Vikram kumar
-
మహేశ్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా అక్కినేని హీరో!
యంగ్ హీరో నాగచైతన్య వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ‘లవ్స్టోరీ’షూటింగ్ పూర్తి చేసుకున్న చైతూ.. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా చేస్తూన్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం అబిడ్స్లోని రామకృష్ణ సినిమా హాల్లో జరుగుతుండగా.. చైతుపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. (చదవండి : బంపరాఫర్ కొట్టేసిన అఖిల్.. పెద్ద సినిమాలో చాన్స్!) ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడిగా కనిపించబోతున్నాడని సమాచారం. అలాగే ఈ సినిమాలో మహేశ్ కొన్ని నిమిషాలపాటు తళుక్కున మెరవబోతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. తాజాగా లీకైన ఫోటోలను బట్టి చూస్తే ఇది నిజమనే తెలుస్తోంది. అభిరామ్ పేరు పేరిట, మహేష్ బాబు పోస్టర్లతో థియేటర్ ప్రాంగణంలో బ్యానర్లు ఏర్పాటు చేసిన పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు మహేశ్కి అక్కినేని ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఉంది. అఖిల్ తొలి సినిమా అఖిల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కు మహేశ్ బాబు హాజరయ్యాడు. తాజాగా నాగచైతన్య సినిమాలోనూ కనిపించి.. మరోసారి అక్కినేని ఫ్యామిలీతో బాండింగ్ను మహేశ్ బాబు మరోసారి గుర్తు చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో చైతన్య మొదటి సారి హాకీ ప్లేయర్గా కనిపిస్తున్నాడు. గతంలో మజిలీ సినిమాలో క్రికెటర్గా కనిపించి మెప్పించాడు. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి, అవికా గోర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. థాంక్యూ సినిమాని 2021 చివర్లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. -
ముగ్గురు భామలతో థాంక్యూ..!
అక్కినేని కుటుంబానికి ఫ్యామిలీ డైరెక్టర్ అయిపోయాడు విక్రమ్ కె కుమార్. లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు చివరి చిత్రం మనంతో మొదలైంది అక్కినేని కుటుంబానికి, విక్రమ్ కుమార్కు మధ్య అనుబంధం. ఆ తర్వాత అఖిల్తో ఆయన హలో మూవీ తెరకెక్కించారు. ఇప్పుడు నాగచైతన్యతో థాంక్యూ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ప్రస్తుతం మూవీ దునియాలో చక్కర్లు కొడుతోంది. థాంక్యూ సినిమాలో నాగచైతన్యతో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. డిసెంబర్ నుంచి మొదలుకానున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. మరో హీరోయిన్గా గ్యాంగ్లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుందన్న ఊహాగానాలూ కూడా వినిపిస్తున్నాయి. అయితే, మూవీ టీమ్ నుంచి ఇందుకు సంబంధించి ఎటువంటి ప్రకటన వెలువరించలేదు. ఈ పుకార్లన్నీ నిజమా కాదా అని తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న థాంక్యూ ఒక కమర్శియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. దీన్ని దిల్ రాజు తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. ఇది 2021 చివర్లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం నాగచైతన్య సాయి పల్లవితో కలిసి లవ్స్టోరీ సినిమాలో నటిస్తున్నారు. 2014లో విడుదల అయిన మనం సినిమా అక్కినేని కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనది. కానీ దాని తర్వాత ఆయన తీసిన హలో అక్కినేని వారికి హిట్ ఇవ్వలేకపోయింది. థాంక్యూతో అయినా విక్రమ్ మళ్లీ మనం లాంటి హిట్ ఇస్తాడేమో చూడాలి. -
‘మనం’ దర్శకుడితో చైతూ కొత్త సినిమా
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయన తనయుడు హీరో నాగ చైతన్య తన కొత్త సినిమాను ప్రకటించారు. మనం సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతన్య హీరోగా ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు ‘థాంక్యూ’ అనే టైటిల్ను కూడా ఖరారు చేశారు. దర్శకుడు విక్రమ్ విభిన్న కథను సిద్ధం చేసుకొని దానిని నాగ చైతన్యకు వినిపించగా..కథ ఎంతో నచ్చడంతో ఈ సినిమాకు చైతూ ఓకే చెప్పాడు. దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ను ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే అక్కినేని కుటుంబం మొత్తంతో విక్రమ్ మనం సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అలాగే అఖిల్తోనూ ‘హలో’ సినిమాను తీశాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అక్కినేని వారితో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ప్రస్తుతం చైతూ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్స్టోరి అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా చేస్తున్నారు. కరోనావైరస్ లేకపోయుంటే ఈ చిత్రం ఇప్పటికే విడుదలై ఉండేది. అంతేగాక ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో కూడా నాగ చైతన్య సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
హారర్కి సై
సిల్వర్ స్క్రీన్ పై తొలిసారి భయపెట్టడానికి రెడీ అవుతున్నారట నాగచైతన్య. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ చిత్రం చేస్తున్నారు చైతన్య. ఈ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని తెలిసిందే. ఇది హారర్ థ్రిల్లర్ జానర్ లో ఉంటుందని తాజా సమాచారం. హారర్ బ్యాక్ డ్రాప్ లో చైతన్య ఇప్పటి వరకూ సినిమా చేయలేదు. ఇదే అతని తొలి హారర్ సినిమా అవుతుంది. ‘లవ్ స్టోరీ’ షూటింగ్ పూర్తి అయినా వెంటనే విక్రమ్ కుమార్ సినిమా మొదలుపెడతారు చైతన్య. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతన్య ‘మనం’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. -
ముదురుతున్న ‘గ్యాంగ్ లీడర్’ వివాదం
నాని, విక్రమ్ కె కుమార్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఇటీవలే ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్తో టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ తమ బ్యానర్లో రిజిస్టర్ చేసుకున్నామని, గ్యాంగ్ లీడర్ పేరుతో తాము సినిమా కూడా ప్రారంభించామని చిత్ర నిర్మాత, హీరో మోహన కృష్ణ ఫిలిం చాంబర్లో జరిగిన ప్రెస్ మీట్లో తెలియజేశారు. మాణిక్యం మూవీస్ బ్యానర్ మీద తెలంగాణ, ఏపి ఫిలిం చాంబర్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మోహన కృష్ణ మాట్లాడుతూ.. ‘మా మాణిక్యం మూవీస్ బ్యానర్లో బావా మరదలు అనే సినిమా నిర్మించాం. ఇప్పుడు నాయుడు గారి అబ్బాయి నిర్మిస్తున్నాం. త్వరలోనే గ్యాంగ్ లీడర్ అనే సినిమా చేయబోతున్నాం. ఇందులో నేనే హీరోగా, నిర్మాతగా సెట్స్ మీదకు వెళ్ల బోతున్నాం. అక్టోబర్లో గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేశాం. ఉగాది రోజున ఈస్ట్ గోదావరిలో దాదాపు 40 రోజుల పాటు షూటింగ్కు ప్లాన్ చేశాం. చిరంజీవి గారి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. నేను చిరంజీవి గారికి వీరాభిమానిని. గ్యాంగ్ లీడర్ టైటిల్ తో ఏ మెగా హీరో సినిమా చేసినా ఇచ్చేస్తాను. వేరే వాళ్లకు ఇచ్చే ప్రసక్తి లేదు. టైటిల్ కావాలని మైత్రీ మూవీ మేకర్స్ నుంచి కాల్ చేశారు. కానీ నేను టైటిల్ ఇవ్వను, అమ్మను అని చెప్పాను. వాళ్లు చాలా రకాలుగా ట్రై చేశారు. కానీ టైటిల్ మాకే దక్కింది. అయినప్పటికీ నాని బర్త్ డే రోజు మా టైటిల్ తో పబ్లిసిటీ చేసుకున్నారు. నా పర్మీషన్ తీసుకోకుండా ఎలా టైటిల్ ను ఎనౌన్స్ చేస్తారు. ఇటువంటి నిర్ణయం ఎలా తీసుకున్నారో తెలియదు. చాంబర్ రూల్స్ కు విరుద్దంగా టైటిల్ను ఎలా ఎనౌన్స్ చేస్తారు. నేను చాంబర్ లో కంప్లైంట్ ఇచ్చాను. ఈ టైటిల్ మాకే వచ్చింది. ఏపి, తెలంగాణ చాంబర్స్ మాకే అనుకూలంగా ఉన్నాయి. నేను రిజిస్ట్రేషన్ చేసి మూడు నెలలు అవుతుంది. ఉగాది నుంచి షూటింగ్ కు వెళ్తున్నాం. 3 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తున్నాం. చిరంజీవి గారి టైటిల్ పెట్టడం వల్ల చాలా ఫండింగ్ వచ్చింది. 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా వచ్చింది. పక్కోడి టైటిల్ తీసుకోవడం కరెక్ట్ కాదు. పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని వచ్చాను. చిరంజీవి గారి టైటిల్ కు ఎటువంటి ఆటంకం లేకుండా మంచి పేరు తీసుకోవాలని కథ రెడీ చేశాం. టైటిల్ విషయంలో లీగల్ గా మేం కరెక్ట్ గా ఉన్నాం. తుమ్మల పల్లి రామసత్యనారాయణ, సముద్ర, నట్టి కుమార్, ముత్యాల రాందాసు లాంటి పెద్దలు కూడా మాకు సపోర్టివ్ గా ఉన్నారు. ఏపీ ఎలక్షన్స్ అయ్యాక... 16 సినిమాలు తీసిన పెద్ద బ్యానర్ తో కలిసి మా బ్యానర్లో సినిమాలు తీసి యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయబోతున్నాం. అని అన్నారు. -
గ్యాంగ్లీడర్
‘‘ఐదుగురు అమ్మాయిలు. వాళ్ల గ్యాంగ్కి ఓ లీడర్. ఐదు వేళ్లను మోసే అరచేతిలాగా, పాండవుల వెనకుండే కృష్ణుడిలా ఆ గ్యాంగ్ని చూసుకుంటుంటాడు’ అంటూ సాగే వీడియోతో నాని–విక్రమ్ కె.కుమార్ చిత్ర టైటిల్ను నాని బర్త్డే సందర్భంగా ‘గ్యాంగ్లీడర్’ అని ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇది నాని 24వ చిత్రం. ఈ సినిమాలో ‘ఆర్ఎక్స్ 100’ కార్తికేయ విలన్గా నటించనున్నారు. ‘‘చిరంజీవిగారి సినిమాలకు ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళ్లిన జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి. ఆయన అభిమాని అయిన నేను.. ఆయన సినిమా టైటిల్ను నా సినిమాకి పెట్టడం సంతోషంగా ఉంది’’ అని నాని ట్వీటర్లో పేర్కొన్నారు. ఈ సినిమాలో ప్రియాంక, శరణ్య, ప్రియదర్శి కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఆగస్ట్లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరు«ద్. -
