరాబాద్లోని ఇండియా డెవలప్మెంట్ సెంటర్ను కూడా సందర్శించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates) -
బిల్ గేట్స్ను వెనక్కు నెట్టిన జుకర్బర్గ్
ప్రపంచ కుబేరుల జాబితాలోని మొదటి స్థానంలో మార్పుల ఏర్పడ్డ తరువాత.. మెటా సీఈవో 'మార్క్ జుకర్బర్గ్' (Mark Zuckerberg) కూడా ఓ అడుగు ముందుకు వేసి బిల్ గేట్స్ను వెనక్కు నెట్టారు. దీంతో జుకర్బర్గ్ ప్రపంచంలోని నాల్గవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. మెటా స్టాక్ ధరలు 22 శాతం పెరగడం వల్ల జుకర్బర్గ్ సంపద 28 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఈయన నికర విలువ.. బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం 170 బిలియన్ డాలర్లకు చేరింది. ఇదే సమయంలో బిల్ గేట్స్ నికర విలువ 145 బిలియన్ డాలర్ల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే బిల్ గేట్స్ విలువ కంటే జుకర్బర్గ్ విలువ 25 బిలియన్ డాలర్లు పెరిగింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ఇప్పుడు జుకర్బర్గ్ కంటే ముందున్న ధనవంతులు బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్, ఇలాన్ మస్క్ మాత్రమే ఉన్నారు. మెటా తన మొట్టమొదటి డివిడెండ్ను మార్చిలో పంపిణీ చేసినప్పుడు జుకర్బర్గ్ సుమారుగా 174 మిలియన్ డాలర్ల నగదును పొందవచ్చని భావిస్తున్నారు. ఇదీ చదవండి: సంక్షోభంలో పేటీఎం - ప్రత్యర్థులకు పెరిగిన డిమాండ్.. జుకర్బర్గ్ దాదాపు 350 మిలియన్ క్లాస్ A, B షేర్లకు యజమానిగా కంపెనీలో వాటాలను కలిగి ఉన్నారు. అయితే మెటా తన 50-సెంట్స్ త్రైమాసిక డివిడెండ్ కొనసాగిస్తే.. జుకర్బర్గ్ వార్షిక ఆదాయాలు 690 మిలియన్ డాలర్లకు మించిపోతుందని తెలుస్తోంది. ఇదే జరిగితే ధనవంతుల జాబితాలో నాలుగవ స్థానంలో ఉన్న మెటా సీఈఓ మరింత ముందుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. -
ఎక్కువ పన్నులు కట్టాలంటున్న బిల్ గేట్స్! ఎందుకు..?
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఈయన ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నారు. బ్లూమ్బెర్గ్ ప్రకారం బిల్గేట్స్ సంపద 141 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోని సంపన్నులు ఎక్కువ పన్నులు చెల్లించాలని తాను కోరుకుంటున్నట్లు బిల్ గేట్స్ చెప్పారు. తాజాగా దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో బిల్గేట్స్ మాట్లాడుతూ సంపన్న దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువ డబ్బును విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆర్థిక అసమానతలను సరిదిద్దడంలో ఈ చర్య సహాయపడుతుందన్నారు. కాగా ఏడాది క్రితమే ఆయన రెడ్డిట్లో తన 'ఆస్క్ మీ ఎనీథింగ్' ఫోరమ్లో చేసిన వ్యాఖ్యలో సంపన్నులకు పన్నులు ఎక్కువగా పెంచకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంపద పన్ను విధించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిస్తూ 250 మందికి పైగా అల్ట్రా-రిచ్ వ్యక్తులు బహిరంగ లేఖ విడుదల చేసినట్లు బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది. బ్లూమ్బెర్గ్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అత్యంత సంపన్నడైన బిల్గేట్స్.. అత్యధిక సంపదను కలిగి ఉన్న దేశాలు, కంపెనీలు, వ్యక్తులు మరింత ఉదారంగా ముందుకు రావాలన్నారు. అబిగైల్ డిస్నీ, 'సక్సెషన్' నటుడు బ్రియాన్ కాక్స్ వంటి వారు సంతకం చేసిన ఈ బహిరంగ లేఖలో సంపన్నులకు మరింత పన్ను విధించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. అత్యంత సంపన్నులపై అధిక పన్నులు విధించడం వల్ల వారి జీవన ప్రమాణాలపై ఎటువంటి ప్రభావం ఉండదన్నారు. -
మునుపెన్నడూ చూడని అద్భుతాలు 'ఏఐ'తో సాధ్యం - బిల్ గేట్స్
అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సాధారణ ప్రజలు కూడా 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) టెక్నాలజీని రాబోయే రోజుల్లో ఉపయోగించడం మొదలుపెడతారని, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ 'బిల్ గేట్స్' (Bill Gates) వెల్లడించారు. కృత్రిమ మేధస్సు మనం మునుపెన్నడూ చూడని వేగంతో కొత్త ఆవిష్కరణలకు దారి తీస్తుందని తన బ్లాగ్లో రాశారు. ఇప్పటికే అనేక కంపెనీలు ఏఐ ద్వారా అద్భుతాలు సృష్టిస్తున్నాయని, 2024లో ఇది మరింత వేగవంతం అవుతుందని, దీంతో కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని బిల్ గేట్స్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో మనం ఎప్పుడూ చూడలేని అనేక నూతన ఆవిష్కరణలు ఏఐతో సాధ్యమని అన్నారు. ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలను వెతకడంలో ఏఐ పాత్ర ప్రధానంగా ఉండబోతోందని.. ఎయిడ్స్, టీబీ, మలేరియా వంటి వ్యాధులతో పీడించబడే ప్రజలకు సైతం ఏఐ టూల్స్ సాయపడుతుందని వ్యాఖ్యానిస్తూ.. కొన్ని కంపెనీలు క్యాన్సర్ వంటి వాటిని నయం చేయడానికి కావలసిన మందులను అభివృద్ధి చేయడంలో ఏఐ టెక్నాలజీని ఇప్పటికే వాడుతున్నట్లు తెలిపారు. ఏఐ టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి చాలామంది దిగ్గజ కంపెనీల సీఈఓలు కూడా కొంత ఆందోళన చెందారు. ఏఐ వల్ల ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు కూడా వెల్లడించారు. ఏది ఏమైనా ఏఐ వల్ల కొందరికి నష్టమే వాటిల్లినప్పటికీ కొత్త ఆవిష్కరణలకు ఇది బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడుతుందని బిల్ గేట్స్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సగటున ప్రతి రెండు నిమిషాలకు ఒక స్త్రీ ప్రసవ సమయంలో మరణిస్తుందని, ఇలాంటి ప్రమాదాలను తగ్గించడంలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. దీనికోసం 'కోపైలట్' సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ వంటి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇదీ చదవండి: 50 రూపాయలతో రూ.350 కోట్ల సామ్రాజ్యం - చూపు లేకున్నా.. సక్సెస్ కొట్టాడిలా.. HIV ప్రమాదాలను కూడా అంచనా వేయడానికి చాట్బాట్ ఒక సలహాదారు మాదిరిగా పనిచేస్తుందని, దీని ద్వారా ఎప్పటికప్పుడు సలహాలు తీసుకోవచ్చని, ఇలాంటిది అట్టడుగు వర్గాల వారికి కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మొత్తం మీద ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఆరోగ్యానికి సంబంధించిన చాలా విషయాలను తెలుసుకోవచ్చని బిల్ గేట్స్ వెల్లడించారు. -
పనిగంటలపై నవ్వుతెప్పిస్తున్న మీమ్స్ - పారిశ్రామిక వేత్తల మధ్య..
ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి క్యాపిటల్ పాడ్కాస్ట్ 'ది రికార్డ్' ఫస్ట్ ఎపిసోడ్లో యువతను ఉద్దేశించి.. భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడాలంటే, ఇతర దేశాలతో పోటీ పడాలంటే వారానికి 70 గంటలు పనిచేయాల్సిందే అంటూ వెల్లడించారు. గత రెండు, మూడు దశాబ్దాలుగా అద్భుతమైన ప్రగతి సాధించిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ పోటీ పడాలంటే యువత తప్పకుండా వారానికి 70 గంటలు పని చేయాలని, ఇండియాలో పని ఉత్పాదకత ప్రపంచంలోనే చాలా తక్కువగా ఉందని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ యువకులు ఎక్కువపని చేశారని వెల్లడించారు. నారాయణ మూర్తి పనిగంటలపై చేసిన వ్యాఖ్యలు అతి తక్కువ కాలంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. కొందరు ఈయన వ్యాఖ్యలను సమర్దిస్తే.. మరికొందరు గట్టిగా విమర్శించారు. అటు ఐటీ ఉద్యోగుల దగ్గర నుంచి, కొంతమంది ప్రముఖుల వరకు చాలామంది ఈ వ్యాఖ్యలను విమర్శించారు. పనిగంటలు ఉద్దేశించి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ కూడా ఆసక్తికరమై వ్యాఖ్యలు చేశారు. ఏఐ టెక్నాలజీ పెరుగుతున్న వేళ మనుషులు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని ప్రముఖ హాస్యనటుడు ట్రెవర్ నోహ్ హోస్ట్గా నిర్వహించిన ‘వాట్ నౌ’ షోలో వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుంది. ఆ సమయంలో మనుషులు వారానికి మూడు రోజులు పనిచేస్తే సరిపోతుందని చెబుతూ.. కొత్త టెక్నాలజీ మనుషుల ఆయుష్షు, ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తుంది. ఇదీ చదవండి: కోకా కోలా నుంచి మద్యం.. రేటెంతో తెలుసా? పనిగంటలు ఉద్దేశించి ఇద్దరు పారిశ్రామిక వేత్తలు చేసిన వ్యాఖ్యలకు కొందరు నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అలాంటి కోవకు చెందిన ఓ చిన్న వీడియో నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. ఇందులో ఇద్దరు వ్యక్తులు కొట్టుకోవడం నవ్వు తెప్పించే విధంగా ఉండటం గమనార్హం. -
బిల్ గేట్స్ కు దోమలకు సంబంధం ఏమిటి? అసలు అమెరికాలో ఏం జరుగుతోంది?
బిల్ గేట్స్ స్వయంగా దోమలను తరిమిగొట్టే పనేమీ చేయడం లేదు. అయినప్పటికీ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ దీనికి సంబంధించిన ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని తగ్గించేందుకు జన్యుపరంగా మార్పు చెందిన దోమలను అభివృద్ధి చేయడానికి కృషిచేస్తున్న బయోటెక్ కంపెనీ ఆక్సిటెక్కు నిధులు అందజేసినందుకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్కు అవార్డు ప్రకటించారు. ఏప్రిల్ 2021లో ఫ్లోరిడాలోని ఆరు ప్రదేశాలలో ఆక్సిటెక్ సుమారు 150,000 దోమలను విడుదల చేస్తుందని ఆక్సిటెక్ ప్రకటించింది. అయితే ఈ నిర్దిష్ట ప్రాజెక్ట్కు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చలేదని కంపెనీ పేర్కొంది. అంటు వ్యాధులను వ్యాప్తిచేసే దోమల జాతి అయిన ఈడెస్ ఈజిప్టిని జన్యుపరంగా సవరించడానికి బహుళ-సంవత్సరాల పరిశోధన ప్రాజెక్ట్ 2021లో ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక బిల్ గేట్స్ ఉన్నారని ఇంటర్నెట్లో వార్తలు వెలువడ్డాయి. ఈజిప్టి దోమలను జన్యుపరంగా సవరించడం, తరువాత వాటిని అడవిలోకి విడుదల చేయడం అనేది ఇది మొదటిసారేమీ కాదు. పరిశోధకులు ఒక దశాబ్దానికి పైగా దీనిపై పలు ప్రయత్నాలు చేస్తున్నారు. 2010లో కేమాన్ దీవులలో మార్పు చెందిన దోమల విడుదలను విడుదల చేశారు. 2011, 2012, 2015లో ఆక్సిటెక్ బ్రెజిల్లోని పలు ప్రాంతాలలో జన్యుపరంగా మార్పు చెందిన దోమలను విడుదల చేసింది. ఆడ అనాఫిలిస్ దోమల ద్వారా మాత్రమే మలేరియా అనేది మనుషులకు వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈజిప్టి దోమ స్వయంగా మలేరియాను వ్యాప్తి చెందించదు. ఆక్సిటెక్ సంస్థ అనాఫిలిస్ దోమలను జన్యుపరంగా మార్చడానికి పలు ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ సంస్థ వ్యాధులను వ్యాప్తిని అరికట్టేందుకు జీవసంబంధ పరిష్కారాలను అన్వేషించే పరిశోధనలు సాగిస్తుంటుంది. గేట్స్ ఫౌండేషన్ గ్రాంట్ డాక్యుమెంట్లలో ప్రపంచవ్యాప్తంగా 43 నెలల్లో మలేరియా సంబంధిత ప్రాజెక్టుల కోసం జూన్ 2018లో ఆక్సిటెక్కు $5.8 మిలియన్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అమెరికా, కరేబియన్లలో మలేరియా దోమలను అరికట్టడానికి ఈ నిధులను అందజేస్తున్నట్లు గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. సెప్టెంబరు 2020లో $1.4 మిలియన్ల రెండవ దఫా గ్రాంట్ను ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో మలేరియా దోమల నివారణ కోసం ఈ ప్రాజెక్ట్కు అందించినట్లు పేర్కొన్నారు. అయితే అమెరికాలో ఈపనులు చేపట్టేందుకు గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చలేదని కంపెనీ ప్రతినిధి మీడియాకు తెలిపారు. ఆక్సిటెక్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ మొదటి దశలోనే ఉంది. 2020లో యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ జన్యుపరంగా మార్పు చెందిన దోమలను ఫీల్డ్ టెస్ట్ చేయడానికి ఆక్సిటెక్కు ఆమోదం తెలిపింది. అయితే దీనికిముందు కంపెనీ స్థానిక అధికారుల నుంచి ఆమోదం తీసుకోవలసి ఉంటుంది. అలాగే దీనిపై రెండు సంవత్సరాలలో మొత్తం 6,600 ఎకరాల్లో అధ్యయనం జరగాల్సి ఉంది. అయితే ఇంతలో ఈ కంపెనీకి 31 వేలకు మించిన పబ్లిక్ కామెంట్లు వచ్చాయి. వీటిలోని చాలా వ్యాఖ్యలలో ఈ అధ్యయనానికి అనుమతించకూడదని లేదా మరింత సమాచారం అందుబాటులోకి వచ్చే వరకు వేచి ఉండాలని సూచించారు. అయితే దీనిపై సంస్థ 150 పేజీల ప్రతిస్పందనను తెలియజేసింది. జూన్ 2020లో ఫ్లోరిడా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కన్స్యూమర్ సర్వీసెస్ ఈ అధ్యయనం కోసం అనుమతిని మంజూరు చేసింది. అలాగే ఫ్లోరిడా కీస్ మస్కిటో కంట్రోల్ డిస్ట్రిక్ట్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్తో పాటు ఏడు స్టేట్ ఆఫ్ ఫ్లోరిడా ఏజెన్సీలు దీనికి ఆమోదం తెలిపాయి. కాగా ఈజిప్టి దోమలు ఆఫ్రికాకు చెందినవి. ఈ జాతి పెట్టే గుడ్లు పొడి వాతావరణంలో నెలల తరబడి నిద్రాణంగా ఉంటాయని, వర్షం పడినప్పుడు జీవం పోసుకుని వ్యాప్తి చెందుతాయని సంస్థ తెలిపింది. ఫ్లోరిడా కీస్లోని మొత్తం దోమల జనాభాలో ఈజిప్టి దోమ కేవలం 4% మాత్రమే ఉన్నాయి. కానీ దోమల ద్వారా సంక్రమించే వ్యాధులకు ఈజిప్టి దోమలు బాధ్యత వహిస్తాయి. కాగా ఆడ దోమ మాత్రమే చికున్గున్యా, జికా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను వ్యాపిస్తుంది. ఆడ దోమలు మనుషులకు కుట్టి, తమ లాలాజలంలో బ్యాక్టీరియాను మానవ రక్తంలోకి ప్రసారం చేస్తాయి. వీటిని ఎదుర్కొనేందుకు ఆక్సిటెక్ పరిశోధకులు టెట్రాసైక్లిన్ ట్రాన్స్-యాక్టివేటర్ వేరియంట్ అనే ప్రోటీన్ను దోమల నియంత్రణకు ఒక సాధనంగా గుర్తించారు. ఇది కూడా చదవండి: రాబోయే ఏళ్లలో 100 కోట్లమంది మృతి? Bill Gates is not a Scientist or Doctor. Why the Hell is Bill Gates releasing mosquitos on Americans? How much more proof do people need in order to acknowledge his Diabolical Schemes? Arrest Bill Gates. pic.twitter.com/sC2iLpvCVP — Liz Churchill (@liz_churchill10) September 3, 2023 -
మిత్రమా అందుకో శుభాకాంక్షలు: బిల్గేట్స్ అద్భుతమైన వీడియో
Happy Birthday Warren Buffett ప్రపంచంలోనే గొప్ప పెట్టుబడిదారుడి, అపరకుబేరుడు బెర్క్షైర్ హాత్వే , ఛైర్మన్,సీఈవో వారెన్ బఫ్ఫెట్ పుట్టిన రోజు ఆగస్టు 30. ఈ సందర్బంగా మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన స్నేహితుడికి శుభాకాంక్షలందించారు.దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన వీడియోను షేర్ చూస్తూ వినూత్నంగా విషెస్ తెలిపారు. దీంతో ఇది నె టిజనులను బాగా ఆకట్టుకుంటోంది 1920లో నెబ్రాస్కాలోని ఒమాహాలో ఆగస్టు 30న జన్మించారు వారెన్ బఫ్ఫెట్. 93ఏళ్ల ఇన్వెస్టింగ్ లెజెండ్ వారెన్ బఫ్ఫెట్ ప్రపంచంలో అత్యంత విజయ వంతమైన పెట్టుబడిదారులలో ఒకరిగా పేరు గడించారు. ఇన్వెస్టింగ్ తీరు మాంద్యాన్ని ఎలా ఎదుర్కోవాలి, పెట్టుబడులపై లాభాలు ఎలా సాధించాలి లాంటి సలహాలు ఇన్వెస్టర్లకు పెద్ద సక్సెస్మంత్రాలా పని చేస్తాయి. వ్యాపారవేత్త, తండ్రి హోవార్డ్ గ్రాహం బఫ్ఫెట్ ప్రేరణతో 60కి పైగా కంపెనీలను కలిగి ఉన్న బెర్క్షైర్ హాత్వే సీఈవోగా కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్నారు. మీ మీద మీ పెట్టుబడే పెద్ద సక్సెస్ అంటారు ఒరాకిల్ ఆఫ్ ఒమాహాగా పాపులర్ అయిన వారెన్ బఫ్ఫెట్. Happy 93rd birthday to my friend Warren! pic.twitter.com/WxeVO1vOut — Bill Gates (@BillGates) August 30, 2023 -
విండోస్ బర్త్డే.. బిల్ గేట్స్ స్పెషల్ గిఫ్ట్ ఇదే!
