Ananya
-
హైదరాబాద్లో విషాదం.. తుంగభద్రలో మునిగి డాక్టర్ అనన్య మృతి
సాక్షి, బెంగళూరు/హైదరాబాద్: సరదాగా విహారయాత్రకు వెళ్లిన వైద్యుల బృందంలో విషాదం చోటుచేసుకుంది. తుంగభద్రలో దూకి ఈత కొట్టే క్రమంలో హైదరాబాద్కు చెందిన డాక్టర్ అనన్యరావు (27) మృతిచెందారు. నదిలో నుంచి రెస్క్యూ టీమ్ తాజాగా ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో, కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.వివరాల ప్రకారం.. డాక్టర్ అనన్యరావు, మరో ఇద్దరు స్నేహితులు సాత్విన్, హషితలతో కలిసి హంపీ టూర్కి వచ్చారు. స్మారకాలను వీక్షించి మంగళవారం రాత్రి సణాపుర గ్రామంలోని ఓ అతిథి గృహంలో బస చేశారు. బుధవారం మధ్యాహ్నం ఈత కొట్టడానికి తుంగభద్ర నది వద్దకు వెళ్లారు. అనంతరం, సుమారు 25 అడుగుల ఎత్తు గల బండరాయి నుంచి అనన్యరావు నీటిలో దూకి ఈత కొట్టాలనుకుంది.దీంతో, రాళ్ల పైనుంచి నీటిలో దూకెసింది. నీటిలో కాసేపు ఈత కొట్టిన అనన్య.. కాసేపటికే నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ఈ క్రమంలో అనన్య కాపాడేందుకు స్నేహితులు ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నం ఫలించలేదు. ఇక, ఈ ప్రదేశంలో తుంగభద్ర రాతి గుహల్లో ప్రవహిస్తూ ఉంటుంది. యువతి ఈ గుహల్లో చిక్కుకు పోయింటారని పోలీసులు అనుమానించారు. దీంతో గంగావతి గ్రామీణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక గజ ఈతగాళ్లు, అగ్నిమాపకదళం సాయంత్రం వరకు ప్రయత్నించినా ఆమె జాడ కనిపించలేదు.తాజాగా గురువారం ఉదయం అనన్యరావు మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో, అనన్య కుటుంబ సభ్యులు, స్నేహితులు బోరున విలపిస్తున్నారు. ఇక, అనన్య నదిలో దూకిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు.. అనన్యరావు తండ్రి డా.మెహన్రావు అని, ఆమె వీకేసీ ఆస్పత్రిలో వైద్యురాలని తెలిసింది.#KoppalMishap #Sanapur Video showing #AnanyaRao a doctor from #Hyderabad who jumped into the #Tungabhadra river on Tuesday went missing . Rescue operation has not yielded any results so far @NewIndianXpress @XpressBengaluru @Dir_Lokesh pic.twitter.com/Bsd0H9VnzA— Amit Upadhye (@AmitSUpadhye) February 19, 2025 -
సాటి లేరెవరూ నీ సాహసానికి!
బెంగళూరుకు చెందిన అనన్య ప్రసాద్ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఒంటరి ప్రయాణం చేసిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. స్పానిష్ కానరీ దీవుల్లోని లా గోమెరా నుంచి 52 రోజుల్లో కరీబియన్ దీవుల్లోని ఆంటిగ్వాకు చేరుకుంది. 52 రోజుల్లో 3,000 మైళ్ల చారిత్రాత్మక యాత్రను ముగించింది. అనన్య ప్రముఖ కన్నడ కవి జీఎస్ శివరుద్రప్ప మనవరాలు.బెంగుళూరులో పుట్టిన అనన్య పెరిగింది, చదువుకున్నదీ యూకేలో. సరదాగా మొదలైన రోయింగ్ హాబీ ఆ తరువాత అంకితభావంతో కూడిన పాషన్గా మారింది.‘రోయింగ్ను వ్యాయామంగా ఆస్వాదిస్తాను. రోయింగ్ అనేది నా దృష్టిలో సాహసం’ అంటుంది అనన్య.వరల్డ్స్ టఫెస్ట్ రో’లో అన్ని వయసులు, అన్ని దేశాల వారు పాల్గొంటారు. ఈ రేసుకు అర్హత సాధించడానికి మూడున్నరేళ్లు శిక్షణ తీసుకుంది అనన్య. శిక్షణలో మానసిక, శారీరక ఫిట్నెస్, సాంకేతిక నైపుణ్యంపై పట్టు సాధించింది.తన యాత్రలో అనూహ్యమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోవడంలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులను, సవాళ్లను ఎదుర్కొంది. ప్రతిరోజు 60 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించేది. రోజుకు 5 నుంచి 6 గంటలు మాత్రం విశ్రాంతికి కేటాయించేది. ‘ఒంటరిగా ఉన్నప్పటికీ నాకు ఎప్పుడూ ఒంటరిగా అనిపించలేదు. వాతావరణ, సాంకేతిక నిపుణులు, సోషల్ మీడియా బృందాలతో ఎప్పుడూ టచ్లోనే ఉన్నాను’ అని తన ప్రయాణాన్ని గుర్తు తెచ్చుకుంది అనన్య.తన సాహసానికి సామాజిక ప్రయోజనాన్ని కూడా జత చేసింది. మన దేశంలోని అనాథ పిల్లలకు ఆసరాగా నిలిచే మెంటల్ హెల్త్ ఫౌండేషన్, దీనబంధు ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థల కోసం విరాళాలు సేకరించింది. -
లైగర్ లో నటించడం నాకు ఇష్టం లేదు
-
ఎవరీ అనన్య రాజే సింధియా..? 400 గదులు, 560 కిలోల బంగారంతో..
భారతదేశంలో రాజులు, రాజుల కాలం ముగిసినప్పటికీ వారి వంశస్థులు తమ వాసత్వ సంపద్రాయాన్ని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. అదే విధంగా జీవిస్తున్నాయి. అలా వారసత్వాన్ని ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న రాజవంశమే గాల్వియర్లోని సింధియా కుటుంబం. ఈ కుటుంబం రాజరికానికి పర్యాయ పదంగా ఉంటుంది. ఆ కుటుంబం వేరెవరో కాదు మన ప్రధాని మెదీ ప్రభుత్వంలోని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుటుంబమే. అలాంటి వ్యక్తి కుమార్తె అనగానే ఏ రేంజ్లోఉంటుదని సర్వత్రా కుతుహలంగా ఉంటుంది. అయితే ఆమె మాత్రం చాలా సాదాసీదాగా ఉంటుంది. ఆమె నివశించే రాజదర్బారు లాంటి ప్యాలెస్కి జీవనవిధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మరీ ఆ విశేషాలేంటో చూద్దామా..!.ఆ రాకుమార్తె ఎవరంటే ..జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia), మహారాణి ప్రియదర్శిని రాజే(Maharani Priyadarshini Raje)ల ముద్దుల తనయే అనన్య రాజే సింధియా(Ananya Raje Scindia,). అందంలో ఆమె తల్లిని మించి అందంగా ఉంటుందని అంతా అనుకుంటుంటారు. అంతేగాదు అనన్య ప్రపంచంలోని 50 మంది అందమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది కూడా. రాజవంశానికి చెందినదైనా..జనబాహుళ్యానికి దూరంగా ఉంటారు. పైగా సోషల్ మీడియాలో కూడా లోప్రొఫైల్ని కలిగి ఉంది. ఇక మంత్రి జ్యొతిరాదిత్య సింధియాకి కుమార్తె అనన్య తోపాటు కుమారుడు ప్రిన్స్ మహానార్యమన్ కూడా ఉన్నాడు. కుమార్తె ప్రిన్సెస్ అనన్య రాజే సింధియాకి తన రాజకుటుంబ వారసత్వానికి తగ్గట్టుగా సాహస క్రీడలు, గుర్రపుస్వారీ, ఫుట్బాల్ వంటి వాటి పట్ల మక్కువ. ఇక ప్రాథమిక విద్యను ఢిల్లీలోని బ్రిటిష్ స్కూల్లో పాఠశాలలో పూర్తి చేయగా, ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్లో ఉన్నత విద్యను అభ్యసించింది. ఇంతటి విలాసవంతమైన కుటుంబంలో జన్మించినప్పటికీ తన కాళ్లపై తాను నిలబడాలన్న ఉద్దేశ్యంతో స్నాప్చాట్(Snapchat)లో ఇంటర్న్గా పనిచేసి, ఆ తర్వాత ఆపిల్ కంపెనీ(Apple)లో డిజైనర్ ట్రైనీగా పనిచేస్తుందామె. ఆమె 2018లో ప్రతిష్టాత్మక పారిస్ ఫ్యాషన్ ఈవెంట్ 'లే బాల్'లో పాల్గొన్నప్పుడే ప్రజల దృష్టిని ఆకర్షించింది. కేవలం 16 ఏళ్ల వయసులో తన సోదరుడు మహానార్యమన్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంది. అయితే ఈ వేడుకలో ఆమె ధరించిన దుస్తులు ప్రశంసనీయంగానూ చర్చనీయాంశగానూ మారాయి. వాళ్లుండే ప్యాలెస్..సింధియా కుటుంబ రాజ నివాసం జై విలాస్ ప్యాలెస్. ఇవి వారి వారసత్వానికి చిహ్నం. ఈ అత్యద్భుత నిర్మాణానికి ఎవ్వరైన ఫిదా అవ్వుతారు. ఎందుకంటే సుమారు 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 400 గదులు కలిగిన విలాసవంతమైన ఫ్యాలెస్. ఇందులోని గ్రాండ్ దర్బార్ హాల్ దాని ఐశ్వర్యానికి ప్రధాన ఆకర్షణ. ఈ ప్యాలెస్ మొదటి అంతస్తు టస్కాన్ నిర్మాణ శైలిని, రెండో అంతస్తు ఇటాలియన్ డోరిక్ శైలి, మూడవ అంతస్తులో కొరింథియన్లో నిర్మించారు. దీని ఖరీదు వచ్చేసి..దగ్గర దగ్గర రూ. 4 వేల కోట్టు పైనే ఉంటుందట. దీన్ని 1874లో మహారాజా జయజీరావు సింధియా నిర్మించారు. అంతేగాదు ఈ ప్యాలెస్లో అత్యంత బరువైన 3,500 కిలోగ్రాముల షాన్డిలియర్ లైటింగ్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుందట. దీన్ని ప్యాలెస్ పైకప్పు తట్టుకోగలదో లేదని ఏకంగా పది ఏనుగుల చేత పదిరోజుల పాటు నడిపించి పరీక్షించారట. అలాగే గ్రాండ్ దర్బార్ హాల్లో 560 కిలోగ్రాముల బంగారంతో అలంకరించిన గోడ కళ్లు చెదరిపోయేలా ఉంటుందట. దీంతోపాటు ఇందులో ఉండే విలాసవంతమైన భోజనశాలలోని వెండిరైలు టేబుల్పై వంటలను వడ్డించడం అత్యంత ఆశ్చర్యానికి లోను చేస్తుంది. అంతేగాదు ఈ ప్యాలెస్లో ఉండే 35 గదులను రాజమాతా విజయ రాజే సింధియా, జివాజిరావ్ సింధియా జ్ఞాపకార్థం మ్యూజియంలుగా మార్చారు. దీన్ని హెచ్.హెచ్. మహారాజా జివాజిరావ్ సింధియా మ్యూజియం అని పిలుస్తారు ప్రజలు. గాల్వియర్లో తప్పక చూడాల్సిన పర్యాటక స్పాట్ కూడా ఇదే.(చదవండి: 140 కిలోల బరువుతో ఒబెసిటీతో బాధపడ్డాడు..ఇవాళ ఏకంగా 55 కిలోలు..!) -
ఐటీ ఉద్యోగుల క్రష్గా అనన్య (ఫోటోలు)
-
హీరోయిన్గా టాలీవుడ్ స్టార్ నటి కూతురు.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
చాలా పెద్ద కథ అనిపించింది: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
‘‘΄పొట్టేల్’ సినిమా చూశాను.. చాలా బాగా నచ్చింది. కథ విన్నాక ఇది చిన్న కథ కాదు చాలా పెద్ద కథ అనిపించింది. సాహిత్ ఇంత అద్భుతంగా తీస్తాడని ఊహించలేదు. నాకు చాలా పెద్ద బడ్జెట్ మూవీలా కనిపించింది. నిర్మాతలు చాలాఫ్యాషన్తో తీశారు. అజయ్, యువ, అనన్య, నోయల్, జీవా అందరూ సూపర్గా నటించారు. యువ దర్శకులు ఎవరూ ఇటీవల పూర్తి స్థాయి గ్రామీణ నేపథ్యంలో సినిమా చేయలేదనుకుంటున్నాను. ఆ నేపథ్యంలో ‘రంగస్థలం’ చిత్రం తర్వాత నేను చూసిన సినిమా ‘΄పొట్టేల్’. ఈ సినిమాని అందరూ ప్రోత్సహించాలి’’ అని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కోరారు. యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘΄పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువ చంద్రకృష్ణ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారి స్ఫూర్తితో మొదలైన నా జర్నీ ఇక్కడ వరకూ వచ్చింది.‘΄పొట్టేల్’లో చాన్స్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఇటీవల ఏ సినిమాకీ ΄పొందని అనుభూతిని ప్రేక్షకులు మా ‘΄పొట్టేల్’తో ΄పొందుతారు’’ అని సాహిత్ చెప్పారు. ‘‘చదువు విలువ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది’’ అన్నారు సురేష్ కుమార్. ‘‘΄పొట్టేల్’ లాంటి సినిమా తీసిన నా ఫ్రెండ్ సాహిత్ పేరు చాలా కాలం గుర్తుండిపోతుంది’’ అన్నారు నిశాంక్ రెడ్డి. -
సివిల్స్ టాపర్ ఆదిత్య
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ –2023 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం ప్రకటించింది. అఖిలభారత స్థాయిలో తొలి ర్యాంకును ఆదిత్య శ్రీవాస్తవ, రెండో ర్యాంకును అనిమేశ్ ప్రధాన్ సొంతం చేసుకున్నారు. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్యరెడ్డి ఆలిండియా మూడో ర్యాంకు దక్కించుకోవడం విశేషం. నాలుగు ర్యాంకు పి.కె.సిద్ధార్థ్ రామ్కుమార్కు, ఐదో ర్యాంకు రుహానీకి లభించింది. అఖిలభారత సర్వీసులకు మొత్తం 1,016 మంది ఎంపికయ్యారు. వీరిలో 664 మంది పరుషులు, 352 మంది మహిళలు ఉన్నారు. టాప్–5 ర్యాంకర్లలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు.. టాప్–25 ర్యాంకర్లలో 15 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. ఎంపికైన అభ్యర్థుల్లో 30 మంది దివ్యాంగులు ఉన్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది. సివిల్స్–2023కి 10.16 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 5.92 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. 14,624 మంది మెయిన్స్కు అర్హత సాధించారు. వీరిలో 2,855 మంది పర్సనాలిటీ టెస్టు(ఇంటర్వ్యూ)కు అర్హత సాధించారు. చివరకు 1,016 మందిని కేంద్ర సర్వీసులకు యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 347 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు 115 మంది, ఓబీసీలు 303 మంది, ఎస్సీలు 165 మంది, ఎస్టీలు 86 మంది ఉన్నారు. సివిల్స్–2023 ఫలితాల పూర్తి వివరాలను http:// www.upsc. gov. in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు సివిల్ సర్వీసెస్ పరీక్షలో నెగ్గి, కేంద్ర సర్వీసులకు ఎంపికైన విజేతలకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వారి అంకితభావం, శ్రమకు తగిన ప్రతిఫలం లభించిందని పేర్కొన్నారు. విజేత కృషి, ప్రతిభ దేశ భవిష్యత్తుకు తోడ్పడుతుందని వివరించారు. మెరిసిన ఐఐటీ గ్రాడ్యుయేట్ ►సివిల్స్ తొలి ర్యాంకర్ ఆదిత్య శ్రీనివాస్తవ మెయిన్స్ లో తన ఆప్షనల్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ను ఎంచుకున్నారు. ఆయన ఐఐటీ–కాన్పూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ (బీటెక్) పూర్తిచేశారు. ►రెండో ర్యాంకర్ అనిమేశ్ ప్రధాన్ ఐఐటీ–రూర్కెలాలో కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ అభ్యసించారు. సివిల్స్ మెయిన్స్ లో ఆప్షనల్గా సోషియాలజీని ఎంచుకున్నారు. ►తెలుగు యువతి, సివిల్స్ మూడో ర్యాంకర్ దోనూరు అనన్యరెడ్డి ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(ఆనర్స్) జాగ్రఫీ చదివారు. సివిల్స్ మెయిన్స్ లో ఆమె ఆప్షనల్ సబ్జెక్టు ఆంథ్రోపాలజీ. -