జున్నూవాళ్ల డాడీ
సన్నాఫ్ సెలబ్రిటీ అయితేనే అడ్రస్ ఉండే సొసౌటీ ఇది! పోలీస్ ఆపితే.. 'మా డాడీ ఎవరో తెలుసా' అని అడిగే జనరేషన్ ఇది! కాని..'జున్నూ' అలా కకూడదని నానీ ప్రేమ పోలీసింగ్ చేస్తున్నాడు. వేలు చూపి 'ఇది చెయ్యొద్దు' అనడు. రేప్పొద్దున ఎవరు తన కొడుకు వైపు వేలెత్తి చూపకుండా ఇప్పుడే అన్నీ నేర్పిస్తున్నాడు. పిల్లలకు తండ్రి హీరో అవ్వాలంటే మురపాలే సరిపోవు మరి. ►మీ బర్త్డే 24న. రీసెంట్గా 24వ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. అది కూడా ‘24’ అనే సినిమా తీసిన డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్తో. 24 అంకెకు మీ జీవితంలో ఏదైనా స్పెషాలిటీ ఉందా? ►ఉందనుకుంటాను. కానీ దానికి లాజికల్ వివరణ ఇవ్వలేను. చిన్నప్పటి నుంచి 24తో చాలా కనెక్షన్ ఉంది. ట్రైన్ టికెట్, ఫ్లైట్ టికెట్ అనుకోకుండా 24వ సీట్ రావడం, ఇల్లు కొనుక్కుంటే అది ఫ్లాట్ నం. 24 అవ్వడం... ఇలా అనుకోకుండా కుదురుతుంటాయి. ఇక నేను పని చేస్తున్నది 24 శాఖలున్న ఇండస్ట్రీలో. సెకన్కు 24 ఫ్రేమ్లు ఉంటాయి. నా బర్త్డే 24. హీరోగా నా కెరీర్ స్టార్ట్ అయింది 24ఏళ్లకు. విచిత్రంగా అనిపిస్తుంటుంది. అది యాదృచ్ఛికమో దానికేమైనా కనెక్షన్ ఉందో నాకు తెలియదు. సరే ఇన్ని కనెక్షన్లు ఉన్నాయి కదా అని నా కారు నెంబర్లు కూడా 24 అని పెట్టించుకున్నాను (నవ్వుతూ). లక్కీ అని కాదు. 24తో ఓ చిన్న ఎమోషన్ ఏర్పడింది. ►ఈ బర్త్డే విశేషాలు ఏమైనా? ►బేసిక్గా బర్త్డే అంటే భయం. ఆ ఒక్క రోజు మాత్రం మన క్యాలెండర్ నుంచి స్కిప్ అయిపోతే బావుండు అనిపిస్తుంటుంది. ఒకలాంటి ప్రెషర్ ఫీల్ అవుతుంటాను. చిన్నప్పుడు బర్త్డే అంటే స్కూల్లో మనం చాలా స్పెషల్. క్లాస్లో ఎక్కువగా మాట్లాడని క్లాస్మేట్స్ కూడా వచ్చి మనకు విషెస్ చెబుతారు. యాక్టర్ అయ్యాక మనం వద్దనుకున్నా అటెన్షన్ ఉంటుంది. దాంతో ప్రైవేట్ టైమ్ కోసం వెతుకుతూ ఉంటాం. బర్త్డే రోజు లెక్కపెట్టలేనంత మంది విష్ చేస్తుంటారు. వాళ్లందరికీ రిప్లయ్ ఇవ్వాలనుంటుంది. కానీ ప్రాక్టికల్గా కుదరదు. అదో ప్రెషర్. అంత టైమ్ కూడా ఉండదు. ఫ్రెండ్స్ కలవాలనుకుంటారు, ఫ్యామిలీ మనతో టైమ్ స్పెండ్ చేయాలనుకుంటారు. సినిమా షూటింగ్ ఉంటే వెళ్లిపోవాలి. అందుకే బర్త్డే డేట్ వరకు స్కిప్ అయి నెక్ట్స్ డేట్కి వెళ్లిపోతే బావుండు (నవ్వుతూ). ► గుర్తుండిపోయిన బర్త్డే ఏదైనా ఉందా? ►చిన్నప్పటి బర్త్డేల్లో ఓ అమాయకత్వం ఉండేది. ఏం చాక్లెట్లు కొనాలి? మన క్లోజ్ ఫ్రెండ్స్కు రెండు మూడు ఇచ్చి మిగతావాళ్లను ఒకటే తీసుకోమనడం... ఆ క్యూట్నెస్, ఇన్నోసెన్స్ ఇప్పుడు ఉండవు కదా. చిన్నప్పుడు సెలబ్రేట్ చేసుకున్న బర్త్డేలన్నీ గుర్తుండిపోయినవే. నా చిన్నప్పటి ఫొటోలన్నీ నా పుట్టినరోజుకు దిగినవే. అది కూడా సరోజ్ అనే ఫోటో స్టూడియోలో. నా ఆల్బమ్ తీస్తే ఫస్ట్ వచ్చే పది ఫొటోలు పది సంవత్సరాల బర్త్డేలవే. ప్రతి ఫొటో వెనుక ‘సరోజ్ ఫొటో స్టూడియో ఫిబ్రవరి 24’ అని కామన్గా ఉంటుంది. నా ఫొటోలన్నింటికీ ఒకటే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. వెనకాల కర్టెన్ అలానే ఉంటుంది. ఫ్లవర్వాజ్ బొమ్మ సైజ్ అలానే ఉంటుంది. నా సైజ్ మారుతుంది. నేను పెద్దగా అవుతూ వచ్చాను. ఇప్పుడు అలా ఫొటోలు దిగడం మిస్ అవుతున్నాను. అమ్మ పొద్దునే లేపి నలుగు పెట్టి, తల స్నానం చేయించి ఫొటో తీయించడానికి రైల్వే ట్రాక్ దాటించి తీసుకెళ్లేది. అదో స్పెషల్ మెమొరీ. ► ఇంతకీ ఈ బర్త్డేకు ఇంట్లోనే ఉంటున్నారా? ►ఉంటున్నాను. ఉండకపోతే అదో ప్రాబ్లమ్. నాకు ఏదైనా పని ఉండి ఊరెళ్తే పని అయ్యాక తిరిగొస్తా. కానీ బర్త్డే ఉంటే పనిమధ్యలో తిరిగి రావాలి. ఇంట్లో లేకపోతే బాగోదు కదా. ► మీ భార్య అంజన ఏమైనా గొడవ చేస్తారా? అలాంటిదేం లేదు.. బర్త్డే వస్తుంది. స్కిప్ అయిపోతే బావుండు అని తనతో అంటుంటా. అయితే ఇంట్లోవాళ్లతో ఉండాలని వాళ్లు కోరుకుంటారు... నాకూ ఉండాలని ఉంటుంది కదా. ► మీ జున్ను (నాని తనయుడి ముద్దు పేరు) మీ జీవితంలోకి వచ్చాక మీకిది రెండో బర్త్డే. మీ అబ్బాయి ఫస్ట్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశారు? లాస్ట్ ఇయర్ మార్చిలో జున్నూది ఫస్ట్ బర్త్డే. ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేస్తున్నారా? అని కొంతమంది అడిగారు. వాడికి అర్థం కాని వయసులో వాడి ఫంక్షన్ చేసి ఉపయోగమేంటి? అనుకున్నాను. మా ఇంట్లోనే స్పెండ్ చేశాం. ఈ ఇయర్ కూడా అలానే జరుపుకుంటాం. బర్త్డేఫంక్షన్స్ అన్నీ మన ఫ్రెండ్స్ని కలుసుకోవడానికి సెలబ్రేట్ చేసుకుంటాం. మన ఆనందం, గొప్ప చూపించుకోవడం కోసం బర్త్డేలు సెలబ్రేట్ చేసుకోవడం నాకిష్టం ఉండదు. అందుకే బర్త్డే అంటే మనవాళ్లతో టైమ్ స్పెండ్ చేయడమే. ► ఈ బర్త్డేకి కొత్త బట్టలు కొనుక్కున్నారా? ►చిన్నప్పుడు మోస్ట్ ఎగై్జటింగ్ వాటిలో కొత్త బట్టలు కొనుక్కోవడం. ఇప్పుడు కొత్త బట్టలు సందర్భానికి సంబంధం లేకుండా కొనుక్కుంటున్నాం, కొన్న వెంటనే వేసుకుంటున్నాం. నటులకు షూటింగ్లో రోజూ కొత్త బట్టలే కదా (నవ్వుతూ). ఆ ఎగై్జటింగ్ విషయం ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ►కెరీర్వైజ్గా గతేడాది స్పీడ్ కొంచెం తగ్గించారు... ►కృష్ణార్జున యుద్ధం, దేవదాస్... రెండు సినిమాలే చేశాను. ‘బిగ్ బాస్’ షో వల్ల ఇంకోటి మిస్ అయింది. ఈ ఏడాది మూడు సినిమాలు వస్తాయి. ►మీ మొదటి సినిమా (అష్టా చెమ్మా) ఇంద్రగంటి మోహనకృష్ణతో చేశారు. 25వ సినిమా కూడా ఆయనతోనే చేయబోతున్నారు. ఇందులో విలన్గా కనిపిస్తారట? ►డిఫరెంట్ రోల్ చేస్తున్నాను. ఇప్పటి వరకూ ఎప్పుడూ చేయని పాత్ర అది. ఇది మల్టీస్టారర్ కాదు. మోహనకృష్ణగారు ఓ హీరో (సుధీర్బాబు)తో సినిమా చేస్తున్నారు. అందులో నేనో చిన్న పాత్ర పోషిస్తున్నాను. అంతే. కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ సినిమా గురించి ఇప్పుడు నేనేం చెప్పినా లాజికల్గా ఉండదు. త్వరలోనే అనౌన్స్ చేస్తాం. ►సబ్జెక్ట్లు ఎంచుకోవడంలో నాని రూట్ మార్చాడని కొందరు అంటున్నారు.. ►లేదు. అయితే నేను రూట్ మార్చానని చాలామంది అనుకుంటున్నారు. రెండు రొటీన్ ఫిల్మ్స్ చేసి నాని కొత్త రూట్ వెతుకుంటున్నాడు, కొత్త రోల్స్ చేయబోతున్నాడు అని. నేనెప్పుడూ అలా ఆలోచించలేదు. అవన్నీ బయటివాళ్ల అనాలసిస్లు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం, పైసా, జెండా పై కపిరాజు, జెంటిల్మేన్’ లాంటి ఇంట్రెస్టింగ్ ఐడియాలు చేశాం కదా .. మనం కమర్షియల్ మీటర్కు సెట్ అవుతామా? లేదా? అని ‘నేను లోకల్, యంసీఏ’ సినిమాలు చేశాను. రొటీన్ సినిమాలు అన్నారు. అన్నవాళ్లకు రొటీన్ కానీ నాకు కాదు. అవి చేశాను కదా అని మళ్లీ ఇటు సైడ్ వస్తున్నాను. యాక్టర్గా అన్నీ చేయాలి. అదే చేస్తూ వస్తున్నాను. చూసే విధానం బట్టి ఎవరికి వారు ఒక ఒపీనియన్ ఏర్పరుచుకుంటారు. నాని ఇటు వెళ్లాడు, అటు వచ్చాడు అని. ఇది సైకిల్. భవిష్యతుల్లో ‘ఎంసీఏ, నేను లోకల్’ లాంటివి చేయనని చెప్పడం లేదు. మళ్లీ వేరే రూట్లోకి వచ్చి చేస్తా. ►నాని ఏ పాత్ర అయినా బాగా చేయగలడు అనే కాంప్లిమెంట్ విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? ►చాలా మంది అనుకుంటారు.. నాని బాగా చేశాడు అని. కాదు.. స్క్రిప్ట్లో విషయం ఉండాలి. బాగా చేయడం, చేయకపోవడం ఉండదు. స్క్రిప్ట్లో స్కోప్ ఉండటం, ఉండకపోవడమే తేడా. ►హిట్, ఫ్లాప్ మీతో ఎన్నిరోజులు ట్రావెల్ అవుతాయి? ►అవి నాకు పెద్ద విషయం కాదు. నేను ఇంపార్టెంట్గా ఫీల్ అయ్యేది ఏంటంటే టీమ్ అంతా కష్టపడి సినిమా చేస్తుంటాం. దానికి తగ్గ క్రెడిట్ రాకపోతే కొంచెం బాధగా ఉంటుంది. వాళ్లంతా బాధపడతారు అనే బాధ తప్పితే నా కెరీర్ ఏమైపోతుంది... అనే ఆలోచన ఉండదు. సక్సెస్, ఫ్లాప్ బాధపెట్టవు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. జయాపజయాలకు అతీతంగా ప్రేక్షకులతో నాకు ఓ కనెక్షన్ వచ్చేసింది అనే నమ్మకం ఏర్పడింది. ►‘నా కెరీర్ ఏమైపోతుంది’ అనే ఆలోచన లేదన్నారు.. ఆ మాటల్లోనే ఏమీ కాదనే మీ ఆత్మవిశ్వాసం కనపడుతోంది. ఇది ఎప్పుడు డెవలప్ అయింది? ►ఎప్పుడు కుదిరిందో తెలియదు కానీ కుదిరింది. కొన్ని నెలలు కలసి టీమ్ అందరం కష్టపడతాం. పని చేసినవాళ్లు ఎప్పుడు తలుచుకున్నా వాళ్లకు ఆ సినిమా ఓ చేదు జ్ఞాపకంలా మిగిలిపోకూడదు. ఎవరూ నష్టపోకూడదని కోరుకుంటాను. అందుకోసం సక్సెస్ అవసరం అయితే ఆ సక్సెస్ నాకు కావాలి. అయితే నేను ఏరోజూ సినిమా సక్సెస్ అవ్వాలి అని చేయలేదు. ఎంజాయ్ చేస్తూ చేశాను. నా పనిని ఎంజాయ్ చేస్తున్నంత వరకూ నాకు పని ఉంటుంది. జెన్యూన్గా కష్టపడితే వర్క్ మనల్ని ఫాలో అవుతుంటుందని నమ్ముతాను. సక్సెస్ అవ్వాలి, సెటిల్ అవ్వాలి అని మొక్కుబడిగా చేస్తే అది కూడా మనల్ని వదిలేస్తుంది. దానివెనకాల మనం పరిగెత్తనప్పుడు అది మనపక్కనే బుద్ధిగా కూర్చుని ఉంటుందని నా ఫీలింగ్. ►మీ వయసుకన్నా ఎక్కువ వయసున్న పాత్రలు కూడా చేస్తున్నారు? ►‘జెర్సీ’లో నా వయసుకు మించిన పాత్ర చేశాను. ఇది నేను గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది. ఇప్పటి వరకూ ఏ సినిమాకీ ఈ స్టేట్మెంట్ వాడలేదు. ‘జెర్సీ’ నా కెరీర్లో బెస్ట్ అవుతుంది. ►ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారు? అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ►రిజల్ట్ గురించి చెబుతున్న స్టేట్మెంట్ కాదిది. యాక్టర్గా పూర్తి సంతృప్తి ఇచ్చింది. నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ‘ఇంకా ఏదో చేస్తే బావుండు’ అనే ఓ ఫీలింగ్ ఉంటుంది కదా.. అది లేదు ఈ సినిమా చూసిన తర్వాత. అందుకే నా బెస్ట్ వర్క్ అంటాను. ఈరోజు వరకూ ఇది బెస్ట్ అన్నాను. దాని అర్థం దీన్ని మించే సినిమాలు రావని కాదు. ఇప్పటివరకూ నా కెరీర్లో ఇది బెస్ట్. ఇదివరకూ మంచి సినిమాలు చేశా. అవి చేసినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే ఆ సినిమాల్లో ఆ పాత్రగా మారిపోయినప్పటికీ ఎక్కడో చోట నాని అనేవాడు కనపడి ఉంటాడు. ఆర్టిస్ట్గా పూర్తి స్థాయి పాత్రగా మారిపోయే అవకాశం ఎప్పుడూ రాలేదు. ఈ సినిమా చేసినప్పుడు అనిపించలేదు కానీ చూసుకున్నప్పుడు ‘నేను’ అనే ఫీలింగ్ నాకు రాలేదు. అర్జున్ అనే వ్యక్తి కథను చూస్తారు. వాడితోపాటూ ఏడ్చాను, నవ్వాను. రేపు థియేటర్స్లోకి వచ్చినప్పుడు అది ఎంతవరకూ నిజం అన్నది మాత్రం మీరే చెప్పాలి. యాక్టర్గా నాకు లభించిన సంతృప్తి వర్ణించలేనిది. ► అర్జున్ అంటే మీ అబ్బాయి పేరు. కావాలనే సినిమాలో పెట్టారా? ►అవును. సినిమాలో నా పేరు అర్జున్. మా అబ్బాయి పేరు నాని. రివర్స్ చేశాను (నవ్వుతూ). ►ఇంతకుముందు ‘ఎటో వెళ్లిపోయింది మనసు’లో మీ భార్య అంజన ఇంటి పేరు వాడారు. కావాలని మీరు చెబుతుంటారా? ►ఆ సినిమాలో హీరోయిన్ సమంత పేరు నిత్యా. ఆ పాత్రకు ఓ ఇంటిపేరు కావాలని గౌతమ్ మీనన్ అడిగారు. అప్పుడు నేను అంజనతో రిలేషన్లో ఉన్నాను. పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాం. తన ఇంటిపేరు (యలవర్తి)ని హీరోయిన్ ఇంటిపేరుగా సజెస్ట్ చేస్తే, గౌతమ్ బాగుందన్నారు. ఆ తర్వాత ‘మజ్ను’లో ‘రాంబాబు గారి అబ్బాయా మజాకా’ అని ఓ డైలాగ్ చెప్పాను. నిజానికి ఆ సీన్లో ఆ డైలాగ్ లేదు, నేనే కావాలని సరదాగా చెప్పాను. బాగుందని ఉంచేశారు. అది మా నాన్నగారి పేరు. ఏదో సరదాకి ఇలాంటివి చేస్తుంటాను కానీ ఇవే ఉండాలని ఒత్తిడి చేయను. ►ఎంతమంది కొత్త హీరోలు వచ్చినా మీ స్థానం మీదే. అదెలా వీలవుతుంది? ►ఎందుకంటే నేను రేస్లో లేను కాబట్టి. అందరూ పరిగెడుతున్న డైరెక్షన్లో నేను పరిగెడితే నేను రేస్లో ఉన్నట్టు. నా స్థానానికి డేంజర్. అందరూ వెళ్తున్న గమ్యం వైపు నేను వెళ్లడం లేదు. సో.. నన్ను దాటేస్తారు, నన్ను గెలిచేస్తారు అని భయపడను. నాకు డేంజర్ ఉందని అనుకోను. అందరూ సూపర్ స్టార్లు అవుదాం అని వెళ్తున్నారు కానీ నేను వెళ్తున్న మార్గంలో ఎవ్వరూ రావడం లేదని నేను అనుకుంటున్నాను. వాళ్లను డిస్ట్రబ్ చేసి నా దారిలో కూడా వచ్చేలా చేసుకోవడం లేదు (నవ్వుతూ). ►అంటే మీరు సూపర్స్టార్ అవ్వాలనుకోవడం లేదా? ►నేనెప్పుడూ యాక్టర్గానే ఉండాలి అనుకున్నాను. మీరు ఏ పేరుతో అయినా పిలుచుకోండి. న్యాచురల్ స్టార్ అదీ ఇదీ అనుకోవచ్చు. ప్రేమతో పిలుస్తున్నారు అని అనుకుంటాను. ఇందాక యాక్టర్గా బాగా సంతృప్తి చెందాను అని చెప్పాను కదా. దాని ముందు ఏ సూపర్స్టార్ ఫీలింగ్లూ దగ్గరకు రాలేవు. యాక్టర్ అనేవాళ్లకు దాన్ని మించిన సంతృప్తి ఉండదు. అదే ఉంటున్నప్పుడు ఇక దేనికోసం పరిగెత్తాలి. ►గేమ్ ఆడేటప్పుడు పోటీ లేకపోతే కిక్ ఉండదు కదా? ►నేను గేమ్ ఆడటం లేదు. ఒకరి మీద గెలవడానికి పోటీ అయితే అప్పుడు పోటీ కావాలి. నేనెవరి మీదా గెలవాలనుకోవడం లేదు. నాకు పిచ్చిగా నచ్చే ఓ పని చేస్తున్నాను. పొద్దున లేస్తే ఫుడ్ ఫర్ సోల్ అంటాం కదా.. ఆత్మసంతృప్తి కోసం పని చేస్తున్నాను. ఈ ప్రాసెస్ని ఆస్వాదించాలి అనుకుంటున్నాను. చేసిన ప్రతి షాట్ బావుంటే నాకు కిక్ వస్తుంది. అందులో కిక్ వెతుక్కుంటున్నాను కానీ పోటీలోకాదు. ►నటుడిగా సంతృప్తి ఇచ్చిన సినిమా బాగా ఆడలేదనుకోండి.. ఆ ఫ్లాప్ ఎఫెక్ట్ మీ కెరీర్ మీద ఎంత ఉంటుంది? ►బాక్సాఫీస్ నంబర్ల వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఉదాహరణకు ఓ భారీకథ మన దగ్గరకు వచ్చిందనుకోండి. దానికి పెద్ద బడ్జెట్ కావాలి. అంత బడ్జెట్ పెట్టాలంటే నా అంతకుముందు సినిమా బాక్సాఫీస్ నంబర్ బాగుండాలి. అప్పుడు ఆ భారీ కథను అడ్జెస్ట్ కాకుండా తీయొచ్చు. లేకపోతే రాజీపడిపోవాల్సి వస్తుంది. ఇందుకోసం బాక్సాఫీస్ నంబర్ని పట్టించుకోవాలి. డబ్బులు వస్తే బాగా ఆనందపడతాను. మా నిర్మాత, టీమ్ హ్యాపీగా ఉంటారు. వాళ్లంతా హ్యాపీ అయితే నేను హ్యాపీ. ►నాని నిర్మాతల హీరో అంటారు. ఒకవేళ చేసిన నిర్మాతకే మళ్లీ డేట్స్ ఇవ్వకపోతే ‘నానీకి బిల్డప్’ అంటారు. రెంటినీ ఎలా తీసుకుంటారు? ►కరెక్టే. నేను డేట్స్ ఇచ్చినప్పుడు నాని మనోడే అనుకునే చాన్స్ ఎక్కువ. అయితే నాని మనోడే కదా.. సినిమా చేస్తాడు అని ప్రతిసారీ అనుకుంటే కుదరకపోవచ్చు. దానికి చాలా కారణాలు ఉంటాయి. నాకు కథ ముఖ్యం. మంచి కథ కుదిరితేనే సినిమా. రెండు హిట్స్ కొట్టాం అని అదే కాంబినేషన్లో మూడోసారి సినిమా చేసేయాలి అనుకోను. మూడో సినిమా కథ కూడా కుదరాలి. బావుండాలి. ఇలా ఆలోచించడం నటుడిగా నాకు చాలా అవసరం. కెరీర్ స్టార్టింగ్లో మొహమాటానికి కొన్ని చేశాను. ఇప్పుడు నచ్చిందే చేస్తున్నాను. ►ఒకవేళ మీకు బాగా అనిపించని కథ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కదా? ►అది కాదనడంలేదు. అయితే నాకు డౌట్ ఉన్న కథతో సినిమాకి ఓకే చెబితే షూటింగ్ జరిగే నెక్ట్స్ ఆరు నెలలు డౌట్తో పడుకోవాలి, డౌట్తో నిద్రలేవాలి. నమ్మకంగా ఉన్న స్క్రిప్ట్తో చేస్తే ఏదో కొత్త ఉత్సాహంతో పని చేస్తాను. ఎగై్జటింగ్గా నిద్రలేస్తాను. సినిమా రిజల్ట్తో సంబంధం లేదు. డౌట్ ఉన్న సినిమాలు కూడా హిట్ అవుతుంటాయి. నమ్మకంగా ఉన్న సినిమాలు పోతాయి. రిజల్ట్ రెండే రోజులు, అయితే షూటింగ్ ప్రాసెస్ మాత్రం దాదాపు 9 నెలలు. తొమ్మిదినెలలు ఇంపార్టెంటా? రెండు రోజులు ఇంపార్టెంటా? ►ఓకే.. పెళ్లి తర్వాత మీలో వచ్చిన మార్పు? పెళ్లయ్యాక జీవితం నా చేతుల్లో లేదు, నా భార్య చేతుల్లో ఉందని చాలామంది అంటుంటారు... ►జీవితం వాళ్ల చేతుల్లోకి వెళ్లదు, మనమే పెడతాం. మనమే సరెండర్ అవుతాం. వాళ్లు లాక్కోవడం ఉండదు. అందరూ ఎలా మాట్లాడతారంటే నాకు స్వాతంత్య్రం లేదు అని జోకులేస్తారు. కానీ స్వేచ్ఛ కోల్పోయే విషయంలో ఒక్క శాతం కూడా వాళ్లు కారణం అవ్వరు. పని అయిపోయిందా? ఇంటికొస్తున్నావా? అని వాళ్లు ఫోన్ చేసినా చేయకపోయినా మనకే వెళ్లాలనిపిస్తుంది. అది రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాం. నిజం చెప్పాలంటే పెళ్లి పెద్దగా ఏం మార్చలేదు నన్ను. పిల్లోడు మార్చాడు. చాలా మార్చాడు. పెళ్లి ఓవర్ రేటెడ్. కంట్రోల్ అదీ ఇదీ అంటాం కానీ. కంట్రోల్లో ఉండేది మాత్రం పిల్లల తర్వాతే. పెళ్లయ్యాక మూడేళ్లకు మా జున్ను పుట్టాడు. వీడొచ్చాక లైఫ్ని చూసే కోణమే మారిపోయింది. పొరపాటున ఏపని చేసినా ఒక ఎగ్జాంపుల్ అవుతాం. పొరపాటున పేపర్ పక్కన విసిరేసినా, వాడూ అదే నేర్చుకుంటాడని భయం. డస్ట్బిన్లో వేస్తున్నాను. నోట్లోంచి వచ్చే మాటలన్నీ మంచివే అయ్యుండాలి. ఆ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లోడికి రాంగ్ ఎగ్జాంపుల్ ఇవ్వకూడదు. ప్రపంచం దృష్టిలో హీరో అవడంకన్నా కొడుకు దృష్టిలో హీరో అవడానికి మించింది మరోటి లేదనుకుంటాను. సినిమా హీరో కాదు మా నాన్న రియల్ లైఫ్ హీరో అని పిల్లలు అనుకుంటే అది ప్రతి తండ్రికి పెద్ద సంతృప్తి. ‘జెర్సీ’ సినిమా ఆ పాయింట్ మాట్లాడుతుంది. ► మీ జున్నూ మిమ్మల్ని ఏమని పిలుస్తాడు? ►నాన్న అంటాడు. ఇప్పుడు అదొక్క మాటే వచ్చు. పొద్దున్నుంచి నాన్న నాన్న అంటాడు. అమ్మ కూడా రాదు. నాన్నకూచి. నేను షూటింగ్లో ఉండి వీడియో కాల్ చేస్తే దిండు చూపిస్తాడు. నేను పక్కనే ఉండాలని అర్థం అన్నమాట. మేమిద్దరం ఉంటే అల్లరి మామూలుగా ఉండదు. మామూలుగా కొందరు పిల్లలు పదిమంది వస్తే ముడుచుకుపోతారు. జున్నుగాడు మాత్రం ఎంతమంది వస్తే అంత యాక్టివ్ అవుతాడు. ఎంటర్టైనర్. ఎవరు పిలిస్తే వాళ్ల దగ్గరకు వెళ్తాడు. నేనైనా డబ్బులు తీసుకొని ఎంటర్టైన్ చేస్తానేమో, వాడు ఫ్రీగా ఎంటర్టైన్ చేస్తాడు (నవ్వుతూ). ► 24 గంటలే ఎందుకు.. ఇంకొన్ని గంటలుంటే బావుండే అని ఎప్పుడైనా అనుకున్నారా? ►అలా ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఒకడినే ఉన్నానే నాలా ఇంకొకడుంటే బావుండే అనుకుంటాను. ఒక్కసారి కాదు చాలాసార్లు అనిపించింది. ఒకచోట ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, ఇంకోచోట ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. రెండూ మిస్సవ్వలేం. ఫ్యామిలీ అందరూ కలసి ఏదో స్పెషల్ ప్లాన్ ఫిక్స్ చేసుకొని ఉంటాం. వర్క్ కూడా మిస్ అవలేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు నాలోనే ఇద్దరుంటే నువ్వు ఈ పని చూసుకో, నేను ఇంకో పని చూసుకుంటాను అని సర్దుకోవచ్చు కదా. ఇలా ఊహించుకుని నవ్వుకుంటాను. ►ఒకప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశారు కదా... యాక్టింగ్ టు డైరెక్షన్ ఎప్పుడు? ►డైరెక్షన్ ఏమో కానీ ప్రొడక్షన్ సైడ్ ఉంటాను. ఓన్లీ కొత్త రకం సినిమాలే నిర్మించాలనుకుంటున్నాను. ‘అ!’ తర్వాత చాలా కథలు విన్నాను. సూపర్ హిట్ ప్రాజెక్ట్స్. నిర్మిస్తే డబ్బులొచ్చేస్తాయి. కానీ చేయలేదు. ఎందుకంటే నా బ్యానర్ మీద యూనిక్ సినిమాలు మాత్రమే చేయాలని. ► ‘అ!’ కమర్షియల్గా వర్కౌట్ అయిందా? ►అయింది. అలాగే పాత్ బ్రేకింగ్గా నిలిచింది. వాల్పోస్టర్ సినిమా నుంచి ఏ సినిమా వచ్చినా అలా యూనిక్గా ఉండాలన్నది నా ఆలోచన. ► 24 సినిమాల అనుభవం ఉంది మీకిప్పుడు. మీ పదేళ్ల కెరీర్ని ఎప్పటికప్పుడు యాక్టర్గా మనం ఏంటి అని సమీక్షించుకుంటారా? ►సమీక్షించుకోవడం అన్నట్టుగా కాదు కాని పాతజ్ఞాపకాల్ని విజిట్ చేస్తుంటాను. పాత సినిమాలు చూసినప్పుడు ‘అరే.. అప్పుడు మన పర్ఫార్మెన్స్ ఏంటి, ఇలా ఉంది?’ అనే యాంగిల్లో మాత్రమే ఆలోచిస్తా. నటుడిగా ఇంత పరణితి చెందా అది ఇదీ అని ఆలోచించుకోను. ► ఫైనల్లీ.. యాక్టర్గా ఇన్ని సినిమాలు చేయాలి అని టార్గెట్ ఏమైనా? ►నెక్స్ సినిమా గురించే ఆలోచించను. ఇంకా యాక్టర్గా ఎన్ని చేస్తాను అంటే ఇందాక ‘నచ్చిన కథలే చేస్తాను’ అని మాట్లాడిన ఐడియాలజీకి విరుద్ధం అయిపోతుంది. – డి.జి.భవాని -
నాని సినిమాలో సెన్సేషనల్ బ్యూటీ..!