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు 'బిల్ గేట్స్' (Bill Gates) ఇటీవల తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఒక వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ బిల్ గేట్స్ ఈ వీడియో ఎందుకు షేర్ చేశారు? దీని వెనుక ఉన్న కారణం ఏమిటనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కంప్యూటర్ యుగంలో కొనసాగుతున్నామన్న విషయం అందరికి తెలుసు. అయితే కంప్యూటర్ అనగానే ముందుగా అందరికి విండోస్ గుర్తుకు వస్తాయి. ఆధునిక కాలంలో ఎన్ని ఓఎస్లు పుట్టుకొచ్చిన ఒకప్పటి విండోస్95 మాత్రం ఇప్పటికే ప్రత్యేకమే. దీనిని ప్రారంభించి ఇప్పటికి 28 సంవత్సరాలు పూర్తయినట్లు సమాచారం. ఇదీ చదవండి: చంద్రయాన్-3 బడ్జెట్ కంటే ఖరీదైన కారు.. ఇలాంటి మోడల్ ఇప్పటి వరకు చూసుండరు..! విండోస్95 విడుదలైన సుమారు మూడు దశాబ్దాలు కావొస్తున్న సందర్భంగా బిల్ గేట్స్ దానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ... తన పాత జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. ఇందులో బిల్ గేట్స్ డ్యాన్స్ వేయడం చూడవచ్చు. మైక్రోసాఫ్ట్ మొదటి సారి 1995 ఆగష్టు 24న విండోస్95ను 32 బిట్ సిస్టంతో విడుదల చేసింది. ఆ తరువాత కాలంలో ఇందులో చాలా మార్పులు వచ్చాయి. Some memories stick with you forever. Others follow you around the internet for 28 years. Happy birthday, @Windows. pic.twitter.com/CUqLN2fqlW — Bill Gates (@BillGates) August 24, 2023 -
కుసుమా నువ్వు గ్రేట్
బనశంకరి: ప్రజల్లో డిజిటల్ ఆర్థిక సాధికారత కోసం బెంగుళూరుకు చెందిన ఒక పోస్టుమాస్టర్ చేస్తున్న కృషికి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ముగ్ధుల య్యారు. పోస్ట్మాస్టర్ కె.కుసుమ కృషి అభినందనీయమని సామాజిక మాధ్యమాల్లో ప్రశంసించారు. ఇటీవల బెంగళూరులో ఎందరో సామాజిక కార్యకర్తలను కలిశారు. పోస్ట్మాస్టర్అయిన కుసుమనూ కలిశారు. భారత్లో శరవేగంగా సాగుతున్న డిజిటల్ ఆర్థికాభివృద్ధిలో కుసుమ వంటివారు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడిన బిల్గేట్స్ ఆమెతో ఉన్న ఫోటోను షేర్ చేశారు. -
బిల్ గేట్స్ ప్రశ్నకు ఖాన్ సమాధానం - వీడియో వైరల్
ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో ఒకరు, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ 'బిల్ గేట్స్' (Bill Gates) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈయన ఇటీవల తన సొంత పోడ్కాస్ట్ 'అన్కన్ఫ్యూజ్ మి విత్ బిల్ గేట్స్' అనే ప్రోగ్రామ్ ప్రారంభించారు. దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పటికే ఒక ఎపిసోడ్ పూర్తయింది. రెండవ ఎపిసోడ్ కూడా రిలీజ్ అయింది. ఇందులో ఖాన్ అకాడమీ వ్యవస్థాపకుడు సాల్ ఖాన్ని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఎపిసోడ్లో సాల్ ఖాన్కి కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఫోటో చూపించి.. మీరెప్పుడైనా సాల్ ఖాన్ అని ఇంటర్నెట్లో సర్చ్ చేస్తే ఈ వ్యక్తి కనిపించారా? ఇద్దరి పేర్లూ ఒకేలా ఉన్నాయని ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యారా అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా సల్మాన్ ఖాన్ నాకు తెలుసు, నేను అకాడమీ ప్రారంభించిన ప్రారంభంలో ఆయన ఫ్యాన్స్ నుంచి మెయిల్స్ వచ్చేవని చెప్పాడు. ఇదీ చదవండి: అంకిత భావానికి రూ. 3.5 కోట్లు ప్రతిఫలం! ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. అంతే కాకుండా.. మెయిల్స్లో నువ్వంటే నాకు ఇష్టమని, నువ్వు మ్యాథ్స్ అంత సులభంగా ఎలా చేస్తారు అని ఉండేదని వెల్లడించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి తోడు బిల్ గేట్స్ చేతిలో సల్మాన్ ఖాన్ ఉండటంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. -
ఏకంగా రూ. 3.4 లక్షల కోట్ల విరాళాలిచ్చిన మహిళ ఎవరో తెలుసా?
పరోపకారార్థం ఇదం శరీరం అనేది నానుడి. ఏ ఫలం ఆశించకుండా నలుగురికి సాయం చేయడం. సృష్టిలో ఈ భూమ్యా కాశాలతోపాటు పశువులు, వృక్షాలు ఎలాంటి ప్రత్యుపకారం ఆశించకుండానే తమ విధిని నిర్వరిస్తున్నాయి. పరులకి సేవ చెయ్యడమే ఉత్కృష్టమైన జన్మనెత్తిన మనుషుల పరమావధి. తమకున్న దాంట్లో ఎంతో కొంత దానం చేయాలని భావిస్తాం. ఇది కేవలం భారతీయులకే కాదు, యావత్ ప్రపంచానికి వర్తిస్తుంది...కదా! తాజాగా భూరి విరాళాలతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచారో ఓ మహిళా వ్యాపారవేత్త. ఆమె ఎవరు. ఏ దేశస్థురాలు ఆ వివరాలు చూద్దాం. ఆమె మరెవ్వరో కాదు అమెరికు చెందిన మెలిండా ఫ్రెంచ్ గేట్స్. మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్గేట్స్ మాజీ భార్య. 3.24 లక్షల కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చిన ప్రపంచంలో టాప్లో నిలిచారు. 2000లో భర్త బిల్ గేట్స్ తో కలిసి బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ను 2015 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థ గా అవతరించింది. ప్రస్తుతం దాదాపు 70 బిలియన్ల డాలర్ల విరాళాలతో బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఆస్తుల పరంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద దాతృత్వ సంస్థ.వాషింగ్టన్లోని సియాటిల్ కేంద్రంగా సేవలందిస్తున్న మెలిండా నేతృత్వంలోని సంస్థ తన సంపదలో 99 శాతానికి పైగా విరాళంగా ఇవ్వాలనే లక్ష్యానికి కట్టుబడి ఉంది. 1964 ఆగస్టు 15న పుట్టిన మెలిండా కంప్యూటర్ సైంటిస్ట్ అయిన మైక్రోసాఫ్ట్లో మాజీ మల్టీమీడియా ప్రొడక్ట్ డెవలపర్ , మేనేజర్ కూడా. గ్లోబల్ హెల్త్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ , అమెరికన్ ఎడ్యుకేషన్తో సహా వివిధ సమస్యలపై గేట్స్ ఫౌండేషన్ పనిచేస్తుంది.1994లో హెల్త్, స్టడీ, జెండర్ ఈక్వాలిటీ కోసం ప్రోత్సహించడానికి ఫౌండేషన్ ద్వారా 39 బిలియన్ల డాలర్లకు పైగా విరాళాలు అందించారు.మెలిండా గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా నిరుపేద మహిళలకు గర్భనిరోధక అంశాలకి ప్రాధాన్యతనిస్తున్నారు. దీని కోసం ఆమె సంస్థ ద్వారా ఒకబిలియన్ డాలర్లకు పైగా విరాళాలివ్వడం విశేషం. మెలిండా మంచి రచయిత్రి కూడా. భారతదేశంలో ఫౌండేషన్ దాతృత్వ కార్యకలాపాలకు గుర్తింపుగా, బిల్ అండ్ మెలిండా సంయుక్తంగా 2015లో భారతదేశం మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ను అందుకున్నారు.2016లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫ్రెంచ్ గేట్స్ , బిల్కు ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను ప్రదానం చేశారు. ఏడేళ్ల డేటింగ్ తర్వాత, 1994లో బిల్ గేట్స్, మెలిండా హవాయిలో ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. కానీ అనూహ్యంగా 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన ఈ జంట ఆగస్టు 2021లో విడాకులు తీసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ మెలిండా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా నిలుస్తూ వస్తున్నారు. -
పెళ్ళికి ముందే ప్రియురాలితో చక్కర్లు కొడుతున్న బిల్ గేట్స్ - (ఫోటోలు)
-
బిల్ గేట్స్ ప్రైవేట్ ఆఫీసులో ఉద్యోగం: ఇంటర్వ్యూలో షాకింగ్ ప్రశ్నల దుమారం
ప్రపంచ కుబేరుల్లో ఒకరు, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్మరోసారి వార్తల్లో నిలిచారు. బిల్గేట్స్ ఆఫీసులో ఉద్యోగం కోసం పిలిచి ఇంటర్వ్యూలో అభ్యంతరకర ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వైరల్గా మారింది. (వంటలతో షురూ చేసి రూ. 750 కోట్లకు అధిపతిగా, ఊహించని నెట్వర్త్) ఈ నివేదిక ప్రకారం బిల్ గేట్స్ ప్రైవేట్ ఆఫీసు ఇంటర్వ్యూను థర్డ్ పార్టీ కంపెనీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బిల్ గేట్స్ ప్రైవేట్ కార్యాలయంలో ఉద్యోగాలు కోరుతున్న మహిళలను లైంగికంగా అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారు. గేట్స్ వెంచర్స్ కోసం ఇంటర్వ్యూ చేసే ఎక్సటర్న్ సెక్యూరిటీ వారి లైంగిక చరిత్ర, మీకు నచ్చే పోర్న్ చిత్రాలు, చిత్రాలు, వారి ఫోన్లో నగ్న ఫోటోలేమైనా ఉన్నాయా, ఇంతకు ముందు వివాహేతర సంబంధాలున్నాయా అని మహిళల్ని ప్రశ్నించారు. అంతేకాదు డ్రగ్స్ తీసుకుంటారా వంటి ఇతర ప్రశ్నల్ని కేడా అడిగారు. అయితే అదే స్థానాలకు పురుష దరఖాస్తుదారులు అలాంటి వ్యక్తిగత వివరాల గురించి అడగలేదని కూడా నివేదించింది. కొంతమంది మహిళలు తాము ఇంతకుముందు "డాలర్ల కోసం డ్యాన్స్ చేసారా" అని అడిగారని తెలపారని, లైంగికంగా సంక్రమించే వ్యాధికి మీకు సోకిందా అని కూడా ప్రశ్నించారని తెలిపారని వాల్ స్ట్రీట్ పేర్కొంది. అయితే ఈ కథనంపై కాన్సెంట్రిక్ అడ్వైజర్స్ స్పందించింది. కాన్సెంట్రిక్ అడ్వైజర్స్ సీఈవో మైక్ లెఫెవర్ ఈ ఆరోపణలను తిరస్కరించారు. చట్టాలకు లోబడి మాత్రమే ప్రవర్తించామన్నారు. ఇదీ చదవండి: Bhuvan Bam Net Worth 2023: తొలి జీతం 5వేలే.. ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్గా కోట్లు, ఎలా? మరోవైపు గేట్స్ వెంచర్స్ ప్రతినిధి మాట్లాడుతూ కాన్సెంట్రిక్ అడ్వైజర్స్ లైంగికంగా అసభ్యకరమైన ప్రశ్నలు అడగడం గురించి తమకు తెలియదనీ, అయితే ఇది ఈ విధానం ఆమోదయోగ్యం కాదు, తమ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఆమె పేర్కొన్నారు. కానీ. పదిహేనేళ్ల స్క్రీనింగ్ ప్రక్రియలో ఇలాంటి సమాచారం ఎపుడూ తమకు అందలేదని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామన్నది స్పష్టం చేయలేదు. (బిజినెస్ టైకూన్ల తొలి జాబ్ ఏదో తెలుసా? మెగా స్టార్ల సక్సెస్ జర్నీ తెలుసా?) కాగా 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ బిల్ గేట్స్ మిలిండా దంపతులు విడాకులు తీసుకోవడం పెద్ద సంచలనం రేపింది. 2021 ఆగస్టులో వీరికి విడాకులు మంజూరయ్యాయి. ఆ తరువాత ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడనే వార్తలొచ్చాయి. దీంతోపాటు బిల్ గేట్స్ పలువురు మహిళా ఉద్యోగులతో సంబంధాలున్నాయని ఆరోపణలు కూడా జోరుగానే ఉండటం గమనార్హం. -
అపర కుబేరులు జిమ్లో ఉంటే ఎలా ఉంటుంది - ఫోటోలు
-
బిల్గేట్స్తో సమావేశం వండర్ఫుల్! కోవిడ్ నిర్వహణపై ప్రశంసల జల్లు!
భారతదేశ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ దేశా రాజధానిలోని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో భేటీ అయ్యారు. అంతేగాదు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని వార్రూమ్ని సైతం సందర్శించారు బిల్గేట్స్. వాస్తవానికి దీన్ని కోవిడ్ సమయంలో నేషనల్ పబ్లిక్ హెల్త్ అబ్జర్వేటరీ పేరుతో వార్ రూమ్ని రూపొందించారు. మన్సుఖ్తో జరిగిన సమావేశంలో బిల్గేట్స్ కోవిడ్ నిర్వహణ, టీకా డ్రైవ్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ వంటి డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాల గురించి తెలుసుకుని ప్రశంసించారు. అలాగే ఆ సమావేశంలో బారత్ జీ20 ఆరోగ్య ప్రాధాన్యతలు, పీఎం భారతీయ జనౌషధి పరియోజన ఈ సంజీవని గురించి కూడా ఆరోగ్య మంత్రి మన్సుఖ్ బిల్గేట్స్తో చర్చించారు. ఈ మేరకు ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయా ట్విట్టర్ వేదికగా బిల్గేట్స్తో జరిగిన సమావేశం వండర్ఫుల్ అంటూ ఈవిషయాన్ని వెల్లడించారు. కాగా, బిల్గేట్స్ గతవారం తన బ్లాగ్లో భారత పర్యటన గురించి తెలియజేశారు. బ్లాగులో ఆయన..నేను వచ్చేవారం భారతదేశానికి వెళ్తున్నాను. చాల ఏళ్లుగా అక్కడ చాలా సమయం గడిపినప్పటికీ..మరుగదొడ్లను తనిఖీ చేయడం నుంచి భారతదేశంలోని పేద, వెనుకబడిన కులాలు నివశించే గ్రామాన్ని సందర్శించడం వరకు ప్రతిదీ చేస్తున్నాను. కోవిడ్కి ముందు నుంచి కూడా భారత్ని సందర్శించ లేకపోయాను. అక్కడ ఎంత వరకు పురోగతి సాధించిందో తెలుసుకునేంతం వరకు వేచి ఉండలేను అని రాసుకొచ్చారు. అలాగే భారతదేశాన్ని కొనయాడారు. భారతదేశం భవిష్యత్తుపై మంచి ఆశను కలిగిస్తుందన్నారు. ప్రపంచం పలు సంక్షోభాలతో అతలాకుతలం అయిపోతున్నప్పటికీ.. భారత్ మాత్రం ఎంత పెద్ద సమస్యనైనా సరే సులభంగా పరిష్కరించగలదని నిరూపించిందన్నారు. (చదవండి: చైనాపై ఒత్తిడి తెచ్చేలా..రంగం సిద్ధం చేస్తున్న అమెరికా!) -
భారత డిజిటల్ నెట్వర్క్ భేష్
న్యూఢిల్లీ: భారత్లోని డిజిటల్ పబ్లిక్ నెట్వర్క్ భేషుగ్గా ఉందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసించారు. దేశీయంగా విశ్వసనీయమైన, చౌకైన కనెక్టివిటీ లభిస్తుందని చెప్పారు. భారత్ అత్యంత చౌకైన 5జీ మార్కెట్ కావచ్చని ఆయన పేర్కొన్నారు. బుధవారం న్యూఢిల్లీలో నిర్వహించిన జీ20 సంబంధ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గేట్స్ ఈ విషయాలు తెలిపారు. ఆధార్, చెల్లింపుల వ్యవస్థ, మరింత మందిని బ్యాంకింగ్ పరిధిలోకి తెచ్చేందుకు భారత్ సాధించిన పురోగతి తదితర అంశాల గురించి ఆయన ప్రస్తావించారు. ప్రాథమిక ఆధార్ రూపకల్పనపై ఇన్వెస్ట్ చేయడం సహా చెల్లింపుల విధానాన్ని సులభతరం చేయడంలో భారత్ సమగ్రమైన ప్లాట్ఫాంను రూపొందించిందని గేట్స్ చెప్పారు. ఈ విషయంలో మిగతా దేశాలకు ఆదర్శంగా ఉండగలదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా వర్ధమాన దేశాలు ఇలాంటి వాటి అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు. -
రిషి సునాక్, బిల్గేట్స్ను ఇంటర్వ్యూ చేసిన చాట్బాట్.. ఏయే ప్రశ్నలు అడిగిందో తెలుసా?
