Amitabh Kant
-
ఇంకా కష్టపడితేనే లక్ష్యాలు సాధించగలం
న్యూఢిల్లీ: 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారతీయులు మరింత ఎక్కువగా కష్టపడితేనే సాధ్యమని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ఇందుకోసం అవసరమైతే వారానికి 80 గంటలైనా, 90 గంటలైనా పనిచేయాల్సిందేనన్నారు. ‘‘నేను కష్టించి పని చేయాలని విశ్వసిస్తాను. భారతీయులు ఇంకా కష్టపడి పనిచేయాలి. అది వారానికి 80 గంటలు కావచ్చు లేదా 90 గంటలు కావచ్చు. ఇప్పుడు 4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న మన ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్ల భారీ లక్ష్యానికి చేరుకోవాలనుకున్నప్పుడు, వినోదాలతో గడిపేస్తూనో, లేకపోతే ఏదో కొందరు సినిమా స్టార్ల అభిప్రాయాలను అనుసరిస్తూనో కూర్చుంటే సాధించలేము’’ అని వ్యాఖ్యానించారు. పటిష్టమైన పని విధానాలతోనే జపాన్, దక్షిణ కొరియా, చైనా ఆర్థిక విజయం సాధించాయని, ప్రపంచ స్థాయి ఎకానమీగా ఎదగాలంటే భారత్ కూడా అలాంటి ఆలోచనా ధోరణిని అలవర్చుకోవాలని చెప్పారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు 4 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. ఎన్ని గంటల పని వేళలు ఉండాలనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొందరు కార్పొరేట్ దిగ్గజాలు వారానికి 70–90 గంటలు పని చేయాలంటే, ఎన్ని గంటలు పని చేశామనేది కాదు ఎంత నాణ్యంగా పని చేశామనేది ముఖ్యమని మరికొందరు దిగ్గజాలు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాషనైపోయింది.. ‘‘ఎక్కువగా కష్టపడకూడదంటూ మాట్లాడటం ఇప్పుడు ఫ్యాషన్గా మారిపోయింది. పనుల్లో జాప్యం జరగకుండా, ఖర్చులు పెరిగిపోకుండా, ప్రపంచ స్థాయి నాణ్యతతో, గడువు కన్నా ముందుగా ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే భారత్ కష్టపడి పని చేయాల్సిందే. ఇక పని–కుటుంబ జీవితం మధ్య సమతౌల్యం పాటించాలనే విషయానికొస్తే.. నేను ప్రతి రోజూ వ్యాయామం చేస్తాను. గోల్ఫ్ ఆడతాను. ఇవన్నీ చేస్తూనే నేను ప్రతి రోజూ కష్టపడి పని కూడా చేస్తాను. మీకు వ్యక్తిగతంగా ఒకటిన్నర గంటలు మీకోసమే పక్కన పెట్టుకున్నా మీకు రోజులో ఇంకా 22.5 గంటలు ఉంటాయి. పని–కుటుంబ బాధ్యతల మధ్య సమతౌల్యం పాటించడానికి బోలెడంత సమయం ఉంటుంది. కష్టపడకపోవడమనేదాన్ని ఏదో ఫ్యాషన్గా మార్చొద్దు. పెద్దగా శ్రమించకుండానే భారత్ గొప్ప దేశంగా ఎదగగలదంటూ యువతకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. కష్టపడకుండా ఏ దేశమూ ఎదగలేదు’’ అని అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. -
రానున్న దశాబ్దంలో భారత్దే హవా!
న్యూఢిల్లీ: భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనున్న నేపథ్యంలో వచ్చే దశాబ్దంలో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో 20 శాతం వాటను కలిగి ఉంటుందని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఏఐఎంఏ సదస్సులో ఆయన మాట్లాడుతూ, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని, ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని పేర్కొన్నారు. రాబోయే మూడు సంవత్సరాలలో భారత్ ఎకానమీ జపాన్, జర్మనీలను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న భరోసాను ఇచ్చారు. ప్రపంచ ఎకానమీకి భారత్ ఛోదక శక్తిగా ఆవిర్భవిస్తోందని పేర్కొన్నారు. ‘‘ఈ రోజు మనం చూస్తున్నది ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక తరానికి ఒకసారి జరిగే మార్పు. కొన్ని సంవత్సరాల క్రితం భారత్ బలహీనమైన ఐదు దేశాల్లో ఉంది. బలహీనమైన ఐదు నుంచి ఒక దశాబ్దంలో మొదటి ఐదు స్థానాలకు చేరుకున్నాము’’అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామీణుల జీవన ప్రమాణాలు పెరగాలి.. మూడు దశాబ్దాల్లో 9–10 శాతం వృద్ధి సాధించి, 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాలను మార్చాలని, ఆరోగ్య రంగం మెరుగుపడాలని, పోషకాహార ప్రమాణాలు పెరగాలని అమితాబ్ కాంత్ ఉద్ఘాటించారు. భవిష్యత్ వృద్ధిని సాధించడానికి భారత్లో రాష్ట్రాల పాత్ర కీలకమని అన్నారు. ‘‘అంటే దేశ జనాభాలో దాదాపు 50 శాతం ఉన్న బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలు పరివర్తన చెందాల్సిన అవసరం ఉంది’’ అని ఈ వివరించారు. ‘‘మనం వాటిని మార్చడం చాలా క్లిష్టమైనది. ఎన్ని అవరోధాలు ఎదురయినప్పటికీ, ఆయా రాష్ట్రాలు మానవ అభివృద్ధి సూచికలో మెరుగుదలకు కీలకమైన ఛోదక శక్తిగా మారడం చాలా ముఖ్యం’’ అని కాంత్ అన్నారు. భారతదేశ జనాభాలో 50 శాతం మంది వృద్ధిని సృష్టిలో కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. అయితే దిగువ 50 శాతం మంది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాథమిక జీవన ప్రమాణాలను సాధించడానికి వ్యవసాయ కూలీ లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడుతున్నారని ఆయన తెలిపారు.ఈ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం చాలా ముఖ్యమని ఆయన ఉద్ఘాటించారు. అభివృద్ధి చెందిన దేశమంటే... ప్రస్తుతం భారత్ తలసరి ఆదాయం దాదాపు 2,300 డాలర్లు. 2031 ఆర్థిక సంవత్సరం భారత్ తలసరి ఆదాయం 4,500 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. ఇదే జరిగితే దేశం ఎగువ మధ్య–ఆదాయ దేశాల క్లబ్లో ప్రవేశిస్తుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. ఆ స్థాయి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. -
ఏఐ విప్లవంలో పాల్గొనడం కాదు.. నేతృత్వం వహించాలి
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) విప్లవంలో భారత్ కేవలం పాల్గొనడం మాత్రమే కాదని, దీనికి నేతృత్వం వహించాలని దేశ జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో దేశాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకురావడానికి తన సాంకేతిక శక్తి సామర్థ్యాలను సమీకరించాలని ఇక్కడ జరిగిన గ్లోబల్ ఇండియాఏఐ సదస్సులో ఆయన అన్నారు. ఇండస్ట్రీ ప్రాతినిధ్య సంస్థ– నాస్కామ్ను ఉటంకిస్తూ, 70 శాతం భారతీయ స్టార్టప్లు తమ వృద్ధిని పెంచుకోవడానికి ఏఐకి ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కాంత్ ప్రస్తావిస్తూ, తద్వారా స్టార్టప్ ఎకోసిస్టమ్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ప్రాజెక్ట్లలో 19 శాతం వాటాతో అత్యధిక సంఖ్యలో గిట్హబ్ఏఐ ప్రాజెక్ట్లను కలిగి ఉన్న రెండవ దేశంగా భారత్ ఉండడం గర్వకారణమని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఏఐ అభివృద్ధికి సంబంధించి భారత్ శక్తిసామర్థ్యాలను ఈ విషయం స్పష్టంచేస్తోందన్నారు. ఈ స్ఫూర్తితో ఈ రంగంలో భారత్ మరింత పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ విశ్వసనీయంగా, నైతికంగా ఉండే భవిష్యత్తును రూపొందించడానికి చురుకైన విధానం అవసరమని కూడా కాంత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
లండన్లో మరో భారతీయ విద్యార్థిని దుర్మరణం
లండన్లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని చేసితా కొచర్ దుర్మరణం పాలయ్యారు. లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో పీహెచ్డీ చేస్తున్నకొచర్ వర్శిటీ నుంచి తిరిగి వెళుతూండగా ప్రమాదానికి గురయ్యారు. సైకిల్పై వెళుతూండగా ట్రక్ ఒకటి ఆమెను బలంగా ఢీకొంది. దీంతో కోచర్ అక్కడికక్కడే మరణించారు. కోచర్ భర్త ప్రశాంత్ ఆమెను రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చేసితా ఆకస్మిక మరణంపై ఆమె తండ్రి, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఎస్పీ కోచర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చేసితా మరణం కుటుంబంతోపాటు స్నేహితులను కూడా విషాదంలోకి నెట్టేసిందని ఆయన వ్యాఖ్యానించారు. అత్యంత ప్రతిభావంతురాలైన చేసితా మరణంపై సన్నిహితులు, సహవిద్యార్థులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. Cheistha Kochar worked with me on the #LIFE programme in @NITIAayog She was in the #Nudge unit and had gone to do her Ph.D in behavioural science at #LSE Passed away in a terrible traffic incident while cycling in London. She was bright, brilliant & brave and always full of… pic.twitter.com/7WyyklhsTA — Amitabh Kant (@amitabhk87) March 23, 2024 నీతీ ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కూడా కొచర్తో తన అనుబంధాన్ని ఎక్స్ (ట్విట్టర్)లో పంచుకున్నారు. కొచర్ అకాల మరణంపై సంతాపం ప్రకటించిన ఆయన ఆమె నీతి ఆయోగ్లో తనతో కలిసి పనిచేశారని, ధైర్యవంతురాలని గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ, అశోకా యూనివర్సిటీ, పెన్సిల్వేనియా, చికాగో యూనివర్సిటీల్లో పలు కోర్సులు చేసిన చేసితా కోచర్ 2021-23 మధ్య కాలంలో నీతి ఆయోగ్లోని నేషనల్ బిహేవియరల్ ఇన్సైట్స్ యూనిట్ ఆఫ్ ఇండియాలో సీనియర్ అడ్వైజర్గా పనిచేశారు. అంతేకాదు ఆధార్ ప్రాజెక్టు వ్యవస్థాపక బృందంలో ఒకరు కూడా సెంటర్ ఫర్ సోషల్ అండ్ బిహేవియర్ చేంజ్లో పని చేస్తూండగా బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్తో కూడా కలిసి పనిచేశారు. ఆర్గనైజేషనల్బిహేవియర్ మేనేజ్మెంట్లో పీహెచ్డీకోసం గత ఏడాది సెప్టెంబరులోనే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో చేరారు. నాలుగేళ్ల ఈ పీహెచ్డీ కోర్సుకు పూర్తిస్థాయి స్కాలర్షిప్ లభించడం గమనార్హం. ఫీడ్ ఇండియా బిజినెస్ చదువులో కొచర్ ఎపుడూ టాపర్. గణితం, ఎకానమిక్స్ అంటే చాలా ఇష్టం. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకునే సమయంలో తొలి బిజినెస్ ‘ఫీడ్ ఇండియా’ను ప్రారంభించింది. విశ్వవిద్యాలయ క్యాంటీన్లలో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి నామమాత్రపు ధరకు విక్రయించేది. తద్వారా క్యాంటీన్లలో వృథా అవుతున్న ఆహారాన్ని సద్వినియోగం చేయడంతోపాటు... పేద మహిళలు వంట చేసుకునే శ్రమను తగ్గించి ఎక్కువ సమయం పనిచేసి మరింత సంపాదించుకునేలా చేసింది. ఈ వ్యాపారాన్ని కొనసాగించాలని చేసితా అనుకున్నా.. కుటుంబ సభ్యుల సూచనల మేరకు చదువులు పూర్తి చేయాలన్న దిశగా అడుగులు వేసింది. కానీ ఆమె కలలు, ఆశయాలు నెరవేరకుండానే ఈ లోకాన్ని వీడడం విషాదం. -
Ashwini Vaishnav: వచ్చే పదేళ్లలో 6 నుంచి 8 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ వచ్చే 10 సంవత్సరాలలో 6 నుంచి 8 శాతం స్థిరమైన వృద్ధి రేటును కొనసాగిస్తుందన్న విశ్వాసాన్ని కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యక్తం చేశారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను తీర్చడానికి భారత్ తగిన స్థానంలో ఉందని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పెట్టుబడిదారులకు విజ్ఞప్తి చేశారు. రైసినా డైలాగ్ 2024లో ఆయన ఈ మేరకు మాట్లాడుతూ, 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి వచ్చే ఐదేళ్లలో కేంద్రం మరింత పటిష్ట పునాదులు వేస్తుందని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా భారత్ ఆవిర్భవించాలి: జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పెట్టుబడులకు సంబంధించి కీలక మూలధనాన్ని ఆకర్షించడానికి 2047 నాటికి భారతదేశం గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా మారాల్సిన అవసరం ఉందని జీ 20 షెర్పా అమితాబ్ కాంత్ ఇదే కార్యక్రమంలో అన్నారు. ‘రైసినా డైలాగ్ 2024’లో కాంత్ ప్రసంగిస్తూ, నేటి ప్రధాన సవాలు వాతావరణ మార్పు అని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, ప్రపంచ బ్యాంక్ ‘వాతావరణ బ్యాంకుగా’ మారాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో, అన్ని పెట్టుబడులు పునరుత్పాదక రంగంలోకి ప్రవహిస్తాయని అంచనావేశారు. పర్యావరణానికి పెద్దపీట వేసిన దేశాతే మూలధనాన్ని ఆకర్షించగలవని ఆయన అన్నారు. -
2030 నాటికి 2.5 కోట్ల ఉద్యోగాలు! - అమితాబ్ కాంత్
న్యూఢిల్లీ: పరిశ్రమ, మౌలిక రంగ హోదా కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్న ఆతిథ్య, పర్యాటక రంగ సంస్థలకు భారతదేశ జీ20 షెర్పా అమితాబ్ కాంత్ కీలక సూచన చేశారు. పరిశ్రమ, మౌలిక సదుపాయాల హోదా కల్పన కోసం సహాయం చేయాలని రాజకీయ నాయకులను ఒకపక్క కోరడంతోపాటే, మరోవైపు 2030 నాటికి 2.5 కోట్ల ఉద్యోగాల కల్పన గురించి కూడా వారికి భరోసా ఇవ్వాలని ఆయన సూచించారు. హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఏఐ) నిర్వహించిన 6వ హోటల్స్ కాంక్లేవ్లో కాంత్ మాట్లాడుతూ, పరిశ్రమ హోదా కోసం ఆతిథ్య, పర్యాటక రంగ డిమాండ్ సరైనదేనన్నారు. అయితే ఈ రంగం భారీ ఉపాధి అవకాశాలను అందిస్తుందని రాజకీయ నాయకులకు తెలియజేయడంలో విఫలమైందని పేర్కొన్నారు. ‘‘మీరు టూరిజం వైపు చూస్తే, రాజకీయ దృక్కోణం నుండి నేను ఆలోచిస్తాను. రాజకీయ నాయకులు ఒక విషయం మాత్రమే అర్థం చేసుకుంటారు. పర్యాటక రంగం ఎన్ని ఉద్యోగాలను సృష్టిస్తోంది అని మాత్రమే వారు ఆలోచిస్తారు. ఇక్కడ వారికి భరోసా లభిస్తే.. ఈ రంగం కోసం ఎటువంటి పెద్ద నిర్ణయమైనా ప్రభుత్వం నుంచి వెలువడుతుంది’’ అని ఆయన అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. పర్యాటక రంగం సృష్టించే ప్రతి ప్రత్యక్ష ఉద్యోగానికి భారీ సానుకూల స్పందన ఉంటుంది. అయితే ఉద్యోగాల సృష్టికర్తలమని రాజకీయ నాయకులకు చెప్పడంలో పర్యాటక రంగం విఫలమైందని నేను భావిస్తున్నాను. ఉపాధి పరంగా, థాయ్లాండ్ దాదాపు 2 కోట్ల ఉద్యోగాలు, మలేషియా 1.5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తే... భారతదేశం పర్యాటక రంగం మాత్రమే 78 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తోంది. ఎంఐసీఎస్ (మీటింగ్, ఇన్సెంటివ్, కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్) విభాగంలో అవకాశాన్ని అందిపుచ్చుకోడానికి ఆతిథ్య, పర్యాటక రంగం కృషి చేయాలి. యశోభూమి, భారత్ మండపం ఆవిష్కరణతో భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ కన్వెన్షన్ అలాగే ఎక్స్పో సెంటర్లను కలిగి ఉంది. ప్రపంచ మార్కెట్లో 500 బిలియన్ డాలర్లకు పైగా ఉన్న ఎంఐసీఈ విభాగంలో భారత్ వాటా 1 శాతం కంటే తక్కువగా ఉంది. ఇది విచారకరమైన అంశం. ఏడేళ్లలో ఐదుకోట్ల ఉద్యోగాలు: హెచ్ఏఐ కాగా, రాబోయే ఐదేళ్ల నుంచి ఏడేళ్లలో 5 కోట్ల ప్రత్యక్ష –పరోక్ష ఉద్యోగాలను సృష్టించాలని పర్యాటక, ఆతిథ్య రంగం భావిస్తోంది. అయితే పూర్తి పరిశ్రమ, మౌలిక సదుపాయాల హోదా పొందేందుకు ప్రభుత్వ మద్దతు అవసరమని హోటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఏఐ) తెలిపింది. తాము కోరుకుంటున్న ప్రత్యేక హోదా కేవలం వసతులను సృష్టించడానికి మాత్రమే కాకుండా, ఈ రంగం ఆదాయం పరంగా, ఉపాధి కల్పనా పరంగా పురోగమించడానికి దోహదపడుతుందని హెచ్ఏఐ ప్రెసిడెంట్ పునీత్ ఛత్వాల్ 6వ హెచ్ఏఐ హోటల్స్ కాంక్లేవ్లో పేర్కొన్నారు. -
చైనాను అందుకోవాలంటే.. 10% వృద్ధి అవసరం
న్యూఢిల్లీ: చైనా ఆర్థిక వ్యవస్థ పరిమాణం ప్రస్తుతం భారతదేశం కంటే ఐదు రెట్లు ఉందని, చైనా స్థాయి ని మన దేశం చేరుకోవాలంటే 10 శాతం వృద్ధి సాధన అవసరమని భారత్ జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్న ఆయన, రాబోయే మూడు దశా బ్దాల్లో 8–9 శాతం వృద్ధిరేటు సాధన దేశానికి సవాలుగా మారుతుందని పేర్కొన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోర మ్ ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) ఇక్కడ ఏర్పా టు చేసిన ఒక కార్యక్రమంలో కాంత్ మాట్లాడుతూ, ప్రైవేట్ రంగం మద్దతు లేకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థ అధిక రేటు వృద్ధి సాధన అసాధ్యమని అన్నారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తు తం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకాన మీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. 3.5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీతో భారత్ ఐదవ స్థానంలో నిలుస్తోంది. 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. 2030 నాటికి జపా న్ ఎకానమీని సైతం భారత్ అధిగమించగలదని ఎస్అండ్పీ గ్లోబల్ వంటి సంస్థలు కొన్ని విశ్లేషిస్తున్నాయి. విమానయానంలో యూరప్ను మించి... మౌలిక రంగానికి ప్రభుత్వం పటిష్ట మద్దతునిస్తోందన్నారు. యూరప్లోని విమానాశ్రయాల కంటే భారతీయ విమానాశ్రయాల నాణ్యత మెరుగ్గా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ విమానయాన సంస్థల కంటే మన దేశీయ విమానయాన సంస్థలు కూడా మెరుగ్గా ఉన్నాయని ఆయన అన్నారు. ఏఐ కీలక పాత్ర భారతదేశ వృద్ధి పటిష్టత చెక్కుచెదర కుండా ఉంటుందని భరోసా ఇచి్చన అమితాబ్ కాంత్, స్థిరమైన వృద్ధిని తీసుకురావడానికి ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించకుండా, సాంకేతిక రంగలో పురోగతి అసాధ్యమని సైతం ఈ సందర్బంగా పేర్కొన్నారు. -
G20 Summit: జీ20 సదస్సు విజయం వారి కృషే..