ఇటీవల సక్సెస్ విషయంలో కాస్త తడబడుతున్న యంగ్ హీరో నాని వరుసగా రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో నటిస్తున్న నాని, తరువాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. తాజాగా నాని, విక్రమ్ల సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ టాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. ఇటీవల ఒక్క కంటి సైగతో సోషల్ మీడియాను ఊపేసిన బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించనుందట. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. -
చాన్స్ కొట్టేశారా?
తెలుగులో అనుకున్నంత స్పీడ్గా సినిమాలు ఒప్పుకోకపోయినా తమిళంలో మంచి ఫామ్తో దూసుకెళ్తున్నారు మేఘా ఆకాశ్. ఇటీవలే రజనీకాంత్ ‘పేట’ సినిమాలో చిన్న రోల్ కూడా చేశారు. తాజాగా తెలుగులో నాని సరసన హీరోయిన్గా నటించే చాన్స్ కొట్టేశారని టాక్. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్, నాని కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారు. పీసీ శ్రీరామ్ కెమెరామేన్. ఈ సినిమాలో హీరోయిన్గా మేఘా ఆకాశ్ పేరుని ఫిక్స్ చేశారట. సినిమా అనౌన్స్మెంట్ రోజు ‘నాని... మరో ఐదుగురు’ అంటూ పేర్కొన్నారు చిత్రబృందం. అంటే ఈ సినిమాలో ఐదుగురు భామలు ఉండే ఛాన్స్ ఉందా? వేచి చూడాలి. ‘జెర్సీ’ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూట్లో జాయిన్ అవుతారట నాని. -
నాని స్క్రిప్ట్ రాస్తున్నాడా...?
నేచురల్ స్టార్ నాని హీరోగానే కాక ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. అ! సినిమాతో అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న నాని ప్రస్తుతానికి హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా నాని స్క్రిప్ట్ రైటర్ అవతారం ఎత్తినట్టుగా వార్తలు వినిపించాయి. త్వరలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు నాని. ఈ సినిమాకు విక్రమ్తో కలిసి నాని రచయితగా పనిచేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై దర్శకుడు విక్రమ్కుమార్ క్లారిటీ ఇచ్చారు. నాని స్క్రిప్ట్ వర్క్ లో ఇన్వాల్ కావటం లేదని చెప్పారు. ప్రస్తుతం నాని జెర్సీ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. నాని క్రికెటర్గా నటిస్తున్న ఈసినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతోంది. -
‘అమ్మాయిలు... ఇది మీ కోసమే!’
ప్రస్తుతం జెర్సీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న యంగ్ హీరో నాని తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టుగానే విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తన 24వ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు నాని. ఇష్క్, మనం, 24, హలో లాంటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన విక్రమ్ కుమార్ లాంగ్ గ్యాప్ తరువాత మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. చాలా రోజులుగా విక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా ఉంటుందన్న టాక్ వినిపించింది. అయితే బన్నీ , త్రివిక్రమ్తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్చూపిస్తుండటంతో విక్రమ్, నానితో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ను విభిన్నంగా డిజైన్ చేశారు. ఓ పిట్టగోడ మీద నాని, విక్రమ్లో టీ తాగుతున్న చర్చించుకుంటున్న ఫొటోను ‘నేను, విక్రమ్ ఇంకా ఆ మిగతా ఐదుగురు వచ్చే సంవత్సరంలో.. అమ్మాయిలు ఇది మీ కోసమే’ అనే కామెంట్తో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 19న ప్రారంభ కానుంది. #Nani24 నేను, విక్రమ్ ఇంకా ఆ మిగతా ఐదుగురు. వచ్చే సంవత్సరం లో :)) Girls !! This ones for you 🤗@MythriOfficial @Vikram_K_Kumar and the legendary @pcsreeram sir pic.twitter.com/l3lj5II2N2 — Nani (@NameisNani) 2 December 2018 -
విక్రమ్.. నానికే ఫిక్స్..!
ఇష్క్, మనం, 24, హలో లాంటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన విక్రమ్ కుమార్ లాంగ్ గ్యాప్ తరువాత మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. చాలా రోజులుగా విక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా ఉంటుందన్న టాక్ వినిపించింది. అయితే బన్నీ , త్రివిక్రమ్తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్చూపిస్తుండటంతో విక్రమ్ మరో హీరోతో సినిమాకు రెడీ అవుతున్నాడు. డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించిన నేచురల్ స్టార్ నాని ఇటీవల కాస్త తడబడుతున్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో నటిస్తున్న నాని తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థనిర్మించనుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
బన్నీ ఇంకా ఫిక్స్ అవ్వలేదా..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా తరువాత ఇంత వరకు మరో సినిమా అంగీకరించలేదు. ఆ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించకపోవటంతో తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బన్నీ. ఇప్పటికే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అల్లు అర్జున్ టీం ఎలాంటి ప్రకటనా చేయలేదు. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. యువ దర్శకులు మారుతి, పరుశురాంలు కూడా బన్నీ కోసం కథ రెడీ చేస్తున్నారట. అంటే విక్రమ్ కథను ఇంకా బన్నీ ఫైనల్ చేయలేదా..? లేక విక్రమ్ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా బన్నీ లైన్లో పెడుతున్నాడా..? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలంటే మాత్రం బన్నీ క్లారిటీ ఇవ్వాల్సిందే. -
మకాం మార్చిన బన్నీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. ఇంత వరుకు నెక్ట్స్ ప్రాజెక్ట్ ప్రకటించకపోయినా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుందున్న టాక్ వినిపిస్తోంది. తాజాగా బన్నీ కొత్త ఆఫీస్లోకి వెళ్లారట. ఇన్నాళ్లు గీతా ఆర్ట్స్ ఆఫీస్నే తన ఆఫీస్గా వినియోగించుకున్న బన్నీ తాజాగా జూబ్లీ హిల్స్లో కొత్త ఆఫీస్ను ప్రారంభించారు. ఇక మీదట తన సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ డిస్కషన్స్, ఇతర పనులు ఈ ఆఫీస్నుంచే చేయనున్నాడట బన్నీ. బన్నీ కొత్త సినిమాకు సంబంధించిన పనులు కూడా కొత్త ఆఫీస్ నుంచే జరగనున్నాయి. -
బన్నీకి జోడి సమంత..!
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో నిరాశపరిచిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఆ సినిమా తరువాత గ్యాప్ తీసుకుంటున్నాడు. నా పేరు సూర్య రిలీజ్ అయి 4 నెలలు దాటుతున్న బన్నీ కొత్త సినిమాను ఇంకా మొదలు పెట్టలేదు. చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినా ఇంకా ఎవరికీ బన్నీ ఓకె చెప్పలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించేందుకు బన్నీ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ఇప్పటికే విక్రమ్ కథకు బన్నీ ఓకె చెప్పాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు నటీనటుల ఎంపిక కూడా జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో బన్నీకి జోడిగా సమంతను తీసుకునే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు విక్రమ్ కుమార్. గతంలో బన్నీకి జోడిగా సమంత నటించిన సన్నాఫ్ సత్యమూర్తి మంచి విజయం సాధించింది. విక్రమ్ కాంబినేషన్లో సమంత నటించిన 24 కూడా మంచి విజయం సాధించింది. దీంతో సెంటిమెంట్ పరంగా కూడా సమంత అయితే కలిసొస్తుందని భావిస్తున్నారట చిత్రయూనిట్. అయితే ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
కాన్సెప్ట్ అదేనా?
‘మనం’ సినిమా కథ చెప్పి, ఒప్పించడం కష్టం. పోనీ ‘24’ సినిమా కథ? మళ్లీ అదే పరిస్థితి. ఇలా.. చెప్పుకోవడానికి చాలా క్లిష్టంగా చూడటానికి చాలా క్లియర్గా ఉంటాయి దర్శకుడు విక్రమ్కుమార్ సినిమా కథలు. ఈసారి కూడా ఆడియన్స్కు ఇలాంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియా చెప్పడానికే రెడీ అవుతున్నారట విక్రమ్ కుమార్. అల్లు అర్జున్ హీరోగా విక్రమ్కుమార్ ఓ సినిమా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్గా షికారు చేస్తున్న పుకారు ఏంటంటే ఈ సినిమా కథ పునర్జన్మల నేప«థ్యంలో సాగనుందని. ‘నా పేరు సూర్య’ సినిమా తర్వాత వెంటనే సినిమా స్టార్ట్ చేయకుండా కొంచెం టైమ్ తీసుకున్నారు అల్లు అర్జున్. విక్రమ్కుమార్ చెప్పిన ఈ పాయింట్ బన్నీని చాలా ఎగై్జట్ చేసిందని సమాచారం. ఈ ఏడాది ఆఖర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మించనున్నారట. -
వరల్డ్ స్టంట్ అవార్డ్స్కు హలో
‘టారస్ వరల్డ్ స్టంట్ అవార్డ్స్’ పేరుతో ప్రతి సంవత్సరం వరల్డ్ మూవీస్లోని బెస్ట్ స్టంట్ పెర్ఫార్మర్స్కు అవార్డ్స్ ప్రకటిస్తారు. ఈ ఉత్సవం లాస్ ఏంజెల్స్లో జరుగుతుంది. విశేషం ఏంటంటే.. ‘బెస్ట్ యాక్షన్ ఇన్ ఏ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీ’లో ‘హలో’ సినిమా నామినేట్ అయింది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు విక్రమ్ కె. కుమార్ మాట్లాడుతూ – ‘‘హలో’ సినిమా ‘టారస్ వరల్డ్ అవార్డ్స్ క్యాటగిరీలో నామినేట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నాగార్జున సార్, యాక్షన్ డైరెక్టర్ బాబ్ బ్రౌన్, కెమెరామేన్ పీయస్ వినోద్, ఎడిటర్ ప్రవీణ్ పూడి, సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్లకు థ్యాంక్స్. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ బాగా రావడానికి మీరంతా కారణం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. అఖిల్.. నీ డెడికేషన్, హార్డ్ వర్క్, నీ యాటీట్యూడ్ నిన్ను కొత్త హైట్స్కు తీసుకువెళ్తాయి. ఎప్పుడూ ఇలానే ఉండు’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. నామినేషన్ అయితే సంపాదించుకుంది కానీ ‘హలో’కి అవార్డు దక్కలేదు. చైనీస్ మూవీ ‘ఉల్ఫ్ వారియర్ 2’కి అవార్డు దక్కింది. ఏది ఏమైనా ‘ప్రపంచ సినిమాలు’ పోటీ పడే అవార్డ్స్లో ఓ ఇండియన్ మూవీ నామినేషన్ వరకూ వెళ్లడం గొప్ప అని సినిమా లవర్స్ అంటున్నారు. -
ప్రయోగానికి రెడీ అవుతున్న బన్నీ
ఈ శుక్రవారం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ సరికొత్త లుక్లో దర్శనమిస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాతో మరో ఘన విజయం ఖాయం అన్న నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమా తరువాత బన్నీ చేయబోయే సినిమాపై చర్చ మొదలైంది. వరుసగా కమర్షియల్ ఎంటర్టైనర్లు చేస్తూ వస్తున్న అల్లు అర్జున్ తన నెక్ట్స్ సినిమా కాస్త డిఫరెంట్గా చేసే ఆలోచనలో ఉన్నాడట. లింగుస్వామి దర్శకత్వంలో గతంలో ఓ సినిమా ప్రారంభమైనా ఆ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ కనిపించటం లేదు. దీంతో ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట బన్నీ. ఈ సినిమాతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. మరి వీటిలో బన్నీ ఏ ప్రాజెక్ట్ను ముందుగా స్టార్ట్ చేస్తాడో చూడాలి. -
వెనక్కి తగ్గిన నాని
సహజమైన నటనతో మూడేళ్లపాటు వరుసగా విజయాలు అందుకున్న నానిపై ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తదనం లేకపోగా.. పైగా కమర్షియల్ రూట్లో వెళ్తున్నాడంటూ క్రిటిక్స్ ఏకేస్తున్నారు. వరుస విజయాలకు కృష్ణార్జున యుద్ధం బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలో తన తర్వాతి చిత్రం విషయంలో నాని అలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని.. నాగార్జునతో కలిసి శ్రీరామ్ ఆదిత్యా డైరెక్షన్లో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రయోగాత్మక చిత్రం అయినప్పటికీ.. కథ నచ్చటంతో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేయాలన్న నాని నిర్ణయించుకున్నాడంట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రయోగాల జోలికి వెళ్తే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందే తప్ప.. పెద్దగా పేరు రాదనే అంచనాకు నాని వచ్చినట్లు సమాచారం. అవసరాల శ్రీనివాస్, హను రాఘవపూడి ఇద్దరితో స్టోరీ డిస్కషన్లు అవుతుండటంతో.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అఖిల్ వంద గంటలు కష్టపడ్డాడు..!
హలో సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న అక్కినేని యంగ్ హీరో అఖిల్, ఆ సక్సెస్ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమాతో హీరోగానే కాదు గాయకుడిగానూ ప్రూవ్ చేసుకున్నాడు అఖిల్. ఈ సినిమాలో ‘ఏవేవో కలలు కన్నా’ అంటూ సాగే రొమాంటిక్ మెలోడిని ఆలపించాడు అఖిల్. ఈ పాటను పలు వేదికల మీద కూడా పర్ఫామ్ చేసిన అఖిల్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆ పాటకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు అఖిల్. తనను గాయకుడిగా మార్చిన క్రెడిట్ సంగీత దర్శకుడు అనూప్ రెబెన్స్ దే అన్న అఖిల్, తామిద్దరం ఆ పాట కోసం వంద గంటలకు పైగా శ్రమించినట్టు వెల్లడించాడు. అనూప్ తనకు రెగ్యులర్ సింగర్లా పాట పాడేందుకు కావాల్సిన మెలకువలు నేర్చించాడని తెలిపాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హలో సినిమాతో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. -
హలో.. అక్కినేని సర్ప్రైజ్ ఇదే..!
