Ajeya Kallam
-
విద్య, వైద్యం, ఉపాధితోనే నిజమైన అభివృద్ధి
భీమవరం/భీమవరం (ప్రకాశం చౌక్): భవనాలు నిర్మించడం, కాలువలు తవ్వడమే అభివృద్ధి కాదని.. అట్టడుగు వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు లభిస్తేనే నిజమైన అభివృద్ధి అని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పీసీఆర్ కల్యాణ మండపంలో గురువారం ‘ఓపెన్ మైండ్ ఫర్ బెటర్ సొసైటీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ నాడు–నేడు సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తన ఉద్యోగానుభవంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ చేసిన ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే రెండేళ్లు కరోనా విపత్తు వల్ల తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చిందన్నారు. మిగిలిన మూడేళ్ల కాలంలో ఒకపక్క పేదలకు సంక్షేమం, మరోపక్క రాష్ట్రంలో శాశ్వత అభివృద్ధి ప్రణాళికలు రచించారని తెలిపారు. ఐదేళ్లలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమపాళ్లలో జరిగాయనేందుకు ఉదాహరణ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కళాశాలలు, గ్రామ, వార్డు సచివాలయ భవనాలు, విలేజ్ క్లినిక్లు, ఆస్పత్రి భవనాలు అని వివరించారు. చంద్రబాబు హయాంలో పేదరికం నిష్పత్తి 7.7 శాతం ఉంటే.. జగన్ పాలనలో 4.19 శాతానికి తగ్గిందన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి కేవలం రూ.3 వేల కోట్ల పెట్టుబడులు వస్తే.. గడచిన ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.78 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. నాడు–నేడు పథకం ద్వారా 45,975 ప్రభుత్వ పాఠశాలలను రూ.18 వేల కోట్లతో అభివృద్థి చేశారన్నారు. ఓపెన్ మైండ్తో చర్చించాలి ఓపెన్ మైండ్ ఫర్ బెటర్ సొసైటీ చైర్మన్, ఏపీ ఉన్నత విద్యా రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ ఎన్.రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో 34వేల ఉద్యోగాలు ఇస్తే.. జగన్ పాలనలో 2.7 లక్షల ఉద్యోగాలు కల్పించారని వివరించారు. 2018–19 వరకు స్థూల రాష్ట్ర ఉత్పత్తి రూ.7,90,800 కోట్లయితే 2023–24లో రూ.11,66,000 కోట్లు అని చెప్పారు. తలసరి ఆదాయం 2018–19లో రూ.1.54 లక్షల కోట్లు అయితే 2023–24లో రూ.2.20 కోట్లకు పెరిగిందన్నారు. ఆర్టీఐ మాజీ కమిషనర్, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు మాట్లాడుతూ.. గత పాలనతో పోలిస్తే మన రాష్ట్రంలో పేదరికం 50 శాతం తగ్గిందన్నారు. పేదల పిల్లలు ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, మాస్టర్ డిగ్రీ వంటి ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్నారని, దీనిని మేధావులు గుర్తించాలని కోరారు. -
ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చాయన్న అజయ్ కల్లాం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఇదే కదా సుపరిపాలన
సాక్షి, విశాఖపట్నం : ‘ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2.18 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. ప్రజలకవసరమైన అన్ని సేవలనూ అందుబాటులోకి తెచ్చారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలను సమూలంగా మార్చేశారు. విలేజి/అర్బన్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటుచేశారు. ఫ్యామిలీ డాక్టర్ సదుపాయాన్ని కల్పించారు. పారిశ్రామికంగానూ ఎంతో అభివృద్ధి చేశారు. ఇవేకాదు.. సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు ఇంకెన్నో సంక్షేమ పథకాలను అవినీతికి ఆస్కారంలేకుండా అందజేస్తున్నారు. ఇదేకదా సుపరిపాలన అంటే?’.. అని సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం చెప్పారు. విశాఖలోని ఓ హోటల్లో ఆదివారం జరిగిన ‘ట్రాన్స్ఫార్మింగ్ గవర్నెన్స్’ అనే సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. స్వాతంత్య్రం వచ్చాక 17 వైద్య కళాశాలలు వస్తే ఇప్పుడు 17 ఏర్పాటుకానున్నాయని.. ఇందులో ఐదింటి నిర్మాణం, అడ్మిషన్లు ఇప్పటికే పూర్తయి క్లాసులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పరిపాలన, చేపట్టిన సంస్కరణలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అజేయ కల్లాం చెప్పారు. ప్రభుత్వోద్యోగుల జీతాలు ఇక్కడే ఎక్కువ.. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ప్రభుత్వోద్యోగుల జీతాలు ఏపీలోనే ఎక్కువని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో పోలిస్తే 30 శాతం అధికమని ఆయన తెలిపారు. ఏపీలో 2014లో ప్రభుత్వోద్యోగుల జీతాల చెల్లింపులు రూ.18,709 కోట్లుంటే 2023–24లో అది రూ.57,222 కోట్లకు పెరిగిందన్నారు. ఏపీకంటే రెట్టింపు ఉన్న మధ్యప్రదేశ్లో ప్రభుత్వోద్యోగుల జీతాలు రూ.48 వేల కోట్లేనని చెప్పారు. ఉద్యోగుల అలవెన్సులు, పెండింగ్ క్లియరెన్సుపై ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని అజేయ కల్లాం తెలిపారు. 2.18 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు.. ఇక ఈ ఐదేళ్లలో 2.18 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు వచ్చాయని, వీరిలో 1.35 లక్షల మంది సచివాలయాల ఉద్యోగులేనన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 13 వేల మందికే ఉద్యోగ నియామకాలు జరిగాయని ఆయన గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగన్ ఊరూరా సచివాలయాలను ఏర్పాటుచేసి రాష్ట్రస్థాయి సచివాలయ వ్యవస్థను గ్రామస్థాయికి తీసుకొచ్చారన్నారు. ఈ వ్యవస్థలో జరుగుతున్న అద్భుతాలను చూసి తమిళనాడు, కేరళ సహా మరికొన్ని రాష్ట్రాలు అమలుకు సన్నాహాలు చేస్తున్నాయని.. పాలన వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల ఏర్పాటుజరుగుతోందన్నారు. అలాగే.. సుదీర్ఘకాలంగా ఉన్న భూ వివాదాల పరిష్కారానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్టును అమలుచేస్తున్నారన్నారు. ఇప్పుడు మరో 12 రాష్ట్రాలు దీని అమలుకు ప్రయత్నిస్తున్నాయని అజేయ కల్లాం చెప్పారు. ఈ విషయంలో కొంతమంది న్యాయవాదులు సృష్టిస్తున్న ఆపోహలను నమ్మొద్దని ఆయన కోరారు. 31లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు.. ఇదిలా ఉంటే.. మరే రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు, పథకాలు అందజేస్తున్న ఘనత ఒక్క మన రాష్ట్రానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో కొత్త పోర్టులు, హార్బర్లు, ఐటీలు, పరిశ్రమలు వస్తున్నాయని.. మరే రాష్ట్రానికి రాని విధంగా రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీలో రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని అజేయ కల్లాం చెప్పారు. ఇలాఅన్నిటా గత ప్రభుత్వాలకంటే ఎన్నో రెట్లు మెరుౖగెన సుపరిపాలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరుగుతోందని.. ఈ సుపరిపాలనపై ప్రజలే మంచి తీర్పునిస్తారన్నారు. ఈ సదస్సులో సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రసన్నకుమార్, నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ వీసీ బాలమోహన్దాస్, డా.బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వీసీ సుధాకర్, కార్తీక్, పలువురు మేధావులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. రైతుల ఆత్మహత్యలే ఆలోచింపజేశాయి ‘1997లో ఏపీలో ఏడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరి ఆత్మహత్యలకు కారణాలపై అప్పటి ముఖ్య కార్యదర్శి జన్నత్ హుస్సేన్ నేతృత్వంలో జరిపిన దర్యాç³#్తలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రైతు పంట పెట్టుబడికి రూ.10 వేలు అప్పుచేస్తే రూ.3 లక్షలు చెల్లించాల్సి వస్తోందని, అప్పుల భారంతో పిల్లలను చదివించలేకపోతున్నారని, ఆరోగ్య సమస్యలకు రూ.వేలల్లో, పిల్లల పెళ్లిళ్లకు లక్షల్లో అప్పులు చేయాల్సి వస్తోందని, వాటిని తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తేలింది. ఈ వాస్తవాలను మహానేత వైఎస్ గుర్తించారు. సీఎం అయ్యాక దీనిపై ఆలోచించి ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్ వంటివి అమలుచేశారు’ అని అజేయ కల్లాం వివరించారు. -
ల్యాండ్ టైట్లింగ్తో భూ వివాదాలకు తెర
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ చట్టం–2022 వల్ల భూ వివాదాలు, మోసాలను అరికట్టి యాజమాన్య హక్కుపై పూర్తి భరోసా కల్పించే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. వాస్తవాలను గమనించకుండా కొన్ని రాజకీయ పార్టీలు, కొంత మంది న్యాయవాదులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు దేశంలోని 12 రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయని, భూములకు శాశ్వత హక్కు రావాలంటే ఈ చట్టం అమలు జరగాలని అన్నారు. యజమాని ఎక్కడున్నా భూమికి రక్షణ అవసరమని, ప్రతి మూడు నెలలకోసారి మొబైల్ ఫోన్లో భూమి వివరాలను చెక్ చేసుకునే సౌలభ్యం ఉంటుందని వివరించారు. ఎవరైనా మార్పులు, చేర్పులకు ప్రయత్నిస్తే మనకు సమాచారం కూడా వస్తుందన్నారు. న్యాయ వ్యవస్థలో 66 శాతం కేసులు, 24 శాతం హత్యలు భూ తగాదాలకు సంబంధించినవే ఉన్నాయని చెప్పారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు. వివరాలు ఇలా.. సాక్షి: ఈ చట్టం వల్ల భూ యజమానులకు ప్రయోజనాలేమిటి? కల్లం: ఈ చట్టం కింద నిర్వహించే టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదయితే ఆ భూమికి అతనే యజమాని అనే హామీని ప్రభుత్వం ఇస్తుంది. ఆ భూమిపై హక్కుకు ఈ రికార్డే సాక్ష్యం. ఒకవేళ రికార్డుల్లో ఏదైనా పొరపాటు వల్ల భూమి హక్కులకు భంగం కలిగితే ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తుంది. ఇందుకోసం టైటిల్ ఇన్సూరెన్సు వ్యవస్థ ఏర్పాటవుతుంది. సాక్షి: ఈ చట్టం వల్ల ఎలాంటి మార్పులు వస్తాయి? కల్లం: వ్యవసాయ భూమి కొనుగోలు చెయ్యాలంటే రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ చెల్లించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజు చేయించుకోవాలి. ఆ తరువాత ఆర్వోఆర్ చట్ట రిజిస్ట్రేషన్ ప్రకారం తహసీల్దార్ విచారణ చేసి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చెయ్యాలి. కొత్త చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఒకేచోట, ఒకేసారి జరుగుతాయి. భూమి కొనుగోలు చేసిన వ్యక్తికి సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్ ఉంటే హక్కులకు సంపూర్ణ హామీ ఉన్నట్లే. సాక్షి: రెవెన్యూ రికార్డుల్లో ఎలా నమోదు చేసుకోవాలి? కల్లం: తహసీల్దార్కు మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్ విచారణ చేసి నమోదు చేస్తారు. పట్టాదారు రికార్డుల్లో పాస్ పుస్తకం జారీ చేస్తారు. కొత్త విధానంలో టైటిల్ రిజిస్టర్లో నమోదు చేసి, సర్టిఫికెట్ జారీ చేస్తారు. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి ప్రాథమిక పరిశీలన చేసి, రికార్డుల వివరాలు, దరఖాస్తుదారు అర్జీల్లో పొందుపరిచి నిర్ధారించి సర్టిఫికెట్ ఇస్తారు. సాక్షి: టైటిల్ రిజిస్టర్లో ఏర్పడే భూ వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు? కల్లం: భూమి రికార్డులను రూపొందించిన ఆ రికార్డుల్లో పొరపాట్లను సరి చెయ్యడానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటయ్యింది. భూమి యజమానుల రికార్డు అయినా రిజిస్టర్ 1, 1బిలో తప్పులుంటే సవరణ కోసం ఆర్వోఆర్ చట్టం కింద రెవెన్యూ డివిజనల్ అధికారికి అప్పీల్ చేసుకోవచ్చు, జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్ దాఖలు చెయ్యవచ్చు. కొత్త చట్టం కింద నిర్వహించే టైటిల్ రిజిస్టర్లో తప్పులుంటే జిల్లా స్థాయిలోని ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్ దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చు.టైటిల్ రిజిస్టర్లో నమోదు చేసిన వివరాలకు సంబంధించి వివాదాలుంటే జిల్లా స్థాయిలో ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్ దగ్గర అప్పీల్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చే తీర్పుపై అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించవచ్చు. సాక్షి: ఈ చట్టం కింద ఏర్పడే నూతన వ్యవస్థలు ఏమిటి? కల్లం: కొత్త చట్టం అమలులోకి వస్తే భూమి హక్కుల రిజిస్టర్కు భూమి టైటిలింగ్ ఆఫీసర్లను నియమిస్తారు. టైటిల్ రిజిస్టర్పై వివాదాలుంటే పరిష్కరించడానికి జిల్లా స్థాయిలో ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్లను నియమిస్తారు. ఇప్పుడున్న రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు అనుబంధ సంస్థలుగా పని చేస్తాయి. సాక్షి: కొత్త చట్టంలో సివిల్ కోర్టుల పాత్ర ఏమిటి? కల్లం: ఆర్వోఆర్ చట్టం కింద నిర్వహించే 1బి రిజిస్టర్లో నమోదు, తప్పొప్పుల సవరణ బాధ్యత సివిల్ కోర్టులకు లేనట్లే. ఈ కొత్త చట్టం కింద నిర్వహించే టైటిల్ రిజిస్టర్లో తప్పులను సవరించే బాధ్యత కూడా సివిల్ కోర్టులకు ఉండదు. వారసత్వ/ఆస్తి పంపకాల వివాదాలు, ప్రస్తుతం కోర్టుల్లో పెండింగులో ఉన్న వివాదాలు, టైటిల్ రిజిస్టర్ తయారీకి సంబంధం లేని ఇతర భూ వివాదాలు సివిల్ కోర్టు పరిధిలోనే ఉంటాయి. కొత్త చట్టం అమలులోకి వచ్చినప్పటికీ, ప్రస్తుతం కోర్టుల్లో పెండింగ్లో ఉన్న వివాదాల వివరాలు టీఆర్లో నమోదు చేయించుకోవాలి. అంతిమంగా ఉత్తర్వుల ప్రకారం చర్య తీసుకుంటారు. టీఆర్ నమోదైన వివరాలపై అభ్యంతరాలుంటే హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. సాక్షి: కొత్త చట్టంలో రికార్డులు ఎవరు నిర్వహిస్తారు? కల్లం: ఈ చట్టం కింద మూడు రికార్డులుంటాయి. 1. భూమి హక్కులకు అంతిమ సాక్ష్యంగా ఉండే టైటిల్ రిజిస్టర్, 2. భూ సమస్యలుంటే నమోదు చేసే వివాదాల రిజిస్టర్, 3. భూమిపై ఇతర హక్కులను నమోదు చేసే చార్లెస్ అండ్ కొవనెంట్స్ రిజిస్టర్. ఈ మూడు రిజిస్టర్లను కలిపి రికార్డ్ ఆఫ్ టైటిల్స్ అంటారు. ఈ రికార్డులను ల్యాండ్ అథారిటీ, సంబంధిత అధికారులు నిర్వహిస్తారు. సాక్షి: అభ్యంతరాలుంటే ఎంత కాలంలో తెలపాలి? కల్లం: టైటిల్ రిజిస్టర్లో ఉన్న వివరాలపై అభ్యంతరాలు ఉంటే ఆ వివరాలు నమోదైన రెండు సంవత్సరాల లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆర్వోఆర్ చట్ట ప్రకారం రూపొందిన రిజిస్టర్–1లో అభ్యంతరాలుంటే సంవత్సరంలోగా దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్ 1బిలో నమోదు చేసిన వివరాలపై అభ్యంతరాలుంటే 90 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. కానీ ఈ చట్టంలో అత్యధికంగా రెండేళ్ల కాల వ్యవధి ఇచ్చారు. సాక్షి: కొత్త చట్టం హక్కులకు భద్రతా? భంగమా? కల్లం: హక్కులకు పూర్తి భద్రత చేకూర్చడం, భూ యజమానులకు ప్రభుత్వమే భరోసాగా ఉండడమే ఈ చట్టం ఉద్దేశం. భూములన్నింటికీ ఒకే రికార్డు ఉండటం, ఈ రికార్డును ఆన్లైన్లో పూర్తి రక్షణతో అందరికీ అందుబాటులో ఉంచడం వలన పారదర్శకత వస్తుంది. తారుమారు చేసే అవకాశం లేకుండా రికార్డులు నిర్వహిస్తారు. ఈ చట్టం వలన భూ వివాదాలు భారీగా తగ్గుతాయి. కొత్తగా భూ యాజమాన్య వివాదాలు ఏర్పడే అవకాశాలు కూడా తగ్గుతాయి. కోర్టులు ఇచ్చిన తీర్పులను ఈ చట్టం కింద నమోదు చేసుకోవాలి. ఆ వివరాలకు ప్రభుత్వ గ్యారెంటీ లభిస్తుంది. టైటిల్ రిజిస్టర్లో క్లరికల్ తప్పిదాలుంటే టీఆర్ఓ వద్ద అప్పీలు చేసుకోవాలి. సాక్షి: ఇలాంటి చట్టం ఎక్కడైనా ఇప్పటికే అమలులో ఉందా? కల్లం: టైటిల్ గ్యారెంటీ చట్టం ఆస్ట్రేలియా, రష్యా, అమెరికా, కెనడా, బ్రిటన్, కామన్వెల్త్, తదితర వంద దేశాల్లో అమల్లో ఉంది. సాక్షి: కొత్త చట్టంలో భూమి కొనుగోలు చేస్తే కలిగే ప్రయోజనాలేమిటి? కల్లం: ఈ కొత్త చట్టం అమలులోకి వస్తే భూమి కొనుగోలు చేసే ముందు టైటిల్ రిజిస్టర్లో వివరాలు చూసుకుంటే చాలు. పాత విధానంలో ఆర్ఎస్ఆర్ నుంచి ప్రస్తుత అడంగల్ వరకూ ప్రతి సంవత్సరం రికార్డు పరిశీలించాల్సిన అవసరం ఉండదు. టైటిల్ రిజిస్టర్లో పేరుంటే ప్రభుత్వ భరోసాతో భూమి కొనుగోలు చెయ్యవచ్చు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఒకేసారి సులభంగా జరిగిపోతాయి. రిజిస్ట్రేషన్ జరిగిందంటే భూమి హక్కుల బదిలీ జరిగినట్టే. అన్ని రకాల భూములకూ ఈ చట్టం వర్తిస్తుంది. అన్ని రకాల భూములకు ఒకటే రిజిస్టర్ ఉంటుంది. సాక్షి: తగాదాలు వస్తే ఎవరు పరిష్కరిస్తారు? కల్లం: వివాదాలుంటే సర్వే, హద్దుల చట్టం కింద సంబంధిత అధికారులను కానీ, సివిల్ కోర్టును కానీ ఆశ్రయించవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య భాగ పంపిణీ, వారసత్వ తగాదాలు ఉంటే సివిల్ కోర్టులు పరిష్కరిస్తాయి. ఆస్తి పన్నులు, ఇతర వివాదాలు, కేసులు ఉంటే న్యాయస్థానాలు పరిష్కరిస్తాయి.రికార్డుల వివరాలపై అభ్యంతరాలుంటే చట్టంలో పేర్కొన్న కాల వ్యవధిలో ఎల్టీఏఓ, అప్పీలు వేసి, వివరాలు టీఆర్ఓ వద్ద నమోదు చేసుకోవాలి. అప్పీల్ చేసుకోకపోతే ఆ భూమిపై హక్కులకు ప్రభుత్వ గ్యారెంటీ లభించదు. ప్రస్తుతం సివిల్ కోర్టులో ఉన్న వివాదాల్లో వచ్చే అంతిమ తీర్పు ప్రకారమే టైటిల్ రిజిస్టర్లో హక్కుల నమోదు జరుగుతుంది. కానీ కోర్టుల్లో వివాదంలో ఉన్న వివరాలు టీఆర్ఓ వద్ద నమోదు చేయించుకుని, ఆ సర్టిఫైడ్ కాపీని సంబంధిత కోర్టుకు తెలియజేయాలి. -
భూసమస్యలన్నీ పరిష్కారమయ్యేలా...
దాదాపు వందేళ్ళ క్రితం బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ సర్వేలో భూమిని అనుభవిస్తున్న వారి వివరాలతో వాటి వాస్తవ స్థితిని నిర్ధారించారు. అయితే రెవెన్యూ రికార్డులను సరిగ్గా అప్డేట్ చేయకపోవడం, వివిధ చట్టాల్లో తీసుకువచ్చిన మార్పుల కారణంగా క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, వ్యత్యాసాలు భూమి రికార్డుల్లో నమోదు కాలేదు.ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రికార్డ్ ఆఫ్ రైట్స్’ చట్టాన్ని (భూ యాజ మాన్య హక్కు చట్టం) తెచ్చింది. భూ యాజమాన్య హక్కులకు సంబంధించి ఎదురవుతున్న అనేక సమస్యలను పరిష్కరించడానికి డ్రోన్లు, విమానాల ద్వారా భూముల రీ సర్వే చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి భూకమతంలో పట్టాదారు వాస్తవ స్థితిని ధ్రువీకరించేలా సర్వే జరుగుతోంది. భారతీయుల్లో భూమికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సమాజంలోని అన్ని వర్గాల సంస్కృతులు భూ యాజమాన్యానికి అనుకూలంగా ఉండడం వల్ల అందరూ దాన్ని కోరుకుంటారు. దేశంలోని గ్రామీణ కుటుంబాల మొత్తం ఆస్తిలో భూమి 73 శాతం ఉండగా, పట్టణ గృహాల ఆస్తిలో భూమి, భవనాలు 90 శాతం ఉన్నట్లు 2013 ఎన్ఎస్ఎస్ఓ నివేదికలో తేలింది. అందుకే పెట్టుబడిదారులు, రుణదాతలు, బ్యాంకర్లు స్పష్టమైన టైటిల్, స్పష్టమైన ల్యాండ్ మ్యాపింగ్, రికార్డుల నిర్వహణ, స్పష్టమైన హక్కులు ఉండాలని కోరుకుంటారు. కానీ మెకెన్సీ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో దేశంలోని ఎక్కువ భూముల యాజమాన్యానికి సంబంధించి చట్టపరమైన వివాదాలున్నాయని తేలింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ తరహా భూముల వివాదాలు 5 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. కానీ మన దేశంలో దాదాపు 70 శాతం సివిల్ వివాదాలున్నాయి. ప్రస్తుత రెవెన్యూ రికార్డులు ప్రాథమికంగా బ్రిటిష్ ప్రభుత్వం 100 ఏళ్ల క్రితం నిర్వహించిన సర్వే ఆధారంగా రూపుదిద్దుకున్నాయి. అవన్నీ ప్రభుత్వానికి భూముల ద్వారా ఎక్కువ ఆదాయాన్ని సేకరించే లక్ష్యంతో రూపొందించినవి. స్వాతంత్య్రం వచ్చాక కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు భూమిని సాగు చేసేవారికి సురక్షితమైన హక్కులు ఉండేలా ప్రోత్సహించడానికి అనేక భూ సంస్కరణలు ప్రవేశపెట్టాయి. ‘ఎస్టేట్లు – ఇనామ్ నిర్మూలన చట్టం’, ‘వ్యవసాయ భూముల సీలింగ్ చట్టం’, ‘పీఓటీ’ చట్టం, ‘ఆర్ఓఎఫ్ఆర్’ వంటి చట్టా లను వరుసగా వచ్చిన ప్రభుత్వాలు సాగుదారులకు అనుకూలంగా తీసుకువచ్చాయి. భూముల యాజమాన్యంలో జరిగిన ఈ మార్పు లన్నీ రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కినా... కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల క్రమం తప్పకుండా నవీకరణ (అప్డేట్) అవలేదు. దాదాపు 100 సంవత్సరాల క్రితం జరిగిన సర్వేలో భూమిని అను భవిస్తున్న వారి వివరాలతో వాటి వాస్తవ స్థితిని నిర్ధారించినా... రెవెన్యూ రికార్డులను సరిగ్గా అప్డేట్ చేయకపోవడం, వివిధ చట్టాల్లో తీసుకువచ్చిన మార్పుల కారణంగా క్షేత్ర స్థాయిలో నెలకొన్న పరిస్థి తులు, వ్యత్యాసాలు భూమి రికార్డుల్లో నమోదు కాలేదు. ఈ సమస్య లను పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వం ‘రికార్డ్ ఆఫ్ రైట్స్’ చట్టాన్ని ప్రవేశపెట్టింది. అలాగే ఆ చట్టాన్ని సవరించడం ద్వారా గ్రామాల వారీగా ప్రతి వ్యక్తి అధీనంలో ఉన్న భూమి వివరాలను రికార్డుల్లో అప్డేట్ చేసింది. ఇలా హక్కుల రికార్డును ప్రవేశపెట్టిన తర్వాత కూడా భూ వివాదాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుత రెవెన్యూ రికార్డులు ఊహాజనిత హక్కును మాత్రమే కల్పిస్తాయి. కొన్ని కేసుల్లో రికార్డులు క్షేత్ర స్థాయి పరిస్థితికి విభిన్నంగా ఉంటాయి. కోర్టు కేసులు, వారసత్వాలు, తనఖా వంటి భూమికి సంబంధించిన వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించే ఎలాంటి ఒకే ఒక్క మూలాధారం ప్రస్తుత రికార్డుల్లో లేదు. దీనివల్ల భూ యజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నింటినీ ఒకేసారి పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం రాష్ట్రం మొత్తాన్ని డ్రోన్లు, విమానాల ద్వారా భూముల రీ సర్వే చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి భూ కమతంలో పట్టాదారు వాస్తవ స్థితిని ధ్రువీకరించేలా సర్వే జరుగుతోంది. భూ యాజమాన్యంపై ఉన్న గందరగోళాన్ని తొలగించేలా రీ సర్వేలో ప్రతి భూభాగానికి జియో రిఫెరెన్స్ ఇస్తున్నారు. భూమి, దానికి సంబంధించిన రికార్డులను అనేక శాఖలు (రెవెన్యూ, పంచాయితీ రాజ్, పట్టణ స్థానిక సంస్థలు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, రిజిస్ట్రేషన్ శాఖలు) నిర్వహిస్తుండడం వల్ల తీవ్ర జాప్యం జరుగుతోంది. అలాగే పౌరులు వాటికి సంబంధించిన అనుమతులు, సేవలు పొందేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ పరిస్థితి ఎందుకంటే? భూమి యాజమాన్యం సార్వభౌమాధికారంతో ఉంటుందని దేశంలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం. అనేక అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా నిశ్చయాత్మకమైన టైటిల్ విధా నానికి (కన్క్లూజివ్ టైటిల్ విధానం) మన దేశం వెళ్లలేదు. ఇప్పుడు ఉన్న ల్యాండ్ టైటిల్ విధానం... యాజమాన్యాన్ని ధ్రువీకరించే నిశ్చ యాత్మక టైటిల్కు విరుద్ధంగా ‘అనుకూల టైటిల్ కాన్సెప్ట్’ (ప్రిజెమ్టివ్ టైటిల్) ఆధారంగా రూపొందించబడింది. అంటే భూమి అధీనంలో ఉన్న వ్యక్తి సదరు భూమికి సంబంధించి రెవెన్యూ శాఖకు పన్ను చెల్లిస్తున్న వ్యక్తిగా భావించబడే అర్థంలో ఇచ్చిన టైటిల్ మాత్రమే. అది కూడా ‘1872 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్’ ప్రకారం చట్టపరమైన స్వాధీనమే. భూమిపై లావాదేవీ జరిగినప్పుడు కూడా టైటిల్ వెరిఫి కేషన్ అవసరం లేని వ్యవస్థ కారణంగా భూమి టైటిల్ విధానం పేల వంగా ఉంది. ‘1908 ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్’ కూడా పత్రాల నమోదుకు సంబంధించిన చట్టమే తప్ప భూమి లేదా టైటిల్ రిజి స్ట్రేషన్కి సంబంధించినది కాదు. 1982 ఆస్తి బదిలీ చట్టానికి యాజ మాన్యం యొక్క ధ్రువీకరణ అవసరం లేదు. భూమి లావాదేవీల విషయంలో ఆదాయాన్ని పెంచడానికి మాత్రమే ఈ చట్టాలు పరిమి తమయ్యాయి. ఆ భూముల యాజమాన్యానికి సంబంధించి ఏదైనా ప్రశ్న తలెత్తితే, అది తనదేనని నిరూపించుకోవాల్సి బాధ్యత యజమా నిపైనే ఉంటుంది. తక్షణ సంస్కరణలు అవసరం ఈ నేపథ్యంలో భూ సమస్యలన్నింటినీ అధిగమించేందుకు ఎలా ముందుకు వెళ్లాలో సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ను నియమించింది. ఈ ‘టైటిల్ సర్టిఫికేషన్ టాస్క్ఫోర్స్’ ఒక సమగ్రమైన భూమి టైటిల్ వ్యవస్థను దేశంలో వీలైనంత త్వరగా తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తించింది. దాని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 2011లో ఒక ముసాయిదా ల్యాండ్ టైట్లింగ్ బిల్లును తీసు కువచ్చింది. నిశ్చయాత్మకమైన ఆస్తి హక్కుల (కన్క్లూజివ్ ప్రాపర్టీ టైటిల్స్) వ్యవస్థను ఏర్పాటు చేయడం, పాలన, నిర్వహించడం దీని ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా అనుసరించే ‘టోరెన్స్’ వ్యవస్థ ఆధారంగా దీన్ని రూపొందించారు. టోరెన్స్ వ్యవస్థ 3 సూత్రాలతో ఉంటుంది. 1. మిర్రర్ సూత్రం. ఇది టైటిల్ రిజిస్ట్రేషన్ను సూచిస్తుంది. క్షేత్ర స్థాయి వాస్తవికత (గ్రౌండ్ రియాలిటీ)ను కచ్చితంగా ప్రతిబింబిస్తుంది. 2. కర్టెన్ సూత్రం. ఇది గతానికి అడ్డుగా ఒక తెర ఉన్నన్నట్లు సూచిస్తుంది. టైటిల్ను రిజిస్టర్లో టైటిల్ నమోదు కావడమే ప్రస్తుత టైటిల్ నిశ్చయాత్మక రుజువు అనీ, గతాన్ని పరిశోధించాల్సిన అవ సరం లేదనీ చెబుతోంది. 3. హామీ సూత్రం. ఇది టైటిల్ను రిజిస్టర్ చేసే క్రమంలోనూ, భూ యజమానులకు జారీ చేసే ధ్రువీకరణ పత్రాలలోనూ దొర్లే తప్పు లకు నష్టపరిహారానికి ప్రభుత్వ సంస్థల హామీని ఇస్తుంది. ఇది కోర్టుల్లో కూడా చెల్లుబాటయ్యే పూర్తి అజేయమైన యాజమాన్య ధ్రువీకరణ పత్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ శాసనసభ 2019లో ‘ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టా’న్ని ఆమోదించి దాన్ని భారత రాష్ట్రపతి అంగీకారం కోసం పంపింది. దాన్ని అందుకున్న కేంద్రం భూమి వ్యవహారాలు పర్యవేక్షించే కేంద్ర ఎల్ఓఆర్, ఐటీ, న్యాయ తదితర శాఖల పరిశీలనకు పంపింది. ఆ యా శాఖలు కొంత సమయం తీసుకుని ఈ చట్టంపై అభిప్రా యాలు, వ్యాఖ్యలు పంపారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం అందుకనుగుణంగా టైట్లింగ్ బిల్లుకు పలు సవరణలు చేసి శాసనసభకు పంపింది. దీనిని 2023లో సభ ఆమోదించింది. ఆ బిల్లును మళ్లీ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా ఇటీవలే దానికి ఆమోదం లభించింది. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని నోటిఫై చేసి అమలు చేయడానికి కావల్సిన నియమాలు, మార్గదర్శకాలను రూపొందిస్తోంది. కానీ చర్చించకుండా హడావిడిగా చట్టం తెచ్చారని కొందరు బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉంది. రెండు సార్లు పూర్తిగా చర్చించి సంతృప్తి చెందిన తర్వాతే అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించింది. మన దేశంలో చట్టాలు ఇదే విధానంలో రూపుదిద్దు కుంటాయి తప్ప వేరే విధానంలో కాదు. ప్రజాస్వామ్యంలో చట్ట సభలు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. రాజ్యాంగ సవరణలు కూడా ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లవు. దీన్ని సమగ్రంగా పరిశీ లించడానికి, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు పలు దఫాలుగా పంపిన వివరణలు చూసి ఆమోదించడానికి కేంద ప్రభుత్వానికి నాలుగేళ్లు పట్టింది. భూముల వ్యవహారంలో రెవెన్యూ శాఖ సమర్థతను ప్రశ్నిస్తూ కొందరు వ్యక్తులు పత్రికలకు ఎక్కడం కూడా దురదృష్టకరం. బహుశా ఈ దేశంలో భూ యాజమాన్య వ్యవస్థల పరిణామం గురించి వారికి తెలియకపోవచ్చు. బ్రిటిష్వారు మొదటిసారిగా రైత్వారీ సెటిల్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, రెవెన్యూ సిబ్బంది అయిన సెటిల్మెంట్ అధికారులే భూమిని అనుభవిస్తున్న ప్రజలకు హక్కులు ఇచ్చారు తప్ప వేరే వారు కాదు. ఆర్ఓఆర్, ఎస్టేట్ల రద్దు, ఇనాం రద్దు, ల్యాండ్ సీలింగ్ వంటి భూమికి సంబంధించిన ప్రతి చట్టంలోనూ హక్కుదారులకు సంబంధించిన అంశాలను పరిష్కరించే అధికారం రెవెన్యూ అధికారులకే ఉంది. భూ సమస్యలను పరిష్కరించడంలో, పట్టా హక్కులు లేదా యాజమాన్య హక్కులు ఇవ్వడంలో రెవెన్యూ సిబ్బందికి మించిన జ్ఞానం ఎవరికీ ఉండదు. రెవెన్యూ సిబ్బందికి భూ చట్టాలు/సమస్యలను అర్థం చేసుకునే సామర్థ్యం లేదని చెప్పడం సరికాదు. అదే సందర్భంలో ఏ సీనియారిటీ ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులను నియమిస్తారనే విషయం రాష్ట్ర ప్రభు త్వానికే వదిలేయాలి. అన్ని వివరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులను ఖరారు చేస్తుంది. చట్టం ప్రకారం అప్పీలేట్ అధికారులుగా సర్వీసులో ఉన్న లేదా రిటైర్ అయిన జాయింట్ కలెక్టర్ స్థాయి కంటే తక్కువ కాకుండా ఉన్న వారే నియమితులవుతారు. అప్పీలేట్ అధికారులుగా ఎవరిని నియ మించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయించలేదు. ఈ దశలో ఎవరికి నచ్చినట్లు వారు ఊహించుకోవడం సరికాదు. టైటిల్ రిజిస్టర్లో నమోదైన ఎంట్రీలపై అప్పీల్ చేసుకునేందుకు రెండేళ్ల సమయం ఎలా సరిపోతుందని కొందరు ప్రశ్నించారు. ఇది చాలా విడ్డూరంగా కనిపిస్తోంది. మ్యుటేషన్ చట్టం, ఆర్ఓఆర్ వంటి ఏ ఇతర చట్టాల ప్రకారమైనా రికార్డింగ్ అధికారి నిర్ణయాన్ని సవాలు చేయడానికి చరిత్రలో ఎన్నడూ కొన్ని వారాల కంటే ఎక్కువ సమయం ఇవ్వలేదు. రికార్డింగ్ అధికారి నిర్ణయాన్ని సవాలు చేయడానికి కొన్ని వారాల సమయం మాత్రమే ఇస్తారు. కానీ ల్యాండ్ టైట్లింగ్ చట్టంలో రెండు సంవత్సరాల సమయం ఇచ్చారు. పైన చెప్పిన టోరెన్స్ వ్యవస్థ ప్రకారం పునఃసమీక్ష, పరిష్కారం తర్వాత, రికార్డింగ్ చేయబడుతుంది, ఇది తాత్కాలికంగా మాత్రమే పరిగణించబడుతుంది. ఈ ప్రక్రియలో పట్టాదారులకు నోటీసులు ఇవ్వబడతాయి. ఈ తాత్కా లికాన్ని సవాలు చేయడానికి ప్రజలకు 2 సంవత్సరాల సమయం ఇస్తారు. 2 సంవత్సరాలలోపు ఎటువంటి ఛాలెంజ్ లేకపోతే, తాత్కా లికమే ఫైనల్ అవుతుంది. ఈ విషయంలో పరిమితి చట్టంలోని నిబంధనలను కోట్ చేయడం అసంబద్ధం. అజేయ కల్లం వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారు -
Viveka Case: నా వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేశారు
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ.. హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జిషీట్లో తన వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం తెలంగాణ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నా వాంగ్మూలంపై సిబిఐ తప్పుడు వైఖరి "ఏప్రిల్ 29న నేను వాంగ్మూలం ఇస్తుండగా.. అధికారి మరొకరిని లోపలికి పిలిచారు. ఆయన లాప్ట్యాప్తో వచ్చి ఏదో రికార్డు చేసుకున్నాడు. ఆయన ఏం రికార్డు చేసింది నాకు చూపించలేదు. కనీసం చదివి వినిపించలేదు. నాకు తెలిసినంతవరకు నా వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో రికార్డు కూడా చేయలేదు. సీబీఐ నా స్టేట్మెంట్ను తప్పుడు రికార్డు చేసినట్లు మే 17న ఓ పత్రికలో ప్రచురితమైన వార్త ద్వారా తెలుసుకున్నా". విచారించింది ఒకరయితే, సంతకం చేసింది మరొకరా? "నా స్టేట్మెంట్పై సంతకం చేసిన అధికారి, నన్ను విచారించిన అధికారి ఒకరు కాదు. దర్యాప్తు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రాజ్యాంగ ధర్మాసనాలు పదేపదే చెబుతున్నా.. కొందరు మాత్రం వాటిని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. దర్యాప్తు చేయడం అంటే అస్పష్టమైన సత్యాన్ని బయటికి తీసుకురావడం. కానీ, ఇక్కడ అధికారులు అలా వ్యవహరించలేదు." నా వాంగ్మూలం పత్రికకు సిబిఐ ఎలా లీక్ చేస్తుంది? "నా వాంగ్మూలం గురించి నేను ఎవరి వద్దా ప్రస్తావించలేదు. కానీ, ఆ పత్రికలో ఎలా వచ్చిందో నాకు అర్థంకాలేదు. ఆశ్చర్యం వేసింది. ఆ పత్రికలో పేర్కొన్నదంతా అసత్యపూరితం. పత్రికలో వచ్చిన దానిపై ఎలక్ట్రానిక్ మీడియా చర్చా కార్యక్రమాలు పెట్టడంతో నేను విలేకరుల సమావేశం పెట్టి.. ఆ పత్రికది కట్టుకథ అని చెప్పాల్సి వచ్చింది. సీబీఐ నమోదు చేసింది కూడా నేను చెప్పింది కాదని తెలిసింది. అయితే సీఆర్పీసీ 161 కింద రికార్డు చేసిన కాపీ నావద్ద లేనందున నా వాంగ్మూలం తప్పుగా పేర్కొన్న విషయాన్ని తెలుసుకోలేకపోయా" నేను చెప్పింది ఒకటయితే సిబిఐ మరోలా స్టేట్ మెంట్ తయారు చేస్తుందా? "ఏప్రిల్ 29, 2023న సీబీఐ నా నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసింది. నేను చెప్పింది ఒకటయితే CBI దాన్ని మార్చి ఛార్జిషీటులో మరోలా పేర్కొంది. మార్చి 15, 2019న జగన్ గారి నివాసంలో సుమారు ఉదయం 5 గంటల సమయంలో మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైంది. సమావేశం మొదలైన సుమారు గంటన్నర తర్వాత అటెండర్ వచ్చి డోరు కొట్టారు. OSD కృష్ణమోహన్రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్గారికి ఏదో విషయం చెప్పారు. వెంటనే జగన్గారు షాక్కు గురైయ్యారు. చిన్నాన్న చనిపోయారని తమతో అన్నారు" ఇంతకుమించి తానేమీ సీబీఐకి చెప్పలేదని అజేయ కల్లం స్పష్టం చేశారు. నేను చెప్పని విషయాలు మీరేలా స్టేట్ మెంట్ లో చేర్చుతారు? తాను CBIకి స్టేట్మెంట్లో కేవలం పైన పేర్కొన్న విషయాన్ని మాత్రమే చెప్పానని, కాని సీబీఐ ఛార్జిషీటులో వీటిని మార్చివేసిందని అజేయ కల్లం తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి భార్య ప్రస్తావన కాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదని అజేయ కల్లం తెలిపారు. అయితే సీబీఐ పేర్కొన్న స్టేట్మెంట్లో తనకు ఆపాదించి, తాను చెప్పినట్టుగా అబద్ధాలను చేర్చారని అజేయకల్లం పిటిషన్ లో పేర్కొన్నారు. CBI దాన్ని తొలగించాల్సిందే "దురదృష్టవశాత్తు నేను చెప్పింది CBI సరిగ్గా రికార్డు చేయలేదు. చార్జిషీట్లో సీబీఐ పేర్కొంది పూర్తిగా అసంబద్ధం. దర్యాప్తును తప్పుదారి పట్టించి.. ఇతరులను కేసులో ఇరికించే ధోరణితోనే సీబీఐ ఇలా తప్పుగా పేర్కొంది. నేను చెప్పకున్నా చెప్పినట్లు సీబీఐ తప్పుడు వాంగ్మూలాన్ని సమర్పించడం ఎంతమాత్రం సరికాదు. ఇతర వ్యక్తులను చిక్కుల్లో పడేసేందుకే సీబీఐ తప్పుడు సమాచారం చేర్చింది. ఈ అంశాలను పరిశీలించి హైదరాబాద్ సీబీఐ కోర్టులో సమర్పించిన చార్జిషీట్ నుంచి తప్పుడు వాంగ్మూలాన్ని తొలగించాలి". తెలంగాణ హైకోర్టు ఆ ఛార్జ్ షీట్ నుంచి తన వాంగ్మూలం తొలగించేలా ఆదేశాలివ్వాలని అజేయ కల్లం విజ్ఞప్తి చేశారు. వివక్ష లేకుండా విచారణ జరగాలి సీబీఐ తన వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేయడం చట్టవిరుద్ధమని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా విచారణ సాగాలని అజేయకల్లం విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ లో సీబీఐ డైరెక్టర్ని, వివేకా కేసు విచారణాధికారి (ఏఎస్పీ)ని ప్రతివాదులుగా చేర్చారు. -