Ananya Tripathi: కోడర్ టు రియల్ ఎస్టేట్ క్వీన్
రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల పేర్లు అరుదుగా వినిపిస్తాయి. కోడర్, స్ట్రాటజీ కన్సల్టెంట్, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్, సీయీవోగా మంచి పేరు తెచ్చుకున్న 39 సంవత్సరాల అనన్య త్రిపాఠి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టి విజయం సాధించింది. ‘రియల్ ఎస్టేట్ క్వీన్’గా పేరు తెచ్చుకుంది... ఆర్మీ ఆఫీసర్ కూతురు అయిన అనన్య త్రిపాఠి తరచుగా ఒక స్కూల్ నుంచి మరో స్కూల్కు మారుతూ ఉండేది. ‘రకరకాల ప్రాంతాలలో చదువుకోవడం వల్ల ఎన్నో సంస్కృతుల గురించి తెలుసుకునే అవకాశం, అదృష్టం దొరికింది’ అంటుంది అనన్య. పుణెలోని ఆర్మీ ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ పూర్తిగా చేసిన అనన్య ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ ‘టీసీఎస్’ తొలి ఉద్యోగం చేసింది. కోడర్గా మంచి పేరు వచ్చినా తన దృష్టి వ్యాపారంగంపై మళ్లింది. అలా కోళికోద్ – ఐఐఎంలో ఎంబీఏ చేసింది. క్యాంపస్ సెలెక్షన్లో ‘మెకిన్సీ’కి ఎంపికైన ఏకైక స్టూడెంట్ అనన్య. గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ ‘మెకిన్సీ’లో ఏడు సంవత్సరాల ప్రయాణం తనకు ఎన్నో పాఠాలు నేర్పింది. మార్గదర్శకులలాంటి వ్యక్తులతో పరిచయం జరిగింది. విశ్లేషణాత్మకంగా ఉండడంతో పాటు స్ట్రక్చర్డ్ డాటా తాలూకు సమస్యలను పరిష్కారించడానికి సంబంధించిన జ్ఞానాన్ని మెకిన్సీలో సొంతం చేసుకుంది. అయితే ఫ్యాషన్ ఇ–కామర్స్ కంపెనీ ‘మింత్రా’ నుంచి వచ్చిన అవకాశం అనన్య కెరీర్ను మార్చి వేసింది. ఇ–కామర్స్ గురించి ఎన్నో సందేహాలు ఉన్న ఆ కాలంలో ‘మింత్రా’ నుంచి వచ్చిన ఆఫర్కు వెంటనే ఓకే చెప్పడం కష్టమే. అయినప్పటికీ సందేహాలను పక్కన పెట్టి చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ హోదాలో ‘మింత్రా’లో చేరింది అనన్య. మూడున్నరేళ్లలో ‘మింత్రా’ లాభాలను పెంచింది. ఆ తరువాత గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ ‘కేకేఆర్ కేప్స్టోన్’ నుంచి కొత్త కెరీర్ ఆపర్చునిటీ వెదుక్కుంటూ వచ్చింది. ‘కేకేఆర్’లో మాక్స్ హెల్త్కేర్, వినీ కాస్మెటిక్స్లాంటి కంపెనీలతో కలిసి పనిచేసింది. అనన్య మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ గ్రూప్ ‘బ్రూక్ఫీల్డ్’ నుండి పిలుపు వచ్చింది. మామూలుగానైతే మెటర్నిటీ బ్రేక్లో ఉన్నప్పుడు సెలవు కాలం పూర్తయ్యేంత వరకు చాలా కంపెనీలు వేచి చూడవు. అయితే బ్రూక్ఫీల్డ్ మాత్రం అనన్య ప్రతిభాసామర్థ్యాలపై నమ్మకంతో ఓపిగ్గా వేచి చూసింది. వారి నమ్మకాన్ని అనన్య వమ్ము చేయలేదు. ‘పలు పరిశ్రమలకు సంబంధించి ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్లలో అనన్యకు అపారమైన అనుభవం ఉంది. స్ట్రాటజీ కన్సల్టెంట్, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్గా ఆమె ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది’ అంటాడు బ్రూక్ఫీల్డ్ రియల్ ఎస్టేట్ మేనేజింగ్ పార్టనర్ అంకుర్ గుప్తా. బ్రూక్ఫీల్డ్ రియల్ ఎస్టేట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్గా మరోసారి గెలుపు జెండా ఎగరేసిన అనన్య త్రిపాఠి నుంచి వినిపించే సక్సెస్మంత్రా ‘కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి’. -
‘అనన్య’ అద్భుత విజయం సాధించాలి
జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘అనన్య’. ప్రసాద్ రాజు బొమ్మిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ పతాకంపై జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ నిర్మించారు. హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథాచిత్రంగా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 22న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో "అనన్య" ప్రి రిలీజ్ వేడుకను హైద్రాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు సుమన్, యువ కథానాయకుడు సందీప్ మాధవ్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ప్రముఖ దర్శకనిర్మాత సాయి వెంకట్, విశ్రాంత న్యాయమూర్తి మాల్యాద్రి, శ్రీనివాస్ బోగిరెడ్డి, యువ దర్శకుడు అఫ్జల్ తోపాటు యూనిట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. "అనన్య" అద్భుత విజయం సాధించాలని ఈ సందర్భంగా అతిధులు అభిలషించారు. ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న "అనన్య" అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరించి తమ "శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్"కు శుభారంభాన్నిస్తుందని నిర్మాత జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ పేర్కొన్నారు. సెన్సార్ సభ్యుల ప్రశంసలు దండిగా అందుకుని, ఈనెల 22న వస్తున్న "అనన్య" ప్రేక్షకుల ఆదరాభిమానాలు సైతం పుష్కలంగా పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు ప్రసాద్ రాజు బొమ్మిడీ తెలిపారు. తమ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసి, ఆల్ ది బెస్ట్ చెప్పిన హీరో శ్రీకాంత్ కు దర్శకనిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు. -
‘అనన్య’ విజయం సాధించాలి: హీరో శ్రీకాంత్
జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘అనన్య’. ప్రసాద్ రాజు బొమ్మిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ పతాకంపై జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ నిర్మిస్తున్నారు. హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథాచిత్రంగా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 22న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో "అనన్య" ప్రచార చిత్రాన్ని శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ ఆవిష్కరించి, ఈ చిత్రం ఘన విజయం సాధించాలని అభిలషించారు. ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరించి తమ "శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్"కు శుభారంభాన్నిస్తుందని నిర్మాత జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ పేర్కొన్నారు. సెన్సార్ సభ్యుల ప్రశంసలు దండిగా అందుకుని, ఈనెల 22న వస్తున్న "అనన్య" ప్రేక్షకుల ఆదరాభిమానాలు సైతం పుష్కలంగా పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు ప్రసాద్ రాజు బొమ్మిడీ తెలిపారు. తమ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసి, ఆల్ ది బెస్ట్ చెప్పిన హీరో శ్రీకాంత్ కు దర్శకనిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు. -
ఈమె స్టార్ హీరోయిన్, ఆ ఒక్క సినిమాతో చాలా ఫేమస్.. కానీ ఆ తర్వాతే!