ఇప్పుడు ప్రపంచమంతటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభంజనమే. అందరూ చాట్బాట్ గురించే చర్చించుకుంటున్నారు. చాట్జీపీటీ వంటి చాట్బాట్లతో మాట్లాడేందుకు ప్రముఖులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏఐ ఆధారిత ప్లాట్ఫారమ్ నుంచి పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సాంకేతికత, ఆవిష్కరణలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై తమ అంతరార్థాలను ఆవిష్కరించారు. వీరిని ఇంటర్వ్వూ చేసేందుకు ఈ చాట్బాట్ అధునాతన నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అల్గారిథమ్లను ఉపయోగించింది. గతంలో వారిద్దరు చేసిన ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, పబ్లిక్ స్టేట్మెంట్ల నుంచి ప్రశ్నలను రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికత అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా చెబుతున్నారు. ఎందుకంటే ఇది వారితో సమాధానాలు రాబట్టేందుకు చాలా తెలివిగా ప్రశ్నలు సంధించింది. 10 డౌనింగ్ స్ట్రీట్ అనే యూట్యూబ్ ఛానెల్లో ఈ ఇంటర్వ్వూ వీడియోను పోస్ట్ చేశారు. రాబోయే పదేళ్లలో గ్లోబల్ ఎకానమీ, జాబ్ మార్కెట్పై సాంకేతికత ఎలా ప్రభావం చూపుతుందని మీరు భావిస్తున్నారు?.. అంటూ ఇంటర్వ్వూను ప్రారంభించిన చాట్బాట్.. ఇద్దరినీ ఆలోచనలను రేకెత్తించే పలు ప్రశ్నలను సంధించింది. దీనికి బిల్గేట్స్ స్పందిస్తూ.. కార్మిక కొరత, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి అంశాల్లో ప్రపంచం మరింత పురోగతి చెందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రశ్న అడిగిన చాట్బాట్ను అభినందిస్తూ తాము మరింత సమర్థవంతంగా పనిచేయడంలో ఏఐ సహాయపడుతుందన్నారు. చాట్బాట్ తర్వాతి ప్రశ్న.. ‘మీరు ఇప్పటివరకు స్వీకరించిన అతి ముఖ్యమైన సలహా ఏమిటి, అది మీ వృత్తిని, జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది’.. దీనిపై బిల్స్గేట్, రిషిసునాక్ ఇద్దరూ సమాధానమిచ్చారు. తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి అందిన సహకారాన్ని, సలహాలను పంచుకున్నారు. మీ విధులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయాల్సివస్తే దేన్ని చేయాలని మీరు కోరుకుంటారు అని అడిప్రశ్నకు గేట్స్ సమాధానమిస్తూ.. తాను నోట్స్ తయారు చేసే క్రమంలో డ్రాయింగ్లు, పద్యాలను జోడించడానికి ఏఐ సహాయం తీసుకుంటానన్నారు. ప్రధాని ప్రశ్నోత్తరాల సమయంలో తన తరఫున ఏఐ పాల్గొనడాన్నిఇష్టపడతానని రిషి సునాక్ చెప్పారు. బ్రెగ్జిట్ అనంతరం యూకే ఆర్థిక పరిస్థతి, వృద్ధి, ఆవిష్కరణల కోసం కొత్త అవకాశాలను సృష్టించడానికి సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చనే దాని గురించి రిషి సునాక్ను చాట్బాట్ ప్రశ్నించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి కొత్త సాంకేతికతలలో పెట్టుబడులు, ఇన్వెస్టర్లు, చిన్న వ్యాపారారులకు మద్దతిచ్చే వ్యవస్థను సృష్టించడం వంటివాటి ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. కోవిడ్ అనంతర ప్రపంచం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, క్లిష్ట సమయాల్లో ఒకరికొకరు ఎలా తోడుగా నిలివాలి వంటి అంశాలను కూడా ఆయన స్పృశించారు. సమాజంలో ఏఐ పాత్ర, వాతావరణ మార్పు, ప్రపంచ ఆరోగ్యం వంటి అత్యంత ముఖ్యమైన సవాళ్లను పరిష్కరించడానికి దీన్ని ఎలా ఉపయోగించవచ్చనే దాని గురించి బిల్ గేట్స్ను అడగ్గా నైతికంగా, పారదర్శకంగా, జవాబుదారీగా ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. దీని ప్రయోజనాలు ప్రజలందరికీ అందేలా ప్రభుత్వాలు, వ్యాపారవేత్తలు, పౌర సమాజం మధ్య సహకారం కావాలని పిలుపునిచ్చారు. -
బిల్ గేట్స్ (బిజినెస్ మాగ్నెట్) రాయని డైరీ
మిస్ పౌలా నవ్వారు. ఆమె నవ్వు సియాటిల్ నగరంలా అందంగా ఉంది. నన్ను అర్థం చేసుకున్న సిటీ సియాటిల్. అక్కడే నేను పుట్టాను. పర్వతాల అరణ్య జ్వాలలపై నాకు ప్రేమ కలిగిందీ అక్కడే. ‘‘ఏంటి నవ్వుతున్నారు మిస్ పౌలా?’’ అని అడిగాను. సియాటిల్లోని మొత్తం ఏడు లక్షల యాభై వేల మంది జనాభాకు కాస్త దూరంగా ఉండే కాఫీ షాప్లో ఇద్దరం పక్కపక్కన కూర్చొని ఉన్నాం. నేను ఆమె వైపు జరిగి కూర్చుంటే ఆమె నావైపు ఒరిగి కూర్చున్నారు. ‘‘మన గురించి ఏవో రాస్తున్నారు..’’ అన్నారు పౌలా.. నవ్వుతూనే. నేనూ నవ్వాను. ‘‘మీరెందుకు నవ్వుతున్నారు బిల్!’’ అన్నారామె. ‘‘ఏవో రాస్తున్నారు కానీ, ఏవేవో రాయడం లేదు. నయం కదా..’’ అన్నాను. ఇద్దరం కాసేపు మౌనంగా ఉండిపోయాం. మా భుజాలు వాటి కబుర్లలో అవి ఉండిపోయాయి. ‘‘మీ నవ్వు పొయెట్రీలా ఉంటుంది బిల్..’’ అన్నారు పౌలా హఠాత్తుగా! 67 ఏళ్ల వయసులో ఆమె కారణంగా సియాటిల్ నగరాన్ని నేను, 60 ఏళ్ల వయసులో నా కారణంగా పొయెట్రీని ఆమె ఇష్టపడుతున్నామా? అయినా నా నవ్వు పొయెట్రీలా ఉంటుందని ఆమె అన్నారే గానీ పొయెట్రీని తను ఇష్టపడతానని అన్లేదుగా!! ‘‘పొయెట్రీ అంటే మీకు ఇష్టమా?’’ అని అడిగాను. ఆమె నవ్వి, ‘‘ఎవరికుండదూ..!’’ అన్నారు. ‘‘బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్లక్కూడానా?’’ అన్నాను. ‘‘ఓయ్..’’ అంటూ తన భుజంతో నా భుజాన్ని నెట్టేశారు పౌలా. ఆమెలో ఏదో మాయ ఉంది. యాన్ విన్బ్లాడ్లో ఉన్నట్లు, జిల్ బెనెట్లో ఉన్నట్లు, మెలిందాలో ఉన్నట్లు! అసలు ఆడవాళ్లలోనే ఈ మాయ ఉంటుందా?! మెలిందా నాకు విడాకులు ఇవ్వడానికి విన్బ్లాడ్ కానీ, జిల్ బెనెట్ గానీ కారణం కాదు. పౌలాకు నేను దగ్గరవ్వడానికి మెలిందా కానీ మరొకరు కానీ కారణం కాదు. ప్రేమ, స్నేహం.. ఇవి మాత్రమే నడిపిస్తాయి జీవితాన్ని. జెఫ్రీ ఎప్స్టైన్ నా స్నేహితుడు. అతడితో మాట్లాడవద్దంటుంది మెలిందా. అతడి మీద కేసులు ఉన్నాయని, అతడు జైలుకు వెళ్లాడని, అతడితో స్నేహం వదిలేయమని అంటుంది. ‘‘ఎలా వదిలిపెట్టడం మెలిందా?’’ అంటే.. ‘‘పోనీ నన్నొదిలేయ్’’ అంటుంది!! జైల్లో జెఫ్రీ ఆత్మహత్య చేసుకుని చనిపోయాక కూడా మెలిందా మనసు కరగలేదు. ఎందుకుండాలి ఒక మనిషి పట్ల మరొక మనిషి అంత కఠి నంగా!! మెలిందాతో ఆ మాటే అన్నాను. కోపంతో నన్ను వదిలి వెళ్లింది. కానీ ప్రేమ, టెన్నిస్ ఎవర్నీ ఒంటరిగా ఉండనివ్వవు. నా జీవితంలోకి పౌలా ప్రవేశించారు. నాలానే పౌలా టెన్నిస్ అభిమాని. మొదటి సారి కలిసినప్పుడు.. ‘‘మీ..రూ..’’ అంటూ నన్నలా చూస్తూ ఉండిపోయారు పౌలా. రెండోసారి మేము కలుసుకున్నప్పుడు ‘‘మీ..రూ..’’ అంటూ తనను అలా చూస్తూ ఉండిపోయాన్నేను. మనసుకు నచ్చిన వాళ్లతో కలిసి కూర్చోడానికి టెన్నిస్ టోర్నమెంట్ల తర్వాత కాఫీ షాపులు బాగుంటాయి. అయితే ఒక్కటే నిరాశను కలిగిస్తుంది. కాఫీ షాపులలో ఎన్ని గంటలు కూర్చున్నా డ్యూటీకి వెళ్లడం కోసమైతే ల్యాప్టాప్ని తగిలించుకుని పైకి లేవవల సిందే. పౌలా ఈవెంట్ ఆర్గనైజర్. ‘‘ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు బిల్..’’ అన్నారు పౌలా తన భుజంతో మళ్లీ నా భుజాన్ని నెట్టేస్తూ. మా ముందున్న టేబుల్ మీద ఆవేళ్టి ట్యాబ్లాయిడ్స్ ఉన్నాయి. ‘బిల్ గేట్స్కి మళ్లీ ప్రేమ దొరికింది’.. అన్నిటిపైనా ముఖ్యాంశం ఒకటే! ‘అవునా! బిల్ గేట్స్కి ప్రేమ దొరికిందా?!’’ అంటూ నా కళ్లలోకి చూసి నవ్వారు పౌలా. మాధవ్ శింగరాజు -
హాట్ టాపిక్గా బిల్గేట్స్ డేటింగ్, ఎవరా కొత్త గర్ల్ ఫ్రెండ్?
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ మళ్లీ ప్రేమలో పడ్డాడంటూ వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఒరాకిల్ మాజీ సీఈవో భార్య పౌలా హర్డ్తో గతేడాది నుంచే డేటింగ్లో ఉన్నట్లు రకరకాల కథనాలు వచ్చాయి. దీనికి తోడు ఆ ఇద్దరు ఇటీవల ఒక ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్లో జంటగా కనిపించడంతో ఈ పుకార్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. పౌలా హర్డ్ 2019లో క్యాన్సర్తో పోరాడి మరణించిన ఒరాకిల్ మాజీ సీఈవో మార్క్ హర్డ్ భార్య. పౌలా హర్డ్ కూడా ఈవెంట్ నిర్వాహకురాలిగా పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుందని ఆమెకు మంచి పేరుంది. అంతేగాదు ఆమె గతంలో టెక్ ఎగ్జిక్యూటివ్గా కూడా పనిచేసింది. పౌలా కూడా పలు దాతృత్వ కార్యక్రమాలు చేస్తుండటం విశేషం. కాగా. బిల్గేట్స్ 30 సంవత్సరాల వివాహం అనంతరం మెలిండా గేట్స్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఐతే తాము విడిపోయినప్పటికీ ప్రపంచ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పేదరికాన్ని తగ్గించడంపై దృష్టి సారించే తమ ఫౌండేషన్తో మాత్రం ఇరువురం కలిసే పనిచేస్తామని ప్రకటించడం గమనార్హం. (చదవండి: మీ పనికీ, జీవితానికీ మధ్య సమతుల్యత ఉందా?: రాండ్స్టాడ్స్ అధ్యయనం) -
సాక్షి కార్టూన్ 06-02-2023
-
టెక్ దిగ్గజం బిల్ గేట్స్ రోటీ చేస్తే ఎలా ఉంటుంది? వైరల్ వీడియో
సాక్షి, ముంబై: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నారు. ఒక ఫుడ్ బ్లాగర్ తో కలిసి రోటీలు తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిహార్ పర్యటనలో భాగంగా టెక్ దిగ్గజం చెఫ్ అవతార మెత్తారు. ప్రముఖ చెఫ్ ఈటన్ బెర్నాథ్తో కలిసి రోటీలు చేసిన వాటిని నేతితో ఎంజాయ్ చేయడం విశేషంగా నిలిచింది. అంతేకాదు రోటీ ఎలా చేయాలో నేర్చుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి వాటిని ఆరంగించారు. చాలా బాగున్నాయంటూ బిల్ గేట్స్ కితాబునిచ్చారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఇన్స్టాగ్రామ్లో గేట్స్ ఒక వీడియోను పంచుకున్నారు, దీనిలో రోటీని ఎలా తయారు చేయాలో బెర్నాథ్ గేట్స్కు నేర్పించారు. ‘‘మేం కలిసి భారతీయ రోటీని తయారు చేసాం. ఈటాన్ భారతదేశంలోని బీహార్ పర్యటన నుండి తిరిగి వచ్చాడు, అక్కడ అతను గోధుమ రైతులను కలుసుకున్నాడు, కొత్త ప్రారంభ విత్తే సాంకేతికతలతో దిగుబడి గణనీయంగా పెరిగింది’’ అని గేట్స్ క్యాప్షన్లో రాశారు.అలాగే 'దీదీ కి రసోయ్' కమ్యూనిటీ క్యాంటీన్ల మహిళలను కూడా కలుసుకున్నారు. అటు పాప్యులర్ బ్లాగర్ ఈటన్ బెర్నాత్ దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ‘‘నేను భారతదేశంలోని బీహార్ కు వెళ్లి వచ్చా.. అక్కడ గోధుమలను పండించే రైతులను కలిశాను. రోటీని తయారు చేయడంలో తమ నైపుణ్యాన్ని పంచుకున్న ‘దీదీ కీ రసోయి’ క్యాంటీన్లకు ధన్యవాదాలు’’ అని ఆయన రాశారు. .@BillGates and I had a blast making Indian Roti together. I just got back from Bihar, India where I met wheat farmers whose yields have been increased thanks to new early sowing technologies and women from "Didi Ki Rasoi" canteens who shared their expertise in making Roti. pic.twitter.com/CAb86CgjR3 — Eitan Bernath (@EitanBernath) February 2, 2023 -
హైదరాబాద్కు రానున్న బిల్ గేట్స్, సత్య నాదెళ్ల
సాక్షి, హైదరాబాద్ః వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 26వ తేదీ వరకు బయో ఏషియా 20వ వార్షిక సదస్సు హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ సదస్సులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ప్రోత్సహించేందు కు కేంద్ర ఎంఎస్ఎంఈ విభాగంతో బయో ఏషి యా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏషియాలో అతిపెద్దదైన లైఫ్ సైన్సెస్, హెల్త్ టెక్ వేదికగా బయో ఏషియా సదస్సును తెలంగాణ ప్రభుత్వం ఏటా నిర్వహిస్తోంది. ఆ సదస్సులో ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక పెవిలియన్ కేటాయిస్తారు. ఇందులో వైద్య ఉపకరణాలు, ఫార్మా స్యూటికల్స్తో పాటు అనుబంధ పరిశ్రమలకు చెందిన 60 ఎంఎస్ఎంఈలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. రెండు దశాబ్దాలుగా హైదరాబాద్లో జరుగుతున్న ఈ సదస్సులో హెల్త్కేర్, లైఫ్సైన్సెస్ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమలతో పాటు స్థానిక సంస్థలు భాగస్వాములుగా ఉంటున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. సదస్సుకు అనేక మంది నోబుల్ బహుమతి విజేతలతో పాటు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, నోవార్టిస్ సీఈఓ వాస్ నర్సింహన్, మెడ్ట్రానిక్స్ సీఈవో జెఫ్ మార్తా వంటి ప్రముఖులు హాజరవుతున్నట్లు బయో ఏషియా సీఈవో శక్తి నాగప్పన్ వెల్లడించారు. (క్లిక్ చేయండి: రాయదుర్గం టు శంషాబాద్.. ఏనోట విన్నా అదే చర్చ) -
ప్రేమలో పడిన మిలిందా గేట్స్, కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?
న్యూఢిల్లీ: పారిశ్రామిక వేత్త మిలిందా ఫ్రెంచ్ గేట్స్ డేటింగ్ అంశం అమెరికా మీడియాలో హల్ చల్ చేస్తోంది. మిలిందా 60 ఏళ్ల మాజీ టీవీ రిపోర్టర్ జాన్ డ్యూ ప్రీతో డేటింగ్ చేస్తోందనే వార్త వైరల్ అవుతోంది. ఫాక్స్ న్యూస్మాజీ కరస్పాండెంట్, కమ్యూనికేషన్స్ స్పెషలిస్ట్ జోన్ డు ప్రీతో మళ్లీ ప్రేమలో పడ్డారని టీఎంజెడ్ సహా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్ షిప్లో ఉన్నారని నివేదించింది. అంతేకాదు కాలిఫోర్నియాలోని న్యూపోర్ట్ బీచ్లోని ఫైవ్ స్టార్ హోటల్లో ఈ జంట, కొంతమంది కుటుంబ సభ్యులతో పాటు బస చేసినట్లు కూడా రిపోర్ట్ చేసింది. Bill Gates ex-wife Melinda finds love again; reportedly dating a former TV reporter Melinda Gates, ex-wife of billionaire Bill Gates, is reportedly dating a former Fox News reporter TMZ reports that the 58-year-old philanthropist has been dating Jon Du Pre, 63, for months now. pic.twitter.com/A0ixRbudvR — Instablog9ja (@instablog9ja) November 9, 2022 కాగా బిల్ గేట్స్, మిలిందా గేట్స్ 27 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలుకుతూ ఆగస్టు 2021లో విడాకుల అంశాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపర్చారు బిల్గేట్స్తో విడిపోయిన తర్వాత తాను ఎంతో మనోవేదనకు గురయ్యానంటూ మిలిందా ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, బిల్ గేట్స్, మిలిందాకు ముగ్గురు సంతానం ఉన్నారు. మరోవైపు తాజా కథనాలపై మిలిందాగ గానీ, జాన్ డ్యూ ప్రీ గానీ ఇంతవరకు స్పందించలేదు. -
టీకా వల్లే నా కూతురు చనిపోయింది..వెయ్యి కోట్లివ్వండి..
ముంబై: ‘‘కోవిషీల్డ్ టీకా సైడ్ ఎఫెక్ట్స్ వల్లే నా కుమార్తె మరణించింది. కేంద్ర ప్రభుత్వ కమిటీ కూడా దీన్ని ధ్రువీకరించింది. కనుక రూ.వెయ్యి కోట్ల పరిహారం ఇప్పించండి’’ అంటూ నాసిక్కు చెందిన స్నేహాల్ అనే వైద్య విద్యార్థి తండ్రి లునావత్ దిలీప్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంతోపాటు, టీకా తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్కు, దానికి తోడ్పాటు అందించిన బిల్గేట్స్ ఫౌండేషన్కు కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే విచారణ నాటికి సమాధానమివ్వాలని ఆదేశించింది. చదవండి: జయలలిత మరణం.. కొడనాడులో ఎన్నో రహస్యాలు..! -
భారత ఆరోగ్యరంగంపై బిల్గేట్స్ ప్రశంసలు
న్యూఢిల్లీ: కాలానికి అనుగుణంగా భారత ఆరోగ్యరంగం కొత్త పుంతలు తొక్కుతోందని మైకోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ శ్లాఘించారు. దేశీయంగా ఆరోగ్య, డిజిటల్ రంగాల దినదినాభివృద్ధికి అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారంటూ ప్రధాని మోదీని పొగిడారు. దేశాభివృద్ధిలో ఆరోగ్య, డిజిటల్ రంగాల ముఖ్యపాత్రను గ్రహించి వాటికి సముచిత స్థానం ఇవ్వడం అద్భుతమన్నారు. As India celebrates its 75th Independence Day, I congratulate @narendramodi for prioritizing healthcare and digital transformation while spearheading India’s development. India's progress in these sectors is inspiring and we are fortunate to partner in this journey #AmritMahotsav — Bill Gates (@BillGates) August 15, 2022 ఇదీ చదవండి: భారత్పై మరోమారు పాక్ మాజీ ప్రధాని ప్రశంసలు -
ప్రధాని మోదీకి బిల్గేట్స్ అభినందనలు
సియాటెల్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. భారత్లో 200 కోట్ల వ్యాక్సినేషన్ డోసుల ప్రక్రియ పూర్తైనందునా అభినందించారు బిల్గేట్స్. ఈ మేరకు ఓ వార్త కథనాన్ని ట్యాగ్ చేసి మరీ ట్విటర్లో ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు.. భారత వ్యాక్సిన్ తయారీదారులతో భాగస్వామ్యం కొనసాగింపుపైనా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కోవిడ్-19 ప్రభావాన్ని తగ్గించినందుకు భారత వ్యాక్సిన్ తయారీదారులు, భారత ప్రభుత్వంతో మా నిరంతర భాగస్వామ్యాన్ని గొప్పగా భావిస్తున్నాం అని ట్వీట్ చేశారాయన. ఇక ప్రధాని మోదీ ఆదివారం నాడు భారత్ మరో చరిత్ర సృష్టించిందంటూ వ్యాక్సినేషన్పై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. బూస్టర్ డోసులను సైతం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉచితంగా ప్రజలకు అందిస్తోంది. Congratulations @narendramodi for yet another milestone of administering #200crorevaccinations. We are grateful for our continued partnership with Indian vaccine manufacturers and the Indian government for mitigating the impact of COVID19. https://t.co/YeGUPsveL0 — Bill Gates (@BillGates) July 19, 2022 -
బిల్ గేట్స్ నిర్ణయం.. ప్రపంచ కుబేరుల్లో 4వ స్థానంలోకి గౌతమ్ అదానీ!