నూతన విద్యా విధానంతో ఉజ్వల భవిష్యత్తు
బంగారుపాళెం: నూతన విద్యా విధానంతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, రిటైర్డ్ సీఎస్ అజేయ కల్లం అన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలంలోని నల్లంగాడు, తుంబకుప్పం గ్రామ సచివాలయాలను గురువారం ఆయన సందర్శించారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై అక్కడి సిబ్బందిని ఆరా తీశారు. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా.. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం ద్వారా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు అడిగిన ప్రశ్నకు అజేయ కల్లం సమాధానం ఇస్తూ.. గతంలో 2, 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు వెళ్లి చదువులు సాగించిన విషయాన్ని గుర్తుచేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులందరూ కలిసి చదువుకోవడం వల్ల తెలివితేటలు బాగా ఉండేవని, పిల్లల్లో స్నేహపూర్వక వాతావరణం నెలకొని ఉండేదని తెలిపారు. ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న విద్యావిధానం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తోందని చెప్పారు. అజేయ కల్లంను జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రామచంద్రారెడ్డి, ఎంపీపీ అమరావతి, వైస్ ఎంపీపీ శిరీష్రెడ్డి, సర్పంచులు ధనంజయరావు, లీలావతమ్మ, రంజిత్కుమార్రెడ్డి, తహసీల్దార్ బెన్రాజ్, ఇన్చార్జి ఎంపీడీవో సందీప్ మర్యాద పూర్వకంగా కలిశారు. -
ఆయుర్వేదం విశిష్టమైన వైద్య విధానం: అజేయ కల్లం
సాక్షి, అమరావతి: ఆయుర్వేద వైద్యం అనేది వేదాలు, పంచ భూతాల ఆధారంగా ప్రకృతి పరంగా అందించబడిన విశిష్టమైన వైద్య విధానమని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. సీఎం వైఎస్ జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సచివాలయం మూడో బ్లాక్లో ఏపీ రాష్ట్ర ఆయుష్ విభాగం, సచివాలయ ఉద్యోగుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆయుర్వేద మెగా ఆరోగ్య శిబిరాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఆయుష్ కమిషనర్ కల్నల్ రాములు మాట్లాడుతూ ఈ మెగా వైద్య శిబిరం ద్వారా వివిధ సాధారణ వ్యాధులకు నిపుణులైన వైద్యులచే ఉచితంగా పలు సలహాలు సూచనలతోపాటు అవసరమైన మందులను ఉచితంగా పొందవచ్చన్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య శిబిరంలో 10 మంది ఆయుర్వేద వైద్య నిపుణులు, ఐదుగురు హోమియో వైద్య నిపుణులు, ఐదుగురు యోగా గురువులతో పాటు మొత్తం 40 మంది వైద్య బృందం పాల్గొంటున్నట్లు చెప్పారు. అంతకు ముందు సీఎం జన్మదినోత్సవం సందర్భంగా అజేయ కల్లం కేక్ కట్ చేసి ‘ఆయుష్ ద్వారా ఆరోగ్యం’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
‘సమీకృతం’గా రైతులకు సాధికారత
గుంటూరు రూరల్: సమీకృత విధానంలో వ్యవసాయం ద్వారా రైతుల సాధికారత దిశగా కృషిచేయాలని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం సూచించారు. గుంటూరు సమీపంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సమీకృత వ్యవసాయం ద్వారా రైతుల సాధికారతపై నిర్వహించిన రెండురోజుల జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. రెండోరోజు సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అజేయ కల్లం మాట్లాడుతూ రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నదాతలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి నేతృత్వంలో 11 విభాగాలపై చర్చలు జరిపి రైతుల అభివృద్ధికి తీర్మానాలు చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఎ.విష్ణువర్థన్రెడ్డి , డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ టి.జానకిరాం, మాజీ ఉపకులపతి డాక్టర్ రాఘవరెడ్డి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ త్రిమూర్తులు, అగ్రివిుషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు డాక్టర్ ఎం.చంద్రశేఖర్రెడ్డి, ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ కె.గురవారెడ్డి, రైతులు, పాల్గొన్నారు. -
భూముల రీసర్వే ప్రాజెక్టు పనులు వేగవంతం చేయండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో భూముల రీసర్వే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని రాష్ట్రస్థాయి స్టీరింగ్, ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో భూముల రీసర్వే ప్రాజెక్టుకు సంబంధించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న అర్బన్ సర్వే పైలట్ ప్రాజెక్టు పూర్తి కానుండగా, త్వరలోనే ఇతర పట్టణాలకు విస్తరించనున్నామని ఆశాఖ అధికారులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సర్వే, సెటిల్మెంట్, భూమి రికార్డుల కమిషనర్ సిద్దార్థ జైన్ మాట్లాడుతూ..రీసర్వే పనులకు అవసరమైన పరికరాల కొనుగోలు టెండర్లను వెంటనే పిలవాలని కమిటీ నిర్ణయించిందన్నారు. సరిహద్దుల వద్ద భూరక్ష రాళ్లను వెంటనే ఏర్పాటు చేసేందుకు స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. -
అది టీడీపీ ఎమ్మెల్సీ పీఆర్వో పనే
మంగళగిరి: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లంతో పాటుకొందరు విలేకరులపై సోషల్ మీడియాలో దు్రష్పచారానికి పాల్పడింది టీడీపీ ఎమ్మెల్సీ పీఆర్వో చైతన్య, ఎమ్మెల్సీ అనుచరులేనని పోలీసుల విచారణలో తేలింది. విద్యుత్ శాఖలో ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేసిన కేసుతో పాటు అదే ఉద్యోగాలకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసిన ఇద్దరు వ్యక్తులను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు మంగళగిరి సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. 2017లో ఎమ్మెల్సీ, మంత్రికి అనుచరుడిగా ఉన్న మంగళగిరికి చెందిన గాలి వెంకట లారెన్స్ పట్టణంలోని కొత్తపేటకు చెందిన కారంచేటి మణికాంత్కు విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.23 లక్షలు తీసుకున్నాడు. మూడేళ్లు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడం, డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో మణికాంత్ ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్న కోలపల్లి సునిల్కుమార్ కీలకపాత్ర వెలుగులోకి వచ్చింది. అతనితోపాటు ఎమ్మెల్సీకి మరో సన్నిహితుడు లారెన్స్ పేరు బయటకు రావడంతో పీఆర్వో చైతన్య దీన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడ వేశాడు. ఎమ్మెల్సీకి కేసు చుట్టుకుంటుందనే భావనతో ఉద్యోగాల పేరిట వసూళ్లకు సంబంధించి అజేయ కల్లం, ఆర్కే, సాక్షి విలేకరిపై దుష్ప్రచారానికి పూనుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో లారెన్స్, కొప్పూరి వేణును అరెస్ట్ చేసినట్టు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
నా పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోంది
సాక్షి, అమరావతి: మంగళగిరి ప్రాంతానికి చెందిన కొందరు ఓ ముఠాగా ఏర్పడి.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తన పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు వాట్సాప్ పోస్టుల ద్వారా తన దృష్టికి వచ్చిందని డీజీపీ గౌతం సవాంగ్కు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం బుధవారం ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపించాల్సిందిగా కోరారు. ఈ ఆరోపణల మీద సమగ్ర విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విచారణలో ఈ వార్తలు తప్పని తేలితే.. వాట్సాప్ మెసేజ్లు ఎక్కడ్నుంచి పుట్టుకొచ్చాయో.. వాటికి కారకులెవరో? గుర్తించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అజేయ కల్లం డీజీపీని కోరారు. -
నా పేరుతో మోసాలు: అజేయ కల్లం
సాక్షి, గుంటూరు: మంగళగిరికి చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి తన పేరుతో ఘరానా మోసాలకు పాల్పడుతున్నట్లు ఏపీ సీఎం ప్రధాన సలహాదారు, మాజీ సీఎస్ అజేయ కల్లం బుధవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ముఠా తన పేరును వాడుకుని జూనియర్ లైన్మెన్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. వాట్సప్ పోస్టుల ద్వారా ఈ విషయం తన దృష్టికి వచ్చినట్లు చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డీజీపీని కోరారు. ఒకవేళ విచారణలో ఈ వార్తలు తప్పని తేలితే వాట్సప్ మేసేజ్లు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి, వాటికి కారకులేవరో గుర్తించి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. -
గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం
సాక్షి, అమరావతి బ్యూరో: గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శనీయంగా నిలిచిందని ఏపీ సీఎం సలహాదారు, మాజీ సీఎస్ అజేయ కల్లం అన్నారు. ఏఎన్యూలో ‘గ్రామీణ భారతదేశ సుస్థిర అభివృద్ధి పయనం–అభినందనీయమైన గ్రామ సచివాలయ వ్యవస్థ’ అనే అంశంపై సోమవారం సదస్సు జరిగింది. సదస్సులో అజేయ కల్లం ఆన్లైన్ ద్వారా ప్రసంగిస్తూ ప్రజా భాగస్వామ్యం లేని సమాజాభివృద్ధికి అర్థమే లేదన్నారు. గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం బాధ్యతని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణాభివృద్ధిలో బాధ్యతాయుతంగా చర్యలు చేపడుతున్నారన్నారు. అందులో భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారన్నారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు పాలన, అధికార వికేంద్రీకరణ చేపట్టడం ద్వారా అవినీతికి తావులేకుండా వాటి ఫలాలు క్షేత్రస్థాయిలో అన్ని వర్గాలకు అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. లక్షలాది మంది వలంటీర్లు నిస్వార్థమైన సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఈ వ్యవస్థ ద్వారా గ్రామీణ పేద వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. గ్రామీణ సేవల విషయంలో గతంలో కేరళ ఆదర్శంగా ఉండేదని, నేడు గ్రామ సచివాలయాల ఏర్పాటుతో ఆ ప్రభుత్వం కూడా ఏపీని ఆదర్శంగా తీసుకుంటుందని వివరించారు. గ్రామ సచివాలయాల ద్వారా రానున్న రోజుల్లో మరిన్ని ఆదర్శవంతమైన ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె.హేమచంద్రా రెడ్డి, ఏఎన్యూ వీసీ ఆచార్య పి.రాజశేఖర్, ఏపీ ప్రభుత్వ ఐసీడీ (ఇంటర్ కేడర్ డిప్యుటేషన్) ఐఏఎస్ అధికారి జీఎస్ నవీన్కుమార్ తదితరులు మాట్లాడారు. -
వికేంద్రీకరణతో మూడు ప్రాంతాల అభివృద్ధి
సాక్షి, అమరావతి: వికేంద్రీకరణతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, భవిష్యత్తులోనూ ప్రాంతీయ విద్వేషాలు వచ్చేందుకు ఆస్కారం ఉండదని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. వీలైనన్ని తక్కువ నిధులతో మూడుచోట్ల 3 నగరాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. పాలన వికేంద్రీకరణకు సంబంధించి వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఆదివారం వెబినార్ నిర్వహించింది. ఆ సెల్ కన్వీనర్ ఎం.మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్లో అజేయ కల్లం మాట్లాడారు. వెయ్యి కోట్లతో విశాఖ శివార్లలో పరిపాలనకు అవసరమైన భవనాలు నిర్మించవచ్చని, ఇందుకు భూమి అందుబాటులో ఉందని చెప్పారు. విశాఖకి కొంత బూస్ట్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో హైదరాబాద్కు పోటీగా తయారవుతుందన్నారు. వెయ్యి కోట్లతో కర్నూలులో హైకోర్టుకు భవనాలు, వసతులు కల్పిస్తే ఆ నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. అసెంబ్లీని అమరావతిలోనే కొనసాగించడం ద్వారా ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు కాపాడే అవకాశం ఉంటుందని చెప్పారు. అమరావతి ప్రాంతం వ్యవసాయాధారితమైనది కావడం వల్ల ఇక్కడ అందుకనుగుణమైన పరిశ్రమల ఏర్పాటుకు ఆస్కారం ఉందన్నారు. రాజధాని రైతుల ప్రయోజనాలు కాపాడతామన్నారు. 29 గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని, వారికిచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ నేతృత్వంలో ఏర్పాటైన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ నివేదికలో వికేంద్రీకరణ గురించి చెప్పారన్నారు. స్వయంపాలనకు వీలుగా పంచాయతీలకు యంత్రాంగం, నిధులు సమకూర్చాలని గాంధీజీ చెప్పారని, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ ప్రభుత్వం అదే చేస్తోందని తెలిపారు. రాజధాని పేరుతో కార్యకలాపాలన్నింటినీ ఒకేచోట చేయాలని ఎక్కడా లేదన్నారు. వికేంద్రీకరణతో సాంకేతికంగా 99.999 శాతంమంది ప్రజలకు ఇబ్బంది ఉండదన్నారు. బీసీజీ నివేదిక ప్రకారం అమరావతి నిర్మాణానికి లక్ష కోట్ల నుంచి లక్షన్నర కోట్లు ఖర్చవుతుందని, అంతచేసినా అది లాభదాయకం కాదన్నారు. ప్రభుత్వం తక్కువ ఖర్చుతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేలా వికేంద్రీకరణను ప్రతిపాదించిందన్నారు. -
న్యాయ వ్యవస్థపై అమితమైన గౌరవం ఉంది
-
ఏపీ హైకోర్టుకు ‘సుప్రీం’ కమాండ్
(సాక్షి, ప్రత్యేక ప్రతినిధి): నిస్సందేహంగా ఇదో సంచలనమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఆవేదనను ఆధారాలతో సహా భారత ప్రధాన న్యాయమూర్తితో పంచుకుంది. ఎందుకంటే దర్యాప్తు దశలో స్టే ఇవ్వవద్దని సుప్రీం కోర్టు పదే పదే చెబుతున్నా.. రాష్ట్ర హైకోర్టులో మాత్రం అలాంటి ‘స్టే’లు మంజూరైపోతున్నాయి. ఏ దర్యాప్తూ కదలకుండా ముందరికాళ్లకు బంధాలు పడిపోతున్నాయి. ఇక చిన్న చిన్న కేసుల్లో సైతం తీర్పుల సంగతలా ఉంచితే... రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిర్వీర్యమైపోయిందన్న స్థాయిలో తీవ్రమైన వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. వెంటనే ఓ వర్గం మీడియాలో అవన్నీ విపరీతమైన ప్రాధాన్యంతో ప్రసారమౌతూ అచ్చయిపోతున్నాయి. ఎందుకిలా అవుతోందని ఆరా తీసిన ప్రభుత్వం... అవన్నీ సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ఎన్.వి.రమణ జోక్యంతో జరుగుతున్నాయని తెలుసుకుని ఆధారాలతో సహా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేకు అందజేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటమే కాక... తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అడ్వొకేట్ జనరల్గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్తో కలిసి జస్టిస్ ఎన్.వి.రమణ ఎలా ఆస్తులను పోగేసుకున్నారో అందులో వివరించారు. జస్టిస్ రమణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నపుడు మామూలు న్యాయవాదిగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్కు అనుకూలంగా ఎన్ని ఉత్తర్వులిచ్చారో కూడా ముఖ్యమంత్రి ఆధారాలతో సహా వివరించారు. వీటన్నిటితో పాటు చంద్రబాబు నాయుడికి, జస్టిస్ ఎన్.వి.రమణకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని వెల్లడించే మరో ఆధారాన్ని కూడా సీఎం తన లేఖలో ప్రస్తావిస్తూ అందజేశారు. గతంలో ఓ ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సభ్యుడిగా జస్టిస్ ఎన్.వి.రమణ వ్యక్తం చేసిన అభిప్రాయం... అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసిన అభిప్రాయం అచ్చు గుద్దినట్లు ఒక్కటేనని... కింద సంతకాలు మాత్రమే మారాయని... ఈ విషయాన్ని అప్పట్లో కొలీజియం సభ్యుడిగా ఉన్న జస్టిస్ చలమేశ్వర్ స్వయంగా చెప్పారని కూడా సీఎం పేర్కొన్నారు. ఈ కుమ్మక్కు కారణంగా తాము ఏ అక్రమాన్ని వెలికితీయాలనకున్నా అడ్డుపడుతున్నారని, దానికి అన్ని స్థాయిల్లోనూ ఒత్తిళ్లు తెస్తున్నారని జగన్ వివరించారు. ఈ మేరకు ఆధారాలను కూడా సీజేఐకి అందజేసినట్లు శనివారం ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం తెలియజేశారు. రాత్రి 9 గంటల సమయంలో మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలు వెల్లడించారు. ( జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!) సీజేఐకి లేఖ, ధ్రువపత్రాలు కూడా... అమరావతి భూ కుంభకోణంగా ప్రభుత్వం పేర్కొంటున్న వ్యవహారంలో కేబినెట్ సబ్కమిటీ విచారణను, సిట్ దర్యాప్తును నిలిపేస్తూ ఇటీవల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వి.సోమయాజులు ఇచ్చిన ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేయటం మీకు తెలుసు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి సైతం... ఈ కుంభకోణంలో మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జి కుటుంబ సభ్యులపై జరుగుతున్న దర్యాప్తును నిలిపేశారు. అంతేకాక దానికి సంబంధించిన వార్తలు మీడియాలో రాకుండా గ్యాగ్ ఉత్తర్వులిచ్చారు. వీటినీ సుప్రీం కోర్టులో సవాల్ చేశాం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరుగుతున్న పరిణామాలను... ప్రత్యేకించి ఏపీ హైకోర్టు వ్యవహారాల్లో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ జోక్యాన్ని దేశ ప్రధాన న్యాయమూర్తికి తెలియజేశాం. దీనికి సంబంధించిన వివిధ పత్రాలనూ ఈ నెల 8న ఆయనకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అందజేశారు. ఇవన్నీ జస్టిస్ ఎన్.వి.రమణకు, టీడీపీ అధిపతి నారా చంద్రబాబు నాయుడితో ఉన్న అనుబంధాన్ని, టీడీపీ నేతల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలను బయటపెట్టేవే. ఇక జస్టిస్ ఎన్.వి.రమణ తాను హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నపుడు దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించిన కేసుల్లో ఆయనకు అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులైతే న్యాయ వ్యవస్థ దుర్వినియోగాన్ని బయటపెడతాయి. ఈ పరిణామాలన్నిటినీ సీజేఐకి లేఖ రూపంలో ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర హైకోర్టు వ్యవహారాలను జస్టిస్ ఎన్.వి.రమణ నేరుగా ఎలా ప్రభావితం చేస్తున్నారో తెలియజేశారు. అమరావతి భూ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారాలను, దాంట్లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి ముందుంచారు’’ అని కల్లం వివరించారు. మీడియా సమావేశంలో భాగంగా వివిధ పత్రాలను మీడియాకు కూడా అందజేసినా... అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి ఇటీవల దమ్మాలపాటి, సుప్రీం న్యాయమూర్తి కుమార్తెలపై ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని, దానికి సంబంధించిన ఫిర్యాదును మాత్రం ఇవ్వలేదు. హైకోర్టు ఈ వ్యవహారాన్ని మీడియాలో ప్రచురించకుండా “గ్యాగ్’ ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో ఇలా చేసినట్లు కల్లం తెలిపారు. అయితే ఈ సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి మాత్రం అందజేశామన్నారు. ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ విషయంలో ముందుకెళ్లేటపుడు అఫిడవిట్లతో సహా ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టంచేశారు. ( జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!) న్యాయ వ్యవస్థపై అమితమైన గౌరవం ఉంది... ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి హైకోర్టుపై, సుప్రీంకోర్టుపై, న్యాయవ్యవస్థపై అత్యంత గౌరవ ప్రపత్తులున్నట్లు కల్లం తెలిపారు. సీఎం తన లేఖలోనూ ఈ విషయం పేర్కొన్నారని చెప్పారు. “ఇదంతా కొద్ది మంది గౌరవ న్యాయమూర్తుల వ్యవహార శైలిని సుప్రీంకోర్టుకు వివరించే ప్రయత్నమే. ముఖ్యమంత్రిగానీ, ప్రభుత్వం గానీ ఎప్పుడూ చట్టాలకు, రాజ్యాంగానికి లోబడే పనిచేస్తాయి. ఏ వ్యవస్థతోనయినా గౌరవపూర్వకమైన విభేదాలే ఉంటాయి’’ అని కల్లం ఉద్ఘాటించారు. టీడీపీ ప్రయోజనాలే లక్ష్యంగా.. హైకోర్టు ఉత్తర్వులివీ తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను పరిరక్షించేందుకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లోని వాస్తవాలు ఇవీ అని పేర్కొంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుప్రీం సీజేకు అనుబంధ పత్రాలు అందజేశారు.. దానిలోని అంశాలు చూస్తే.. చంద్రబాబు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ వ్యవస్థలను గౌరవనీయ సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జిల ద్వారా రాజకీయాలకు వినియోగించుకోవడం బాధ, ఆవేదన కలిగిస్తోంది. ప్రజాస్వామికంగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, పడగొట్టడానికి గౌరవప్రదమైన హైకోర్టును ఉపయోగించుకుంటున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మాయని మచ్చలాంటి తీర్పుల వెనుక జస్టిస్ ఎన్వీ రమణ ద్వారా చంద్రబాబు సాగిస్తున్న బహిరంగ, రహస్య కార్యకలాపాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతిలో వివిధ సంస్థలకు చెందిన వారు భూములు కొన్న విషయం ప్రజలకు తెలిసిందే. అసెంబ్లీ ఆమోదించిన మూడు రాజధానులు, ఒక కీలకమైన చర్చ జరిగిన విషయాన్ని సవాలు చేస్తూ ఈ ఏడాది జనవరి నుంచి వరుసగా రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. అమరావతిలో తమ స్వార్థ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఈ పిటిషన్లు వేశారు. ఈ సందర్భంలో అక్కడ జరిగిన నిరసనలకు స్వార్థపూరిత వ్యక్తులే నిధులు సమకూర్చారని నివేదికలు చెబుతున్నాయి. వివిధ దశల్లో 30 వరకూ పిల్స్ దాఖలయ్యాయి. ముఖ్యమంత్రిని ప్రతివాదిగా కూడా పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపట్టినప్పటి నుంచి ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో న్యాయ పరిపాలనను హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ద్వారా జస్టిస్ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారనే విషయం స్పష్టమైంది. ఆ ప్రభావం ఈ విధంగా ఉంది. ► చంద్రబాబునాయుడు నిర్ణయం మేరకు ఆయన ప్రయోజనాలు కాపాడే విధంగా జడ్జిల సిట్టింగ్ రోస్టర్ను ప్రభావితం చేశారు. ఆ జడ్జిల్లో జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ డి.రమేశ్ తదితరులు ఉన్నారు. ► న్యాయంవైపు లేకుండా ఉన్న, హైకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న పిల్స్ను అనుమతించే దిశగా ప్రభావం. ► కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభావం టీడీపీ ప్రయోజనాలను పరిరక్షించిన ప్రత్యేక సందర్భాలు అమరావతి ల్యాండ్ స్కామ్ : అమరావతి భూ కుంభకోణంపై ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే హైకోర్టు స్టే విధించింది. జస్టిస్ కె. లలిత జడ్జిల్లో తెలుగుదేశం ప్రయోజనాలను కాపాడే వాళ్లలో జస్టిస్ కె. లలిత ఒకరు. మెడికల్ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టయ్యారు. ఆయన ఒక వారం రోజులు జైల్లో లేకుండానే.. ఆ జడ్జి ఆ మాజీ మంత్రిని ఆస్పత్రికి మార్చాలని ఆదేశాలిచ్చారు. తర్వాత ఇంకో ఆస్పత్రికి మార్చారు. తుదకు ఆస్పత్రి నుంచే విడుదల అయ్యే విధంగా బెయిల్ ఇచ్చారు. ఆ ఆదేశాలను ఆపాలని కోరుతూ ప్రభుత్వం వేసిన పిటిషన్లపై వాదనలు వినలేదు. దీంతో అచ్చెన్నాయుడుకు ప్రయోజనం చేకూరింది. ( జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!) అలాగే రక్షిత స్థలంలో ఉన్న ఇళ్లను, కట్టడాలను తొలగించడానికి గతంలో ఉన్న ఏపీసీఆర్డీఏ ప్రక్రియ మొదలు పెట్టింది. ఆ ఇళ్లలో చంద్రబాబు నివాసం కూడా ఉంది. ఆ ప్రక్రియపై స్టే ఉంది. వరదల సమయంలో నది నీళ్లు ఆ ఇళ్లలోకి చేరాయి. అలాగే ఆ కట్టడాలు ప్రవాహానికి ఆటకం కలిగించాయి. జస్టిస్ డి.రమేష్ జస్టిస్ రమేష్ను క్రిమినల్ కేసుల్లో క్వాష్ పిటిషన్ల విచారణ, రిట్ పిటిషన్ల పరిధిలో వ్యూహాత్మకంగా ఉంచారు. గత ప్రభుత్వం హయాంలో అడ్వొకేట్ జనరల్కు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా జస్టిస్ రమేష్ ఉండేవారు. టీడీపీకి అనుబంధంగా ఉన్న వారి విషయంలో ఆయన వ్యవహారం ఇలా ఉంది.. ► రమేష్ హాస్పిటల్స్కు చెందిన డాక్టర్ రమేష్ దాఖలు చేసిన పిటిషన్కు అనుకూలంగా, ఆయనపై తదుపరి చర్యలు తీసుకోకుండా జస్టిస్ రమేష్ స్టే ఇచ్చారు. రమేష్ ఆస్పత్రి నిర్వహించిన కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 10 మంది చనిపోయిన విషయంలో జస్టిస్ రమేష్ ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ డాక్టర్ రమేష్ పరారీలోనే ఉన్నారు. జస్టిస్ రమేష్ ఆదేశాలను సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. ► ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీపై దాఖలైన ఎఫ్ఐఆర్ను క్వాష్ కోరుతూ రాష్ట్ర ఎన్నికల అధికారి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కొన్ని రోజుల నిందితుడు అదే ఎఫ్ఐఆర్ను క్వాష్ కోరుతూ రెండో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణకు స్వీకరించినపుడు రెండు పిటిషన్లు కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. అయితే కారణాలు ఏమీ చెప్పకుండా జస్టిస్ రమేష్ మాత్రం దర్యాప్తుపై స్టే విధించారు. సత్యనారాయణ మూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి గత పది సంవత్సరాల నుం జస్టిస్ ఎన్వీ రమణకు విశ్వసనీయమైన వ్యక్తిగా ఉన్నారు. ప్రభుత్వంపై ఆయన వ్యతిరేకత ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పరిపాలనలో హైకోర్టు జోక్యం చేసుకున్న ప్రతి విషయంలోనూ ఆయన పాత్ర స్పష్టంగా కనబడుతుంది. రాజధానుల విచారణ విషయంలో అన్ని సందర్భాల్లో (ఆయన పక్కన కానీ లేదా ఫుల్ బెంచ్ అయినా కానీ) జస్టిస్ సత్యనారాయణ మూర్తి తనతో ఉన్నట్లు చీఫ్ జస్టిస్ నిర్ధారించారు. ప్రభుత్వ న్యాయవాదులపై ఆయన దారుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. ► ఇంటర్ కాలేజీల సంఘం దాఖలు చేసిన పిటిషన్ విషయంలో.. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 365 విషయంలో అడ్వొకేట్ జనరల్కు సూచనలు చేస్తూ జస్టిస్ మూర్తి వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విషయంలో కౌంటర్ను పట్టించుకోకుండా కేవలం పిటిషనర్ అఫిడవిట్ ఆధారంగా జస్టిస్ మూర్తి విచారణను రిజర్వ్లో ఉంచారు. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో కూడా పలుమార్లు ప్రభుత్వాన్ని ఆయన వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై కూడా ఆయన పలుమార్లు విమర్శలు చేశారు. ► మాజీ అడ్వొకేట్ జనరల్, జస్టిస్ ఎన్వీ రమణకు ఆప్తుడు అయిన దమ్మాలపాటి శ్రీనివాస్పై నమోదైన క్రిమినల్ కేసు విషయంలో దర్యాప్తు కొనసాగకుండా జస్టిస్ మూర్తి స్టే ఇచ్చారు. జస్టిస్ డి.సోమయాజులు ► పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నుంచి నవయుగ ఇంజనీరింగ్ను తొలగించిన విషయంలో ఆ కంపెనీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ జస్టిస్ సోమయాజులు వద్దకు విచారణకు వచ్చింది. హైకోర్టు వెబ్సైట్లో ఆయన ప్రొఫైల్ చూస్తే.. జస్టిస్ సోమయాజులు గతంలో నవయుగ కంపెనీకి లీగల్ సలహాదారుగా ఉన్నారు. విచారణ సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించలేదు. ఆయన ఇచ్చిన ఆదేశాలను మరో జడ్జి వెకేట్ చేశారు. అయితే చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్.. జస్టిస్ సోమయాజులు ఇచ్చిన పూర్వ ఆదేశాలను తిరిగి అనుమతించింది. ► కేబినెట్ కమిటీ, సిట్ నివేదికలకు సంబంధించి అన్ని ప్రభుత్వ ఆదేశాలపై జస్టిస్ సోమయాజులు స్టే విధించారు. ఈ కేసు విషయంలో రిట్ పిటిషన్లు దాఖలు చేసిన వారు టీడీపీ కార్యకర్తలే. తమ పార్టీ ప్రతిష్టకు భంగం అంటూ ఆ పిటిషన్లు దాఖలు చేశారు. సర్కారుకు వ్యతిరేకంగా ‘ఎల్లో పిల్స్’ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ ఆ పార్టీ ఎజెండాను మోస్తున్న ఆంధ్రజ్యోతి, టీవీ5 న్యూస్ చానెల్ రాష్ట్ర ప్రభుత్వంపై పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) దాఖలు చేయడానికి కారణమయ్యాయి. ముందుగా ఆయా అంశాలపై ఈ రెండు మీడియా సంస్థలు కథనాలు ఇవ్వడంతోపాటు చర్చలు నిర్వహిస్తాయి. ఇలా జరిగిన కొద్ది రోజులకే వాటిపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో పలు పిల్స్ దాఖలు అవుతాయి. వీటిలో కొన్ని.. జడ్జిల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని పిల్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తోందంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఆగస్టు 15న ఒక కథనం ప్రచురించింది. అదే రోజు ఆ కథనాన్ని రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి ఖండించారు. ఆ పత్రిక రాసింది తప్పుడు కథనమని హైకోర్టు రిజిస్ట్రార్కు తెలిపారు. ఇది జరిగిన రెండు రోజులకే అంటే ఆగస్టు 17న హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై హైకోర్టు ఎలాంటి ప్రామాణికత లేని ఆ పత్రిక కథనాన్ని ఆధారం చేసుకుని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే ఆ పత్రిక కథనం ఆధారంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందులో విచిత్రమేమిటంటే.. అటు హైకోర్టు.. ఇటు చంద్రబాబు ఫోన్ల ట్యాపింగ్ ఎలాంటి ఆధారాలను చూపకపోవడం గమనార్హం. విశాఖలో టీడీపీ ర్యాలీకి అనుమతి నిరాకరణ విశాఖలో బహిరంగ ర్యాలీ నిర్వహించడానికి టీడీపీని అనుమతించకపోవడానికి సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. విశాఖ వెళ్లడానికి చంద్రబాబును ప్రభుత్వం అనుమతించని ఒక రోజు తర్వాత, సీఆర్పీసీ సెక్షన్ 151 కింద ఆయనకు నోటీసు జారీ చేసి అరెస్టు చేశాక ఈ పిల్ దాఖలు చేయడం గమనార్హం. దీనిపై కోర్టు డీజీపీని కోర్టుకు పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా అని నిలదీసింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ పిల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఒక నాయకుడు కోవిడ్–19 మార్గదర్శకాలను ఉల్లంఘించారని, భౌతికదూరాన్ని పాటించడం లేదని ఆరోపిస్తూ ఈ పిల్ను దాఖలు చేశారు. విచారణ చేసి ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేశామని ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అయితే దీనిపై సంతృప్తి చెందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉల్లంఘనలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నానని పేర్కొన్నారు. ఇది జరిగిన మరుసటి రోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని కోర్టులో పిల్ దాఖలైంది. ఈ రెండు పిల్స్ను కలిపి విచారించిన హైకోర్టు దీనికి సీబీఐ విచారణ అవసరం లేదని పేర్కొంది. పలు విషయాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పులు.. 1. గ్రామ పంచాయతీ కార్యాలయాల అధికార పార్టీ జెండా రంగులేస్తోందని పిల్స్ 2. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశపెట్టడంపై పిల్ 3. రాష్ట్ర ఎన్నికల సంఘానికి, మరెన్నో అంశాలకు సంబంధించి రిట్ పిటిషన్లు 4. జస్టిస్ ఈశ్వరయ్య, సస్పెన్షన్కు గురైన న్యాయాధికారి రామకృష్ణ మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణపై హైకోర్టు నేరుగా విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణ చేయాలని జస్టిస్ రవీంద్రన్ను కోరింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టుపై కుట్ర జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేకుండానే విచారణ బాధ్యతలను రవీంద్రన్కు అప్పగించింది. ( జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!) -
నగదు బదిలీతో రైతు చేతికే ‘అస్త్రం’
సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్తు మోటార్లకు మీటర్లను అమర్చడం వల్ల అంతిమంగా రైతులకే మేలు జరుగుతుందని, లో వోల్టేజీ ఇబ్బందులు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం లాంటి సమస్యలకు తెరపడుతుందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం పేర్కొన్నారు. సరఫరాలో అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు రైతులకు అందుతుందని, దీన్ని హక్కుగా నిలదీసే అవకాశం కూడా వ్యవసాయదారులకు లభిస్తుందని తెలిపారు. రాష్ట్ర రైతాంగానికి మరో 30 ఏళ్ల పాటు పూర్తి ఉచితంగా రోజూ 9 గంటలు పగటిపూట విద్యుత్తు అందించే విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని స్పష్టం చేశారు. కేంద్ర సంస్కరణల్లో భాగంగా నగదు బదిలీని అమలు చేసినా ఏ ఒక్క రైతుపైనా పైసా కూడా భారం పడనివ్వబోమన్నారు. విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత సర్కారు నిర్లక్ష్యంతో.. గత సర్కారు నిర్వాకాలతో 42 శాతం ఫీడర్లలో నాణ్యమైన విద్యుత్తు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఫీడర్లను బలోపేతం చేసేందుకు ఈ ప్రభుత్వం రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తోంది. రబీ నాటికి çవంద శాతం ఫీడర్ల పరిధిలో పగటి పూటే 9 గంటల విద్యుత్తు అందచేస్తాం. రూ.8 వేల కోట్ల బకాయిలు చెల్లించాం.. నేరుగా నగదు బదిలీ చేయడం వల్ల పంపిణీ సంస్థల(డిస్కమ్లు) చేతికి డబ్బులు అంది ఆర్థికంగా మనుగడ సాగించగలుగుతాయి. చంద్రబాబు అధికారంలో ఉండగా డిస్కమ్లకు బకాయిలు 14 నెలల పాటు చెల్లించలేదు. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టాక రూ.8.000 కోట్ల బకాయిలు చెల్లించడంతోపాటు బిల్లులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తోంది. రైతు చేతిలో ‘అస్త్రం’ నగదు బదిలీ విధానంలో రైతులు తమ జేబు నుంచి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన పనిలేదు. ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే సొమ్ము బిల్లుల చెల్లింపు కోసం డిస్కమ్లకు చేరుతుంది. దీనిద్వారా రైతు ఎంత బిల్లు చెల్లిస్తున్నాడో తెలుసుకుంటాడు. విద్యుత్తులో నాణ్యత లేకుంటే నిలదీయవచ్చు. అంటే ప్రభుత్వం రైతుల చేతిలో ఒక అస్త్రాన్ని పెడుతోంది. ఫలితంగా డిస్కమ్ల బాధ్యత, జవాబుదారీతనం పెరుగుతుంది. 10 వేల మెగావాట్లతో సోలార్ ప్లాంట్లు... మీటర్లు బిగించడం లాంటి అవసరాలకు మూలధన వ్యయం తప్పదు. అయితే ఇది వ్యవస్థను మెరుగుపరిచేందుకు చేస్తున్న ప్రయత్నం. రైతులకు 30 ఏళ్ల పాటు నిరాటంకంగా ఉచిత విద్యుత్తు ఇవ్వాలంటే ఇలాంటి చర్యలు తప్పవు. అందుకోసమే ప్రభుత్వం 10 వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్తును అందుబాటులోకి తెస్తోంది. శ్రీకాకుళం నుంచి శ్రీకారం ► డిసెంబర్ నుంచి నగదు బదిలీని శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం. ► ఉచిత విద్యుత్తు వినియోగంపై ఎలాంటి పరిమితులు ఉండవు. ఒక్క కనెక్షన్ కూడా తొలగించరు. ఎక్కువ కనెక్షన్లు ఉన్నా ఇబ్బంది లేదు. ► ప్రతీ కిలోవాట్కు రూ. 1,200 డెవలప్మెంట్ చార్జీలు, ప్రతీ హెచ్పీకి రూ. 40 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి అక్రమ కనెక్షన్లు క్రమ బద్ధీకరించుకోవచ్చు. అదనపు లోడ్కు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. మీటర్లతో మేలు ఇలా.. మీటర్లు అమర్చడం వల్ల రైతు ఎంత విద్యుత్తు వినియోగిస్తున్నారో తెలుసుకుని అందుకు తగినట్లుగా లోడ్ ప్రకారం ట్రాన్స్ఫార్మర్ను అప్గ్రేడ్ చేయవచ్చు. లేదంటే మారుస్తారు. దీనివల్ల సరఫరాలో నాణ్యత పెరుగుతుంది. లో వోల్టేజీ–హై వోల్టేజీ లాంటి సమస్యలుండవు. ఎంత విద్యుత్తు కావాలో సబ్ స్టేషన్ స్థాయి నుంచే తెలుస్తుంది కనుక అంత మేరకు రైతులకు చేరుతుంది. -
తొమ్మిది గంటలు ఎంత వాడినా ఫ్రీనే
సాక్షి, విజయవాడ: వ్యవసాయ రంగానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం గురించి అనుమానాలు ఏమైనా ఉంటే నివృత్తి చేయడానికి తాను మీడియా ముందుకు వచ్చాను అన్నారు సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం ముఖ్య ఉద్దేశ్యం పగటి పూట 9 గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వడం. ఇందుకు సంబంధించిన బిల్లును రైతుకు ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి ప్రభుత్వమే నగదు చెల్లిస్తుంది. నాణ్యమైన విద్యుత్ని అందిస్తున్న నేపథ్యంలో రైతుకు ప్రశ్నించే అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వం 16,371 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలకు బకాయి ఉంది. ప్రతి మోటార్కు మీటర్ అమర్చడం ద్వారా నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మరింత చౌకగా ఉచిత విద్యుత్ని అందిస్తాం’ అన్నారు. (చదవండి: సాగుకు ‘పవర్’) అంతేకాక ‘రైతు 9 గంటలు ఎంత విద్యుత్ వినియోగించినా అంతా ఉచితమే. విద్యుత్ మీటర్ రీడింగ్ అంతా ప్రభుత్వం చూస్తుంది. అనధికారికంగా ఉన్న విద్యుత్ కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తాం. రైతులు కోసం ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తెరుస్తాం. దీనిపై బ్యాంకులు, విద్యుత్ అధికారులు మద్య ఒప్పందం జరగనుంది. కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బంది రాదు. గత ప్రభుత్వం కంటే మెరుగ్గా, చిత్తశుద్ధితో 7 వేలకు పైగా జూనియర్ లైన్ మెన్లను ఏర్పాటు చేశాం. 2018-19 కంటే 2019-20లో విద్యుత్ సరఫరాలో 38శాతం అవాంతరాలు తొలగిపోయాయి. రైతుకు అదనపు కనెక్షన్లు ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ పథకం కార్పొరేట్ పరిధిలోకి రాదు. 1250 రూపాయలు అదనంగా చెల్లిస్తే సరిపోతుంది. విద్యుత్ కనెక్షన్ల మార్పులకు సంబంధించిన వివరాలను విలేజ్ సెక్రటరీలకు ఇస్తే సరిపోతుంది. శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా డిసెంబర్ నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యుత్ నగదు బదిలీ అమలు చేస్తాం. 17 లక్షలు పైగా కనెక్షన్లు ఉన్నాయి. అనధికారికంగా ఉన్న కనెక్షన్లు ఒక లక్షకు పైగా ఉన్నట్లు అంచనా. వాటిని క్రమబద్దీకరిస్తాం’ అన్నారు అజేయ కల్లాం. -
రైతు శ్రేయస్సే ధ్యేయం
-
రైతులు పైసా కట్టక్కర్లేదు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలకు అనుగుణంగానే వ్యవసాయ విద్యుత్తు వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని చేపట్టాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్తు కోసం రైతులు పైసా కూడా కట్టాల్సిన అవసరం లేదని, మీటర్లకయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. బిల్లు చెల్లిస్తారు కనుక విద్యుత్తు నాణ్యతపై రైతులకు అధికారులను నిలదీసే హక్కు ఉంటుందని చెప్పారు. అధికారులు కూడా మరింత బాధ్యతగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. బుధవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉచిత విద్యుత్తుపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఉచిత విద్యుత్తు పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని తెలిపారు. కనికరం లేకుండా కాల్పులు జరిపించారు.. ఉమ్మడి రాష్ట్రంలో ఏడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా నాటి చంద్రబాబు సర్కారు కనికరించలేదు. కరవు వెంటాడుతున్నా నిర్దాక్షిణ్యంగా వ్యవసాయ విద్యుత్ ధర హార్స్పవర్ రూ. 50 నుంచి రూ. 650కి పెంచింది. విద్యుత్తు బిల్లులు కట్టలేదని రైతులపై కాల్పులు జరపడంతోపాటు జైళ్లలో పెట్టిన ఘనత చంద్రబాబు సర్కారుదే. వైఎస్సార్ ఆశయాల దిశగానే... – ఈ పరిస్థితిని చూసి చలించిన దివంగత వైఎస్సార్ అధికారం చేపట్టగానే దేశానికే ఆదర్శమైన ఉచిత విద్యుత్పథకాన్ని తెచ్చారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్య, ఉచిత విద్యుత్తు రైతు ఇంట ఆనందాన్ని నింపాయి. రూ. 50 వేల కోట్లతో రైతుల కోసం జలయజ్ఞం చేపట్టిన ఘనత వైఎస్సార్దే. – వైఎస్సార్ చేపట్టిన ప్రతీ పథకాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లేందుకేసీఎం జగన్ శ్రమిస్తున్నారు. బాబు మాటలు బూటకం.. మిగులు విద్యుత్తు అంటూ చంద్రబాబు చెప్పే మాటలు బూటకం. రాష్ట్ర విభజన నాటికే ఏపీలో 55 శాతం విద్యుత్ఉత్పత్తి ఉండగా తెలంగాణాలో 45 శాతం ఉంది. వినియోగం తెలంగాణలో 57 శాతం, ఏపీలో 43 శాతం ఉంది. ఏపీలో 12 శాతం అదనపు ఉత్పత్తి ఉంది. ప్రైవేటు విద్యుత్ను ప్రోత్సహించేందుకు థర్మల్ విద్యుత్తు పీఎల్ఎఫ్ తగ్గించడమే చంద్రబాబు ఘనత. ఆ బకాయిలన్నీ సీఎం జగన్తీరుస్తున్నారు – వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తు సరఫరా కష్టమైనా సీఎం జగన్ సాహసంతో అమలు చేస్తున్నారు. ఫీడర్ల బలోపేతం కోసం రూ. 1,700 కోట్లు మంజూరు చేశారు. – గత సర్కారు రూ.34 వేల కోట్ల మేర విద్యుత్తు బకాయిలు పెట్టి వెళ్లిపోతే సీఎం జగన్ వాటిని తీరుస్తున్నారు. విద్యుత్సబ్సిడీలకు సంబంధించి రూ.17,904 కోట్లు ఖర్చు పెట్టారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఇందులో సగం కూడా ఇవ్వలేదు. – ఈ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్సబ్సిడీ కోసం రూ.7 ,171 కోట్లు ఇచ్చింది. అక్వాసాగుదారులకు రూ.700 కోట్లు ఇచ్చింది. అన్ని రకాల ఉచిత విద్యుత్తు సబ్సిడీలు కలిపి రూ.11,000 కోట్లు ఇచ్చింది. కేంద్రం తెచ్చిన సంస్కరణలతో.. –సంస్కరణల దిశగా కేంద్రం వేస్తున్న అడుగులను అన్ని రాష్ట్రాలు అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదనపు నిధులపై కొన్ని షరతులు విధించింది. విద్యుత్సబ్సిడీని రైతుల ఖాతాలకు బదిలీ చేయాలనేది ఇందులో ప్రధానమైనది. డిసెంబర్లోగా ఒక్క జిల్లాలో అయినా ప్రయోగాత్మకంగా నగదు బదిలీ అమలు చేసి వచ్చే సంవత్సరం రాష్ట్రమంతా విస్తరిస్తామని చెబితేనే అప్పులపై కేంద్రం వెసులుబాటు కల్పిస్తుంది. -
మేడం... మీ లెక్క తప్పింది
సాక్షి, అమరావతి: కేంద్రం రాష్ట్రానికి ఒక యూనిట్ విద్యుత్ను రూ.2.70కే సరఫరా చేస్తుంటే, పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ రూ.9 చొప్పున సరఫరా చేస్తోందన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్లోని లేక్వ్యూ గెస్ట్ హౌస్లో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రి చెప్పిన మాటలు అవాస్తవమన్నారు. ఎన్టీపీసీ కుడ్గి నుంచి యూనిట్కు రూ.9.84 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వద్దన్నా.. కేంద్రం అంటగడుతోందని ఆయన ఎత్తిచూపారు. రాష్ట్రంలో కుటుంబ పాలన, కులం, అవినీతిని రూపుమాపాలనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వాటిపై పోరాటం చేసే.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. విద్యుత్ చార్జీల్లో మార్పులు చేయలేదు ► పరిశ్రమలకు యూనిట్కు రూ.7.65 చొప్పున వసూలు చేయాలని 2017లో టీడీపీ సర్కార్ నిర్ణయించింది. ఆ చార్జీల్లో మేం ఎలాంటి మార్పులు చేయలేదు. ► దేశంలో పరిశ్రమలకు యూనిట్ విద్యుత్ను తెలంగాణ రూ.7.60, మహారాష్ట్ర రూ.7.25, రాజస్తాన్ రూ.7.30, కర్ణాటక రూ.7.20, తమిళనాడు రూ.6.35 చొప్పున సరఫరా చేస్తున్నాయి. ► తమిళనాడులో కేంద్రం అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల యూనిట్ను రూ.3 చొప్పున ఇస్తుండటంతో ఆ రాష్ట్రం యూనిట్ను రూ.6.35 చొప్పున పరిశ్రమలకు సరఫరా చేస్తోంది. ► గుజరాత్లో రాయితీలు తక్కువగా ఉండటం.. ఎక్కువ విద్యుదుత్పత్తి కేంద్రాలు ఉండటం వల్ల యూనిట్ రూ.5 చొప్పున పరిశ్రమలకు సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో యూనిట్పై రూ.1 చొప్పున రాయితీ ఇస్తున్నాం. అంటే.. యూనిట్ విద్యుత్కు రూ.6.65 చొప్పున వసూలు చేస్తున్నాం. టీడీపీ సర్కార్ అవినీతి వల్లే చార్జీలు అధికం ► థర్మల్ విద్యుత్ కేంద్రం పనులకు మెగావాట్కు రూ.3 కోట్ల నుంచి రూ.3.50 కోట్లకు మించి ఖర్చు కాదు. కానీ.. టీడీపీ సర్కార్ రూ.8.50 కోట్ల చొప్పున కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఈ వ్యవహారంలో టీడీపీ సర్కార్ పెద్దలు భారీగా కమీషన్లు తిన్నారు. ఈ ఒక్క విద్యుత్ కేంద్రం వల్లే విద్యుత్ సంస్థలపై రూ.20 వేల కోట్ల అప్పు భారం పడింది. ► బహిరంగ మార్కెట్లో సౌర, పవన విద్యుత్లు యూనిట్ రూ.2.. అంతకంటే తక్కువ ధరకు లభ్యమవుతోంటే.. టీడీపీ సర్కార్ అధిక ధరలకు దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)ను కుదుర్చుకుంది. ఈ వ్యవహారంలోనూ టీడీపీ సర్కార్ పెద్దలు అవినీతికి పాల్పడ్డారు. ► 2014 నాటికి ఏపీ జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్లకు రూ.24,800 కోట్లు అప్పులు ఉండేవి. కానీ.. టీడీపీ సర్కార్ అవినీతి, అసమర్థత.. నిర్వహణ లోపం వల్ల విద్యుత్ సంస్థల అప్పులను రూ.70 వేల కోట్లకు పెంచేసింది. అప్పుగా తెచ్చిన నిధులను టీడీపీ సర్కార్ పెద్దలు తినేశారు. ► విభజన సమయంలో సింగరేణి కాలరీస్ తెలంగాణకు కేటాయించారు. రాష్ట్రానికి బొగ్గు గనులను కేటాయించలేదు. దీని వల్ల బొగ్గు కొనుగోలు కోసం ఏటా అదనంగా రూ.2,500 కోట్ల మేర భారం పడుతోంది. విద్యుత్ వాడకపోయినా ట్రాన్స్మిషన్ చార్జీలా! ► సెంట్రల్ ట్రాన్స్మిషన్ లైన్ల ద్వారా రాష్ట్రం మీదుగా సరఫరా అవుతున్న విద్యుత్ను వినియోగించుకున్నా.. వినియోగించుకోకపోయినా.. పక్క రాష్ట్రాలు వినియోగించుకుంటున్నా మెగావాట్కు రూ.5.50 లక్షల చొప్పున కేంద్రానికి రాష్ట్రం చెల్లించాల్సి వస్తోంది. ► ఇతర రాష్ట్రాలు ట్రాన్స్మిషన్ చార్జీలు మెగావాట్కు రూ.లక్ష చెల్లిస్తున్నాయి. ఇది అధర్మమని కేంద్రానికి చెప్పాం. వినియోగించుకున్న విద్యుత్కు మాత్రమే ట్రాన్స్మిషన్ చార్జీలు వసూలు చేయాలని సూచించాం. ఇందుకు కేంద్రం అంగీకరించింది. కానీ.. ఇప్పటికీ ఆ తప్పును సరిదిద్దలేదు. దీని వల్ల ట్రాన్స్మిషన్ చార్జీల రూపంలోనే ఏడాదికి రూ.1,700 కోట్లు కేంద్రానికి చెల్లించాల్సి వస్తోంది. ► బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతున్నా.. సోలార్ బండిల్(సేవలతో కలిపి ఉత్పత్తిని విక్రయించే వ్యూహం) విద్యుత్ను ఎన్టీపీసీ యూనిట్ రూ.4.84 చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీని వల్ల ఏడాదికి విద్యుత్ సంస్థలపై రూ.3,500 కోట్లకుపైగా భారం పడుతోంది. ► టీడీపీ సర్కార్ చేసిన అప్పుల్లో రూ.53 వేల కోట్లను కేంద్ర సంస్థలైన పీఎఫ్సీ, ఆర్ఈసీల నుంచే చేసింది. అదీ పది శాతం వడ్డీపై. అంటే వడ్డీ రూపంలోనే ఏటా రూ.5,300 కోట్లకుపైగా చెల్లించాల్సి వస్తోంది. దీని వల్లే రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు అధికంగా ఉంటున్నాయి. అద్భుతమైన వ్యవస్థను తీసుకొచ్చాం ► ఎన్నడూ ప్రజా జీవితంలో లేకున్నా.. ఎలాంటి అర్హతలు లేకున్నా.. ఎమ్మెల్యే కాకపోయినా.. కేవలం కొడుకు అనే ‘ఏకైక’ కారణంతో ఒకరిని మంత్రిని చేసిన కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలకాలనే ఆమె అభిప్రాయాలను గౌరవిస్తున్నాం. ► సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా ఇటీవల సచివాలయ ఉద్యోగాల భర్తీలో మెరిట్పైనే 80 శాతం పోస్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఇచ్చాం. నామినేటెడ్ పదవుల్లో కూడా ఈ వర్గాలకు 50 శాతం పదవులను ఇచ్చేలా చట్టాన్ని తెచ్చి, అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ► అవినీతిని నిర్మూలించాలనే లక్ష్యంతో.. గ్రామ స్థాయి నుంచి వ్యవస్థలను పటిష్టం చేయాలనే గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం. వలంటీర్ల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సేవలు అందిస్తున్నాం. ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలోనే మరెక్కడా లేదు. ► ఇంజనీరింగ్ పనుల టెండర్లలో అవినీతిని నిర్మూలించడానికి చట్టాన్ని తెచ్చాం. జ్యుడిషియల్ ప్రివ్యూను ఏర్పాటు చేశాం. జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించిన షెడ్యూళ్లతో రివర్స్ టెండరింగ్ను నిర్వహిస్తున్నాం. ► టీడీపీ సర్కార్ హయాంలో అక్రమాలు జరిగిన టెండర్లను రద్దు చేసి.. గత నెల వరకూ నిర్వహించిన రివర్స్ టెండరింగ్లో రూ.2,072 కోట్ల మేర ఖజానాకు ఆదా చేశాం. టీడీపీ సర్కార్ పట్టణాల్లో ఐదు లక్షల ఇళ్లకు టెండర్లు పిలిచింది. నిర్మాణం ప్రారంభించని 64 వేల ఇళ్ల పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తేనే రూ.400 కోట్లు ఆదా అయింది. -
‘అధిక ధరకు విద్యుత్ అంటగడుతున్నారు’
సాక్షి, హైదరాబాద్: ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి అవినీతికి తావులేకుండా గ్రామస్థాయి నుంచి పటిష్టమైన వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేస్తున్నారని సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్ ఛార్జీలు, తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. ఉద్యోగ నియామాకాల్లో 80 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైరారిటీలకు ప్రాధాన్యత ఇస్తూ చట్టం తీసుకొచ్చామన్నారు. రివర్స్ టెండంరింగ్ ద్వారా ఇప్పటివరకు రూ.2,072 కోట్లు ఆదా అయ్యాయని వివరించారు. వద్దన్నా విద్యుత్ అంటగడుతున్నారు ‘విద్యుత్ టారిఫ్పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేశాయి. ఏపీలో పరిశ్రమలకు యూనిట్ విద్యుత్ ధర రూ.7.65ల టారిఫ్ గత ప్రభుత్వమే నిర్ణయించింది. మా ప్రభుత్వం వచ్చిన తరువాత దీనిలో ఎలాంటి మార్పు చేయలేదు. కేంద్రం రూ.2.70పైసలకే యూనిట్ విద్యుత్ ఇస్తుందని కేంద్రమంత్రి చెప్పడం అవాస్తవం. ఎన్టీపీసీ రూ.9.84పైసలకు యూనిట్ విద్యుత్ ఇస్తోంది. వద్దన్నా ఈ విద్యుత్ను ఏపీకి అంటగడుతున్నారు. ఒక మెగావాట్ విద్యుత్ ట్రాన్స్మిట్ చేసినందుకు ఏపీ నుంచి రూ.5 లక్షలు వసూలు చేస్తున్నారు. పక్క రాష్ట్రం వారు విద్యుత్ తీసుకుంటున్నా ట్రాన్స్మిషన్ చార్జీలు మనం చెల్లించాల్సి వస్తోంది. గత ఒప్పందాల వల్లే పెరిగిన విద్యుత్ ధరలు కేంద్రానికి ఏడాదికి ట్రాన్స్మిషన్ చార్జీలే రూ.1700కోట్లు ఏపీ చెల్లిస్తోంది. కేంద్రం చేసిన ఒప్పందాలను ఇప్పటి వరకు ఎక్కడా ఏపీ ఉల్లంఘించలేదు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏపీకి బొగ్గుగనులు కేటాయించలేదు. ప్రత్యేక బొగ్గు గనుల కేటాయింపులు లేకపోవడం వల్ల ఏడాదికి రూ.2,500కోట్లు అదనంగా ఏపీ చెల్లించాల్సి వస్తోంది. గత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం చేసిన కొన్ని ఒప్పందాల వల్లే ఏపీలో విద్యుత్ ధరలు పెరిగాయి. 2014లో అన్ని విద్యుత్ సంస్థల అప్పు కలిపి రూ 24,800 కోట్లు.. నేడు అది 70,000 కోట్లకు పెరిగింది. అవినీతి, తప్పుడు ఒప్పందాల వల్లే ఈ అప్పులు ఇంతగా పెరిగాయి. ఈ అప్పులకు వడ్డీలు కట్టడం వల్ల కూడా విద్యుత్ చార్జీలపై ప్రభావం పడుతోంది. గత ప్రభుత్వం వెళుతూ రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టింది’అంటూ అజేయ కల్లం వివరించారు. -
అదే సీఎం జగన్ సిద్ధాంతం : అజేయ కల్లాం
-
అదే సీఎం జగన్ సిద్ధాంతం : అజేయ కల్లాం
సాక్షి, చిత్తూరు : అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన అని ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లాం అన్నారు. ఆదివారం ఆయన మూడు రాజధానులకు మద్దతుగా చిత్తూరు జిల్లా నారావారిపల్లి గ్రామంలో నిర్వహించిన అధికార వికేంద్రీకరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజేయకల్లాం మాట్లాడుతూ.. అధికార వికేంద్రీకరణ అనేదే సీఎం జగన్ ప్రభుత్వ సిద్ధాంతం అని, ఇందులో భాగంగానే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ అలోచిస్తే.. చంద్రబాబు, ఎల్లో మీడియా ఒకే చోట అభివృద్ధిని కోరుకుంటున్నాయని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వం కొంతమంది లబ్ధి కోసమే అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపట్టిందని ఆరోపించారు. గతంలో హైదరాబాద్లో మాత్రమే పెద్ద పెద్ద కంపెనీలను పెట్టించారని, దాని వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందని చెప్పారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అలా చేయకుండా తమ రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని తీసుకెళ్లి సక్సెస్ సాధించాయని తెలిపారు. రాజధాని సెంటర్లో ఉండాలని కోరుకోవడం తప్పు అని అన్నారు. రాజధాని మధ్యలో ఉండాలని చంద్రబాబు అంటున్నారని, ఢిల్లీ నుంచి అమెరికా వరకు ఎక్కడా రాజధాని మధ్యలో లేదనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేయడమే టీడీపీ సిద్ధాంతం అని విమర్శించారు. -
గ్రామ స్వరాజ్యానికి నాంది
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాలు, అభివృద్ధి వికేంద్రీకరణ, పీపీఏలు, పారిశ్రామిక విధానం, రాజధాని, రివర్స్ టెండరింగ్ తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య సలహాదారు అజేయ కల్లంతో ‘సాక్షి’ ముఖాముఖి చర్చించింది. ఆ వివరాలు ఇవీ.. గాంధీ జయంతి రోజే ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి నాంది పలికేలా గ్రామ సచివాలయాలను ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణాలు ఏమిటి? పరిపాలన వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలన అందించవచ్చన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భావన. పంచాయతీలు తీసుకున్న నిర్ణయాల అమలుకు కార్యనిర్వాహక వ్యవస్థ లేదు. స్థానిక సంస్థల బలోపేతం కోసం పార్లమెంట్ చేసిన 73, 74వ రాజ్యాంగ సవరణలను అమలు చేస్తూ దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో గ్రామ సచివాలయాల ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. సర్పంచి నేతృత్వంలో గ్రామ సభలు నిర్వహించి గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయడమే వీటి ఉద్దేశం. జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యమిదే. గ్రామంలోనే సమస్యలు పరిష్కారమవడం వల్ల ప్రజాప్రతినిధులు, అధికారులపై భారం తగ్గుతుంది. సచివాలయాలు అందుబాటులోకి రావడం వల్ల సర్పంచి తప్పనిసరిగా గ్రామసభ నిర్వహించాల్సిందే. గ్రామ సచివాలయాల్లో అక్రమాలకు తావులేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సచివాలయ ఉద్యోగులకు పకడ్బందీగా శిక్షణ ఇస్తాం. నైతిక, మానవీయ విలువలను పాటించేలా శిక్షణ సమయంలోనే జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రజాసేవే పరమావధిగా సచివాలయ ఉద్యోగులు పనిచేసేలా చర్యలు తీసుకుంటాం. సచివాలయ ఉద్యోగుల నియామకం వల్ల ఖజానాపై భారీ భారం పడుతుందని ప్రతిపక్షం విమర్శిస్తోంది కదా? గత సర్కార్ ఒక పరిశ్రమ ఏర్పాటుకు రూ.1,200 కోట్ల రాయితీలు ఇచ్చింది. ఆ పరిశ్రమ ద్వారా కేవలం వెయ్యి మందికే ఉద్యోగాలు వచ్చాయి. అవి ప్రైవేట్వి. కానీ.. గ్రామ సచివాలయాల వల్ల 1,34,534 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. వారి సర్వీసులు పూర్తి రెగ్యులర్ అయ్యాక వారందరి జీతాలు రూ.నాలుగు నుంచి ఐదు వేల కోట్లకు మించవు. ఇప్పుడు చెప్పండి ప్రతిపక్షం విమర్శల్లో వాస్తవం ఉందా? సచివాలయ ఉద్యోగాలు ఒక వర్గానికే వచ్చాయంటూ ప్రతిపక్షం ఆరోపణలు చేస్తోంది కదా? సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో 80 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. సామాజిక న్యాయానికి ఇంతకంటే నిదర్శనం ఎక్కడైనా ఉంటుందా? ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను తప్పుబట్టడమే ప్రతిపక్షం పనిలా ఉంది తప్ప ప్రజాసమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇద్దామన్న ఆలోచన వీసమెత్తు కూడా లేదన్నది వారి చేష్టల ద్వారా అవగతమవుతోంది. పెన్షన్లు, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ రైతు భరోసా లాంటి పథకాల ద్వారా రాయితీలు ఇవ్వడానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వీటికేం చెబుతారు? ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ప్రతిపక్షాలు రాయితీ కింద చూస్తే మేం సామాజిక పెట్టుబడిగా పరిగణిస్తాం. వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రభుత్వం ఏటా ఒక్కో రైతుకు ఇచ్చే రూ.12,500లను వ్యవసాయ పెట్టుబడి కింద సర్కార్ పరిగణిస్తుంది. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సంక్షేమ పథకాల ద్వారా సామాజిక పెట్టుబడిని ప్రజలకు అందిస్తాం. ఈ అంశంలో విమర్శలకు వెరవం. అభివృద్ది చెందిన, చెందుతున్న దేశాలు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంటే రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తున్నారని, ఇది తిరోగమన చర్యగా కొందరు నేతలు అభివర్ణిస్తుండటంపై ఏమంటారు? ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో కెనడా ఒకటి. కెనడాలో ప్రభుత్వ రంగ సంస్థలు బలంగా ఉన్నాయి. రాష్ట్రంలోనూ ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడం ద్వారా అభివృద్ధిని పరుగులు పెట్టించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్దేశం. అందులో భాగంగానే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ సంస్థలను తలదన్నే రీతిలో ప్రభుత్వ రంగ సంస్థలను తీర్చిదిద్ది ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం. రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధితో రైతులకు గిట్టుబాటు ధర ఎలా అందిస్తారు? పప్పు దినుసులు, చిరు ధాన్యాలు, వరి తదితర వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక వ్యూహం రచించారు. తొలిదశలో పల్సెస్, మిల్లెట్స్ బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అధిక దిగుబడులిచ్చే వంగడాల అన్వేషణ దగ్గర నుంచి.. ప్రపంచంలో ఏ పంటకు ఎక్కువ ధర ఉందో.. ఏ వస్తువులకు అధిక డిమాండ్ ఉందో గుర్తించి.. ఆయా పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించి.. ఫలాన ధరతో కొనుగోలు చేస్తామని ఆయా బోర్డులు ఒప్పందాలు చేసుకుంటాయి. వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తాయి. ఈ బోర్డులు ధరల స్థిరీకరణ నిధి నుంచి రుణ రూపంలో నిధులను సమకూర్చుకుంటాయి. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర దక్కడంతోపాటు.. దేశానికి విదేశీ మారకద్రవ్యం కూడా లభిస్తుంది. ప్రణాళిక సంఘం స్థానంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నాలుగు ప్రాంతీయ ప్రణాళిక మండళ్ల ఏర్పాటు వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి? పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో నాలుగు ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆయా ప్రాంతాల అవసరాలు? తీర్చడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? అభివృద్ధికి ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే అంశాలపై ప్రాంతీయ మండళ్లు ప్రభుత్వానికి ప్రణాళిక సమర్పిస్తాయి. వాటిని అనుసరించి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంది. ఇది రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుంది. గ్రామానికి పంచాయతీ.. రాష్ట్రానికి శాసనసభ, మండలి.. దేశానికి పార్లమెంట్ శాసనాలు చేస్తాయి. వాటిని అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సచివాలయాలున్నాయి. కానీ గ్రామ పంచాయతీలకు మాత్రం సచివాలయాలు లేవు. రాష్ట్రంలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ విప్లవాత్మక చర్యలకు నాంది పలికారు. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయడం వల్లే గ్రామ సచివాలయాల ఉద్యోగాలకు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో 80 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాలు దక్కించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ఇస్తున్న వాటిని రాయితీలుగా కాకుండా సామాజిక పెట్టుబడిగా పరిగణిస్తోంది. సాంప్రదాయేతర ఇంధన వనరులను అందిపుచ్చుకునేలా సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో విద్యుత్ ధరలు తగ్గుతాయని 2014 నుంచే ప్రపంచవ్యాప్తంగా నిపుణులు చెబుతూ వస్తున్నారు. డిస్కమ్లు వారించినా వినకుండా అధిక ధరలకు విద్యుత్ను సుదీర్ఘ కాలానికి కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం గత పాలకుల అవగాహనరాహిత్యానికి, అక్రమార్జనకు సజీవ సాక్ష్యాలు కాదా?. కేంద్రం నియమించిన ప్రొఫెసర్ శివరామకృష్ణ కమిటీ నివేదిక ఇవ్వక ముందే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎవరినీ సంప్రదించకుండా, బహిరంగ చర్చ (పబ్లిక్ డిబేట్) లేకుండా ఏకపక్షంగా రాజధానిపై నిర్ణయం తీసుకుంది. నాటి నుంచి నేటివరకు రాయలసీమలో, ఉత్తరాంధ్రలో ప్రజోద్యమాలు ఎగసిపడుతున్నాయి. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సెప్టెంబరు 13న రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదికపై బహిరంగ చర్చ నిర్వహించి జనం మెచ్చేలా.. ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా రాజధానిపై సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నిర్ణయం తీసుకుంటారు. పరిశ్రమల పేరుతో విలువైన భూములను గత పాలకులు కొందరికి అతి తక్కువ ధరకు కట్టబెట్టారు. ఇప్పటికీ పరిశ్రమలను ఏర్పాటు చేయలేదు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నిబంధనల ప్రకారం పరిశ్రమలు ఏర్పాటు చేయని సంస్థలకు కేటాయించిన భూములను రద్దు చేసి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారిశ్రామికాభివృద్దే లక్ష్యంగా పెట్టుబడిదారులకు, ప్రభుత్వానికి ఆమోదయోగ్యంగా ఉండేలా అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నాం. గత ప్రభుత్వం కుదుర్చుకున్న పీపీఏలను ప్రభుత్వం సమీక్షించడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి కదా? సరికొత్త ఆవిష్కరణలు రావడంతో సౌర, పవన విద్యుత్ ధరలు భారీ ఎత్తున తగ్గుతాయని 2014 అక్టోబర్ 10న ఎన్ఆర్ఈఎల్ నివేదిక ఇచ్చింది. 2015–22 మధ్య కాలంలో సౌర విద్యుత్ ధరలు 17 నుంచి 22 శాతం, పవన విద్యుత్ ధరలు 6 నుంచి 11 శాతం తగ్గుతాయని నీతి ఆయోగ్ తేల్చి చెప్పింది. 2025 నాటికి సౌర, పవన విద్యుత్ ధరలు 26 నుంచి 35 శాతానికి తగ్గుతాయని ఇంటర్నేషనల్ రెన్యువబుల్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఆర్ఏఎన్ఏ) 2017లో స్పష్టం చేసింది. అప్పటి ముఖ్యమంత్రి, నాటి విద్యుత్ శాఖ మంత్రికి ఆ రంగంపై కనీస అవగాహన ఉంటే అధిక ధరలకు పవన, సౌర విద్యుత్ కొనుగోలు చేయరు. 25 ఏళ్లపాటు అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి ఖజానాను దోచిపెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారన్నది స్పష్టమవుతోంది. పీపీఏల సమీక్షించడం వల్ల ఏపీలో విద్యుత్ ధరలు తగ్గిస్తే.. ఇతర రాష్ట్రాల్లోనూ తగ్గించాల్సి వస్తుందని ఉత్పత్తి సంస్థలు భయపడుతున్నాయి. ప్రజలపై భారం తగ్గించడమే లక్ష్యంగా పీపీఏలను రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి తీరుతుంది. -
సీఎంవో అధికారులకు శాఖల పునఃపంపిణీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా నియమితులైన ప్రవీణ్ ప్రకాష్ బాధ్యతలు చేపట్టడంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు ముఖ్య సలహాదారు అజేయకల్లం శనివారం సీఎంవో (ముఖ్యమంత్రి కార్యాలయం)లో పనిచేస్తున్న అధికారులకు శాఖలను పునఃపంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధానపరమైన అంశాలు.. కేడర్కు సంబంధించిన అంశాలు, ముఖ్యమైన ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన ఫైళ్లను ముఖ్య సలహాదారు అజేయకల్లం ద్వారానే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి పంపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఎంవోలో పనిచేస్తున్న అధికారులకు కేటాయించిన శాఖలు ఇవీ.. అజేయకల్లం, సీఎం ముఖ్య సలహాదారు: హోం శాఖ, ఆర్థిక, ప్రణాళిక శాఖ, రెవెన్యూ శాఖ ,న్యాయ, శాసనసభ వ్యవహారాలు, సీఎం కార్యాలయ వ్యవహారాలు, ఎవరికీ కేటాయించని శాఖలు డాక్టర్ పీవీ రమేష్ సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి: వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, విద్యా శాఖ (పాఠశాల, ఇంటర్, ఉన్నత, సాంకేతిక విద్య), పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫ్రా ప్రవీణ్ ప్రకాష్, సీఎం ముఖ్య కార్యదర్శి: సాధారణ పరిపాలన, విద్యుత్ శాఖ, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు (పునరి్వభజన చట్టానికి సంబంధించిన అంశాలు, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాజ్యాంగబద్ధ సంస్థలు, ప్రధానమైన అధికారులతో సీఎం సంప్రదింపులు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన కార్యదర్శి అంతకంటే దిగువ స్థాయి అధికారులతో రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారాల పర్యవేక్షణ, సీఎం ఢిల్లీకి వెళ్లినప్పుడు ఆయనతో పాటు వెళ్లడం), డ్యాష్ బోర్డ్స్, సీఎంవో మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, సీఎం కార్యదర్శి: రవాణా, రహదారులు భవనాలు, ఏపీఎస్ఆర్టీసీ, గృహ నిర్మాణం, ఆహార పౌరసరఫరా>లు, వినియోగదారుల వ్యవహారాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సెర్ప్, యువజన వ్యవహారాలు, క్రీడలు, గనులు, భూగర్భవనరులు, కారి్మక, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, అన్ని సంక్షేమ శాఖలు జె.మురళి, సీఎం ప్రత్యేక కార్యదర్శి: పశుసంవర్థక శాఖ, డెయిరీ, మత్స్య శాఖ, సహకార, మార్కెటింగ్ శాఖ, సాంస్కృతిక శాఖ, ఎంపీలు, ఎమ్మెల్యేల గ్రీవెన్సులు, ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) దువ్వూరి కృష్ణ, సీఎం ప్రత్యేక కార్యదర్శి: ఆరి్థక శాఖ, విద్యుత్ శాఖ ముక్తాపురం హరికృష్ణ, సీఎం ప్రత్యేక అధికారి: ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్, జనరల్ గ్రీవెన్సెస్ పి.కృష్ణమోహన్రెడ్డి, సీఎం ఓఎస్డీ: సీఎం అపాయింట్మెంట్స్, సందర్శకులు, సీఎం రోజువారీ కార్యకలాపాలు. -