ఈమెని చూస్తే అచ్చ తెలుగమ్మాయి అనుకుంటారు. కానీ ఈమెది తెలుగు కాదు. సొంత భాషలో కెరీర్ సంగతి పర్లేదు కానీ తెలుగులో మాత్రం ఒకే ఒక్క సినిమాతో యమ క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత మాత్రం టాలీవుడ్లో సరిగా కెరీర్ ప్లాన్ చేసుకోలేకపోయింది. భారీ బడ్జెట్ సినిమాల్లో నటించినా లాభం లేకుండా పోయింది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు అనన్య. అరె.. ఈమెని ఎక్కడో చూసినట్లు ఉందే అనుకుంటున్నారా? పర్లేదు కాస్త గుర్తుపట్టారనమాట. కేరళలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ అసలు పేరు అయిల్య గోపాలకృష్ణ. కాకపోతే సినిమాల్లోకి వచ్చేసరికి అనన్య అని పేరు మార్చుకుంది. తండ్రి నిర్మాత కావడంతో చిన్నప్పుడే ఒకటి రెండు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) ఇక డిగ్రీ చదువుతున్నప్పుడు ఆర్చరీలో(విలువిద్య) రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదే టైంలో ఈమెకు మూడు నాలుగు సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. కానీ వాటికి నో చెప్పింది. కానీ కొన్నిరోజుల తర్వాత 'పాజిటివ్' అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2008 నుంచి ఇప్పటికీ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. 'జర్నీ' సినిమాతో తెలుగు ఆడియెన్స్కి దగ్గరైపోయింది. ఆ తర్వాత హీరోయిన్గా తెలుగులో 'అమాయకుడు' అని స్ట్రెయిట్ మూవీ చేసింది. కానీ ప్లాఫ్ అయింది. గత కొన్నాళ్లలో అయితే 'అఆ', 'మహర్షి' లాంటి తెలుగు సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు చేసింది కానీ టాలీవుడ్లో ఇదేమంతగా ఉపయోగపడలేదు. దీంతో పూర్తిగా మలయాళ చిత్రాలకే పరిమితమైపోయింది. నటిగా కొనసాగుతూనే 2012లో ఆంజనేయన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతానికైతే ఓవైపు ఫ్యామిలీ, మరోవైపు యాక్టింగ్ కెరీర్ బ్యాలెన్స్ చేసుకుంటోంది. అయితే చాలారోజుల తర్వాత ఈమెని చూసి నెటిజన్స్ గుర్తుపట్టలేకపోయారు. కాసేపటి తర్వాత ఈమె 'జర్నీ' హీరోయిన్ కదా అని గుర్తుపట్టారు. (ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ) View this post on Instagram A post shared by SuMaN RaMdAs 🇮🇳 (@the_art_of_photographer) -
ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో బబుల్గమ్ చిత్ర యూనిట్ సందడి
-
వినోదాల పొట్టేల్
యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పొట్టేల్’. ‘బందం రేగడ్’, ‘సవారీ’ చిత్రాల ఫేమ్ సాహిత్ మోతుకూరి దర్శకత్వంలో నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్ లాంచ్ ఈవెంట్కు అతిథిగా హాజరైన నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ– ‘‘పొట్టేల్’ సినిమా ఫస్ట్ లుక్ వీడియో చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది. ఈ సినిమా షూటింగ్ను చూసేందుకు సెట్స్కు వెళ్లాను. ప్రేక్షకులకు ఓ మంచి కథని చూపించడానికి టీమ్ చాలా కష్టపడి పని చేసింది. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చి, పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు. ‘‘వినోదంతో పాటు మంచి ప్రయోజనం కోసం చేసిన చిత్రమిది’’ అన్నారు యువ చంద్రకృష్ణ. ‘‘పొట్టేల్’ కథ రాసినప్పుడు ఎంత హై ఫీలయ్యానో అదే హై ఈ రోజు వరకూ వుంది. నిశాంక్, సురేష్ చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. యువ చంద్ర, అనన్య బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ చిత్రంలో అజయ్గారు కీ రోల్ చేశారు’’ అన్నారు సాహిత్ మోతుకూరి. ‘‘సినిమా అద్భుతంగా వచ్చింది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు నిశాంక్, సురేష్. ‘‘అందరూ గుర్తుంచుకునే చిత్రం అవుతుంది’’ అన్నారు అనన్య. -
రహస్యాలెన్నో..
‘కాలగర్భంలో కలిసిపోయిన మన తాంత్రిక శాస్త్రాన్ని తెరిస్తే అందులో ఊహకందని రహస్యాలెన్నో!’ అనే వాయిస్ ఓవర్తో మొదలవుతుంది ‘తంత్ర’ సినిమా టీజర్. శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్ రఘుముద్రి హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో అనన్యా నాగళ్ల, సలోని, ‘టెంపర్’ శీను ఇతర ప్రధాన పాత్రధారులు. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో నరేశ్బాబు. పి, రవి చైతన్య నిర్మిస్తు్తన్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. ‘‘ఇందులో దుష్టశక్తి బారిన పడిన అమ్మాయి పాత్రలో అనన్య, తాంత్రికుడిగా ‘టెంపర్ శీను’, ఓ మిస్టీరియస్ పాత్రలో సలోని కనిపిస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. -
రాకేష్ మరిన్ని సినిమాలు చేయాలి
‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్లో జరిగింది. తొలి సన్నివేశానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి కెమెరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ ఎంపీ (రాజ్యసభ) సంతోష్ కుమార్ క్లాప్ ఇచ్చారు. నటుడు తనికెళ్ల భరణి గౌరవ దర్శకత్వం వహించగా, నటుడు సాయికుమార్ మేకర్స్కి స్క్రిప్ట్ అందజేశారు. గ్రీన్ ట్రీ ప్రోడక్షన్స్ పతాకంపై జయలక్ష్మీ సాయి కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకత్వం వహిస్తుండగా, అనన్యా నాగళ్ల హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాప్రా రంభోత్సవంలో రోజా మాట్లాడుతూ– ‘‘రాకేష్కి ఎప్పట్నుంచో లీడ్ రోల్ చేయాలని ఉంది. ఈ సినిమాతో అది నెరవేరడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా విజయం సాధించి, భవిష్యత్లో రాకేష్ మరిన్ని సినిమాలు చేసి, ప్రజలకు వినో దాన్ని పంచాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.‘‘నటుడిగా, నిర్మాతగా రాకేష్ మరెన్నో సినిమాలు చేసి, మంచి పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు ఎంపీ సంతోష్ కుమార్. ‘‘చిన్న సినిమాలు పెద్దగా అవుతున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించి, రాకేష్ మరో పది సినిమాలు చేసే స్థాయికి రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు తనికెళ్ల భరణి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: చరణ్ అర్జున్. -
ఫైనాన్షియల్ లిటరసీతో మహిళా ప్రపంచాన్ని మార్చేస్తోంది!