న్యూఢిల్లీ: దేశరాజధానిలో రెండు రోజులపాటు జరిగిన జీ20 సమావేశాలు విజయవంతమైన నేపథ్యంలో సమావేశాలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన జీ20 నిర్వహణాధికారి అమితాబ్ కాంత్ అతని బృందంపైనా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్బంగా మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ అమితాబ్ కాంత్ నేతృత్వంలోని జీ20 షెర్పాల కృషిని కొనియాడారు. కేరళకు చెందిన ఐఏఎస్ అధికారి అమితాబ్ కాంత్పై శశి థరూర్ ప్రశంసలు కురిపించారు. థరూర్ తన ఎక్స్(ట్విట్టర్) వేదికగా రాస్తూ.. శభాష్ అమితాబ్.. మీరు ఐఏఎస్ ఎంచుకోవడం వలన ఐఎఫ్ఎస్ ఓ గొప్ప అధికారిని కోల్పోయిందని మాత్రం చెప్పగలను. ఢిల్లీ డిక్లరేషన్ విషయంలో మీ పాత్ర అనిర్వచనీయం. ఢిల్లీ డిక్లరేషన్ డ్రాఫ్ట్ పూర్తి చేయడానికి ఒక్కరోజు ముందే రష్యా చైనాలతో చర్చించి ఏకాభిప్రాయం సాధించడం సాధారణ విషయం కాదని.. ఇది భారత దేశానికే గర్వకారణమని అన్నారు. Well done @amitabhk87! Looks lile the IFS lost an ace diplomat when you opted for the IAS! "Negotiated with Russia, China, only last night got final draft," says India's G20 Sherpa on 'Delhi Declaration' consensus. A proud moment for India at G20! https://t.co/9M0ki7appY — Shashi Tharoor (@ShashiTharoor) September 9, 2023 ఢిల్లీ డిక్లరేషన్లో అత్యంత కీలక ఘట్టమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అంశాన్ని చాలా నేర్పుగా పొందుపరచిన జీ20 షెర్పాలపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జీ20 సదస్సు నిర్వహణలో ప్రధానాధికారి అమితాబ్ కాంత్ కూడా షెర్పాల బృందాన్ని అభినందించారు. అమితాబ్ కాంత్ రాస్తూ.. జీ20 సదస్సు మొత్తంలో అత్యంత కఠినమైన అంశం రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశంపై ఏకాభిప్రాయం సాధించడమే. దీనికోసం కనీసం 200 గంటల పాటు చర్చలు నిర్వహించాం, 300 ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించాము. మొత్తంగా 15 డ్రాఫ్టులను తయారుచేశాము. ఈ విషయంలో ఎంతగానో సహాయపడిన ఈనమ్ గంభీర్, నాగరాజ్ నాయుడు కాకనూర్ లకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని రాశారు. The most complex part of the entire #G20 was to bring consensus on the geopolitical paras (Russia-Ukraine). This was done over 200 hours of non -stop negotiations, 300 bilateral meetings, 15 drafts. In this, I was greatly assisted by two brilliant officers - @NagNaidu08 & @eenamg pic.twitter.com/l8bOEFPP37 — Amitabh Kant (@amitabhk87) September 10, 2023 రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశంపై గతంలో భేదాభిప్రాయాలు వ్యక్తమైనా కూడా దానిపై కర సాధన చేసి షెర్పాలు సభ్యదేశాల ఏకాభిప్రాయం సాధించారు. ఏ ప్రకటన చేసినప్పుడే భారత్ ప్రధాని కూడా షెర్పాల బృందాన్ని అభినందించిన విషయం తెలిసిందే. #WATCH | G-20 in India: PM Narendra Modi says, " I have received good news. Due to the hard work of our team, consensus has been built on New Delhi G20 Leaders' Summit Declaration. My proposal is to adopt this leadership declaration. I announce to adopt this declaration. On this… pic.twitter.com/7mfuzP0qz9 — ANI (@ANI) September 9, 2023 ఇది కూడా చదవండి: G20 Summit: జీ20 సమావేశాలు విజయవంతం -
గ్రేట్ ఇండియన్ బ్రాండ్ అరకు కాఫీ..
సాక్షి, అమరావతి: అరకు కాఫీ ఘుమఘుమలు మరోసారి అంతర్జాతీయంగా ఖ్యాతికెక్కింది. ప్రపంచంలోనే తొలి గిరిజన సంప్రదాయ కాఫీ అయిన అరకు కాఫీ ఇండియన్ గ్రేట్ బ్రాండ్లలో ఒకటి అంటూ నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ ట్వీట్ చేయగా.. దానిని స్వాగతిస్తూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. దీంతో, మరోసారి అంతర్జాతీయంగా అరకు కాఫీపై ట్విట్టర్ వేదికగా పెద్ద చర్చ జరుగుతోంది. ఇండియాలో జరుగుతున్న జీ–20 సమావేశాల్లో విదేశీ ప్రతినిధులకు అందంగా ప్యాక్ చేసిన అరకు కాఫీని అందిస్తున్నామని, ఇది ప్రపంచంలోనే తొలి గిరిజన కాఫీగా గుర్తింపు పొందిందంటూ అమితాబ్ కాంత్ కీర్తించారు. సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న కాఫీ సాగు ప్రాంతంగా అరకుకు గుర్తింపు లభించందన్నారు. ప్రతిసారి సేంద్రియ సాగు పరీక్షలో స్థిరంగా 90 కంటే ఎక్కువ మార్కులు సాధిస్తూ తొలి ఇండియన్ కాఫీగా నిలవడమే కాకుండా.. గ్రేట్ ఇండియన్ బ్రాండ్గా ఎదిగిందన్నారు. ఈ ట్వీట్పై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. దేశ విజయాన్ని అద్దంపట్టే విధంగా అరకు కాఫీని ఎంచుకోవడం అద్భుతమైన నిర్ణయమంటూ పొగిడారు. A perfect epicurean choice, @amitabhk87 whixh showcases an incredible Indian success story. The creation of a global brand while simultaneously transforming the lives of the tribal population of Araku. https://t.co/oFHWz0EIzy — anand mahindra (@anandmahindra) July 16, 2023 ఇది కూడా చదవండి: కొల్లేరు పర్యాటకం.. కొత్త అందాల నిలయం -
స్టార్టప్ వ్యవస్థ బలోపేతానికి కృషి,నిధుల కొరత లేదు: అమితాబ్ కాంత్
గురుగ్రామ్: అంకుర సంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. స్టార్టప్ల వ్యవస్థను ప్రోత్సహించేందుకే తప్ప నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయత్నించబోదని ఆయన స్పష్టం చేశారు. ఆ వ్యవస్థలో భాగమైన వర్గాలే స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. స్టార్టప్20 సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. (హార్లే డేవిడ్సన్ ఎక్స్440 బుకింగ్స్ షురూ ) అంకుర సంస్థల పురోగతికి అవరోధాలు కల్పించాలనేది ప్రభుత్వల ఉద్దేశం కాదనే స్పష్టమైన సందేశం స్టార్టప్లకు చేరాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. భారత్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని అంకుర సంస్థలను ఆహ్వానించారు. 2030 నాటికి అంకుర సంస్థల వ్యవస్థలోకి జీ20 దేశాలన్నీ కలిసి ఏటా 1 లక్ష కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టేలా చూసేందుకు స్టార్టప్20 గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలు సాకారమైతే స్టార్టప్లకు మరిన్ని ప్రయోజనాలు చేకూరగలవని గోయల్ చెప్పారు. (Virat Kohli First Car: స్టార్ క్రికెటర్ కోహ్లీ, ఫస్ట్ కారు ఏదో తెలుసా? దుమ్మురేపే లగ్జరీ కార్ల కలెక్షన్) స్టార్టప్లకు నిధుల కొరత లేదు: అమితాబ్ కాంత్ సరైన అంకుర సంస్థలకు పెట్టుబడుల కొరతేమీ లేదని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. పటిష్టమైన వ్యాపార విధానాలున్న మంచి స్టార్టప్లకు నిధుల లభ్యత బాగానే ఉందని ఆయన చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు స్టార్టప్ వ్యవస్థ చురుగ్గా పని చేస్తోందని స్టార్టప్20 శిఖర్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భారత్లో 1,00,000 పైచిలుకు స్టార్టప్లు, 108 యూనికార్న్లు (బిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే అంకురాలు) ఉన్నాయని అమితాబ్ కాంత్ తెలిపారు. (జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా) -
విక్రయాల కోసం ప్రభుత్వంపై ఆధారపడకండి
న్యూఢిల్లీ: అంకుర సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాల కోసం ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ (కొనుగోళ్ల)పై ఆధారపడొద్దని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ సూచించారు. దానికి బదులుగా దేశీ మార్కెట్, ఎగుమతులపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన యూత్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న సందర్భంగా కాంత్ ఈ విషయాలు తెలిపారు. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కొనుగోళ్ల ద్వారా స్టార్టప్లకు తోడ్పాటు అందించేందుకు సానుకూలంగా కృషి చేస్తున్నాయని, అనేక సందర్భాల్లో పలు మినహాయింపులు కూడా ఇస్తున్నాయని ఆయన చెప్పారు. అంకుర సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు గవర్నమెంట్ ఈ–మార్కెట్ప్లేస్ చక్కని రన్వేలాంటిదని కాంత్ వివరించారు. ‘అయితే, అంకుర సంస్థల విషయంలో ప్రభుత్వాలు మరీ ఎక్కువగా జోక్యం చేసుకోవడానికి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం. చురుకైన స్టార్టప్లు మార్కెట్ప్లేస్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ప్రభుత్వ కొనుగోళ్లపై మరీ ఎక్కువగా ఆధారపడిపోకూడదు‘ అని ఆయన చెప్పారు. ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటి స్కీముల ద్వారా స్టార్టప్లకు పెట్టుబడులు లభించేలా తోడ్పాటు అందించడానికి మాత్రమే ప్రభుత్వ పాత్ర పరిమితం కావాలని కాంత్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, లింగ అసమానతలను రూపుమాపేందుకు, మహిళల జీవన ప్రమా ణాలు మరింత మెరుగుపడేందుకు పురుషుల దృష్టికోణం మారాలని ఆయన చెప్పారు. సాధారణంగా భారత్, దక్షిణాసియాలో ఆస్తిని కుమార్తెలకు కాకుండా కుమారులకే మార్పిడి చేసే సంస్కృతి ఉందని.. అలా కాకుండా కుమార్తెల పేరిట బదిలీ చేసే సంస్కృతి వస్తే దశాబ్ద కాలంలోనే మహిళలు మరింతగా రాణించడాన్ని చూడగలమని కాంత్ చెప్పారు. -
ఏఐతో కొత్త అవకాశాలు.. ప్రైవసీకి సవాళ్లు
పాంజిమ్: కృత్రిమ మేథ (ఏఐ)తో మానవాళి అభివృద్ధికి కొత్త అవకాశాలు లభించగలవని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. పనితీరు, పరివర్తనలో సాంకేతికత కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సమాచార సేకరణ, ప్రాసెసింగ్, వితరణ ప్రక్రియ అంతా వేగంగా, సమర్థమంతంగా నిర్వహించేందుకు తోడ్పడుతోందని రెండో జీ20–ఎస్ఏఐ (సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్) సదస్సులో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ), నకిలీ వార్తలపరమైన సవాళ్లు తలెత్తవచ్చని ఆయన చెప్పారు. -
వర్ధమాన దేశాలకు ‘అభివృద్ధి లక్ష్యాల’ నిధులు కావాలి
న్యూఢిల్లీ: సుస్థిర అభివృద్ధి సాధన లక్ష్యాల సాధన కోసం వర్ధమాన దేశాలకు దీర్ఘకాలికంగా నిధులు అవసరమని నీతి ఆయోగ్ మాజీ సీఈవో, జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. ఇందుకోసం కోపెన్హాగన్ ఒప్పందం ప్రకారం సంపన్న దేశాల నుంచి వర్ధమాన దేశాలకు నిధుల ప్రవాహం పెరగాలని పేర్కొన్నారు. జీ20 అధ్యక్ష హోదాలో కూటమిని మరింత సమ్మిళితంగా ఎలా చేయవచ్చు, ప్రపంచ ఎకానమీ వృద్ధికి ఎలా దోహదపడవచ్చు అనే అంశాలకు భారత్ ప్రాధాన్యత నిస్తోందని కాంత్ తెలిపారు. ఇదీ చదవండి: ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్ అనేక సవాళ్లు నెలకొన్నప్పటికీ డిజిటల్ చెల్లింపులు, డేటా ఎకానమీ తదితర విషయాల్లో భారత్ వేగంగా పురోగమి స్తోందని.. ఇతర దేశాలకూ ఈ మోడల్ ఉపయోగకరమైనదని ఆయన పేర్కొన్నారు. వాతావరణ వేడిమిని తగ్గించే లక్ష్యాలను సాధించే దిశగా ప్రపంచ దేశాలు చర్యలు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కాంత్ చెప్పారు. పారిశ్రామికీకరణ క్రమంలో పాశ్చాత్య దేశాలే వాతావరణాన్ని భారీగా కలుషితం చేశాయని, ప్రస్తుత వాతావరణ సంక్షోభంలో వర్ధమాన దేశాల వాటా చాలా స్వల్పమేనని ఆయన తెలిపారు. కర్బన ఉద్గారాలతో ప్రపంచాన్ని ముంచెత్తకుండా పారిశ్రామిక బాటలో ముందుకు సాగే తొలి దేశాల జాబితాలో భారత్ కూడా ఉంటుందని కాంత్ చెప్పారు. (Dr.Vandana Lal Success Story: రూ. 3వేల కోట్ల నికర విలువతో రిచెస్ట్ విమెన్: ఆసక్తికర విషయాలు) మరిన్ని వార్తలు, అప్డేట్ కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
జీ20తో డిజిటల్ కృషిని ప్రపంచానికి చాటి చెప్తాం
న్యూఢిల్లీ: డిజిటల్ పరివర్తనలో భారత్ చేస్తున్న కృషిని జీ20 కార్యక్రమాల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పనున్నట్లు నీతి ఆయోగ్ మాజీ సీఈవో, జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. తద్వారా గ్లోబల్ సౌత్ (లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా, ఓషియానియా దేశాలు) ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు తోడ్పాటు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 8వ జాతీయ నాయకత్వ సదస్సులో పాల్గొన్న సందర్భంగా కాంత్ ఈ విషయాలు తెలిపారు. అంతర్జాతీయంగా 400 కోట్ల మందికి డిజిటల్ గుర్తింపు లేదని, 250 కోట్ల మంది కనీసం బ్యాంకు ఖాతా కూడా లేదని కాంత్ చెప్పారు. 133 దేశాల్లో వేగవంతమైన డిజిటల్ చెల్లింపుల విధానాలు లేవని పేర్కొన్నారు. అలాంటిది, డిజిటైజేషన్ ద్వారా భారత్ ప్రజల జీవితాల్లో మార్పులు తేగలిగిందని, ఉత్పాదకత పెంచుకుని సమర్థమంతమైన ఆర్థిక వ్యవస్థగా ముందుకెడుతోందని కాంత్ చెప్పారు. డిజిటైజేషన్ డిజిటల్ చెల్లింపులు తదితర విభాగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతిని వివరించారు. ‘భారత్ పాటిస్తున్న ఈ మోడల్ను మిగతా ప్రపంచం ముందుకు ఎలా తీసుకెళ్లాలన్నది ఒక సవాలు. భారత డిజిటల్ పరివర్తన గాధను ప్రపంచానికి పరిచయం చేసేందుకు జీ20 వేదికను ఉపయోగించు కుందాం. ఆ విధంగా గ్లోబల్ సౌత్ దేశాల పౌరుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం‘ అని కాంత్ పేర్కొన్నారు. -
వృద్ధి కోసం ఫైనాన్షియల్ రెగ్యులేటర్లు మారాలి
ముంబై: దేశంలో ఆర్థిక రంగానికి సంబంధించి పనిచేస్తున్న నియంత్రణ సంస్థలు (రెగ్యులేటర్లు) సోషలిస్ట్ యుగంలో రూపొందించినవని, వృద్ధి కోసం అవి మారాల్సిన అవసరం ఉందని జీ–20లో భారత్ షెర్పా (ప్రతినిధి), నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. ఎస్బీఐ కాంక్లేవ్లో భాగంగా కాంత్ మాట్లాడారు. ఆర్బీఐ, సెబీ, కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. మార్పు, అభివృద్ధి ఏజెంట్లుగా పనిచేయాలని సూచించారు. ఎప్పుడో సామ్యవాదం రోజుల్లో నియంత్రణ సంస్థలు ఏర్పాడ్డాయని, నేటి కాలానికి అనుగుణంగా వాటి ఆలోచనా విధానంలో మార్పు రావాలన్నది తన అభిప్రాయంగా పేర్కొన్నారు. దేశ అభివృద్ధి ఆవశ్యకత గురించి కాంపిటిషన్ కమిషన్ (సీసీఐ) ఉపోద్ఘాతంలో ప్రస్తావించారని చెబుతూ, ఇతర నియంత్రణ సంస్థలకు సైతం ఇదే విధమైన లక్ష్యం ఉండాలన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ, రెన్యువబుల్ ఎనర్జీలో రానున్న అవకాశాలను భారత్ సొంతం చేసుకోలేకపోతే 7 శాతం వృద్ధి రేటును కూడా ఆశించలేమన్నారు. ఉచిత విద్యుత్ తదితర ఉచిత తాయిలాలతో కొంత మంది రాజకీయ నాయకులు దేశాన్ని నాశనం చేస్తున్నారని, ప్రత్యేకంగా ఎవరి పేరును ప్రస్తావించకుండా విమర్శించారు. ఈ ఏడాది జీ–20కి భారత్ నాయకత్వం వహిస్తుండడం తెలిసిందే. సర్క్యులర్ ఎకానమీపై దృష్టి అవశ్యం క్లైమేట్ చేంజ్ సమస్య పరిష్కారం కోసం (వాతావరణ సమతౌల్య పరిరక్షణ) సర్క్యులర్ ఎకానమీపై దృష్టి సారించాల్సిన తక్షణ అవసరం ఉందని ఒక వెర్చువల్ కార్యక్రమంలో భారత్ తరఫున జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ అనేది ఉత్పత్తి– వినియోగానికి సంబంధించిన ఒక నమూనా. వినియోగ ఉత్పత్తుల రీసైక్లింగ్ ఇందులో ప్రధాన భాగం. డిసెంబర్ 1 నుంచి జీ–20 ప్రెసిడెన్సీ బాధ్యతలు స్వీకరిస్తున్న భారత్, సర్క్యులర్ ఎకానమీ పురోగతికి తన వంతు ప్రయత్నం చేస్తుందన్నారు. -
8జీ–20 షెర్పాగా అమితాబ్ కాంత్!
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ జీ–20కు భారత కొత్త షెర్పాగా సేవలు అందించనున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటి వరకు ఈ బాధ్యతలు చూశారు. ‘‘జీ–20 అధ్యక్ష బాధ్యతలు ఈ ఏడాది భారత్కు రానున్నాయి. దీంతో షెర్పా బాధ్యతల్లో ఉన్న వారు దేశవ్యాప్తంగా వివిధ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. మరింత సమయం కేటాయించాల్సి ఉంటుంది. కేంద్ర మంత్రి గోయల్ నరేంద్ర మోదీ కేబినెట్లో ఎన్నో శాఖల బాధ్యతలు చూస్తున్నారు. వీటికే ఎక్కువ సమయం కావాల్సి ఉంటుంది. పైగా రాజ్యసభ నేతగానూ గోయల్ పనిచేస్తున్నారు’’అని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన అమితాబ్ కాంత్ గతంలో పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం సెక్రటరీగానూ పనిచేశారు. -
భారత్ స్టార్టప్ల విప్లవం
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని భారత స్టార్టప్లు శాసిస్తున్నాయని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. ముఖ్యంగా హెల్త్, నూట్రిషన్, వ్యవసాయ రంగాల్లో ఇవి తమదైన ప్రత్యేకతను చాటుతున్నాయని పేర్కొన్నారు. మహిళల ఆధ్వర్యంలోని సంస్థలు సమ సమాజ సాకారంలో కీలక వాహకాలుగా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఫిక్కీ మహిళా ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్లో 61,000 స్టార్టప్లు, 81 యూనికార్న్లు ఉన్నట్టు చెప్పారు. మహిళల నిర్వహణలోని వ్యాపార సంస్థలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, భారత స్టార్టప్ ఎకోసిస్టమ్లో మహిళలే తదుపరి విప్లవానికి దారి చూపిస్తారని అంచనా వేశారు. ప్రస్తుతం వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థలు, ప్రైవేటు ఈక్విటీ సంస్థలు మహిళా స్టార్టప్లకు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపారు. ‘‘ఇది వ్యూహాలు రూపొందించుకునేందుకు, స్టార్టప్లు చక్కగా వృద్ధి చెందేందుకు తగిన చర్యలను సూచించేందుకు, మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు దారితీస్తుంది’’అని కాంత్ చెప్పారు. నేడు భారత్ విప్లవాత్మకమైన వినియోగం, పట్టణీకరణ, డిజిటైజేషన్, పెరుగుతున్న ఆదాయాలతో గొప్ప వృద్ధిని చూడనుందన్నారు. -
ప్రైవేటు రైళ్లా ? మాకొద్దు బాబోయ్ !