సీఎం ఇచ్చిన స్వేచ్ఛతోనే.. పారదర్శకంగా పరీక్షలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలలో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావులేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతోందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం తెలిపారు. రాజకీయ జోక్యం లేకుంటే ఏ పనిలోనైనా అధికారుల పనితీరు అద్భుతంగా ఉంటుందనేందుకు ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియే నిదర్శనమన్నారు. ఉద్యోగాల రాతపరీక్షల ముగింపు సందర్భంగా రాష్ట్ర స్థాయి పరీక్షల కమిటీ చైర్మన్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పరీక్షల కమిటీ కంట్రోలర్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్,మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్కుమార్, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్తో కలిసి అజేయ కల్లం సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. రికార్డు స్థాయిలో కొత్త ఉద్యోగాలు: అజేయ కల్లం రికార్డు సంఖ్యలో ఉద్యోగాలకు ఎటువంటి తప్పులకు తావు లేకుండా అత్యంత పకడ్బందీగా, తక్కువ సమయంలో అంతా హర్షించే విధంగా పరీక్షలను నిర్వహించడం అద్భుతమన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒకే విడతలో 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను చేపట్టిన చరిత్ర ఎప్పుడూ లేదని, వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల లోపే ఎన్నికల హామీ మేరకు రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీని చేపట్టారని తెలిపారు. ఇప్పుడు భర్తీ చేస్తున్నవి ఈ ప్రభుత్వం కొత్తగా సృష్టించిన ఉద్యోగాలని, ఇవేమీ ఖాళీ అయిన ప్రభుత్వ ఉద్యోగాలు కాదన్నారు. ఏ సర్కారైనా సంవత్సరానికి 1,000 ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేసే పరిస్థితుల్లో లేని సమయంలో ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా సృష్టించి, నియామకాలు చేపట్టడం ఒక చరిత్రగా అభివర్ణించారు. పరీక్షల నిర్వహణలో గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, విజయకుమార్, జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర, జిల్లా స్థాయి సిబ్బంది పనితీరును ఆయన ప్రశంసించారు. ఎంపికయ్యే ఉద్యోగులను వారి సొంత ఊరిలో నియమించాలా.. వద్దా? అన్నదానిపై ఇంకా ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరగలేదని, దీనిపై విధాన పరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అజేయ కల్లాం తెలిపారు. 90 శాతం మంది హాజరు: గిరిజా శంకర్ ఉద్యోగ రాతపరీక్షలకు 21.69 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే, 19.49 లక్షల మంది హాజరయ్యారని, దాదాపు 90 శాతం మంది హాజరవడం విశేషమని పరీక్షల రాష్ట్ర స్థాయి కంట్రోలర్గా వ్యవహరించిన గిరిజా శంకర్ చెప్పారు. తొలిరోజు ఉదయం 12 లక్షల మందికి పైగా హాజరు కావాల్సిన పరీక్షకు ఏకంగా 93 శాతం మంది హాజరయ్యారన్నారు. పరీక్ష రాసే వారు ముఖ్యంగా మహిళా అభ్యర్ధులు ఇబ్బంది పడకూడదని వారు నివసించే ప్రాంతానికి 40–50 కిలోమీటర్ల లోపు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎన్నికల తరహాలో ఈ పరీక్షలను కూడా నిర్వహించినట్టు చెప్పారు. ఫలితాల వెల్లడి, నియామక ప్రక్రియలోనూ ఇంతే పారదర్శకంగా పని చేస్తామన్నారు. జవాబు పత్రాల స్కానింగ్ వేగంగా సాగుతుందని, ఈనెల 18, 19వ తేదీల్లో ఫలితాలు వెల్లడించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ప్రకటించారు. సమర్ధంగా పరీక్షల నిర్వహణలో అభ్యర్ధుల సహకారం మరవలేనిదన్నారు. చరిత్రాత్మక ఘట్టం: ద్వివేది ఇన్ని లక్షల ఉద్యోగాల భర్తీ.. 22 లక్షల మందికి రాతపరీక్షలు.. ఇంత పకడ్బందీగా పరీక్షల నిర్వహణ.. ఇదో ‘హిస్టారిక్ ఈవెంట్’ అని పరీక్షల కమిటీ చైర్మన్ గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో చిన్న పొరపాటు దొర్లినట్టు ఎక్కడా చిన్న ఫిర్యాదు కూడా రాలేదన్నారు. డిగ్రీ అభ్యర్ధులు పోటీ పడే స్థాయిలో ప్రశ్నాపత్రం రూపకల్పన ఉందన్నారు. 25 శాతం సులభమైనవి, మరో 25 శాతం కఠినమైనవి, 50 శాతం యావరేజ్ ప్రశ్నలతో ఉందన్నారు. పరీక్ష పూర్తి పారదర్శకంగా జరిగిందనేందుకు అభ్యర్ధులకు ఓఎమ్మార్ షీటు నకలు ఇంటికే ఇచ్చామని, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి? ర్యాంకు ఎంత? అన్నది ఫలితాల్లో స్పష్టంగా తెలిసిపోతుందన్నారు. పరీక్షల నిర్వహణలో ఏపీపీఎస్సీ, ఏపీ ఎస్సీఈఆర్టీ తదితర సంస్థల సహకారం ఉందన్నారు. జిల్లాల వారీగా, పోస్టుల వారీగా, కేటగిరీలవారీగా ర్యాంకులను ప్రకటిస్తామన్నారు. ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వూ్యలు ఉండవని, ఇప్పటికీ కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని చెప్పారు. యూపీఎస్సీ స్థాయిలో నిర్వహణ: విజయకుమార్ పారదర్శకంగా, స్వేచ్ఛగా పరీక్షలు నిర్వహించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవంతంగా పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ విజయకుమార్ తెలిపారు. పరీక్షల కంట్రోలర్ గిరిజా శంకర్ సూచనలు, జిల్లా కలెక్టర్లు, సిబ్బంది సహకారంతో యూపీఎస్సీ స్థాయిలో పరీక్షలు నిర్వహించగలిగామన్నారు. యూపీఏస్సీలోనూ ఒకే విడతలో 14 లక్షల మందికి మించి దరఖాస్తులు చేసుకోరని, అందులోనూ 7–8 లక్షల మందికి మించి హాజరు ఉండదన్నారు. దాదాపు 22 లక్షల మంది దరఖాస్తుదారుల్లో 90 శాతం మంది పరీక్షలకు హాజరు కావడం రికార్డుగా పేర్కొన్నారు. మార్కులు, మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు. -
సీఎం జగన్ ఇచ్చిన స్వేచ్ఛతోనే అది సాధ్యమైంది
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలు ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం అన్నారు. ఆరు రోజుల పాటు సాగిన ఈ పరీక్షలకు మొత్తం 89.83 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. నిరుద్యోగ సమస్యను తగ్గించడంతో పాటు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులైన పేదలకు అందించాలని, ప్రభుత్వ సేవల్లో జాప్యం జరగరాదనే సదుద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో పనిచేసేందుకు అవసరమైన ఉద్యోగుల నియామకానికి ఈ నెల ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు (2, 5 తేదీల్లో ప్రభుత్వ సెలవులు) ఆరు రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. (చదవండి : సచివాలయ పరీక్షల నిర్వహణపై సర్వత్రా ప్రశంసలు) పరీక్షలు ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా అజేయకల్లం సోమవారం మీడియాతో మాట్లాడారు. ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టామన్నారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఒకే సారి లక్షా 34వేల ఉద్యోగాలు భర్తీ చేయడం రికార్డ్ అన్నారు. గత 20 ఏళ్లలో ఏడాదికి 1000 ఉద్యోగాలు కూడా భర్తీ చేసిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన స్వేచ్ఛ.. రాజకీయ జోక్యం లేకుండా చర్యలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాజకీయ జోక్యం లేకుంటే అధికారుల పనితీరు అద్భుతంగా ఉంటుందనడానికి ఈ ఉద్యోగ నియామక ప్రక్రియే నిదర్శనమన్నారు. 20లోగా ఫలితాలు : గిరిజా శంకర్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలు మొత్తంగా 89.83శాతం అభ్యర్థులు హాజరయ్యారని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ వెల్లడించారు. పరీక్షలకు ఎటువంటి ఇబ్బది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సచివాలయ ఉద్యోగ పరీక్షలకు 21.69లక్షల దరఖాస్తులు వచ్చాయని, మొత్తంగా 19.49 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. అభ్యర్థుల రవాణ సౌకర్యం కోసం 6వేల బస్సులను ఉపయోగించామన్నారు. జవాబు పత్రాలను స్ట్రాంగ్రూంలలో భద్రపరిచామని, జిల్లా కేంద్రాలలో ఓఎమ్మార్ షీట్ల స్కానింగ్ చేపడతామన్నారు. ఈ నెల 20 లోపు ఫలితాలను వెల్లడిస్తామని గిరిజా శంకర్ పేర్కొన్నారు. అందరి సహకారంతోనే ఇంత పెద్ద టాస్క్ పూర్తి చేశాం : విజయ్కుమార్ అందరి సహకారం వల్లే సచివాల పరీక్షలను ప్రశాంతంగా ముగిశాయని మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్కుమార్ అన్నారు. తమపై నమ్మకంలో ప్రభుత్వం అప్పజెప్పిన పనిని సమర్ధవంతంగా నిర్వహించామన్నారు. పరీక్షల నిర్వహణ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. 25శాతం టఫ్ ప్రశ్నలు ఉన్నాయి : ద్వివేది ఏపీపీఎస్సీ ప్రమాణాలను పాటించి సచివాల ఉద్యోగాల పరీక్షలను నిర్వహించామని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ప్రశ్నాపత్రం 25శాతం టఫ్గా ఉందన్నారు. అత్యంత వేగంగా ప్రశ్నాపత్రాల స్కానింగ్ చేపట్టామని, ఈనెల 20లోపు ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. జిల్లాలవారిగా మెరిట్ లిస్ట్ ప్రకటిస్తామని తెలిపారు. సచివాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, 1500 చోట్ల సచివాలయ భవనాలను నిర్మిస్తామని ద్వివేది పేర్కొన్నారు. -
వీడుతున్న చిక్కుముడులు!
సాక్షి, అమరావతి: విభజన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకుని పొరుగు రాష్ట్రమైన తెలంగాణాతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారు. ఇందులో భాగంగా ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంపై రాష్ట్ర అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం శనివారం హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, సలహాదారు రాజీవ్శర్మతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రెండు రాష్ట్రాల అధికారుల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు కొనసాగాయి. కొన్ని అంశాల్లో ఒక రాష్ట్రానికి ప్రయోజనం, మరికొన్ని విషయాల్లో మరో రాష్ట్రానికి ప్రయోజనం కలిగి ఉండవచ్చని అయితే వీలైనంత త్వరగా సమస్యలకు పరిష్కారం చూపాలని, లేదంటే మరో రెండేళ్లయినా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ చందంగానే ఉంటాయనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు. ప్రధానంగా విభజన చట్టం 9, 10వ షెడ్యూల్ సంస్థల్లోని ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల పంపిణీపై ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చర్చలు సాగాయి. తొమ్మిదవ షెడ్యూల్లోని 89 సంస్థల ఆస్తులు, అప్పులు పంపిణీకి సంబంధించి షీలాబిడే కమిటీ నివేదిక ఆధారంగా ముందుకు సాగేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. ఇందులో కొన్ని సంస్థల్లో ఏపీకి, మరికొన్ని సంస్థల్లో తెలంగాణాకు ప్రయోజనం ఉంటుందని, ఇరు రాష్ట్రాలకు సమన్యాయం జరిగే అవకాశం ఉన్నందున తొమ్మిదవ షెడ్యూల్లోని 89 సంస్థలకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించుకుందామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్నేహహస్తం చాపింది. దీనిపై తెలంగాణ అధికారులు కూడా సానుకూలంగానే స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 10వ షెడ్యూల్లోని సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు పంపిణీపై కూడా విస్తృతంగా చర్చించారు. ముఖ్యమంత్రులతో చర్చించిన తరువాత ఒక నిర్ణయానికి రావాలని ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలపై కూడా అధికారులు చర్చించారు. విద్యుత్తు బకాయిలపైనా చర్చ... తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన విద్యుత్ బకాయిలపై కూడా రెండు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు కొనసాగాయి. దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ ఒకసారి అకౌంట్స్ సరిచూసిన తరువాత ఒక నిర్ణయానికి వస్తామని స్పష్టం చేసింది. విద్యుత్ ఉద్యోగుల పంపిణీపై కూడా చర్చ సాగింది. భీష్మించుకుని కూర్చోవడం వల్ల ఫలితం ఉండదని, పరిష్కారాలు కావాలని శుక్రవారం ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో కేసీఆర్ తెలంగాణ విద్యుత్ అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగుల పంపిణీ ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్పై కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టమైన ప్రతిపాదనలు చేసింది. ఇది రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరిగేలా ఉన్నందున ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుందనే ఉద్దేశం వ్యక్తమవుతోంది. ఏపీఎండీసీ ఆస్తులు రూ.1,200 కోట్లు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తమ సంస్థఆస్తుల విభజన ప్రక్రియ కూడా త్వరలోనే కొలిక్కి వస్తుందని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ది సంస్థ (ఏపీఎండీసీ) అధికారులు, సిబ్బంది భావిస్తున్నారు. ఏపీఎండీసీకి సుమారు రూ. 1,200 కోట్ల ఆస్తులున్నాయి. తొమ్మిదో షెడ్యూలులో ఉన్న ఈ సంస్థ ఆస్తులను విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 52: 48 దామాషాలో పంచుకోవాలి. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ఏపీఎండీసీకి రూ. 624 కోట్లకుపైగా వాటా రానుంది. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ)కి రూ.576 కోట్లు దక్కనున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల స్థాయిలో జరిగే సమావేశంలోనే ఏపీఎండీసీ విభజన ప్రక్రియ పరిష్కారమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. విశాఖ లేదా తిరుపతిలో ఇద్దరు సీఎంల సమావేశం! రెండు రాష్ట్రాల అధికారుల మధ్య సాగిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నిర్ణయించారు. వారం రోజుల్లోగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు మరోసారి సమావేశమై సమస్యల పరిష్కారానికి నాంది పలకాలని నిర్ణయించారు. సాగునీటి రంగానికి చెందిన అంశాలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వారం పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సమావేశాన్ని ఏర్పాటు చేయించాలని భావిస్తున్నారు. జూలై 11వతేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలున్నందున ఆ లోగానే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విశాఖపట్టణం లేదా తిరుపతిలో సమావేశం నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. -
ఏపీ సచివాలయంలో సిద్ధమౌతున్న సీఎం చాంబర్
-
సచివాలయంలో సిద్ధమౌతున్న సీఎం చాంబర్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు ఉదయం 8.49 గంటలకు సీఎం చాంబర్లో అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు సీఎం చాంబర్ మొదటి బ్లాక్ను వాస్తుకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం, వైఎస్సార్ సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి చాంబర్ పనులను పరిశీలించారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాటు జరుగుతున్నాయి. శనివారం ఉదయం 11.49 గంటలకు మంత్రులు పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. -
సీఎం ముఖ్య సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన కల్లం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్య సలహాదారుగా నియమితులైన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం సచివాలయం తొలి బ్లాక్ మొదటి అంతస్తులో బుధవారం మధ్యాహ్నం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కేబినెట్ హోదాలో ఆయన ముఖ్యమంత్రి కార్యాలయ అధిపతిగా వ్యవహరిస్తారు. బాధ్యతలు స్వీకరించడానికి ముందు అజేయ కల్లం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. బాధ్యతల స్వీకారం సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సాధారణ పరిపాలన (రాజకీయ వ్యవహారాలు) ముఖ్యకార్యదర్శి రామ్ ప్రకాశ్ సిసోడియా, ఏపీ ట్రాన్స్కో సీఎండీ ఎన్.శ్రీకాంత్, ఇతర అధికారులు అజేయ కల్లంను కలిసి అభినందనలు తెలిపారు. -
సీఎం వైఎస్ జగన్తో అజయ్ కల్లం భేటీ
-
ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా అజేయ కల్లం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం కేబినెట్ హోదాతో తాజాగా సీఎం ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎం పేషీ) అధిపతిగా ఆయన వ్యవహరిస్తారు. సీఎంవో కార్యదర్శులకు శాఖలను కేటాయించే బాధ్యత కూడా ఆయనకే అప్పగించారు. ప్రభుత్వ సలహాదారులతోపాటు రాష్ట్రంలో ఏ శాఖకు చెందిన అధికారినైనా పిలిచి సలహాలు ఇచ్చే అధికారాన్ని ప్రభుత్వం ఆయనకు కల్పించింది. అందరూ ఆయనకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ కాకముందు ఉన్న టీఏ, డీఏలు వర్తిస్తాయి. ప్రభుత్వ వాహనంతోపాటు నివాస వసతి సౌకర్యం కల్పిస్తారు. లేదంటే ప్రభుత్వం అద్దె చెల్లిస్తుంది. డిప్యుటేషన్పై సిబ్బంది నియామకానికి ఆదేశాలు కల్లంకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)తోపాటు పేషీలో ప్రైవేట్ కార్యదర్శి, వ్యక్తిగత సహాయకుడు, ఇద్దరు డ్రైవర్లు, నలుగురు ఆఫీసు సబార్డినేట్లు ఉంటారు. ఈ పోస్టులను ఆన్ డ్యూటీ పద్ధతిలో కేటాయిస్తారు. వారికి మాతృసంస్థల్లో వచ్చే వేతనాలతో పాటు పేషీలో పనిచేసినందుకు ప్రత్యేక అలవెన్సులు పొందడానికి అర్హత ఉంటుంది. డ్రైవర్లు, సబార్డినేట్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవచ్చు. డిప్యుటేషన్పై సిబ్బందిని నియమించేందుకు సాధారణ పరిపాలన శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. ఎక్కడ పనిచేసినా మన్ననలే అజేయ కల్లం తిరుమల – తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ ఛైర్మన్గా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేశారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, సీఎస్గా పనిచేసిన సమయంలో తన అభిప్రాయాలను ఫైళ్లపై నిర్మొహమాటంగా రాశారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉండగా రాజధాని అమరావతిలో స్విస్ ఛాలెంజ్ విధానాన్ని తప్పుబడుతూ ఫైలులో కుండబద్దలు కొట్టినట్లు రాశారు. ‘స్విస్ ఛాలెంజ్ లోపభూయిష్టంగా ఉంది. ఇది పనికిమాలిన విధానం. దీనివల్ల నష్టం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు. ఈ విధానాన్ని ఉపసంహరించుకోవడం ఉత్తమం..’ అని ఫైలులో మూడు పేరాలు పొందుపరిచారు. ఆయన ఎక్కడ ఏ స్థాయిలో పనిచేసినా మంచి అధికారిగా, మానవతావాదిగా మన్ననలు పొందారు. -
భారీగా అధికారుల బదిలీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని పెద్ద ఎత్తున బదిలీలు చేస్తూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 50 మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కల్పించారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో పాటు సీఎం ముఖ్య సలహాదారుగా నియమించిన అజేయ కల్లంతో చర్చించి, సీనియర్లకు తగిన ప్రాధాన్యం ఇస్తూ బదిలీలపై సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలలో భాగంగా రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ)ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశారు. సీఆర్డీఏ కమిషనర్, అదనపు కమిషనర్లను బదిలీ చేశారు. సీఆర్డీఏ కొత్త కమిషనర్గా లక్ష్మీనరసింహంను నియమించారు. జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ను బదిలీ చేసి ఆయన స్థానంలో ఆదిత్యనాధ్ దాస్ను నియమించారు. శశిభూషణ్ కుమార్ను జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. సీఆర్డీఏ కమిషనర్, జెన్కో మాజీ ఎండీతోపాటు పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీగా ఐఏఎస్ అధికారి జె.మురళిని నియమించారు. ఉభయ గోదావరి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, విశాఖపట్టణం, అనంతపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. -
నవరత్నాల అమలుపై కసరత్తు చేస్తోన్న జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందే ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై నిశ్చయ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టి సారించారు. నవరత్నాల అమలుపై ఆయన కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు ఆ పథకాల అమలుపై తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్లతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నవరత్నాల్లోని ప్రతీ పథకంపై ఈ సమీక్షలో చర్చించారు. బడ్జెట్ కేటాయింపులపై చర్చ నవరత్నాల్లో ఏ పథకానికి ఎంత నిధులు అవసరం, వచ్చే బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేయాల్సి ఉంటుందనే అంశాలపై చర్చించారు. అలాగే నవరత్నాల్లో ఏ పథకాన్ని ఏ శాఖ ద్వారా అమలు చేయించాలనే విషయంపైన కూడా ఈ సమీక్షలో చర్చించారు. వీలైనంత త్వరగా కేబినెట్ కూర్పు చేసి నవరత్నాల అమలుపై కీలక నిర్ణయాలను తీసుకోవాలనే ఆలోచనలో జగన్మోహన్రెడ్డి ఉన్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు సాధ్యమైనంత త్వరగా నవరత్నాలను ప్రజలకు అందించాలనే తపన జగన్మోహన్రెడ్డిలో కనిపిస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. లబ్దిదారుల గుర్తింపు... నవరత్నాల్లో ప్రతీ పథకాన్ని అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేలా ఏర్పాట్లు చేసే విషయమై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ప్రమాణ స్వీకారానికి ముందే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి మోడీని కలిసి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుపై జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నవరత్నాల విషయంలో కూడా ఆయన అంతే స్పీడుతో ముందుకు సాగుతున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి 18లోగా కొత్త అసెంబ్లీ వచ్చే నెల 18వ తేదీలోగా కొత్త అసెంబ్లీ కొలువు తీరాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రొటెం స్పీకర్ను ఎంపిక చేసిన తరువాత అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వచ్చే నెల 18వ తేదీలోగా పూర్తి కావాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అసెంబ్లీ ఏర్పడ్డాక బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. -
‘టార్గెట్ పెట్టి మరీ మద్యాన్ని అమ్మిస్తున్నారు’
సాక్షి, గుంటూరు : మద్యం వల్ల అత్యాచారాలు, కిరాయి హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని, టార్గెట్లు పెట్టి మరీ ప్రభుత్వాలు మద్యాన్ని అమ్మిస్తున్నాయని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో.. దశలవారీగా మద్యనిషేధం అమలుపై చర్చా వేదికలో మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సమాజం ఉన్న దేశాలు ఆర్థికంగా ముందుకు వెళ్తున్నాయని అన్నారు. ఎన్నికల్లో మద్యం పంపిణీ వల్ల చిన్న పిల్లలు సైతం మద్యానికి బానిసలవుతున్నారని పేర్కొన్నారు. మద్యంపై అందరికీ అవగాహనం కలిగించినప్పుడే మార్పు వస్తుందని, వైఎస్ జగన్ దశలవారీగా మద్యపాన నియంత్రణ చేస్తానన్నారని పునరుద్ఘాటించారు. ఇదే కార్యక్రమాని హాజరైన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ‘అప్పట్లో ఎన్టీఆర్ మద్యనిషేధం చేస్తానంటే మహిళలు చాలా ఆనందించారు. కానీ ఇప్పటి ప్రభుత్వాలు మద్యాన్ని హోమ్ డెలివరీ చేసే వరకు దిగజారాయి. అనంతపురంలో మంచి నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే, మద్యం వల్ల ప్రభుత్వం రూ.244 కోట్లు ఆదాయం పొందింది. ఆ డబ్బుతో మంచి నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం తన ఖజానాలో వేసుకుంది. చిన్నపిల్లలు సైతం తాగుడుకు అలవాటు పడుతున్నారు.. తల్లిదండ్రులు కూడా పిల్లలను గమనిస్తూ వుండాలి. అందరూ బాధ్యతతో వ్యవహరిస్తే మద్యాన్ని నిర్మూలించవచ్చ’న్నారు. మాజీ సీఎస్ అజేయ కల్లం మాట్లాడుతూ.. ‘మద్యపానం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకూడదు. సమాజం మీద బాధ్యత లేనట్టు వ్యహరించకూడదు. మద్యపాన నిషేధంపై స్వచ్చంద సంస్థలు పోరాటం చేయాలి. దశలవారీగా మద్యపాన నిషేధంపై సమగ్ర చర్చ జరగాలి’ అని పేర్కొన్నారు. ‘మద్యం వల్ల చిన్న చిన్న కుటుంబాలు మరింతగా ఛిన్నాబిన్నం అవుతున్నాయి. డ్రైవర్లు తాగి వాహనం నడిపితే ఎన్నో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రోడ్డుప్రమాదాలపై సమీక్ష చేస్తే మద్యం వల్ల జరుగుతున్న ప్రమాదాలే ఎక్కువని తేలాయి. మద్యపాన నిషేధం అమలు చేయలేరా? అని నన్ను చాలామంది అడుగుతుంటారు. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే కచ్చితంగా అమలు చేయవచ్చ’ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. -
టీడీపీ పాలనలో అవినీతి శివతాండవం
సాక్షి, హైదరాబాద్: ‘ఇంత దౌర్భాగ్యమైన పాలన ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ చూడలేదు. ఈ ఐదేళ్ల టీడీపీ పాలనలో అన్ని రంగాల్లోనూ అవినీతి శివతాండవం చేసింది. అరాచక పర్వం రాజ్యమేలింది. వ్యవస్థలన్నిటినీ నాశనం చేశారు’అని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అజేయ కల్లం ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఓపెన్ మైండ్ సొసైటీ ఆధ్వర్యంలో ‘ఓటు మన హక్కు–ఓటు మన బాధ్యత’అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. విపత్తుల బారినపడి రైతులు అప్పులపాలైనా కూడా చంద్రబాబు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండేళ్లలో వారికి చెల్లించాల్సిన రూ.12 వేల కోట్ల బకాయిలు ఎగ్గొట్టి.. ఎన్నికల ముందు కేవలం వెయ్యి రూపాయలు విదిల్చారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణాన్ని సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేసుకున్నారని దుయ్యబట్టారు. మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం నేర్పింది.. రాజధాని శంకుస్థాపనలు, శిలాఫలకాలకు రూ.350 కోట్లు ఖర్చుపెట్టడమేనా అని చంద్రబాబును ప్రశ్నించారు. అవినీతిని పెంచి పోషించడానికి, వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడానికి తప్ప చంద్రబాబు అనుభవం ఎందుకూ ఉపయోగపడలేదన్నారు. మీ స్వార్థం కోసం విద్వేషాలు రాజేయొద్దు.. మీ స్వార్థం కోసం రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రాజేయడం రాజకీయ నాయకులకు గానీ సినిమా వాళ్లకు గానీ ధర్మం కాదని అజేయ కల్లం విజ్ఞప్తి చేశారు. ఆంధ్రవాళ్లమంతా హైదరాబాద్లో ప్రశాంతంగానే ఉన్నామని చెప్పారు. ఈ కీలక సమయంలో కొందరు రాజకీయ ప్రముఖులు చేసే ఆరోపణలను విశ్వసించవద్దని.. విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు. మాట్లాడటం రాని వారు కూడా మంత్రులుగా పాలించటం మన దౌర్భాగ్యమంటూ లోకేశ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మాటల్లో చెప్పలేనంత అవినీతి జరిగింది.. మనంత అవినీతిలో కూరుపోయిన రాష్ట్రం దేశంలో మరొకటి లేదని మాజీ సీఎస్ అజేయ కల్లం పేర్కొన్నారు. వాటాల కోసం ప్రాజెక్టుల అంచనాల విలువను మూడు రెట్లు పెంచేశారన్నారు. పథకాల్లో, సహజవనరుల్లో, కాంట్రాక్టుల్లో.. మాటల్లో వర్ణించలేనంత దోపిడీ జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వం రైతుల భూములను పప్పుబెల్లాల్లా పంచేసిందన్నారు. దీని వెనుకనున్న మతలబేమిటో ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరముందన్నారు. రూ.వేల కోట్ల విలువ చేసే 400 ఎకరాల భూమిని ఓ ఎంపీకి అప్పనంగా ఇచ్చారని చెప్పారు. తిరిగి ఆయన నుంచి వచ్చే సొమ్మును ఎన్నికల ఖర్చులకు ఉపయోగిస్తారన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంటే ఖర్చులు నియంత్రించుకోకుండా.. రూ.60 కోట్లు పెట్టి అమరావతిలో తాత్కాలిక భవనాలెందుకని ప్రశ్నించారు. రూ.100 కోట్ల ఖర్చుతో శాశ్వత భవనాలు నిర్మించుకుంటే ప్రజాధనం దుర్వినియోగమయ్యేది కాదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు నిత్యం రూ.7.2 కోట్లు.. ఉచిత ఇసుక, మట్టి పేరుతో ఏపీలో దోపిడీ తారాస్థాయికి చేరిందని అజేయ కల్లం ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలదే రాజ్యంగా మారిపోయిందన్నారు. ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్లు.. ఇలా అన్ని పనులను డబ్బులు తీసుకొని మాత్రమే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఇసుక, మట్టిలోనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులకు నిత్యం రూ.7.2 కోట్లు చేరుతుందని చెప్పారు. తెలంగాణలో ఇసుక అమ్మకం ద్వారా రూ.3 వేల కోట్ల ఆదాయం వస్తే.. మన రాష్ట్రంలో రూ.10 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. కానీ ఒక్క రూపాయి కూడా ఖజానాకు చేరలేదని చెప్పారు. ఇదంతా ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లే తినేస్తున్నారన్నారు. జన్మభూమి కమిటీలు మితిమీరిన పెత్తనంతో పంచాయతీ వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. సినిమా రాజకీయాలు మంచివి కావు సినిమా వాళ్లు వచ్చి రాజకీయాల్లో చేసేదేమీ ఉండదని అజేయ కల్లం పేర్కొన్నారు. వాళ్లకు ఏబీసీడీలు తెలియవన్నారు. ఒకసారి ఎంపీసీ చదివానని, మరోసారి సీఈసీ చదివానంటున్నారని ఎద్దేవా చేశారు. సినిమా రాజకీయాలు రాష్ట్ర భవితకు మంచివి కావన్నారు. రాష్ట్రం కోసం త్యాగం చేసినవారే రియల్ హీరోలన్నారు. నేటి యువత అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి గానీ.. ముఖానికి రంగేసుకొని ఎవరో రాసిచ్చిన డైలాగులు చెప్పే వాళ్లను కాదన్నారు. వైఎస్సార్ వచ్చాకే ఇరిగేషన్ అభివృద్ధి.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే సాగునీరు, విద్యుత్ రంగాలు అభివృద్ధి చెందాయని అజేయ కల్లాం పేర్కొన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన జలయజ్ఞానికి చంద్రబాబు రూ.17 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవని చెప్పారు. కానీ అలా చేయకుండా.. అవసరం లేని ప్రాజెక్టులు సృష్టించి 35 శాతంపైనా కమీషన్లు వసూలు చేసుకున్నారని ఆరోపించారు. కడపకు చెందిన ఓ రాజ్యసభ సభ్యుడు రూ.3 వేల కోట్ల కమీషన్ తీసుకున్నారని చెప్పారు. పోలవరం తదితర ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందన్నారు. ఇక బలహీన వర్గాల ఇళ్ల కాంట్రాక్టుకు సంబంధించి తెలంగాణకు, ఏపీ ప్రభుత్వానికి చదరపు అడుగుకి వెయ్యి రూపాయల తేడా ఉందని చెప్పారు. 36,500 చదరపు అడుగులకు రూ.వెయ్యి చొప్పున లెక్క వేసుకుంటే రూ.వేల కోట్ల అవినీతి జరిగిందనే విషయం స్పష్టమవుతోందన్నారు. 35 ఏళ్లలో జరిగిన అవినీతి కంటే ఈ ఐదేళ్లలో జరిగిన అవినీతే ఎక్కువన్నారు. నీరుచెట్టు, ఎన్ఆర్జీఎస్ ఇలా అన్ని సంక్షేమ పథకాల పేర్లు చెప్పి దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు చెప్పే ఐటీ అంతా ఒట్టి భ్రమ అని అజేయ కల్లం ఎద్దేవా చేశారు. నొయిడాలో, పూణేలో, బెంగళూరులో ఐటీ కంపెనీలు వచ్చినప్పుడు.. అక్కడి వాళ్లెవరూ ఇలా డప్పు కొట్టుకోలేదన్నారు. ఎక్కడ సౌకర్యాలుంటే అక్కడికి ఐటీ కంపెనీలు రావటం సహజమని చెప్పారు. పోలీసులు, రెవెన్యూతో పాటు అన్ని వ్యవస్థలూ టీడీపీ చెప్పుచేతల్లోకి వెళ్లిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన వారితో తామంతా టీడీపీకి కట్టుబడి నడుచుకుంటామంటూ ప్రమాణం చేయిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. ఇష్టానుసారంగా ఓట్ల తొలగింపు.. 40 నియోజకవర్గాల్లో 5 వేల నుంచి 50 వేల ఓట్లు తీసేశారని అజేయ కల్లం ఆరోపించారు. రాష్ట్రం మొత్తం మీద లక్షల సంఖ్యలో ఓట్ల తొలగింపు జరిగిందన్నారు. 40 నియోజకవర్గాల్లో గత ఎన్నికల కంటే ఇప్పుడు ఓట్ల సంఖ్య భారీగా తగ్గిందన్నారు. ప్రతి ఏడాదీ ఓట్ల సంఖ్య పెరగాల్సి ఉంటే.. తగ్గడమేమిటని ప్రశ్నించారు. తిరుపతి నగరంలో 50 వేలు ఓట్లు, నెల్లూరులో 40 వేలు, మంగళగిరిలో 20 వేలు తగ్గాయని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ ఓట్లను దురుద్దేశంతో తొలగించారని చెప్పారు. ప్రభుత్వం దగ్గర ఉండాల్సి ఓటర్ల డేటా.. టీడీపీ నాయకుల చేతికి వెళ్లిపోయిందన్నారు. పథకం ప్రకారమే చంద్రబాబు ఆరోపణలు.. ఒక పథకం ప్రకారమే ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్పై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని అజేయ కల్లం ఆరోపించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఖర్చులకు.. రాహుల్ గాంధీ పర్యటనలకు చంద్రబాబు డబ్బులిస్తున్నారని తెలిపారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకే మోదీ, కేసీఆర్పై చంద్రబాబు తరచూ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే రాయలసీమ వాసులపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి ప్రస్తుతం రాయలసీమలోనే నేరాలు తక్కువని చెప్పారు. గుంటూరు, కృష్ణా జిల్లాలోనే నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ బ్యూరో డేటా స్పష్టం చేస్తోందన్నారు. కానీ క్రైం అంతా రాయలసీమలోనే అన్నట్లు ప్రచారం చేస్తున్నారని అజేయ కల్లం మండిపడ్డారు. రాయలసీమ వాళ్లు పాలకులయితే భూ ఆక్రమణలు చోటు చేసుకుంటాయని, హత్యలు జరుగుతాయని, ప్రజలకు భద్రత ఉండదంటూ కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని.. అందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరారు. ఏపీ హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఉంటున్న సీమాంధ్రులంతా వారం ముందే తమతమ ప్రాంతాలకు వెళ్లి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి ఓటు వినియోగించుకునేలా చూడాలన్నారు. చంద్రబాబు ఓటమి చారిత్రక అవసరమన్నారు. సమావేశం సీనియర్ జర్నలిస్టు ఎంఈఐ ప్రసాదరెడ్డి, విశ్రాంత ప్రొఫెసర్ పి.రాఘవరెడ్డి, ఓపెన్ మైండ్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు..!