త్వరలో ‘హలో’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న అక్కినేని వారసుడు అఖిల్, తన రెండో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలెట్టేశాడు. మనం ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ ‘హలో’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణీ హీరోయిన్గా పరిచయం అవుతోంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ను నవంబర్ 16న రిలీజ్ చేయనున్నారు. టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ఓ ఆసక్తికర పోస్టర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు. And November 16th it is! The teaser is headed your way and we can’t be more thrilled. No looking back. #HelloTeaserOnNov16 #HelloOnDec22 pic.twitter.com/jf1dW3kC0S — Akhil Akkineni (@AkhilAkkineni8) 14 November 2017 -
'హలో' తాజా అప్ డేట్
తొలి సినిమాతో తీవ్రంగా నిరాశపరిచిన అక్కినేని వారసుడు అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నాగార్జున దగ్గరుండి సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను చక్కబెడుతున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కు నాగచైతన్య, సమంత పెళ్లి పనులతో బ్రేక్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తయిపోవటంతో హాలో టీం తిరిగి షూటింగ్ మొదలు పెట్టేసింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్ ద్వారా కన్ఫామ్ చేసిన హీరో అఖిల్, హలో ఆఖరి షెడ్యూల్ మొదలైంది. త్వరలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించనున్నాం డిసెంబర్ 22న సినిమా రిలీజ్ అవుతుందంటూ తెలిపారు. అఖిల్ సరసన దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. మనం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. Started the last and final schedule of #HELLO! December 22nd here we come. Lots of excitement soon :) #Hello!ondec22nd — Akhil Akkineni (@AkhilAkkineni8) 21 October 2017 -
అఖిల్ క్లారిటీ ఇచ్చేది ఎప్పుడంటే..!
తొలి సినిమా అఖిల్తో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన అక్కినేని నట వారసుడు అఖిల్, రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సారి తన కొడుకుకి సూపర్ హిట్ ఇస్తానని చెప్పి మరి నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. చాలా రోజులుగా సినిమా షూటింగ్ జరుగుతున్నా సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఏవీ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు చిత్రయూనిట్. ఇంత వరకు హీరోయిన్ ఎవరన్న విషయంలో కూడా క్లారిటీ ఇవ్వలేదు. జున్ను, ఎక్కడ ఎక్కడ ఉండో తారక, రంగుల రాట్నం లాంటి టైటిల్స్ వినిపించినా.. యూనిట్ సభ్యుల మాత్రం దేన్నీ కన్ఫామ్ చేయలేదు. దీంతో సినిమా మీద క్లారిటీ ఎప్పుడిస్తారో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే అభిమానుల కోరిక తీర్చేందుకు అక్కినేని హీరోలు రెడీ అవుతున్నారు. కింగ్ నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 29న అఖిల్ రెండవ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కానుందట. అదే రోజు సినిమా టైటిల్ పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, ఈ సినిమాను డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టుగా గతంలోనే ప్రకటించాడు నాగ్. -
అఖిల్ చేతిపై టాటూ.. సినిమా కోసమేనా..!
తొలి సినిమాతో నిరాశపరిచన అఖిల్, ప్రస్తుతం తన రెండో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. తొలి ప్రయత్నంలో జరిగిన తప్పులు రిపీట్ కావద్దన్న ఉద్దేశంతో చాలా కేర్ తీసుకొని రెండో సినిమాను పూర్తి చేస్తున్నాడు. ఇప్పటి వరకు సినిమా కథా కథనాలు ఎలా ఉండబోతున్నాయన్న విషయం బయటకు రానివ్వలేదు. అంతేకాదు హీరోయిన్ ఎవరన్న విషయం కూడా వెల్లడించలేదు. అయితే తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అఖిల్ చేతి మీద ఇంట్రస్టింగ్ టాటూ కనిపించింది. బాణం దాని ముందు 8 అనే అంకె తో ఉన్న ఈ టాటూ తన కొత్త సినిమా కోసమేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అఖిల్ రెండో సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ కావటం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. విక్రమ్కు గుర్తింపు తీసుకువచ్చిన 13, 24 సినిమాలు నెంబర్ చుట్టూనే తిరుగుతాయి. అదే బాటలో అఖిల్ రెండో సినిమా కూడా 8 అనే అంకె చుట్టూ నడుస్తుందా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాపై మరింత సమాచారం త్వరలోనే వెల్లడించనున్నారు. -
హీరో అఖిలే లీక్ చేశాడు..?
దుబాయ్లోని అబుదాబిలో జరుగుతున్న సైమా వేడుకల్లో యంగ్ హీరో అఖిల్ తొలిసారిగా పాట పాడిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు నటుడిగానే తెలిసిన అఖిల్లోని సింగింగ్ టాలెంట్ చూసి ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్ అయ్యారు. అయితే తాజాగా ఈ పర్ఫామెన్స్కు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ వార్త టాలీవుడ్ సర్కిల్స్లో సందడి చేస్తుంది. సైమా వేడుకల్లో అఖిల్ పాడిన పాట తన కొత్త సినిమాలోనిదట. ఏవేవొ కలలు కన్నా అనే పల్లవితో సాగిన మెలోడియస్ సాంగ్, ప్రేక్షకులను కట్టి పడేసింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం అనూప్ ట్యూన్ చేసిన పాటనే అఖిల్ సైమా స్టేజ్ మీద పర్ఫామ్ చేశాడట. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండగా అఖిల్ పర్ఫామెన్స్ తరువాత ఆ అంచనాలు తారా స్థాయికి చేరాయి. -
ఆ వదంతులు నమ్మొద్దు: నాగ్
హైదరాబాద్: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ రెండో సినిమా ప్రాజెక్ట్ ఇటీవల మొదలైంది. తొలి సినిమా 'అఖిల్' నిరాశపరచడంతో రెండో మూవీ ప్రాజెక్టును నాగ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నాగ్కు 'మనం' లాంటి విజయాన్ని అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ తన రెండో మూవీ చేస్తున్నాడు. అయితే ఈ మూవీకి టాలీవుడ్ హీరోయిన్లను సంప్రదించకుండా.. బాలీవుడ్ భామను తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో అఖిల్కు జోడీగా శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ నటిస్తోందని వచ్చిన వదంతులను నాగ్ కొట్టిపారేశారు. ఖుషీకి భారీ పారితోషికం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వచ్చిన ఓ కథనాన్ని నాగ్ రీట్వీట్ చేస్తూ.. ఇది నిజం కాదనిస్పష్టం చేశారు. మరోవైపు ఈ తన కొత్త ప్రాజెక్టు కోసం అఖిల్ కసరత్తులు చేస్తున్నాడు. విక్రమ్ సినిమా ఫిజికల్గా చాలా డిమాండ్ చేస్తోందని, కొత్త ట్రైనర్ వర్కవుట్ షెడ్యూల్ ఇచ్చారు. డైట్ కూడా ప్లాన్ చేశారని స్వయంగా అఖిల్ ఇటీవల ఓ అప్డేట్ ఇచ్చాడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ ప్రాజెక్టుకు మనం మూవీకి పనిచేసిన టెక్నీషియన్లు ఈ భాగస్వామ్యం కానున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్తో పాటు మనం ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. -
అఖిల్ సినిమాలో యంగ్ విలన్
తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నట వారసుడు అఖిల్, రెండో సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రెండో సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాను కింగ్ నాగార్జున అనపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై స్వయంగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇష్క్, 24 సినిమాలో విలన్ గా నటించిన టాలీవుడ్ యంగ్ యాక్టర్ అజయ్, అఖిల్ సినిమాలోనూ విలన్గా కనిపించనున్నాడు. ఇప్పటికే అఖిల్ సినిమా యూనిట్తో అజయ్ కూడా చేరిపోయాడు. అయితే ఈ సినిమాలో అజయ్, మెయిన్ విలన్గా నటిస్తున్నాడా..? లేక మరో విలన్ కూడా ఉంటాడా..? అన్న విషయం తెలియాల్సి ఉంది. -
అఖిల్ అదే తప్పు చేస్తున్నాడా..?
అక్కినేని నటవారసుడిగా భారీ అంచనాల మధ్య వెండితెరకు పరిచయం అయిన హీరో అఖిల్. తొలి సినిమాతోనే మాస్ హీరో ఇమేజ్ కోసం ప్రయత్నించిన అఖిల్ అభిమానులను నిరాశపరిచాడు. చాక్లెట్ బాయ్ల కనిపించే అక్కినేని అందగాడు, భారీ యాక్షన్ సీన్లు, చేజ్లు చేయటంతో అభిమానులు కనెక్ట్ కాలేకపోయారు. దీంతో అఖిల్ తొలి ప్రయత్నం డిజాస్టర్గా మిగిలిపోయింది. అయితే రెండో సినిమా విషయంలో కూడా అదే తప్పు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ తన రెండో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన అఖిల్, భారీ యాక్షన్ సీన్స్కు రెడీ అవుతున్నాడట. అందుకోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లను తీసుకువస్తున్నారు. ఈ సినిమాతో అయినా అఖిల్, తండ్రి బాటలో మన్మథుడి ఇమేజ్ కంటిన్యూ చేస్తాడనుకుంటే మరోసారి యాక్షన్ హీరో అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ ప్రయత్నం ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా అఖిల్ కెరీర్కు శివ లాంటి బ్రేక్ ఇస్తుందని యూనిట్ గట్టిగా నమ్ముతోంది. -
అఖిల్ కొత్త సినిమా ప్రారంభం
-
నాగ్ డైరెక్టర్తో అఖిల్ మూవీ ప్రారంభం
హైదరాబాద్: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ రెండో సినిమా ప్రాజెక్ట్ మొదలైంది. తొలి సినిమా అఖిల్ నిరాశపరచడంతో కాస్త గ్యాప్ తీసుకున్న అఖిల్ రెండో మూవీ పట్టాలెక్కనుంది. నాగార్జునకు 'మనం' లాంటి సక్సెస్ అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనంది. కొత్త ప్రాజెక్టును నాగార్జున, అమల ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు నాగార్జున. 'ఓపికకు తెరపడింది. అఖిల్ మూవీ ప్రారంభమైంది. పూజ చేసి ప్రాజెక్టు మొదలుపెట్టాం' అని ట్వీట్లో నాగ్ పేర్కొన్నారు. అఖిల్ మూవీ సక్సెస్ కావాలని నాగార్జున ఆకాంక్షిస్తూ.. తనయుడు అఖిల్ను దీవించారు. అఖిల్ కెరీర్కు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్గా, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి, మనం మూవీకి పనిచేసిన టెక్నీషియన్లు ఈ మూవీలో భాగస్వామ్యం కానున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్తో పాటు మనం ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. Patience always pays off!!puja done -
అఖిల్ మూవీపై మరో ట్విస్ట్
అఖిల్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన క్యూట్ బాయ్ అఖిల్, తొలి సినిమాతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. డెబ్యూ సినిమాతోనే మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించి మెప్పించలేకపోయాడు. దీంతో రెండు సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తొలి చిత్రాన్ని అఖిల్ ఇష్టానికి వదిలేసిన నాగార్జున, రెండో సినిమా విషయంలో మాత్రం దగ్గరుండి అన్నీ చక్కబెడుతున్నాడు. చాలా మంది దర్శకుల పేర్లను పరిశీలించి ఫైనల్గా మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమాను ఫైనల్ చేశాడు. చాలా రోజులు క్రితమే విక్రమ్ దర్శకత్వంలో అఖిల్ సినిమా అంటూ ఎనౌన్స్మెంట్ వచ్చినా.. ఇంత వరకు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. త్వరలోనే అఖిల్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందన్న వార్తలు వినిపిస్తున్నా అది ఎప్పుడన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. అయితే తాజాగా అఖిల్ రెండో సినిమాపై ఆసక్తికరమైన వార్త ఒకటి వినిపిస్తోంది. దర్శకుడు విక్రమ్ ముందుగా అనుకున్న కథను పక్కన పెట్టేసి, ఇప్పుడు మరో కథను రెడీ చేసే పనిలో ఉన్నాడట. ముందుగా అనుకున్న లైన్ సెట్ కాకపోవటంతో ఇప్పుడు మరో కథను పక్కాగా ప్రీపేర్ చేస్తున్నారట. అందుకే జనవరిలోనే ప్రారంభం కావల్సిన సినిమాను ఫిబ్రవరికి వాయిదా వేశారన్న టాక్ వినిపిస్తోంది. -
అఖిల్ కోసం ఆస్కార్ విజేత
అక్కినేని నటవారసుడు అఖిల్ రెండో సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తున్నారు అక్కినేని ఫ్యామిలి. తొలి సినిమా నిరాశపరచటంతో రెండో సినిమాతో ఎలాగైనా సక్సెస్ సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు అఖిల్. అందుకు తగ్గట్టుగా సినిమా కథా కథనాలతో పాటు నటీనటులు సాంకేతిక నిపుణుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు ను కీలక పాత్ర కోసం సంప్రదిస్తున్నారన్న వార్త వినిపిస్తుంది. ఇప్పుడు సంగీత దర్శకుడిగా ఓ స్టార్ మ్యూజిషియన్ తీసుకోవాలని భావిస్తున్నారట. అఖిల్ రెండో సినిమాను విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ నెలలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. జనవరిలో రెగ్యులర్ షూట్ మొదలవుతోంది. ప్రస్తుతం నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది. అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. నాగచైతన్య హీరోగా తెరకెక్కి, రెహమాన్ సంగీతం అందించిన ఏం మాయ చేసావే, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. అదే సెంటిమెంట్ తో అఖిల్ రెండో సినిమాకు కూడా రెహమాన్ ప్లస్ అవుతాడని భావిస్తున్నారు. మరి రెహమాన్ మ్యూజిక్ అఖిల్ కు హిట్ ఇస్తుందేమో చూడాలి. -
డిసెంబర్ తొలి వారంలో అఖిల్ సినిమా
తొలి సినిమా అఖిల్తో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన అక్కినేని నట వారసుడు, తన నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నాడు. తొలి సినిమా నిరాశపరచటంతో రెండో సినిమా విషయంలో నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం తీసుకున్నాడు ఈ యంగ్ హీరో. స్టార్ డైరెక్టర్ల నుంచి కుర్ర దర్శకుల వరకు అందరినీ ట్రై చేసి ఫైనల్ గా మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఇప్పటికే ఈ సినిమా ఎనౌన్స్ చేసి చాలా రోజులవుతున్నా ఇంత వరకు పట్టాలెక్కలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ తొలి వారంలో అఖిల్ రెండో సినిమాను లాంఛనంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఆ తరువాత అఖిల్ నిశ్చితార్థ కార్యక్రమాలు పూర్తి చేసి జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంబించాలని భావిస్తున్నారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే అఖిల్ వివాహం కన్నా ముందే రెండో సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అఖిల్ కొత్త సినిమా.. కొత్త ఏడాదిలోనే..
అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ రెండో సినిమా కోసం అభిమానులు మరికొద్ది రోజుల పాటు వెయిట్ చేయాల్సిందేనట. తొలి సినిమా అఖిల్తో నిరాశపరిచిన ఈ యంగ్ హీరో రెండో ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. స్టార్ డైరెక్టర్ల నుంచి ఎన్నో యంగ్ డైరెక్టర్ వరకు చాలా మందిని సంప్రదించిన తరువాత ఫైనల్గా మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమాను ఫైనల్ చేశాడు. కింగ్ నాగార్జున కూడా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ సినిమా అంటూ అఫీషియల్ గా ప్రకటించినా.. ఈ సినిమా సెట్స్ మీదకు వెల్లడానికి మాత్రం మరింత సమయం పట్టనుందట. ప్రస్తుతం కథకు తుదిమెరుగులు దిద్దుతున్న విక్రమ్, మరో మూడు నెలల పాటు స్క్రీప్ట్ మీదే వర్క్ చేయనున్నాడు. దీంతో అఖిల్ సినిమా ఈ ఏడాదిలో మొదలయ్యే అవకాశం కనిపించటం లేదు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని 2017 జనవరిలో సినిమాను ప్రారంబించాలని ప్లాన్ చేస్తున్నారు అక్కినేని టీం. -
అఖిల్, హను సినిమా ఆగిపోలేదా..?
తొలి సినిమాతో నిరాశపరిచిన స్టార్ వారసుడు అక్కినేని అఖిల్, రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే చాలా కథలు విన్న అఖిల్, ఒకటి, రెండు సినిమాలను దాదాపు ఫైనల్ చేసిన తరువాత పక్కన పెట్టేశాడు. హను రాఘవపూడి సినిమాను అధికారికంగా ప్రకటించి కూడా పక్కన పెట్టేశాడు. ఇటీవల అఖిల్ నెక్ట్స్ సినిమా మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఉంటుందంటూ నాగార్జున ప్రకటించాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన వార్త అక్కినేని అభిమానులను ఖుషి చేస్తోంది. ఆగిపోయిందనుకున్న అఖిల్, హను రాఘవపూడి ప్రాజెక్ట్ కూడా త్వరలోనే సెట్స్ మీదకు రానుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి అఖిల్, విక్రమ్ కుమార్తో, హను, నితిన్తో సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ప్రారంభం కానుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. -
నవంబర్లో అఖిల్ రీ లాంచ్..?
అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని వారసుడు అఖిల్ తొలి సినిమాతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. భారీ హీరోయిజం, మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యంగ్ హీరోను ప్రేక్షకులు ఆదరించలేదు. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న అక్కినేని అందగాడు, ఇప్పుడు తన రీ లాంచ్కు భారీ ప్రణాళికలు వేస్తున్నాడట. అఖిల్ తొలి సినిమా విషయంలో పెద్దగా కలుగజేసుకోని నాగార్జున, రెండో సినిమాను మాత్రం అంతా తానై నడిపించాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ నెక్ట్స్ సినిమా ఉంటుందని ప్రకటించిన అక్కినేని కుటుంబం, ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భావిస్తుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను నవంబర్లో ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. -
ఘనంగా విక్రమ్కుమార్ వివాహం
-
అక్కినేని వారసులు క్లారిటీ ఇచ్చారు
యంగ్ హీరో అఖిల్ తన రెండో సినిమాపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు. అఖిల్ సినిమా రిజల్ట్తో ఆలోచనలో పడ్డ ఈ యువ కథానాయకుడు రెండో సినిమా ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే చాలా మంది దర్శకులతో చర్చలు జరిపిన అక్కినేని యంగ్ హీరో గతంలో హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే నిర్మాణపరమైన సమస్యల కారణంగా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. తాజాగా మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు అఖిల్. ఇదే విషయాన్ని నాగార్జున కూడా కన్ఫామ్ చేశాడు. అఖిల్ రెండో సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడని ప్రకటించిన నాగ్, నాగచైతన్య.., సొగ్గాడే చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటించనున్నాడని ప్రకటించాడు. త్వరలోనే ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. Sept rocks for me/announcing films with two of my star directors.KALYAN with NagaChaitanya//VIKRAM KUMAR with Akhil.On the floors very soon — Nagarjuna Akkineni (@iamnagarjuna) 1 September 2016 -
విక్రమ్కుమార్ దర్శకత్వంలో?
కథ రెడీ... ఇక షూటింగ్ మొదలుపెట్టడమే ఆలస్యం అనుకున్న తరుణంలో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడుతుంది. సినిమా పరిశ్రమలో ఇది చాలా సహజం. ఇటీవల అఖిల్ సినిమా విషయంలో ఇలానే జరిగింది. ‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో అఖిల్ తన రెండో సినిమా చేయాలనుకున్నారు. కానీ, ఇటు అఖిల్ అటు హను రాఘవపూడి వేరు వేరు బేనర్లకు కమిట్మెంట్ ఇవ్వడంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందాల్సిన సినిమా వాయిదా పడింది. దాంతో అఖిల్ రెండో సినిమాకి దర్శకుడెవరు? అనే చర్చ మళ్లీ మొదలైంది. ఈ చర్చల్లో ప్రధానంగా దర్శకుడు విక్రమ్కుమార్ పేరు వినిపిస్తోంది. అక్కినేని కుటుంబం ఎప్పటికీ గర్వంగా చెప్పుకోదగ్గ ‘మనం’లాంటి ఫీల్గుడ్ మూవీని అందించిన విక్రమ్కుమార్ అంటే నాగార్జునకు ప్రత్యేకమైన అభిమానం ఉండటం సహజం. అక్కినేని కుటుంబం అంటే విక్రమ్కి కూడా మంచి అభిమానం ఉంది. యాక్చువల్గా ‘మనం’ తర్వాత మళ్లీ విక్రమ్కుమార్తో తన కుటుంబానికి చెందిన హీరోల్లో ఎవరో ఒకరితో సినిమా చేయాలన్నది నాగ్ ఆకాంక్ష అనే వార్త వినిపించింది. అప్పుడే అఖిల్ కోసం మంచి కథ రెడీ చేయమని విక్రమ్కుమార్ని నాగ్ కోరారని ఫిల్మ్నగర్ టాక్. సో.. అఖిల్ రెండో సినిమా విక్రమ్కుమార్ దర్శకత్వంలోనే ఉంటుందని చెప్పుకుంటున్నారు. అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఇంకెంత మంది దర్శకులు పేర్లు వినిపిస్తాయో చూడాలి. -
బన్నీ, హరీష్కే ఫిక్స్ అయ్యాడు
సరైనోడు సక్సెస్ తరువాత చాలారోజులుగా ఖాళీగా ఉన్న అల్లు అర్జున్ ఎట్టకేలకు తన తదుపరి సినిమాను కన్ఫామ్ చేశాడు. ముందుగా మనం, 24 చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్తో ఎక్స్పరిమెంటల్ సినిమా చేయాలని భావించిన బన్నీ, తరువాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. మరో తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో మాస్ మాసాలా ఎంటర్టైనర్ను ప్లాన్ చేసినా అది కూడా వర్క్ అవుట్ కాలేదు. ఫైనల్గా సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో మంచి ఫాంలో ఉన్న హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్తో తెరకెక్కించనున్నాడు. దాదాపు ఏడేళ్ల విరామం తరువాత బన్నీ, దిల్ రాజు బ్యానర్లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు బన్నీ లక్కీ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమా ఆగస్టులో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
లాయర్గా రాధికా ఆప్టే
‘రక్తచరిత్ర’ చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాధికా ఆప్టే ఆ తర్వాత ‘లెజెండ్’, ‘లయన్’ చిత్రాల ద్వారా తనలో మంచి మాస్ హీరోయిన్ ఉన్న విషయాన్ని కూడా నిరూపించుకున్నారు. తాజాగా ‘టుడే’ చిత్రం ద్వారా మరోసారి తెలుగు తెరపై మెరవనున్నారు. ‘మనం’, ‘24’ చిత్రాల దర్శకుడు విక్రమ్కుమార్ వద్ద అసోసియేట్గా పని చేసిన రుద్రన్ దర్శకత్వం వహించారు. 5కలర్స్ మల్టీ మీడియా పతాకంపై దామెర శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. మానసిక రోగులపై ఓ ముఠా చేస్తున్న అరాచకాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో రాధికా ఆప్టే లాయర్ పాత్ర చేశారు. జులైలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
24 ముందు కథేంటి!
సూర్య తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన చిత్రం 24. సమంత, నిత్యామీనన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్కుమార్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించారు. సూర్య తన 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మించిన ఈ టైమ్ మిషన్ థ్రిల్లర్ కథా చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్రాజా ఈ నెల 6వతేదీన విడుదల చేశారు. చిత్రానికి ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణ అభిస్తోంది. ఈ చిత్రంలో పోషించిన మూడు పాత్రల్లో రెండు పాత్రల్ని కవల పిల్లలుగా చూపించారు. అవే ఆత్రేయ,సేతురామన్ పాత్రలు.అయితే ఆ పాత్ర ల భావస్వారూప్యాలను యుక్త వయసు దాటిన తరువాతే చూపించారు. దీంతో అంతకు ముందు కథేమిటన్న ఆసక్తి చిత్రం చూసిన వారికి కలుగుతుంది. ఆ క థను తరువాత తెరకెక్కిస్తానంటున్నారు దర్శకుడు. సాధారణంగా చిత్రం విజయం సాధిస్తే దానికి సీక్వెల్స్ తీస్తుంటారు. అలాంటిది దర్శకుడు విక్రమ్కుమర్ 24 చిత్రానికి ముందు కథను తరువాత తెరకెక్కిస్తానంటున్నారు. కవల పిల్లలు ఆత్రేయ, సేతురామన్ ఇతివృత్తంతో సూర్య హీరోగానే చిత్రం చేస్తానని ఆయన ఇటీవల తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయన అల్లుఅర్జున్, మహేశ్బాబులతో చిత్రాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తి చేసిన తరువాత సూర్యతో 24 చిత్రానికి ముందు కథతో చిత్రం చేస్తారట. సాదాసీదా కథలే అయినా ఆసక్తికరమైన కథనాలతో చిత్రాలను జనరంజితంగా తెరకెక్కించడంలో దిట్ట అయిన విక్రమ్కుమార్ 24 చిత్రానికి టైమ్ మిషన్ ఫార్ములాను ఉపయోగించుకుని సక్సెస్ అయ్యారు. ఈ సారి ఎలాంటి మ్మాజిక్ను వాడనున్నారో మరి. అది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. -
'నా పూర్తి సామర్థ్యాన్ని ఇంత వరకూ చూపించలేదు'
సరైనోడు సినిమా సక్సెస్తో ఆనందంగా ఉన్న అల్లు అర్జున్, తన భవిష్యత్ ప్రణాలికను మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న స్టైలిష్ స్టార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి తెలియజేశాడు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు తనలోని పూర్తి స్థాయి నటనను ప్రదర్శించే అవకాశమే రాలేదంటూ కామెంట్ చేశాడు బన్నీ. నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి మరెన్నో కొత్త తరహా పాత్రలు, కొత్త తరహా కథల్లో నటించాలని తెలిపాడు. అంతేకాదు సినిమా మార్కెట్ పరంగా మరింత అభివృద్ధి చెందాలంటే మల్టీ లింగ్యువల్ సినిమాలు తెరకెక్కాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని తెలిపాడు. ప్రస్తుతం బన్నీ కూడా బైలింగ్యువల్ సినిమాల మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే మాలీవుడ్లో మంచి మార్కెట్ సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్, ప్రస్తుతం కోలీవుడ్ మీద దృష్టి పెట్టాడు. అందుకే తమిళ దర్శకులతో పనిచేయటంతో పాటు తన నెక్ట్స్ సినిమాలను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. బాహుబలి సినిమా తరువాత తెలుగు సినిమా మార్కెట్ చాలా పెరిగిందన్న అల్లు అర్జున్, సరైనోడు సినిమాతో తన కోరిక నేరవేరిందని ఆనందం వ్యక్తం చేశాడు. టాలీవుడ్ హైయ్యస్ట్ గ్రాసర్స్ లిస్ట్లో తన సినిమా తొలి ఐదు స్ధానాల్లో ఉండాలని కోరుకునే వాణ్ని, సరైనోడు వంద కోట్ల వసూళ్లు సాధించటంతో తన కోరిక నెరవేరిందన్నాడు. అంతేకాదు ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూస్ ఇచ్చిన వారికి కూడా తన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. రివ్యూ రాసే వారు చాలా తెలివైన వారు, వారికి నచ్చే సినిమా తీయటం చాలా కష్టం అంటూ సెటైర్ వేశాడు. ప్రస్తుతం బైలింగ్యువల్ సినిమాల మీద దృష్టి పెడుతున్న బన్నీ, తమిళ దర్శకుడు లింగుసామి డైరెక్షన్లోయాక్షన్ డ్రామా చేయడానికి ఓకె చెప్పాడు. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్న ఈ సినిమాపై పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. తాజాగా 24 సినిమాతో సంచలనం సృష్టించిన విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో మెడికల్ థ్రిల్లర్లో నటించనున్నట్లుగా తెలిపాడు. -
ఈ ప్రశ్నలకు జవాబులు...అందులో ఉంటాయి
‘13బి’ నుంచి ‘మనం’ వరకూ నేను చేసిన సినిమాలన్నీ విభిన్న కథాంశాలతో తీసినవే. నాకు రాయడమంటే ఇష్టం. అందుకే డిఫరెంట్ జానర్స్ ఎంచుకుంటూ వస్తున్నా. ఆరు నుంచి ఏడు నెలల వరకూ స్క్రిప్ట్ వర్క్ చేస్తాను. ‘24’ సినిమా స్క్రిప్ట్కు ఏకంగా నాలుగేళ్లు కేటాయించా’’ అని విక్రమ్కుమార్ అన్నారు. సూర్య హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘24’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సైన్స్ ఫిక్షన్కు మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని విక్రమ్కుమార్ అన్నారు. ఆయన పంచుకున్న మరిన్ని విశేషాలు... ‘24’లో ప్రతి సీన్ టైమ్తో ముడిపడి ఉంటుంది. చాలా టైమ్ తీసుకుని, ప్రతి సీన్ను తీర్చిదిద్దా. ఇలాంటి కథాంశాలు హాలీవుడ్లో చాలా వచ్చాయి. కానీ నాకు మనదైన సినిమా కావాలి. అదీ అందరికీ కనెక్ట్ అయ్యేలా తీయాలి. ప్రతి సీన్ను ఎంజాయ్ చేస్తూ రాశాను. ఏ సినిమా తీసినా దానికి మనదైన హంగులు అద్ది తీయడమంటే ఇష్టం. ఇప్పుడీ సినిమా పిల్లలకు తెగ నచ్చేసింది. ఈ సినిమా చూసిన వాళ్లందరూ ఇంత క్లిష్టమైన కాన్సెప్ట్ను అంత సింపుల్గా ఎలా చెప్పగలిగారు అని అడిగారు. తెలుగులో ‘ఆదిత్య 369’ సినిమా టైమ్ మెషీన్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిందని తెలిసింది. చాలా ఏళ్ల క్రితమే ఇలాంటి జానర్లో సినిమా తీశారంటే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుగారికి హ్యాట్సాఫ్. త్వరలోనే ఆ సినిమా చూస్తా. ‘24’ కథను కొంత మంది స్టార్ హీరోలకు వినిపించా. ఈలోగా నాకు సూర్య దగ్గర నుంచి పిలుపు వచ్చింది. అప్పటికే ఆయన చాలా సినిమాల్లో డబుల్ రోల్స్ చేసి విసిగిపోయారు. ఈ సినిమాలో మూడో క్యారెక్టర్ ఆత్రేయ గురించి చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యారు. కథ విన్న నాలుగన్నర గంటల తర్వాత ఆయన ఈ చిత్రానికి ఓకే చెప్పేశారు. ఈ సినిమా మేకింగ్ సరదాగా గడిచిపోయింది. కొంతమంది సినిమా నిడివి ఎక్కువైందంటున్నారు. అయినా రెండున్నర గంటల్లో ఒక కథను చూపించడమనేది అసాధ్యం. నాకెందుకో ఆ పద్ధతి నచ్చదు. ఎంత సేపు సినిమా ఉందని కాదు, ఎంత బాగా తీశామన్నది ముఖ్యం. అందుకే ఈ చిత్రం ప్రీక్వెల్కు స్క్రిప్ట్ రాస్తున్నా. ఎందుకంటే ‘24‘లో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ఆ జవాబు ప్రీక్వెల్లో ఉంటుంది. అల్లు అర్జున్, మహేశ్ లకు కథలు వినిపించా. అల్లు అర్జున్ సినిమా తర్వాత మహేశ్తో చేస్తా. ఆ తర్వాత ‘24’ ప్రీక్వెల్ సూర్య నిర్మాణంలో ఉంటుంది. -
ప్రివ్యూ టాక్: 24 సినిమా ఎలా ఉందంటే..
తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు నటించిన చిట్ట చివరి చిత్రం.. మనం. ఈ సినిమాను అత్యంత ధైర్యంగా తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్ కుమార్ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కూడా చూశాడు. ఈ సినిమా విడుదలై ఇప్పటికి ఏడాది కావస్తున్నా.. ఇప్పటికీ చాలామంది దీనిగురించి చర్చించుకుంటున్నారు. ఆ సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ నుంచి వచ్చిన మరో చిత్రం.. సూర్య హీరోగా నటించిన '24'. శుక్రవారం విడుదలవుతున్న ఈ సినిమాకు ఇప్పటికే బోలెడంత హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ఈ సినిమాను ఆకాశానికెత్తేశాడు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రివ్యూ చూసిన తరణ్.. తన భావావేశాన్ని ఆపుకోలేక ఈ సినిమా గురించి వరుస ట్వీట్లతో మోతెక్కించాడు. విక్రమ్ తన నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించాడని, 24 సినిమా సబ్జెక్టును చాలా మేధస్సుతో డీల్ చేశాడని తరణ్ అన్నాడు. ఈసారి మూడు పాత్రలలో నటించిన సూర్య కూడా అవార్డు విన్నింగ్, నాకౌట్ పెర్ఫార్మెన్సు చూపించాడని ప్రశంసించాడు. ముఖ్యంగా చెడ్డవాడైన విరోధి పాత్రలో అదరగొట్టాడని చెప్పాడు. ఈ సినిమాను కేవలం బాగుందని చెప్పలేమని.. ఇందులో ఇంకా చాలా ఉన్నాయని అన్నాడు. ఇంత మంచి సబ్జెక్టును తీసుకున్నందుకు మొత్తం సినిమా టీమ్కు అభినందనలు చెప్పాడు. ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం, సబ్జెక్టు మీద పట్టు, వాటన్నింటితో పాటు ఆర్థిక దన్ను అన్నీ ఉండాలని తెలిపాడు. టైటిళ్లతో మొదలుపెట్టి ప్రేక్షకులను కట్టిపడేస్తుందని, తర్వాత 2.40 గంటల పాటు ఒక రోలర్ కోస్టర్లో తిరుగుతున్నట్లుగా అద్భుతమైన అనుభూతికి లోనవుతారని తరణ్ అన్నాడు. ఈ సినిమాకు అతిపెద్ద బలం దాని కాన్సెప్టేనని, దానికి తోడు ఇందులో కావల్సినంత వినోదం, ఎవరూ ఊహించలేని ట్విస్టులు, మలుపులు ఉంటాయంటూ ప్రేక్షకులను ఊరించాడు. సూర్య - సమంతల మధ్య సన్నివేశాలు కూడా చూడదగ్గవేనని, మంచి ఇంటర్వెల్ పాయింటు ఉందని తెలిపాడు. It requires courage, conviction, command over the medium and of course, financial strength to bring to life a film like #24TheMovie... — taran adarsh (@taran_adarsh) 5 May 2016 #24TheMovie grabs your attention from the titles itself and for the next 2.40 hours you're hooked on to this terrific roller coaster ride... — taran adarsh (@taran_adarsh) 5 May 2016 Biggest strength of #24TheMovie is its concept. It also packs loads of entertainment and unpredictable twists and turns that win you over... — taran adarsh (@taran_adarsh) 5 May 2016 High points: Dramatic start, cute light moments [Suriya-Samantha], fab interval point, emotional moments, the culmination #24TheMovie — taran adarsh (@taran_adarsh) 5 May 2016 Vikram Kumar, who directed the terrific #Manam [Telugu], displays his mastery yet again. He handles the subject with brilliance #24TheMovie — taran adarsh (@taran_adarsh) 5 May 2016 Suriya, in triple roles this time, delivers an award-worthy, knockout performance. He's stupendous as the evil antagonist #24TheMovie — taran adarsh (@taran_adarsh) 5 May 2016 #24TheMovie is not just a good looking film, but has lots to offer. Kudos to the team for pulling off the subject with élan! — taran adarsh (@taran_adarsh) 5 May 2016 -
'24 కథను ఆరేళ్లుగా నా దగ్గర పెట్టుకున్న'
చెన్నై: 'ప్రతి కథకు ఒక తలరాత ఉంటుంది. ఈ కథ నేను నా దగ్గర దాదాపు ఆరేళ్లు పెట్టుకున్నాను. చివరకు సూర్యాతో సినిమా పూర్తయింది. ఈ విషయం చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. సూర్యాతో ఈ సినిమా చేయడం నిజంగా ఓ దైవ నిర్ణయం. చిత్ర నిర్మాణం పూర్తయిన '24' సినిమాను చూసిన తర్వాత నేను చెప్తున్నాను. ఈ సినిమాను ఒక్క సూర్య మాత్రమే చేయగలడు మరింకెవరూ చేయలేరని. ఒక వేళ అలా చేసినా ఇప్పుడు ఉన్న సినిమాలాగా మాత్రం ఉండదు' అని 24 చిత్ర దర్శకుడు మనం ఫేమ్ విక్రమ్ కుమార్ అన్నారు. శుక్రవారం విడుదలకానున్న ఈ చిత్రానికి, చిత్ర హీరో సూర్యకు సంబంధించిన వివరాలు తెలిపారు. తానెప్పుడు సైన్స్ ఫిక్షన్ చిత్రాలు చేయడానికి ఇష్టపడతానని, కాలంలో ప్రయాణించడమనేది చాలా ఉత్సాహాన్ని ఇచ్చే అంశం అని, వీటిపై పనిచేసేందుకు తాను ఇష్టపడతానని చెప్పారు. 'మనుషులుగా మనమంతా కాలంలో ప్రయాణించేవాళ్లం. దేవుడు మనకు ఎన్నో అద్భుతాలు చేయగలిగే సామర్థ్యాన్ని ఇచ్చాడుగానీ, కాలాన్ని నియంత్రించే శక్తినివ్వలేదు. తాము తీసుకున్న కరడుగట్టిన నిర్ణయాలను పునరుద్ధరించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఒకసారి గతంలోకి వెళితే బాగుండు అని అనుకుంటారు' అని విక్రమ్ చెప్పారు. తాను తీసిన 24 అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదన్నారు. ఆరేళ్ల పిల్లాడికి కూడా ఈ సినిమా అర్థం అవుతుందని, ప్రతి క్లిష్టమైన అంశాన్ని సంశ్లిష్టం చేశామని చెప్పారు. -
విక్రమ్తో అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఓ ఇంట్రస్టింగ్ సినిమాకు అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాను కంప్లీట్ చేసిన బన్నీ.. ఆ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ సంస్థ భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు ప్రమోషన్ను కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ సినిమా తరువాత బన్నీ చేయబోయే సినిమా ఏంటి అన్న విషయంలో మాత్రం ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించటంలో హ్యాట్రిక్ సాధించే దిశగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్ను కూడా ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇష్క్, మనం సినిమాలతో క్రేజీ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్, ప్రస్తుతం సూర్య హీరోగా 24 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తరువాత విక్రమ్, బన్నీ హీరోగా ఓ సినిమా చేసే ఆలోచనలోఉన్నాడట. బన్నీ కూడా విక్రమ్తో సినిమాకు రెడీ గానే ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. తన ప్రతీ సినిమా ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కించే విక్రమ్ బన్నీతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. -
సూర్య '24' బాలీవుడ్ రీమేక్..?
ఈ వేసవిలో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాల్లో భారీ అంచనాలున్న సినిమా 24. సూర్య హీరోగా తన సొంతం నిర్మాణ సంస్థ ద్వారా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకుడు. సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా సమంత, నిత్యా మీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు లోనూ ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేయాడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అంతేకాదు బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను సూర్య స్వయంగా నిర్మించేదుకు రెడీ అవుతున్నాడు. హృతిక్ రోషన్ లేదా సల్మాన్ ఖాన్ లలో ఒకరిని హీరోగా ఒప్పించి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు సూర్య. -
24లో సూర్య సొంత గొంతు
కోలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు సూర్య. తన ప్రతి సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేసే సూర్య తదుపరి సినిమా 24 విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. అయితే ఇప్పటివరకు సూర్య సినిమాలకు వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించేవారు. తమ్ముడు కార్తీ తెలుగులో డబ్బింగ్ చెప్పటం ప్రారంభించినా సూర్య మాత్రం రిస్క్ తీసుకోలేదు. అయితే 24 చిత్రంలో ఆ రిస్క్కు రెడీ అవుతున్నాడు సూర్య. మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై టాలీవుడ్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ఇటీవల రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్న సూర్య ఒక పాత్రకు తన సొంత గొంతుతో తెలుగు డబ్బింగ్ చెపుతున్నాడు. ఇదే వర్కవుట్ అయితే ఇక ముందు రాబోయే సినిమాలన్నింటిలో ఫ్యాన్స్ సూర్య సొంత గొంతు వినొచ్చు. -
సూర్య స్టైల్లో '24'
సౌత్ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక చిత్రాలకు రెడీగా ఉండే స్టార్ హీరో సూర్య. మరోసారి అదే ఫార్ములాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. సైన్స్ ఫిక్షన్గా తెరకెక్కిన '24' సినిమాతో మరోసారి అభిమానులకు షాక్ ఇవ్వనున్నాడు. 5 వేరియేషన్స్లో త్రిపాత్రాభినయం చేస్తున్న సూర్య ఈ సినిమాతో మరోసారి భారీ హిట్ మీద కన్నేశాడు. మనం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విక్రమ్ కుమార్, ఈ సినిమాతో అదే ఫాం కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. శుక్రవారం రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తుంది. కవల సోదరులుగా నటిస్తున్న సూర్య ఒక పాత్రలో సైంటిస్ట్గా, మరో పాత్రలో విలన్ ఆత్రేయగా కనిపిస్తున్నాడు. సూర్య చేసిన రిస్కీ ఫైట్స్, సూర్య గెటప్స్తో పాటు ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా టీజర్ రేంజ్ను పెంచింది. సినిమా కాన్సెప్ట్ను ఫస్ట్ టీజర్లోనే రిలీజ్ చేసిన దర్శకుడు విక్రమ్ కుమార్ సినిమాను మరింత గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాడు. -
'24' టీజర్ రిలీజ్కు ముహుర్తం కుదిరింది
సౌత్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ 24. ఇష్క్, మనం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ డిఫరెంట్ మూవీలో సూర్య త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు అభిమానులను ఆకట్టుకోగా త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ టీజర్ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. తొలి రోజు నుంచి సినిమా ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న చిత్రయూనిట్ టీజర్ లాంచ్ చేయబోతున్న విషయాన్ని కూడా క్రియేటివ్గా ఎనౌన్స్ చేశారు. సైంటిఫిక్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ సినిమా జానర్ను రివీల్ చేసే విధంగా సైంటిస్ట్ ఉపయోగించే పరికరాలతో పోస్టర్ను రిలీజ్ చేశారు. మార్చి 4, సాయింత్రం 6గంటలకు టీజర్ను రిలీజ్ చేస్తున్నట్టుగా పోస్టర్తో ఎనౌన్స్ చేశారు. ఈవిషయాన్ని సూర్య తన ట్విట్టర్లో వెల్లడించారు. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 16 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. #24Teaser on Friday 4th, March @6pm #Vikramkumar @arrahman @deepakbhojraj @2D_ENTPVTLTD @rajsekarpandian @kegvraja pic.twitter.com/pS7gVLBmSu — Suriya Sivakumar (@Suriya_offl) March 1, 2016 -
పోస్టర్ అదిరింది!