గత రెండు సంవత్సరాలుగా భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ దూకుడు మామూలుగా లేదు. అదానీ సంస్థలు కూడా ఎన్నడూ లేని విధంగా లాభాల బాట పడుతూ ఎందులోనూ తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నాయి. తాజాగా ప్రపంచ కుబేరుల్లో గౌతమ్ అదానీ తన స్థానాన్ని ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకున్నారు. అయితే ఈ ఏడాదిలోనే రికార్డు స్థాయిలో ఆయన ఆస్తుల విలువ పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఫోర్స్బ్ ప్రకటించిన సంపన్నుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ను వెనక్కినెట్టి అదానీ నాలుగో స్థానానికి దూసుకెళ్లారు. ఇటీవల బిల్ గేట్స్ 20 బిలియన్ డాలర్లను గేట్స్ ఫౌండేషన్కు విరాళమిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం అనంతరం గేట్స్ ఒక స్థానం కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో అదాని 114 బిలియన్ డాలర్ల సంపదతో నాలుగో స్థానానికి ఎగబాకారు. ప్రపంచవ్యాప్తంగా ధనవంతుల విషయానికొస్తే.. అత్యధిక సంపాదన 230 బిలియన్ డాలర్లతో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో నిలవగా, రెండు, మూడు స్థానాల్లో బెర్నార్డ్ ఆర్నాల్డ్, అమెజాన్ అధినేత జెప్ బెజోస్ లు నిలిచారు. నాలుగో స్థానంలో గౌతమ్ అదాని నిలిచారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మాత్రం పదో స్థానంలో కొనసాగుతున్నారు. చదవండి: Go First Flights: గాల్లో ఉండగానే ఇంజన్ లోపాలు, ఒకేసారి రెండు విమానాల్లో -
ఫౌండేషన్కు లక్షన్నర కోట్ల విరాళం..ప్రకటించిన బిల్ గేట్స్!
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్కు తన ఆస్తిలో సుమారు 20 బిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు, ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందించేందుకు నా వంతు సాయం చేస్తున్నాను. అందుకే నాకు, నాకుటుంబానికి కావాల్సినంత ఖర్చు చేసి మిగిలిన మొత్తం ఫౌండేషన్కు ఇవ్వాలని భావిస్తున్నా. ఇందులో భాగంగా బిల్ గేట్స్ ఫౌండేషన్కు లక్షన్నకోట్లు విరాళం ఇస్తున్నట్లు బిల్ గేట్స్ తన బ్లాగ్లో పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత కుబేరుల స్థానంలో ఉన్న బిల్గేట్స్కు సేవా కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. పెరిగిపోతున్న సంపదను ప్రపంచ జనాభా ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించేందుకు ఖర్చు చేస్తుంటారు. అందుకే మైక్రోసాఫ్ట్ ఫౌండర్ గేట్స్ - మిలిండా ఫౌండేషన్ను ఏర్పాటు చేసి తన సంపాదనలో సింహభాగం అటు తరలించాడు. ఈ ఫౌండేషన్ ద్వారా ప్రపంచ దేశాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా ఆ ఫౌండేషన్కు బిల్గేట్స్ పెద్దమొత్తంలో విరాళం ఇవ్వడంపై ఆయన అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
Bill Gates Resume: రెజ్యూమ్ అంటే అట్లుంటది: బిల్గేట్స్ పోస్ట్ వైరల్
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్కు సంబంధించి ఒక ఆసక్తికర విషయం విశేషంగా ఆకట్టుకుంటోంది. 48 ఏళ్ల పాత రెజ్యూమ్ ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన బిల్ గేట్స్ తన రెజ్యూమ్ను శుక్రవారం సోషల్మీడియా ప్లాట్ఫాంలో షేర్ చేశారు. ‘‘మీలో ఎవరైనా ఇటీవల గ్రాడ్యుయేట్ అయినా లేదా కాలేజీ డ్రాపౌట్ అయినా, మీ రెజ్యూమ్ 48 సంవత్సరాల క్రితం నాటి నా రెజ్యూమ్ కంటే చాలా మెరుగ్గా ఉంటుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను’’ అని ఆయన తన పోస్ట్లో చెప్పారు. 1973 నాటి విలియం హెన్రీ గేట్స్ (బిల్ గేట్స్) రెజ్యూమ్ చూసి మంచి రెజ్యూమ్ కోసం వెబ్సైట్లు కన్సల్టెంట్లను వెతుక్కునే యూత్ అంతా వావ్ అంటోంది. సుమారు 48 ఏళ్ల క్రితం తాను ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే సమయంలో అప్పటి రెజ్యూమ్ను మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్గేట్స్ తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.1973లో బిల్గేట్స్ హార్వర్డ్స్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో ఉన్నారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీనిపై లింక్డిన్ వినియోగదారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక-పేజీ రెజ్యూమ్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు. చాలా బాగుంది. మన జీవితంలో మనం ఎంత సాధించామో చాలాసార్లు మర్చిపోతాం. అందుకే అలాంటి జ్ఞాపకాలం కోసం గత రెజ్యూమ్ల కాపీలను దాచుకోవాలని ఒకరు, అది రెజ్యూమ్లా లేదు ప్రామిసరీ నోట్గా ఉందని మరో యూజర్ వ్యాఖ్యానించడం విశేషం. -
వారెన్ బఫెట్: అపర కుబేరుడి మంచి మనసుకు నిదర్శనమిది!
ప్రపంచ అపర కుబేరుడు వారెన్ బఫెట్ది మంచి మనసు. ఎన్నోసార్లు తన తన సేవా గుణాన్ని చాటుకున్నారు. అయితే.. ఆయన మరణిస్తే తన ఆస్తి ఎవరికి చెందాలో నిర్ణయించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం బఫెట్ నిర్ణయం వ్యాపార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. " మీ దృష్టిలో సక్సెస్ అంటే..వేల కోట్ల ఆస్తి ఉంటే మనం జీవితంలో విజయం సాధించనట్లు కాదు. డబ్బుతో ఏదైనా కొనుచ్చు. కానీ ప్రేమను కొనలేం. అలాంటి ప్రేమ ఎదుటి వారిని నుంచి పొందాలంటే..మనం వాళ్లని ప్రేమించాలి."అంటూ సక్సెస్కి విభిన్నమైన నిర్వచనం చెప్పారు వారెన్ బఫెట్. నిర్వచనం చెప్పడమే కాదు.అందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు. మరణించిన తర్వాత తన ఆస్తిని ప్రపంచవ్యాప్తంగా పిల్లల సేవింగ్స్ బ్యాంకులు తెరిచి.. తద్వారా వాళ్ల అకౌంట్లలో వేసే యోచనలో(అంచనా) ఉన్నట్లు తెలుస్తోంది. బఫెట్ ఆస్తుల వివరాలు! బెర్క్షేర్ హత్వే కంపెనీ సీఈవోగా ఉన్న బఫెట్ 2006లో తన స్టాక్లో 85 శాతం ఛారిటీకి ఇస్తానని హామీ ఇచ్చారు. మాట ప్రకారం..ఎక్కువ భాగం గేట్స్ - మిలిండా ఫౌండేషన్ కు కేటాయించారు. బఫెట్ మొత్తం 90 బిలియన్ డాలర్ల బెర్క్ షైర్ వాటాలో 56 బిలియన్ డాలర్లు గేట్స్ ఫౌండేషన్ కు, 17.4 బిలియన్ డాలర్లు నాలుగు కుటుంబ సభ్యుల ఛారిటీ సంస్థలకు దానం చేయగా.. మిగిలిన 18 బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఏం చేస్తారనేది.. ప్రశ్నార్ధకంగా మారింది. పిల్లల అకౌంట్లకి డబ్బులు ఈ నేపథ్యంలో గేట్స్ ఫౌడేషన్ మాజీ ఉద్యోగి వాల్ స్ట్రీట్ జర్నల్ తో మాట్లాడుతూ..గేట్స్ ఫౌండేషన్ విరాళాలు అందించే దాతలు ఎక్కువ మంది ఉన్నారు. బఫెట్ దానం చేయగా మిగిలిన మొత్తాన్ని ఎవరికి ఇవ్వాలనేది ప్రశ్నార్ధకంగా మారింది. అందుకే బఫెట్ తన ఆస్తుల్ని ఎవరికి ఇవ్వాలో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్తో ఓ ప్రతిపాదన ఉంచినట్లు ఆ సంస్థ మాజీ ఉద్యోగి బహిర్గతం చేశారు. "ఇందులో తాను(వారెన్ బఫెట్) మరణించిన 10ఏళ్ల లోపు తన బిలియన్ డాలర్ల ఆస్తుల్ని ఖర్చు చేయాలి. ప్రత్యేకంగా పిల్లల కోసం వరల్డ్ వైడ్గా బ్యాంకుల్ని ఏర్పాటు చేయడం,అకౌంట్లను ఓపెన్ చేసి అందులో పిల్లల పేర్ల మీద డబ్బులు వేయడం." గేట్స్ ఫౌండేషన్ ఏం చెబుతుందంటే ఆగస్ట్ 30తో 92వ ఏట అడుగుపెట్టనున్న వారెన్ బఫెట్..మరణానంతరం తన సంపదను ఎలా పంపిణీ చేస్తారనే వివరాలను వెల్లడించలేదు. అయినప్పటికీ గేట్స్ ఫౌండేషన్ వరల్డ్ వైడ్గా ప్రతి బిడ్డకు పంపిణీ చేసే మొత్తం బఫెట్ సమకూరిస్తే.. విశ్వంలో ఉన్న పిల్లలందరూ సామాజిక ఆర్థిక సమస్యల్ని అధిగ మించవచ్చు. అదే సమయంలో వారి తల్లిదండ్రులు ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని గేట్స్ ఫౌండేషన్ అభిపప్రాయం వ్యక్తం చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. -
ఆదర్శ భారత్: బిల్గేట్స్ని ఆకట్టుకున్న భారత్
భారతదేశ శక్తి సామర్థ్యాలు, ఆ దేశం సాధించిన ఘనత తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని బిల్ గేట్స్ ఇటీవల అన్నారు. అందుకాయన చూపిన నిదర్శనం కోవిడ్ నియంత్రణలో భారత్ ఆదర్శంగా నిలబడటం. దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న భారత్ అత్యంత క్లిష్టమైన సమయంలో ఆరోగ్య సవాళ్లను అధిగమించి తన సత్తాను చాటింది. 100 కోట్ల డోసుల కోవిడ్–19 టీకాలు వేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ ఇదే అత్యంత వేగంగా సాగిన అతిపెద్ద టీకా కార్యక్రమం. భారత్ సాధించిన ఈ విజయంలోని మౌలిక అంశాలను ఇతర దేశాలు కూడా అనుసరించాలి అని కూడా గేట్స్ అన్నారు. మొదట అంశం: పైనుంచి కింది స్థాయి వరకు రాజకీయ సంకల్పం బలంగా పని చేయడం. రెండో అంశం: భారత్ తనకున్న సుదీర్ఘ అనుభవం, అవగాహన, మౌలిక వసతులను ఉపయోగించుకుని కోవిడ్పై పోరాటానికి ప్రచారం చేయడం. మూడో అంశం: మహమ్మారి కంటే ముందే తన టీకాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు భారత్ నిలబెడుతూ ఉండటం. ముఖ్యంగా మెనైంజైటస్, నిమోనియా, డయేరియా వంటి ప్రాణాంతక వ్యాధులకు వ్యతిరేకంగా టీకాలు అందివ్వడం. నాలుగోది : భారతదేశం తన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డిజిటల్ టెక్నాలజీ సాయంతో విజయవంతంగా మానిటర్ చేయడం. ఈ మౌలికమైన అంశాలన్నిటితో ఇండియా ప్రపంచానికి ఒక ధైర్యాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలో వచ్చే 25 ఏళ్లలో ఇండియా ఆరోగ్య అగ్రరాజ్యంగా మారినా ఆశ్చర్యం లేదన్న భావన కూడా గేట్ మాటల్లో ధ్వనించింది. -
ఆయన చేస్తున్న పనులు చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు - బిల్గేట్స్
వారిద్దరు ప్రపంచ కుబేరులు. ఒకే సమయంలో వ్యాపార సామ్రాజ్యంలో పోటీ పడ్డారు. వారిలో ఒకరు వారెన్ బఫెట్ అయితే, మరొకరు బిల్గేట్స్. సంప్రదాయ వాణిజ్యం, స్టాక్మార్కెట్లో వారెన్ బఫెట్ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటే.. టెక్నాలజీ బాట పట్టి మైక్రోసాఫ్ట్తో ప్రపంచ గమనాన్నే మార్చేశాడు బిల్గేట్స్. వ్యాపారంలో ఇద్దరి దారులు వేరైనా వాటి ద్వారా వచ్చిన సంపద ఖర్చు పెట్టడంలో ఇద్దరూ ఒక్కటే. తమ దగ్గరున్న సంపదను సేవా కార్యక్రమాలను వెచ్చించడంలో వీళ్లద్దరూ ఎప్పుడూ ముందుంటారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ధనవంతుడిగా వెలుగొందుతున్న కాలంలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ గేట్స్ - మిలిండా ఫౌండేషన్ను ఏర్పాటు చేసి తన సంపాదనలో సింహభాగం అటు తరలించాడు. ఈ ఫౌండేషన్ ద్వారా ప్రపంచ దేశాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆహారం, విద్యా, వైద్యం మొదలు వ్యాక్సిన్ల వరకు ఉచితంగా అందిస్తున్నారు. బిల్గేట్స్ ఉద్దేశాలు నచ్చి వారెన్ బఫెట్ సౌతం గేట్స్ - మిలిందా ఫౌండేషన్కి భారీ ఎత్తున విరాళం అందిస్తున్నాడు. తాజాగా గేట్స్ - మిలిందా ఫౌండేషన్కి నాలుగు బిలియన్ డాలర్లు అందించాడు వారెన్ బఫెట్. దీంతో ఇప్పటి వరకు ఈ ఫౌండేషన్కు వారెన్ బఫెట్ అందించిన సాయం ఏకంగా 36 బిలియన్ డాలర్లకు చేరింది. కీర్తి కోసం పాకులాడకుండా తన మిత్రుడు నడిపిస్తున్న స్వచ్చంధ సంస్థకు వారెన్ బఫెట్ భారీగా విరాళం అందిస్తున్నాడు. దీంతో మంచి పనులు చేసేందుకు సేవా కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగేందుకు వారెన్ బఫెట్ అందిస్తున్న సహకారం చూస్తుంటే తన కళ్ల వెంట ఆనంద భాష్పాలు రాలుతున్నాయంటూ గేట్స్ పేర్కొన్నారు. I’m grateful for Warren’s gifts to support the foundation’s work and for our many years of friendship. When he decided in 2006 to make these gifts, it moved me to tears. It still does. https://t.co/JVfF4aUCZv — Bill Gates (@BillGates) June 14, 2022 చదవండి: బిల్గేట్స్ చెబుతున్నాడు.. ఈ సలహా పాటిద్దామా? -
బిల్గేట్స్ చెబుతున్నాడు.. ఈ సలహా పాటిద్దామా?
ప్రపంచ కుబేరుడిగా సుదీర్ఘ కాలం నంబర్ వన్ స్థానంలో కొనసాగాడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కొత్త దిశను చూపడమే కాదు ఐటీతో ప్రపంచ గమనాన్నే మార్చేశాడు గేట్స్. బిజినెస్ వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా పుస్తకాలు చదివే అలవాటు ఆయన మానుకోలేదు. రెగ్యులర్గా రకరకాల పుస్తకాలను ఆయన చదువుతూనే ఉంటారు. అందులో బాగా నచ్చినవి, ఆ పుస్తకాలు చదివితే ప్రయోజనం చేకూరుతుందని నమ్మేవాటిని మనకు సజెస్ట్ చేస్తుంటారు. తాజాగా మరికొన్ని పుస్తకాలను ఆయన మనకు సూచించారు. వాటిని చదవడం ఎంతో మంచిదంటున్నారు. 1) ది పవర్ ది పవర్ పుస్తకాన్ని బ్రిటీష్ రచయిత నయోమీ అల్డర్మ్యాన్ రాశారు. ఈ నవల ఫిక్షన్ విభాగంలో 2017లో రిలీజైన ఈ పుస్తకం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ పుస్తకం చదవాలంటూ గేట్స్కి ఆయన కూతురు సూచించారట. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, పైకి కనిపించని ఇబ్బందుతుల తదితర అంశాలను ఇందులో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. 2) వై వీ ఆర్ పోలరైజ్డ్ అమెరికన్ జర్నలిస్టు రాసిన మరో పుస్తకం వై వీ ఆర్ పోలరైజ్డ్. అమెరికా రాజకీయలు ప్రధాన ఇతివృత్తంగా ఉండే ఈ ఫిక్షన్ నవల సైకాలజీ మీద కూడా ఫోకస్ చేస్తుంది. 3) ది లింకన్ హైవే అమోర్ టవెల్స్ రాసిన ది లింకన్ హైవే పుస్తకం కూడా చదివి తీరాల్సిందే అంటున్నాడు బిల్గేట్స్. గతంలో అమెర్ టవెల్స్ రాసిన ఏ జెంటిల్మెన్ ఇన్ మాస్కోకి కొనసాగింపుగా ఈ పుస్తకం వచ్చింది. మొదటిదాని కంటే రెండోది మరీ బాగుందంటూ కితాబు ఇచ్చారు బిల్గేట్స్. 4) ది మినిస్ట్రీ ఫర్ ది ఫ్యూచర్ కిమ్ స్టాన్లీ రాబిన్సన్ రాసిన సైన్స్ ఫిక్షన్ నవల ది మినిస్ట్రీ ఫర్ ది ఫ్యూచర్. వాతావరణ మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రస్తుతం నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్తు ఎంత దుర్లభంగా ఉంటుందనే అంశాలను లోతుగా చర్చించిన పుస్తకం ఇది. ప్రకృతి పట్ల మన బాధ్యతను ఈ పుస్తకం గుర్తు చేస్తుందంటున్నారు గేట్స్. 5) హౌ ది వరల్డ్ రియల్లీ వర్క్స్ ప్రముఖ రచయిత వాక్లవ్ స్మిల్ కలం నుంచి జాలువారిన మరో మాస్టర్ పీస్ హౌ ది వరల్డ్ రియల్లీ వర్క్స్. జీవితానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాలు మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి. వాటి ఆధారంగానే మన జీవనశైలి ఏలా మారుతుందనే అంశాలను ఇందులో విపులంగా చర్చించారు. చదవండి: బిల్గేట్స్, ఎలాన్ మస్క్ మాటల యుద్ధం -
Sakshi Cartoon: కోవిడ్ టీకాకరణలో ప్రపంచానికి భారత్ ఆదర్శం-బిల్గేట్స్
కోవిడ్ టీకాకరణలో ప్రపంచానికి భారత్ ఆదర్శం-బిల్గేట్స్ -
మాయదారి ట్విటర్..కరిగిపోతున్న మస్క్ సంపద!