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి, ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టి భవిష్యత్తు లేకుండా చేసిన చంద్రబాబు ఎన్నికల సమయంలో మీ భవిష్యత్తు.. నా బాధ్యత.. అని నినాదాలివ్వడం హాస్యాస్పదంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎస్ అజేయకల్లం విమర్శించారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని శ్రీనిధి కన్వెన్షన్ సెంటర్లో శనివారం నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్–సేవ్ డెమోక్రసీ’ సదస్సులో మాజీ సీఎస్, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావుతో కలిసి అజేయకల్లం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సదస్సుకు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. తొలుత పులివెందులలో శుక్రవారం దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం జరిగిన సదస్సులో అజేయకల్లం మాట్లాడుతూ టీడీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని అన్నారు. ఐదేళ్లలో 25 లక్షల మంది కొత్త ఓటర్లు జాబితాలో చేరాలని, అయితే 2014లో 3.68 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఇటీవల జనవరిలో విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 3.69 కోట్లమంది ఓటర్లు మాత్రమే ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో పెద్దఎత్తున టీడీపీ పాలనలో ఓటర్ల తొలగింపు కార్యక్రమం చేపట్టడమే ఇందుకు కారణమని చెప్పారు. కొన్ని కులాల వారీగా ఓట్లను టార్గెట్ చేసి టీడీపీ ప్రభుత్వం తొలగించిందని తెలిపారు. మనకున్న రీసర్చ్, పారిశ్రామిక సంస్థలు, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ 1980కు ముందే వచ్చాయని, ఆ తర్వాత కేవలం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో మాత్రమే చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు నిర్మించారని అజేయకల్లం చెప్పారు. ఆర్థిక వ్యవస్థ నాశనం అయింది.. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ నాశనం అయిందని అజేయకల్లం అన్నారు. మన రాష్ట్రానికి రూ.94 వేల కోట్ల గ్యారంటీ లిమిట్స్కు అర్హత ఉండగా.. దానిలో 30–35 శాతం మించి గత 70 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో గ్యారంటీ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం 101 శాతం ఇప్పటికే గ్యారంటీ రుణం తీసుకుందని చెప్పారు. రూ.3.50 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత ఒక్క టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందని, పోలవరం, శంకుస్థాపనలు, ధర్మపోరాట దీక్షల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని అన్నారు. రెవెన్యూ పాతాళానికి.. 2004–2014 మధ్య సంవత్సరానికి 39.5 శాతం లెక్కన రాష్ట్ర రెవెన్యూ 395 శాతం పెరగగా..గత నాలుగు సంవత్సరాల్లో టీడీపీ పాలనలో రాష్ట్ర రెవెన్యూ 30 శాతం కంటే తక్కువ నమోదైందని అజేయకల్లం అన్నారు. అంటే సంవత్సరానికి కనీసం 7 శాతం కూడా పెరగలేదని చెప్పారు. అయితే 2004–14మధ్య పెరిగిన తలసరి ఆదాయంలో సగం నమోదవుతుంటే తాము అద్భుతాలు సృష్టించామని ఎల్లో మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదైన దాఖలాలు లేవని, అయినా వ్యవసాయంలో డబుల్ డిజిట్ గ్రోత్ నమోదయిందని ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. పశుక్షేత్రాల్లో దొంగ లెక్కలు చూపిస్తూ రూ.కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో అవినీతి తారాస్థాయికి చేరిందని, ఫాం పాండ్లు, మరుగుదొడ్ల నిర్మాణం, ఇసుక ఇలా అన్ని రంగాల్లోనూ అవినీతి తాండవమాడుతుందని అజేయకల్లం అన్నారు. ఎల్లో మీడియా మశూచిలా పట్టిపీడిస్తోంది: ఐవైఆర్ రాష్ట్రాన్ని ఎల్లో మీడియా మశూచిలా పట్టి పీడిస్తోందని మాజీ సీఎస్, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. అబద్ధాలను పదే పదే ప్రచారం చేసి ప్రజలను తికమక పెట్టి టీడీపీని గెలిపించాలని ఎల్లో మీడియా ప్రయత్నిస్తోందన్నారు. ఎంత సేపటికీ నాలుగు బిల్డింగ్లు వచ్చాయి, ఫిల్లర్ ఇలా వేశాం, ఊచలు ఇలా కట్టాం అని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇదే ఒక అద్భుతం అని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందన్నారు. పోలీస్ వ్యవస్థనూ నాశనం చేశారు.. పోలీస్ వ్యవస్థను సైతం నాశనం చేసి పార్టీ కార్యకర్తల్లా పోలీసులను ఉపయోగించుకుంటున్నారని అజేయకల్లం విమర్శించారు. 2వేల మందికి ప్రమోషన్లు ఇస్తే సీఎంకు సన్మానం చేసి, ఓటు వేసి రుణం తీర్చుకుంటామని పోలీసులు ప్రమాణాలు చేశారని, వాళ్లను పోలీసులు అనాలో ఖాకీ చొక్కా వేసుకున్న టీడీపీ కార్యకర్తలు అనాలో అర్థం కావడం లేదని అన్నారు. అవినీతిలో మొదటిస్థానం.. భారత దేశంలో కెల్లా అత్యధికంగా అవినీతి జరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నంబర్–1 స్థానంలో నిలుస్తుందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అన్నారు. టీడీపీ పాలనలో ప్రాంతీయ అసమానతలు గణనీయంగా పెరిగాయని, జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ టీడీపీ పాలనలో చట్టసభల్లో ప్రజాసమస్యలపై ప్రశ్నించే హక్కు ప్రజాప్రతినిధులకు లేకుండా చేశారన్నారు. రైల్వేస్ మాజీ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఎం.పాపిరెడ్డి, అగ్రికల్చర్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.రాఘవరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ చుండూరు సాయి పాల్గొన్నారు. -
35 ఏళ్లలో ఇంత దౌర్భాగ్యమైన పాలన చూడలేదు
‘రాష్ట్రంలో 35 ఏళ్లలో ఇంత దౌర్భాగ్యమైన పాలన చూడలేదు.అన్నింటా అవినీతి విలయ తాండవం చేసింది. అరాచక పర్వం రాజ్యమేలింది. విపత్తుల బారిన పడ్డ రైతులకు మొండిచేయి చూపారు. ఈ రెండేళ్లలో వారికి చెల్లించాల్సిన రూ. వేల కోట్ల బకాయిల్ని ఎగ్గొట్టి.. ఎన్నికల ముందు రూ.వెయ్యి విదిలించి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నించారు. రాజధాని పేరుతో కేవలం శంకుస్థాపనలు, శిలాఫలాకాలకే రూ. 350 కోట్ల ఖర్చుపెట్టడమేనా చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం? రాజధాని నిర్మాణాన్ని సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేసుకున్నారు. లేనిది ఉన్నట్లు, జరగనిది జరిగినట్లు గ్రాఫిక్స్తో సినిమా చూపించారు. డబ్బులు వెదజల్లి తప్పుడు లెక్కల్ని ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబు గోబెల్స్ను మించిపోయారు. అవినీతిని పెంచి పోషించడంలోను, వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడంలో,రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడంలో తప్ప ఆయన అనుభవం ఎందుకూ కొరగాదు.’ – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయకల్లం ‘ఇసుక, మట్టితో సహా సహజ వనరుల్ని అడ్డంగా దోచేశారు. నీరు–చెట్టు, ఉపాధి హామీ ఇలా కాదేదీ అనినీతికనర్హం అన్నట్లు చంద్రబాబు సర్కారు పాలన ఇష్టారాజ్యంగా సాగింది. సాగునీటి పెండింగ్ ప్రాజెక్టుల అంచనాల్ని మూడు రెట్లు పెంచేసి, కమీషన్ల కోసం రెండు ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని తెరపైకి తేవడమే ఈ ప్రభుత్వం సాధించిన ఘనత. పోలవరం సాకారం కోసం శ్రమించింది ఒకరైతే.. మేమే చేస్తున్నామంటూ డబ్బా కొట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణ పథకంలోని అవినీతి గిన్నిస్ రికార్డుకు చేరువలో ఉంది. మితిమీరిన దుబారా, అక్రమాలతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. పోలవరం విహారయాత్రలకు రూ. 400 కోట్ల ఖర్చు ఈ ప్రభుత్వ దుబారాకు పరాకాష్ట. ఎవరు అధికారంలోకి వచ్చినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం ఎలాగో తెలియని పరిస్థితికి పూర్తిగా దిగజార్చారు. ముడుపులివ్వందే ఏ పనీ జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది.’ ఇలా చంద్రబాబు ప్రభుత్వ నిజ స్వరూపాన్నీ, తెరవెనుక అవినీతి, అక్రమాల్ని చీల్చిచెండాడారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయకల్లం. పదవిలో ఉన్నప్పుడు, అనంతరం జరిగిన వాస్తవాలను చూసిన ఆయన గత అయిదేళ్ల బాబు పాలన తీరుపై ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాల్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అజేయకల్లం ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.. సాక్షి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ స్థాయిల్లో పనిచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైరయ్యారు కదా! రాష్ట్రంలో ప్రస్తుత సర్కారు పాలనపై మీ విశ్లేషణ ఏమిటి? అజేయకల్లం అన్ని స్థాయిల్లోను వ్యవస్థలు కుప్పకూలాయి. గ్రామ పంచాయతీల వ్యవస్థ నీరుగారింది. జన్మభూమి కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అరాచకాలు సృష్టిస్తున్నాయి. శాసనసభ్యులు పరిపాలనను తమ చెప్పుచేతల్లోకి తీసుకుని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పలువురు అధికారులు నియమ, నిబంధనల్ని గాలికొదిలి చేతులెత్తేశారు. రాష్ట్రంలో 35 ఏళ్లలో ఇంత దౌర్భాగ్యమైన పరిపాలన ఎన్నడూ లేదు. సాక్షి: టీడీపీ సర్కారు గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకుంటుందన్న అధికార వర్గాల వ్యాఖ్యల వెనుక మర్మమేమిటి? కల్లం: ఏదీ జరగకపోయినా, ఏం చేయకపోయినా అంతా మేమే చేసినట్లు మీడియాలో చెప్పుకోవాలనే ఆలోచనతో తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. పోలవరం గురించి ఏవేవో గొప్పలు చెప్పుకుంటున్నారు. అసలు పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు మొదలైందో అందరికీ తెలుసు. అనుమతులు తెచ్చిందొకరు, రాష్ట్ర సర్కారు డబ్బు ఖర్చుపెట్టిందొకరు, జాతీయ ప్రాజెక్టుగా చేసిందొకరు. డబ్బిచ్చేదొకరు. మరి పోలవరం విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమిటో ఎవరికీ అర్థం కాదు. కానీ మేమే చేశాం. మేమే చేసేస్తున్నామని డబ్బా కొడుతున్నారు. విహార యాత్రల పేరుతో రూ. 400 కోట్లు దుర్వినియోగం చేసి ప్రజలను పోలవరం తీసుకురావడమేంటి? సాక్షి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, ముఖ్యమంత్రుల్లో తానే సీనియర్నని చెప్పుకుంటున్నారు కదా? వాస్తవం ఏమిటి? కల్లం: అనుభవం దేనిలో ఉపయోగపడింది? అవినీతిని పెంచడంలోనా? వ్యవస్థలను భ్రష్టుపట్టించడంలోనా? ఆర్థిక క్రమశిక్షణను కూలదోయడంలోనా? చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం బహుశా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేయడానికి పనికొచ్చినట్లుంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బ్యాంకుల నుంచి ఎక్కువ వడ్డీకి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అప్పు తీసుకోవడానికి కూడా బహుశా అనుభవం ఉపయోగపడిందేమో! రాష్ట్ర అప్పు – జీడీపీ దామాషా 35 శాతం దాటిపోతున్నట్లుంది. ఆర్థిక క్రమశిక్షణను గాలికొదిలి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించాక పాలన ఎక్కడుంది. సాక్షి: విజన్ 2020, విజన్ 2029,విజన్ 2050తో వృద్ధిరేటు సాధించామని సర్కారు చెబుతున్నగణాంకాల మాటేమిటి? కల్లం: అసలు దూరదృష్టి(విజన్)కి అర్థమేంటి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వచ్చే ఏడాది కట్టాల్సిన అప్పు వాయిదా, వడ్డీ కలిపితే మనం తెచ్చే అప్పును మించిపోయేలా ఉంది. ఎవరు పరిపాలనలోకి వచ్చినా ఏం చేయాలో దిక్కు తెలియక జుట్టుపీక్కోవాల్సిన పరిస్థితి కల్పించారు. కేవలం కాగితాల్లో దొంగలెక్కలు చూపుతూ మీడియాలో ఆ తప్పుడు గణాంకాలతో ప్రచారం చేసుకుంటున్నారు. సాక్షి:రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిలో వాస్తవమెంత? కల్లం: రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి ఆక్టోపస్లా తారాస్థాయికి చేరింది. గ్రామస్థాయిలో నీరు – చెట్టు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎన్ఆర్ఈజీఎస్) పేర్లతో దోపిడి చేస్తున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద వచ్చే డబ్బంతా కేంద్ర ప్రభుత్వమిచ్చేదే. అది తన సొంత డబ్బు అన్నట్లు మేమే రోడ్లు వేయించాం, మా రోడ్ల మీద నడిచేవారంతా మాకు ఓటు వేయాలని బహిరంగంగా చెప్పుకోవడం దారుణమైన విషయం. సాక్షి: ఇంకా ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందో చెప్పగలరా? కల్లం: సహజ వనరులను సైతం దోచుకుంటున్నారు. ఇసుక, మట్టి పేర్లతో దోపిడీ, దందాలు సాగుతున్నాయి. ప్రతి పథకంలో అవినీతి రాజ్యమేలుతోంది. ట్రాక్టర్లు (ప్రగతి రథం), ఆటోలు, సెల్ఫోన్ల కొనుగోలు మొదలు సెట్టాప్ బాక్సుల కొనుగోలు వరకూ అవినీతి లేనిదెక్కడో ప్రభుత్వానికే తెలియాలి. సాక్షి: భూముల వ్యవహారంలో ఏం నడుస్తోంది? కల్లం: భూముల విషయమైతే ఇక చెప్పేదేమీ లేదు. ప్రభుత్వ సంస్థలకు ఎకరా రూ.కోట్లకు ఇస్తూ ప్రయివేటుకైతే లక్షలకే కట్టబెడుతున్నారు. అమరావతి కేంద్రంగానే ఈ వ్యవహారం సాగుతోంది. విశాఖ వంటి నగరాల్లో సైతం విలువైన భూములను ఐటీ సంస్థల ఏర్పాటు ముసుగులో పప్పుబెల్లాల చందంగా అస్మదీయులకు రియల్ వ్యాపారం కోసం కేటాయిస్తున్నారు. ఫ్రాంక్లిన్ సంస్థకు రూ. 406 కోట్ల విలువైన భూమిని రూ. 13 కోట్లకే అప్పనంగా కట్టబెట్టడం వెనుక వాటాలే కారణం. సాక్షి: వాటాల కోసమే ప్రాజెక్టులకు సంబంధించిన వ్యయాల్ని భారీగా పెంచారన్న విమర్శలపై మీ అభిప్రాయం? కల్లం: టెండర్లన్నింటిలో అవకతవకలే. ఫైబర్గ్రిడ్ మొదలు, సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి భవనాలు, రహదారులు, భోగాపురం విమానాశ్రయం వరకూ అన్నింటా అవినీతి దందాలే. బహుశా అంచనాలకు రెక్కలు రాని టెండరే లేదేమో! సాక్షి: సాగు నీరిచ్చామని బాబు ప్రతి వేదికపైనా చెబుతున్నారే? కల్లం: ఈ ప్రభుత్వం సాగునీటి రంగంలో సాధించిందేమైనా ఉందంటే పెండింగులో ఉన్న అన్ని ప్రాజెక్టుల అంచనాలు మూడు రెట్లు పెంచి దోచుకోవడమే. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం మొదలుపెట్టింది లేదు. కమిషన్ల కోసం చేసిన రెండు లిఫ్ట్ ఇరిగేషన్లు తప్ప ఇంకేమీ చేయలేదు. సాక్షి: వ్యవసాయ రంగంలో అద్భుత ప్రగతి సాధించామని సీఎం చెబుతున్నారు. ఈ గణాంకాలు వాస్తవమేనా? కల్లం: వ్యవసాయ రంగంలో సర్కారు చెబుతున్న ప్రగతి అంతా బూటకమే. అయిదేళ్లుగా సాధారణ వర్షపాతం కూడా లేదు. వర్షాభావ పరిస్థితుల్లో సాగు విస్తీర్ణం తగ్గిపోతుందనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. సాగు భూములు బీళ్లుగా ఉంటే రైతులు సంతోషంగా ఎలా ఉంటారు? వ్యవసాయ రంగం ఆరోగ్యంగా ఎలా ఉంటుంది? గతంలో ఇదే పార్టీ తొమ్మిదేళ్ల పాలనలో ఏడేళ్లు వరుణుడితో పోరాటమే. పాడి, మత్స్య రంగంలో అద్భుత ప్రగతి సాధించామని చెబుతున్నారు. గత కొన్నేళ్లలో రాష్ట్రంలో 13.65 లక్షల మేర గేదెల సంఖ్య తగ్గింది. అందులో 9.2 లక్షలు పాడిగేదెలే. అయినా పాల ఉత్పత్తి సాలుకు 4.2 మిలియన్ లీటర్లు పెరిగిందని చెబుతున్నారు. ఇదెలా సాధ్యమో ఆ అంకెలు తయారుచేసిన వారికే తెలియాలి. బహుశా ఇది పాల ఉత్పత్తి కాకుండా అంకెల ఉత్పత్తి అయి ఉండవచ్చు. శాస్త్రీయంగా పరిశీలిస్తే కిలో దాణాకు 1.44 లీటర్ల పాలు వస్తాయని అనుభవజ్ఞులు చెబుతుంటే మన పాలకులు మాత్రం కిలో దాణాకు ఏకంగా 13.7 లీటర్ల పాల ఉత్పత్తి చేసినట్లు చెప్పుకుంటున్నారు. మన అంకెల ఉత్పత్తి ఎంత గొప్పదో చెప్పేందుకు ఈ ఒక్కటి చాలు. చేపల విషయంలోను ఇదే స్టోరీ రిపీట్ అవుతోంది. ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్లో హెక్టారుకు రూ. 20 లక్షల విలువ చేసే కనీస ఉత్పత్తి సాధించామంటున్నారు. సముద్ర చేపల విషయంలో వాస్తవంగా ప్రభుత్వాలు చేసేదేమీ లేదు. ఇలాంటి కల్పిత అంకెల ఆధారంగా దేశంలోనే అద్భుత ప్రగతి సాధించామని చెప్పుకోవడం చూసి తెలుగువారిగా సిగ్గుపడాలో లేదో మనమే తేల్చుకోవాలి. సాక్షి: ఇతర రాష్ట్రాలు అసూయపడేలా రాష్ట్రం అభివృద్ధి చెందిందని బాబు చెబుతున్నారు కదా? కల్లం: దేశంలో వాస్తవంగా ఈ రోజు మనంతగా అప్పుల బారిన పడ్డ రాష్ట్రం మరొకటి లేదు. ఇంత అవినీతి రాష్ట్రం కూడా వేరొకటి లేదు. మరి దేన్ని చూసి ఇతర రాష్ట్రాలు అసూయపడతాయో అర్థంకాని విషయం. సాక్షి: కౌలు రైతులకు సర్కారు ఏమైనా చేసిందా? కల్లం: రైతులకే గతి లేదు. ఇక ఈ సర్కారు కౌలు రైతులకు ఏదో చేస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది. కౌలు రైతులకు పెట్టుబడి రాయితీ కూడా ఇవ్వడంలేదు. సాక్షి: నిధులను సర్కారు వృథా చేస్తోందన్న విమర్శలపై మీ అభిప్రాయం కల్లం: దుబారా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సర్కారు బరితెగించిందని చెప్పక తప్పదు. నిరర్థకమైన వ్యయాలు, విలాసవంతమైన తిరుగుళ్ల కోసం కొన్ని వేల కోట్లు దుబారా చేసిన విషయం అందరికీ తెలిసిన వాస్తవం. ఆదాయం లేదని బీద అరుపులు అరుస్తూ.. ఒక్క సంవత్సరం కూడా ఉండని హైదరాబాద్లో సచివాలయంలో మరమ్మతుల పేరుతో ఎల్ బ్లాకు కోసం రూ. 14.63 కోట్లు వృథాగా వెచ్చించారు. సీఎం కుటుంబాన్ని హైదరాబాద్లోని హోటల్ పార్కు హయత్లో పెట్టి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చెల్లించడం దుబారా కాక మరేమిటి? ఇక పాలకుల విదేశీయానానికి ప్రత్యేక విమానాలు, విలాసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సాక్షి: దేశంలో తొలిసారి నదుల అనుసంధానం మేమే చేశామని చంద్రబాబు చెబుతున్నారు కదా! ఇందులో వాస్తవమెంత? కల్లం: ఇది చాలా గమ్మత్తయిన విషయం. గోదావరి – కృష్ణా నదుల్ని అనుసంధానం చేశామని పాలకులు చెబుతున్నారు. దాని అర్థమేమిటో చెప్పేవారికే తెలియదు. రెండు నదుల నీరు కలవడం అనుసంధానమైతే ఎన్నో దశాబ్దాల క్రితమే గోదావరి – కృష్ణా అనుసంధానం జరిగిపోయింది. ఏలూరులో లాకులు, ఆక్విడెక్టులు కొన్ని దశాబ్దాల క్రితమే నిర్మించారని బహుశా రాష్ట్రంలో తెలియని వారు ఉండరేమో? గోదావరి – కృష్ణా కాలువను అనుసంధానం చేయడమే వాటి లక్ష్యం. సాక్షి: రాజధాని నిర్మాణం ఎలా ఉండటం ఆదర్శం? సర్కారు చేస్తున్నదేంటి? కల్లం: ఎవడో డబ్బున్నోడికి బెంజ్ కారు ఉందని లేనివాడు కూడా అప్పు చేసి అదే కొనుక్కోవాలనుకోవడం మూర్ఖత్వం. అందుకే మంచమున్నంత వరకే కాళ్లు చాపుకోవాలని పెద్దలు చెబుతుంటారు. తమకున్న ఆదాయ పరిధికి తగ్గట్టుగా జీవించాలనేది ప్రాథమిక ఆర్థిక సూత్రం. పెద్దలు చెప్పేది, కుటుంబంలో పిల్లలకు తల్లిదండ్రులు చెప్పేది కూడా ఇదే. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు ప్రజాధనం వినియోగం విషయంలో ఇంకా పొదుపుగా వ్యవహరించాలి కదా.? ఆదాయం లేనప్పుడు కోట్లు ఖర్చు పెట్టి ఎవరైనా ఇల్లు కడతారా? అప్పు చేస్తే వడ్డీ పెరిగి భారమవుతుందని తెలిసే.. అప్పులిచ్చేవారున్నా కూడా ఇష్టారాజ్యంగా అప్పులు తేరాదని విజ్ఞులంతా చెబుతుంటారు. అత్యవసరంలో తప్ప అప్పు చేయరాదని ప్రతి ఒక్కరూ చెప్పడమే కాదు నమ్మే సూత్రం కూడా అదే. అలాంటప్పుడు ఆర్థికంగా బలహీనంగా ఉన్న రాష్ట్రానికి అప్పులు తెచ్చి కోటల్లాంటి నిర్మాణాలు ఎవరు చేపడతారు? కేవలం బాధ్యతారాహిత్యంగా ఉండేవారు, ప్రజల శత్రువులు మాత్రమే ఇలా చేస్తారు. సాక్షి: రాజధానిలో ఏం ఉండాలి? కల్లం: రాజధానిలో ఉండాల్సిందేమిటి? ఉండేదెవరు? అనేది ముందు చూడాలి. తక్కువ ఖర్చుతో అవసరానికి సరిపడా మాత్రమే మనం రాజధానిని నిర్మించుకోవచ్చు కదా? విలాసవంతమైన భవనాలు, సౌకర్యాలు ఎవరికోసం? ప్రపంచంలో అన్ని దేశాల రాజధానులకు ప్రాధాన్యమివ్వకుండా చిన్న పట్టణాల్లో చిన్న కట్టడాలు నిర్మించుకుంటున్న విషయం అక్షరసత్యం. మరి ఈ తమాషాలన్నీ ఎందుకు? కేవలం కమిషన్ల కోసం, ముందుగానే భూములు కొన్న రాజకీయ నాయకుల ‘రియల్ ఎస్టేట్’ వ్యాపారం కోసం తప్ప మరి దేనికీ ఉపయోగం ఉండదు. సాక్షి: అవినీతి ఇంతగా పెరిగిపోతే ఎవరూ ప్రశ్నించడం లేదా? కల్లం: నింగి, నేల హద్దుగా అవినీతి పెరిగిపోతున్న తీరును అధికారులు ఎక్కడైనా ప్రస్తావిస్తే.. మా కార్యకర్తలు బతకొద్దా? అని అధికార పార్టీ నేతలు ప్రశ్నించిన సంఘటనలు ఉన్నాయి. సేవ చేయడం కాకుండా దోచుకోవడమే పని అనేవాడు కార్యకర్త ఎలా అవుతాడో నాకు అర్థం కావడంలేదు. ప్రొటోకాల్ పేరిట భారీగా ఖర్చు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులు, అధికారులు చేసిన ఖర్చుతో పోల్చితే రాష్ట్రం విడిపోయిన తర్వాత పదింతలు ఖర్చు పెట్టారు. ఒకవైపు లోటు బడ్జెట్ అంటూనే నవ నిర్మాణ దీక్షలు, ధర్మపోరాట దీక్షలు, పుష్కరాల పేరుతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జనం సొమ్మును విచ్చలవిడిగా మంచినీళ్లలా దుబారా చేశారు. సాక్షి: అన్నదాతా సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బు వేస్తున్నామని సీఎం చెబుతున్నారు కదా? కల్లం: అయిదు నక్షత్రాల హోటళ్లకూ, విమానాల్లో తిరిగే వారికీ రాయితీలు ఇస్తున్నారు. రాష్ట్రంలో రైతుల ఖర్మేమిటోగానీ గత రెండేళ్ల నుంచి ప్రకృతి విపత్తుల బారిన పడ్డ వారికి మాత్రం ఒట్టి చేయి చూపుతున్నారు. ఈ రోజు వరకూ రైతు రుణమాఫీకి రెండు వాయిదాలకు సంబంధించి సుమారు రూ. 8,830 కోట్లు, విపత్తుల బారినపడ్డ వారికి పెట్టుబడి రాయితీ రూ. 2,200 కోట్లు, విత్తనాలు, వ్యవసాయ పరికరాల బిల్లులు రూ. 800 కోట్లు, మొక్కజొన్నలకు రూ. 200 కోట్లు వెరసిరైతులకు చెల్లించాల్సిన రూ. 12,030 కోట్ల బిల్లులు గతేడాది, ఈ సంవత్సరానికి సంబంధించినవి ఖజానాలో పెండింగ్లో మూలుగుతున్నాయి. వీటిని విడుదల చేయకుండా ఆపి రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్నదాత సుఖీభవ పేరుతో ఓట్ల కోసం రైతుల ఖాతాల్లో వెయ్యి రూపాయలు విదిలిస్తున్నారు. దీనిని సాధారణ పరిపాలన అంటామా? అనుభవజ్ఞులైనవారు అందించే పాలన అంటారా? చేతగాని వారి పాలన అంటారా? ప్రజలే ఆలోచించుకోవాలి. - లేబాక రఘురామిరెడ్డి, సాక్షి ప్రతినిధి ‘రాజధానిలో శిలాఫలకాల్ని వేసినవే మళ్లీ మళ్లీ వేయడం, ఇందుకోసం సభలు, ఆర్భాటాల కోసం రూ. 350 కోట్లు ఖర్చు చేయడం ఏ పరిపాలనానుభవం కిందకు వస్తుంది? బహుశా హైదరాబాద్లోనూ, అమరావతిలోనూ రెండు చోట్ల క్యాంపు ఆఫీసులకు సొబగులు, ఫాంహౌస్ల హంగులకు వందల కోట్లు ఖర్చుపెట్టారు. ఏ మాత్రం వినియోగించకుండానే హైదరాబాద్లో సచివాలయం మరమ్మతుల కోసం కోట్లాది రూపాయిలు దుర్వినియోగం చేయడానికి సీఎం చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం పనికొచ్చిందేమో’ ‘సామాన్య రైతుల నుంచి రాజధాని పేరిట సేకరించిన భూమిని ప్రజాప్రయోజనాల కోసమే వినియోగించాలనేది ప్రాథమిక మౌలిక సూత్రం. లాభార్జన కోసం నడిపే ఏ సంస్థకూ దీన్ని తక్కువ ధరకు ఇవ్వకూడదు. ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులు నిర్వహిస్తామని, ఆస్పత్రులు నిర్మిస్తామన్న ప్రైవేటు సంస్థలకు కారు చౌకగా ఈ భూముల్ని ఎందుకివ్వాలి. అవేవీ పేదలకు ఉచితంగా లేదా రాయితీతో సీట్లు ఇవ్వడం లేదు. ఉచిత వైద్యం చేయడం లేదే. రైతుల నుంచి సేకరించిన వందలాది ఎకరాలను లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యా, వైద్య వ్యాపారాలు చేసుకుంటున్న సంస్థలకు పప్పుబెల్లాల్లా ఇవ్వడం వెనుక మతలబేమిటో సర్కారు పెద్దలకే ఎరుక. సామాన్యులు వెళ్లలేని అయిదు నక్షత్రాల హోటళ్లకు కారు చౌకగా భూములు ఇవ్వడమే కాకుండా రాయితీలు ఇవ్వడంలో ఔచిత్యం పాలకులకే తెలుసు.’ ‘జాతీయ రహదారి నిర్మాణానికి కి.మీ.కి రూ. 17 కోట్ల నుంచి రూ. 26 కోట్లు అయితే అమరావతిలో రోడ్లకు కి.మీ.కి రూ. 36 కోట్లు పోస్తున్నారు. చ.అడుగుకు రూ. 2 వేలతో అధునాతన భవనం నిర్మించుకుంటున్న ఈ రోజుల్లో తాత్కాలిక సచివాలయానికి చదరపు అడుగుకు రూ. 11,000 ఖర్చు పెట్టారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. రాష్ట్రంలో పర్యవేక్షక వ్యవస్థలు ఎంత బలహీనపడ్డాయో చెప్పనక్కరలేదు’ ‘చేనేత కార్మికుల పేరుతో బోగస్ సొసైటీల మాటున పవర్లూమ్స్ మీద తయారైన వస్త్రాన్ని ఆప్కోకు సరఫరా చేసి ఒక్క వైఎస్సార్ జిల్లాలోనే వందల కోట్లు దోచుకున్నారన్నది ఆధారాలతో సహా బట్టబయలైన నగ్నసత్యం. మరి రాష్ట్రమంతా లెక్కలోకి తీసుకుంటే ఇందులో ఎంత కుంభకోణం జరిగిందో?’ ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ పథకం కింద నిర్మిస్తున్న ఇళ్లకు చదరపు అడుగుకు వెచ్చిస్తున్న వ్యయం పక్క రాష్ట్రంతో పోల్చితే మన రాష్ట్రంలో రూ. వెయ్యికి పైగా ఎక్కువ కావడం గమనార్హం. మరి మనం పది లక్షల ఇళ్లు కట్టిస్తే దాదాపుగా 36.5 కోట్ల చదరపు అడుగులు నిర్మించినట్లు. మరి చదరపు అడుగుకు రూ.1000 లెక్కన 36.5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణానికి దుర్వినియోగం ఎన్ని వేల కోట్లో ప్రజలే తేల్చుకోవాలి.’ – అజేయ కల్లం -