న్యూఢిల్లీ: రైల్వే విభాగంలో ప్రైవేట్ సంస్థలను అనుమతించడం తదితర చర్యలతో రైల్వే అసెట్స్ను మానిటైజ్ చేయాలన్న ప్రతిపాదనకు ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా స్పందన రాలేదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. మానిటైజేషన్ ప్రక్రియను సరిగ్గా రూపొందించకపోవడం ఇందుకు కారణం కావచ్చని .. ఈ నేపథ్యంలో సదరు ప్రణాళికలను రైల్వే శాఖ పునఃసమీక్షిస్తోందని ఆయన తెలిపారు. కచ్చితంగా రాబడులు వస్తాయంటేనే పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ ముందుకు వస్తుందని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అసెట్ మానిటైజేషన్ ప్రణాళికలో పేర్కొన్న రూ. 6 లక్షల కోట్ల అసెట్స్ నుంచి కచ్చితంగా ఆదాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంత్ వివరించారు. చదవండి: ఎల్ఐసీ ఐపీవో వాయిదా! -
సంస్కరణలు పెద్ద ఎత్తున చేపట్టాలి
న్యూఢిల్లీ: భారత్కు మరిన్ని సంస్కరణలు అవసరమని, అన్ని రంగాల్లోనూ పెద్ద ఎత్తున సంస్కరణలను చేపట్టాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. సీఐఐ పార్ట్నర్షిప్ సదస్సు 2021ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎగుమతులు గణనీయంగా పెరిగిన సందర్భాల్లోనే భారత్ వృద్ధి సాధించినట్టు గుర్తు చేశారు. భారత్ పోటీనిచ్చేలా ఉండాలని ఇది తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం.. తదుపరి మరిన్ని సంస్కరణలు చేపట్టే విషయంలో ప్రభుత్వం తీరుపై ప్రభావం చూపిస్తుందా? అన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. ‘‘సంపద సృష్టి ప్రైవేటు రంగం ద్వారానే సాధ్యపడుతుందన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. వారికి (పారిశ్రామికవేత్తలకు) పరిస్థితులు అనుకూలంగా ఉండేలా చూడడమే ప్రభుత్వం చేయాల్సిన పని. ఉత్ప్రేరకంగా, సదుపాయ కల్పనదారుగానే ప్రభుత్వం వ్యవహరించాలి. సంస్కరణలను ఈ దిశగానే ముందుకు నడిపించాలి’’ అని కాంత్ చెప్పారు. -
టెస్లా ఎంట్రీపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం..!
భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి వచ్చేందుకు టెస్లా సిద్దమైన విషయం తెలిసిందే. దిగుమతి సుంకాలు అధిక ఉండడంతో టెస్లా రాక కాస్త ఆలస్యమవుతోంది. అధిక దిగుమతి సుంకాలపై ఇప్పటికే టెస్లా ప్రతినిధులు భారత ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా భారత్లోకి టెస్లా ఎంట్రీ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. డ్యూటీ కోత తగ్గించే అవకాశం..! ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలనే టెస్లా ప్రతిపాదనపై భారత ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. దిగుమతి సుంకాలపై ఎంతమేర కోత పెట్టవచ్చుననే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. టెస్లా ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ రెవెన్యూ విభాగం తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా మూడు సంవత్సరాల పాటు దిగుమతి సుంకాలను తాత్కాలికంగా తగ్గించే అవకాశాలపై కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు ఆయన అన్నారు. చదవండి: లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1 ప్రభుత్వంతో చర్చలు..! ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలని టెస్లా కోరిన విషయం తెలిసిందే. టెస్లాతో పాటుగా ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్ధ బీఎండబ్ల్యూ కూడా దిగుమతి సుంకాలపై ప్రభుత్వం మరొకసారి ఆలోచించాలని కోరింది. దిగుమతి సుంకాలను 40 శాతానికి తగ్గించడంతో భారత్లో ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు మరింత ఊపందుకునే అవకాశం ఉందని టెస్లా వాదించింది. అదనంగా 10 శాతం సోషల్ వెల్ఫేర్ సర్చార్జిని కూడా మాఫీ చేసే అంశంపై కూడా కంపెనీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. విదేశీ కార్లపై దిగుమతి సుంకాలు భారత్లో ఇలా..! విదేశాల్లో తయారైన కార్లపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 60-100 శాతం దిగుమతి సుంకాలను విధిస్తుంది. ఇంజిన్ పరిమాణంతో పాటు ధర, బీమా, రవాణా కలుకొని 40,000 డాలర్లు దాటితే ఈ సుంకం వర్తించనుంది. చదవండి: లక్షకోట్లకు పైగా నష్టం, రాజకీయాల్లోని ఆ వృద్దులపై నిషేదం విధించాలి..! ఎలన్ పిలుపు -
ఆర్బీకేలకు జాతీయస్థాయి ప్రశంసలు
ఆర్బీకేల కోసం చాన్నాళ్లుగా వింటున్నాం. చాలా మంచి ఆలోచన. వీటిద్వారా సంక్షేమ పథకాల అమలుతోపాటు సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్తున్న తీరు చాలా బాగుంది. వీటిని జాతీయస్థాయిలో అమలు చేసేందుకు లోతైన చర్చ, అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. –అమితాబ్కాంత్, సీఈవో, నీతి ఆయోగ్ వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల ఆలోచన వినూత్నంగా ఉంది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన వీటిద్వారా రైతులకు నాణ్యమైన సేవలందిస్తున్న తీరు అద్భుతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు. – తోమియో షిచిరీ, భారత ప్రతినిధి, కంట్రీ డైరెక్టర్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకేల) జాతీయస్థాయిలో ప్రశంసలందుకుంటున్నాయి. ఆర్బీకేల ఏర్పాటు, వాటి పనితీరుపై అధ్యయనం చేసేందుకు ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో)తో పాటు నీతి ఆయోగ్ ఆహ్వానం మేరకు వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య జాతీయస్థాయిలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. న్యూఢిల్లీలో తొలుత ఎఫ్ఏవోలోను, తర్వాత నీతి ఆయోగ్లోను ఆమె ఇచ్చిన ప్రజంటేషన్ పట్ల వారు అమితాసక్తిని ప్రదర్శించారు. ఆర్బీకేలు ఎప్పుడు ప్రారంభించారు. వాటిద్వారా ఏయే సేవలు అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల నుంచి.. ఈ సందర్భంగా పూనం మాలకొండయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిందే ఆర్బీకే వ్యవస్థ అని చెప్పారు. ఇవి ఆయన మానస పుత్రికలని తెలిపారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. ‘పాలనను ప్రజల ముంగిటకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి 2 వేల జనాభాకు ఓ గ్రామ సచివాలయం ఏర్పాటు చేసిన మా ప్రభుత్వం వాటికి అనుబంధంగా ఆర్బీకేల వ్యవస్థను తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేలను ఏర్పాటు చేశాం. వాటిలో స్మార్ట్టీవీ, డిజిటల్ లైబ్రరీ, కియోస్క్, భూసార, విత్తన పరీక్షలు చేసే మినీ టెస్టింగ్ కిట్లు, ఇంటర్నెట్ సదుపాయం కల్పించాం. అనుభవం, నైపుణ్యతగల 14 వేలమందికి పైగా వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది ద్వారా ఆర్బీకేలు కేంద్రంగా గ్రామస్థాయిలో విత్తు నుంచి విపణి వరకు రైతులకు నాణ్యమైన సేవలందిస్తున్నాం. సీజన్కు ముందుగానే ధ్రువీకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అందుబాటులో ఉంచుతున్నాం. కియోస్క్లో బుక్ చేసుకున్న గంటల్లోనే వాటిని డోర్ డెలివరీ చేస్తున్నాం. ఆర్బీకేలనే పంట కొనుగోలు కేంద్రాలుగా తీర్చిదిద్దాం. వీటికి అనుబంధంగా వైఎస్సార్ యంత్ర సేవాకేంద్రాలు (కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు), గోదాములతో కూడిన మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తున్నాం. పంటల నమోదు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం’ అని ఆమె వివరించారు. సేంద్రియ పాలసీకి టెక్నికల్ పార్టనర్గా ఉంటాం రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు త్వరలో ప్రత్యేక పాలసీని తీసుకొస్తున్నామని పూనం మాలకొండయ్య చెప్పారు. ఆర్గానిక్ సర్టిఫికేషన్ తీసుకొస్తున్నామని, ఇందుకోసం సాంకేతిక సహకారం అందించాలని కోరారు. ఎఫ్ఏవో కంట్రీ డైరెక్టర్ షిచిరీ మాట్లాడుతూ తప్పకుండా సాంకేతిక సహకారం అందిస్తామని చెప్పారు. టెక్నికల్ పార్టనర్గా కూడా ఉంటామని తెలిపారు. ఆర్థికంగా కూడా చేయూత ఇస్తామన్నారు. ఆర్బీకేల ఏర్పాటు, పనితీరు కోసం ఐక్యరాజ్యసమితికి కూడా నివేదిస్తామని చెప్పారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్ మాట్లాడుతూ ఆర్బీకేల ప్రయోగం మంచిదేనన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. దీనిపై జాతీయస్థాయిలో అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై కేంద్రానికి నివేదిక ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీడ్స్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గెడ్డం శేఖర్బాబు, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ ఆర్.అమరేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో నీతిఆయోగ్ సీఈవో
సాక్షి, న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఢిల్లీ మోతీబాగ్లోని తన నివాస ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా అమితాబ్కాంత్ ఆదివారం మొక్కలు నాటారు. అనంతరం నీతిఆయోగ్ సీఈవోకు వృక్ష వేదం పుస్తకాన్ని సంతోష్ బహూకరించారు. పుస్తక వివరాలతో పాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే మరో ముగ్గురిని ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్కి నామినేట్ చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత పాల్గొన్నారు. వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో.. సాక్షి, హైదరాబాద్: గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ‘ఊరిఊరికో జమ్మిచెట్టు.. గుడిగుడికో జమ్మిచెట్టు’ నినాదంతో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా ఆదివారమిక్కడ జమ్మి మొక్కలను పంపిణీ చేశారు. -
అర్బన్ ప్లానింగ్ బలోపేతం కావాలి: నీతిఆయోగ్
సాక్షి, న్యూఢిల్లీ: అర్బన్ ప్లానింగ్ సామర్థ్యం పెంపునకు కీలక సంస్కరణలు అవసరమని నీతిఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది. ‘అర్బన్ ప్లానింగ్ సామర్థ్యంలో సంస్కరణలు’ పేరుతో రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్కుమార్, సీఈవో అమితాబ్ కాంత్, ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ కె.రాజేశ్వర్ రావు గురువారం ఇక్కడ విడుదల చేశారు. 9 నెలల పాటు సంబంధిత మంత్రిత్వ శాఖలు, పట్టణ ప్రణాళిక, ప్రాంతీయ ప్రణాళికల నిపుణులతో చర్చించి నీతి ఆయోగ్ ఈ నివేదికను రూపొందించింది. ‘రానున్న కాలంలో పట్టణ భారతదేశం దేశ ఆర్థిక వృద్ధికి శక్తిని ఇస్తుంది. పట్టణ ప్రణాళిక సహా పట్టణ సవాళ్లు అధిగమించేందుకు అత్యున్నత విధానాలపై శ్రద్ధ అవసరం. పట్టణ ప్రణాళిక సామర్థ్యంలో ఉన్న అంతరాలను పూడ్చాల్సిన అవసరం ఉంది. లేదంటే వేగవంతమైన, సుస్థిరమైన, సమానమైన వృద్ధికి గల భారీ అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది..’ అని డాక్టర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ‘ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ఉమ్మడి కృషితో దేశంలోని నగరాలు మరింత నివాసయోగ్యంగా, సుస్థిర నగరాలుగా మారుతాయి..’ అని సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. దేశంలోని 52 శాతం నగరాలకు మాస్టర్ ప్లాన్ లేదని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 3,945 టౌన్ ప్లానర్ పోస్టులకు గాను 42 శాతం ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. దేశంలో 12 వేలకు పైగా టౌన్ ప్లానర్ పోస్టులు అవసరమని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రాల టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ విభాగాల్లో సగటున నగరానికి ఒక ప్లానర్ కూడా లేరని నివేదిక పేర్కొంది. నివేదిక సిఫారసులు ► ఆరోగ్యకరమైన 500 నగరాలు: 2030 నాటికి ప్రతి నగరం అందరికీ ఆరోగ్యవంతమైన నగరం కావాలని ఆకాంక్షించాలి. ఈ దిశగా 500 హెల్తీ సిటీస్ ప్రోగ్రామ్ను ఐదేళ్ల పాటు అమలు చేసేలా కేంద్ర ప్రాయోజిత పథకాన్ని అమలు చేయాలి. ప్రాధాన్యత గల నగరాలు, పట్టణాలను రాష్ట్రాలు, స్థానిక సంస్థలు గుర్తించాలి. ► ప్రతిపాదిత హెల్తీ సిటీస్ ప్రోగ్రామ్ ద్వారా అన్ని నగరాలు, పట్టణాల్లో భూమి లేదా ప్రణాళిక ప్రాంత సామర్థ్యాన్ని పెంచేందుకు శాస్త్రీయ ఆధారాల ప్రాతిపదికన అభివృద్ధి నియంత్రణ నిబంధనలు బలోపేతం చేయాలి. ► ప్రభుత్వ రంగంలో అర్బన్ ప్లానర్ల కొరత తీర్చేందుకు రాష్ట్రాలు టౌన్ ప్లానర్ల ఖాళీలను భర్తీ చేయాలి. అలాగే మరో 8,268 పోస్టులను లాటరల్ ఎంట్రీ పొజిషన్స్గా కనీసం మూడేళ్లు, గరిష్టంగా ఐదేళ్లు ఉండేలా మంజూరు చేయడం ద్వారా కొరతను తీర్చాలి. ► పట్టణం, దేశ ప్రణాళిక విభాగాలు టౌన్ ప్లానర్ల కొరత ఎదుర్కొంటున్నందున రాష్ట్రాలు నియామక నిబంధనల్లో సవరణలు చేసి టౌన్ ప్లానింగ్ ఉద్యోగాల్లో అర్హులైన అభ్యర్థులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ► పట్టణాలు ఎదుర్కొంటున్న సవాళ్లు పరిష్కరించేందుకు ప్రస్తుత పట్టణ ప్రణాళికా పాలనా నిర్మాణాన్ని రీ–ఇంజినీరింగ్ చేయాలి. ఇందుకు ఉన్నత స్థాయి కమిటీ రూపొందించాలి. ► పట్టణ, దేశ ప్రణాళిక చట్టాలను సమీక్షించి నవీకరించాలి. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో అపెక్స్ కమిటీ ఏర్పాటు చేయాలి. ► మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో వివిధ దశల్లో పౌరులను భాగస్వాములను చేయాలి. ► సాంకేతిక కన్సల్టెన్సీ సేవలు సహా పలు అంశాల్లో ప్రయివేటు రంగం పాత్రను బలోపేతం చేయాలి. ► కేంద్రీయ విశ్వ విద్యాలయాలు, సాంకేతిక విద్యా సంస్థలు దశల వారీగా ప్లానింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులు అందించాలి. ► కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధమైన సంస్థగా ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్’ను నెలకొల్పాలి. ‘నేషనల్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్’ పోర్టల్ను ఏర్పాటు చేయడం ద్వారా టౌన్ ప్లానర్స్ రిజి్రస్టేషన్ చేసుకునే వెసులుబాటు కలి్పంచాలి. -
మహిళలకు ఆర్థిక సేవలు మరింతగా విస్తరించాలి
న్యూఢిల్లీ: ఆర్థిక సేవల రంగం పరిధిలోకి పెద్ద సంఖ్యలో మహిళలను తీసుకురావడానికి మరింత సమ్మిళిత వ్యవస్థ అవసరమమని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. మహిళలు సులభతరంగా ఆర్థిక సేవలు పొందేందుకు డిజిటల్ సాధనాలు, వినూత్న పథకాలు వంటివి తోడ్పడగలవని ఆయన తెలిపారు. భారత్లోని మహిళలకు ఆర్థిక తోడ్పాటులో జన్ ధన్ పథకం ప్రాధాన్యం అంశంపై రూపొందిన నివేదిక ఆవిష్కరణ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. ఉమెన్స్ వరల్డ్ బ్యాంకింగ్, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా కలిసి దీన్ని రూపొందించాయి. మహిళా కరెస్పాండెంట్స్ నియామకం వంటి వినూత్న విధానాలతో బ్యాంకింగ్, ఆర్థిక సర్వీసుల రంగం పరిధిలోకి మరింత మంది మహిళా కస్టమర్లను తీసుకువచ్చేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులకు అవకాశాలు ఉన్నాయని కాంత్ చెప్పారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్ర ప్రతిపత్తి సాధించడానికి జన్ ధన్, ఆధార్, మొబైల్ (జేఏఎం) ఊతంతో, 40 కోట్ల మంది ప్రజలు అధికారికంగా ఆర్థిక సేవల పరిధిలోకి వచ్చారని పేర్కొన్నారు. మరోవైపు, మహిళలకు ఆర్థిక సేవలను మరింత చేరువ చేసేందుకు జన్ ధన్ ప్లస్ విధానాన్ని పాటించవచ్చని నివేదిక సూచించింది. దీని ప్రకారం నాలుగు నెలల పాటు జన్ ధన్ ఖాతాలో రూ. 500 డిపాజిట్ చేస్తే.. ప్రోత్సాహకంగా రూ. 10,000 మేర రుణం/ఓవర్డ్రాఫ్ట్ ఇవ్వొచ్చని పేర్కొంది. 2020 ఫిబ్రవరి–2020 ఆగస్టు మధ్యకాలంలో 101 బీవోబీ శాఖల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయగా 50,000 మంది పురుషులు, మహిళ కస్టమర్లు జన్ ధన్ ప్లస్ ఖాతాలు తీసుకున్నట్లు వివరించింది. -
నీతి ఆయోగ్ సీఈఓకు నిరసన సెగ
సాక్షి,విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్ ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనకు దిగారు. గురువారం నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ బస చేసిన హిల్టాప్ గెస్ట్హౌస్ వద్ద కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్యర్యంలో ఈ పోరాటాన్ని చేపట్టారు. ‘సేవ్ వైజాగ్ స్టీల్’ అంటూ నినదించారు. నీతి ఆయోగ్ సీఈఓ గో బ్యాక్ అనే నినాదాలతో హోరెత్తించారు. సీఈఓ అమితాబ్ కాంత్ గురువారం మెడ్టెక్ జోన్లో పర్యటించనున్నారు. చదవండి: Afghanistan: ఆమె భయపడినంతా అయింది! -
ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు కేంద్రం శుభవార్త!
ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు కేంద్రం శుభవార్త అందించింది. ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ వాహన రంగం కోసం అంతే వేగంగా మౌలిక సదుపాయాలను కల్పించడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం విధి విధానాలు గల ఒక హ్యాండ్ బుక్ ను నీతి ఆయోగ్ విడుదల చేసింది. ఈ హ్యాండ్ బుక్ ను నీతి ఆయోగ్, విద్యుత్ మంత్రిత్వ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ, వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ ఇండియా కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసింది. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ.. "భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అనేక మంది పోటీదారులు ఛార్జింగ్ మౌలిక సదుపాయాల మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. ఈ హ్యాండ్ బుక్ ప్రభుత్వ & ప్రైవేట్ భాగస్వాములతో కలిసి ఈవి ఛార్జింగ్ నెట్ వర్క్ లను ఏర్పాటు చేయడంలో కలిసి పనిచేయడానికి సహకరిస్తుంది. ఈవి ఛార్జింగ్ నెట్ వర్క్ లను అమలు చేయడంలో వివిధ స్థానిక అధికారులు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ హ్యాండ్ బుక్ పరిష్కరిస్తుంది" అని అన్నారు. ఈవి ఛార్జింగ్ సౌకర్యాలను సులభతరం చేయడానికి ప్రతి 25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఈవిలకు ఛార్జింగ్ అందించడం వల్ల డిస్కమ్లపై కొత్త రకం పవర్ డిమాండ్ ఏర్పడుతుంది. ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కొరకు అంతరాయం లేని పవర్ సప్లైని అందించడానికి ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ల సామర్ధ్యం పెంచేలా ఈ పుస్తకంలో మార్గానిర్దేశం చేసినట్లు కేంద్రం పేర్కొంది. -
ఆరోగ్య రంగంలో అపార అవకాశాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆరోగ్య రంగంలో పెట్టుబడులకు దేశవ్యాప్తంగా అనుకూల పరిస్థితులున్నాయని, ఇందులో ఏపీలోని మెడ్టెక్ జోన్ కూడా ఉందని నీతి ఆయోగ్ తెలిపింది. ఆసుపత్రులు, వైద్య పరికరాలు, వైద్య బీమా, టెలీమెడిసిన్ తదితర అంశాల్లో పెట్టుబడుల అవకాశాలపై రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్, సీఈవో అమితాబ్కాంత్, అదనపు కార్యదర్శి డాక్టర్ రాకేశ్ సర్వాల్లు మంగళవారం విడుదల చేశారు. మెడ్టెక్ జోన్ను వైద్య పరికరాల తయారీ కేంద్రంగా నీతి ఆయోగ్ ప్రస్తావించింది. కరోనా మహమ్మారి చెలరేగిన సమయంలో 15,000 వెంటిలేటర్లు, 10 మిలియన్ల డయాగ్నస్టిక్ కిట్లు, ఐదు లక్షల ఎన్–95 మాస్కులు, 2 లక్షల పీపీఈ కిట్లు ఉత్పత్తైనట్లు తెలిపింది. ‘క్రిటికల్ కాంపొనెంట్లు తయారీ చేసే సంస్థలు దేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉన్నందున ఈ రంగంలో పెట్టుబడులకు మెడ్టెక్ జోన్ అనుకూలం’’ అని నివేదికలో పేర్కొంది. కోవిడ్ సంక్షోభం విసిరిన సవాలు అనేక అవకాశాలకు దారితీయటం వల్ల ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నట్లు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. నివేదికలో ఇతర అంశాలివీ.. ఆరోగ్యంతోపాటు ఉపాధి.. భారత్లో ఆరోగ్య రక్షణ రంగం 2016 నుంచి ఏటా 22% చొప్పున పెరుగుతూ వస్తోంది. ఇది 2022లో 372 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. 2015లో ఆరోగ్య రంగం ప్రత్యక్షంగా 4.7 మిలియన్ల మందికి ఉపాధి కల్పించగా 2022 నాటికి 7.5 మిలియన్లకు పెరుగుతుందని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) అంచనా వేసింది. ఆరోగ్య రంగం ఆదాయపరంగా, ఉద్యోగాలపరంగా అతిపెద్ద రంగాలలో ఒకటిగా మారింది. జీవనశైలి వ్యాధుల పెరుగుదల, ప్రభుత్వ –ప్రైవేటు భాగస్వామ్యం, డిజిటల్ టెక్నాలజీ వినియోగం వైద్య రంగం ఎదుగుదలకు కారణం. చికిత్స కోసం విదేశీయుల రాక.. మెడికల్ వీసాతో 2017లో విదేశాల నుంచి 4,95,056 మంది వస్తే 2019లో 6,97,000 మంది భారత్కు వచ్చారు. అఫ్గానిస్థాన్, పాకిస్తాన్, ఒమన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, నైజీరియా, కెన్యా, ఇరాక్ నుంచి ఎక్కువగా వస్తున్నారు. గుండె, ఆర్థోపెడిక్, అవయవాల మార్పిడి, న్యూరో, ఆంకాలజీ, బేరియాట్రిక్స్ తదితర చికిత్సల కోసం ఎక్కువ మంది విదేశీయులు వస్తున్నారు. అధునాతన వైద్య విధానాలతోపాటు ఆయుర్వేదం, యోగా ఇతర సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. -
Coal Block Auction: వేలానికి 67 బొగ్గు గనులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 67 బొగ్గు బ్లాకులను (గనులు/నిక్షేపాలు) విక్రయానికి పెట్టింది. రెండో దశ వాణిజ్య బొగ్గు మైనింగ్ వేలాన్ని గురువారం ప్రారంభించి.. ఆత్మనిర్భర్ భారత్ దిశగా వేసిన అడుగుగా అభివర్ణించింది. 2014లో వాణిజ్య ప్రాతిపదికన బొగ్గు గనులను ప్రారంభించిన తర్వాత ఒక విడతలో అత్యధిక బ్లాక్లను వేలానికి ఉంచడం ఇదే ప్రథమం. వేలాన్ని బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, బొగ్గు శాఖ సెక్రటరీ అనిల్ కుమార్ జైన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం విక్రయించనున్న 67 గనుల్లో 23 కోల్మైన్స్ చట్టం కింద, 44 మైన్స్ అండ్ మినరల్స్ చట్టం పరిధి కింద ఉన్నాయి. కోకింగ్, నాన్కోకింగ్ కలసి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్ర పరిధిలో ఈ గనులు విస్తరించి ఉన్నట్టు మంత్రి వెల్లడించారు. అపారమైన బొగ్గు నిల్వలను వినియోగించుకునేందుకు పెట్టుబడిదారులు ముందుకు రావాలని, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడమేకాక దేశాభివృద్ధికి పాటుపడాలని ప్రహ్లాద్ జోషి కోరారు. వాణిజ్య బొగ్గు మైనింగ్ ద్వారా కొత్త పెట్టుబడులు వస్తాయని, ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని చెప్పారు. బొగ్గు నిల్వలు ఉన్న రాష్ట్రాల్లో సామాజిక-ఆర్థిక అభివృద్ధి మేరుగుపడుతుందని అని అన్నారు. బొగ్గు రంగంలో గత విజయాలను పరిశీలించాక, భవిష్యత్తులో వేలం నిర్వహించడానికి ప్రభుత్వం ‘రోలింగ్ యాక్షన్’ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించినట్టు మంత్రి ప్రకటించారు. చదవండి: ఈ బ్యాంకు పాస్బుక్, చెక్బుక్లు ఏప్రిల్ 1 నుంచి చెల్లవు -
రిటైల్ 4.0తో కోటికి పైగా కొత్త కొలువులు
న్యూఢిల్లీ: రిటైల్ రంగానికి సంబంధించి ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాలు రెండూ కలిస్తే గణనీయంగా కొత్త కొలువులు వచ్చేందుకు, ఎగుమతులనూ పెంచుకునేందుకు అవకాశం లభించనుంది. కన్సల్టింగ్ సంస్థ టెక్నోపాక్తో కలిసి దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు ఉన్నాయి. రిటైల్ 4.0 పేరిట రూపొందించిన ఈ నివేదిక ప్రకారం ఆన్లైన్ + ఆఫ్లైన్ విధానంతో కొత్తగా 1.2 కోట్ల మేర కొత్త కొలువులు రాగలవు. అలాగే రిటైల్ ఎగుమతులు 125 బిలియన్ డాలర్ల దాకా పెరగగలవని అంచనా. గడిచిన దశాబ్దకాలంలో భారత రిటైల్ మార్కెట్ మూడు రెట్లు వృద్ధి చెందింది. 2019–20లో భారత స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో రిటైల్ రంగం వాటా 10% దాకా ఉండగా, 3.5 కోట్ల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ‘కోవిడ్–19 అనేది ఒక అగ్నిపరీక్షలాంటిది. డిజిటల్ మాధ్యమాన్ని అందిపుచ్చుకో వడం, వేగవంతంగా ఆన్లైన్ వైపు మళ్లడం ద్వారా దేశీ రిటైల్ రంగం ఈ సంక్షోభం నుంచి మెరుగ్గానే బైటపడగలిగింది‘ అని నివేదిక పేర్కొంది. మార్కెట్ వృద్ధి..: నివేదిక ప్రకారం .. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి దేశీ రిటైల్ మార్కెట్ 1.5 లక్షల కోట్ల డాలర్లకు చేరనుంది. 2.5 కోట్ల మేర కొత్త కొలువులు రానున్నాయి. ఇందులో సగభాగం వాటా ఆఫ్లైన్+ఆఫ్లైన్ విధానానిదే ఉండనుంది. 1.2 కోట్ల కొలువులు, 125 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులు దీన్నుంచి రానున్నాయి. అలాగే, మొత్తం రిటైల్ రంగం కట్టే పన్నుల్లో ఈ విభాగం వాటా 37 శాతం దాకా ఉండనుంది. సాంకేతికత ఊతం..: రాబోయే రోజుల్లో రిటైల్ రంగం వృద్ధి చెందడంలో టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుందని నివేదిక ఆవిష్కరణ సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. దేశీయంగా రిటైల్ వ్యాపారానికి అనువైన పరిస్థితులు కల్పించేందుకు కేంద్రం జాతీయ రిటైల్ వాణిజ్య విధానాన్ని రూపొందించే ప్రయత్నాల్లో ఉందన్నారు. రిటైల్ 4.0 ప్రయోజనాలు పొం దేందుకు రిటైల్ వర్గాలతో పాటు విధాన నిర్ణేతలు, అనుబంధ పరిశ్రమలు కలిసి రావాలని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ అభిప్రాయపడ్డారు. -
త్వరలో అడ్వాన్స్డ్ బ్యాటరీ టెక్నాలజీ విధానం
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాలు, ఇతరత్రా అవసరాలకు ఉపయోగపడే అత్యాధునిక బ్యాటరీ సాంకేతికతలో స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం త్వరలో ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టనుందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహన రంగం వృద్ధికి దోహదపడే చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే సెల్స్ను దేశీయంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర విధానం అవసరమని మంత్రి చెప్పారు. ఆటోమొబైల్ తయారీతో పాటు విద్యుత్ వాహనాల విషయంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారత్ ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాల పరిశోధన, అభివృద్ధి అంశంపై జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గడ్కరీ ఈ విషయాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు కే విజయ రాఘవన్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఇంధనానికి సంబంధించిన పరిశోధనలు ఎవరికి వారు విడివిడిగా చేస్తున్నారు. వీటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి అంతా కలిసికట్టుగా పనిచేస్తే అత్యుత్తమ టెక్నాలజీలను అభివృద్ధి చేయొచ్చు. దీనిపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నాం. ఆయా టెక్నాలజీల లాభదాయకతపై కూడా దృష్టి పెడతాం. ఇందుకోసం ప్రత్యేక విధానం అవసరం‘ అని మంత్రి చెప్పారు. -
గూగుల్ పేకు మరో ఝలక్
సాక్షి, న్యూఢిల్లీ: వరుసగా రెండో నెలలో కూడా పేమెంట్ యాప్ ఫోన్పే టాప్లో నిలిచింది. ఫ్లిప్కార్ట్ మద్దతున్న ఫోన్పే మళ్లీ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యుపీఐ) చార్టులో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. తద్వారా వాల్మార్ట్కు చెందిన ఈ పేమెంట్ యాప్ గూగుల్ పేని అధిగమించి, టాప్ యూపీఐ యాప్గా ఫోన్పే నిలిచింది. జనవరిలో మొత్తం యుపీఐ లావాదేవీల్లో 41శాతం వాటాతో 968.72 మిలియన్ల లావాదేవీల వాల్యూమ్తో ఉన్న ఫోన్పే వరుసగా రెండవ నెలలో పరంపరను కొన సాగించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం ఫోన్పే లావాదేవీలు 7 శాతం పెరిగాయి, ట్రాన్సాక్షన్స్ విలువ జనవరిలో 5 శాతం పెరిగింది. ఫోన్పే తరువాత రూ .1.71 లక్షల కోట్ల విలువైన 853.53 మిలియన్ లావాదేవీలతో గూగుల్ పే రెండవ స్థానంలో ఉంది. 33,910 కోట్ల రూపాయల విలువైన 281.18 మిలియన్ లావాదేవీలను రికార్డు చేసిన పేటీఎం మూడో స్థానంలో నిలిచింది. అమెజాన్ పే, భీమ్, వాట్సాప్ పే లావాదేవీల విలువ వరుసగా రూ .4,004 కోట్లు, రూ .7,463 కోట్లు, రూ .36 కోట్లుగా ఉన్నాయి. జనవరిలో యూపీఐ ద్వారా మొత్తం రూ .4.2 లక్షల కోట్ల 2.3 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయని, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ గతవారం ట్విటర్లో వెల్లడించారు. ఈ ఘనతను ఇది అసాధారణమైన ఘనత అని పేర్కొన్నారు. నెలకు ఒక బిలియన్ లావాదేవీలను దాటడానికి యూపీఐకి 3 సంవత్సరాలు పట్టిందని, అయితే ఆ తరువాతి బిలియన్ టార్గెట్ను ఏడాదిలోపే సాధించామన్నారు. లావాదేవీలు 76.5 శాతం పెరుగుదలను నమోదు చేయగా, లావాదేవీల విలువ దాదాపు 100 శాతం పెరిగిందని ట్వీట్లో పేర్కొన్నారు. కాగా డిసెంబరులో, ఫోన్పే 1.82 లక్షల కోట్ల రూపాయల విలువైన 902 మిలియన్ లావాదేవీలతో ఫోన్పే టాప్ ప్లేస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. గూగుల్ పే 854 మిలియన్ లావాదేవీలను 1.76 లక్షల కోట్ల రూపాయలను నమోదు చేసింది. Phenomenal ! UPI recorded 2.3 billion transactions worth ₹ 4.3 trillion in Jan 2021. On a YOY basis, UPIs transaction value jumped 76.5 % while transaction value jumped nearly 100%. Took UPI 3 years to cross 1 billion transactions a month. Next billion came in less than a year.— Amitabh Kant (@amitabhk87) February 3, 2021 -
ఆపిల్, గూగుల్ కంపెనీలకు భారీ షాక్
న్యూఢిల్లీ: ఆపిల్, గూగుల్, డ్రాప్బాక్స్ వంటి క్లౌడ్ స్టోరేజ్ కంపెనీలకు నీతి ఆయోగ్ భారీ షాక్ ఇచ్చింది. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా డీజీబాక్స్(Digi Boxx)అనే స్వదేశీ క్లౌడ్ స్టోరేజ్, మేనేజ్మెంట్ ప్లాట్ఫాంను ప్రారంభించింది. దీనికోసం డీజీబాక్స్ బృందంతో కలిసి పనిచేసినట్లు నీతి ఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్ తెలిపారు. ఇందులో రా ఫైల్స్, ఫోటోలు, ఈ-డాక్యుమెంట్స్ వంట వాటిని నిల్వచేసుకోవచ్చు. ఈ సేవలు వెబ్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని త్వరలో ఐఓఎస్ వెర్షన్ యూజర్లకు కూడా అందుబాటులో ఉంటుందని బృందం తెలిపింది. డీజీబాక్స్ లో ఆన్-డిమాండ్, రియల్ టైమ్ యాక్సెస్, ఎడిటింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా ఇందులో ఫైల్స్ లేదా డేటాని ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు మీ మొబైల్ లేదా లాప్టాప్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న మెటాడేటా ఫీచర్ ఆధారంగా డేటాను సులభంగా సెర్చ్ చేసుకోవచ్చు. ఇందులో వేర్వేరు ఫార్మాట్, సైజులలో ఉన్న డాక్యుమెంట్స్ ఒకేసారి అప్లోడ్ చేయవచ్చు. ఇందులో ఉన్న ఫిల్టర్స్ ఫీచర్ ద్వారా ఫైల్స్ను వేర్వేరు విభాగాలుగా విభజించడం, లేబుల్స్ క్రియేట్ చేయడం, ముఖ్యమైన ఫైల్స్ను టాప్లో ఉండేటట్లు కూడా చేసుకోవచ్చు. డీజీబాక్స్ ఎలా ఉపయోగించాలి? డీజీబాక్స్ క్లౌడ్ స్టోరేజ్ సేవలను ఉపయోగించడానికి వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఖాతా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీ పేరు, ఇమెయిల్ చిరునామా, ఫోన్ నంబర్, నివాస చిరునామా వంటి వాటిని నమోదు చేయాల్సి ఉంటుంది. తరువాత డీజీబాక్స్ వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మీ స్వంత ఫైల్లను సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ ఫైల్స్ ను ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. ఫైల్లను వెంటనే షేర్ చేయడానికి మీ మెయిల్, రిసీవర్ యొక్క మెయిల్ అందించాల్సి ఉంటుంది. ఇప్పుడు 2జీబీ ఫైల్స్ వరకు షేర్ చేయవచ్చు. ఈ ఫైల్లు 45 రోజుల పాటు డిజిబాక్స్లో ఉంటాయి. డీజీబాక్స్ ధర ఈ సేవలు పొందటం కోసం డీజీబాక్స్ యొక్క నెల, వార్షిక ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. దీన్ని ఉచితంగా పొందడానికి కూడా 20జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఎస్ఎస్ఎల్ సెక్యూరిటీ, జీమెయిల్ ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లు కూడా లభించనున్నాయి. ఫ్రీ యూజర్లు 2జీబీ సైజు ఉన్న ఫైల్స్ ఒకేసారి షేర్ చేసుకోవచ్చు. అదే నెలకు రూ.30 రూపాయలు చెల్లిస్తే 5టీబీ స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. వీరు 10 జీబీ సైజ్ ఉన్న ఫైల్స్ కూడా ఒకేసారి అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే చిన్న, మధ్యతరహా వ్యాపారుల కోసం నెలకు రూ.999 ప్లాన్ ను అందుబాటులో ఉంచింది. ఈ ఫైల్స్ ను 500 వినియోగదారులు వాడుకోవచ్చు. ఇందులో 50టీబీ స్పేస్ లభిస్తుంది. వీరు కూడా ఒఒకేసారి 10 జీబీ సైజ్ ఉన్న ఫైల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. -
పర్యాటక రంగం పరుగు!