ఏమీ తెలియకపోవడం వల్ల కలిగే నష్టం సంక్షోభ సమయంలో, కష్టసమయంలో భయపెడుతుంది. బాధ పెడుతుంది. సమస్యల సుడిగుండంలోకి నెట్టి ముందుకు వెళ్లకుండా సంకెళ్లు వేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అనన్య పరేఖ్ ‘ఇన్నర్ గాడెస్’ అనే సంస్థను ప్రారంభించింది. ‘ఇన్నర్ గాడెస్’ ద్వారా ఫైనాన్షియల్ లిటరసీ నుంచి మెంటల్ హెల్త్ వరకు అట్టడుగు వర్గాల మహిళల కోసం దేశవ్యాప్తంగా వర్క్షాప్లు నిర్వహిస్తోంది. చెన్నైలోని మైలాపూర్లో ఉమ్మడి కుటుంబంలో పెరిగిన అనన్య పెద్దల నుంచి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంది. ఆరు సంవత్సరాల వయసు నుంచే పుస్తకాలు చదవడం అలవాటైంది. ‘పుస్తకపఠనం అలవాటు చేయడం అనేది నా కుటుంబం నాకు ఇచ్చిన విలువైన బహుమతి’ అంటున్న∙ అనన్య పెద్దల నుంచి విన్న విషయాలు, పుస్తకాల నుంచి తెలుసుకున్న విషయాల ప్రభావంతో సమాజం కోసం ఏదైనా చేయాలనే ఆలోచన చేయడం ప్రారంభించింది. సోషల్ ఎంట్రప్రెన్యూర్గా వడివడిగా అడుగులు వేయడానికి ఈ ఆలోచనలు అనన్యకు ఉపకరించాయి. అనేక సందర్భాలలో లింగ విక్ష ను ఎదుర్కొన్న అనన్య ‘ఇది ఇంతేలే’ అని సర్దుకుపోకుండా ‘ఎందుకు ఇలా?’ అని ప్రశ్నించేది. కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి చర్చించేది. తమ ఇంటికి దగ్గరగా ఉండే ఒక బీద కుటుంబానికి చెందిన పిల్లల కోసం క్లాసు పుస్తకాలు కొనివ్వడం ద్వారా సామాజిక సేవకు సంబంధించి తొలి అడుగు వేసింది అనన్య. ఏరో స్పేస్ ఇంజనీరింగ్ చేసిన అనన్య ఉన్నత ఉద్యోగాలపై కాకుండా మహిళల హక్కులు, మహిళా సాధికారత, చదువు... మొదలైన అంశాలపై దృష్టి పెట్టింది. చెన్నై కేంద్రంగా ‘ఇన్నర్ గాడెస్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ తరపున అట్టడుగు వర్గాల మహిళల కోసం ఫైనాన్షియల్ లిటరసీ, ఫైనాన్షి యల్ యాంగై్జటీ, మెంటల్ హెల్త్, పర్సనల్ ఇన్వెస్టింగ్... మొదలైన అంశాలపై దేశవ్యాప్తంగా డెబ్భైకి పైగా వర్క్షాప్లు నిర్వహించింది. సరైన సమయంలో ఆర్థిక విషయాలపై అవగాహన కలిగిస్తే అది భవిష్యత్ కార్యాచరణకు ఉపయోగపడుతుందనే నమ్మకంతో పదహారు నుంచి ఇరవైనాలుగు సంవత్సరాల మధ్య ఉన్న యువతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఇన్నర్ గాడెస్. ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం కలిగే ఇబ్బందులు, ఉండడం వల్ల కలిగి మేలు, జీరో స్థాయి నుంచి వచ్చి విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తల గురించి ఈ వర్క్షాప్లలో చెప్పారు. షాపింగ్ నుంచి బ్యాంక్ వ్యవహారాల వరకు ఒక మహిళ తన భర్త మీద ఆధారపడేది. దురదృష్టవశాత్తు అతడు ఒక ప్రమాదంలో చనిపోయాడు. ఆమె ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? ఇలాంటి మహిళలను దృష్టిలో పెట్టుకొని వ్యవహార దక్షత నుంచి వ్యాపార నిర్వహణ వరకు ఎన్నో విషయాలపై ఈ వర్క్షాప్లలో అవగాహన కలిగించారు. ‘ఇన్నర్ గాడెస్’ నిర్వహించే వర్క్షాప్ల వల్ల పర్సనల్ ఫైనాన్స్కు సంబంధించిన ఎన్నో విషయాలపై మహిళలకు అవగాహన కలిగింది. సరిౖయెన నిర్ణయాలు తీసుకోవడంలో ఇది వారికి ఉపకరించింది. ఇరవై సంవత్సరాల వయసులో ‘ఇన్నర్ గాడెస్’ను ప్రారంభించిన అనన్య తన ప్రయాణంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొంది. ‘అవరోధాలు అప్పుడే కాదు ఏదో ఒక రూపంలో ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే వాటికి ఎప్పుడూ భయపడలేదు. ప్రారంభంలో ఫైనాన్షియల్ లిటరసీ అనే కాన్సెప్ట్పై నాకు కూడా పరిమిత మైన అవగాహనే ఉండేది. కాలక్రమంలో ఎన్నో నేర్చుకున్నాను. కెరీర్కు ఉపకరించే సబ్జెక్ట్లకు తప్ప పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్పై మన విద్యాప్రణాళికలో చోటు లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో వర్క్షాప్లు నిర్వహించాం. వీటిలో ఎంతోమంది వాలంటీర్లు, స్కూల్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈ వర్క్షాప్లో పాల్గొన్న ఒక అమ్మాయి మ్యూచువల్ ఫండ్స్ గురించి అవగాహన చేసుకోవడమే కాదు, తన అమ్మమ్మకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో సహాయపడింది. ఇలాంటివి విన్న తరువాత మరింత ఉత్సాహం వస్తుంది’ అంటుంది అనన్య పరేఖ్. -
అద్భుతం.. ‘అనన్య’ నృత్యం..