బిలయనీర్లు ఈలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్' సంపద కరిగి పోతున్నట్లు తెలుస్తోంది. గడిచిన 5 నెలల కాలంలో ఆ ముగ్గురు ధనవంతులు 115బిలియన్ డాలర్లను నష్టపోయారు. వీరితో పాటు వరల్డ్ రిచెస్ట్ పర్సన్ల జాబితాలో 3వ స్థానంలో ఉన్న జపాన్ లగ్జరీ గూడ్స్ కంపెనీ ఎల్వీఎంహెచ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ సైతం 44.7 బిలియన్ డాలర్లను కోల్పోయారు. బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ నివేదిక ప్రకారం..అత్యధికంగా బెజోస్ 53.2 బిలియన్ డాలర్లు, మస్క్ 46.4 బిలియన్ డాలర్లు, అత్యల్పంగా బిల్ గేట్స్ 15.1 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు. దీంతో గత శుక్రవారం నాటికి మస్క్ సంపద 224 బిలియన్ డాలర్లు, బెజోస్ ఆస్తి 139 డాలర్లు, గేట్స్ ఆస్తి 123 బిలియన్ డాలర్లు, బెర్నార్డ్ ఆర్నాల్ట్ 133 బిలియన్ డాలర్లతో సరిపెట్టుకున్నారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకుల కారణంగా కంపెనీ షేర్లు కుప్పకూలిపోవడంతో భారీ ఎత్తున నష్టపోయారు. ఇది కూడా చదవండి : Elon Musk: నా దారి రహదారి: ఈలాన్ మస్క్ మరో ఘనత కొంపముంచిన ట్విటర్! ముఖ్యంగా మస్క్ సంపద కరిగిపోవడానికి కారణం ఆయన నిర్ణయాలేనని బ్లూం బర్గ్ తన కథనంలో ప్రస్తావించింది. టెస్లాలో మస్క్ వాటా 15.6శాతం ఉండగా మొత్తం సంపద 122 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే స్టాక్ మార్కెట్లో టెస్లా కారు షేర్లు ఈ ఏడాదిలో మొత్తం (గత వారం శుక్రవారం వరకు) 37శాతం నష్టపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ట్విట్టర్ను 9.2శాతం వాటాను కొనుగోలు చేశారు. ఈ కొనుగోళ్లు టెస్లా పట్ల అతని నిబద్ధతను పెట్టుబడిదారులను ప్రశ్నించేలా చేసింది.దీంతో టెస్లా స్టాక్స్ పడిపోయాయి. ఆ తర్వాత మస్క్ సైతం ట్విట్టర్ను 44 బిలియన్లకు టేకోవర్ చేసుకునేందుకు 8.4 బిలియన్ల విలువైన టెస్లా షేర్లను మస్క్ అమ్మాడు. వెరసీ మస్క్ సంపద కరిగిపోవడానికి పరోక్షంగా కారణమైంది. -
బిల్గేట్స్, ఎలాన్ మస్క్ మాటల యుద్ధం
ఇద్దరు ప్రపంచ కుబేరుల మధ్య భేదాభిప్రాయాలు భగ్గుమంటున్నాయి. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ మధ్య మాటల పోరు ముదిరింది. టీ కప్పులో తుఫాన్లా మొదలైన వీరి కొట్లాట వ్యక్తిగత నిందారోపణల వరకు వచ్చింది. పర్యావరణ పరిరక్షణకు కోట్లాది డాలర్లు కుమ్మరిస్తున్న వీరి మధ్య గొడవ చివరకు ఆ ఫండింగ్పై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది... ప్రపంచ కుబేరుల్లో అగ్ర స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్, మాజీ నంబర్వన్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. మస్క్కు చెందిన టెస్లా కంపెనీని దెబ్బతీయడానికి గేట్స్ లక్షలాది డాలర్లు వెచ్చిస్తున్నారన్న వార్తలు వీరి మధ్య విభేదాలకు నాంది పలికాయి. ట్విటర్ కొనుగోలు యత్నాల్లో ఉన్న మస్క్ను అడ్డుకునేందుకు గేట్స్ ఫౌండేషన్ యత్నిస్తోందన్న ఒక వెబ్సైట్ కథనం మస్క్కు మరింత కోపం తెప్పించింది. దీంతో గేట్స్పై, ఆయన ప్రోత్సహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంపై తీవ్ర విమర్శలకు దిగారు. గేట్స్ను అపహాస్యం చేసేలా కామిక్ ఫొటో కూడా ట్వీట్ చేయడంతో వారి మధ్య దూరం మరింత పెరిగింది. మస్క్ ట్విటర్ను కొనుగోలు చేస్తే తప్పుడు సమాచార వ్యాప్తి మరింత పెరుగుతుందంటూ గేట్స్ కూడా పరోక్ష విమర్శలు చేశారు. గతంలో నూ వీరిద్దరూ చిన్న చిన్న విసుర్లు విసురుకున్నా తాజాగా మాటల యుద్ధం బాగా ముదిరింది. విభేదాలు పెంచిన కథనం ట్విటర్ను మస్క్ 4,400 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసే యత్నాల్లో ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ట్విటర్ అడ్వర్టైజర్లకు పలు సంస్థలు బహిరంగ లేఖ రాశాయి. వీటిలో 11 సంస్థలకు గేట్స్ ఫౌండేషన్ నిధులందించిందంటూ బ్రిట్బార్ట్ అనే వెబ్సైట్ తాజాగా కథనం వెలువరించింది. దీనిపై మస్క్ను కొందరు ట్విటర్లో ప్రశ్నించగా అదో ఒక పనికిమాలిన చర్య అంటూ తిట్టిపోశారు. అంతేగాక టెస్లాలో షార్ట్ పొజిషన్లు (షేర్ మార్కెట్లో ఒక కంపెనీ ధర పడిపోతుందనే అంచనాతో తీసుకునే పొజిషన్లు) అధికంగా తీసుకున్నారంటూ గేట్స్ను దుయ్యబట్టారు. గేట్స్ను గర్భిణితో పోలుస్తూ ఎమోజీ షేర్ చేశారు. ‘‘షార్ట్ పొజిషన్లపై గేట్స్ను నిలదీశా. శీతోష్ణస్థితి మార్పులపై మా కంపెనీ ఎంతో పోరాటం చేస్తోంది. అలాంటి కంపెనీలో షార్ట్ పొజిషన్లు తీసుకున్న గేట్స్ దాతృత్వాన్ని, పర్యావరణంపై పోరును నేనైతే సీరియస్గా తీసుకోలేను’’ అంటూ దులిపేశారు. పర్యావరణంపై పోరు పేరిట టెస్లా పెద్దగా చేస్తున్నదేమీ లేదంటూ గేట్స్ గతంలో ఎద్దేవా చేశారు. కొన్ని ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసినంత మాత్రాన పర్యావరణ మార్పును అడ్డుకున్నట్టు కాదన్నారు. ట్విటర్పై రగడ ట్విటర్ను మస్క్ కొనుగోలు చేయడంపై గేట్స్ గతంలోనూ నెగెటివ్గా స్పందించారు. మస్క్ నేతృత్వంలో ట్విటర్లో అసత్య సమాచారం మరింత పెరగొచ్చంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘పారదర్శకత కూడా లోపిస్తుంది. నేను ప్రోత్సహించే టీకాలు మనుషుల ప్రాణాలు తీస్తాయని, వాళ్లను నేను ట్రాక్ చేస్తున్నానని వ్యాఖ్యలు చేసే మస్క్ ఆధ్వర్యంలో ట్విటర్లో ఎలాంటి వార్తలు వ్యాపిస్తాయో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. అప్పట్నుంచీ గేట్స్పై మస్క్ గుర్రుగా ఉన్నారు. తాజా కథనం నేపథ్యంలో తన కసినంతా విమర్శల రూపంలో వెళ్లగక్కారు. అయితే మస్క్ ట్వీట్లను పట్టించుకోనని గేట్స్ సమాధానమిచ్చారు. గతంలో మస్క్ బిట్కాయిన్లో వాటా కొన్నప్పుడూ గేట్స్ పరోక్ష విమర్శలు చేశారు. అయితే వీరి మధ్య విభేదాలు ఇంతలా ఎందుకు పెరిగాయన్నది అంతుబట్టని విషయం. ఈ కొట్లాట మరింత ముదిరితే దాని ప్రభావం వారు పర్యావరణ పరిరక్షణకు ఇచ్చే నిధులపై పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
కోవిడ్ బారిన పడిన బిల్గేట్స్
మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్ కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనిపించడంలో వెంటనే టెస్ట్ చేయించుకున్నట్టు.. అందులో కోవిడ్ 19 పాజిటివ్గా తేలినట్టు ఆయన వెల్లడించారు. వైద్యులు అందించిన సూచనటు పాటిస్తూ ఐసోలేషన్లోకి వెళ్తున్నట్టు చెప్పారు. తిరిగి ఆరోగ్యవంతుడైన తర్వాత ఐసోలేసన్ వీడుతానని బిల్గేట్స్ ట్వీట్ చేశారు. I've tested positive for COVID. I'm experiencing mild symptoms and am following the experts' advice by isolating until I'm healthy again. — Bill Gates (@BillGates) May 10, 2022 అయితే ఇప్పటికే కోవిడ్ వ్యాక్సినేషన్ , బూస్టర్ డోసు వేసుకున్నందున వల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బిల్గేట్స్ పేర్కొన్నారు. కోవిడ్ ప్రపంచాన్ని ముంచెత్తడానికి ముందే ఓ మహమ్మారి మానవాళిపై దాడి చేసే అవకాశం ఉందని బిల్గేట్స్ ముందుగానే ప్రపంచ దేశాలకు సూచనలు చేశారు. చదవండి: ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వార్నింగ్! -
ట్విటర్ను హ్యాండిల్ చేయడం టెస్లా అంత ఈజీ కాదు - బిల్గేట్స్
నాటకీయ పరిణామాల మధ్య ట్విటర్ను సొంతం చేసుకుని అందరి చేత ఔరా అనిపించాడు ఈలాన్ మస్క్, ఈ నిర్ణయాన్ని ముందుగా వ్యతిరేకించిన ఎందరో తర్వాత ఈలాన్కు మద్దతుదారులగా మారారు. అయితే మైక్రోసాఫ్ట్ అధినేత బిలేగేట్స్ మాత్రం ఈ టేకోవర్పై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో జరిగిన వాల్స్ట్రీట్ జర్నల్ ఈవెంట్ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూజర్లకు ఫ్రీ స్పీచ్ అందివ్వాలనే ఉద్దేశంతో ట్విటర్ను ఈలాన్ మస్క్ టేకోవర్ చేసినట్టు చెబుతున్నారు. కానీ ఫ్రీ స్పీచ్ ముసుగులో వచ్చే ద్వేషపూరిత వ్యాఖ్యలు, తప్పుడు సమాచారాన్ని ఎలా అరికడతారంటూ ప్రశ్నించారు. ఫ్రీ స్పీచ్కి అవకాశం ఇస్తూనే దీన్ని ఆపే విధానం ఎలా ఉంటుందో చూడాలన్నారు బిల్గేట్స్. ఈలాన్ మస్క్ దగ్గర మంచి ఇంజనీర్లు, టెక్నిషియన్లు ఉండవచ్చు. కానీ టెస్లా, స్పేస్ఎక్స్లను నిర్వహించినంత సుళువు కాదు ట్విటర్ను హ్యాండిల్ చేయడం అంటూ తన అభిప్రాయం చెప్పారు బిల్గేట్స్. ఇప్పటికయితే ట్విటర్ గాడి తప్పుతుందని నేను అనేకోవడం లేదని, అయితే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కచ్చితంగా తన అభిప్రాయాలు చెబుతానని ఆయన వెల్లడించారు. చదవండి: మస్క్ ట్విటర్ కొనుగోలు: సౌదీ యువరాజు ట్యూన్ ఇలా మారిందేంటబ్బా! -
విడాకుల కన్నా అదే ఎక్కువ బాధించింది: బిల్గేట్స్
ప్రతీ వివాహ బంధం.. ఒక దశ దాటిన తర్వాత మార్పునకు లోనవుతుంది. పిల్లలు పెరిగి పెద్దవ్వడం, పెళ్లి చేసుకుని లేదంటే ఉద్యోగాల కోసమే ఇల్లు విడిచిపెట్టాల్సి వస్తుంది. కానీ, నా వరకు వచ్చేసరికి ఆ మార్పు విడాకుల రూపంలో ఎదురైంది అని అంటున్నారు టెక్ దిగ్గజం బిల్గేట్స్. సండే టైమ్స్తో తొలిసారి తన విడాకులు.. ఇతర పరిణామాలపై స్పందించాడు బిల్గేట్స్. అయితే విడాకులు తీసుకోవడం కన్నా.. పిల్లలకు దూరంగా ఉండడం తనను ఎంతో బాధించిందని గేట్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక మిలిందా ఫ్రెంచ్తో వివాహం, విడాకులు.. ఇప్పుడు ఆమెతో కలిసి ఫౌండేషన్ కోసం కలిసి పని చేయడంపై ఆయనకు ప్రశ్నలు ఎదురు అయ్యాయి ఈ ఇంటర్వ్యూలో. అవసరమైతే తాను మళ్లీ మెలిండాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే అన్న సంకేతాలు ఇచ్చారు ఆయన. మిలిందాతో వైవాహిక బంధం అద్భుతంగా సాగింది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే నాకు ప్రస్తుతం ఎటువంటి ప్రణాళికలు లేవు. కానీ కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని సూచిస్తున్నట్లు బిల్ గేట్స్ చెప్పారు. ఒకవేళ మిలిందాను మళ్లీ పెళ్లి చేసుకోవాల్సి వస్తే.. ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ అవకాశం వదులుకోను అంటూ వ్యాఖ్యానించారాయన. గడిచిన రెండేళ్లు చాలా నాటకీయంగా సాగినట్లు బిల్ గేట్స్ తెలిపారు. విడాకులు, కరోనా కన్నా.. పిల్లలు తనను వదిలి వెళ్లడం బాధ కలిగించినట్లు చెప్పారు. ప్రస్తుతం మిలిందాతో కలిసి వర్కింగ్ రిలేషన్షిప్లో ఉన్నానని, ఫౌండేషన్ కోసం పనిచేస్తున్న ఇద్దరూ మీటింగ్ సమయంలో మంచి స్నేహితులుగా మాట్లాడుకుంటున్నామని, అది అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడాయన. ఇంతగా ప్రేమించినప్పుడు.. వివాహ బంధం ఎందుకు ముగిసిందని ప్రశ్న ఎదురుకాగా.. పెళ్లిళ్లు క్లిష్టమైనవి. వాటి గురించి లోతుగా చర్చించడం సరికాదు. మా వివాహ బంధం ఎందుకు విఫలమైందని విషయం ఇప్పుడు అప్రస్తుతం అని దాటవేత ధోరణి ప్రదర్శించాడు. 2021 మే నెలలో బిల్, మిలిందా విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. 2021 ఆగస్టులో వారికి విడాకులు కన్ఫర్మ్ అయ్యింది. బిల్ గేట్స్, మిలిందా జంటకు జెన్నిఫర్, రోరీ, ఫోబో అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. చదవండి: బిల్గేట్స్ పై మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు!! -
Elon Musk: బిల్గేట్స్పై ఎలన్ మస్క్ అసభ్య ట్వీట్
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్కు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అలాంటిది మస్క్ తాజాగా ఓ దిగజారుడు చర్యకు పాల్పడ్డాడు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ను అవమానపరిచేలా శనివారం ఓ దారుణమైన ఫొటోను ట్విటర్లో షేర్ చేశాడు. ఐఫోన్లో ఆమధ్య ప్రెగ్నెంట్ మెన్(అఫీషియల్ ప్రకటన చేయకపోయినా అదే నిజం!) ఎమోజీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఒకవైపు బిల్గేట్స్, మరోవైపు ఆ ఎమోజీ ఫొటోను ఉంచి ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఒకవేళ మీరు త్వరగా బో**ను కోల్పోవాల్సి వస్తే.. అంటూ ఓ చిల్లర కామెంట్ను క్యాప్షన్గా ఉంచాడు. దానికి అసభ్యమైన అర్థం వస్తుంది. అందుకే మస్క్ను అతని ఫాలోవర్స్ తిట్టిపోస్తున్నారు. ఇందులో పలువురు ప్రముఖులు సైతం ఉండడం విశేషం. ఏ మత్తులో ఈ కామెంట్ చేశాడో, దాని వెనకాల కారణం ఏంటో తెలియదుగానీ.. ఈ ట్వీట్ ట్విటర్లో పెనుదుమారాన్నే రేపుతోంది ఇప్పుడు!. in case u need to lose a boner fast pic.twitter.com/fcHiaXKCJi — Elon Musk (@elonmusk) April 23, 2022 చదవండి👉🏼: నెట్ఫ్లిక్స్పై మస్క్ కామెంట్లు ఎందుకంటే.. -
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్తో మంత్రి కేటీఆర్ ఆసక్తికర చర్చ
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మానవాళి స్పందించిన తీరు ఆశించినంతగా లేదని మైక్రోసాఫ్ట్ అధినేత, గిఫ్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు బిల్గేట్స్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ మహమ్మారి మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందని చెప్పారు. హైదరాబాద్లో గురువారం వర్చువల్ పద్ధతిలో మొదలైన 19వ బయో ఆసియా సదస్సులో బిల్గేట్స్, తెలంగాణ ఐటీ మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రెండేళ్ల కరోనా మహమ్మారి మనిషికి నేర్పించిన పాఠాలు ఏవని ప్రశ్నించగా గేట్స్ స్పందిస్తూ వ్యాక్సిన్లను అత్యంత వేగంగా తయారు చేయగలగడం మ నిషి సాధించిన ఘనత అని వ్యాఖ్యానించారు. అ లాగే ఆక్సిజన్ కొరత విసిరిన సవాళ్లనూ సమర్థంగా ఎదుర్కోగలిగామన్నారు. అంతర్జాతీయ సహకారంతో భారత్ టీకాలను వేగంగా తయారు చేసింద ని, ప్రజలందరికీ ఈ టీకాలను అందించే విషయంలో ధనిక దేశాలకంటే మెరుగ్గా వ్యవహరించిం దని కొనియాడారు. టీకాల సమర్థ పంపిణీతో ఎ న్నో విలువైన ప్రాణాలను కాపాడగలిగిందన్నారు. సిద్ధంగా ఉండాలి.... భవిష్యత్తులోనూ కరోనా లాంటి మహమ్మారులు వస్తే వాటిని ఎదుర్కొనేందుకు మానవాళి సంసిద్ధంగా ఉండాలని గేట్స్ ఆకాంక్షించారు. మెరుగైన వ్యాక్సిన్లు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సకు అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో రాగల మహమ్మారి గురించి గేట్స్ 2015లోనే అంచనా వేయడాన్ని కేటీఆర్ ప్రస్తావించగా ఆయన స్పందిస్తూ భవిష్యత్తులో వచ్చే మహమ్మారులు కరోనా మాదిరిగా ఏళ్లపాటు ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తు మహమ్మారిని ఎదుర్కొనేందుకు పరిశోధనలపై అన్ని దేశాలు దృష్టి పెట్టాలని కోరారు. జీవశాస్త్రంలో మనిషి ఊహించని స్థాయిలో ఆవిష్కరణలు జరగనున్నాయని, అవి భవిష్యత్ సవాళ్లకు మనల్ని సిద్ధం చేస్తాయని అన్నారు. ఎంఆర్ఎన్ఏదే భవిష్యత్తు... హెచ్ఐవీ మొదలు అనేక ఇతర వ్యాధులకు చికిత్స అందించే సామర్థ్యంగల ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీదే భవిష్యత్తు అని బిల్గేట్స్ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి సమయంలో అందుబాటులోకి వచ్చిన ఈ ఎంఆర్ఎన్ఏ సాం కేతికత అందర్నీ ఆశ్చర్యపరిచిందన్నారు. ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు గేట్స్ ఫౌండేషన్ ప్రయత్నాలు ము మ్మరం చేసిందని చెప్పారు. సృజనాత్మక ఆలోచనలతో చవకైన మందులను తయారు చేయగల సామర్థ్యం ఉన్న భారతీయ కంపెనీలతోనూ ఫౌండేషన్ భాగస్వామ్యం ఏర్పాటు చేసు కున్నట్లు ఆయన తెలిపారు. హెచ్ఐవీతోపాటు అనేక వ్యాధులకు రానున్న 10–15 ఏళ్లలో ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ద్వారా చికిత్స అందించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమీప భవిష్యత్తులో సెన్సార్లు కృత్రిమ మేధ సా యంతో పనిచేసే పరికరాలు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తేనున్నాయన్నారు. హైదరాబాద్కు ఎప్పుడు వస్తారన్న కేటీఆర్ ప్రశ్నకు కరోనా ఆంక్షలను పూర్తిగా ఎత్తేశాక ఆసియాలో పర్యటించే అంశాన్ని పరిశీలిస్తానని చెప్పారు. -