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థని తిరిగి గాడిలో పెట్టడానికి కేంద్రం మరో ప్యాకేజీ ప్రకటించే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కరోనా ప్రభావం పర్యాటకం, రవాణా, ఆతిథ్య రంగాలపై తీవ్రంగా ఉంది. ఇప్పటికీ హోటల్స్లో తినాలన్నా, వేరే ఊళ్లకి వెళ్లాలన్నా ప్రజలు భయపడే పరిస్థితులు ఉన్నాయి. అందుకే పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించడానికి కేంద్రం ఒక ఆర్థిక ప్యాకేజీని రూపొందించడానికి కసరత్తు చేస్తోందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ఒక జాతీయ చానెల్కు వెల్లడించారు. ఈ ప్యాకేజీతో పర్యాటక రంగం పరుగులు పెట్టడమే కాకుండా పర్యాటకం, రవాణా, ఆతిథ్య రంగాల్లో ఉద్యోగావకాశాలు కూడా వస్తాయి. అంతే కాకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల బలోపేతంపై కూడా కేంద్రం దృష్టి సారిస్తున్నట్టుగా అమితాబ్ కాంత్ వెల్లడించారు. అయితే ఈ ప్యాకేజీని ప్రకటించడానికి మరో రెండు మూడు నెలలు పడుతుందని ఆయన వివరించారు. ఈ పండుగ సీజన్లో వచ్చే ఆదాయ మార్గాలపై కేంద్రం దృష్టి సారించింది. పౌర విమానయానం, రైల్వేల నుంచి ఆదాయం పెరిగేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. సెప్టెంబర్లో ప్రజల కొనుగోలు శక్తి సూచి 56.8 పాయింట్లకు చేరుకుందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే మధ్య తరగతి ప్రజలు దసరా, దీపావళి సీజన్లో ఎంత ఖర్చు పెడతారో చూడాల్సి ఉందని అమితాబ్ కాంత్ చెప్పారు. -
త్వరలో విశాఖలో 'డిజిటల్ కాన్క్లేవ్': మేకపాటి
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అంగీకరించిందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. బీహెచ్ఈఎల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లే విధంగా ఒక కేంద్ర బృందం ఏర్పాటు చేయనున్నట్లు సీఎండీ సింఘాల్ చెప్పారని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. ఈ బృందాన్ని నడిపించేలా నోడల్ అధికారి నియమించనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో విశాఖలో 'డిజిటల్ కాన్క్లేవ్' ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని తెలిపారు. బీహెచ్ఈఎల్ సీఎండీ, నీతి ఆయోగ్ సీఈవో తో సమావేశమైన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆర్డీవో ఛైర్మన్, నేవీ అధ్యక్షుడు, వైమానికదళ ప్రధాన అధికారులతోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ పారిశ్రామిక ప్రగతిపై మంత్రి మేకపాటి ఆలోచనలకు ప్రశంసలు అందాయి. (సీఎం జగన్ విజన్కు అభినందనలు) మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలకు కేంద్రంలోని ప్రముఖులు నీరాజనం పలుకుతున్నారని మంత్రి పేర్కొన్నారు. దొనకొండలో 'సోనిక్ సిస్టమ్' ఏర్పాటుకు సానుకూలత చూపారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అసలైన పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది ఇప్పుడేనన్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ నలిన్ సింఘాల్తో మంత్రి మేకపాటి సమావేశమయ్యారు. ఏపీ పారిశ్రామిక ప్రగతిపై మంత్రి మేకపాటికి గల ఆలోచనలను బీహెచ్ఎల్ సీఎండీ ప్రశంసించారు. విశాఖలో 'డిజిటల్ కాన్క్లేవ్' ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని తెలిపారు. (‘ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్’) ఐటీఐ కాలేజీలకు తోడ్పాటు పాఠశాల విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బీహెచ్ఈఎల్ సంయుక్తంగా నైపుణ్యానికి సంబంధించిన సర్టిఫికెట్లు అందించే కార్యక్రమంలో భాగస్వామ్యమవ్వాలని మంత్రి గౌతమ్ రెడ్డి కోరారు. మంత్రి మేకపాటి ఇతర ప్రతిపాదనల పట్ల కూడా బీహెచ్ఈఎల్ సీఎండీ నలిన్ సింఘాల్ సానుకూలంగా స్పందించారు. ఐటీఐ కాలేజీలకు తోడ్పాటు, నైపుణ్య శిక్షణలో భాగస్వామ్యమవుతామని మంత్రికి తెలిపారు. బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో ఎంట్రిప్యూనర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు. అనంతరం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాలలో ప్రతి జిల్లాకు ఒక సోలార్ పానల్స్ ఏర్పాటు మంత్రి మేకపాటి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఎస్ఎస్ డీసీ ఎండీ అర్జా శ్రీకాంత్ పాల్గొన్నారు. (ఏపీలో కొత్తగా 9999 కరోనా కేసులు) నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్లో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. అక్టోబర్ నుంచి ఎప్పుడైనా విశాఖలో 'డిజిటల్ సదస్సు' నిర్వహించేందుకు అమితాబ్ కాంత్ సుముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన, కీలక సంస్కరణలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలను అమితాబ్ కాంత్ మెచ్చుకున్నారని పేర్కొన్నారు. కరోనా విపత్తు సమయంలో దేశంలోనే తొలుత స్పందించి ఎమ్ఎస్ఎమ్ఈలకు ఆర్థిక అండగా నిలిచిన ఏకైక రాష్ట్రం ఏపీ అని నీతి ఆయోగ్ సీఈవో ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగులలో ఏపీ మొదటి స్థానం కైవసం చేసుకోవడాన్ని ఆయన అభినందించారని మంత్రి పేర్కొన్నారు. కరోనా విపత్తులో ప్రభుత్వ పాలన బాగుంది ఏపీ పారిశ్రామిక విధానం గురించి ప్రస్తావించిన అమితాబ్ కాంత్. అందరి దృష్టి ఆకర్షించిన ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ కాపీ కావాలని మంత్రిని అడిగారు. ఒకసారి పాలసీ కాపీ చదవుతానని నీతి ఆయోగ్ సీఈవో అన్నట్లు మంత్రి తెలిపారు. కరోనా విపత్తులో, ఆర్థిక లోటులో ప్రభుత్వ పాలన బాగుందన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించినపుడే భారతదేశ అభివృద్ధి జరిగినట్లని మంత్రి మేకపాటితో అమితాబ్ కాంత్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ గురించి అమితాబ్ కాంత్ ఆరా తీశారు . సీఎం జగన్ నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్ల స్థాయిలో మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దుతున్న తీరును ఫోటోల ద్వారా అమితాబ్ కాంత్ మంత్రి మేకపాటి వివరించారు. ఈశాన్య భారత్ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పోర్టుల పాత్ర కీలకమని, ఏపీలో జాతీయ స్థాయి పోర్టుగా భావనపాడు పోర్టును తీర్చిదిద్దేందుకు కేంద్రం సహకారం ఉంటుందని నీతి ఆయోగ్ సీఈవో వెల్లడించారు. రాష్ట్రంలో త్వరలో అందుబాటులోకి రానున్న 30 నైపుణ్య కళాశాలలకు సహకారమందించాలని మంత్రి మేకపాటి కోరారు. వ్యవసాయం, పరిశ్రమలే రాష్ట్ర రెవెన్యూకి కీలకమని, అందుకు కేంద్ర సహకారమందించాలని మంత్రి కోరగా నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సానుకూలంగా స్పందించారు. పాఠశాల విద్య పూర్తయ్యే స్థాయి నుంచే నైపుణ్యం సాధించే విధంగా నైపుణ్య మానవవనరులుగా తీర్చిదిద్దేందుకు అన్ని రంగాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటయ్యే విధంగా చూడాలని నీతి ఆయోగ్ సీఈవోను ఏపీఎస్ఎస్డీసీ ఎండీ అర్జా శ్రీకాంత్ కోరారు. ఏపీ నుంచి 8-9 యూరప్ దేశాలకు అవసరమైన ఆహార ఉత్పత్తుల ఎగుమతులలో కీలకమైన విశాఖ పోర్టుకు మరింత ఎగుమతుల సామర్థ్యం పెంచేందుకు అనుమతులు, సహకారం కావాలని విశాఖ మెడ్ టెక్ జోన్ సీఈవో జితేంద్ర శర్మ నీతి ఆయోగ్ సీఈవోను కోరారు. ఏపీ ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. 'డిఫెన్స్'పై ప్రత్యేక దృష్టి డీఆర్డీవో, నావికా, వైమాణికదళ ప్రధాన అధికారులతో మంత్రి మేకపాటి భేటీ అయ్యారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గుండ్రా సతీష్ రెడ్డితో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రక్షణ రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు. ఏపీ కొత్త పారిశ్రామిక విధానంలో 'డిఫెన్స్'పై ప్రత్యేకంగా దృష్టి సారించామని ఆ రంగంలో అభివృద్ధికి డీఆర్డీవో సహకారం కావాలని మంత్రి మేకపాటి కోరారు. నౌకదళాల అధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్తో మంత్రి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు. దొనకొండలో సోనిక్ (ధ్వని తరంగాలకు సంబంధించిన) వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి గౌతమ్ రెడ్డి కోరారు. ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు వద్ద యుద్ధాల సమయంలో ఉపయోగపడే 'నేవీ బేస్' స్థాపించాలని మంత్రి మేకపాటి కోరారు. యుద్ధాలు జరిగే సమయంలో ఏవైనా విమానాలు, ఓడలు మరమ్మతులకు గురైనపుడు నేవీ ఆధ్వర్యంలో నావల్ బేస్ ద్వారా విమానాలకు ఓడలలో తాత్కాలికంగా ఆశ్రయం పొందే అవకాశముంటుందన్నారు. అనంతరం, వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బి.ఎస్.ధనోవాను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కలిశారు. రాష్ట్రంలోని రక్షణ వ్యవస్థ, అభివృద్ధికి సహకారం కోసం మంత్రి మేకపాటి చర్చించారు. ఈ సమావేశం అనంతరం మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని మంత్రి మేకపాటి హైదరాబాద్ చేరారు. -
ప్రాంతీయ భాషల బాట పట్టండి
న్యూఢిల్లీ: పెద్ద సంఖ్యలో వినియోగదారులకు మరింత చేరువ కావాలంటే కేవలం ఇంగ్లిష్లో మాత్రమే సర్వీసులు అందిస్తే కుదరదని, ప్రాంతీయ భాషల వైపు మళ్లాలని ఫిన్టెక్ సంస్థలకు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సూచించారు. అనేక భాషలు, యాసలు ఉన్న భారత్ వైవిధ్యాన్ని పట్టించుకోకపోతే చాలా మందికి చేరువ కాలేని రిస్కు ఉందని ఆయన పేర్కొన్నారు. ‘ఇంగ్లిష్ మర్చిపోండిక. ప్రాంతీయ భాషల బాట పట్టండి. ప్రస్తుతం అదొక్కటే మార్గం. వివిధ భాషల్లో స్థానికంగా సేవలు అందించడం ద్వారానే అందర్నీ ఆర్థిక సేవల పరిధిలోకి తీసుకురావడం సాధ్యపడుతుంది. ఫిన్టెక్ సంస్థలు అలా చేయకపోతే ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలకు ఊతం లేకుండా పోతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ వర్చువల్ సెమినార్లో పాల్గొన్న సందర్భంగా అమితాబ్ కాంత్ ఈ విషయాలు చెప్పారు. క్యాపిటల్ మార్కెట్ల విషయానికొస్తే మార్కెటింగ్ కార్యకలాపాలన్నీ కూడా పట్టణ ప్రాంతాల్లోనే ఉంటున్నాయని, దీంతో గ్రామీణ ప్రాంతాల వారికి వీటి గురించి తెలియకుండా పోతోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల వారు కూడా పాలుపంచుకుంటేనే వీటిలో ప్రజల భాగస్వామ్యం మరింతగా పెరుగుతుందన్నారు. అపార అవకాశాలు..: రాబోయే రోజుల్లో ఫిన్టెక్ కంపెనీలకు మరిన్ని వ్యాపార అవకాశాలు లభించగలవని కాంత్ చెప్పారు. కస్టమర్ల వివరాల సేకరణకు సంబంధించి కేవైసీ నిబంధనలను మరోసారి సమీక్షించాల్సిన అవసరం ఉందని, ఈ ప్రక్రియ వ్యయాలు మరింతగా తగ్గించాల్సి ఉందన్నారు. -
తయారీ, ఎగుమతి కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: కీలకమైన రంగాల్లో నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా భారత్ను అంతర్జాతీయ తయారీ, ఎగుమతి కేంద్రంగా మార్చేందుకు ప్యాకేజీ రూపకల్పన జరుగుతోందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వెల్లడించారు. ‘కరోనా వైరస్ అనంతరం భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు’ అనే అంశంపై ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) నిర్వహించిన ఆన్లైన్ సెషన్లో ఆయన మాట్లాడారు. హెల్త్కేర్, ఎడ్యుకేషన్, మొబిలిటీ, జీనోమిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, 5జీ, ఫిన్టెక్, తయారీ అన్నవి ప్రాధాన్య క్రమంలో వేగంగా విప్లవాత్మక సంస్కరణలు అమలు చేసే రంగాలుగా పేర్కొన్నారు. తయారీ రంగం ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమైనదని, చైనాలో సరఫరా పరంగా ఏర్పడిన ఇబ్బందులను అనుకూలంగా మలుచుకోవాలని భారత్ కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా 1,450 కంపెనీలను ప్రభుత్వం సంప్రదించిందని, భారత్లో వేగంగా ఇన్వెస్ట్ చేసేందుకు, ఇక్కడికి తరలివచ్చేందుకు వీలుగా వాటికి సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘భారత్ టెక్నాలజీని విదేశాల నుంచి అరువు తెచ్చు కోవాలి. చోరీ చేయాలి. చైనా ఇదే పని చేసింది. అందుకే తక్కువ ఖర్చుకే ఉత్పత్తి చేయగలుగుతోంది’’ అని అమితాబ్ కాంత్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. -
పర్యాటక రంగం.. 50 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: పర్యాటక రంగం 2022 నాటికి 50 బిలియన్ డాలర్ల (రూ.3.55 లక్షల కోట్లు) ఆదాయ లక్ష్యాన్ని సాధించాలని నీతి ఆయోగ్ అమితాబ్ కాంత్ సూచించారు. ఈ రంగానికి వృద్ధి అవకాశాలు, ఉపాధి కల్పన అవకాశాలు అపారంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సీఐఐ 15వ వార్షిక పర్యాటక సదస్సు ఢిల్లీలో గురువారం జరిగింది. దీనికి కాంత్ హాజరై మాట్లాడారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ ఉపాధి అవకాశాలు కల్పించే సామర్థ్యం పర్యాటకానికి ఉందన్నారు. ‘‘2018లో భారత పర్యాటక రంగం 28.6 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. దీన్ని 2022 నాటికి 50 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లే లక్ష్యాన్ని పెట్టుకోవాలి’’అని ఆయన పేర్కొన్నారు. -
రైళ్ల ప్రైవేటీకరణకు కమిటీ
న్యూఢిల్లీ: నిర్ణీత కాలపరిమితితో దేశంలోని 150 పాసింజర్ రైళ్లను ప్రైవేటీకరించేందుకు, 50 రైల్వే స్టేషన్లను ప్రైవేటు ఆపరేటర్లకు ఇచ్చేందుకు కేంద్రం మరో అడుగువేసింది. ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఈ విషయమై రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్కు ఇటీవల లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పాటుచేసే సాధికారిక యంత్రాంగం (కమిటీ) ఈ ప్రక్రియ అమలు తీరుని పర్యవేక్షిస్తుందని ఆయన ఆ లేఖలో తెలిపారు. వీకే యాదవ్, అమితాబ్లతోపాటు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి, గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఉంటారు. రైల్వే బోర్డు ఇంజనీరింగ్ సభ్యుడు, ట్రాఫిక్ రైల్వే బోర్డు సభ్యుడిని కూడా ఈ సాధికారిక యంత్రాంగంలో భాగం చేయాలని అమితాబ్ కాంత్ తెలిపారు. ‘ప్రపంచస్థాయి ప్రమాణాలకు దీటుగా తొలుత కనీసం 50 రైల్వేస్టేషన్లను నవీకరించాలి. అలాగే అంతర్జాతీయస్థాయి సదుపాయాలతో, ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో మొదటిదశలో 150 రైళ్లను నడపడానికి రైల్వే శాఖ ప్రైవేటు ఆపరేటర్లకు ఇప్పటికే అనుమతి ఇచ్చింది’ అని అమితాబ్కాంత్ పేర్కొన్నారు. బిడ్డింగ్ ప్రక్రియను ఆమోదించే అధికారం ఈ కమిటీకే ఉంటుంది. ‘ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరించడంతో వచ్చిన ఫలితాలను బేరీజు వేస్తే, సాధికారిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నాం’ అని ఆయన అన్నారు. -
హైదరాబాద్లో మైక్రాన్ డెవలప్మెంట్ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన సెమీకండక్టర్ల తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ తాజాగా హైదరాబాద్లో గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ (జీడీసీ)ని ఆవిష్కరించింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ శుక్రవారమిక్కడ దీన్ని ప్రారంభించారు. మైక్రాన్ వంటి దిగ్గజ సంస్థ హైదరాబాద్లో తమ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్లో రెండు ఎలక్ట్రానిక్స్ క్లస్టర్స్ ఉన్నాయని, ఈ విభాగంలో పెట్టుబడులకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయన్నారు. సెమీకండక్టర్స్ తయారీ యూనిట్ను కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. మరోవైపు, సుమారు 3,50,000 చ.అ. విస్తీర్ణంలో ఈ సెంటర్ ఏర్పాటు చేసినట్లు సంస్థ సీఈవో సంజయ్ మెహ్రోత్రా విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇటీవలే ప్రారంభించిన బెంగళూరు కార్యాలయంతో పాటు హైదరాబాద్ జీడీసీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య సుమారు 700 దాకా ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దీన్ని 2,000 దాకా పెంచుకోనున్నట్లు, ఇందులో ఎక్కువగా నియామకాలు హైదరాబాద్ కేంద్రంలోనే ఉండనున్నట్లు మెహ్రోత్రా వివరించారు. ప్రస్తుతం తమకు జపాన్, చైనా సహా ఆరు దేశాల్లో తయారీ కార్యకలాపాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. డేటా విప్లవంతో ఈ రంగంలో అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అమితాబ్ కాంత్ చెప్పారు. -
నేడు ఐఐటీ హైదరాబాద్ 8వ స్నాతకోత్సవం
సాక్షి, సంగారెడ్డి: జిల్లాకు తలమానికంగా ఉన్న హైదరాబాద్ ఐఐటీ దేశంలోనే ఎంతోమంది ఇంజనీరింగ్ విద్యార్థులను తయారుచేస్తోంది. సుమారుగా 11ఏళ్ల ప్రస్థానంలో 250 మంది విద్యార్థులను పీహెచ్డీలో గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దింది. ఈ ఐఐటీ ప్రాంగణం 8వ స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఈ నెల 10వ తేదీ శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు స్నాతకోత్సవం జరగనుంది. ఇందుకు ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేస్తున్నారు. స్నాతకోత్సవానికి సంబంధించి ప్రొఫెసర్లు, విద్యార్థులు, సిబ్బంది రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలో హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై హైదరాబాద్ ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ని 2008లో ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మంజూరైన ఈ ఐఐటీని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్.వైఎస్.రాజశేఖర్రెడ్డి జిల్లాకు కేటాయించారు. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఐఐటీలో ప్రారంభంలో కేవలం మూడు ఇంజనీరింగ్ కోర్సులను మాత్రమే ప్రవేశపెట్టారు. ప్రారంభ సంవత్సరంలో బీటెక్ సీఎస్ఈ, ఈఈ, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులు మాత్రమే ఉండేవి. వీటిలో 40 మంది విద్యార్థులకు ఒక కోర్సు చొప్పున 120 మంది విద్యార్థులకే ప్రవేశం ఉండేది. ఇంతితై.. వటుడింతై హైదరాబాద్ ఐఐటీ ప్రస్తుతం దేశంలోనే 8వ ర్యాంకులో ఉందంటే.. కేవలం దశాబ్ధ కాలంలోనే ఎంత ఎత్తుకు ఎదిగిందో ఊహించవచ్చు. దేశంలో మొత్తం 23 ఐఐటీలు ఉన్నాయి. నాడు 120 మంది విద్యార్థులు.. మూడు ఇంజనీరింగ్ కోర్సులతో ప్రారంభమైన ఈ ఇన్స్టిట్యూషన్లో ప్రస్తుతం 10 కోర్సులు (డిపార్ట్మెంట్స్)తో 2,900 మంది విద్యార్థులున్నారు. సీఎస్ఈ, ఈఈ, మెకానికల్ కోర్సులతో పాటు గా ప్రస్తుతం సివిల్, కెమికల్, మెటీరియల్ సైన్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, మాథమేటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఇంజనీరింగ్ సైన్స్ కోర్సులలో విద్యాబోధన జరుగుతున్నది. ఈ సంవత్సరం నుంచి బీటెక్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఎం టెక్లో క్లైమేట్ చేంజ్ (వాతావరణ మార్పు లు) అనే కోర్సులను ప్రవేశపెడుతున్నారు. టీచింగ్తో పాటు రీసెర్చ్కు ప్రాధాన్యం హైదరాబాద్ ఐఐటీలో కేవలం విద్యాబోధనకే కాకుండా రీసెర్స్ (పరిశోధన), ఇన్నోవేషన్స్ (కొత్త విషయాలను కనుక్కోవడం)కు ప్రాధాన్యత నిస్తున్నారు. కేవలం 120 మంది విద్యార్థులు.. 3 కోర్సులతో ప్రారంభమైన ఈ ఇన్స్టిట్యూట్లో ఈ విద్యాసంవత్సరంలో 2,900 మంది విద్యార్థులు.. 900 మంది పీహెచ్డీ విద్యార్థులు ఉన్నారంటే అనతికాలంలోనే ఎంత ఉన్నతస్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. టీచింగ్తో పాటు రీసెర్చ్ డెవలప్మెంట్కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. మరో మూడేళ్లలో 5 నుంచి 6 వేల మంది విద్యార్థులు.. ప్రస్తుతం 2,900 మంది ఉన్న ఈ ఐఐటీలో రానున్న మూడేళ్ల కాలంలో మొత్తం 5 నుంచి 6 వేల మంది వరకు ఉండే అవకాశం ఉంది. రెండో దశ భవన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇటీవల కేంద్ర బడ్జెట్లో కూడా రూ.90 కోట్లు కేటాయించారు. ఈ నిర్మాణాలను జపనీస్ సంస్థ ‘జైకా‘ చేపట్టింది. ఎల్అండ్టీ ఆధ్వర్యంలో ఈ పనులు కొనసాగుతున్నాయి. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తవుతాయి. దీంతో ప్రస్తుతం ఉన్న విద్యార్థులతో కలిపి 5 నుంచి 6 వేల మంది విద్యార్థులకు ఈ ప్రాంగణం విద్యతో పాటుగా ఆశ్రమం (అకామిడేషన్) కల్పించనుంది. ఒకేసారి సుమారుగా 800 మంది కూర్చోవడానికి గాను ఆడిటోరియం నిర్మిస్తున్నారు. మధ్యాహ్నం కార్యక్రమం.. హైదరాబాద్ ఐఐటీ 8వ స్నాతకోత్సవం శనివారం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ముఖ్య అతిథిగా రానున్నారు. పాస్అవుట్ విద్యార్థులతో పాటుగా ప్రతీ విద్యార్థి వెంట ఇద్దరిని అనుమతిస్తున్నారు. సుమారుగా 2వేల మంది ఈ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. ఈయనతో పాటుగా అతిథులుగా హైదరాబాద్ ఐఐటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ బీవీఆర్.మోహన్రెడ్డి, అఫిసియేటింగ్ (ఇంచార్జి) డైరెక్టర్ సీహెచ్.సుబ్రమణ్యన్ హాజరుకానున్నారు. మ ధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఈ స్నాతకోత్సవం జరుగుతుంది. ఈ ఐఐటీ నుంచి 560 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ శిక్షణ పూర్తిచేసుకొని పాస్అవుట్ అవుతున్నారు. వీరిలో 68 మంది పీహెచ్డీ స్కాలర్స్ ఉన్నారు. కొత్త ఆవిష్కరణలకు వేదిక దేశంలోని ఏ ఐఐటీకి కూడా తీసిపోని విధంగా హైదరాబాద్ ఐఐటీని కొత్త ఆవిష్కరణలకు వేదిక చేశాం. మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా ఈ ఐఐటీలో ప్రవేశం పొందుతున్నారు. టీచింగ్తో పాటుగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. దేశంలోని 23 ఐఐటీలలో ప్రస్తుతం 8వ ర్యాంకులో ఉంది. భవిష్యత్తులో హైదరాబాద్ ఐఐటీని దేశంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం. మరో ప్రత్యేకత ఏమిటంటే..ఈ ఇన్స్టిట్యూట్లో విభిన్న భాషలు, భిన్న సంస్కృతులు గల విద్యార్థులు ఉన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. ఫ్యాకల్టీకి కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. – సీహెచ్. సుబ్రహ్మణ్యన్, ఇన్చార్జి డైరెక్టర్, హైదరాబాద్ ఐఐటీ -
ఎన్పీఏల పరిష్కారంపై కొత్త నిబంధనలు!