గన్ఫౌండ్రీ (హైదరాబాద్): దీపాంజలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నృత్యగురువు దీపికారెడ్డి శిష్యురాలు అనన్య పొలసాని కూచిపూడి నృత్య అరంగేట్రం శనివారం రవీంద్రభారతిలో కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె చక్కటి హావభావాలతో నర్తించిన పుష్పాంజలి, భామాకలాపం ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రులు శ్రీనివాస్గౌడ్ గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు హాజరై అనన్యను అభినందించారు. అనన్య ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మేనకోడలు. -
Indian Singer-Songwriter Ananya Birla: హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అనన్య బిర్లా (ఫొటోలు)
-
అనన్య సామాన్య స్వతంత్రం
అనన్య బిర్లాకు చెందిన సూక్ష్మరుణ కంపెనీ (ఎంఎఫ్ఐ) స్వతంత్ర మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ దేశంలో రెండో అతి పెద్ద ‘ఎంఎఫ్ఐ’గా గుర్తింపు పొందనుంది. ఎంటర్ప్రెన్యూర్గా గెలుపు జెండా ఎగరేసిన అనన్య బిర్లా సింగర్, రైటర్, యాక్టర్, సోషల్ యాక్టివిస్ట్... ఏకంగా అయిదు సింగిల్స్లో డబుల్ ప్లాటినమ్ స్టేటస్ను సొంతం చేసుకుంది. అనన్య గానప్రతిభ గురించి చెప్పుకోవడానికి ఇదొక మచ్చుతునక మాత్రమే. ‘లెట్ దేర్ బి లవ్’ ‘ఎవ్రీ బడీ లాస్ట్’ పాటలతో అమెరికన్ నేషనల్ టాప్ 40 పాప్ రేడియో షో జాబితాలో చోటు సాధించిన ఫస్ట్ ఇండియన్ ఆర్టిస్ట్గా ఘనత సాధించింది. అనన్యకు చిన్నవయసు నుంచే సంగీతం అంటే ఇష్టం. పదకొండు సంవత్సరాల వయసులో సంతూర్ ప్లే చేయడం నేర్చుకుంది. ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్ కోసం ‘యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్’లో చేరిన అనన్య డిగ్రీ పూర్తి కాకుండానే చదువు మానేసింది. యూనివర్శిటీలో చదువు సంగతి ఎలా ఉన్నా సంగీతంలో మాత్రం ఎటు చూసినా అనన్య పేరు వినిపించేది. పాడడంతో పాటు కవితలు, పాటలు కూడా రాసేది. గిటార్ ప్లే చేయడం నేర్చుకుంది. ‘లివిన్ ది లైఫ్’ తన డెబ్యూ సింగిల్. యూట్యూబ్లో 14 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. మ్యూజిక్ చార్ట్స్లో టాప్లో నిలిచింది. కునాల్ కోహ్లీ స్పై థ్రిల్లర్ ‘శ్లోక్’లో నటిగా ఆకట్టుకుంది. ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు సంగీత, సాహిత్య కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేది అనన్య. ఆందోళన, కుంగుబాటుతో సతమతం అవుతున్న యువత కోసం స్టూడెంట్ హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చిన తరువాత మానసిక సమస్యలతో బాధపడే వారికి సహాయం అందించడానికి ‘ఎంపవర్’ అనే సంస్థను ఏర్పాటు చేసింది. కోవిడ్ సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి 24“7 ఫ్రీ హెల్ప్లైన్ను ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్లైన్ ద్వారా వేలాది మంది ప్రజలకు మేలు జరిగింది. అమెరికాకు చెందిన ప్రసిద్ధ మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘నేషనల్ అలయెన్స్ ఆన్ మెంటల్ ఇల్నెస్’ అంబాసిడర్గా నియమితురాలైంది. ‘అనన్య బిర్లా ఫౌండేషన్’తో సేవాకార్యక్రమా లను విస్తృతం చేసింది. సంగీతం అంటే అపారమైన అనురక్తి ఉన్న అనన్య వ్యాపారరంగంలో తొలి అడుగు వేసినప్పుడు... ‘అనన్య లోకం వేరు. ఆమె ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించడం కష్టం’ అనే గుసగుసలు వినిపించాయి. అప్పటి వరకు అనన్య పేరు పక్కన సంగీతానికి సంబంధించిన విశేషణాలు కనిపించేవి. తరువాత స్వతంత్ర మైక్రోఫిన్, ఫౌండర్ అనేది ఆమె పేరు పక్కన కనిపించడం మొదలైంది. గ్రామీణ ప్రాంతాలలో మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి ‘స్వతంత్ర’ను ఏర్పాటు చేశారు. తన నాయకత్వ లక్షణాలతో ‘స్వతంత్ర’ను అగ్రగామిగా నిలిపింది అనన్య. బెస్ట్ స్టార్టప్లకు ఇచ్చే ‘గోల్డ్ అవార్డ్’ను గెలుచుకుంది. 2016లో గ్లోబల్ లగ్జరీ ఇ–కామర్స్ ప్లాట్ఫామ్ ఇకై ఏషియాకు సీయీవోగా బాధ్యతలు చేపట్టింది. ఫోర్బ్స్ ఆసియాస్ ఉమెన్ జాబితాలో అనన్య పేరు చోటు చేసుకుంది. ‘స్వతంత్ర’ వ్యవస్థాకురాలిగా అనన్య ఆఫీస్ గదికే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలో పర్యటించేది. ఇండోర్లో ఒక పేదింటి మహిళ ‘స్వతంత్ర’ సహకారంతో ఇల్లు కట్టుకోగలిగింది. ఆమెతో మాట్లాడినప్పుడు అనన్యకు ఎంతో సంతోషంగా అనిపించింది. అనన్య అపురూప విజయాలు చూసినప్పుడు ‘ఏ పని చేసే వాళ్లు ఆ పని చేస్తే మంచిది’ ‘రెండు పడవల మీద కాలు వద్దు’ లాంటి మాటలు, సామెతలు బిత్తర పోతాయి. పనిమీద అనురక్తి, అంకితభావం ఉంటే ఒక రంగానికి చెందిన వారు మరో రంగంలో విజయం సాధించవచ్చు అని చెప్పడానికి అనన్య బిర్లాలాంటి వాళ్లు పెద్ద ఉదాహరణ. పెద్దింటి అమ్మాయి పారిశ్రామిక దిగ్గజం కుమార మంగళం బిర్లా కూతురు అయిన అనన్య బిర్లా బాల్యం నియమ నిబంధనలు, రక్షణ వలయాల మ«ధ్య గడిచింది. చిన్నప్పుడే అనన్యకు బాడీగార్డ్ ఉండేవాడు. మిగతా అమ్మాయిల్లాగా ఎక్కడ పడితే అక్కడ ఆడుకోవడానికి లేదు. ఈ రూల్స్తో తనకు ఊపిరి ఆడేది కాదు. ఒత్తిడికి గురయ్యేది. ఇంత ఒత్తిడిలోనూ తనదైన కలలు కనేది. ‘అసలు నేనేమిటి?’ అనే ప్రశ్నకు ఆమెకు సంగీతంలో జవాబు దొరికింది. సంగీతం తనలోని ఒంటరితనాన్ని పోగొట్టడమే కాదు ఆత్మబలాన్ని ఇచ్చింది. ‘పెద్దింటి అమ్మాయి’ అనే పేరు కంటే స్వేచ్ఛాప్రపంచాన్నే అనన్య ఇష్టపడేది. ‘పెద్ద యూనివర్శిటీలో పెద్ద చదువు చదవాలి. పెద్దింటి కుటుంబానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి... ఇలా నా గురించి అనుకునేవారు. అయితే నా ఆలోచనలు దీనికి భిన్నంగా ఉండేవి. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచేది. అయితే తల్లిదండ్రులు మాత్రం నాకు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉన్నారు. నా అభిప్రాయాలకు విలువ ఇచ్చారు’ అంటుంది అనన్య. -