పాత్ర డిమాండ్ చేస్తే ఎలాగైనా మారిపోవడానికి సూర్య సిద్ధపడతారు. అందుకు చాలా నిదర్శనాలున్నాయి. ‘పేరళగన్’ అనే తమిళ చిత్రంలో గూనివాడిగా నటించారాయన. ‘గజిని’లో షార్ట్ టైమ్ మెమరీ లాస్ పాత్రలో ఒదిగిపోయిన వైనం గుర్తుండే ఉంటుంది. ఇక, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’లో టీనేజ్ కుర్రాడిలా, మధ్య వయస్కుడిలా, వృద్ధుడిలా మూడు షేడ్స్ను అద్భుతంగా ఆవిష్కరించారు. ఇప్పుడు ‘24’ చిత్రంలో మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారాయన. ‘మనం’ ఫేమ్ విక్రమ్కుమార్ దర్శకత్వంలో ‘టైమ్ ట్రావెల్’ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ గత ఏడాది నవంబర్లో పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్కి ఎక్కువ రోజులు పడుతుందట. ఇందులో సూర్య సైంటిస్ట్గా, అన్నాతమ్ముడిగా మూడు పాత్రల్లో కనిపిస్తారు. అలాగే ఒక చేతి గడియారానికి కూడా కీలక స్థానం ఉందట. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకూ విడుదలైన రెండు పోస్టర్లు చర్చనీయాంశమయ్యాయి. తాజా పోస్టర్ అయితే హాట్ టాపిక్ అయ్యింది. -
మహేశ్ వద్దన్నాడు... సూర్య చేస్తున్నాడు!
చెన్నై: ప్రిన్స్ మహేశ్ బాబు వదులుకున్న సినిమాను తమిళ హీరో సూర్య చేస్తున్నాడు. 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న '24' సినిమాలో సూర్య నటిస్తున్నాడు. ముందుగా ఈ కథను మహేశ్ కు విక్రమ్ కుమార్ వినిపించాడట. అతడికి ఫస్టాప్ బాగా నచ్చిందట. సెకండాఫ్ అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ఈ సినిమా చేసేందుకు మహేశ్ ఆసక్తి చూపలేదట. తర్వాత ఈ సబ్జెక్ట్ సూర్యకు వద్దకు వెళ్లడం, అతడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో మూడు పాత్రల్లో సూర్య కనిపించనున్నాడని సమాచారం. అన్నదమ్ములుగా, అన్న కొడుకుగా కనిపిస్తాడని తెలుస్తోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్తో పాటు 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. 2016లో వేసవిలో '24' సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. మంగళవారం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆసక్తికరంగా ఉన్నాయి. -
'24' లుక్ అదిరింది
సూర్య హీరోగా 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 24 ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. సూర్య అఫిషీయల్ ట్విట్టర్ పేజ్లో రిలీజ్ చేసిన రెండు పోస్టర్స్లో రెండు డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తున్నాడు సూర్య. గన్తో రఫ్ లుక్లో డాన్లా ఓ ఇమేజ్లో కనిపిస్తుంటే, మరో పోస్టర్లో సైంటిస్ట్లా దర్శనమిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా మీద ఉన్న అంచనాలు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్తో మరింతగా పెరిగాయి. స్టూడియో గ్రీన్ బ్యానర్తో పాటు 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాలంలో ప్రయాణించటం అనే కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ భారీ గ్రాఫికల్ సినిమాకు స్వర సంచలనం ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. 2016లో వేసవిలో 24 మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. Here's the first look of #24TheMovie very close to my heart, loved working! Hope you guys like it! #24FirstLook -
మనం దర్శకుడితో రేసుగుర్రం
వరుస సూపర్ హిట్స్ తో టాలీవుడ్ బాక్సాఫీస్ స్టామినా ప్రూవ్ చేస్తున్న యంగ్ హీరో అల్లు అర్జున్ సినిమాల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లతో పాటు సాఫ్ట్ లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కూడా చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాతో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అందించిన బన్నీ, ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత మరోసారి క్లాస్ సినిమాకు కమిట్ అయ్యే ఆలోచనలో ఉన్నాడు స్టైలిష్ స్టార్. 'మనం' సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ సినీ జనాలతో పాటు టాప్ స్టార్స్ దృష్టిని కూడా ఆకర్షించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయాలని భావిస్తున్నాడు. విక్రమ్ కుమార్ ప్రస్తుతం సూర్య హీరోగా తమిళ్ లో'24' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈసినిమా రిజల్ట్ చూసిన తరువాత బన్నీ సినిమా కు సంబందించిన పని మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం 24 గ్యారెంటీ హిట్ అంటున్నారు. అందుకే బన్నీ, విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో సినిమా రావటం ఖాయంగా కనిపిస్తోంది. -
మరోసారి ప్రయోగం చేస్తున్న సూర్య
-
నిర్మాతగానూ దూసుకెళుతున్నాడు
యంగ్ హీరోనితిన్ నిర్మాతగా కూడా జోరు చూపిస్తున్నాడు. చాలా కాలం తరువాత హీరోగా సక్సెస్ అయిన నితిన్, ప్రస్తుతం నటన మీదే కాకుండా నిర్మాణ రంగం మీద కూడా దృష్టిపెడుతున్నాడు. ప్రస్తుతం అక్కినేని వారసుడు అఖిల్ను హీరోగా పరిచయం చేస్తూ ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తున్న నితిన్, త్వరలో తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా మరిన్ని సినిమాలకు రెడీ అవుతున్నాడు. తన బ్యానర్ ద్వారా స్ట్రయిట్ సినిమాలను ప్రొడ్యూస్ చేయటమే కాదు, డబ్బింగ్ సినిమాలను కూడా రిలీజ్ చేస్తున్నాడు నితిన్. ప్రజెంట్ సూర్య హీరోగా విక్రమ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న 24 సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నాడు. తెలుగులో సూర్య మార్కెట్ తో పాటు తనకు ఇష్క్ లాంటి బిగ్ హిట్ అందించిన విక్రమ్ కుమార్ మీద ఉన్న నమ్మకంతో 20 కోట్లు పెట్టి ఈ హక్కులు సొంతం చేసుకున్నాడట నితిన్. నిర్మాతగా కొనసాగుతూనే హీరోగా కూడా తన కెరీర్ను ముందుకు తీసుకెళుతున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్లో నటిస్తున్నాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈసినిమాకు 'అ ఆ' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫైనల్ చేశారు.. ఈ సినిమాలో తొలిసారిగా నితిన్ సరసన సమంత హీరోయిన్గా నటిస్తుండగా మళయాల సూపర్ హిట్ మూవీ ప్రేమమ్ ఫేం అనుపమ పరమేశ్వరన్ మరో ఇంపార్టెంట్ రోల్లో నటిస్తుంది. -
సకుటుంబంగా... ‘మనం’ అర్ధ శతదినోత్సవం
‘సినిమాల పరంగా, పాత్రల పరంగా గతంలో నేను చేసిన తప్పులన్నిటినీ తుడిచేసింది ‘మనం’. మూడేళ్ల క్రితం దర్శకుడు విక్రమ్కుమార్ రూపంలో అదృష్టం మా ఇంటి తలుపు తట్టింది. అచ్చతెలుగు కథని మా ద్వారా ప్రేక్షకులకు అందించిన విక్రమ్కుమార్ రుణం తీర్చుకోలేనిది. ఈ సినిమాకు పనిచేస్తున్నప్పుడు ఆయన వేరే లోకంలో ఉండేవారు’’ అని హీరో నాగార్జున అన్నారు. విక్రమ్కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన చిత్రం ‘మనం’. అక్కినేని ఫ్యామిలీ నిర్మించిన ఈ సినిమా అర్ధ శతదినోత్సవం పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సభలో నాగ్ తన మనో భావాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, ‘‘ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ మనసుపెట్టి పనిచేశారు. ఈ చిత్రం 85 సెంటర్లలో 50 రోజులు పూర్తిచేసుకుంది. ఓవర్సీస్లో అయితే బ్లాక్బస్టర్. ఈ సినిమా విజయం సాధించాలని నాన్న ఎన్నో కలలు కనేవారు. ఆరోగ్యం బాగుండకపోయినా కష్టపడి పనిచేశారు. నాన్న తపన చూశాక ఈ సినిమా హిట్ అవుతుందో లేదో అని భయం వెంటాడేది. ఇప్పుడు హిట్ అయ్యాక నాన్న లేరే అని బాధేస్తోంది’’అన్నారు. వెంకట్ అక్కినేని మాట్లాడుతూ ‘‘ఆస్ట్రేలియాలో ఈ సినిమా చూశాను. 10 నిమిషాలు చూశాను. అంతే... కంటినిండా నీరే. సినిమా కనిపించలేదు. మళ్లీ చూడాలి’’ అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ ‘‘నాన్నతో, తాతయ్యతో కలిసి నటించడం ఒక గొప్ప అనుభవం’’ అన్నారు. నాగ్, కె. రాఘవేంద్రరావు, నిర్మాత మహేష్రెడ్డి చేతుల మీదుగా యూనిట్ సభ్యులకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు జ్ఞాపికల ప్రదానం జరిగింది. -
నాన్నగారికి నేను బోర్ కొట్టేశానేమో!
‘‘తండ్రీ కొడుకులతో కలిసి నటించే అదృష్టం అందరికీ దక్కదు. ఆ ఆనందాన్ని దక్కేలా చేసిన మా నాన్నగారికి కృతజ్ఞతలు’’ అంటున్నారు నాగార్జున. డా. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన సినిమా ‘మనం’. విక్రమ్కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు, అక్కినేని కుటుంబ అభిమానులతో పాటు నాగార్జున కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున పలు విశేషాలు చెప్పారు. ‘‘నాన్నగారితో కలిసి సినిమా చేయడంవల్ల ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి కుదిరింది. గతంలో నాన్నగారి కాంబినేషన్లో నేను చేసినప్పుడు ఆయన దృష్టంతా నా మీదే ఉండేది. కానీ, ఈ సినిమాకి మాత్రం నాన్నగారి దృష్టి మొత్తం చైతూ మీదే. బహుశా నేను బోర్ కొట్టి ఉంటానేమో’’ అని సరదాగా అన్నారు నాగ్. ‘మనం’ షూటింగ్ లొకేషన్లో తన తండ్రి, తనయుడు ఒకరి మీద ఒకరు జోక్లేసుకుంటూ సరదాగా ఉండేవాళ్లని, ఈ సినిమా మొత్తం తనకో తీపి గుర్తులాంటిదని నాగ్ అన్నారు. ముఖ్యంగా తమ ముగ్గురి కాంబినేషన్లో షూటింగ్ చేసిన ఆ నాలుగైదు రోజులను ఎప్పటికీ మర్చిపోలేనని, అవి చాలా ప్రత్యేకం అని నాగార్జున పేర్కొన్నారు. 1920 నుంచి 2013 వరకు సాగే కథతో ఈ సినిమా ఉంటుందని, అంతకు మించి ఈ సినిమా కథకు సంబంధించిన విశేషాలేమీ బయటపెట్టలేనని కూడా ఆయన అన్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ నటించిన విషయం గురించి చెబుతూ -‘‘మా నాన్నగారికి అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం. ‘రేయ్.. ఎంత బాగా చేశాడురా... చక్కగా ఉంది కదరా...’ అని అమితాబ్ నటన గురించి అనేవారు. అమితాబ్ నటించిన సినిమాలను దాదాపు వదలకుండా చూసేవారు. అందుకే, ఆయన చివరి చిత్రంలో అమితాబ్ నటిస్తే బాగుంటుందనుకున్నా. బిగ్ బి నటించడంతో ఈ సినిమా మరింత ప్రత్యేకం అయ్యింది’’ అని నాగార్జున అన్నారు. -
మా ఇద్దరి అదృష్టం ఇది
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం ‘మనం’ కోసం ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ప్రచార చిత్రానికి వచ్చిన స్పందనే అందుకు గొప్ప నిదర్శనం. రెండు రోజుల్లో పెద్ద సంఖ్యలో క్లిక్స్ దీనికి లభించాయి. ఈ విషయంపై అక్కినేని నాగార్జున ఆనందం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘మనం ప్రచార చిత్రాలకు ఈ స్థాయిలో స్పందన రావడం ఆనందంగా ఉంది. చాలా కొత్తగా ఉన్నాయని ఫోన్లు చేసి మరీ అభినందిస్తున్నారు. మా కుటుంబం కలిసి నటించిన ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గ రీతిలో ఉంటుందని నమ్మకంగా చెప్పగలను. దర్శకుడు విక్రమ్కుమార్ సరికొత్త శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాన్న చివరి సినిమాలో ఆయనతో పాటు భాగం పంచుకునే అదృ ష్టాన్ని నాకు, నాగచైతన్యకు కలిగించిందీ సినిమా’’ అని చెప్పారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోందని, మే నెల 23న ఘనంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత సుప్రియ తెలిపారు. శ్రీయ, సమంత కథానాయికలు.