పథకాలు రూపొందించేటప్పుడే దోపిడీకి ప్లాన్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘రాష్ట్రంలో అవినీతి సంస్థాగతంగా మారిపోయింది. అవినీతిలో రాష్ట్ర ప్రభుత్వం గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించేలా ఉంది. స్కీమ్లు తయారు చేసినప్పుడే ఏ విధంగా దోచుకోవచ్చో ఆలోచిస్తున్నారు. ఇరిగేషన్, ఆర్అండ్బీ పనుల అంచనాలను పెంచేసి, సీఎం దగ్గరి నుంచి నాయకులు, ఉద్యోగుల వరకూ పర్సంటేజీలు పంచుకుంటున్నారు. ఇసుక, మట్టిని కూడా పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు’’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అజేయ కల్లాం ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ‘సేవ్ ఆంధ్రప్రదేశ్–సేవ్ డెమోక్రసీ’ సదస్సు నిర్వహించారు. పలువురు ప్రముఖులు, మేధావులు, ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, ఇతర పెద్దలు పాల్గొన్న ఈ సదస్సులో అజేయ కల్లాం ప్రసంగించారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ పరంగా 2014 జూలై నాటికి పోలవరం మనిహా మిగిలిన 23 ప్రాజెక్టులకు రూ.17 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా చేశారని, ప్రస్తుతం రూ.51 వేల కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతోందని, మూడు రెట్లు అధికంగా ఖర్చు పెట్టినా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. హౌసింగ్లో అవినీతికి అంతేలేకుండా పోతోందని విమర్శించారు. పక్క రాష్ట్రం కంటే మన రాష్ట్రంలో చదరపు అడుగుకు అదనంగా రూ.1,000 వరకూ ఖర్చు చేస్తున్నారని చెప్పారు. 10 లక్షల ఇళ్లకు గాను అదనంగా రూ.36,500 కోట్లు ఖర్చు చూపించి, రూ.18,250 కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అజేయ కల్లాం ఇంకా ఏం చెప్పారంటే... దిగజారిన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ‘‘ఏపీ విభజనకు ముందు రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా కేవలం 23 శాతం. విభజన వల్ల 2014 జూలై నాటికి అది 30.2 శాతానికి పెరిగింది. 2017–18 నాటికి ఈ వాటా 34.4 శాతంగా నమోదైనట్లు శ్వేతపత్రంలో ప్రభుత్వం పేర్కొంది. కానీ, పరిశ్రమల రంగం వాటా 22.5 శాతం నుంచి 22.1 శాతానికి దిగజారిపోయింది. సేవా రంగం వాటా కూడా 44.6 శాతం నుంచి 43.5 శాతానికి పడిపోయింది. అభివృద్ధి సూత్రం ఏమిటంటే జీడీపీలో వ్యవసాయ రంగం వాటా తగ్గుతూ పోవాలి. పరిశ్రమలు, సేవా రంగం వాటా పెరగాలి. వాస్తవ లెక్కలు ఇలా ఉంటే గుజరాత్ రాష్ట్రం మన రాష్ట్రాన్ని చూసి అసూయ పడుతోందని, అందుకే ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని చెబుతుంటే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు కేవలం 20.28 శాతం ఉండగా, గత ఏడాది 28.2 శాతంగా ఉందని ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొనగా, ప్రస్తుతం 29 శాతం వరకు ఉండవచ్చు. అంతకు ముందు 1995–2004 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో అప్పుల శాతాన్ని స్థూల ఉత్పత్తిలో 29.5 శాతానికి పెంచారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 29.5 శాతం ఉన్న అప్పులను 20.28గా తగ్గించింది. 28 శాతం ఉంటే రెడ్అలెర్ట్. కానీ, ప్రస్తుతం అప్పులను 29 శాతానికి తీసుకువెళ్లి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఆర్బీఐ అనుమతి లేకుండా, కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా బ్యాంకుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకొస్తున్నారు. ఈ విధంగా నాలుగేళ్లలో బ్యాంకుల ద్వారా తీసుకున్న అప్పు రూ.35 వేల కోట్లుండగా, ప్రస్తుతం మరో రూ.15 వేల కోట్ల అప్పులు చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ అనుమతి లేకుండా, కేంద్రానికి తెలియకుండా తెస్తున్న అప్పులు రూ.50 వేల కోట్లకు చేరనున్నాయి. ముందు చెప్పిన విధంగా 29 శాతానికి ఇది అదనం. దీన్ని కూడా కలుపుకుంటే రాష్ట్రం తీర్చాల్సిన అప్పు స్థూల ఉత్పత్తిలో 34 శాతం దాటుతుంది. దీన్నుంచి బయటపడాలంటే ఏ రాష్ట్రానికైనా కనీసం రెండు దశాబ్దాలు పడుతుంది. చేనేత రంగంలోనూ అదేతీరు చేనేత రంగం పరిస్థితి ప్రస్తుతం చాలా దయనీయంగా ఉంది. ఒక్క వైఎస్సార్ జిల్లాలో 120 చేనేత సొసైటీలున్నాయి. ఆరు వేల మంది సభ్యులు ఉన్నారు. ఆప్కో చైర్మన్గా ఓ వ్యక్తి ఉన్నారు. ఆయన తాలూకు వ్యక్తులతో 80 బోగస్ సొసైటీలు పెట్టి, వాటి ద్వారా బట్ట తయారైనట్టు, 2015–16లో రూ.262.75 కోట్ల విలువైన క్లాత్ను ఆప్కోకు సరఫరా చేసినట్టుగా చూపారు. 11 కంపెనీల నుంచి మీటరు రూ.30కి కొని, రూ.50కి సొసైటీల ద్వారా అమ్ముకుంటున్నారు. 2015 ఏప్రిల్ 1 నుంచి 2018 మార్చి 31 వరకు రూ.75.95 కోట్ల విలువైన బట్ట బోగస్గా సరఫరా చేశారు. వాస్తవంగా రూ.29.63 కోట్ల విలువైన బట్ట మాత్రమే సరఫరా చేశారు. మిగిలినదంతా బయటి నుంచి కొనుగోలు చేసి తెచ్చిన బట్ట’’ అని అజేయ కల్లాం పేర్కొన్నారు. దోపిడీపై ప్రశ్నిస్తే బురద జల్లుతారా?: విజయ్బాబు చంద్రబాబు ప్రభుత్వం గోబెల్స్ ప్రచారానికి దిగుతోందని సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ విజయబాబు అన్నారు. ప్రపంచంలో మాకియవెల్లీ ఇజం అనేది ఒకటుందని, దీనిప్రకారం పదవి కోసం ఏ నీచానికైనా దిగజారుతారని, అవసరమైతే వెన్నుపోటు పొడుస్తారని, సీఎం చంద్రబాబు కూడా ఆ బాటలోనే నడుస్తున్నారని విమర్శించారు. దోపిడీపై ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం బురద జల్లుతోందని మండిపడ్డారు. పోలవరంపై ప్రజలను ఏమారుస్తున్నారు: ఉండవల్లి అరుణ్కుమార్ ‘‘పోలవరం సందర్శన అంటూ లక్షకు పైగా జనాన్ని తరలించి భోజనాలు కూడా పెడుతున్నారు. ఒక్కసారైనా నేను నా సొంత ఖర్చులతో వచ్చి చూస్తాను. ప్రభుత్వం తరపున ఒక్క అధికారి వచ్చి నేను అడిగిన సమాధానాలకు చెప్పండి అని అడుగుతున్నా స్పందించడం లేదు’’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నచ్చిన వ్యక్తులకు పోస్టింగ్లు ఇచ్చి, ప్రజలను ఏమారుస్తున్నారని దుయ్యబట్టారు. 15 శాతం బోగస్ ఓట్లు: వి.లక్ష్మణరెడ్డి అవినీతి చేయడం తప్పు కాదనే భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, ఒక్కో ఎమ్మెల్యే రూ.100 కోట్ల నుంచి రూ.1,000 కోట్లు వరకూ సంపాదించారని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గంలో 25 కోట్లకు పైగా ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదని, నంద్యాల మోడల్ ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని 3.6 కోట్ల ఓట్లల్లో 15 శాతం (60 లక్షల ఓట్లు) బోగస్ ఓట్లు కొనసాగుతున్నాయని, ఆ బోగస్ ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశిస్తాయని చెప్పారు. దీనిపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో అవినీతి శివతాండవం మాజీ సీఎస్ అజేయ కల్లాం పోడూరు: ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా అవినీతి శివతాండవం చేస్తోందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి’సీఎస్) అజేయ కల్లాం ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో ‘మనకోసం మనం’ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడారు. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాలను దోపిడీ కోసమే భారీగా పెంచుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతి అభివృద్ధి పనిలోనూ 30 శాతం నుంచి 40 శాతం కమీషన్లు, లంచాలు రూపంలో దోపిడీ జరుగుతోందని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధంగా జరుగుతున్న ఈ పరిస్థితులన్నింటినీ చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని పిలుపునిచ్చారు. -
ఆంద్రప్రదేశ్లో అభివృద్ధి శూన్యం : అజేయ కల్లాం
-
అవినీతిలో టీడీపీ రికార్డు పదిలం
సాక్షి, గుంటూరు: ప్రభుత్వం ఎన్ని శ్వేతపత్రాలు విడుదల చేసినా రాష్ట్రం ఆర్థికంగా వెనుకంజలో ఉందన్న మాట వాస్తవమని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అజేయ కల్లం స్పష్టం చేశారు. దేశంలో మనరాష్ట్రం మొదటి స్థానంలో ఉందంటూ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నరసరావుపేటలో శనివారం నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సులో అజేయ కల్లం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. అజేయ కల్లం మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్ పనుల్లో గిన్నిస్ బుక్ రికార్డు సాధించామని ప్రభుత్వం చెప్పుకుంటోందని, అయితే మరో కాంట్రాక్టర్ నాలుగు టన్నులు అదనంగా కాంక్రీట్ వేస్తే ఆ రికార్డు చెరిగిపోతుందని, కానీ, అవినీతిలో టీడీపీ ప్రభుత్వం సృష్టించిన రికార్డును మాత్రం ఎవరూ అధిగమించలేరని తేల్చిచెప్పారు. పౌరసమాజం నాశనం కావడానికి ముఖ్యంగా మూడు కారణాలున్నాయని చరిత్ర చెబుతోందన్నారు. అందులో మొదటిది కుటుంబ వ్యవస్థ నాశనం కావడం, రెండోది విద్యా వ్యవస్థ నాశనం కావడం, మూడోది తప్పుడు వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవడమని చెప్పారు. అజేయ కల్లం ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘తమ పార్టీ కార్యకర్తలకు ఉపయోగపడేలా, వారికి లాభం చేకూరే పథకాలను ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నాయి. దీనివల్ల సమాజంలో అవినీతి వ్యవస్థీకృతంగా మారుతోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న నీరు–చెట్టు, గ్రామీణ ఉపాధి హామీ పథకాలు. ఆయా పథకాల పనులను నామినేషన్పై జన్మభూమి కమిటీలకు, అధికార పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారు. వారు సంపాదించుకోవడానికి మాత్రమే ఆ పథకాలు ఉపయోగపడుతున్నాయి. ఏపీలో 10 లక్షల మరుగుదొడ్లు నిర్మించామని ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి అందులో 40 శాతం కూడా క్షేత్రస్థాయిలో లేవు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో ఆసరా పింఛన్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో పడేవి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పింఛన్ల పంపిణీ బాధ్యతలను జన్మభూమి కమిటీలకు అప్పగించారు. ఎమ్మెల్యే సిఫారసు లేనిదే నేడు రాష్ట్రంలో ఉద్యోగులకు బదిలీలు, పోస్టింగ్లు లభించని పరిస్థితి నెలకొంది. నరసరావుపేటలో కేఎస్సార్ ట్యాక్స్ పేరుతో అధికార పార్టీ నేతలు కూరగాయలు అమ్ముకునేవారిని కూడా వదలడం లేదు. గురజాలలో మైనింగ్ డాన్ ఆర్జన రూ.వెయ్యి కోట్లు తెలంగాణలో నాలుగున్నరేళ్లలో ఇసుక మీద రాయల్టీ రూపంలో రూ.2,000 కోట్లు వచ్చింది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో నాలుగు నుంచి ఐదు రెట్లు ఇసుక ఎక్కువ లభ్యమవుతోంది. ఇలా చూస్తే ఏపీ ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో రూ.10,000 కోట్లు రావాల్సి ఉంది. ట్రాక్టర్ ఇసుకకు రూ.200 చొప్పున రోజుకు రూ.7.2 కోట్లు టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులకు వెళ్తోంది. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఇసుక తవ్వే కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు రూ.30,000 కోట్ల నుంచి రూ.40,000 కోట్లు సొమ్ము చేసుకున్నారు. గురజాల నియోజకవర్గంలో ఓ ప్రజాప్రతినిధి ఇసుక, మైనింగ్ రూపంలో వెయ్యి కోట్లు సంపాదించాడు. హౌసింగ్ స్కీమ్లో రూ.18,250 కోట్ల స్కామ్ హౌసింగ్ స్కీమ్ పేరుతో జరిగిన కుంభకోణం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. తెలంగాణలో 1,000 ఇళ్లు ఒక యూనిట్గా తీసుకుని చదరపు అడుగుకు రూ.1,300 చొప్పున వెచ్చించి చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇళ్ల నిర్మాణ పనులు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం తక్కువ మంది కాంట్రాక్టర్లు ఉంటే కమీషన్లు తీసుకోవడం సులభమని 10,000 ఇళ్లు ఒక యూనిట్గా పెట్టి చదరపు అడుగుకు రూ.2,400 చొప్పున వెచ్చించి నలుగురైదుగురికి కాంట్రాక్టులు ఇచ్చారు. ఇవికాకుండా అమృత్ పేరుతో చదరపు అడుగుకు వసతుల కల్పన పేరుతో రూ.200 చొప్పున ఖర్చు పెడుతున్నారు. ఈ లెక్కన తెలంగాణ కన్నా చదరపు అడుగుకు రూ.1,200 అదనంగా ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇటీవలే ఈ గృహాల సంఖ్యను 10 లక్షలకు పెంచారు. ఈ లెక్కన 36.5 కోట్ల చదరపు అడుగులకు తెలంగాణకు, ఇక్కడికి ఉన్న రూ.1,200 తేడాలో రూ.500లను అధికార పార్టీ పెద్దలు తింటున్నారని కాంట్రాక్టర్లే చెబుతున్నారు. చదరపు అడుగకు రూ.500 చొప్పున 36.5 కోట్ల చదరపు అడుగులకు రూ.18,250 కోట్లు దోచుకుంటున్నారు. సెట్టాప్ బాక్సుల్లో రూ.2 వేల కోట్లకు ఎసరు కేబుల్ ఆపరేటర్లను తమ అధీనంలో పెట్టుకుని తమకు అనుకూలంగా లేని చానళ్ల గొంతు నొక్కడం కోసమే ప్రభుత్వం ఫైబర్నెట్ను తెరపైకి తెచ్చింది. ఈ ఫైబర్నెట్ కాంట్రాక్టులను కూడా అనర్హులకే కట్టబెట్టారు. రూ.300 కోట్లతో ఫైబర్నెట్ ప్రాజెక్టు పూర్తవుతుందని తొలుత చెప్పిన ప్రభుత్వం తర్వాత ఈ వ్యయాన్ని రూ. 1100 కోట్లకు పెంచేసింది. ఒక్కో సెట్టాప్ బాక్సు రూ.1200–1500లకు లభిస్తుండగా, ప్రభుత్వ పెద్దలు మాత్రం కమీషన్ల కోసం ఒక్కో బాక్స్కు రూ.4,000 కేటాయించి, వారికి సంబంధించిన వారికే కాంట్రాక్టులు కట్టబెట్టారు. దోచుకున్నది చాల్లేదని, రూ.2,000 కోట్లు దోచుకోవడం కోసం 10 లక్షల బాక్సులు సరిపోవని 64 లక్షల సెట్టాప్ బాక్సుల కొనుగోలుకు ఇటీవలే జీవో విడుదల చేశారు. ప్రాజెక్టుల కోసం రూ.35 వేల కోట్ల అప్పు: ప్రభుత్వం రూ.50,000 కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు చేపడితే అందులో రూ.25,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్ల సొమ్ము సీఎం, మంత్రులకు వెళుతోంది. రూ.2.20 లక్షల కోట్ల అప్పు ఉందని ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రంలో ప్రకటించిన ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం కోసం బడ్జెట్లో డబ్బు లేకపోయినా వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు గ్యారంటీగా ఉండి రూ.35,000 కోట్ల అప్పు తెచ్చినట్టు చెప్పింది. అన్నింటికీ కన్సల్టెన్సీలే అయితే ఉద్యోగులెందుకు? నాలుగు, ఆరు లైన్ల జాతీయ రహదారులు పక్కాగా వేయడానికి కేంద్రం కిలోమీటర్కు రూ.26 కోట్లు అత్యధికంగా టెండర్లు పిలుస్తుంటే, అమరావతిలో రోడ్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం కి.మీ కి రూ.36 కోట్లకు టెండర్లు పిలిచింది. కన్సల్టెన్సీ చార్జీల పేరుతో నాలుగున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం చెల్లించిన సొమ్ము గత 70 సంవత్సరాల్లో అన్ని ప్రభుత్వాలు చెల్లించినదానికంటే ఎక్కువ. కన్సల్టెన్సీ చార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు చెల్లించింది. అన్ని పనులను కన్సల్టెన్సీలకే అప్పగిస్తూ చార్జీలు చెల్లిస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఇక ఉద్యోగులు ఎందుకు?’’ అని అజేయ కల్లం ప్రశ్నించారు. కమీషన్ల కోసమే అంచనా వ్యయం పెంపు నీటి పారుదల ప్రాజెక్టుల పేరుతో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం 2014లో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రమే. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మొదలుపెట్టి నిర్మాణంలో ఉన్న 23 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.17,368 కోట్లు అవసరమని 2014లో ప్రభుత్వం శ్వేతపత్రంలో పేర్కొంది. ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రంలో రూ.52,000 కోట్లు ఖర్చుపెట్టామని చెప్పింది. రూ.17,000 కోట్ల అంచనా వ్యయాన్ని కేవలం కమీషన్ల కోసం రెండు నుంచి మూడు రెట్లు పెంచేసి దర్జాగా దోచేస్తున్నారు. బడ్జెట్లో డబ్బులు లేకున్నా అప్పులు తెచ్చి మరీ ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెంచి దోచుకోవడం దారుణం. కావాల్సిన వారికే ఎయిర్పోర్ట్ కాంట్రాక్టు! భోగాపురంలో 2,700 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే టెక్నికల్ బిడ్లలో రెండు కంపెనీలు పాల్గొన్నాయి. అందులో ఒకటి ప్రభుత్వ కంపెనీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ, రెండోది జీఎమ్మార్. టెక్నికల్ బిడ్లో అర్హత సాధించిన అనంతరం ఫైనాన్షియల్ బిడ్స్ పిలిస్తే ఎయిర్పోర్ట్ అథారిటీ రెవెన్యూలో 30.2 శాతం ఇస్తామని చెప్పగా, జీఎమ్మార్ 21.6 శాతం ఇస్తామని బిడ్లో తెలిపింది. ప్రభుత్వ కంపెనీ ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి కమీషన్లు గుంజడం కుదరదనే ఉద్దేశంతో ఎలాగైనా జీఎమ్మార్కు టెండర్ కట్టబెట్టాలని కుట్రపన్నారు. చిన్నచిన్న కారణాలు చూపించి కేబినెట్లో పెట్టుకుని ఆ టెండర్ రద్దు చేశారు. -
‘సీమ రైతులు చిత్తుకాగితాలు ఏరుకుంటున్నారు’
సాక్షి, గుంటూరు : రాయలసీమకు చెందిన పెద్ద పెద్ద రైతులు హైదరాబాదులో చిత్తుకాగితాలు ఏరుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అజేయ కల్లాం వ్యాఖ్యానించారు. ఏపీలోని రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. ఏపీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను చూసి వరుణ దేవుడు కూడా పారిపోతున్నాడని ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ప్రశ్నించే గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. తెలంగాణలో ఇసుక మీద రెండు వేల కోట్ల రాయితీ ప్రభుత్వానికి వస్తుందని, కానీ ఏపీలో అంత కంటే పది రెట్లు ఎక్కువ ఆదాయాన్ని ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. రోజుకి 7.2 కోట్ల రూపాయల డబ్బును టీడీపీ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని ఆరోపించారు. పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో కూడా 40 శాతం నిధులను సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు పంచుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో గృహ నిర్మాణం అతి పెద్ద స్కామని, అడుగుకి పదమూడు వందల రూపాయలు చొప్పున పక్క రాష్ట్రాల్లో ఇస్తుంటే ఏపీలో పదివేలు చొప్పున ఇస్తున్నారని తెలిపారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతోంది. కాకినాడలో భూముల కేటాయింపులోనూ కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఫైబర్ నెట్ పేరుతో కేబుల్ వ్యవస్థను తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. పన్నెండు వందల రూపాయలకు దొరికే సెటప్ బాక్స్ 14 వేల చొప్పున కొనుగోలు చేశారు. ఇప్పటికే రెండు వేల కోట్లకుపైగా దోపిడీ చేశారు. పెద్ద పెద్ద నేషనల్ హైవేలకు కిలోమీటరుకు 18 కోట్లు కేటాయిస్తే.. అమరావతిలో రోడ్ల నిర్మాణానికి 36 వేల కోట్లు కేటాయించారంటే.. ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోండి. అవినీతిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే 40 ఏళ్ల అనుభవజ్ఞులు కాదు.. అంకితభావంతో పనిచేసేవారు కావాలి. -
దేవుడినీ దోచేస్తున్నారు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్రంలో సాక్షాత్తూ దేవుడి సొమ్మును కూడా వదలకుండా దోచుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అజేయ కల్లం ఆరోపించారు. అమరావతిలో టీటీడీ టెంపుల్ నిర్మాణం కోసమంటూ రూ.12.50 కోట్లు పెట్టి ఎకరా రూ.50 లక్షల చొప్పున 25 ఎకరాల భూమిని కొనిపెట్టారని చెప్పారు. అక్కడ ఇప్పటికే వెంకటేశ్వరస్వామి ఉందని, మళ్లీ ఇంకో గుడి అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఆదివారం విజయనగరం పట్టణంలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సు జరిగింది. విశ్రాంత ఉద్యోగులు, మేధావులు పాల్గొన్న ఈ సదస్సులో అజేయ కల్లం ప్రసంగించారు. రాష్ట్ర్ర ప్రభుత్వ వైఫల్యాలు, పాలకుల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవరెవరో మొదలు పెట్టిన సాగునీటి ప్రాజెక్టులను కొందరు తమవిగా చెప్పుకుని, తమను తాము అపర భగీరథులుగా అభివర్ణించుకుంటున్నారని విమర్శించారు. అస్మదీయులకు నేరుగా భారీ కాంట్రాక్టులు అప్పగిస్తూ కమీషన్లు కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. అజేయ కల్లం ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చరిత్రలో భూమిని కొనడం జరగలేదు. డబ్బులిచ్చి కొనలేదు. మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చేది. తొలిసారిగా అమరావతిలో టీటీడీ టెంపుల్ అవసరమేంటో తెలియదు. రూ.12.50 కోట్లు పెట్టి ఎకరా రూ.50 లక్షల చొప్పున 25 ఎకరాల భూమిని కొనిపెట్టారు. పక్కనే వైకుంఠపురం అనే గ్రామం ఉంది. అక్కడ వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. మళ్లీ అమరావతిలో టీటీడీ టెంపుల్ కోసం భూమి ఎందుకు కొన్నారో అర్థం కాలేదు. టీటీడీ ఎట్లా ఒప్పకుందో అర్థం కాలేదు. ఇది కాకుండా కొత్తగా జీవో ఇచ్చారు. తిరుపతిలో అవిలాల చెరువు అనే పాడైన చెరువు ఉంది. దాన్ని ఎకో టూరిజం కింద రూ.184 కోట్లతో అభివృద్ధి చేయండని టీటీడీకి ప్రభుత్వం జీవో ఇచ్చింది. టీటీడీకి ఎక్కడైనా ఏదైనా చేయాలన్నా భూమిచ్చినా, అది టీటీడీ పేరున ఉండాలి. దేవుడిని కూడా వదలకుండా దోపిడీ చేస్తున్నారంటే ఏ విధమైన పరిపాలనో అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో మళ్లీ రాచరిక వ్యవస్థ రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం వచ్చింది. కానీ, ఇప్పుడు రాచరిక వ్యవస్థ కొనసాగుతోంది. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోంది. హీరోల సినిమాలు చూడొచ్చు. కానీ, వారిని రాజకీయాల్లో హీరోలుగా చూడొద్దు. పార్టీ కార్యకర్తలకు ప్రయోజనం కలిగేలా పథకాలు రూపొందిస్తున్నారు. నీరు–చెట్టు, గ్రామీణ ఉపాధి హామీ పథకాల్లో భారీగా అవినీతి జరిగింది. పొరుగు రాష్ట్రంలో ఎస్ఎఫ్టీ ఇల్లు రూ.1,300కు కోట్ చేస్తే, ఏపీలో ఇంటి నిర్మాణానికి ఎస్ఎఫ్టీ రూ.2,400 కోట్ చేశారు. ఆదర్శవంతం కాని జీవితాలు గడిపేవారు హీరోలా? ఇటీవలి కాలంలో కొత్తగా సినిమా పాలిటిక్స్ తమిళనాడు తర్వాత మనకు అంటుకున్నాయి. సినిమా నటుల వ్యక్తిగత జీవితాలు ఎవరికీ ఆదర్శంగా ఉండవు. ఆదర్శవంతం కాని జీవితాలు గడిపేవారు సమాజానికి హీరోలు ఎలా అవుతారు? హీరోలంటే అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు, పుచ్చలపల్లి సుందరయ్య, దామోదరం సంజీవయ్య వంటి వారు. విజయనగరం జిల్లాలో శ్రీశ్రీ , తెన్నేటి విశ్వనాథం లాంటివారు హీరోలు. సినిమా హీరోల నటన బాగుంటే ఒకటికి పదిసార్లు సినిమా చూద్దాం. పరిపాలన నడిపించడానికి వారిని ఆదర్శంగా తీసుకోవద్దు. బహిరంగంగానే దోపిడీ రాష్ట్రంలో అవినీతి పార్టీ అధికారంలో ఉంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం, నీరు–చెట్టు వంటి స్కీమ్లు పెట్టి సగానికి సగం తినేసే విధంగా తయారు చేస్తున్నారు. కార్యకర్తల స్థాయి నుంచి ఎంపీలు, ఎమ్మెల్యే, మంత్రుల స్థాయి దాకా పంచుకుతింటున్నారు. నీరు–చెట్టుకు గత నాలుగైదేళ్లలో రూ.30 వేల కోట్లు ఖర్చుపెట్టారు. సగానికి పైగా తినేశారు. కార్యకర్తల పేరుతో పార్టీకి అనుబంధంగా ఉండేవారు తినేస్తున్నారు. వారే మళ్లీ ఎన్నికల్లో ఖర్చుపెడతారు. ఇక ఎమ్మెల్యేలు తన పరిధిలో ఉన్న మట్టి, మద్యం దుకాణాల్లో వాటా, ఇసుక, రిజిస్ట్రేషన్ల వద్ద, పర్మిషన్ల కోసం పర్సేంటేజీల పేరుతో రూ.కోట్లు మింగేస్తున్నారు. ప్రభుత్వ పరిధిలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఐటీలు, కొనుగోళ్ల దగ్గర నుంచి అంతా ఓపెన్గా కమీషన్ల వ్యవహారం సాగుతోంది. పెద్ద ప్రాజెక్టులన్నింటిలో 6 శాతం కమీషన్ ముఖ్యమంత్రికి సీఎంకు వెళ్తోంది. పట్టిసీమలో విపరీతమైన దోపిడీ కాగ్ రిపోర్టు చెప్పిన దాని ప్రకారం.. పట్టిసీమ ప్రాజెక్టులో రూ.600 కోట్ల విలువైన పని జరిగితే రూ.1,600 కోట్లు అని లెక్కల్లో రాసేసుకున్నారు. చదరపు మీటర్ మట్టి తవ్వడానికి రూ.21,350 కోట్ చేశారు. అంటే ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. బ్యాలెన్స్ వర్కును పెంచుకోవడానికి మరింతగా దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు పని వేగంగా జరిగింది. ఆ తర్వాత పని పూర్తి కాలేదు. ఆటోల కొనుగోలులోనూ కమీషన్లు కొన్ని జిల్లాల కలెక్టర్లు నిరుద్యోగులకు ఆటోలిస్తే బాగుంటుందని భావించారు. రెండు జిల్లాల్లో రూ.1.20 లక్షలు, రూ.1.10 లక్షల ధరకు ఆటోలు కొన్నారు. ఆటోల కొనుగోలులోనూ కమీషన్లు మింగేయడానికి రాష్ట్రస్థాయిలో పూల్ చేసి కొంటామని చెప్పి 7,700 ఆటోలను యూనిట్ చేసి, ఒక్కో ఆటోను రూ.2.78 లక్షల ధరకు కైనటిక్ గ్రీన్ సంస్థ (క్వాలిఫైడ్ కానిది)తో నుంచి కొనేలా టెండర్లు ఖరారు చేశారు. లక్ష రూపాయలది రెండు లక్షలకు కొంటున్నారంటే ఇందులో ఎంత కమీషన్ తీసుకుంటున్నారో ఉందో అర్థం చేసుకోవాలి. మెడికల్ అప్లయన్సెస్ స్కామ్ ఒకటి విశాఖ జిల్లాలో జరుగుతోంది. అప్లయన్సెస్కు ఓ కాంట్రాక్టు ఇస్తున్నారు. మెడికల్ ట్రాన్స్స్పరేషన్కు 8 శాతం చొప్పున సర్వీస్ చార్జీలు ఇస్తున్నారు. దానికోసం రూ.3,800 ఉన్న మైక్రోస్కోప్ను రూ.30 వేలుగా రికార్డుల్లో చూపిస్తున్నారు. రూ.800 నుంచి రూ.900 ఖరీదు చేసే గ్లూకోమీటర్ను గ్లూకోజ్ అనలైజర్ అని చెప్పి రూ.5.80 లక్షల చొప్పున కొంటున్నామంటున్నారు. హోల్సేల్గా దోచేయాలని చూస్తున్నారు. మాల్యా, నీరవ్ మోడీ లాంటివారు ఆత్మహత్య చేసుకున్నారా? విశాఖ బాటిలింగ్ కంపెనీ ఎవరిదో అందరికీ తెలుసు. ఒక పెద్దాయనకు చెందిన ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ కాంప్లెక్స్ సిటీకి కృష్ణా జిల్లాలో 498.33 ఎకరాలను కేవలం రూ.4.95 కోట్లకు కేటాయించారు. నిజానికి ఆ భూమి ఖరీదు రూ.300 కోట్లు. ఇది భూమిలో వచ్చే లాభం. ఇది కాకుండా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? విజయ్ మాల్యా, నీరవ్ మోడీ తదితర వారిపై కేసులు పెట్టారు. వీరెవరైనా ఆత్మహత్యలు చేసుకున్నారా? కార్పొరేట్ కంపెనీ పెట్టి, దానిపేరిట అప్పులు తీసుకోవచ్చు. జనాలను దోచేయొచ్చు. పర్సనల్గా ఉండే ఆస్తిని ఏం చేయలేరు. అదే రైతు తీసుకుంటే మొత్తం కుటుంబం నుంచి రికవరీ చేస్తారు. కావాల్సిన వారికి రూ.వందల కోట్లు ఆ దీక్షా, ఈ దీక్ష అంటూ కోట్ల రూపాయలు వృథా చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేస్తామనుకుని నిర్ణయం తీసుకుని, నన్ను, సాంబశివరావు, శ్యామ్బాబులతో కమిటీ వేశారు. డిపార్ట్మెంట్లన్నీ ఎక్కడుండాలో చూసిరండన్నారు. డబ్బుల్లేని రాష్ట్రమని, ఎక్కడపడితే అక్కడ తీసుకుంటే కరెక్ట్ కాదని, అడ్మిషన్స్ లేని ఇంజనీరింగ్ కళాశాలలు నిరుపయోగంగా ఉన్నాయని గ్రహించి, రెండు కళాశాలలు తీసుకుంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్కి సరిపోతుందని, మొత్తం కలిపితే ఏడాదికి రూ.10 కోట్లు సరిపోతాయని నివేదిక ఇస్తే, దాన్ని చెత్తబుట్టలో పడేసి, తమకు కావాల్సిన వారిందరికీ మంచి అద్దెలొస్తాయని, కమీషన్లు వస్తాయని, లాభం సమకూర్చాలని చెప్పి ఇప్పుడు రూ.వందల కోట్లు అద్దెలు కట్టడాన్ని చూస్తున్నాం. రాజధానికి 35,000 ఎకరాలా? మామూలు వ్యక్తే తన ఆర్థిక పరిస్థితి ఆధారంగా జీవిస్తాడు. ప్రజల సంక్షేమం కోరే ప్రభుత్వం తప్పుడు పనులు చేయొచ్చా? హైదరాబాద్లో సెక్రటేరియట్ 25 ఎకరాల్లో ఉంది. రాయపూర్ లాంటి ఆధునిక నగరాన్ని కేవలం 5 వేల ఎకరాల్లో కట్టారు. మనకు నాగార్జున యూనివర్సిటీని తీసుకుంటే 400 ఎకరాల్లోæ అన్నీ వచ్చేవి. అసెంబ్లీ వచ్చేది, బ్రహ్మాండమైన సెక్రటేరియట్ వచ్చేది. దానికి 35 వేల ఎకరాలు ఎందుకు? ఇంకా ఇన్ని వేల కోట్లు అవసరమేంటి? ఎవరి డబ్బు ఇది? కట్టేది మనమే. మన అప్పు రూ.2,52,020 కోట్లు. రాష్ట్ర జీడీపీలో 27.3 శాతం అప్పు ఇప్పటికే చేశాం. ఫైనాన్సియల్ రూల్ ప్రకారం అప్పు ఎట్టిపరిస్థితుల్లోనూ 25 శాతం దాటరాదు. కానీ, 27 శాతానికి చేరింది. వీటితోపాటు నాన్బడ్జెట్లో మరింత దోచేస్తున్నారు. అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ రోజు దేశంలో 16.5 లక్షల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు. కానీ, ఏడాదికి 2 లక్షల ఇంజనీర్లకు కూడా ఉద్యోగాలివ్వలేని ఎకానమీ మనది. మన కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ జీడీపీ ఉన్న అమెరికా వంటి దేశంలో ఏడాదికి కేవలం రెండు లక్షల మంది ఇంజనీర్లను తయారుచేస్తున్నారు. అమరావతి వద్ద కొత్తగా ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశారు. ఉన్నవాటికే దిక్కులేదు. మనుషుల్లేరు. ఉన్న కళాశాలలు మూసివేతకు గురవుతున్నాయి. పోనీ ఫీజులో తగ్గింపునిస్తున్నారా అంటే ఏదీ లేదు. ప్రజారోగ్యం ప్రైవేట్పరం రెయిన్ గన్స్, ఆయిల్ పేరుతో అనంతపురం జిల్లాలో రూ.111.98 కోట్లు ఖర్చు పెట్టారు. నంద్యాలలో ఎన్నికల సమయంలో 13,334 రెయిన్గన్స్ కొన్నారు. వీటి కొనుగోళ్లలో షేర్లు, పర్సెంటేజీలు తప్పితే ఇంకేమీ లేదు. ఇక మెకనైజేషన్ పేరుతో దాదాపు రూ.11,000 కోట్లు అంటున్నారు. రాష్ట్రంలో పబ్లిక్ హెల్త్, ప్రభుత్వ ఆస్పత్రులను ప్రైవేటు పరం చేస్తున్నారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రవేశపెట్టారు. రైతులు తమ పిల్లలను పెద్ద చదువులు చదివించుకోలేకపోతున్నారని గ్రహించి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా వారికి భరోసా కల్పించారు. రైతుల ఉసురు పోసుకున్నారు: గోపాలరావు రాజధాని నిర్మాణం కోసం విజయవాడ వైపు వెళ్లొద్దని చెప్పిన శివరామకృష్ట కమిటీ నివేదికను పక్కన పెట్టడం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలరావు విమర్శించారు. రాజధాని నిర్మాణం కోసమంటూ 32 వేల ఎకరాల సాగు భూమిని తీసుకొని రైతుల ఉసురు పోసున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పాలకుల నిర్వాకం వల్ల కౌలు రైతులు అప్పుల్లో కూరుకుపోయారని చెప్పారు. పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి సీఎం చంద్రబాబు ముందుకు రాకపోవడంవల్ల రాష్ట్రంలో 12,850 సర్పంచులు, 1.38 లక్షల వార్డు సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నాయని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి చెప్పారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఎన్నికలకు వెళ్లడానికి పాలకులు భయపడుతున్నారని విమర్శించారు. మద్యం అమ్మకాలను విచ్చలవిడిగా పెంచి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చారని మండిపడ్డారు. ఈ సదస్సులో ప్రొఫెసర్ కిర్ల విజయ్కుమార్, ప్రొఫెసర్ పీవీజీవీ ప్రసాద్రెడ్డి, రాజకీయ విశ్లేషకులు కె.రవికుమార్, ప్రొఫెసర్లు రాఘవరెడ్డి, రామకృష్ణారావు, విశ్రాంత ప్రిన్సిపాల్ శివరామ్మూరి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేసుకోలేమా? నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం ఆంధ్రాలో 1995లో 1,250 ఆత్మహత్యలు, 1996లో 1,700, 1997లో 1,100, 1998లో 1,750, 1999లో 1,900 ఆత్మహత్యలు జరగ్గా, అంతా బోగస్ 300 మందే చనిపోయారని చెబుతున్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా కార్పొరేట్ ఆసుపత్రులు కట్టిస్తున్నారు. ఒక్కో జిల్లాకు రూ.200 కోట్లు ఖర్చు పెట్టి ఉన్న ఆసుపత్రులను కార్పోరేట్ స్థాయిలో అభివృద్ధి చేసుకోలేమా?’’ అని అజేయ కల్లం ప్రశ్నించారు. -