ముంబై: మొండిబకాయిల పరిష్కారం విషయంలో కేంద్రం, బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లు కొత్త నిబంధనలను తీసుకువస్తాయని నీతిఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమితాబ్ కాంత్ బుధవారం ఇక్కడ వెల్లడించారు. రుణ పునఃచెల్లింపుల్లో ఒక్కరోజు ఆలస్యం అయిన కంపెనీలపైనా దివాలా ప్రక్రియను ప్రారంభించాలని, 180 రోజుల లోపు రుణ పరిష్కారం కాకపోతే, ఆ అకౌంట్ను నేషనల్ లా కంపెనీ ట్రిబ్యునల్కు నివేదించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గత ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన ఒక సర్క్యులర్ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమితాబ్ కాంత్ ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, మొండిబకాయిల సమస్య పరిష్కారానికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సాక్ ఎక్సే్చంజీల ప్రపంచ సమాఖ్య సదస్సులో పాల్గొన్న ఆయన పేరొన్న అంశాల్లో ముఖ్యమైనవి... ► కనీస ఆదాయ పథకాలపై ఇప్పుడు ప్రతిచోటా చర్చ జరుగుతోంది. అయితే ఇటువంటి పథకాల అమలుకు దేశం నిలకడగా అధిక వృద్ధి రేటును సాధించాల్సిన అవసరం ఉంది. ► దేశ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాల వృద్ధికి సకాలంలో రుణ పునఃచెల్లింపులు, మొండిబకాయిల సత్వర పరిష్కారం అవసరం. ► వృద్ధిలేకపోతే పునఃపంపకం ఎలా? మీరు అధిక వృద్ధి సాధించకపోతే, మిగులు ఉండదు. అలాంటప్పుడు కనీస ఆదాయం వంటి పథకాలకు నిధులు కష్టం. ప్రస్తుతం దేశం 7 శాతం వృద్ధి సాధిస్తోంది. కనీస ఆదాయం వంటి పథకాల అమలుకు కనీసం 9 నుంచి 10 శాతం వృద్ధి అవసరం. ► ప్రస్తుత స్థాయి నుంచి వృద్ధి పరుగుకు ఆర్థిక సంస్కరణలను మరింత ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ప్రత్యేకించి తయారీ రంగం వృద్ధికి కృషి చేయాలి. ఇది ఎగుమతులు భారీగా పెరగడానికి దోహదపడుతుంది. కంపెనీల మార్జిన్లు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలూ మెరుగుపడతాయి. ► దృష్టి సారించాల్సిన మరోరంగం వ్యవసాయం. సబ్సిడీలపై వ్యవసాయం పెరగదు. మార్కెట్ సంస్కరణల ద్వారానే ఇది సాధ్యం. -
కృత్రిమ మేథతో సమూల మార్పులు
దావోస్ : కృత్రిమ మేథ (ఏఐ)తో మానవ జీవితంలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో ఆయన మాట్లాడుతూ పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెనుప్రభావం చూపుతుందని తాము భావిస్తున్నామన్నారు. మెరుగైన డేటా ఇవ్వగలగడం, వైద్యులకు నివేదికలు, చిత్రాలు పంపడం, విద్యలో వెనుకబడిన విద్యార్ధులను పర్యవేక్షించడం వంటి ఎన్నో ఊహించని మార్పులు ఏఐతో అనుభవంలోకి వస్తాయన్నారు. కృత్రిమ మేథను పౌరుల జీవితం మెరుగయ్యేందుకు శాస్త్రీయ కోణంలో అమలు చేయాలని సూచించారు. అందరి ప్రయోజనం కోసం ఏఐని వాడుకోవడంపై దృష్టిసారించాలని, దీనిపై మితిమీరిన ఆంక్షలు వినూత్న ఆవిష్కరణలపై ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. -
వాహనాలకు ‘ఎలక్ట్రిక్’ షాక్!
న్యూఢిల్లీ: ఇప్పటికే అధిక ధరలతో బెంబేలెత్తుతున్న వాహన కొనుగోలుదారుల నెత్తిన త్వరలో మరింత పన్ను పోటుకు రంగం సిద్ధమవుతోంది. దేశీయంగా పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా.. సాంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలపై ప్రత్యేక సెస్సు విధించాలని కేంద్రం యోచిస్తోంది. ద్విచక్రవాహనాలు మొదలుకుని కార్లు, బస్సులు, ట్రక్కుల్లాంటి వాణిజ్య వాహనాల దాకా అన్నింటిపై సుమారు రూ. 500– రూ. 25,000 దాకా ఈ సెస్సు భారం పడనుంది. ఈ వివాదాస్పద ప్రతిపాదన సహా పర్యావరణ అనుకూల వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు అమలు చేయాల్సిన ప్రణాళికలపై చర్చించేందుకు గురువారం కేంద్ర ఉన్నతాధికారులు సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్యాబినెట్ కార్యదర్శి పి.కె. సిన్హా సారథ్యంలో కార్యదర్శుల కమిటీ భేటీలో నీతి ఆయోగ్ చేసిన ‘ఫీబేట్’ ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు వివరించాయి. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్తో పాటు భారీ పరిశ్రమలు, విద్యుత్, ఆర్థిక సర్వీసులు, రెవెన్యూ, పెట్రోలియం తదితర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఇందులో పాల్గొననున్నారు. కాలుష్య కారక వాహనాలపై సెస్సు విధించడం, పర్యావరణ అనుకూల వాహనాలకు (ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలు) సబ్సిడీ అందించడం ఈ ఫీబేట్ ప్రతిపాదన ఉద్దేశం. దీని ప్రకారం ఉద్గారాలు వెలువరించే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ)తో పని చేసే ద్విచక్ర వాహనాలపై సగటున రు. 500 మేర ఫీబేట్ విధించవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, త్రిచక్ర వాహనాలపై రూ. 1,000, కార్ల వంటి నాలుగు చక్రాల వాహనాలపై రూ. 12,000, బస్సులు.. ట్రక్కులు తదితర వాణిజ్య వాహనాలపై రూ. 25,000 మేర ఫీబేట్ విధించాలన్న ప్రతిపాదనలు ఉన్నట్లుపేర్కొన్నాయి. రూ. 7,646 కోట్ల సమీకరణ.. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలు అందించగలిగే దిశగా తొలి ఏడాది లో అదనపు ఆదాయ మార్గాల ద్వారా రూ. 7,646 కోట్లు సమీకరించేలా నీతి ఆయోగ్ ప్రతిపాదనలు ఉన్నాయి. 2019 ఏప్రిల్లో ప్రారంభమై ఆ తర్వాత అయిదేళ్ల వ్యవధిలో ఐసీఈ వాహనాలపై సెస్సు రూ. 7,646 కోట్ల నుంచి క్రమంగా రూ. 43,034 కోట్ల దాకా చేరొచ్చని సంబంధిత వర్గాల అంచనా. ఇలా ఫీబేట్ ద్వారా సమీకరించిన నిధులను ఫేమ్ ఇండియా స్కీమ్ కింద ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉపయోగించనున్నారు. ఆటోమొబైల్ పరిశ్రమ అభ్యంతరాలు ఇలా ఎలక్ట్రిక్ వాహనదారులకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సాంప్రదాయ వాహనాలపై సెస్సులు విధించడం సరికాదని ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎక్కువగా చిన్న కార్లు వినియోగించే భారత్ వంటి దేశంలో సబ్సిడీలతో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలమయంగా చేయాలన్న ప్రతిపాదన చాలా ఖర్చుతో కూడుకున్నది కాగలదని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ వ్యాఖ్యానించారు. ‘సబ్సిడీల ప్రాతిపదికన చిన్న కార్ల ఎలక్ట్రిఫికేషన్ సాధ్యపడుతుందని వ్యక్తిగతంగా నేనైతే భావించడం లేదు. ఇందుకోసం టెక్నాలజీ అవసరం అంతే తప్ప. సబ్సిడీలివ్వడమనేది లాభసాటి మార్గమని అనుకోవడం లేదు. సబ్సిడీలతో పెద్ద కార్లున్న సంపన్నులే లాభపడతారు తప్ప.. లక్ష్యం నెరవేరదు’అని ఆయన అభిప్రాయపడ్డారు. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలొక్కటే మార్గం కాదని.. ఇతరత్రా హైబ్రీడ్, బయోఫ్యుయల్స్, సీఎన్జీ వాహనాలను కూడా ప్రోత్సహించే అంశం పరిశీలించవచ్చన్నారు. ఈవీలపై రూ. 50 వేల దాకా సబ్సిడీ.. నీతి ఆయోగ్ ప్రతిపాదనల ప్రకారం ఫీబేట్ అమలు చేసే తొలి ఏడాదిలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు రూ. 25,000, త్రిచక్ర వాహనాలకు రూ. 40,000, ఎలక్ట్రిక్ కారుకు రూ. 50,000 దాకా సబ్సిడీ అందించనున్నారు. ఇది నేరుగా నగదు బదిలీ రూపంలో ఉంటుంది. కాలుష్యకారక వాహనాలపై సెస్సు విధించి, పర్యావరణ అనుకూల వాహనాలను కొనుగోలు చేసేవారికి రిబేటునిచ్చే విధానాన్నే ఫీబేట్గా వ్యవహరిస్తా రు. నార్వే, ఫ్రాన్స్, డెన్మార్క్, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఇప్పటికే దీన్ని అమలు చేస్తున్నాయి. అయితే, దేశీయంగా భారీ స్థాయిలో ఉండే ద్విచక్ర వాహనదారులపై ఫీబేట్ విధించడం వారిపై మరింత భారం మోపడమే అవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనపై గతంలో భారీ పరిశ్రమల శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. -
నీతి ఆయోగ్ సీఈవో సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ ; నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్, యూపీ, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలు దేశ అభివృద్ధికి ఆటంకాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. సోమవారం జమియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బిహార్, యూపీ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు భారత ఆర్థికాభివృద్ధికి ఆటంకాలుగా మారాయి. ముఖ్యంగా సామాజిక సూచీలో ఆయా రాష్ట్రాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. విద్యా-ఆరోగ్య వ్యవస్థలు ఆయా ప్రాంతాల్లో ప్రమాదకరమైన పరిస్థితికి చేరుకున్నాయి. ఐదో తరగతి పిల్లాడికి చదువుల్లో కనీస పరిజ్ఞానం లేకుండా పోతోంది. చదువుతోపాటు పిల్లల ఆరోగ్య స్థితులను అక్కడి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. మహిళల విషయంలో కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఓవైపు మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను పెంపొందించేందుకు కృషి చేస్తుంటే.. మానవాభివృద్ధి సూచిక కలవరపెడుతోంది. ..మానవాభివృద్ధి సూచీ(హెచ్డీఐ)లో మొత్తం 188 దేశాలకు గానూ భారత్ 131వ స్థానంలో ఉంది. అయితే దక్షిణ భారతంలో, ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం చాలా వేగవంతంగా అభివృద్ధి జరుగుతోంది. హెచ్డీఐలో భారత్ స్థితి మెరుగుపడితేనే.. సామాజిక సూచీ విషయంలో మేం ఏమైనా చేయగలుగుతాం. అప్పటిదాకా పరిస్థితి ఇంతే’ అని కాంత్ వెల్లడించారు. అయితే పరిస్థితిని మెరుగుపరిచేందుకు నీతి ఆయోగ్ తరపున కొన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మహిళా సాధికారకత పెంపొందించే దిశగా విధివిధానాలను ప్రభుత్వాలు రూపొందించినప్పుడే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
నీతి ఆయోగ్ సీఈవో పదవీకాలం పొడిగింపు
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ పదవీకాలాన్ని వచ్చే ఏడాది జూన్ 30 వరకు పొడిగించారు. కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించడంతో అమితాబ్ పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. కాలపరిమితి రెండేళ్లు ఉండే నీతి ఆయోగ్ సీఈవో పదవిని అమితాబ్ 2016 ఫిబ్రవరి 17న చేపట్టారు. నీతి ఆయోగ్లో పదవిచేపట్టకముందు ఆయన పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక విభాగం కార్యదర్శిగా పనిచేశారు. అమితాబ్ కేరళ కేడర్కు చెందిన 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. -
ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాలకు ఊతమివ్వడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ఇందులో భాగంగా రోడ్ ట్యాక్స్ తగ్గింపు తదితర ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా దేశ జీడీపీ వృద్ధి, ఉపాధి కల్పనలో ఆటోమొబైల్ రంగం కీలకపాత్ర పోషించడం కొనసాగేలా తోడ్పాటు అందించనున్నట్లు చెప్పారు. దీర్ఘకాలంలో ఆటోమొబైల్స్, బ్యాటరీల తయారీ హబ్గా మారాలని పరిశ్రమల సమాఖ్య అసోచాం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కాంత్ పేర్కొన్నారు. ‘తక్కువ రోడ్ ట్యాక్సులు తదితర ప్రోత్సాహకాలతో ఎలక్ట్రిక్ వాహనాలకు ఊతమివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే స్థూల దేశీయోత్పత్తిలోనూ, ఉపాధి కల్పనతో పాటు ఎగుమతుల్లోనూ ఆటోమొబైల్ రంగం కీలక పాత్రను పోషించడం కొనసాగించే విధంగా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది‘ అని ఆయన చెప్పారు. -
మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘వీ–హబ్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రత్యేకంగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘వీ–హబ్’ పేరుతో స్టార్టప్ ఇంక్యుబేటర్ను ఏర్పాటు చేస్తామని మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. ‘విమెన్ ఎంట్రప్రెన్యూర్స్ (డబ్ల్యూఈ)–హబ్ (వీ–హబ్)’గా దీనిని పిలుస్తామని చెప్పారు. దీంతోపాటు మహిళా పారిశ్రామికవేత్తలు స్థాపించే పరిశ్రమల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టుబడులు పెట్టేందుకు రూ.15 కోట్లతో ‘టీ–ఫండ్’ పేరిట కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ నిధుల నుంచి ఒక్కో పరిశ్రమలో రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు పెట్టుబడులు పెడతామన్నారు. ఇక ప్రభుత్వం జరిపే కొనుగోళ్లలో 20 శాతం వస్తువులను సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల(ఎస్ఎంఈ) నుంచి కొనుగోలు చేయాలన్న నిబంధన ఉందని.. ఈ 20 శాతంలో కనీసం నాలుగో వంతు వస్తువులను తప్పనిసరిగా మహిళల పరిశ్రమల నుంచే సేకరించాలన్న నిబంధన తీసుకొస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా మూడు పారిశ్రామికవాడలు ఉన్నాయని.. మహిళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్నో పెట్టుబడి రాయితీలు, ప్రోత్సహకాలు అందిస్తోందని చెప్పారు. వారికి మరింత చేయూత అందించాలనే తాజా నిర్ణయాలను తీసుకున్నామని పేర్కొన్నారు. గురువారం జీఈఎస్ సదస్సు ముగింపు సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్లతో కలసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. టీ–హబ్ తరహాలోనే.. జీఈఎస్లో పాల్గొన్న ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడి కుమార్తె, సలహాదారు ఇవాంకా తదితరులు టీ–హబ్ను ప్రత్యేకంగా ప్రశంసించారని కేటీఆర్ గుర్తుచేశారు. టీ–హబ్ను ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యూబేటర్గా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ కూడా ప్రకటించారని.. అదే విధంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ‘వీ–హబ్’ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అమెరికా వంటి దేశాల్లో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వాలు నిధులు సహాయం చేయాల్సిన అవసరం ఉండదని.. భారత్లో మాత్రం పరిస్థితులు వేరని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జీఈఎస్కు 140 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారని... తనతో మాట్లాడిన వారంతా సదస్సు ఏర్పాట్లు, చర్చాగోష్ఠులు చాలా బాగున్నాయని ప్రశంసించారని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన జీఈఎస్ సదస్సుల్లో అత్యంత విజయవంతమైన సదస్సు ఇదేనని పేర్కొన్నారు. సదస్సు ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోదీ, ఇవాంకాలతో పాటు సదస్సు నిర్వహణకు సహకరించిన నీతి ఆయోగ్, అమెరికా ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదస్సు ద్వారా అమెరికా–భారత్ల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్టార్టప్లతోనే కొత్త ఉద్యోగాలు ఫోర్బ్స్ జాబితాలోని భారీ పరిశ్రమలు ఇకముందు అదనంగా కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాయని తాను అనుకోవడం లేదని... కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ద్వారానే కొత్త ఉద్యోగాలు వస్తాయని కేటీఆర్ చెప్పారు. జీఈఎస్ సదస్సు ద్వారా ఔత్సాహిక, యువ పారిశ్రామికవేత్తలకు ఎంతో ప్రయోజనం కలిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రాధాన్యతాంశాలుగా తీసుకుంటోందని చెప్పారు. భారత దేశమంటే ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై అనే నాలుగు మెట్రో నగరాలే కాదని.. వాటి వెలుపల హైదరాబాద్ వంటి అందమైన భారతదేశం ఉందని ప్రకటించారు. జీఈఎస్ వంటి ఎన్నో కార్యక్రమాలను హైదరాబాద్ నిర్వహించగలదన్నారు. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు చేపట్టిన ‘ఇన్క్రెడిబుల్ ఇండియా’ప్రచారోద్యమం వెనుక కీలకంగా ఉన్న అమితాబ్కాంత్.. హైదరాబాద్లో పర్యాటకానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారని చెప్పారు. మరో సిలికాన్ వ్యాలీ హైదరాబాద్ ప్రపంచానికి హైదరాబాద్ నగరం మరో సిలికాన్ వ్యాలీ అని జీఈఎస్ సదస్సు చాటిచెప్పిందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్ ప్రశంసించారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణతో పాటు భారత్లో కొత్త పరిశ్రమల స్థాపన, స్టార్టప్లు, ఆవిష్కరణలకు ఊపు వస్తుందని చెప్పారు. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాలు మరింత పుంజుకుంటాయన్నారు. గురువారమే దేశ జీడీపీ గణాంకాలు విడుదలయ్యాయని.. గత త్రైమాసికంలో దేశం 6.3 శాతం వృద్ధి సాధించడం శుభ సూచకమని పేర్కొన్నారు. గతేడాది ఇదే సమయంలో వృద్ధిరేటు 5.7 శాతమేనని.. దేశం తిరిగి వృద్ధి బాటలో పయనిస్తోందని గణాంకాలు సూచిస్తున్నాయని అమితాబ్కాంత్ చెప్పారు. దక్షిణాసియాలో తొలిసారిగా నిర్వహించిన జీఈఎస్కు సహకరించిన అమెరికా, తెలంగాణ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ, ఇవాంకా, కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్లతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. జీఈఎస్ ముగింపు సెషన్లో యూఎస్ కాన్సుల్ జనరల్ క్యాథరీన్ హడ్డా, కేటీఆర్, జయేశ్ రంజన్ తదితరులు -