కరోనా తర్వాత ప్రపంచానికి మరో ముప్పు తప్పదు: బిల్గేట్స్
టెక్ మేధావిగా, వ్యాపార దిగ్గజంగానే కాదు.. ప్రపంచ సమకాలీన అంశాలపై అంచనా వేయగలిగే మేధావిగా బిల్గేట్స్కి పేరుంది. కరోనా విషయంలో మొదటి నుంచి ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తున్నారు. తాజాగా బిలియనీర్ బిల్గేట్స్ కోవిడ్-19 తీవ్రత కొద్దిగా తగ్గినట్లు పేర్కొన్నారు. కానీ, భవిష్యత్ కాలంలో మరో మహమ్మారి వచ్చే అవకాశం ఉన్నట్లు బిల్గేట్స్ పేర్కొన్నారని సీఎన్బిసీ నివేదించింది. ప్రపంచ జనాభాలో అధిక భాగం కరోనా వైరస్ నుంచి ఒక స్థాయి రక్షణను సాధించారని బిల్గేట్స్ మీడియాతో చెప్పారు. ఓమిక్రాన్ వేరియంట్ వల్ల సంక్రామ్యత తీవ్రత తగ్గిందని ఆయన తెలిపారు. అయితే, ఆయన ఇలా హెచ్చరి౦చాడు: "మన మీద మరో మహమ్మారి దాడి చేసే అవకాశం ఉ౦ది. ఇది మరో కొత్త రకం వ్యాధి అవుతుంది" అని అన్నారు. వైద్య సాంకేతిక పరిజ్ఞానంలో ఇప్పుడు పెట్టుబడులు పెడితే, భవిష్యత్తులో మహమ్మారిపై పోరాడటానికి ప్రపంచం మెరుగైన స్థితిలో ఉంటుందని గేట్స్ చెప్పారు. "తదుపరి మహమ్మారికి సిద్ధంగా ఉండటానికి అయ్యే ఖర్చు అంత పెద్దది కాదు" అని గేట్స్ సీఎన్బిసీకి అని అన్నారు. (చదవండి: ఐపీఎల్ కోసం అమెజాన్, రిలయన్స్ మధ్య యుద్ధం..!) -
బిల్గేట్స్తో ఫొటో.. బిల్డప్కు పోయి నవ్వులపాలయ్యాడు
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కయ్యారు. బిల్డప్ కొట్టేందుకు బిల్గేట్స్తో ఉన్న ఓ ఫొటోను షేర్ చేయగా.. అందులోని ఓ పాయింట్తో పాక్ ప్రధానిని ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన బిల్గేట్స్.. తాజాగా పాక్లో పర్యటించారు(ఆయన పాక్లో పర్యటించడం ఇదే ఫస్ట్ టైం). ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ తన కేబినెట్లోని మంత్రులు, కీలక విభాగాధిపతులతో కలిసి బిల్గేట్స్తో లంచ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఓ ఫొటోను పాక్ పీఎంవో ట్విటర్లో పోస్ట్ చేసింది. అయితే అందులో అంతా ఓ వ్యక్తి వైపు తిరగ్గా.. అక్కడ ఎవరూ లేకపోవడం ఫొటోకి హైలెట్ అయ్యింది. పాక్ న్యూస్ ఏజెన్సీ ది కరెంట్ కథనం ప్రకారం.. అక్కడ ఉంది ఐఎస్ఐ(Inter-Services Intelligence) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్. అతన్ని ఫొటోగానీ, వీడియోలు తీయడానికి ఇంటెలిజెన్స్ సర్వీస్ అంగీకరించదు. ఒక్కపక్క నదీమ్ ఐడెంటిటీని రివీల్ చేయడం ఇష్టం లేని పాక్ ప్రభుత్వం.. మరోపక్క బిల్గేట్స్తో ఉన్న ఫొటోను ఎలాగైనా షేర్ చేయాలని ఉవ్విళ్లూరింది. తద్వారా పాక్ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు చర్చలు జరుపుతున్నట్లు ప్రతిపక్షాలకు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఫొటో షాప్లో ఐఎస్ఐ చీఫ్ ఫొటోను ఎగరకొట్టేయడం, అందరూ నదీమ్ వైపే చూస్తుండడంతో.. ఈ ఫొటో వంకతో ఇమ్రాన్ ఇజ్జత్ తీసేస్తున్నారు పాక్ నెటిజన్లు. Prime Minister @ImranKhanPTI's luncheon in honor of @BillGates Mr. Bill Gates is visiting Pakistan at the special invitation of the Prime Minister. pic.twitter.com/zSYNI6ddki — Prime Minister's Office, Pakistan (@PakPMO) February 17, 2022 గత అక్టోబర్లో నదీమ్.. ఐఎస్ఐ చీఫ్గా బాధ్యతలు చేపట్టాడు. ఆ సమయంలో ఆర్మీ మీడియా వింగ్ మొదట నదీమ్ పేరును ప్రకటించింది. ఆ తర్వాతే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఖాన్ పాలనలో మిలిటరీ జోక్యం ఎక్కువైందని, ఫారిన్-మిలిటరీ పాలసీలను సైతం ప్రభావితం చేస్తున్నాయనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. చదవండి: ఇమ్రాన్ఖాన్ ది ఇంటర్నేషనల్ బెగ్గర్ -
బయో ఆసియా సదస్సుకు బిల్గేట్స్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 24న ప్రారంభం కానున్న రెండ్రోజుల బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ వార్షిక సదస్సు ‘బయో ఆసియా’లో బిల్ మెలిండా గేట్స్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్, జాన్సన్ అండ్ జాన్సన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అలెక్స్ గోర్సీ్క, మెడ్ ట్రానిక్స్ సీఈవో జెఫ్ మార్తా పాల్గొననున్నారు. 24, 25 తేదీల్లో వర్చువల్ విధానంలో ఈ సదస్సు జరగనుంది. బిల్ గేట్స్, అలెక్స్ గోర్సీ్క, జెఫ్మార్తా.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నడుమ సాగే ఇష్టాగోష్టిలో కోవిడ్ మహమ్మారి వల్ల రెండేళ్లుగా నేర్చుకున్న పాఠాలు, ఆధునిక ఆరోగ్య రక్షణ విధానాలు, విశ్వవ్యాప్తంగా ఆరోగ్య రక్షణ రంగం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. మహమ్మారులను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానాలు, అందిపుచ్చుకోవాల్సిన సామర్థ్యాలు, ప్రభుత్వం, పరిశ్రమలు పోషించాల్సిన పాత్రపై మాట్లాడతారు. కోవిడ్ ప్రభావం, సప్లై చైన్లో అంతరాయం, ఆవిష్కరణల వాతావరణం, స్టార్టప్లు, ఆరోగ్య రక్షణ రంగంలో ఏఐ, ఎమ్ఎల్, డీప్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికత పాత్రపై జాన్సన్ అండ్ జాన్సన్ సీఈవో అలెక్స్ గోర్సీ్క కీలక ప్రసంగం చేయనున్నారు. మెడ్ టెక్ రంగంలో వస్తున్న కొత్త మార్పులు, మెడ్ టెక్ రంగం అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా అనుసరించాల్సిన విధానాలపై మెడ్ ట్రానిక్స్ సీఈఓ జెఫ్మార్తా ప్రసంగిస్తారు. 72 దేశాల నుంచి 31 వేల మంది.. ‘ఆరోగ్య రక్షణ రంగంపై దృష్టిని కేంద్రీకరిస్తూ ప్రతీసారి జరిగే బయో ఏషియా సదస్సు సంబం ధిత రంగాలకు చెందిన వారిని ఒకే గొడుగు కిందకు తీసుకొస్తోంది. 2022 సదస్సు కూడా ఈ పరంపరను కొనసాగిస్తోంది. బిల్గేట్స్, గోర్సీ్క, మార్తా వంటి దూరదృష్టి కలిగిన వారు సదస్సులో పాల్గొనడం లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు మేలు చేస్తుంది ’ మంత్రి కేటీ రామారావు ఒక ప్రకటనలో వెల్లడించారు. 72 దేశాలకు చెందిన 31 వేల మంది ప్రతినిధులు వర్చువల్ విధానంలో ఈ సదస్సులో పాల్గొంటున్నారని బయో ఏషియా సీఈవో శక్తి నాగప్పన్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు. ఈ అంతర్జాతీయ వేదిక భారతీయ బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాలు విశ్వవ్యాప్తంగా పేరు సంపాదించేందుకు దోహదం చేస్తుందని అన్నారు. -
బిల్గేట్స్పై ‘రాసలీలల’ ఆరోపణలు.. కీలక నిర్ణయం!
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో బిల్గేట్స్పై లైంగిక-రాసలీలల ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణల మీద మైక్రోసాఫ్ట్ బోర్డు దర్యాప్తు అర్ధాంతరంగా ముగిసింది కూడా!. ఈ తరుణంలో కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని ప్రముఖ న్యాయ విచారణ సంస్థ ‘అరెంట్ ఫాక్స్ ఎల్ఎల్పీ’ని మైక్రోసాఫ్ట్ నియమించుకుంది. ఈ సంస్థ బిల్గేట్స్ వచ్చిన ఆరోపణలపై బోర్డు తయారు చేసిన నివేదికను సమీక్షిస్తుంది. ఆ తర్వాతే బోర్డు రూపొందించిన నివేదికను బహిర్గతం చేస్తుంది. అంటే.. బిల్గేట్స్ లైంగిక వేధింపుల విషయంలో బోర్డు దర్యాప్తు ఏం తేల్చిందన్న విషయం వేసవి దాకా బయటికి రాదన్నమాట!. ఒక్క బిల్గేట్స్ విషయంలోనే మాత్రమే కాదు.. 2019 తర్వాత మైక్రోసాఫ్ట్లో పని చేసే పలువురు ప్రముఖుల మీద పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే లైంగిక వేధింపులు, లింగ వివక్ష, ఇతర సమస్యలపై కంపెనీ విధానాల్ని సమీక్షించాలని షేర్ హోల్డర్స్.. బోర్డును కోరారు. అందుకే అరెంట్ ఫాక్స్ను నియమించుకుంది మైక్రోసాఫ్ట్ కంపెనీ. ప్రముఖులపై వచ్చిన ఆరోపణలు నిజమా? కాదా? అనే విషయంతో పాటు కంపెనీలో భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఎదురైతే ఎలా డీల్ చేయబోతుందన్న విషయంపై కంపెనీ ఒక పద్ధతిని ఫాలో అవ్వాలని చూస్తోంది. అందుకే న్యాయ విచారణ సంస్థ అభిప్రాయాల్ని సేకరిస్తోంది. పనిలో పనిగా ఉద్యోగుల ఆందోళనలను, పరిష్కారాలపైనా అరెంట్ దృష్టి పెట్టనుంది. ఇదిలా ఉంటే మైక్రోసాఫ్ట్ చైర్మన్ పదవి నుంచి 2020 మార్చి నెలలో ఆయన దిగిపోయాడు. తన నిష్క్రమణకు కారణం ‘ఫౌండేషన్’ మీద ఫోకస్ చేయడమే అని ఆయన ప్రకటించుకున్నప్పటికీ.. అసలు విషయం కాదని వేధింపుల పర్వమే కారణమని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2007 సమయంలో సమయంలో ఉద్యోగులపై ఆయన ఈ-మెయిల్స్ ద్వారా వేధింపులకు పాల్పడ్డాడని, ఉమెనైజర్ అని, ఉద్యోగులతో ఆయన ప్రవర్తనాశైలి బాగుండేదని కాదని ఆరోపణలు రాగా.. ఈమేరకు బోర్డు ఆయన్ని పిలిచి మందలించినట్లు మీడియాలోనూ కథనాలు వచ్చాయి. ఈ కథనాల తర్వాత మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగులు కొందరు, బిల్గేట్స్ సన్నిహితులు సైతం ఆయనపై లైంగిక ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు రావడం కొసమెరుపు. చదవండి: ‘బిల్గేట్స్ పచ్చి తాగుబోతు, యువతులతో నగ్నంగా స్విమ్మింగ్పూల్లో..’ సంబంధిత కథనాలు: గేట్స్ వెకిలి మెయిల్స్.. వద్దని వారించిన మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్స్! -
ఒమిక్రాన్తో కరోనా విశ్వరూపం!
న్యూయార్క్: కరోనాతో తీవ్ర అనారోగ్యం పాలుపడకుండా ఉండేందుకు తక్షణమే ప్రజలంతా కోవిడ్ టీకాలు తీసుకోవాలని ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్గేట్స్ విజ్ఞప్తి చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులతో కరోనా సంక్షోభం అత్యంత తీవ్రదశకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని, టీకా తీసుకున్నవారిలో కూడా ఇన్ఫెక్షన్ కలిగిస్తోందని ఇప్పటికే డబ్లు్యహెచ్ఓ ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో హాలీడే సీజన్లోకి అడుగుపెట్టడం ఆందోళన కలిగిస్తోందని గేట్స్ చెప్పారు. అయితే ఈ పరిస్థితి ఎంతో కాలం ఉండకపోవచ్చని, భవిష్యత్లో ఒక రోజు ఈ మహమ్మారికి అంతం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటివరకు ఒకరికొకరు అండగా ఉండాలన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయని భావిం చే సమయంలో కరోనా విజృంభణ మళ్లీ మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒమిక్రాన్ అందరికీ సోకుతోందని, తన స్నేహితుడు దీని బారిన పడడంతో తాను హాలీడే ప్రణాళికలను రద్దు చేసుకున్నానని తెలిపారు. వీలైతే బూస్టర్ డోసు తీసుకోవడం ద్వారా మరింత రక్షణ పొందవచ్చని గేట్స్ అభిప్రాయపడ్డారు. ఒమిక్రాన్ మనపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో ఇంకా తెలియదని, ఈ విషయాల్లో స్పష్టత వచ్చేవరకు అంతా దీన్ని సీరియస్గానే తీసుకోవాలని సూచించారు. డెల్టాలో కనీసం సగం తీవ్రత దీనికున్నా దీని వేగంతో అత్యంత భీభత్సం సృష్టించగలదని హెచ్చరించారు. మూడునెలల్లో వేవ్ పూర్తి ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని, ఇది ఒక దేశంలో అడుగుపెట్టి డామినెంట్ వేరియంట్గా మారిన తర్వాత వచ్చే వేవ్ 3నెలల్లోపే ముగియడం శుభపరిణామమని గేట్స్ చెప్పారు. అయితే వేవ్ కొనసాగిన కాలం మాత్రం సమస్యలు తప్పవన్నారు. సరైన చర్యలు తీసుకుంటే 2022కు తప్పక కరోనాకు చరమగీతం పాడొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఒమిక్రాన్ విజృంభణ.. బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
Bill Gates Warns World on Omicron surge: టెక్ మేధావిగా, వ్యాపార దిగ్గజంగానే కాదు.. ప్రపంచ సమకాలీన అంశాలపై అంచనా వేయగలిగే మేధావిగా బిల్గేట్స్కి పేరుంది. కరోనా విషయంలో మొదటి నుంచి ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే డెల్టాఫ్లస్ లాంటి ప్రమాదకరమైన వేరియెంట్ విజృంభణ సమయంలో.. వ్యాక్సినేషన్ రేటు పెరుగుతుండడం, పాజిటివిటీ రేటు పడిపోతుడడంపై బిల్గేట్స్ ఓ అంచనాకి వచ్చారు. కరోనా అంతమయ్యే సమయం ఎంతో దూరం లేదంటూ తాజాగా వ్యాఖ్యలు చేశారు. కానీ, ఒమిక్రాన్ బిల్గేట్స్ అంచనాల్ని తలకిందులు చేసింది ఇప్పుడు. దీంతో తన తాజా ప్రకటనపై యూటర్న్ తీసుకున్నారాయన. ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో ప్రపంచం చాలా దారుణమైన దశకు చేరుకుందని, రానున్న రోజులు మరింత కీలకమని పేర్కొన్నారు. అంతేకాదు వచ్చే ఏడాదిలో అన్ని దేశాలు అన్ని రంగాల్లో సంక్షోభాల్ని ఎదుర్కొక తప్పదని అంచనా వేశారు. ఈ మేరకు తన ట్విటర్లో వరుస ట్వీట్లు పోస్ట్ చేశారాయన. ‘‘సెలవుల్ని బంధువులతో కలిసి ఆస్వాదిద్దాం అనుకున్నా. కానీ, నా సన్నిహితులు సైతం ఒమిక్రాన్ బారినపడ్డారు. దీంతో మొత్తం కార్యక్రమాల్ని రద్దు చేసుకున్నా. చరిత్రలో ఏ వైరస్ ఒమిక్రాన్ వేరియెంట్ కన్నా వేగంగా విస్తరించలేదు. అతిత్వరలో అన్ని దేశాల్లో ఒమిక్రాన్ విస్తరించడం ఖాయం. రాబోయే మూడు నెలలు ప్రపంచం గడ్డుకాలం ఎదుర్కొబోతోంది. కొన్నినెలలపాటు ఆ ప్రభావం కొనసాగుతుంది. There will be more breakthrough cases in people who are vx’d, which sounds concerning but is purely a factor of how many people are vx’d and how fast this variant is spreading. Vaccines are designed to prevent people from getting seriously ill or dying & are doing that well. — Bill Gates (@BillGates) December 21, 2021 సంక్షోభాలు తప్పకపోవచ్చు!. డెల్టాలో సగం తీవ్రతకు చేరుకున్నా.. ఒమిక్రాన్ తీవ్రత తారాస్థాయికి చేరుకుంటుంది. పరిస్థితులు దిగజారిపోతాయి. కానీ, ఒక్కటి మాత్రం కరాకండిగా చెప్పగలను. సరైన జాగ్రత్తలు పాటిస్తూ.. సరైన నిర్ణయాలు తీసుకుంటే 2022లోనే కరోనాను జయించొచ్చు. వీలైనంత త్వరలో మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు బిల్గేట్స్. Omicron is spreading faster than any virus in history. It will soon be in every country in the world. — Bill Gates (@BillGates) December 21, 2021 ఆ కామెంట్పై విమర్శ కరోనా ప్యాండెమిక్లో దారుణమైన దశకు చేరుకున్నామన్న బిల్గేట్స్.. మరో ట్వీట్తో విమర్శలపాలయ్యారు. బూస్టర్ షాట్స్ తీసుకోవాలంటూ ఆయన ఇచ్చిన సలహాను చాలామంది తప్పుబడుతున్నారు. సంబంధిత వార్త: కరోనా అంతమయ్యేది అప్పుడే: బిల్ గేట్స్ చదవండి: బిల్గేట్స్, బెజోస్ తర్వాత ఎవరంటే.. -
కరోనా అంతమయ్యేది అప్పుడే: బిల్ గేట్స్
Bill Gates Predicted Covid Pandemic: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి పీడ నుంచి ఎప్పుడు ఉపశమనం లభిస్తుందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అంచనా వేశారు. ప్రస్తుత పరిస్థితులు, కోవిడ్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వాక్సిన్ల వాడకం దృష్ట్యా మహమ్మారి తీవ్రమైన దశ 2022లో ముగుస్తుందని ఈ విషయాన్ని తన బ్లాగులో చెప్పారు. కరోనా కొత్త వేరియంట్లతో వ్యాప్తి చెందడం, ప్రజలకు పూర్తిగా టీకాలు వేయడం అంత త్వరగా జరిగే పని కాదు గనుక మహమ్మారి ముగింపు తాను ఆశించినంత దగ్గరగా లేదని బిలియనీర్ చెప్పాడు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి ఆందోళన తప్పదని అందులో ఎటువంటి సందేహం లేదని ఆయన అన్నారు. కొత్త వేరియంట్లను ప్రభావాన్ని వేగంగా గుర్తించడం, వ్యాక్సిన్లు, యాంటీవైరల్ డ్రగ్స్లో అభివృద్ధితో కలిపి, 2022లో కోవిడ్ తీవ్రత నుంచి బయటపడే అవకాశాలు ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రతి సీజన్లో కోవిడ్, ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాల్సి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ప్రమాదకరమైన వేరియంట్లను ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని, మహమ్మారి అంతమయ్యేవరకు పోరాటం ఆపకూడదని సూచించారు. చదవండి: ఆ గ్రామంలో వింత సంప్రదాయం.. మా ఊరికి రావొద్దు.. -
ఆ విడాకుల విలువ అక్షరాల యాభై వేల కోట్లు!