రాష్ట్రంలో రాచరికపు పాలన
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో రాజరికపు పాలన, కుటుంబ పెత్తనం వల్ల వ్యవస్థలన్నీ ధ్వంసం కాగా వ్యవస్థీకృత అవినీతి తారా స్థాయికి చేరిందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం ఆందోళన వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు నుంచి మట్టి వరకు, అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుకొని ప్రభుత్వ దుబారా వరకు రూ.వేల కోట్ల ప్రజా సంపదను లూటీ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. గురువారం నెల్లూరు టౌన్హాల్లో ‘మనం కోసం మనం’ నేతృత్వంలో జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సభకు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అజేయ కల్లం ఇంకా ఏం చెప్పారో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... రైతులకు మొండిచెయ్యి.. కంపెనీలకు భూములా? ‘రైతులకు సబ్సిడీలు, రుణాలు, కనీస మద్దతు ధర ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఫైవ్ స్టార్ హోటళ్లకు, విమానాల కంపెనీలకు, సాఫ్ట్వేర్ కంపెనీలకు మాత్రం భూమితో పాటు రాయితీలు భారీగా ఇస్తోంది. విజయవాడ – సింగపూర్ విమానాలు నడిపే ఇండిగో సంస్థకు రూ.18 కోట్లు సబ్సిడీ ఇస్తూ గత నెల 27న జీఓ జారీ చేసి ఇప్పటికే రూ.3 కోట్లు విడుదల చేశారు. విమాన సంస్థలకు ఎదురు డబ్బులిచ్చి మరీ విమానాలు ఎందుకు నడిపిస్తున్నారు? విమానాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు సింగపూర్ వెళ్లడానికా? లేక రాజధానిలో 1,600 ఎకరాలు కేటాయించిన సింగపూర్ కంపెనీ కోసమా? ఇదేనా ప్రజారంజక పాలన అంటే? విమాన కంపెనీలు, స్టార్ హోటళ్లకు రాయితీలు ఇవ్వడం కంటే అర్బన్ ప్రాంతాల్లో ఉచితంగా వసతి గృహాలు నిర్మించి అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. దీక్షల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం.. రాష్ట్రంలో దీక్షల పేరుతో రూ.కోట్లలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. 50 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ప్రభుత్వమే దీక్షలు చేయడం చూశామా? హెచ్సీఎల్ కంపెనీ అధినేత శివనాడార్ తిరుపతిలో కంపెనీ పెడతానంటే అమరావతికి తీసుకొచ్చి రూ.700 కోట్లు విలువ చేసే 49 ఎకరాల భూమి, 12 ఏళ్ల పాటు రూ. 2,223 కోట్ల రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ప్రశ్నించలేని ఎమ్మెల్యేలు ఉన్నంతవరకూ ఇదే పరిస్థితి పేదల ఇళ్ల నిర్మాణ పథకంలోనూ భారీగా అవినీతి జరుగుతోంది. తెలంగాణలో ఒక చదరపు అడుగు నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం రూ.800 చొప్పున కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్లో రూ.1,900 నుంచి రూ.2,700 వరకు కంపెనీని బట్టి ఇస్తున్నారు. ధరలో ఇంత తేడా ఎందుకో ప్రశ్నించలేని ఎమ్మెల్యేలు ఉన్నంత వరకు పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఈ అంశాలపై ఓ సాధారణ వ్యక్తిగా నేను మాట్లాడితే ‘‘మీరు ఏ పార్టీ? మీకు ఏం పని..?’’ అంటూ ప్రశ్నించే హక్కే లేదన్నట్లుగా మంత్రులు మాట్లాడడం దారుణం. సాగునీటి ప్రాజెక్టుల్లో 40 శాతం దోపిడీ సాగునీటి ప్రాజెక్టుల్లో 35 నుంచి 40 శాతం ప్రజాధనాన్ని దోచుకుని తింటున్నారు. మళ్లీ ఆ డబ్బులనే రాజకీయాల్లో పెట్టుబడిగా పెట్టి వారి గణాన్ని ఎన్నికల బరిలో దించుతున్నారు. రాష్ట్రంలో నిపుణులైన ఇంజనీర్లను ప్రాజెక్టుల వద్దకు తీసుకెళ్లి జరిగిన పనుల విలువ లెక్కిస్తే వాస్తవాలు తెలుస్తాయి. రాజధాని పేరుతో రూ.60 వేల కోట్లు దుర్వినియోగం రాష్ట్రంలో ఖర్చు పెట్టే ప్రతి పైసాకు అసెంబ్లీ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. కానీ అసెంబ్లీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా, సభలో కనీసం చర్చించకుండా, ఓటింగ్ నిర్వహించకుండా రూ.27 వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తారు? కాగ్ తప్పుబట్టినా ఒక్క ఎమ్మెల్యే కూడా దీన్ని ప్రశ్నించలేదు. లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో నాన్ బడ్జెట్ పేరుతో రూ.60 వేల కోట్లు అప్పు తీసుకోవడం ఏమిటి? రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంటే ఖర్చులు నియంత్రించుకోకుండా రూ.60 వేల కోట్లు పెట్టి అమరావతిలో తాత్కాలిక భవనాలు ఎందుకు? రూ.100 కోట్ల ఖర్చుతో శాశ్వత భవనాలు నిర్మించుకుంటే ప్రజాధనం లూటీ అయ్యేది కాదు. ప్రజాభిప్రాయానికి తావులేకుండా చేసి వ్యవస్థల్ని ప్రభుత్వం నాశనం చేస్తోంది. వైఎస్ మొండి ధైర్యంతో పోలవరంపై ఖర్చు చేశారు పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకతను 1930లోనే గుర్తించారు. తర్వాత 1970లో ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మొండి ధైర్యంతో పోలవరంపై రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేయించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం దీన్ని చట్టంలో పొందుపరిచి నాబార్డు ద్వారా నిధులు ఇచ్చింది. కానీ మన పాలకులు పోలవరాన్ని తాము పూర్తి చేస్తే అపరభగీరథులు అవుతామని, తమని ఓడించే వాళ్లే ఉండరని క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించడం మూలంగానే పోలవరం అభివృద్ధిలో పురోగతి లేదన్నారు. రాజధాని రియల్ ఎస్టేట్ డబ్బుతో ఎన్నికలకు సిద్ధం రాజధాని పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను కనీసం చూడకుండానే రాజధాని ప్రాంతాన్ని ప్రకటించేసి రైతుల నుంచి 35 వేల ఎకరాల భూమిని తీసుకుంది. ఇందులో 5 నుంచి వేల ఎకరాల భూమిని ఎమ్మెల్యేలు, మంత్రులు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ భూమిగా మార్చేశారు. వీటి ద్వారా వచ్చే అవినీతి డబ్బును మళ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఉచిత ఇసుక పేరుతో దోపిడీ రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలదే రాజ్యంగా మారిపోయింది. వారికి తెలియకుండా ఏదీ జరగదు. ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్లు అన్నీ డబ్బులు తీసుకుని చేస్తున్నారు. అనేక చోట్ల ‘‘ఎమ్మెల్యే టాక్స్’’ ఉంది. కనీసం మెడికల్ షాపు ఏర్పాటు చేసుకోవాలన్నా ఎమ్మెల్యేకు ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. జన్మభూమి కమిటీలు మితిమీరిన పెత్తనంతో పంచాయతీ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయింది. ఉచిత ఇసుక పేరుతో దోపిడీకి తెర తీశారు. ఉచితం అని చెప్పి భారీ ధరకు అమ్ముతున్నారు. పొరుగున ఉన్న తెలంగాణలో నదులు తక్కువ కావడంతో ఇసుక మనకు లభించినంతగా దొరకదు. అక్కడ ఇసుక అమ్మకం ద్వారా రూ.3 వేల కోట్ల ఆదాయం వస్తే, మన రాష్ట్రంలో రూ.10 వేల కోట్లు రావాలి, కానీ ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇదంతా ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లే తినేస్తున్నారు. ఒక రకంగా పూర్తి వ్యవస్థీకృత దోపిడీ కొనసాగిస్తున్నారు. కార్యకర్తలు కాదు.. పెయిడ్ వర్కరŠస్స్ రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు రూ. వందలు, వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఉపాధిహామీ పనులు రూ.25 వేల నుంచి రూ.30 వేల కోట్లు జరిగితే అన్నీ అధికార పార్టీ కార్యకర్తలకే ఇచ్చారు. కార్యకర్తలకు ఒక రకమైన ప«నులు, ఎమ్మెల్యేలకు మరో రకమైన పనులు, మంత్రులకు ప్రాజెక్టులు... ఇలా పంచుకొని మరీ దోపిడీ కొనసాగిస్తున్నారు. వాళ్లు కార్యకర్తలు కాదు... పెయిడ్ వర్కర్స్. లోకేష్ కోసం కుటుంబ పాలన.. మంత్రి లోకేష్ కోసం మరో 25 నుంచి 30 మంది వారసులకు టికెట్లు ఇచ్చి కుటుంబ పాలన కొనసాగించనున్నారు. అనుభవం, అవగాహన లేనివారిని, కనీసం సర్పంచ్గా గెలవలేని వారిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేసి మంత్రులుగా చేస్తున్నారు. వారికి కనీసం ప్రజాస్వామ్యం అంటే ఏమిటో కూడా తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో లేని రాజధాని నిర్మాణం, ఇతర అంశాలపై ప్రజల అభిప్రాయాన్ని తీసుకోకుండా వ్యవహరించటం సరికాదు. -
లీకులతో షురూ!
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు పనితీరు చాలా విచిత్రంగా ఉంటుందని విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. విభజన అంశాలతోపాటు ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై ఐవైఆర్ తాను రాసిన ‘నవ్యాంధ్రలో నా నడక’ పుస్తకంలో ఒక అధ్యాయాన్ని కేటాయించారు. తాను పని చేసిన కాలంలో సీఎం చంద్రబాబు వివిధ సందర్భాల్లో అనుసరించిన విధానాలను ఆయన అందులో ప్రస్తావించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి... అధికారులపైకి నెట్టేసి తప్పుకుంటారు.. ‘చంద్రబాబు ఏపని చేయాలనుకున్నా, ఎవర్ని నియమించాలనుకున్నా ముందు రోజు ఆ విషయంపై లీకులు ఇస్తారు. వాటిని ఆయనకు అనుకూలంగా ఉండే పత్రికలు, టీవీ ఛానళ్లు ప్రచారం చేస్తాయి. దానిపై వచ్చిన ప్రతిస్పందన ఆధారంగా ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఇది చంద్రబాబు సాధారణంగా అనుసరించే పద్ధతి. ఒకవేళ ఆ నిర్ణయం వివాదాస్పదంగా మారితే అందుకు బాధ్యతను ఎవరో ఒకరిపై తోసేసి తాను మాత్రం సురక్షితంగా ఉండాలని ప్రయత్నిస్తారు. చాలాసార్లు నిర్ణయాలకు బాధ్యతను అధికారులపైనే తోసేస్తారు. ఇది ఇప్పుడే కాదు.. గతంలో కూడా ఆయన ఇదే పద్ధతిని అనుసరించారు. ఉదాహరణకు గతంలో చంద్రబాబు అదనంగా మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినప్పుడు పెద్ద గందరగోళం చెలరేగింది. మర్నాడు ఇది ఎవరు, ఎందుకు చేశారు? అని సీఎం ఆరా తీసి కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి. మూడో రోజు తర్వాత ఆ కమిషనర్ను ఆ పదవి నుంచి తప్పించి పోస్టింగ్ ఇవ్వకుండా ఎక్కడో సర్దుబాటు చేశారు. నిజానికి అదనంగా మద్యం షాపులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది చంద్రబాబే.’ కావాలనే లీకులు.. ‘నన్ను సీఎస్గా నియమించే విషయంలో కూడా చంద్రబాబు అదే పద్ధతి అనుసరించారు. నన్ను చీఫ్ సెక్రటరీగా, రాముడును డీజీపీగా, మరొకర్ని ఇంటెలిజెన్స్ ఐజీగా నియమించనున్నట్లు లీక్లు వచ్చాయి. ఈ జాబితా గవర్నర్కు అందచేసి ఆమోదం పొందాలి. రెండో రోజు జాబితాను పరిశీలించాక.. ‘‘ఆ ఇంటెలిజెన్స్ అధికారి పేరు తీసేయండి. ఆయనపై నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది...’’ అని ముఖ్యమంత్రి అన్నారు. అదృష్టవశాత్తు నామీద వ్యతిరేక ఫీడ్బ్యాక్ రాలేదు. సాయంత్రం జరిగిన ఆంతరంగిక చర్చల్లో మీపట్ల ఏదీ వ్యతిరేక సమాచారం అందలేదనుకుంటా అని ఒక మిత్రుడు అనడంతో ఊపిరి పీల్చుకున్నా. ఈ పద్ధతి అజేయ్ కల్లాం విషయంలో కూడా జరిగింది. ఆయన్ను చీఫ్ సెక్రటరీగా మొదట నెల పాటు నియమించి తర్వాత ఆర్నెల్లు పొడిగించాలని తొలుత నిర్ణయించారు. కానీ రాత్రి పొద్దుపోయిన తర్వాత కొత్త చీఫ్ సెక్రటరీగా దినేశ్కుమార్ను నియమిస్తున్నట్లు చెప్పారు. బహుశా రాత్రిపూట జరిగిన చర్చల్లో అజేయ్ కల్లాంను సీఎస్గా పంపకూడదని నిర్ణయించి ఉంటారు. కేంద్రం అజేయ్ కల్లాంకు ఆర్నెల్ల పొడిగింపునకు సుముఖంగా లేదని, ఈ నేపథ్యంలో నెల రోజుల కోసం సీఎస్గా నియమించే బదులు నేరుగా దినేశ్కుమార్కు ఇవ్వాలనుకుంటున్నామని లీకులు సృష్టించారు. దీంతో కల్లాం సీఎంను కలవడంతో ఆయనకు నెల పాటు సీఎస్గా అవకాశం ఇచ్చారు. అదే జీవోలో కల్లాం రిటైర్మెంట్ తర్వాత దినేశ్కుమార్ను సీఎస్గా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉదంతం బాబు పద్ధతిని స్పష్టం చేస్తోంది. ఇష్టంలేని వారి మనోస్థైర్యం దెబ్బతినేలా లీకులు ఇచ్చి చివరకు వేటు వేస్తారు’ అని పేర్కొన్నారు. -
అజేయ కల్లం సంచలన ఆరోపణలు
‘‘సాగునీటి ప్రాజెక్టుల్లో పెద్ద బాస్కు (సీఎం) భారీగా కమీషన్ అందుతోంది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఖర్చు చేసిన నిధుల్లో ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, అధికార పార్టీ నేతలు 40 శాతం మేర కమీషన్ దండుకుంటున్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం గత నాలుగున్నరేళ్లలో ఖర్చు చేసినట్టు ప్రభుత్వం చెబుతున్న రూ.50,000 కోట్లలోనే ఏకంగా రూ.20,000 కోట్ల అవినీతి జరిగింది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఏకంగా రూ.20,000 కోట్ల అవినీతి జరిగిందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అజేయ కల్లం సంచలన ఆరోపణలు చేశారు. దీంతోపాటు మొత్తం రూ.3 లక్షల కోట్లకుపైగా అవినీతి జరిగిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో నింగి, నేల హద్దుగా అవినీతి పెచ్చుమీరుతోందని దుయ్యబట్టారు. సాగునీటి ప్రాజెక్టులు, ఇసుక, మట్టి, ఫైబర్ గ్రిడ్, నీరు–చెట్టు, నీటి కుంటలు, రెయిన్ గన్లు.. ఇలా ప్రతిదాంట్లోనూ అవినీతి రాజ్యమేలుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో 600 మంది ఒక్కొక్కరు రూ.500 కోట్లకుపైగా సంపాదించారని ధ్వజమెత్తారు. అంతేకాకుండా 50 మంది రూ.100 కోట్లకుపైగా, మరో 50 మంది రూ.50 కోట్లకుపైగా అక్రమంగా ఆర్జించారని చెప్పారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలులో నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సుకు అజేయ కల్లం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... కమీషన్ల కోసమే ప్రైవేట్ కరెంటు కొనుగోళ్లు రాష్టంలో చేపడుతున్న కాంట్రాక్టులన్నీ కేవలం కొన్ని కంపెనీలకు... నవయుగ, మేఘా, కావూరి, రాయపాటి, సీఎం రమేష్కు చెందిన కంపెనీలకు మాత్రమే అప్పగిస్తున్నారు. వీరు ఎక్కడా పనులు చేయడం లేదు. సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి నేరుగా 8 శాతం వరకు కమీషన్లు మింగేస్తున్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు, సెల్ఫోన్ల కొనుగోళ్లలోనూ భారీగా అవినీతి జరిగింది. ఇక నీరు–చెట్టు పథకం కింద రూ.10 లక్షల విలువైన పనులే కాకుండా.. రెండు పనులు కలిపి మొత్తం రూ.20 లక్షల పనులను కూడా నామినేషన్ విధానంలో కావాల్సిన వారికి అప్పగిస్తున్నారు. ఈ పనుల్లో లెక్కలేనంత అవినీతి చోటుచేసుకుంది. మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగంలోని జెన్కో ప్లాంట్లలో గతంలో 90 శాతం ప్లాంట్లు ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తో నడిచేవి. ఇప్పుడు కమీషన్ల కోసం ప్రైవేటు కంపెనీల నుంచి కరెంటును కొనుగోలు చేస్తుండటంతో జెన్కో ప్లాంట్ల పీఎల్ఎఫ్ 50 శాతానికి పడిపోయింది. స్పీకర్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు 23 మంది విపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లాగా కొనుగోలు చేసి స్పీకర్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు. గ్రామ పంచాయతీకి దక్కాల్సిన ఇసుకను దోపిడీ చేసి సంపాదించిన సొమ్ముతో రూ.2 వేలు, రూ.5 వేలు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటామనే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి పోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ఇసుక నుంచి మట్టి వరకు అన్ని పనుల్లోనూ అవినీతి రాజ్యమేలుతోంది. నీరు–చెట్టు కింద పనులు చేయకున్నా బిల్లులు మాత్రం చేసుకుంటున్నారు. ఇక నీటి కుంటలు(ఫారం పాండ్స్) తవ్వకపోయినప్పటికీ తవ్వినట్టుగా లెక్కలు చూపుతున్నారు. ఈ విధంగా 600 మంది రూ.500 కోట్లకుపైగా అక్రమంగా సంపాదించారు. 50 మంది రూ.100 కోట్లకుపైగా, మరో 50 మంది రూ.50 కోట్లకుపైగా సంపాదించినట్టు తెలుస్తోంది. అంటే కేవలం 600 మంది రూ.500 కోట్ల చొప్పున లెక్కిస్తే ఏకంగా రూ.3 లక్షల కోట్ల మేర అవినీతికి పాల్పడి ఆర్జించినట్టు స్పష్టమవుతోంది. ఫైబర్ లేదు.. గ్రిడ్ లేదు రాష్ట్రంలో చివరకు సెల్ఫోన్ల కొనుగోళ్లలోనూ అవినీతి జరుగుతోంది. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు చేపడతామని కేంద్ర ప్రభుత్వం చెబితే.. మేమే చేపడతామని రూ.400 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ఎక్కడా కనిపించడం లేదు. ఫైబర్ లేదు.. గ్రిడ్ లేదు. మార్కెట్లో కేవలం రూ.2,000కు దొరికే సెట్టాప్ బాక్సులను రూ.4,000కు అమ్ముతున్నారన్నారు. ఇలా ఏ రంగంలో చూసినా అవినీతే సాక్షాత్కరిస్తోంది. జనం సొమ్మును విచ్చలవిడిగా ధారపోస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో నింగి, నేల హద్దుగా అవినీతి పెరిగిపోయింది. ఏమిటీ అవినీతి అని ప్రశ్నిస్తే.. మా కార్యకర్తలు బతకొద్దా అని అధికార పార్టీ నేతలు అంటున్నారు. సేవ చేయడం కాకుండా దోచుకోవడమే పని అనేవాడు కార్యకర్త ఎలా అవుతాడు? ప్రోటోకాల్ రూపంలో భారీగా ఖర్చు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులు, అధికారులు చేసే ఖర్చుకు ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత పదింతలు ఖర్చు పెడుతున్నారు. ఒకవైపు లోటు బడ్జెట్ అంటూనే నవ నిర్మాణ దీక్షలు, ధర్మపోరాట దీక్షలు, పుష్కరాల పేరుతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జనం సొమ్మును విచ్చలవిడిగా ధారపోస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ రూ.200 కోట్లు ఖర్చు పెట్టింది. దేశంలోనే అత్యధిక ఎన్నికల వ్యయం జరిగిన ఎన్నికగా ఈ ఉప ఎన్నికలు గుర్తింపు పొందాయి. ఇలాంటి రాజకీయాలు మనకు అవసరమా? నీతిమాలిన రాజకీయాల నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైఎస్కు పేరు రాకూడదనే... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పులిచింతల ప్రాజెక్టు పూర్తయ్యింది. అయితే నేటికి ప్రాజెక్టులో నీళ్లు నింపుకోవడానికి వీలు కావడం లేదు. ఇక్కడ భూసేకరణ కోసం తెలంగాణ రైతులకు రూ.200 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది. ఆ పరిహారం చెల్లిస్తే తమకేమి వాటా రాదని ఏపీ ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తయితే వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందనే కాలయాపన చేస్తున్నారు. దోపిడీలో ఇక వారసుల వంతు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి వెధవలైనా మంత్రులవుతున్నారు. కనీసం సర్పంచ్ కాకున్నా, ఏమాత్రం పరిజ్ఞానం లేకపోయిన, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా మంత్రులు అవుతున్నారు. అందులో భాగంగా ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా కిడారి శ్రావణ్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో 25–30 మంది టీడీపీ నాయకుల వారసులు రాజకీయాల్లో రాబోతున్నారు. ఇప్పటికే నాన్నలు రాష్ట్రాన్ని దోచేశారు. ఇప్పుడు వారసులు కూడా వచ్చి దోచేయడమే పనిగా పెట్టకుంటారు. కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు, అవినీతి నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి. పొట్టి శ్రీరాములు, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి లాంటి త్యాగధనులను సమాజం హీరోలుగా గుర్తించాలి. ఏపీలో అత్యున్నత విద్యాసంస్థలేవీ? 1980కి ముందే హైదరాబాద్ గణనీయంగా అభివృద్ధి చెందింది. పీవీ నరసింహారావు, నేదురుమల్లి జనార్దన్రెడ్డిల హయాంలోనే సైబర్స్ టవర్స్ కోసం పదెకరాల భూమి, రూ.4.5 కోట్లు కేటాయించారు. తరువాత వచ్చిన కొందరు నాయకులు దాని చుట్టూ భూములు కొనుగోలు చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ సైబరాబాద్ తామే నిర్మించినట్లు మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ప్రపంచంలోని అత్యున్నత 1,000 విద్యా సంస్థల్లో ఏపీలో ఒక్కటి కూడా లేదు. నేను 1970ల్లో బాపట్లలో అగ్రికల్చర్ చదువుతున్న సమయంలో మైక్రో ఇరిగేషన్ కింద రెయిన్గన్ల గురించి విన్నాను. ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా రైతులకు కూడా 1994ల్లో చూపించాం. ఇప్పటి పాలకులు తామే కొత్తగా రెయిన్గన్లను కనుగొన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. వాటి కొనుగోళ్లల్లోనూ అవినీతికి పాల్పడుతున్నారు. ఇప్పుడు ఆ రెయిన్గన్లు ఎక్కడ ఉన్నాయో కనిపించడం లేదు. వ్యవస్థలన్నీ కుప్పకూలాయి అసెంబ్లీలో గతంలో ప్రతిపక్ష నేతలు చెప్పే మాటలకు ఎంతో విలువ ఇచ్చేవారని రిటైర్డు డీజీపీ ఆంజనేయరెడ్డి గుర్తుచేశారు. అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కనీసం మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సులో ఆంజనేయరెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలు, విక్రయాలకు అసెంబ్లీ నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులను అక్కడ మాట్లాడనీయకపోవడంతో రోడ్లపైన అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తుందని చెప్పినప్పటికీ కమీషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని చేపట్టడం దారుణమన్నారు. ఒక విపక్ష ఎమ్మెల్యేను సంవత్సరం పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తే ప్రజాస్వామ్యానికి విలువ ఏముంటుందని ప్రశ్నించారు. ఇందులో గవర్నర్, కోర్టులు ఎందుకు మౌనంగా ఉన్నాయో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణలో అక్కడి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని, అయితే, ఏపీలో మాత్రం మీడియా మాఫియాతో అ పరిస్థితి లేకుండా పోయిందని చెప్పారు. ఏపీలో కుల ప్రతిపాదికన రాజకీయాలు నడుస్తున్నాయని, ఇందుకు పాలక పక్షమే కారణమని ఆరోపించారు. రాజధానికి దొనకొండ అనుకూలమైన ప్రాంతమని శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చినా, దానిని పక్కనబెట్టి వరద, సునామీలు వచ్చే ప్రాంతమైన అమరావతిని ఎంపిక చేసి సారంతమైన 30 వేల ఎకరాల భూములను బీడుగా మార్చారని విమర్శించారు. అక్కడ అన్ని తాత్కాలిక భవనాలను ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మద్యాంధ్రప్రదేశ్గా మార్చారు ఏపీలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయని, అవినీతి లేకుండా ఏ పనీ కావడం లేదని ఆంజనేయరెడ్డి మండిపడ్డారు. మానవ వనరుల సూచికలో ఏపీ 27వ స్థానంలో ఉందన్నారు. ఏపీని మద్యాంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత పాలకులకే దక్కుతుందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు కుదేలయ్యాయని... ఆయా రంగాల్లో సమూల మార్పులను తేవాల్సిన అవసరం ఉందని డాక్టర్ బ్రహ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. సిద్దేశ్వరం అలుగును నిర్మించని వారికి పాలించే హక్కు లేదన్నారు. మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మార్పునకు నాంది పలకాలని జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ తహసీల్దార్ రోషన్ అలీ, అజయ్కుమార్, కేవీ సుబ్బారెడ్డి, రవీంద్ర సుబ్బయ్య, డాక్టర్ సంజీవ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. - నేను 1970ల్లో బాపట్లలో అగ్రికల్చర్ చదువుతున్న సమయంలో మైక్రో ఇరిగేషన్ కింద రెయిన్గన్ల గురించి విన్నాను. ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా రైతులకు కూడా 1994ల్లో చూపించాం. ఇప్పటి పాలకులు తామే కొత్తగా రెయిన్గన్లను కనుగొన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. వాటి కొనుగోళ్లల్లోనూ అవినీతికి పాల్పడుతున్నారు. ఇప్పుడు ఆ రెయిన్గన్లు ఎక్కడున్నాయో కనిపించడం లేదు. - ఏమిటీ అవినీతి అని ప్రశ్నిస్తే.. మా కార్యకర్తలు బతకొద్దా అని అధికార పార్టీ నేతలు అంటున్నారు. - లోటు బడ్జెట్ అంటూనే నవ నిర్మాణ దీక్షలు, ధర్మపోరాట దీక్షలు, పుష్కరాల పేరుతో, ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జనం సొమ్మును విచ్చలవిడిగా ధారపోస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ రూ.200 కోట్లు ఖర్చు పెట్టింది. ఇలాంటి నీతిమాలిన రాజకీయాల నుంచి మనం బయట పడాలి. - ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి వెధవలైనా మంత్రులవుతున్నారు. కనీసం సర్పంచ్ కాకున్నా, ఏమాత్రం పరిజ్ఞానం లేకపోయినా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా మంత్రులు అవుతున్నారు. -
దేశ చరిత్రలోనే మాజీ సీఎస్లు వేలెత్తి చూపిన ఏకైక సర్కార్..