5 దశాబ్దాల్లో వేల ఏళ్ల అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, రానున్న ఐదు దశాబ్దాల కాలంలో గత ఐదు వేల సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి జరగబోతోందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. పట్టణీకరణ ప్రధానాంశంగా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. వినూత్న, స్థిర పట్టణాభివృద్ధి కోసం కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) ముగింపు సెషన్కు ఆయన మోడరేటర్గా వ్యవహరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘అమెరికా, యూరోప్ దేశాల్లో పట్టణీకరణ పూర్తయింది. చైనాలో పూర్తయ్యే దశకు చేరుకుంది. కానీ భారత్లో ఇప్పుడే ప్రారంభమైంది. ఇది శుభపరిణామం. రాబోయే 50 ఏళ్లలో భారత్ మరో స్థితిలో ఉంటుంది’’ అని పేర్కొన్నారు. సమతుల అభివృద్ధి సాధించేందుకు 7 రాష్ట్రాల్లోని 201 జిల్లాల్లో విద్య, వైద్య, పోషకాహార సౌకర్యాల కల్పన కోసం ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. ‘ఉమెన్ ఫస్ట్.. ప్రాస్పరిటీ ఆల్’ నినాదంతో జరిగిన ఈ సదస్సు ప్రపంచంలోని మహిళా పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. చివరి సెషన్లో వెల్స్పన్ ఇండియా లిమిటెడ్ సీఈవో దీపాలీ గోయెం కా, ఐయూరోప్ క్యాపిటల్ ఫౌండర్ క్రిస్టినా డేవిసన్, దక్షిణాఫ్రికాకు చెందిన పెట్రోలింక్ ఫౌండర్ లెరొటో సెలీనా ముత్సుమయి, టీంలీస్ సర్వీసెస్ చైర్మన్ మనీశ్ సభర్వాల్, యూఎస్ఏఐడీ అడ్మినిస్ట్రేటర్ మార్క్ గ్రీన్లతో కూడిన ప్యానెల్ ‘మహిళా సాధికారత’పై చర్చాగోష్ఠి నిర్వహించారు. ఇందులో ఎవరేమన్నారంటే.. ఫ్రాన్స్లో ప్రతి కంపెనీలో 40 శాతం మహిళా డైరెక్టర్లు: క్రిస్టినా మహిళలు ఎదగాలంటే మరో మహిళ సహకారం చాలా అవసరం. పెట్టుబడిదారుగా నేను కూడా మంచి ఆలోచనలున్న మహిళలకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా. అయితే మహిళా సాధికారత కోసం మార్పు పైస్థాయి నుంచి రావాలి. కంపెనీల స్థాపనలోనే మహిళల భాగస్వామ్యం ఉండాలి. ఫ్రాన్స్లో ఏ కంపెనీ పెట్టినా ఆ కంపెనీ బోర్డులో 40 శాతం మంది మహిళలే సభ్యులుగా ఉంటారు. ఆ మేరకు అక్కడ చట్టం చేశారు. అమెరికాలో అది 20 శాతమే ఉంది. దాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. అమెరికాలోని అడ్వెంచర్ క్యాపిటల్ ఫండ్స్లో 72 శాతం పెట్టుబడిదారులు పురుషులే. యూరోప్లో పరిస్థితి మరీ దారుణం. మహిళలకు పెట్టుబడులు కావాలంటే ముందు వారు విజయాలు సాధించాలి. విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా నిరూపించుకున్నప్పుడే మిమ్మల్ని నమ్మి ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. అగ్నిభద్రా అందరికీ ఆదర్శం: దీపాలి గ్రామీణ భారతం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. గుజరాత్కు చెందిన అగ్నిభద్రా అనే గ్రామీణ యువతిని వాల్మార్ట్ కంపెనీ ఎంచుకుంది. వాస్తీ అనే ఎన్జీవో నిర్వహించిన నైపుణ్య ప్రదర్శన పోటీలో విజేతగా నిలిచి ఆమె ఈ అవకాశాన్ని దక్కించుకుంది. గ్రామీణ యువతులు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. దేశంలోని మహిళా శక్తిని సక్రమంగా వినియోగించుకుంటే 2.9 ట్రిలియన్ డాలర్ల ఆదాయాన్ని సముపార్జించవచ్చు. 2025 కల్లా దేశంలోని 6.8 కోట్ల మంది మహిళలు పనిలో కొత్తగా భాగస్వామ్యం కాబోతున్నారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తుంది. మహిళలు గణితంలో నైపుణ్యం సాధించాలి: లొరెటో మహిళలకు విద్య అవకాశాలు మెరుగుపడినప్పుడే సామాజిక మార్పు వస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలు, యువతులు, చిన్నారులు గణితంలో నైపుణ్యం సాధించాలి. గణితం లేకుండా 21వ శతాబ్దపు విద్య ఉపయోగం లేదు. మహిళలకు తగిన అవకాశాలు కల్పిస్తే వ్యాపారాలు కాదు జాతిని నిర్మిస్తారు. ఈ సదస్సులో పాల్గొనడం మంచి అనుభూతిని కలిగించింది. కేవలం మ్యాపులు, టీవీల్లో మాత్రమే చూసే అవకాశం ఉన్న అనేక దేశాల మహిళలు, పారిశ్రామికవేత్తలతో అనుభవాలను పంచుకోవడం నిజంగా అద్భుతమే. మహిళల్లోని వాస్తవికతకు ప్రతిబింబం: మార్క్ గ్రీన్ ఈ సదస్సులో నేను మహిళా పారిశ్రామికవేత్తల్లోని ప్రతిభను చూశాను. వారికి సహజంగానే ఉండే వాస్తవికత, శక్తికి ఈ సదస్సు ప్రతిబింబంగా నిలిచింది. మహిళా సాధికారతలో భాగంగా వారికున్న అడ్డంకులను తొలగించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఐటీని వారికి దగ్గర చేయాలి. ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలి. భారత్లో మహిళలకు టీబీ పెద్ద అడ్డంకిగా మారింది. ఇలాంటివి గుర్తించి వాటిపై పనిచేయాలి. సరైన విద్య అందించాలి. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. వేర్వేరు వేతనాలు చట్ట విరుద్ధం: మనీశ్ పని ప్రాంతాల్లో పురుషులకు, మహిళలకు వేర్వేరుగా వేతనాలివ్వడం చట్ట విరుద్ధం. దీన్ని నియంత్రించాలి. దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం 30 నుంచి 18 శాతానికి పడిపోయింది. దీన్ని అధిగమించడం అనివార్యం. ప్రస్తుతానికి దేశంలో ఉద్యోగాల సమస్యేమీ లేదు. వేతనాలు కోరినంత సాధించుకునే అవకాశాలున్నాయి. కానీ భవిష్యత్తులో ఉద్యోగాల కల్పన అనుకున్నంత సులువుగా ఉండకపోవచ్చు. అందుకే పట్టణీకరణ, పారిశ్రామికీకరణ ద్వారా మానవ పెట్టుబడులను తయారు చేసుకోవాల్సి ఉంది. చివరి సెషన్లో అంతా మహిళలే మహిళా సాధికారత ప్రధానాంశంగా జరిగిన మూడ్రోజుల ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ముగింపు సెషన్ను తనదైన శైలిలో ముగించారు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్. దీనికి మోడరేటర్గా ఉన్న ఆయన.. ప్యానెల్ సభ్యులను ప్రశ్నలు అడిగేందుకు పురుషులను అనుమతించలేదు. తొలుత లేడీస్ ఫస్ట్ అంటూ కొందరు మహిళలకు అవకాశమిచ్చినా ఓ పురుష పారిశ్రామికవేత్త ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించగా.. ‘మీ వెనుక ఆమెను ముందు అడగనీయండి.’ అని వారించారు. ఆ తర్వాత ఆయన ఈ సెషన్లో కేవలం మహిళలే ప్రశ్నించాలని, పురుషులకు అవకాశం లేదన్నారు. దీంతో సభికుల్లో హర్షధ్వా నాలు వ్యక్తమయ్యాయి. చివరి సెషన్ను ఆయన ఓ మహిళా పారిశ్రామికవేత్త ప్రశ్నతో ముగించడం, ఈ సెషన్లోని ఐదుగురు ప్యానెల్ స్పీకర్లలో ముగ్గురు మహిళలే కావడం విశేషం. -
'ఆవిష్కరణలు, ఉపాధి కల్పనలపై చర్చ'
న్యూఢిల్లీ : మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలనేది గ్లోబల్ ఎంటర్ప్రిన్యూయర్ షిప్(జీఈఎస్) సదస్సు ముఖ్య ఉద్దేశం అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్లో ఈ నెల 28 నుంచి 30 వరకు సదస్సు జరుగుతుందన్నారు. అమెరికా, భారత్ సంయుక్తంగా జీఈఎస్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సదస్సులో ఇవాంకా ట్రంప్ పాల్గొంటున్నారని తెలిపారు. ఆవిష్కరణలు, ఉపాధి కల్పన కఠిన సవాళ్లపై జీఈఎస్లో చర్చ జరుగుతుందన్నారు. తొలి రోజు సదస్సులో గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్ పాల్గొంటారని వెల్లడించారు. 150కి పైగా దేశాల నుంచి 1500 మంది పారిశ్రామికవేత్తలు హాజరవుతారన్నారు. మహిళలు పారిశ్రామిక రంగంలో పురోగాభివృద్ధి సాధించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. -
డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం పైపైకి!
నోయిడా: రాబోయే మూడు నాలుగేళ్లలో దేశంలో డెబిట్, క్రెడిట్ కార్డులు, ఏటీఎంల వినియోగం బాగా పెరుగుతుందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. ఆర్థిక లావాదేవీల నిర్వహణకు భవిష్యత్తులో మొబైల్ ఫోన్ల వాడకంపై ఆధారపడతారన్నారు. దేశంలో దాదాపు 72 శాతం ప్రజలు 32 ఏళ్లలోపు వారేనని, 2040 వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. 100 కోట్ల బయోమెట్రిక్ కార్డులు, పెద్ద సంఖ్యలో మొబైల్ ఫోన్లు, బ్యాంకు ఖాతాలు ఉన్న దేశం మనదేనని చెప్పారు. 7.5 శాతం వార్షిక వృద్ధి రేటుతో భారత్ ముందుకు పోతుందని, ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం సమయంలో మన వృద్ధి రేటు ఒయాసిస్సును తలపిస్తుందని అభిప్రాయపడ్డారు. -
34 సంస్థల్లో వాటాలు అమ్మాలి!
న్యూఢిల్లీ: ఖాయిలాపడిన ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్యూ) వ్యూహాత్మక వాటాల విక్రయానికి సంబంధించి ప్రభుత్వానికి ఇప్పటిదాకా 34 సంస్థలపై సిఫార్సులు చేసినట్లు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలియజేశారు. ఖాయిలా పడిన సంస్థల లాభదాయకత అంశాన్ని పరిశీలించాలంటూ ప్రధాని కార్యాలయం (పీఎంవో) చేసిన సూచనల మేరకు నీతి ఆయోగ్ ఈ సిఫార్సులు చేసింది. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నిర్వహించిన ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా కాంత్ ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎస్యూల్లో వాటాల విక్రయం ద్వారా రూ. 72,500 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. మైనారిటీ వాటాల అమ్మకం ద్వారా రూ. 46,500 కోట్లు, వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా రూ.15,000 కోట్లు, పీఎస్యూ బీమా కంపెనీల లిస్టింగ్ ద్వారా రూ.11,000 కోట్లు సమీకరించనుంది. బీమా నిధులు ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లోకి మళ్లించాలి.. మౌలిక రంగ ప్రాజెక్టుల్లో ప్రైవేట్ పెట్టుబడులు మరింతగా రావాలని అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. అటు బీమా, పెన్షన్ ఫండ్స్ నిధులను కూడా ఇన్ఫ్రా ప్రాజెక్టుల ఫైనాన్సింగ్ కోసం మళ్లించవచ్చని ఆయన సూచించారు. దీంతో పాటు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) స్కీమును పూర్తి స్థాయిలో పునఃపరిశీలించాలని కాంత్ పేర్కొన్నారు. తగినన్ని పెట్టుబడులు లేక దేశీ ఇన్ఫ్రా రంగం సుదీర్ఘకాలం సమస్యల్లో కొట్టుమిట్టాడిందని ఆయన చెప్పారు. ‘పెన్షన్, బీమా నిధులను ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో పెట్టుబడులుగా మళ్లించేందుకు అనువైన పరిస్థితులుండాలి. వీజీఎఫ్ స్కీమ్ను కూడా పూర్తిస్థాయిలో పునఃసమీక్షించాలి‘ అని కాంత్ తెలిపారు. భారత్ 9–10 శాతం స్థాయిలో వృద్ధి సాధించాలంటే మౌలిక రంగాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణ కొరియా, సింగపూర్, తైవాన్, జపాన్ తదితర దేశాల్లో మెరుగైన ఇన్ఫ్రా ఊతంతోనే వృద్ధి చెందాయని చెప్పారు. మౌలిక రంగానికి రూ. 50 లక్షల కోట్లు కావాలి.. వచ్చే అయిదేళ్లలో 2022 నాటికి దేశీయంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో రూ. 50 లక్షల కోట్ల మేర పెట్టుబడులు అవసరమవుతాయని క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. మొత్తం ఇన్ఫ్రా పెట్టుబడుల్లో దాదాపు 78 శాతం.. విద్యుత్, రవాణా, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన మొదలైనవే ఉండగలవని వివరించింది. 2016, 2017 ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా వ్యయాలు చేయడం వల్లే.. ప్రైవేట్ పెట్టుబడులు భారీగా తగ్గినా.. రాష్ట్రాల ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితులు దిగజారినా.. ప్రభావం పాక్షికంగానే పడిందని క్రిసిల్ తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరం తర్వాత ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకోగలవని పేర్కొంది. 2013–17 మధ్య కాలంలో భారత్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పెట్టుబడులు రూ. 37 లక్షల కోట్లకు (స్థూల దేశీయోత్పత్తిలో సుమారు 5.6 శాతానికి) పెరిగాయని.. అంతకుముందు అయిదేళ్లలో ఇన్వెస్ట్ చేసిన రూ. 24 లక్షల కోట్ల పెట్టుబడులతో పోలిస్తే ఇది 56 శాతం అధికమని క్రిసిల్ వివరించింది. -
భవిష్యత్ ఎన్నికలను నిర్ధేశించేవి ఇవే...
న్యూఢిల్లీః భవిష్యత్తులో జరిగే ఎన్నికలను నిర్ణయించేది నీరేనని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. సమర్థ నీటి నిర్వహణ కీలక అంశంగా ముందుకొస్తుందని నొక్కిచెప్పారు.ప్రజలకు నీటి అవసరాలు ప్రాధాన్య అంశం కావడంతో జల వనరులను సమర్థంగా నిర్వహించిన ప్రభుత్వాలనే ప్రజలు ఎన్నుకుంటారని అన్నారు.పరిశ్రమ సంస్థ సీఐఐ మంగళవారం నిర్వహించిన జల సదస్సులో అమితాబ్ కాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. సమర్థ నీటి నిర్వహణ చేపట్టని ప్రభుత్వాలు కనుమరుగవక తప్పదని హెచ్చరించారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ సహా ఉత్తరాదిలో సరైన నియంత్రణలు లేకపోవడంతో గత దశాబ్ధంలో విపరీతంగా భూగర్భ జలాలను తోడేశారని అన్నారు.పంజాబ్, ఢిల్లీలు క్రమంగా ఎడారిగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ నీటి కొరత కలిగిన దేశంగా మారుతున్న క్రమంలో సమర్ధ జలవనరుల నిర్వహణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. మనం మెరుగైన ఆర్థిక వృద్ధి సాధించాలన్నా, మన ప్రజల ఆర్థిఖ ప్రమాణాలు మెరుగుపరచాలన్నా నీటి వనరులే కీలకమని అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. -
జీఎస్టీతో 10 శాతం ఆర్థిక వృద్ధి సాధ్యం
సాక్షి, న్యూఢిల్లీ: జూలై 1 నుంచి అమలు కానున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) దేశంలో సరికొత్త ఆర్థిక విప్లవానికి నాందిపలకనుందని, దీని ద్వారా ప్రస్తుతం 7.6% ఉన్న ఆర్థికవృద్ధి భవిష్యతులో 9–10%కి చేరుతుందని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త సంస్కరణల వైపు పయనించనుందన్నారు. మంగళవారం ఢిల్లీలో ఏసర్, ట్యాలీ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో వాణిజ్య వ్యాపారులకు సులభంగా జీఎస్టీపై సమగ్ర అవగాహన, నిర్దిష్టమైన వ్యాపార లావాదేవీలను కలిగి ఉండే విధంగా రూపొందించిన ప్రీ లోడెడ్ ట్యాలీ సాఫ్ట్వేర్ కంప్యూటర్లు, ల్యాప్టాప్ల ఆవిష్కరణ కార్యక్రమంలో అమితాబ్ కాంత్ పాల్గొన్నారు. అఖిల భారత పరిశ్రమల సమాఖ్య అధ్వర్యంలో ట్యాలీ సొల్యూషన్స్ అందించిన జీఎస్టీ పన్ను ఆధారిత ట్యాలీ సాఫ్ట్వేర్తో ఏసర్ కొత్త కంప్యూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ద్వారా వ్యాపారులు తమ వాణిజ్య లావాదేవీలను, జీఎస్టీ పన్నుల చెల్లింపు విధివిధానాలను సులభతరంగా అర్థం చేసుకొనే వీలుకలుగుతుంది. వ్యాపారుల సౌలభ్యం కోసం ఏసర్, ట్యాలీ చేసిన ఈ ప్రయాత్నానికి ఆమిత్కాంత్ అభినందించారు. కార్యక్రమంలో ఏసర్ ఇండియా ఎండీ హరీష్ కోహ్లీ, ట్యాలీ సొల్యూషన్స్ ఎక్యిక్యూటివ్ డైరెక్టర్ తేజస్ గోయెంకా, అఖిల భారత పరిశ్రమల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖన్డెవాల్ పాల్గొన్నారు. బ్యాంకుల విలీనంపై నీతి ఆయోగ్ అధ్యయనం ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంపై కసరత్తు చేస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ .. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను మదింపు చేసేందుకు నీతి ఆయోగ్తో పాటు అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థల సహకారం కూడా తీసుకుంటోంది. సుమారు నెల రోజుల్లో నీతి ఆయోగ్ దీనిపై నివేదికనివ్వొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
దక్షిణాసియాలో అత్యుత్తమం..కృష్ణపట్నం పోర్టు
నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ముత్తుకూరు(సర్వేపల్లి): కృష్ణపట్నం పోర్టు దక్షిణాసియాలోనే అన్ని వసతుల కలిగిన అత్యుత్తమ పోర్టుగా రూపుదిద్దుకుంటోందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టులో శుక్రవారం ఆయన ఆటోమేటిక్ ఫర్టిలైజర్ హ్యాండ్లింగ్ సిస్టంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక ఫర్టిలైజర్ హ్యాండ్లింగ్ సిస్టం ద్వారా ఎరువులకు నీమ్ కోటింగ్ ఇవ్వడంతో పాటు అత్యాధునిక ప్యాకింగ్ కల్పించడ వల్ల నాణ్యత దెబ్బతినదన్నారు. సరుకుల ఎగుమతి–దిగుమతుల్లో సమయ పాలన పాటిస్తున్నారన్నారు. పోర్టులో కస్టమ్స్ క్లియరెన్స్ వేగవంతంగా జరుగుతోందన్నారు. ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా ఎండీ చింతా శశిధర్, సీఈఓ అనీల్ఎండ్లూరి తదితరులు ఆయనకు పోర్టు ప్రగతిని వివరించారు. -
పెట్రో వాహనాల నమోదుపై పరిమితి
ఇంధన ఖర్చు రూ. 3.9లక్షల కోట్లు ఆదా ► విరివిగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలి ► నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ నివేదిక న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్పై పరిమితి విధించి, ఎలక్ట్రిక్, షేర్డ్ వాహనాలను భారీగా వాడాలని నీతిఆయోగ్ సూచించింది. తద్వారా ఇంధనానికి అయ్యే ఖర్చులో 2030 నాటికి దాదాపు 6000 కోట్ల డాలర్లను(రూ. 3.9 లక్షల కోట్లు) ఆదాచేయవచ్చని పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి భారీగా పన్ను మినహాయింపులను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ విధానం చైనాలో విజయవంతమయ్యిందని తెలిపింది. ఈ మేరకు నీతిఆయోగ్, రాకీ మౌంటేన్ ఇన్స్టిట్యూట్ నివేదికను తయారుచేశాయి. దీన్ని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ విడుదల చేశారు. దీని ప్రకారం ఎలక్ట్రానిక్ వాహనాలను ఉపయోగించడం వల్ల 2030 నాటికి 67 శాతం ఇంధన శక్తిని కాపాడుకోవడచ్చని, 37 శాతం కార్బన్ ఉద్గారాలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. అలాగే 15 కోట్ల 60 లక్షల టన్నుల ఆయిల్ను ఆదా చేయవచ్చని తెలిపారు. అలాగే ఆయిల్ స్థానంలో బ్యాటరీల దిగుమతిని కూడా భారీగా తగ్గించుకొని, ఇక్కడే తయారుచేసుకోవాల్సి ఉందన్నారు. వీటికి గిరాకీ పెంచడానికి మొదటగా ప్రభుత్వ వాహనాలు, ప్రజా రవాణా వాహనాల మార్పుపై దృష్టిసారించాలని సూచించారు. ‘సురక్షితమైన, అతి తక్కువ ఖర్చులో సమర్థవంతమైన సేవలను అందించడానికి విభిన్న మార్గాలను అనుసరించాలి. తద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించవచ్చు. చమురు దిగుమతులను తగ్గించుకోవచ్చు’ అని 140 పేజీల నివేదిక ముందుమాటలో నీతిఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగరియా పేర్కొన్నారు. -
2022 నాటికి వాటి అవసరమే ఉండదట!