Russian Billionaire Vladimir Costly Divorce Case News: రష్యన్ బిలియనీర్ వ్లాదిమిర్ పొటానిన్ అత్యంత ఖరీదైన విడాకులతో వార్తల్లోకెక్కాడు. ఏకంగా ఏడు బిలియన్ డాలర్ల విలువైన(మన కరెన్సీలో అక్షరాల యాభై వేల కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది) విడాకుల భరణం కోరుతూ ఆయన భార్య(మాజీ) కోర్టుకెక్కింది. తద్వారా జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ తర్వాత అత్యంత ఖరీదైన విడాకుల కేసుగా రికార్డుల్లోకి ఎక్కింది ఇది. వ్లాదిమిర్ పొటానిన్.. రష్యాలోనే రెండో రిచ్చెస్ట్ పర్సన్. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆయన సంపద 29.9 బిలియన్ డాలర్లుగా ఉంది. 31 ఏళ్ల కాపురం తర్వాత వ్లాదిమిర్ పొటానిన్, నటాలియా పొటానినా విడాకులకు సిద్ధమయ్యారు. అయితే ఖనిజం ఫ్యాక్టరీ ఎంఎంసీ నోరిల్స్క్ నికెల్ పీఎస్జేసీలో వ్లాదిమిర్కు చెందిన వాటా నుంచి యాభై శాతం భరణంగా ఇప్పించాలంటూ మాజీ భార్య నటాలియా లండన్ కోర్టుకు ఎక్కింది. ఆ విలువ ఏడు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే ఉంటుందని అంచనా. అంతేకాదు ఆయన వ్యాపారాల్లో ఆ విలువ మూడో వంతు పైనే ఉంటుంది. ఇలాంటి హైప్రొఫైల్ కేసులకు తీర్పులు ఇవ్వడంలో లండన్ కోర్టుకు ఘన చరిత్రే ఉంది. గతంలో బిలియనీర్ ఫర్ఖద్ అఖ్హ్మెదోవ్ విడాకుల కేసులో 450 మిలియన్ పౌండ్ల భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది కూడా. ఇంతకు ముందు నటాలియా పొటానీనా కింది కోర్టులో 84 మిలియన్ డాలర్లు కోరగా.. 40 మిలియన్ డాలర్లకు జడ్జి తీర్పు ఇచ్చారు. కానీ, పొటానీనా మాత్రం భారీ భరణం కోరుతూ ఈసారి లండన్ కోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో పోటానిన్ అభ్యర్థన పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, మాక్మెకంజీ స్కాట్కు 36 బిలియన్ డాలర్లు విడాకుల భరణం చెల్లించగా.. బిల్గేట్స్, మిలిండాకు 26 బిలియన్ డాలర్ల భరణం చెల్లించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలో మూడో బిలియనీర్గా ఖరీదైన విడాకుల జాబితాలో వ్లాదిమిర్ నిలుస్తాడా? లేదా? అన్నది తెలియడానికి కొంత టైం పడనుంది. -
బిల్గేట్స్తో మోదీ భేటీ
గ్లాస్గో సమావేశాల సందర్భంగా భారత ప్రధాని మోదీ మంగళవారం మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు, అపరకుబేరుడు బిల్గేట్స్తో భేటీ అయ్యారు. సుస్థిర అభివృద్ధి, భూతాపోన్నతిని తగ్గించే చర్యలపై చర్చలు జరిపారు. అనంతరం నేపాల్ ప్రధాని దేవ్బా తో మోదీ చర్చలు జరిపారు. ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ మధ్య భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు చతురోక్తులు విసురుకున్నారు. ‘మా దేశంలో మీకు అత్యధిక జనాదరణ ఉంది’అని ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్ తెలపగా మోదీ ‘థ్యాంక్యూ, థాంక్యూ’ అంటూ బదులిచ్చారు. అనంతరం బెన్నెట్ తమ యమినా పార్టీలో చేరాలంటూ మోదీని ఆహ్వానించారు. దాంతో, ఇరువురు నేతలు సరదాగా నవ్వుకున్నారు. -
బిల్గేట్స్, బెజోస్పై విమర్శలు: ‘మాకు నీతులు చెప్పి.. మీరేమో ఇలా’
వాషింగ్టన్: సామాన్యులు అంటే పర్లేదు కానీ.. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు తమ నోటి వెంట వచ్చే మాటకు కట్టుబడి ఉండాలి. చేసేవాటినే చెప్పాలి.. చెప్పిన వాటిని ఆచరించాలి. అలా కాదని ప్రజలకు నీతి వ్యాఖ్యలు బోధించి.. వారు మాత్రం విచ్చలవిడిగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. జనాలు కూడా ఊరుకోరు. ఎడాపెడా చీవాట్లు పెడతారు. తాజాగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ప్రపంచ కుబేరులు బిల్గేట్స్, జెఫ్ బెజోస్. వీరిద్దరిపై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు నెటిజనులు. ఈ కుబేరులు ఇంతలా విమర్శలపాలు కావడానికి కారణం ఏంటో తెలియాలంటే ఇది చదవండి. కొద్ది రోజుల క్రితమే బిల్గేట్స్ తన 66వ పుట్టినరోజు వేడులకు ఘనంగా జరుపుకున్నారు. కేవలం 50 మంది మాత్రమే ఈ బర్త్డే పార్టీకి హాజరయ్యారు. వేడుకలు టర్కీ సముద్ర తీరంలో.. ఓ లగ్జరీ పడవలో నిర్వహించారు. ఈ పార్టీకి హాజరుకావడం కోసం బెజోస్ హెలికాప్టర్లో 120 మైళ్ల దూరం ప్రయాణించి.. అక్కడకు చేరుకున్నాడు. ఈ బర్త్డే వేడుకల సందర్భంగా వెల్లడైన కార్బన్డైయాక్సైడ్ మోతాదుపై తాజాగా విపరీతమైన చర్చ నడుస్తోంది. కేవలం నాలుగు గంటల పాటు సాగిన బర్త్డే పార్టీ జరిగిన పడవ నుంచి 19 టన్నులు, బెజోస్ హెలికాప్టర్ ప్రయాణంలో 215 పౌండ్ల కార్బన్ డయాక్సైడ్ వెల్లడయినట్లు తెలిసింది. (చదవండి: ఆయన గెలుపు కంటే.. ఈయన వెటకారమే ఎక్కువైంది) ఈ క్రమంలో పలువురు నెటిజనులు బిల్గేట్స్, బెజోస్పై విమర్శలు కురిపిస్తున్నారు. ఓ వైపు ఈ ఇద్దరు మానవతావాదులు పర్యావరణ పరిరక్షణ గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు. మరోవైపు వీరి ఆడంబరాలు.. మరింత కార్బన్ ఉద్గారాలను వెల్లడిస్తుంటాయి. జనాలకేమో ఆఫీసుకు వెళ్లడానికి వ్యక్తిగత వాహనాల బదులు.. ప్రజా రవాణ వ్యవస్థను వినియోగించుకొండి అని నీతులు చెబుతూ.. మీరు మాత్రం మీకు నచ్చినట్లు ఎంజాయ్ చేయండి అని విమర్శిస్తున్నారు. (చదవండి: బిల్గేట్స్నే బకరా చేసిన బిల్డప్ బాబాయ్) బిల్గేట్స్ బర్త్డే పార్టీ జరిగిన పడవ సూపర్యాచ్ని లానా అని పిలుస్తారు. ప్రముఖ వ్యాపార దినపత్రిక ప్రకారం, గేట్స్ వారానికి 1.8 మిలియన్ పౌండ్లకు దీనిని అద్దెకు తీసుకున్నారు. గేట్స్ అతిథులు మెగా-యాచ్ నుంచి సీ మీ బీచ్ అని పిలువబడే ఫెతియే నగరంలోని ఏకాంత బీచ్కి వెళ్లినట్లు తెలిసింది. చదవండి: ఇద్దరూ ఇద్దరే.. వీళ్ల చర్యలు ఊహాతీతం -
బిల్ గేట్స్ కుమార్తె వివాహం.. ఖర్చు ఎంతంటే..
వాషింగ్టన్: ప్రస్తుత కాలంలో సామాన్యుల ఇళ్లల్లో జరిగే పెళ్లి వేడుకలే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి అలాంటిది ప్రపంచ కుబేరుడు బిల్గేట్స్ ఇంట పెళ్లి అంటే.. మాటలు కాదు. అతిరథ మహరథులు అతిథులుగా హాజరయ్యే ఈ వేడుకకు ఖర్చు మాములుగా ఉండదు. మన ఆసియా కుబేరుడు ముకేష్ అంబానీ ఆయన కుమార్తె ఇషా అంబానీ వివాహ వేడుకకు సుమారు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు సమాచారం. మరి ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ కుమార్తె వివాహం అంటే ఖర్చు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటున్నారా.. అయితే అక్కడే మీరు పప్పులో కాలేసినట్లు. బిల్గేట్స్ కుమార్తె వివాహ వేడుకకు కేవలం 2 మిలియన్ డాలర్లు అనగా 14 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయట. ఇంత తక్కువ ఎందుకంటే.. కరోనా. (చదవండి: ప్రియుడితో బిల్గేట్స్ తనయ జెన్నీఫర్ పెళ్లి!) కొన్ని రోజుల క్రితం బిల్ గేట్స్ కుమార్తె జెన్నీఫర్ కేథరిన్ గేట్స్ వివాహం జరిగినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడు, ప్రియుడు, హార్స్ రైడర్ అయిన నాయెల్ నాజర్తో జెన్నిఫర్ పెళ్లి జరిగినట్లు అమెరికాకు చెందిన ‘పీపుల్’ మ్యాగజైన్ ధృవీకరించింది. పెళ్లి అనంతరం జెన్నీఫర్ గేట్స్ తన వివాహ వేడుక గురించి వోగ్ మ్యాగ్జైన్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘2021 నాకు చాలా సవాళ్లు విసిరిన సంవత్సరం. ఓ వైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. బయటకు వెళ్లడానికి అవకాశం లేకుండా అయిపోయింది. దానికి మించిన సంఘటన మా ఇంట్లోనే చోటు చేసుకుంది. దురదృష్టం కొద్ది ఈ ఏడాదే మా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితులు మధ్య పెళ్లి వేడుకను ప్లాన్ చేయడం చాలా సవాలుతో కూడుకున్న పని అయ్యింది’’ అని తెలిపింది జెన్నీఫర్. (చదవండి: ఈ పెళ్లి చరిత్రలో నిలిచిపోతుంది.. ఎందుకంటే!) ‘‘ఇక పెళ్లికి ఇరు కుటుంబాల సన్నిహితులను మాత్రమే పిలవాలని భావించాం. అలా చూసుకున్న 300 మంది లిస్ట్ తయారయ్యింది. ఇక వారందరిని టీకా సర్టిఫికేట్ తప్పనిసరి చేశాం. నెగిటివ్ రిపోర్ట్ తీసుకురావాల్సిందిగా సూచించాం. పెళ్లి సందర్భంగా వారాంతంలో రెండు వివాహ వేడుకలు నిర్వహించాం. ఒకటి సివిల్ మరొకటి మతపరమైనది’’ అని తెలిపింది. ‘‘శనివారం మధ్యాహ్నం న్యూయార్క్లోని ఉత్తర సేలంలోని కుటుంబానికి చెందిన 142 ఎకరాల ఎస్టేట్లో బహిరంగ వివాహ వేడుక జరిగింది. ప్రఖ్యాత న్యూయార్క్ సిటీ రెస్టారెంట్లు క్యాటరింగ్ చేశాయి. కస్టమ్ వెరా వాంగ్ డిజైన్ చేసిన వెడ్డింగ్ గౌను ధరించాను. ఈవెంట్ ప్లానర్ మార్సీ బ్లమ్ వారాంతంలో ఈ వేడుక జరిపించారు’’ అన్నది. జెన్నీఫర్ భర్త నాయల్ నాజర్ ఈక్వెస్ట్రియన్(గుర్రపు స్వారీ)లో పాల్గొన్నాడు. ఈజిప్టు సంతతికి చెందిన నాజర్ది సంపన్న కుటుంబమే. వీరిద్దరూ చాలా కాలం క్రితం నుంచే డేటింగ్లో ఉన్నారట. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో వీరిద్దరి కలిసి చదువుకుంటున్నపటి నుంచే ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు బిల్గేట్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. గేట్స్ దంపతులు విడిపోవడంతో.. కుమార్తె వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను తల్లి మిలిందా దగ్గరుండి చూసుకున్నారు. బిల్గేట్స్.. కుమార్తె జెన్నీఫర్ వివాహ వేడుకకు ఒకరోజు ముందుగా హాజరయ్యారు. చదవండి: గోల చేయని భార్య! ప్చ్.. నాలుగు రోజులకే విడాకులు -
అమ్మాయిలతో ‘పులిహోర’.. బిల్గేట్స్కు గట్టి వార్నింగ్!
ఇదేం కొత్త ఆరోపణ కాదు. కాకపోతే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ ‘చిలిపి చేష్టలు’ తమ దృష్టికి రావడంతో మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్స్ స్వయంగా ఆయన్ని మందలించారనే కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు వాల్స్ట్రీట్ జర్నల్ సోమవారం ఒక కథనం ప్రచురించింది. సదరు ఘటన 2008లో జరిగింది. ఓ మిడ్ లెవల్ ఉద్యోగితో పులిహోర కలుపుతూ ఆయన(బిల్ గేట్స్) పంపిన మెయిల్స్ వ్యవహారం మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్స్ దృష్టికి వచ్చింది. దీంతో జనరల్ కౌన్సెల్ బ్రాడ్ స్మిత్(మైక్రోసాఫ్ట్ ప్రస్తుత ప్రెసిడెంట్, వైస్ చైర్మన్ ), మరికొందరు ఎగ్జిక్యూటివ్స్ కలిసి గేట్స్ను వ్యక్తిగతంగా సంప్రదించారు. అంతేకాదు ఇలాంటి వ్యవహారాలు ఆపితే మంచిదని ఆయన్ని సున్నితంగా మందలించారు కూడా!. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై బిల్గేట్స్ నీళ్లు నమలడం, ఉద్యోగిణికి కేవలం వెకిలి మెయిల్స్ మాత్రమే పంపడం, పైగా శారీరక సంబంధం దాకా యవ్వారం వెళ్లకపోవడంతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా మందలించి వదిలిపెట్టారని వాల్స్ట్రీట్ జర్నల్ ఆ కథనంలో పేర్కొంది. ఇక ఈ కథనంపై ఇటు మైక్రోసాఫ్ట్గానీ, అటు స్మిత్గానీ స్పందించేందుకు ఇష్టపడడం లేదు. గేట్స్ కార్యాలయం ఈ ఆరోపణలను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. పాత ఆరోపణలనే తిరగదోడుతున్నారని, దీనివెనుక వాళ్ల స్వలాభం ఉండొచ్చంటూ ఖండించింది. ఇదిలా ఉంటే 2019లో బిల్గేట్స్ తనతో చాలా ఏళ్లు శారీరక సంబంధం నడిపారంటూ ఓ ఇంజినీర్ రాసిన లేఖ కలకలం సృష్టించింది. ఈ లైంగిక ఆరోపణలపై న్యాయపరమైన విభాగంతో దర్యాప్తునకు ఆదేశించింది మైక్రోసాఫ్ట్. ఆ దర్యాప్తు గోప్యంగా కొనసాగుతుండగానే మైక్రోసాఫ్ట్ బోర్డ్ నుంచి బయటకు వచ్చేశారు. అయితే ఎప్పుడైతే బిల్ గేట్స్, మెలిండా ఫ్రెంచ్ విడాకులు ప్రకటించారో.. అప్పటి నుంచి వరుసబెట్టి ఆయనపై ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకరకంగా బిల్గేట్స్ చిలకొట్టుడు వ్యవహారాలే మెలిండాతో 27 ఏళ్ల వైవాహిక బంధం ముగియడానికి కారణమనే వాదన సైతం తెర మీద వినిపిస్తుంటోంది. చదవండి: గేట్స్ దంపతులు విడిపోవడానికి కారణం ఎవరంటే.. క్లిక్ చేయండి: ‘బిల్గేట్స్ పచ్చి తాగుబోతు, యువతులతో నగ్నంగా స్విమ్మింగ్పూల్లో..’ -
‘నువ్వింక మారవా?’.. ఎలన్ మస్క్ రిప్లై ఇది
సంపాదించడంలోనే కాదు.. అందులోంచి దానాలు చేయడం ద్వారా కూడా ధనికులు కొందరు శెభాష్ అనిపించుకుంటున్నారు. బిల్గేట్స్, వారెన్ బఫెట్, మార్క్ జుకర్బర్గ్ లాంటి అపర కుబేరులు సైతం ఈ లిస్ట్లో ఉన్నారు. కానీ, ఈ జాబితాలో టాప్ 2 పొజిషన్లో ఉన్నవాళ్లు మాత్రం.. చాలా వెనుకంజలో ఉన్నారు. పైగా వీళ్లిద్దరి వ్యవహార శైలిపై తోటి కుబేరులతో పాటు ప్రముఖులు సైతం మడిపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా స్పేస్ టూరిజంలో పోటీతో అపర కుబేరులు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్లు అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారు. భూమి మీద ఎన్నో సమస్యల్ని పరిష్కరించే అవకాశం ఉన్నా.. అంతరిక్ష ప్రయోగాల పేరుతో వృధా ఖర్చు చేస్తున్నారనే విమర్శ ఈమధ్య బాగా వినిపిస్తోంది. బిల్గేట్స్తో పాటు ప్రిన్స్ విలియమ్ లాంటి ప్రముఖులు సైతం విమర్శించిన వాళ్లలో ఉన్నారు. అయితే ఈ విమర్శలపై తాజాగా ఓ రేడియో ఇంటర్వ్యూలో స్పేస్ఎక్స్ బాస్ ఎలన్ మస్క్ స్పందించాడు. ‘విమర్శల నేపథ్యంలో మార్పు ఆశించొచ్చా’ అని రేడియో జాకీ అడిగిన ప్రశ్నకు.. ‘ఆసక్తి-అవకాశం ఉన్నప్పుడు విమర్శలను ఎందుకు పట్టించుకోవడం’ అంటూ సింగిల్ లైన్లో విమర్శలకు తన బదులు ఇచ్చాడు. Hopefully enough to extend life to Mars — Elon Musk (@elonmusk) October 16, 2021 ఇక క్రిప్టో యూట్యూబర్ మ్యాట్ వాలేస్ ట్విటర్లో ఎలన్ మస్క్ సంపద గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ఎలన్ మస్క్ ప్రస్తుత ఆస్తి 861 బిలియన్ డోజ్కాయిన్లకు సమానం. బిల్గేట్స్, వారెన్ బఫెట్ల ఆస్తి కలిస్తే ఎంతో.. అంత ఆస్తి ఇప్పుడు ఎలన్ మస్క్ ఒక్కడికే ఉందన్నమాట అంటూ వాలేస్ ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్కు ఎలన్ మస్క్ ‘బహుశా.. అంగారకుడి మీద జీవనాన్ని విస్తరించడానికి ఇది సరిపోతుందేమో!’ అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే మాట్లాడితే మార్స్ పేరెత్తే ఎలన్ మస్క్.. చిన్నప్పటి కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తున్నాడు . టెక్ మేధావిగా ఎదిగినప్పటికీ మార్స్ మీద మనిషి మనుగడ ధ్యేయంగా స్పేస్ఎక్స్ను నెలకొల్పి అందుకోసమే కోటాను కోట్ల డాలర్లను వెచ్చిస్తున్నాడు. ఈ క్రమంలో విమర్శలను తాను పట్టించుకోనని చెబుతున్నాడు. అంతేకాదు ఈ వ్యవహారంలో వచ్చే మీమ్స్ను సైతం ఆస్వాదిస్తుంటాడు. చదవండి: మస్క్, బెజోస్.. భూమ్మీద ఏక్ నెంబర్ 'పిసినారులు' -
ప్రియుడితో బిల్గేట్స్ తనయ జెన్నీఫర్ పెళ్లి!