రికార్డులను తారుమారు చేసి లక్షల ఎకరాల కబ్జాకు పాల్పడిన విశాఖ భూ కుంభకోణం రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీది. రాజధాని పేరుతో రైతుల నుంచి మూడు పంటలు పండే సారవంతమైన భూములు తీసుకోవడం ఘోర తప్పిదం. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం అంచనాలను విచ్చలవిడిగా పెంచేసి ఓ కామధేనువులా భావిస్తోంది. అందుకే ప్రాజెక్టు పూర్తి కావడం లేదు. –ఐవైఆర్ కృష్ణారావు పేదలకు పని కల్పించేందుకు వినియోగించాల్సిన ఉపాధి హామీ పథకం నిధులను నీరు–చెట్టు లాంటి ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తూ అధికార పార్టీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. ఐటీ కంపెనీలకు భూ కేటాయింపుల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి సాగుతోంది. ప్రజాసంక్షేమం కోసం వెచ్చించాల్సిన వేలాది కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం కోసం దుర్వినియోగం చేస్తోంది. – అజేయ కల్లం సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు పాలనలో అవినీతి తారాస్థాయికి చేరిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అజేయ కల్లాం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం కలిగిస్తున్నాయి. ఆయన కంటే ముందు, రాష్ట్ర విభజన అనంతరం తొలి సీఎస్గా వ్యవహరించిన ఐవైఆర్ కృష్ణారావు కూడా టీడీపీ సర్కారు అవినీతిని నిర్ధారిస్తూ పలుమార్లు ప్రకటనలు చేయడం తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఉన్నతాధికారులే ధ్రువీకరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పాలనపై ఇంతకన్నా వేరే చార్జిషీట్ అవసరమా? అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. ఇవికాకుండా టీడీపీ సర్కారు రూ.లక్షల కోట్ల మేర లూటీకి పాల్పడినట్లు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ ఆరోపణలు చేసింది. అది చరిత్రలోనే అత్యంత భారీ కుంభకోణం.. ఐవైఆర్తో పాటు అజేయ కల్లాం కూడా సీఎస్లుగా పదవుల్లో కొనసాగినప్పుడే నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ సర్కారు దోపిడీకి, ఖజానాకు నష్టం కలిగించేలా వ్యవహరించటాన్ని తీవ్రంగా, స్పష్టంగా వ్యతిరేకించారు. ఆ తరువాత కూడా పలు సందర్భాల్లో... రికార్డులను తారుమారు చేసి లక్షల ఎకరాల కబ్జాకు పాల్పడిన విశాఖ భూ కుంభకోణం రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీదని ఐవైఆర్ పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని అంతా అధికారులపైకి నెట్టేసి రాజకీయ నేతలను తప్పించారని, సిట్ దర్యాప్తు సక్రమంగా లేదని ఆయన స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి మూడు పంటలు పండే సారవంతమైన భూములు తీసుకోవడాన్ని ఐవైఆర్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అంచనాలను విచ్చలవిడిగా పెంచేసి ఓ కామధేనువులా భావిస్తోందని, లేదంటే ఈ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి అయ్యేదని వ్యాఖ్యానించారు. అంతులేని అవినీతి జరుగుతున్నప్పుడు కేంద్రం ప్రశ్నలు అడగడంలో తప్పులేదని, గుడ్డిగా ఈ అంచనాలను ఆమోదిస్తే కేంద్రం కూడా ఈ మహా స్కామ్లో కూరుకుపోవచ్చని ఐవైఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘నవ్యాంధ్రలో నా నడక’ పేరుతో పుస్తకాన్ని ఐవైఆర్ ఈ నెల 25 తేదీన విడుదల చేయనున్నారు. సీఎం కార్యాలయం, సీఎస్గా ఉండగా సీఎంతో ఎదురైన పలు అంశాలతో పాటు విభజన సమస్యలపై సర్కారు వైఖరి, భూ కేటాయింపులు తదితర అంశాలను ఆయన ఇందులో ప్రస్తావించనున్నారు. ప్రచారం కోసం ప్రజాధనం లూటీ... ఐవైఆర్ కృష్ణారావు 2013 మే నుంచి 2014 జూన్ 1వ తేదీ వరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ)గా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 జూన్ 2వ తేదీ నుంచి 2016 జనవరి నెలాఖరు వరకు ఏపీకి తొలి సీఎస్గా వ్యవహరించారు. అజేయ్ కల్లాం 2014 జూన్ 2 నుంచి ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా 2017 ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనసాగారు. దీంతోపాటు రెవెన్యూ ప్రత్యేక సీఎస్గా కూడా కొన్నాళ్ల పాటు బాధ్యతలు పర్యవేక్షించారు. 2017 మార్చి 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో అజేయ్ కల్లాం విధులు నిర్వర్తించారు. పదవీ విరమణ చేసిన అనంతరం టీడీపీ సర్కారు సాగిస్తున్న అరాచకాలు, అవినీతి అంశాలను అజేయ కల్లాం బహిరంగంగా వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలో అవినీతి తీవ్రస్థాయికి చేరిందని, ప్రజాసంక్షేమం కోసం వెచ్చించాల్సిన వేలాది కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం కోసం పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తోందని పేర్కొన్నారు. పేదలకు పని కల్పించేందుకు వినియోగించాల్సిన ఉపాధి హామీ పథకం నిధులను నీరు–చెట్టు లాంటి ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తూ అధికార పార్టీ నేతలు జేబులు నింపుతున్నారు. ఐటీ కంపెనీలకు భూ కేటాయింపుల పేరుతో సాగుతున్న అవినీతిని అజేయ కల్లాం ప్రధానంగా తప్పుబట్టారు. లీజుకు ఇవ్వకుండా కారుచౌకగా కట్టబెట్టారు.. సీఎం తనయుడు, మంతినారా లోకేశ్ సూచనల మేరకు విశాఖపట్టణంలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కారు చౌకగా భూములను విక్రయించింది. ప్రభుత్వ ఐటీ విధానం మేరకు ఐటీ కంపెనీలకు భూములను లీజుకు మాత్రమే ఇవ్వాలి. అయితే మంత్రి లోకేశ్కు కావాల్సిన వ్యక్తులు అందులో ఉండటంతో రూ.400 కోట్ల విలువ చేసే 40 ఎకరాలను కారు చౌకగా ఎకరం రూ.32.50 లక్షల చొప్పున రూ.13 కోట్లకే సర్కారు విక్రయించింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినా లక్ష్యపెట్టలేదు. అమెరికాలోని శాన్ ఫ్రాన్స్కోలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రధాన కార్యాలయం పది ఎకరాల్లో మాత్రమే ఉందని, అలాంటిది ఇక్కడ 40 ఎకరాలు కేటాయించాల్సిన అవసరం లేదని కమిటీ పేర్కొంది. విశాఖ రూరల్ మండలం మధురవాడలో గతంలో ఈ 40 ఎకరాలను పర్యాటక శాఖకు కేటాయించారని, అయితే ఆ భూమి మార్కెట్ ధర ఎకరం రూ.10 కోట్లకు పైగా ఉందని, ఏపీఐఐసీ నిర్ధారించిన ధర ఎకరం రూ. 2.70 కోట్లుగా ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ కోరినట్లుగా ఎకరం రూ.32.50 లక్షలకు కాకుండా కనీసం ఏపీఐఐసీ నిర్ధారించిన ధర ప్రకారం ఎకరం రూ.2.70 కోట్ల చొప్పునైనా కేటాయించాలని, అది కూడా తొలుత కేవలం పది ఎకరాలనే ఇవ్వాలని సీఎస్ నేతృత్వంలోని కమిటీ గట్టిగా సూచించింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఐటీ మంత్రి లోకేశ్ సీఎస్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సులను పట్టించుకోకుండా ఎకరం రూ.32.50 లక్షల చొప్పున ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు అమ్మేశారు. ఐటీ విధానం మేరకు లీజుకు మాత్రమే ఇవ్వాల్సి ఉన్నా లోకేశ్ సూచన మేరకు విక్రయించారు. మరికొన్ని ఐటీ కంపెనీలు కూడా భూములను విక్రయించాలని కోరగా ప్రభుత్వం తిరస్కరించింది. దీన్నిబట్టి తమకు కావాల్సిన వారికి ఒక విధానం ప్రకారం, ఇతరుల పట్ల మరో విధానాన్ని అనుసరించడం ద్వారా దోపిడీ, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడుతున్నట్లు ప్రభుత్వమే ధ్రువీకరించినట్లైంది. స్విస్ ఛాలెంజ్ వద్దన్న కల్లాం రాజధాని అమరావతిలో రైతుల నుంచి తీసుకున్న భూములను స్విస్ ఛాలెంజ్ విధానంలో సంప్రదింపుల ద్వారా సింగపూర్ కంపెనీలకు అప్పగించాలని టీడీపీ సర్కారు నిర్ణయించినప్పుడు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అజేయ కల్లాం గట్టిగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల మేరకు అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించాలని స్పష్టం చేశారు. సింగపూర్ కంపెనీలకు భారీ రాయితీలు ఇవ్వడంపై కూడా ఆయన తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. పర్యాటక విధానం మేరకు ప్రాజెక్టు వ్యయంలో రాయితీలు 20 శాతానికి మించరాదని, అంతేకాకుండా సింగపూర్ సంస్థలకు ఇచ్చే భూముల్లో మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్ నుంచి రూ. 5,500 కోట్లు వ్యయం చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. వివాదాలు తలెత్తితే లండన్ కోర్టులో పరిష్కరించుకోవాలనే షరతుతోపాటు ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగితే సింగపూర్ కంపెనీలకు పెనాల్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో చెల్లించాలనే షరతులను అంగీకరించరాదని కల్లాం లిఖిత పూర్వకంగా పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు దీన్ని పెడచెవిన పెడుతూ సింగపూర్ కంపెనీలకు భారీ రాయితీలతో 1,691 ఎకరాలను కట్టబెట్టేశారు. సింగపూర్ కంపెనీలతో ఒప్పందం రాష్ట్ర ఖజానాకు గుదిబండగా మారుతుందని అజేయ కల్లాం బహిరంగంగానే హెచ్చరించారు. విరాళాలివ్వాలంటూ ‘ప్రత్యేక’ విమానాల్లో విహారాలా? సీఎం చంద్రబాబు ఒకపక్క రాజధాని నిర్మాణం పేరుతో విరాళాలు వసూలు చేస్తూ మరోపక్క రెగ్యులర్ ఫ్లైటున్నా సరే ప్రత్యేక విమానాల్లో విహరించడాన్ని అజేయ కల్లాం ‘మేలుకొలుపు’ పుస్తకంలో తప్పుబట్టారు. ఏటా రూ.15 కోట్లకుపైగా ప్రత్యేక విమానాలకు వ్యయం చేస్తున్నారని, రాష్ట్రం రెవెన్యూ లోటులో ఉండగా దుబారా వ్యయం సరికాదన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికీ లేని విధంగా రెండేసి క్యాంపు ఆఫీసులు, ఇళ్లు ఉండటం, వాటికి మరమ్మతుల పేరుతో కోట్ల రూపాయలు వెచ్చించడాన్ని కూడా అజేయ కల్లాం తప్పుపట్టారు. ‘హెచ్సీఎల్’ రాకుండా సీమకు అన్యాయం.. ‘హెచ్సీఎల్’ కంపెనీని తిరుపతిలో స్థాపించాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అడ్డుపడి అమరావతికి తరలించి రాయలసీమకు అన్యాయం చేశారని అజేయ కల్లాం పేర్కొన్నారు. అమరావతి పేరుతో ఇతర ప్రాంతాలకు అన్యాయం చేస్తోందని, హెచ్సీఎల్ కంపెనీని తిరుపతిలో ఏర్పాటు చేయించాలని తాను మొత్తుకున్నా ప్రభుత్వం అంగీకరించలేదని అజేయ కల్లాం స్పష్టం చేశారు. ధర్మ పోరాటాలు, దీక్షలు పేరుతో ప్రభుత్వం నాటకాలు, డ్రామాలాడుతూ కాలం గడుపుతోందన్నారు. తాత్కాలిక భవనాలకు కళ్లు చెదిరే ఖర్చు ఇక రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణాలకు వెచ్చించిన వ్యయం చూస్తే నివ్వెరపోవడం ఖాయమని అధికారులు పేర్కొంటున్నారు. వర్షం వస్తే కారిపోయే తాత్కాలిక సచివాలయానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి రూ.11,666 చొప్పున వ్యయం చేసింది. ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి రూ.750 కోట్లు వ్యయం చేసినట్లు కేంద్ర ప్రభుత్వానికి పంపిన వినియోగ పత్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇంతకన్నా దోపిడీ ఎక్కడైనా ఉంటుందా? అని సచివాలయ ఉద్యోగుల్లోనే చర్చ సాగుతోంది. సెట్టాప్ బాక్సుల పేరుతో దోపిడీ ప్రజలు తమ ఇష్ట్రపకారం కొనుక్కునే సెట్టాప్ బాక్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి పంపిణీ చేసే బాధ్యతను సీఎం చంద్రబాబు సన్నిహితుడికి కట్టబెట్టారు. నాణ్యమైన సెట్టాప్ బాక్సులు రూ.1,500కే లభిస్తుండగా ప్రభుత్వం కొనుగోలు చేసే ఒక్కో సెట్టాప్ బాక్సుకు రూ. 4,000 చెల్లిస్తోంది. ఇందులో భారీ అవినీతి జరుగుతున్నట్లు తేలిపోతోంది. అంతే కాకుండా ఈ బాక్సుల కొనుగోలు కోసం రూ.4 వేల కోట్లు అప్పు చేయడమే కాకుండా దానికి ప్రభుత్వమే గ్యారెంటీ కూడా ఇస్తోంది. సాగునీటిలో కమీషన్ల పర్వం.. సాగునీటి ప్రాజెక్టుల ముసుగులో అంచనాలు భారీగా పెంచేసి కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో ప్రభుత్వ పెద్దలు కమీషన్లు దండుకుంటూ సర్కారు ఖజానాను కొల్లగొడుతున్నారు. నీరు–చెట్టు పనుల పేరుతో ఉపాధిహామీ నిధులను మళ్లించి చెరువుల పూడికతీత పనుల్లో మట్టిని సైతం విక్రయిస్తూ అధికార పార్టీ నేతల జేబులను నింపుతున్నట్లు పలుమార్లు వెల్లడైంది. ఇసుక నుంచి మట్టి దాకా దోపిడీకి పాల్పడటంతో పాటు ఎక్కువ ధరకు బొగ్గు కొనుగోళ్లు, ఎక్కువ ధరకు సోలార్ విద్యుత్ కొనుగోళ్లు చేస్తూ జనం నెత్తిన భారం మోపుతోంది. డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రభుత్వం సెల్ఫోన్లు కొనుగోలు చేసి ఇస్తూ అందులోనూ భారీ అవినీతికి తెరతీసింది. తొలుత ఐదు లక్షల సెల్ఫోన్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు కొన్నట్లు చూపిస్తూ రూ. 150 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. సెల్ఫోన్ల కొనుగోళ్లకు మరో రూ.403 కోట్లు కావాలంటూ ఐటీ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఇందులో ఇంకెంత దోపిడీ జరుగుతుందోనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పారిశ్రామిక, ఐటీ రాయితీల పేరుతో ప్రాజెక్టు స్థాపనకు అయ్యే వ్యయానికి మించిపోయి ఖజానా నుంచి రాయితీలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆంతర్యం ఏమిటో తేలిగ్గానే ఊహించవచ్చని పేర్కొంటోంది. ప్రైవేట్ వ్యక్తులు చేయాల్సిన టవర్ల నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖజానా నుంచి ఖర్చు చేయటాన్ని తప్పుబడుతున్నారు. -
ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన అజేయ కల్లం!
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్లో అవినీతి తారస్థాయి కి చేరిందని ఏపీ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ అజేయ కల్లం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన నిధులను ప్రచారం కోసం వేలాది కోట్ల ప్రజాధనాన్ని ఏపీ ప్రభుత్వం పెద్దఎత్తున దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం కింద కేంద్రం రూ.20వేల కోట్లను ఏపీకి ఇస్తే.. అందులో మూడోవంతు నిధులు స్వాహా అయ్యాయని ఆరోపించారు. జన చైతన్య వేదిక ఏపీ అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతిలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సు నిర్వహించారు. అజేయ కల్లం ఏపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఎండగట్టారు. మార్కెట్లో రూ.4వేలు విలువచేసే సెల్ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రూ.7,500 చొప్పున 5 లక్షల మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయడం ద్వారా రూ.150 కోట్లు స్వాహా చేశారన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేరుతో రూ.450 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ.45 లక్షలకే ధారాదత్తం చేశారని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో 80శాతం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కూడా లభించటంలేదని అజేయ కల్లం ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించక ఓవైపు అప్పులపాలవుతుంటే.. మరోవైపు, ప్రభుత్వం విదేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుని వ్యాపారులకు దోచిపెడుతోందని ఆరోపించారు. 30శాతం లోటు వర్షపాతంతో రాయలసీమ, ప్రకాశం జిల్లాల రైతులు ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకోవటంలేదన్నారు. కాగా, రాజధానిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.11వేలు చెల్లించినా చిన్నపాటి వర్షానికే కారుతోందని అజేయ కల్లం ఎద్దేవా చేశారు. అలాగే, గత నాలుగేళ్లుగా ఓ మీడియా సంస్థకు రూ.700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన నిధులను ప్రచారం కోసం ధర్మపోరాట దీక్ష, నవనిర్మాణ దీక్ష, పుష్కరాలు, క్యాంప్ కార్యాలయాలు, ప్రత్యేక విమానాలు, విదేశీయాత్రల పేరుతో వేలాది కోట్లు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. అంతేకాక, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమ సంపాదనను కర్ణాటక, గుజరాత్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు ఖర్చుచేస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో చేసిన అప్పులు తీర్చడానికి సర్కార్ మరిన్ని అప్పులు చేస్తోందని.. వీటిని ప్రయోజనంలేని రంగాలకు వెచ్చిస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిణామాలపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలని.. అందరిలో ప్రశ్నించే తత్వం పెరగాలని అజేయ కల్లం ఆకాంక్షించారు. ప్రజలే కాపాడుకోవాలి: విజయబాబు సదస్సులో పాల్గొన్న సమాచార హక్కు మాజీ కమిషనర్ పి విజయబాబు మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలు, దోపిడీలు మితిమీరిన తరుణంలో రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. నేటి ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ధ్వజమెత్తారు. హుందాగా వ్యవహరించాల్సిన స్పీకర్ సైతం పార్టీ ఫిరాయింపుదారులకు మద్దతుగా నిలవటం దౌర్భాగ్యమన్నారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలియని వ్యక్తిని మంత్రిగా చేసిన ఘనత రాష్ట్రానికే దక్కిందని ఎద్దేవా చేశారు. అవినీతికి కేంద్రాలుగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏపీలో సేవా దృక్పథంతో ఉండాల్సిన విద్య, వైద్య రంగాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి. లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. మానవ వనరుల అభివృద్ధి సూచికలో రాష్ట్రం దేశంలోనే 27వ స్థానం, అక్షరాస్యతలో 32వ స్థానంలో ఉంటే.. అవినీతిలో మాత్రం అగ్రభాగాన ఉందన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులు రాజకీయ అవినీతి కేంద్రాలుగా మారాయన్నారు. రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లుగా 2.4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉండగా.. కేవలం 5వేలు మాత్రమే భర్తీ చేశారని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్రావు వివరించారు. అలాగే, 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉంటే... కేవలం 6వేల పోస్టులకు మాత్రమే డీఎస్సీ నిర్వహిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రమంతటా ‘సేవ్ ఏపీ’ సదస్సులు కాగా, ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’సదస్సులను అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలని ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వీసీ ప్రొఫెసర్ కే రత్నయ్య కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తూ.. కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తోందన్నారు. ప్రభుత్వ వైద్యం పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమకు నికర జలాలను కేటాయించి నీటిపారుదల ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయాలన్నారు. సమావేశంలో దళిత ఐక్య వేదిక నేత కల్లూరు చంగయ్య, సామాజిక సేవకురాలు నర్మద, ప్రొఫెసర్ రంగారెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
రాష్ట్రంలో 52 లక్షల బోగస్ ఓట్లు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల జాబితాలో 52.67 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీలు ఐవైఆర్ కృష్ణారావు, అజేయ కల్లం వెల్లడించారు. నగరంలోని సోమాజీగూడ ప్రెస్క్లబ్లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల జాబితాలోని అవకతవకలపై శనివారం మీడియా సమావేశం జరిగింది. ఇందుకు వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ్రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఐవైఆర్ మాట్లాడుతూ.. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో 3.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 52.67 లక్షల నకిలీ ఓటర్లు ఉండటం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమన్నారు. 2–3 శాతం ఓట్ల తేడతో జయాపజయాలు ఉంటున్న నేటి పరిస్థితుల్లో 15 శాతం నకిలీ ఓట్లు ఉండటం దుర్మార్గమన్నారు. అజేయ్ కల్లం ప్రసంగిస్తూ.. అధునాతన సాఫ్ట్వేర్ ఉపయోగించి నకిలీ ఓట్లను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లుగా కూడా నమోదైన వారు 18 లక్షల మంది ఉన్నారన్నారు. ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 26వేల నకిలీ ఓట్లను గుర్తించగా అందులో 18 వేల ఓటర్లను తొలగించారని ఇంకా 8 వేల ఓట్లు కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయ పార్టీలు, కేంద్ర ఎన్నికల సంఘం, ప్రజాసంఘాలు అప్రమత్తమై ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలని పిలుపునిచ్చారు. అధికారులు, జన్మభూమి కమిటీలు కుమ్మక్కై జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. జన్మభూమి కమిటీలతో ఏపీ అధికార యంత్రంగం కుమ్మక్కు కావడంవల్లే నకిలీ ఓట్లు కొనసాగుతున్నాయన్నారు. ఓటరు కార్డులను ఆధార్కు లింకు చేయడంతోపాటు బయోమెట్రిక్ విధానాలను అమలుచేయడం ద్వారా వీటిని నిరోధించవచ్చన్నారు. జాబితాలో అక్రమాలు జరిగితే స్థానిక అధికార యంత్రాంగాన్ని బాధ్యులను చేసి శిక్షించాలన్నారు. 34లక్షల డూప్లికేటెడ్, రిపీటెడ్ ఓట్లు ఓటరు అనలెటిక్స్ మరియు స్ట్రాటాలజీ టీమ్ సభ్యులు తుమ్మల లోకేశ్వర్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ.. ఏపీలోని 175 నియోజవర్గాల్లో 34,13,000 ఓట్లు డూప్లికేటెడ్, రిపీటెడ్గా ఉన్నాయని ఆరోపించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. – 18లక్షల మందికి పైగా రెండు రాష్ట్రాల్లో ఓట్లున్నాయని.. ఇవి ఏ విధంగా వచ్చాయో ఆధారాలతో ఎన్నికల కమిషన్కు చూపించాం. – 10 కేటగిరీల కింద డూప్లికేట్ ఓట్లను విభజించాం. – అలాగే, సెప్టెంబర్ 1, 2018న విడుదల చేసిన ఓటరు జాబితాలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. భర్త స్థానంలో భార్య పేరు మార్చడం, ఇంటి నెంబర్లు వేర్వేరుగా నమోదు చేసి నకిలీ ఓట్లు సృష్టించారు. – ఒకటే వ్యక్తికి వేర్వేరు చోట్ల ఓట్లు ఉన్నాయి. వయస్సు తేడా చూపించి ఓటరుగా నమోదు చేయించుకున్నారు. ఈ విధంగా 24,928 కేసులు నమోదయ్యాయి. – ఇంటి పేర్లు, అసలు పేర్లు అటూఇటూ మార్చి మొత్తం 92,198 ఓట్లు నమోదు చేశారు. పుట్టిన ఏడాదికే ఓటు హక్కు ఇదిలా ఉంటే.. 18 ఏళ్లకే ఓటు హక్కు ఉండాలని.. కానీ, రాష్ట్రంలో పుట్టిన ఏడాదికే ఓటు హక్కు ఇచ్చారని ఆయన విస్మయం వ్యక్తంచేశారు. ప్రపంచంలో 124 సంవత్సరాల 2 రోజులు బతికినట్లు రికార్డులు ఉంటే .. మన రాష్ట్ర ఓటర్ల జాబితాలో 352 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఉన్నారన్నారు. ఇలాంటివి 6,118 ఓట్లు నమోదు అయ్యాయన్నారు. పీపుల్స్ రిప్రజంటేషన్ యాక్ట్ ప్రకారమైతే.. ఇలాంటి తప్పులు చేసిన వారిపై ఏడాది జైలుశిక్ష విధించాలని చెబుతోందని ఆయన గుర్తుచేశారు. అలాగే, ఇలాంటివి దేశంలో ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్లు గుర్తించలేవని,, సాఫ్ట్వేర్ ఆప్డేట్ చేయకపోవడంతో కూడా ఇలా జరుగుతుందని లోకేశ్వర్రెడ్డి చెప్పారు. సమావేశంలో రీసెర్చ్ స్కాలర్ ఓటరు అనలెటిక్స్ మరియు స్ట్రాటాజీ టీమ్ సభ్యులు జీవీ సుధాకర్రెడ్డి, జన చైతన్య వేదిక రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సలీమ్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. -
గాలి తప్ప అన్ని సహజ వనరులూ లూటీ!
గుంటూరు ఈస్ట్: ప్రస్తుతం ప్రజాప్రతినిధులు గాలి తప్ప అన్ని సహజ వనరులనూ దోచుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం ఆందోళన వ్యక్తం చేశారు. మట్టి, ఇసుక సైతం అమ్ముకుని కోట్ల రూపాయిలు సంపాదించడం ఈ మధ్యే మొదలైందని వెల్లడించారు. గుంటూరులో ఆదివారం జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘ధనస్వామ్యం– వారసత్వ రాజకీయాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సులో అజేయ కల్లం రచించిన ‘మేలుకొలుపు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి జిల్లాల్లోని ఓ గ్రామంలో చెరువు తవ్వడానికి కోటి రూపాయలు అంచనా వేసి విడుదల చేయగా, తవ్విన మట్టి అమ్ముకుని ఎకరాకు రూ. 60 లక్షలు ఆర్జించారని తెలిపారు. ఎమ్మెల్యేలు కేవలం తమ పార్టీకి, కార్యకర్తలకు మాత్రమే ప్రజాప్రతినిధులుగా వ్యవహరించడం అప్రజాస్వామికమన్నారు. పౌరసమాజం నిర్వీర్యం అవడం వల్లే ఇవన్నీ చెల్లుబాటు అవుతున్నాయని ఆయన చెప్పారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నవారిని ఆదర్శంగా తీసుకోవద్దు సమాజం కోసం త్యాగాలు చేసిన వారిని యువత ఆదర్శంగా తీసుకోవాలని అజేయ కల్లం పిలుపునిచ్చారు. సినిమా రంగానికి చెందిన వారిని, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నవారిని, రౌడీలు, సమాజాన్ని దోచుకున్న వారిని ఆదర్శంగా తీసుకుంటే అనర్థాలను మనమే చవిచూడాల్సి ఉంటుందన్నారు. గ్రామ స్థాయిలో ప్రాథమిక వసతులన్నింటినీ సమకూర్చే సెక్రటేరియట్లను అభివృద్ధి చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు ఉండే సెక్రటేరియట్ను అభివృద్ధి చేస్తే ప్రజలకు ఒనగూరేది మిటని ప్రశ్నించారు. ఆగమ శాస్త్ర నిపుణులే చెప్పాలి తిరుమలలో భక్తుల సాధారణ దర్శనాన్ని నిలిపివేయడంపై అడిగిన ప్రశ్నకు అజేయ కల్లం స్పందిస్తూ సంప్రోక్షణ సమయంలో గర్భగుడిలోకి అనుమతించకపోయినా.. సాధారణ దర్శనాన్ని గతంలోలా కొనసాగించవచ్చన్నారు. ఏదో ఇబ్బందులు ఉన్న కారణంగానే వెంకన్న దర్శనం నిలిపివేసే సాహసం చేశారని వ్యాఖ్యానించారు. ఏ కారణాలతో దర్శనం నిలిపివేసిందీ ఆగమశాస్త్ర నిపుణులే చెప్పాలన్నారు. ఎంపీల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు నేరస్తులు సదస్సుకు అధ్యక్షత వహించిన జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. లోక్సభకు ఎన్నికైన ప్రతి ముగ్గురు ఎంపీల్లో ఒకరు నేరస్తులు ఉంటున్నారని, 66 శాతం మంది వారసులు ఉన్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని, మేధావులకు సామాజికవేత్తలకు స్థానం కల్పిస్తేనే ఈ వ్యవస్థ మారుతుందని అభిప్రాయపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలను రాజ్యాంగంలో భాగస్వాములను చేయడం, ఐరోపా దేశాల తరహాలో దామాషా పద్ధతి ప్రవేశపెట్టడం తదితర విప్లవాత్మక చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ది వారసత్వ రాజకీయం కాదు నవ్యాంధ్ర మేధావుల ఫోరం వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ డీఆర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఎంపీగా అనుభవం పొంది, సొంత పార్టీ పెట్టి.. ప్రజలను చైతన్యపరచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాభిమానం పొందారన్నారు. ఆయనది వారసత్వ రాజకీయం కిందకు రాదని స్పష్టం చేశారు. ఈ సదస్సులో ఏఎన్యూ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్.రంగయ్య, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, కన్నా విద్యా సంస్థల డైరెక్టర్ కన్నా మాస్టారు, వావిలాల సంస్థ కార్యదర్శి మన్నవ షోడేకర్, సోషలిస్టు ఉద్యమ నేత మోదుగుల బాపిరెడ్డి, ఎస్హెచ్ఓ వ్యవస్థాపకుడు సేవాకుమార్, ఆగ్జిలరీ సొసైటీ అధ్యక్షుడు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రసంగించారు. -
సీఎంకు రెండు క్యాంప్ ఆఫీసులు ఉండవు
-
ఆ మాజీ ఐఏఎస్ల ప్రశ్నలకు బదులేది?
-
ముందస్తు ప్రణాళికతో వడదెబ్బ నివారణ
► ముఖ్య కూడళ్లలో మజ్జిగ, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి ► బాధితులకు అత్యవసర వైద్య సేవలందించాలి ► రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం విజయనగరం కంటోన్మెంట్: వేసవి కాలంలో ప్రజలు వడదెబ్బ భారిన పడకుండా ముందస్తుగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాల కొండయ్యతో కలసి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆరోగ్య జాగ్రత్తలను వివరించాలన్నారు. తెలుపు రంగు ఉన్న పలుచటి కాటన్ వస్త్ర ధారణను ప్రోత్సహించాలని సూచించారు. ఓఆర్ఎస్, గ్లూకోజ్, ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పీహెచ్సీల్లో 24 గంటల వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. ఉపాధి హామీ వేతనదారులు ఉదయం 6 నుంచి 9.30 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 నుంచి ఆరు గంటల వరకు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ముఖ్య కూడళ్లలో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వేసవిలో పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల దాహార్తి తీర్చేందుకు, వైద్యం అందించేందుకు పశు సంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో వడదెబ్బ మరణాలు సంభవించకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. జిల్లాలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు పంపిణీకి గతేడాది జిల్లాకు రూ.3 కోట్లు విడుదలయ్యాయని, వీటిలో రూ.23.38 లక్షలు ఖర్చు చేసి మిగతా నిధులు ప్రభుత్వానికి తిరిగి పంపించామన్నారు. 2015లో జిల్లాలో 149 వడదెబ్బ మరణాలు సంభవిస్తే బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించామన్నారు. 2016లో 115 మంది వడదెబ్బకు గురై మృతి చెందగా మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించేందుకు ప్రతిపాదించామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జేసీ శ్రీకేశ్, బి.లఠ్కర్, డీఆర్వో మారిశెట్టి జితేంద్ర, సీపీఓ జె.విజయలక్ష్మి, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల జేడీలు లీలావతి, వై.సింహాచలం, ఉద్యాన వన శాఖ డీడీ పీఎన్వీ లక్ష్మీనారాయణ, డీఎఫ్ఓలు వేణుగోపాల్, లక్ష్మణ్, డీఎంఅండ్హెచ్ఓ పద్మజ, డీసీహెచ్ఓ ఉషశ్రీ, సాలూరు కమిషనర్ మల్లయ్యనాయుడు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు. -
సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన ‘కల్లం’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అజేయ కల్లం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సీఎస్గా వ్యవహరించిన సత్యప్రకాష్ టక్కర్ విధుల నుంచి రిలీవ్ అవుతూ కల్లంకు బాధ్యతలు అప్పగించారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో కల్లంతో పాటు మరో నెలరోజుల్లో కొత్త సీఎస్గా బాధ్యతలు చేపట్టనున్న దినేశ్కుమార్ను, రిటైరైన ఎస్పీ టక్కర్ను సీఎం చంద్రబాబు సత్కరించారు. 1983 బ్యాచ్కు చెందిన కల్లం ఆర్థిక, రెవెన్యూశాఖలతో పాటు పలు కీలకశాఖల్లో పనిచేశారు. మార్చి నెలాఖరుతో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన అనంతరం అదే బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న దినేశ్కుమార్ సీఎస్గా బాధ్యతలు చేపట్టేలా ప్రభుత్వం జీవో జారీచేసిన సంగతి తెల్సిందే. కాగా, సీఎస్గా బా«ధ్యతలు చేపట్టిన అజేయ కల్లంకు మరో ఆరునెలలు గడువు పొడిగించేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ కోరారు. ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద టక్కర్, కల్లంలకు సచివాలయ ఉద్యోగులు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన కల్లం
-
రాష్ట్ర ప్రభుత్వ సీఎస్గా అజేయ కల్లం
-
రాష్ట్ర ప్రభుత్వ సీఎస్గా అజేయ కల్లం
⇒ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ⇒ నేడు బాధ్యతలు స్వీకరణ సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆర్థిక, రెవెన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎస్గా ఉన్న సత్య ప్రకాశ్ టక్కర్ మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం అజేయ కల్లాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఆయన మార్చి నెలాఖరునే పదవీ విరమణ చేయనున్నారు. అజేయ కల్లం రాష్ట్రంలో పలు కీలక శాఖల్లో పనిచేశారు. సమర్థ్ధవంతమైన అధికారిగా, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తారని పేరుంది. అయితే తొలుత అజేయ కల్లంకు సీఎస్గా నియమించిన తర్వాత 3 నెలలు చొప్పున రెండు సార్లు పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగిస్తుందని అందరూ భావించారు. కానీ ఆయనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిన ప్రభుత్వం అదే జీవోలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి సీఎస్గా దినేశ్ కుమార్ను నియమిస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న దినేశ్ కుమార్ 1983వ బ్యాచ్కు చెందిన వారు. -
సీఎస్పై ఉత్కంఠకు తెర
హైదరాబాద్: ఏపీ ప్రభుత్వ కొత్త కార్యదర్శిగా అజేయ కల్లంను నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 1983 బ్యాచ్ కు చెందిన అజయ్ కల్లం ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మార్చి 31వ తేదీతో అజేయ కల్లం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో మరొకరిని నియమించే అవకాశాలున్నాయంటూ వార్తలు రావటంతో కొంత ఆసక్తి ఏర్పడింది. అయితే, అజేయ కల్లంనే సీఎస్గా నియమించేందుకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, అజేయ కల్లం పదవీ కాలాన్ని మరో మూడు నెలలపాటు పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుత సీఎస్ టక్కర్ పదవీ కాలం రేపటితో ముగియనుంది. -
ఇక అడుగుకో బార్
-
ఇక అడుగుకో బార్
బీచ్లలో మద్యం విక్రయాలకు లైసెన్స్ సాక్షి, అమరావతి: బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి మాటల స్ఫూర్తితో ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం అడుగుకో బార్కు అనుమతులు ఇచ్చేయనుంది. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో గల ఆహార పార్లర్స్లోను, బీచ్లలోనూ మద్యం విక్రయాలకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా బార్ లైసెన్స్ ల నిబంధనల్లో సవరణలు తీసుకువస్తూ గురువారం జీవో జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం జీవో 470ను జారీ చేశారు. బీచ్ల్లోను, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎక్కడపడితే అక్కడ బార్లను తెరవడానికి వీలుగా కనీసం నిర్మాణ జాగాను తగ్గించేశారు. కనీసం 200 చదరపు మీటర్ల నిర్మాణ స్థలం ఉండాల్సి ఉండగా ఇప్పుడు బార్ల ఏర్పాటునకు కనీసం 100 చదరపు మీటర్లు ఉంటే చాలని నిబంధనల్లో సవరణలు చేశారు. రెడీ టూ డ్రింక్... జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులను వంద మీటర్ల లోపు ఉన్న వాటిని తొలగించాల్సిందిగా సుప్రీం కోర్టు కమిటీ రాష్ట్రాన్ని హెచ్చరిస్తుండగా... దాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా జాతీయ రహదారులకు వంద మీటర్ల లోపు బార్ లెసైన్సలు ఇచ్చేందుకు వీలుగా నిబంధనల్లో సవరణలు చేశారు. పర్యాటక కేంద్రాలుగా పేర్కొన్న బీచ్ల్లోను, ఇతర ప్రాంతాల్లోను విరివిగా బార్ లెసైన్సలను మంజూరు చేయనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లలో స్థానిక పట్టణాభివృద్ధి సంస్థ నుంచి హోటల్కు లెసైన్స పొంది ఉన్న అన్నింటికీ కూడా బార్ లెసైన్సలను జారీ చేయనున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తినడానికి ఆహారం దొరికే ప్రతీ దుకాణం, ఆహార పార్లర్లలో మద్యం విక్రయాలకు లెసైన్సలను మంజూరు చేస్తారు. -
ఎక్సైజ్ శాఖలో ఆర్నెల్లపాటు సమ్మె నిషేధం
అమరావతిః ఎక్సైజ్ శాఖలో ఆర్నెల్ల పాటు సమ్మె నిషేధం విధిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అబ్కారీ శాఖ సేవల్ని అత్యవసర సర్వీసులుగా పరిగణించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2017 ఫిబ్రవరి 18వరకు సమ్మె నిషేధిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం ఉత్తర్వులిచ్చారు. -
ఐఏఎస్ల బదిలీకి రంగం సిద్ధం !
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో దాదాపు 15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. పలు శాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు జిల్లా కలెక్టర్లను బదిలీ చేస్తూ... నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. ఐఏఎస్ అధికారులు పి.వి.రమేష్, ఆదిత్యనాథ్ దాస్తోపాటు పలువురు సీనియర్లకు స్థానచలనం కలగనుంది. వారితో పాటు అజయ్ కల్లాంకు ఆర్థిక శాఖ... పి.వి.రమేష్కు ఆటవీశాఖ... లవ్ అగర్వాల్కు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా కేటాయించే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్తోపాటు ప్రకాశం జాయింట్ కలెక్టర్ను కూడా మార్చనున్నారు. -
‘లెక్కలు’ సరిచూడకపోతే జీతం కట్
సాక్షి, హైదరాబాద్: ప్రతీ నెల 4వ తేదీలోగా రాబడి, వ్యయాలకు సంబంధించిన లెక్కలను సరిచూసి, సర్టిఫై చేయకపోతే ఖజానా అధికారికి తదుపరి నెల వేతనం ఇవ్వకుండా నిలుపుదల చేస్తారు. ఈ మేరకు నిబంధన విధిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఏపీలో బదిలీలకు గేట్లు బార్లా!
గెజిటెడ్ అధికారులకు యథేచ్ఛగా స్థాన చలనం రాజకీయ పైరవీలకు తెరతీసిన సర్కారు రాష్ట్ర స్థాయి కేడర్పై కేంద్రం ఆదేశాలు గాలికి వదిలిన సర్కారు అక్టోబర్ 1 నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తుంగలోకి తొక్కి మరీ యథేచ్ఛగా ఉద్యోగుల బదిలీలకు అనుమతించటం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైరవీలకు తెరతీసింది. గెజిటెడ్ అధికారులను ఎక్కడి నుంచి ఎక్కడికైనా స్వేచ్ఛగా బదిలీ చేసుకోవచ్చంటూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గెజిటెడ్ అధికారులు ఆ పోస్టులో ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారనే అంశంతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా బదిలీ చేయవచ్చని పేర్కొంది. అంటే ఆ పోస్టులోకి వచ్చి కొన్ని నెలలే అయినా టీడీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇష్టం లేకుంటే వేరే చోటకు బదిలీ చేయవచ్చు. ఎన్నికల్లో సహకరించని అధికారులందరినీ బదిలీ చేయాలని ఏకంగా మంత్రివర్గ సమావేశంలోనే రాజకీయ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ద్వారా బదిలీలపై ఉత్తర్వులు జారీ చేయించింది. బదిలీలపై నిషేధాన్ని సెప్టెంబర్ ఆఖరు వరకు సడలిస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజేయ కల్లాం ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి తిరిగి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. బదిలీల నుంచి సచివాలయ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చారు. కింది స్థాయి ఉద్యోగులు మూడేళ్ల నుంచి ఒకే చోట పని చేస్తుంటే బదిలీ చేయాలని సూచించారు. ఉపాధ్యాయులను మాత్రం కౌన్సిలింగ్ ద్వారా బదిలీ చేస్తారు. కేంద్రం వద్దన్నా వినలేదు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి మరీ ఏపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల బదిలీలకు ఆదేశాలు జారీ చేసింది. బదిలీ నుంచి రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగులకు మినహాయింపు ఇద్దామని, పంపిణీ పూర్తి అయ్యాక చేపడదామని అధికారులు సూచించినా ప్రభుత్వ పెద్దలు అంగీకరించలేదు. రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు బదిలీ చేయరాదని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలున్నాయి.