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవాలకు లభిస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో రానున్నకాలంలో ఏటీఎం కార్డులు, మెషీన్లకు ఇక కాలం చెల్లినట్టేనట. పెద్ద నోట్ల రద్దు తరువాత, 2022 నాటికి ఏటీఎంకార్డులు, పీఓఎస్ మెషీన్ల అవసరం ఉండదని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. యూత్ ప్రవాసీ భారతీయ దివస్ 2017లో బాగంగా నిర్వహించిన సెషన్లో ప్రసంగించిన కాంత్, ప్రతి భారతీయుడూ కేవలం తన బొటనవేలిని, మొబైల్ ఫోన్ ద్వారా అన్ని లావాదేవీలు జరుపుతున్న నేపథ్యంలో ఇక కార్డులు వ్యర్థంగా మారిపోతాయని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల, డిజిటల్ చెల్లింపులు భారీ స్థాయిలో జరుగుతాయని, ప్రపంచంలోనే వందకోట్ల (బిలియన్) మొబైల్ కనెక్షన్లు, వందకోట్ల బయోమెట్రిక్లను కలిగిన ఏకైక దేశంగా భారత్ అవతరించిందని కాంత్ పేర్కొన్నారు. ఇటీవల విడుదల భీమ్ యాప్ , ఆధార్ ఆధారిత సేవలను గుర్తు చేశారు. సాంకేతికంగా శరవేగంగా జరుగుతున్న మార్పులు, డిజిటల్ చెల్లింపుల పురోగతి కారణంగా మరో మూడేళ్లలోనే భారత్లో ఏటీఎంలు, క్రిడిట్ కార్టులు అదృశ్యం కానున్నాయని చెప్పారు. ద్రవ్య సాంకేతికత మరియు సామాజిక ఆవిష్కరణల పరంగా భారత్ శరవేగంగా మార్పులకు గురికానుందని, ఈ నేపథ్యంలో వచ్చే రెండున్నరేళ్ల కాలంలోనే భారత్లో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఏటీఎంలు, పీఓఎస్ మెషీన్లు దండగే అని చెప్పారు. ఆదార్ కార్డ్ ఆధారిత టెక్నాలజీ వల్ల ప్రతి లావాదేవీ కూడా కేవలం 30 సెకన్లలో పూర్తవుతుందన్నారు. దేశంలోఇంతవరకు 85శాతం లావాదేవీలు నగదు రూపంలో జరుగుతుండగా, దేశంలో అతికొద్దిమంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారని అందుకే డిజిటల్ లావాదేవీలు, నియత ఆర్థిక వ్యవస్థను రూపొందిం చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చట్టబద్ధంగా రెండు లక్షల కో్ట్ల డాలర్లు చలామణిలో ఉంటూ మరొక లక్ష కోట్ల డాలర్లు అనియతరంగంలో నల్ధ ఆర్థిక వ్యవస్థగా ఉంటున్న స్థితిలో భారత్ పది లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే అసాధ్యమన్నారు. ఇలాంటి నేపథ్యంలో భారత్ అభివృద్ధి చెందడమే సాధ్యం కాదని చెప్పారు. వ్యాపార సరళీకరణలో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణలు ఎఫ్ డీఐ వృద్ధికి దారితీసిందన్నారు. దేశంలో ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి, ఉద్యోగ సృష్టిలో ప్రభుత్వ కృషిని ఆయన నొక్కి చెప్పారు. యూరోప్, అమెరికాలో జనాభా పెద్దవాళ్ల సంఖ్య పెరుగుతోంటే, మనదేశంలో మాత్రం యువత సంఖ్య బాగాపెరుగుతూ ఉండడం అతిపెద్ద సాంఘిక, ఆర్థిక అద్భుతమని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ వృద్ధి రేటు 7.6 శాతంతో కొనసాగడం గమనించాలన్నారు. అభివృద్ధిలో కుంటుపడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఇప్పటికీ ఒయాసిస్గానే ఉందని నీతి అయోగ్ సీఈఓ అభిప్రాయపడ్డారు. -
ఆదాయపు పన్ను చెల్లింపుదార్లు ఒక్క శాతమే
నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ న్యూఢిల్లీ: దేశంలో దాదాపు 130 కోట్ల మంది ప్రజలు ఉంటే... ఇందులో కేవలం ఒక్క శాతం మంది మాత్రమే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. ఇప్పటికీ 95 % మందిప్రజలు నగదు లావాదేవీలనే జరుపుతున్నారని చెప్పారు. 2030 కల్లా భారత్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడున్న 2 లక్షల కోట్ల డాలర్ల స్థాయి నుంచి 10 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరాలంటే ఇంత భారీ మొత్తంలో నగదులావాదేవీలు, అత్యంత కనిష్టస్థాయి ఐటీ చెల్లింపుదారులతో సాధ్యం కాదని కాంత్ పేర్కొన్నారు. నగదురహిత(క్యాష్లెస్) లావాదేవీలపై బుధవారమిక్కడ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) నిర్వహించిన ఒకకార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారిక గణాంకాల ప్రకారం... ప్రస్తుతం దేశంలో 100 కోట్లకు పైగా మొబైల్ ఫోన్ ఫోన్ వినియోగదారులు ఉన్నారని.. ఘిం కా 100 కోట్ల మంది ‘ఆధార్’తోఅనుసంధానం అయ్యారని వివరించారు. ‘ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ను నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం అందరికీ బ్యాంకింగ్ సేవలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగానే 26 కోట్ల జనధన బ్యాంక్ఖాతాలను, 20 కోట్ల రూపే కార్డులను జారీచేయడం జరిగింది. ఇక ఇప్పుడు క్యాష్లెస్ లావాదేవీలకు మారాల్సిన సమయం వచ్చింది’ అని ఆయన పేర్కొన్నారు. హోం మంత్రిత్వశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజుమాట్లాడుతూ... ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది క్యాష్లెస్ లావాదేవాలను అందిపుచ్చుకోవాలన్నారు. -
కొత్త డిజైన్లలో చిన్న నోట్లు
న్యూఢిల్లీ: కొత్త రూ.2 వేల నోటు, రూ. 500 నోట్లలోని డిజైన్, భద్రతా ప్రమాణాలు మిగతా నోట్లకు కూడా త్వరలో అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ లోక్సభకు లిఖిత పూర్వకంగా తెలిపారు. దీనివల్ల దొంగనోట్ల చలామణి తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. మరోపక్క.. త్వరలో మహాత్మాగాంధీ సీరిస్లో భాగంగా రూ. 500 నోట్లను విడుదల చేస్తామని ఆర్బీఐ ప్రకటించింది. ఈ నోటు రెండు నెంబర్ ప్యానళ్లపై ‘ఈ’ ఇంగ్లిషు అక్షరం ఉంటుందని, నోటు రెండో వైపు స్వచ్ఛ భారత్ చిహ్నం ముద్రిస్తారని పేర్కొంది. కొన్ని బ్యాంకు నోట్లకు అదనంగా నంబర్ ప్యానళ్లలో (స్టార్) గుర్తు ఉంటుందని తెలిపింది. స్టార్ గుర్తుతో రూ. 500 నోటు మొదటి సారి జారీ చేస్తున్నామని, స్టార్ గుర్తుతో ఉన్న రూ.10, రూ. 20, రూ. 50, రూ.100 నోట్లు ఇప్పటికే చెలామణీలో ఉన్నాయని వెల్లడించింది. ఆధార్ అనుసంధాన డిజిటల్ చెల్లింపుల కోసం త్వరలో మొబైల్ యాప్ను విడుదల చేస్తున్నామని కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. ఈ–చెల్లింపులపై కోటి మంది ప్రజలకు దేశవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. యూపీఏ(యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) కోసం మొబైల్ యాప్ను అభివృద్ధి చేస్తున్నామని, రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. పార్టీల డిపాజిట్లపై పన్ను ఉండదు: కేంద్రం న్యూఢిల్లీ: రద్దయిన రూ. 500, రూ. వెయ్యి నోట్ల రూపంలో రాజకీయ పార్టీలు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తాలపై ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పాన్ కార్డు లేని పక్షంలో రైతులు తమ వార్షిక వ్యవసాయ ఆదాయం 2.5 లక్షల కంటే తక్కువని పేర్కొంటూ సొంత ధ్రువీకరణ పత్రం చెల్లించాలని సూచించింది. ఆదాయపు పన్ను రిట్నర్న్స్తో వారి ఖాతాల్లోని నగదు సరిపోలకపోవడంతో ఐటీ శాఖ 3 వేల నోటీసులు జారీ చేసిందని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరక్ట్ ట్యాక్స్(సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర చెప్పారు. ఇంత వరకూ రూ.385 కోట్ల నగదు, ఆభరణాల్ని ఐటీ శాఖ సీజ్ చేసినట్లు తెలిపారు. ‘జనవరి మధ్య నాటికి నగదు కొరత ఉండదు’ న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు కారణంగా ఏర్పడ్డ నగదు కొరత జనవరి మధ్య నాటికి ఉండదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ ఏర్పడేందుకు వీలుగా ప్రజలందరూ డిజిటల్ చెల్లింపులు చేసేందుకు గల అన్ని అవకాశాలను పర్యవేక్షించేందుకు ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి అమితాబ్ కాంత్ నేతృత్వం వహిస్తున్నారు. భారతదేశంలో దాదాపు 80 శాతం లావాదేవీలు డిజిటల్ ప్లాట్ఫామ్లో జరిపేందుకు ఉన్న అవకాశాలను కమిటీ పర్యవేక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. 7.5 శాతం వృద్ధి సాధించాలంటే డిజిటైజేషన్ ప్రధానమైనదని ఉద్ఘాటించారు. -
నగదు రహిత లావాదేవీలకు నజరానా
కేంద్ర ప్రభుత్వం ప్రకటన.. ప్రతి లావాదేవీపై కలెక్టర్లకు రూ.10 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం నజరానాలను ప్రకటిస్తోంది. డిజిటల్ మనీ వినియోగాన్ని విస్తృతం చేయ డానికి కలెక్టర్లకు నగదు బహుమతులు అందజేయనుంది. కరె న్సీ వాడకాన్ని తగ్గించి ఆన్లైన్ చెల్లింపుల వైపు ప్రజలను మళ్లించేలా కృషి చేసే కలెక్టర్లు, పౌర సేవా కేంద్రాల ప్రతినిధులకు క్యాష్ అవార్డులు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. యూపీఐ, యూఎస్ఎస్డీ, ఆధార్ ఆధారిత, డిజిటల్ రూపే, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్లు చేసేవారి సంఖ్య పెంపొందించాలని కేంద్రం నిర్ణయించింది. కొత్తగా ఏ ఇద్దరిని ఎలక్టాన్రిక్ చెల్లింపుల వైపు మళ్లించగలిగితే అందుకు ప్రోత్సాహకం గా సంబంధిత కలెక్టర్లకు రూ.10 నగదు అందించనున్నట్లు నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ప్రకటించారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆయన లేఖ రాశారు. అంతేగాకుండా వ్యాపార వర్గాలు ఆన్లైన్ చెల్లింపుల బాట పట్టేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. ఈ మేరకు పౌర సేవా కేంద్రాల ప్రతినిధుల కు నగదు కానుకలు ప్రకటించింది. నగదు రహిత లావాదేవీల వైపు టోకు వ్యాపారిని మళ్లిస్తే రూ.100, చిన్న లావాదేవీలపై రూ.5 ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ఈ-పేమెంట్ల అమలులో అగ్రస్థానంలో నిలిచిన పది జిల్లాలను ఎంపిక చేసి వాటిని ‘డిజిటల్ పేమెంట్ చాంపియన్స’గా పురస్కారాలు అందజేస్తారు. నగదు రహిత గ్రామ పంచాయతీలకూ అవార్డులు ప్రదానం చేయాలని కేంద్రం నిర్ణరుుం చింది. బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్లు, ఈ-వ్యాలెట్ల వినియోగం పెరిగేలా క్షేత్ర స్థారుులో పెద్ద ఎత్తున ప్రచారం చేసేలా కలెక్టర్లకు బాధ్యత అప్పగించారు. -
‘నోట్ల రద్దుతో ఆర్థికాభివృద్ధి’
న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రద్దు చేయడం సాహసోపేతమైన చర్య అని, ఈ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని నీతి ఆయోగ్ ముఖ్యకార్యనిర్వహణాధికారి (సీఈవో) అమితాబ్కాంత్ అభిప్రాయపడ్డారు. శనివారం ఢిల్లీలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ.. నల్లధనాన్ని నియంత్రిస్తే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని , తద్వారా వృద్ధి రేటు 9- 10 శాతానికి చేరుతుందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ మరింత బలపడటానికి జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు అంశాలు దోహదపడతాయని చెప్పారు. నగదు రహిత లావాదేవీలతో అవినీతిని తగ్గించవచ్చని తెలిపారు. నల్లధనాన్ని అరికడితే బ్యాంకుల్లో నిధులు సమృద్ధిగా లభ్యమై, వడ్డీ రేట్లు తగ్గుముఖం పడతాయని వివరించారు. దేశంలో మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టాలని , అప్పుడే ఆర్థిక ఫలాలు పేద ప్రజలకు అందుతాయని చెప్పారు. -
కరెంట్కూ నగదు బదిలీ: నీతి ఆయోగ్
న్యూఢిల్లీ: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల మాదిరిగానే విద్యుత్ సరఫరాకు కూడా నగదు బదిలీ(డీబీటీ) పథకం అమలుకు నీతి ఆయోగ్ మద్దతు తెలిపింది. కనీవిని ఎరగని రీతిలో పెద్దనోట్లను రద్దు చేసిన దేశం విద్యుత్ రంగంలో నగదు బదిలీ ప్రవేశపెట్టే సాహసం చేయొచ్చని అభిప్రాయపడింది. అధిక భాగం ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఈ రంగంలో సత్ఫలితాలు సాధించాలంటే దీర్ఘకాలంలో ప్రైవేటీకరణ చేపట్టాలని సంస్థ సీఈఓ అమితాబ్ కాంత్ సూచించారు. బుధవారం ఆయన ఇండియా ఎనర్జీ ఫోరంలో మాట్లాడారు. ‘ఏ వినియోగదారుడు కూడా డీబీటీ లేకుండా విద్యుత్ పొందకూడదు. బలవంతంగానైనా దీన్ని అమలు చేయాలి. మార్కెట్ ధరల ప్రాతిపదికన ధరలు నిర్ణయించే, పూర్తి స్వేచ్ఛతో వ్యవహరించే నియంత్రణ సంస్థలు రావాలి’ అని కాంత్ అన్నారు. దిగువ స్థాయుల్లో మీటర్ విధానం అమల్లోకి రాకుంటే విద్యుత్ రంగం మనుగడ సాధించలేదని పేర్కొన్నారు. డీజిల్ వినియోగం తగ్గించాలంటే కాలుష్య పన్నులు విధించాలని సూచించారు. కేవలం పదేళ్లే జీవిత కాలమున్న బొగ్గు వాడకాన్ని ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశ ఇంధన రంగం విష వలయంలో చిక్కుకుందని ఇందులో మార్పు రావాలని తెలిపారు. -
10% వృద్ధి .. 10 లక్షల కోట్ల డాలర్లు!
♦ 2032కి భారత ఎకానమీ అంచనాలు ♦ 17.5 కోట్ల ఉద్యోగాల కల్పన ♦ నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ 2032 నాటికి 10 శాతం వృద్ధి రేటుతో 10 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగగలదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. అలాగే 17.5 కోట్ల ఉద్యోగాల కల్పనతో పాటు దారిద్య్ర రేఖ దిగువన ఉన్నవారి (బీపీఎల్) సంఖ్య సున్నా స్థాయికి తగ్గగలదని ఆయన పేర్కొన్నారు. గురువారం సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి అమితాబ్ కాంత్ ఈ మేరకు నీతి ఆయోగ్ అంచనాలను వివరించారు. కీలక అంశాలపై కేంద్రం డిసెంబర్లో ఏర్పాటు చేసిన ఎనిమిది సెక్రటరీల బృందాల (జీవోఎస్) నివేదికల అమలు పురోగతిని కాంత్ వివరించారు. జీవోఎస్ సిఫార్సుల్లో కొన్ని అమలయ్యాయని, మిగతా వాటి అమలుకు మార్గదర్శ ప్రణాళికను రూపొందించడం జరిగిందని కాంత్ పేర్కొన్నారు. వేగవంతమైన వృద్ధి సాధనకు సంబంధించి 2017 ఆర్థిక సంవత్సరంలో రహదారులు, రైల్వేల్లో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ వ్యవధిలో 10,000 కిలోమీటర్ల దూరం రహదారుల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికాగలదని కాంత్ తెలిపారు. లక్ష్యాలు చాలా భారీవే అయినప్పటికీ అధికారులంతా అంగీకరించిన నేపథ్యంలో ఇవి సాధ్యపడేవేనని ఆయన పేర్కొన్నారు. భారత ఎకానమీ 2015-16లో 7.6 శాతం వృద్ధితో 1.7 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. ఎనిమిది బృందాల సిఫార్సుల్లో మరికొన్ని.. సమ్మిళితమైన వేగవంతమైన వృద్ధి సాధన, ఉపాధి కల్పన వ్యూహాలు, వైద్యం.. విద్య, గుడ్ గవర్నెన్స్, రైతు సంబంధ అంశాలు, స్వచ్ఛ భారత్.. గంగా నది ప్రక్షాళన, విద్యుత్ పొదుపు, కొంగొత్త బడ్జెటింగ్ విధానాల రూపకల్పన మొదలైన అంశాలపై ఎనిమిది బృందాలు ఏర్పాటయ్యాయి. ఇవి చేసిన సిఫార్సుల్లో మరికొన్ని అంశాలు.. ♦ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద దారిద్య్ర రేఖకు దిగువన వున్న మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లు మంజూ రు చేయాలని, మెడికల్ టూరిజంను ప్రోత్సహించాల ని వైద్యం, ఫార్మాపై ఏర్పాటైన బృందం సూచించింది. ♦ 2017 మార్చి నాటికి జాతీయ కెరియర్ సర్వీస్ ద్వారా ఇ-ప్లాట్ఫాం విధానంతో అన్ని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీలను అనుసంధానం చేయడం. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా మరో 62 నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయడం. ♦ రహదారులను గడువుకు ముందే పూర్తి చేసే కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకాలిచ్చే విధానాన్ని ఈ ఏడాది ఆఖరు నాటికల్లా అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని వ్యాపారాలను సులభతరం చేసే విషయంపై ఏర్పాటైన బృందం సిఫార్సు చేసింది. ♦ 2016 సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా టోల్ వసూలు వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 2018 నాటికల్లా అన్ని గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ ద్వారా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇవ్వాలి. ♦ 2020 నాటికి 15 మిలియన్ మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యం సాధించడం. 2017 ఆర్థిక సంవత్సరం నాటికి ఇంధన పొదుపు నిబంధనలను మెరుగుపర్చుకోవడం. విద్యుత్ వినియోగాన్ని తగ్గించే భవంతుల నిర్మాణానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం. బూడిద వ్యర్ధాలను తగ్గించేందుకు కొత్తగా 15 బొగ్గు వాషరీలను ఏర్పాటు చేయడం. -
తయారీ హబ్గా ఎదగాలంటే ఎగుమతులూ కీలకమే
న్యూఢిల్లీ: కేవలం దేశీ వినియోగానికే పరిమితం కాకుండా ఎగుమతులూ పెరిగినప్పుడే భారత్ .. తయారీ హబ్గా ఆవిర్భవించగలదని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) కార్యదర్శి అమితాబ్ కాంత్ చెప్పారు. మేకిన్ ఇండియా నినాదం తీరుతెన్నులపై ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ విమర్శలు చేసిన నేపథ్యంలో కాంత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చైనా బాటలో ఎగుమతులపై కాకుండా దేశీ మార్కెట్పై దృష్టి సారిస్తూ మేక్ ఫర్ ఇండియా విధానాన్ని అమల్లోకి తేవాలంటూ రాజన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అమితాబ్ కాంత్.. రాజన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఎవరైనా సరే ప్రాథమికంగా దేశీ మార్కెట్ కోసం ఉత్పత్తి చేసినా .. ఆ తర్వాత క్రమంగా విదేశీ మార్కెట్లలోకి విస్తరించాలని యోచిస్తారని, నిజమైన వ్యాపారవేత్త చేయాల్సిన పని కూడా అదేనని కాంత్ పేర్కొన్నారు. ఎగుమతుల ప్రాధాన్యాన్ని గుర్తెరిగి, మరింత పెంచుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో ప్రధాన పాత్ర పోషించాలంటే దేశీ పరిశ్రమ పోటీతత్వాన్ని మరింతగా అలవర్చుకోవాల్సి ఉంటుందని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజీవ్ఖేర్ పేర్కొన్నారు.