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్గేట్స్-మిలిందా గేట్స్ల కుమార్తె జెన్నీఫర్ కేథరిన్ గేట్స్ వివాహ వేడుక సీక్రెట్గా జరిగిపోయింది. తన స్నేహితుడు, ప్రియుడు, హార్స్ రైడర్ అయిన నాయెల్ నాజర్తో జెన్నిఫర్ పెళ్లి జరిగినట్లు అమెరికాకు చెందిన ‘పీపుల్’ మ్యాగజైన్ ధృవీకరించింది. వీరి వివాహం న్యూయార్క్లో జరిగినట్లు సదరు మ్యాగజైన్ ప్రచురించింది. కొన్ని నెలల క్రితం మిలిందా గేట్స్తో విడాకులు తీసుకున్న బిల్గేట్స్.. కుమార్తె జెన్నీఫర్ వివాహ వేడుకకు ఒకరోజు ముందుగా హాజరయ్యారు. కాగా, కుమార్తె వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను తల్లి మిలిందా దగ్గరుండి చూసుకున్నారు. అతికొద్ది మంది బంధువుల సమక్షంలోనే జెన్నీఫర్-నాజర్ల పెళ్లి జరిగినట్లు పీపుల్ మ్యాగజైన్ స్పష్టం చేసింది. నాజర్ది సంపన్న కుటుంబమే.. ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్లో అమెరికా తరఫున నాజర్ ఈక్వెస్ట్రియన్(గుర్రపు స్వారీ)లో పాల్గొన్నాడు. ఈజిప్టు సంతతికి చెందిన నాయల్ నాజర్ది సంపన్న కుటుంబమే. వీరిద్దరూ చాలా కాలం క్రితం నుంచే డేటింగ్లో ఉన్నారట. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో వీరిద్దరి కలిసి చదువుకుంటున్న సమయంలో ప్రేమ చిగురించింది. చివరకు సోషల్ మీడియా వేదికగా జెన్నీఫర్ తన ప్రేమ వివాహాన్ని గతేడాదే బైటపెట్టింది. ఆ సమయంలో వీరి ప్రేమకు బిల్గేట్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దానిలో భాగంగానే వీరి పెళ్లికి బిల్గేట్స్తో పాటు మాజీ భార్య మిలిందాలు దగ్గరుండి జరిపించినట్లు పీపుల్ మ్యాగజైన్ తెలిపింది. నీతో కలిసి ఎదగాలని, నేర్చుకోవాలని, నవ్వాలని ఉంది ‘నాయల్ నాజర్.. నువ్వు నాకు దొరికిన ఒక అదృష్టానివి. నీతో కలిసి ఎదగాలని, నేర్చుకోవాలని, నవ్వాలని ఉంది. మన జీవితం కలిసి పంచుకోవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది జెన్నీఫర్. ‘ ప్రపంచంలో నేను అదృష్టవంతుడ్నే కాదు.. చాలా హ్యాపీయెస్ట్ పర్సన్ని కూడా. నువ్వే నా జీవితం. నువ్వు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోవడం ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. ప్రతీ ఉదయాన్ని, ప్రతీ రోజుని ఒక కల అంత అందంగా ఆస్వాదించేలా చేసిన నీకు చాలా థాంక్స్’ అని నాజర్ తెలిపాడు. బిల్గేట్స్-మిలిందా మే 4న ప్రకటించిన తర్వాత అది ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి ఉండలేక విడిపోవడానికే మొగ్గుచూపడంతో అది విడాకులకు దారి తీసింది. దాంతో మిలిందాతో 27 ఏళ్ల వైవాహిక జీవితానికి బిల్గేట్స్ ముగింపు పలికినట్లు అయ్యింది. కాగా, బిల్గేట్స్ దంపతులకు ముగ్గురు సంతానం. జెన్నీఫర్ గేట్స్, రోరీ గేట్స్, ఫీబీ అడెల్ గేట్స్. అందరి కంటే పెద్ద అమ్మాయే జెన్నీఫర్ గేట్స్. ఈమె అంటే తల్లి మిలిందాకు చాలా ఇష్టమట. -
అమెజాన్, టెస్లా అధినేతలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన బిల్గేట్స్...!
Bill Gates Takes A Dig At Jeff Bezos And Elon Musk: గత కొన్ని రోజుల క్రితం వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్ సంస్థలు ప్రైవేటు వ్యక్తుల రోదసి యాత్రలను చేపట్టిన విషయం తెలిసిందే..! ఈ సంస్థల అధినేతలు స్పేస్ టూరిజంను అభివృద్ధి చేయాలనే ఉద్ధేశ్యంతో అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా ఈ సంస్థలు తదుపరి అంతరిక్షయాత్రల కోసం వడివడిగా పనులను జరుపుతున్నాయి. ప్రపంచంలోని బిలియనీర్స్ రోదసి యాత్రలను చేయడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. చదవండి: బిలియనీర్ల కొంపముంచిన చైనా సంక్షోభం.. ! వందల కోట్లు ఆవిరి..! భూమ్మీద ఎన్నో సమస్యలున్నాయి..వాటిపై..! అంతరిక్ష యాత్రలతో స్పేస్ టూరిజంను అభివృద్ధిచేస్తున్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్పై మైక్రోసాఫ్ట్ అధినేత ఓ అమెరికన్ షోలో ఘాటు వ్యాఖ్యలను చేశారు. బిల్ గేట్స్ షోలో మాట్లాడుతూ... ‘భూమ్మీద మనం ఎన్నో సమస్యలతో సతమతమౌతుంటే...రోదసీ యాత్రలపై దృష్టి పెట్టడం సరికాదన్నారు. మలేరియా, హెచ్ఐవీ లాంటి వ్యాధులుఇంకా అంతంకాలేదు. నాకు వాటిని భూమ్మీద నుంచి ఎప్పుడు రూపుమాపుతామనే భావన నన్ను ఎప్పుడు వేధిస్తూనే ఉంది. ఈ సమయంలో స్పేస్ టూరిజంపై దృష్టిపెట్టడం సరి కాదు ’ అని అన్నారు. లేట్ లేట్ షో విత్ జేమ్స్ కోర్డాన్ షోలో పలు అంశాలపై బిల్గేట్స్ చర్చించారు . భూగ్రహాన్ని వదిలిపెట్టి ఎప్పుడు ఇతర గ్రహాలకు వెళ్దామనే తపన మీలో లేదని బిల్గేట్స్ను ఉద్దేశించి షో వ్యాఖ్యత జేమ్స్ కోర్డాన్ పేర్కొన్నారు. Tonight on our special #ClimateNight episode, Bill Gates shares a very good reason for why you haven’t seen him in a rocket ship 🚀 pic.twitter.com/7C8cKarJl0 — The Late Late Show with James Corden (@latelateshow) September 23, 2021 చదవండి: బ్యాంకులకు భారీ షాక్ ? అప్పులు చెల్లించలేని స్థితికి చేరిన మరో సంస్థ ! -
ఆ కంపెనీకి భారీగా నిధులను అందిస్తోన్న బిల్గేట్స్, జెఫ్బెజోస్..!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య గ్లోబల్ వార్మింగ్..! ఎంత త్వరగా వీలైతే అంతా తక్కువ సమయంలో శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడం కోసం పలు కంపెనీలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. శిలాజ ఇంధనాల స్థానంలో విద్యుత్ శక్తిని ఉపయోగించి వాహనాల తయారీ కోసం ఇప్పటికే పలు కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. చదవండి: Elon Musk SpaceX: కక్ష్యలో 3 రోజుల ప్రయాణానికి సర్వం సిద్ధం ఎలన్మస్క్కు చెందిన టెస్లా ఒక అడుగు ముందేకేసి ఎలక్ట్రిక్ కార్లను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. టెస్లా కార్లు ఒక్కసారి ఛార్జ్చేస్తే ఆరు వందల కిలోమీటర్లమేర ప్రయాణిస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాల రేంజ్ అనేది ఆయా వాహనాల మెటల్ బాడీపై ఆధారపడి ఉంటుంది. అత్యంత మన్నికైన, తేలికైన, శక్తివంతమైన, మెటల్ బాడీల తయారుకోసం పలు శాస్త్రవేత్తలు పరిశోధనలను చేపట్టారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే లోహలకోసం చేపట్టే పరిశోధనలకు మరింత ఊతం ఇచ్చేందుకు గాను ప్రపంచ బిలియనీర్లు అమెజాన్ అధినేత జెఫ్బెజోస్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ కోబోల్డ్ అనే మినరల్ ఎక్స్ప్లోరేషన్ స్టార్టప్లో భారీగా నిధులను ఇన్వెస్ట్చేసినట్లు తెలుస్తోంది. కోబోల్ట్ స్టార్టప్, బీహెచ్పీ కంపెనీ భాగస్వామ్యంతో ఈవీ వాహనాల్లో వాడే లోహలను వెతకడం కోసం పరిశోధనలను చేపట్టనున్నారు. వీరు అందించే లోహలు ప్రాథమికంగా టెస్లా కార్ల తయారీకి ఉపయోగపడనుంది. కోబోల్డ్ మెటల్స్ , బిహెచ్పి కలిసి ఆస్ట్రేలియాలోని లిథియం, నికెల్, కోబాల్ట్, రాగి కోసం శోధిస్తాయని కోబోల్డ్ సిఇఒ కర్ట్ హౌస్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. టెస్లా కార్ల బ్యాటరీలో వాడే నికెల్ అందించడంకోసం టెస్లాతో బీహెచ్పీ కంపెనీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కృత్రిమ మేథస్సు ఏఐ టెక్నాలజీనుపయోగించి ఈవీ వాహనాల లోహలకోసం కోబోల్డ్ మెటల్స్ అన్వేషణ చేపట్టనున్నాయి. ఈ కంపెనీల్లో ఎనర్జీ వెంచర్స్ ద్వారా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్తో పాటుగా బ్లూమ్బర్గ్ వ్యవస్థాపకుడు మైఖేల్ బ్లూమ్బర్గ్ పెట్టుబడిపెట్టినట్లు తెలుస్తోంది. వీరు ఎంతమేర పెట్టుబడిపెట్టారనే విషయంపై కోబోల్ట్ స్పందించలేదు. ఈవీ వాహనాల లోహల పరిశోధనలకోసం 14 మిలియన్ డాలర్లను ఖర్చుచేయనుంది. చదవండి: బడాబడా కంపెనీలు భారత్ వీడిపోవడానికి కారణం ఇదేనా..! -
పాఠాలు చెప్పని గురువులు.. అయినా గెలిచిన శిష్యులు
Happy Teacher's Day 2021: గురువంటే బడిత పట్టి పాఠాలు నేర్పేవాడు మాత్రమే కాదు. శిష్యుడంటే పలక పట్టి దిద్దాల్సిన అవసరమూ లేదు. గెలుపు తీరాలను తాకిన వాళ్ల నుంచి పాఠాలు నేర్చుకునే వాళ్లను శిష్యులుగానే భావించొచ్చు. అలాగే వాళ్లకు ప్రత్యక్ష పాఠాలు చెప్పకుండా ‘సక్సెస్’ స్ఫూర్తిని నింపే మార్గదర్శకులు గురువులే అవుతారు. ద్రోణుడికి ఏకలవ్య శిష్యుడిలాగా.. వెతికితే వ్యాపార, టెక్ రంగాల్లో రాటుదేలిన ఎంతో మంది మేధావులు మనకు కనిపిస్తారు. వాళ్లలో గురువుల్ని మించిన శిష్యులుగా, వాళ్ల ‘లెగసీ’కి వారసులుగా ఆయా రంగాల్లో పేరు సంపాదించుకుంటున్న కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ►సుందర్ పిచాయ్(పిచాయ్ సుందరరాజన్).. 49 ఏళ్ల ఈ టెక్ మేధావి అల్ఫాబెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా, గూగుల్ సీఈవోగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మెటీరియల్స్ ఇంజినీర్గా కెరీర్ను మొదలుపెట్టిన సుందర్ పిచాయ్.. 2004లో గూగుల్లో అడుగుపెట్టారు. ఇంతకీ ఈయన గురువు ఎవరో తెలుసా? విలియమ్ విన్సెంట్ క్యాంప్బెల్ జూనియర్. అమెరికా వ్యాపార దిగ్గజంగా పేరున్న విన్సెంట్ క్యాంప్బెల్.. మొదట్లో ఫుట్బాల్ కోచ్ కూడా. ఆపై టెక్నాలజీ వైపు అడుగులేసి.. యాపిల్ లాంటి ప్రముఖ కంపెనీలకు పని చేశారు. సుందర్ పిచాయ్.. అంతకంటే ముందు గూగుల్ ఫౌండర్లు ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్, ఎరిక్ షిమిడెట్, జెఫ్ బెజోస్(అమెజాన్ బాస్), జాక్ డోర్సే, డిక్ కోస్టోలో(ట్విటర్), షెరీల్ శాండ్బర్గ్(ఫేస్బుక్) లాంటి ప్రముఖులెందరికో ఈయనే మెంటర్ కూడా. ఇక యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్కు వ్యక్తిగత గురువుగా చాలాకాలం పని చేశారు విన్సెంట్ క్యాంప్బెల్. ►మార్క్ జుకర్బర్గ్.. ఫేస్బుక్ ఫౌండర్ కమ్ సీఈవో. చిన్నవయసులోనే బిలియనీర్గా ఎదిగిన ఈ ఇంటర్నెట్ ఎంట్రెప్రెన్యూర్.. ఎవరి స్ఫూర్తితో ఈ రంగంలోకి అడుగుపెట్టాడో తెలుసా? టెక్ మేధావి స్టీవ్ జాబ్స్. అవును.. ఈ విషయాన్ని స్టీవ్ జాబ్స్ తన బయోగ్రఫీలోనూ రాసుకున్నాడు. ఇది చాలామందిని విస్తుపోయేలా చేసింది. అయితే స్టీవ్ జాబ్స్ చనిపోయిన చాన్నాళ్లకు ఓ అమెరికన్ టాక్ షోలో జుకర్బర్గ్ మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని నిర్ధారించాడు. ► రిచర్డ్ బ్రాన్సన్ బ్రిటిష్ వ్యాపారవేత్త, వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు. లేకర్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు, బ్రిటన్ వ్యాపారదిగ్గజం ఫ్రెడ్డీ లేకర్ను తన గురువుగా ఆరాధిస్తుంటాడు. ఆయన స్ఫూర్తితోనే తాను ఇవాళ ఉన్నానంటూ చాలా ఇంటర్వ్యూలో గురుభక్తిని చాటుకుంటాడు బ్రాన్సన్. ►సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవోగా ఉన్న సత్య నాదెళ్ల.. సంస్థ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ను గురువుగా ఆరాధిస్తుంటాడు. తన కెరీర్ ఎదుగుదలకు గేట్స్ ఇచ్చిన ప్రోత్సాహం, ప్రోద్భలమే కారణమని చెప్తుంటారు. గొప్ప విజయాలు సాధించేందుకు గేట్స్ చెప్పే సూత్రాలు పాటిస్తే చాలాని తనలాంటి వాళ్లకు సూచిస్తుంటాడు సత్య నాదెళ్ల. ►రతన్ నవల్ టాటా(రతన్ టాటా).. ప్రముఖ వ్యాపారవేత్త. టాటా గ్రూపుల మాజీ చైర్మన్. ప్రస్తుతం టాటా చారిటబుల్ ట్రస్ట్ వ్యవహారాలు చూసుకుంటున్న ఈ పెద్దాయన(83).. ఫ్రెండ్లీబాస్ తీరుతో, సహాయక కార్యక్రమాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇంతకీ ఈయన ఎవరిని గురువుగా భావిస్తాడో తెలుసా?.. టాటా గ్రూపుల మాజీ చైర్మన్ జహంగీర్ రతన్జీ దాదాబాయ్ టాటా(జేఆర్డీ టాటా)ని. ►ఎలన్ మస్క్.. బహుతిక్కమేధావిగా పేరున్న మస్క్ తనకు గురవంటూ ఎవరూ లేరని తరచూ ప్రకటనలు ఇస్తుంటాడు. అంతేకాదు స్పేస్ఎక్స్ బిజినెస్ డెవలప్మెంట్ వ్యవహారాలను చూసుకునే జిమ్ కాంట్రెల్ ఓ ఇంటర్వ్యూలో ‘మస్క్ రాకెట్ సైన్స్ గురించి తనంతట తానే తెలుసుకున్నాడ’ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కూడా. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. కంప్యూటర్ సైంటిస్ట్-గూగుల్ ఫౌండర్ ల్యారీ పేజ్తో దగ్గరగా ఎలన్మస్క్ పని చేశాడని, ఆ ప్రభావంతోనే మస్క్ రాటుదేలాడని. ►బిల్ గేట్స్.. వ్యాపార మేధావిగా పేరున్న బిల్గేట్స్కు, అమెరికా ప్రముఖ వ్యాపారవేత్త వారెన్ బఫెట్కు మధ్య అపర కుబేరుడి స్థానం కోసం చాలాకాలం పోటీ నడిచిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ, బఫెట్ను అన్నింటా తాను గురువుగా భావిస్తానని బిల్గేట్స్ చాలా ఇంటర్వ్యూల్లో చెప్తుంటాడు. అంతేకాదు ఇద్దరూ వ్యాపార సలహాలు, ఛారిటీలకు సంబంధించిన వ్యవహారాలపై చర్చించుకుంటారు కూడా. - సాక్షి, వెబ్డెస్క్ స్పెషల్