వరల్డ్ యూనివర్సిటీ పోటీలకు అనన్యశ్రీ
మహబూబ్నగర్: ఉమ్మడి జిల్లాలోని మక్తల్కు చెందిన అనన్యశ్రీ వాలీబాల్లో విశేష ప్రతిభ కనబరుస్తుంది. 2019లో ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా అథ్లెట్ పథకం కింద కేరళలోని పట్టణమిట్టలోగల వాలీబాల్ అకాడమీకి ఎంపికై శిక్షణ తీసుకుంటుంది. ఈమె తెలంగాణతో పాటు కేరళ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం విశేషం. తెలంగాణ నుంచి 2018 పంజాబ్లో జూనియర్ నేషనల్ వాలీబాల్ టోర్నీలో రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించింది. 2019లో తమిళనాడు రాష్ట్రం ధర్మపురి, 2020 కడపలో జూనియర్ నేషనల్ వాలీబాల్ పోటీల్లో పాల్గొంది. కేరళ రాష్ట్రం తరపున గతేడాది ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రాపూర్లో 23వ జాతీయస్థాయి, మహారాష్ట్ర సాంగ్లి జిల్లా ఇస్లాంపూర్లో 24వ జాతీయస్థాయి యూత్ వాలీబాల్ పోటీల్లో పాల్గొంది. కేరళలో సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ, మహారాష్ట్ర రాష్ట్రం కొల్హాపూర్లో సీనియర్ లీగ్ (హరియంట్ చసాక్) వాలీబాల్ టోర్నీలో పాల్గొంది. ఈ మూడు టోర్నీల్లో కేరళ జట్టు విన్నర్గా నిలిచింది. అస్సాం రాష్ట్రం గౌవహాటిలో ఈ ఏడాది ఫిబవరిలో 71వ ఉమెన్ సీనియర్ నేషనల్ వాలీబాల్ పోటీలకు కేరళ రాష్ట్ర జట్టుకు అనన్యశ్రీ ప్రాతినిథ్యం వహించింది. సీనియర్ నేషనల్ వాలీబాల్ చాంపియన్షిప్లో కేరళ మహిళా జట్టు విజేతగా నిలవడంతో అనన్యశ్రీ బంగారు పతకం సాధించింది. పాండిచ్చేరిలో ఫెడరేషన్ కప్ వాలీబాల్ పోటీల్లో పాల్గొనగా కేరళ రాష్ట్ర జట్టు రన్నరప్గా నిలిచింది. వరల్డ్ యూనివర్సిటీ పోటీలకు.. అనన్యశ్రీ తొలిసారిగా విదేశీగడ్డపై వాలీబాల్ పోటీల్లో పాల్గొననుంది. చైనా దేశం చెంగ్డ్ నగరంలో ఈనెల 28 నుంచి వచ్చేనెల 7వ తేదీ వరకు నిర్వహించే శ్రీవరల్డ్ యూనివర్సిటీ చాంపియన్షిప్శ్రీకు ఎంపికైంది. కేరళ యూనివర్సిటీ నుంచి చైనాకు వెళ్లే ఆలిండియా యూనివర్సిటీ వాలీబాల్ జట్టులో అనన్యశ్రీ చోటు దక్కించుకుంది. ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్లో ఈనెల 19 నుంచి 24 వరకు నిర్వహించిన ప్రత్యేక కోచింగ్ క్యాంపులో పాల్గొంది. -
'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' సిరీస్ రివ్యూ
టైటిల్: అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ నటీనటులు: హర్షిత్ రెడ్డి, అనన్య, తేజస్వి మదివాడ తదితరులు నిర్మాణ సంస్థ: అర్రే స్టూడియో, లాఫింగ్ కౌ ప్రొడక్షన్ నిర్మాత: బి.సాయికుమార్, శరణ్ సాయికుమార్ దర్శకత్వం: జొనాథన్ ఎడ్వర్డ్స్ సంగీతం: అజయ్ అరసాడ సినిమాటోగ్రఫీ: అమర్ దీప్ గుత్తుల ఎడిటర్: నాగేశ్వర్ రెడ్డి బొంతల విడుదల తేదీ: 30 జూన్ 2023 తెలుగులో ఓటీటీ అంటే అందరికీ గుర్తొచ్చేది 'ఆహా'నే. మిగతా వాటిల్లో తెలుగు సినిమాలు, సిరీసులు అప్పుడప్పుడు వస్తుంటాయి కానీ దీనిలో మాత్రం ప్రతివారం ఓ సినిమా లేదంటే వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తుంటారు. వాటి రిజల్ట్ సంగతి పక్కనబెడితే ప్రేక్షకుల్ని మాత్రం అలరిస్తుంటాయి. అలా ఈసారి 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' అనే వెబ్ సిరీస్ తీసుకొచ్చారు. హర్షిత్ రెడ్డి, అనన్య, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కథేంటి? అరుణ్ కుమార్ (హర్షిత్ రెడ్డి)ది అమలాపురం. కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేయాలని హైదరాబాద్కి వస్తాడు. ఓ స్టార్టప్ కంపెనీలో ఇంటర్న్గా చేరుతాడు. ఇతడి టీమ్ లీడ్ జై మాత్రం అరుణ్ని బానిసలా చూస్తుంటాడు. ఓ పందెం వల్ల అరుణ్.. షాలినీ(తేజస్వి మదివాడ) టీమ్లోకి వచ్చిపడతాడు. కొన్నిరోజుల్లోనే ఆమె దగ్గర మంచి మార్కులు కొట్టేస్తాడు. ఏకంగా ఆమెతో పర్సనల్ రిలేషన్లోకి వెళ్లిపోతాడు. తర్వాత ఏం జరిగింది? ఈ కథలో పల్లవి(అనన్య) పాత్ర ఏంటి? ఫైనల్గా అరుణ్ ఏం తెలుసుకున్నాడు? అనేది 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' స్టోరీ. (ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ) ఎలా ఉందంటే? ఓ ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు టీమ్ లీడర్ షాలినీ అందరికీ పార్టీ ఇస్తుంది. అరుణ్ కూడా ఆ పార్టీకి వస్తాడు. డ్రింక్ చేస్తాడు. ఈవెంట్ అయిపోయిన తర్వాత సెల్లార్ లోని కారులో అరుణ్-షాలినీ కాస్త అడ్వాన్స్ అవుతారు. అదే సమయంలో వీళ్లిద్దరిని మరో ఇద్దరు చూస్తారు. అసలు వీళ్లెందుకు కారులో ముద్దుముచ్చట వరకు వెళ్లారు. అరుణ్-షాలినీని చూసిన ఆ ఇద్దరూ ఎవరో తెలియాలంటే సిరీస్ చూడండి. 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్'.. 2016లో హిందీలో వచ్చిన 'అఫీషియల్ చుక్యాగిరి' అనే వెబ్ సిరీస్కు అధికారిక రీమేక్. ఓటీటీలో ఎపిసోడ్స్ తర్వాత చాలామందికి ఇది క్లియర్ అయిపోయింది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే నేరుగా స్టోరీలోకి వెళ్లిపోయారు. అరుణ్ కుమార్ హైదరాబాద్ లో ఓ బ్యాచిలర్ రూమ్లో ఉంటాడు. ఉదయమే లేచి ఆఫీస్ కి వెళ్తాడు. కానీ అక్కడేమో టీలు చేసే పని అప్పగిస్తారు. ఆ తర్వాత ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ వెళ్లారు. కార్పొరేట్ వరల్డ్ లో ఓ సాధారణ పల్లెటూరి కుర్రాడు.. ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? పని వల్ల ఎలాంటి సంఘర్షణ అనుభవించాడు? చివరకు అనుకున్నది సాధించాడా లేదా అనేది తొలి సీజన్ లోని ఐదు ఎపిసోడ్లలో చూపించారు. ఇందులో అరుణ్ కుమార్ కి ఓ ట్రాయాంగిల్ లవ్స్టోరీ కూడా ఉంటుందండోయ్. ఒక్కో ఎపిసోడ్ 20-25 నిమిషాలే ఉంటుంది. అలా ఆడుతూ పాడుతూ సిరీస్ ని చూసేయొచ్చు. 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' లో చెప్పుకోవడానికి పెద్దగా కొత్తగా ఏం లేదు. అలా సాఫ్ట్ గా వెళ్లిపోతూ ఉంటుంది. బాగాలేదు అని చెప్పలేం అలా అని బాగుందని కూడా చెప్పలేం. ఈ సీజన్ అంతా కూడా అరుణ్ కుమార్ చుట్టూనే నడుస్తుంది. అనన్య, తేజస్వి పాత్రలని పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. బహుశా తర్వాత సీజన్లలో వీళ్లకు ప్రాధాన్యం దక్కుతుందేమో? ఎవరెలా చేశారు? అరుణ్ కుమార్ గా నటించిన హర్షిత్ రెడ్డి.. ఇంటర్న్ పాత్రలో సెట్ అయిపోయాడు. అమాయకంగా కనిపిస్తూ, అందరు చెప్పిన పనులు చేస్తూ బాగానే మెప్పించాడు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ బాగుంది. పల్లవిగా నటించిన అనన్య బాగానే నటించింది. ఈమె పాత్రకి ఇంకాస్త ఎమోషనల్ సీన్స్ పడుంటే బాగుండేది. డామినేషన్, స్వార్థం కలగలిపిన టీమ్ లీడర్ షాలినీ పాత్రలో తేజస్వి ఓకే. ఆఫీస్ బాయ్ పాత్రలో వాసు ఇంటూరి కాస్త నవ్వించే ప్రయత్నం చేశారు. మిగతా వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. స్టోరీకి తగ్గట్లు డైలాగ్స్ సింపుల్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఓకే అనిపించింది. చాలావరకు ఆఫీస్ లో ఒకే చోట సీన్లన్నీ తెరకెక్కించారు. కాబట్టి పెద్దగా ఖర్చు అయ్యిండకపోవచ్చు. నిర్మాణ విలువులు డీసెంట్ గా ఉన్నాయి. డైరెక్టర్ పర్వాలేదనిపించాడు. సిరీస్ ని ఇంకాస్త ఎమోషనల్ గా తీసుంటే బాగుండేది. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలోపే సీన్లన్నీ చకచకా పరుగెడుతుంటాయి! ఈ వీకెండ్ ఏదైనా సిరీస్ తో టైమ్పాస్ చేద్దామంటే 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' ట్రై చేయొచ్చు! -చందు, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: ‘సామజవరగమన’ మూవీ రివ్యూ) -
బిర్లా పుట్టినరోజు.. రేర్ ఫొటోతో కూతురి ఆసక్తికర పోస్ట్
ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా పుట్టినరోజు (జూన్ 14) పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమార్తె అనన్య బిర్లా రేర్ ఫొటోతో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్ననాటి ఒక త్రోబ్యాక్ ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. పాపాయిగా ఉన్న అనన్యను బిర్లా ఆప్యాయంగా ఎత్తుకున్న ఫొటోను ఆమె షేర్ చేశారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు పా! నిన్ను చాలా ప్రేమిస్తున్నాను" అంటూ అనన్య బిర్లా తన ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో ఫొటోను పోస్ట్ చేశారు. వీటికి వేలాదిగా లైక్లు, కామెంట్లు వచ్చాయి. అలాగే అనేక మంది ప్రముఖులు కూడా బిర్లాకు పుట్టినరోరజు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో నటుడు బాబీ డియోల్, పుల్కిత్ సామ్రాట్, విజె అనూషా దండేకర్ తదితరులు ఉన్నారు. ఇదీ చదవండి: బిర్లా వారసురాలు.. తండ్రి పేరు చెప్పుకునే టైపు కాదు! విభిన్న ప్రతిభతో సొంత గుర్తింపు.. వాణిజ్యం, పరిశ్రమల రంగానికి చేసిన కృషికి గాను కుమార మంగళం బిర్లాకు ఈ సంవత్సరం పద్మభూషణ్ అవార్డు లభించింది. హిందాల్కో ఇండస్ట్రీస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్తో సహా అన్ని ప్రధాన గ్రూప్ కంపెనీల బోర్డులకు ఆయన అధ్యక్షత వహిస్తున్నారు. కుమార మంగళం బిర్లా ముగ్గురు సంతానంలో అనన్య బిర్లా పెద్దది. ఆమెతోపాటు బిర్లాకు కుమారుడు ఆర్యమాన్ మరో కుమార్తె అద్వైతేషా కూడా ఉన్నారు. Happy Birthday Pa! Love you so much ❤️ pic.twitter.com/cbjB0USncM — Ananya Birla (@ananya_birla) June 14, 2023 View this post on Instagram A post shared by Ananya Birla (@ananyabirla) -
'30 వెడ్స్ 21' అనన్య గురించి ఈ విషయాలు తెలుసా?
కొన్నిసార్లు ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయినా సినిమాలు, సిరీస్లు సూపర్ హిట్ అవుతుంటాయి. అటువంటి ఓ సిరీసే ‘30 వెడ్స్ 21’. ఇందులో అద్భుతంగా నటించి, ఓవర్నైట్ యూట్యూబ్ స్టార్గా మారింది అనన్య శర్మ. ఆమె గురించి కొన్ని వివరాలు.. ► అనన్య శర్మ జన్మస్థలం వరంగల్. ప్రస్తుతం చెన్నైలోని వీఐటీ కాలేజీలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. చిన్నప్పటి నుంచి సినిమాలపై మక్కువ ఎక్కువ. ఒక రోజు యూట్యూబ్ చానెల్లో నటించే అవకాశం రావడంతో, నటనవైపు అడుగులు వేసింది. అప్పుడు ఏదో సరదాగా నటించింది. కానీ, ప్రేక్షకులు ఆమె అభినయాన్ని మెచ్చి యూట్యూబ్ స్టార్ను చేశారు. ‘చాయ్ బిస్కెట్’, ‘బాయిస్ ఫార్ములా’ చానెల్స్లోని షార్ట్ ఫిల్మ్స్తో బాగా పాపులర్ అయింది. ► ముప్పై ఏళ్ల వయసున్న అబ్బాయిని ఇరవై ఒక్కేళ్ల అమ్మాయి పెళ్లి చేసుకుంటే వచ్చే చిన్న చిన్న గొడవలు, సర్దుబాట్లు, సరదాలతో చిత్రీకరించిన ‘30 వెడ్స్ 21’ అనే సిరీస్లో అనన్య చక్కటి ప్రతిభను కనబరచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో విడుదల అయిన ‘లాలీపాప్’ అనే కవర్ సాంగ్తో అలరిస్తోంది. తను నటించిన మరో రెండు సిరీస్లూ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. కానీ, ముందు చదువు పూర్తి చేయాలి. ఆ తర్వాత నా టైమ్ మొత్తం నటనకే కేటాయిస్తాను. – అనన్య శర్మ -
నటి సత్య కృష్ణన్ కూతురు ఎంత అందంగా ఉందో చూడండి (ఫొటోలు)
-
ఊ అంటావా మావా!
యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ కీలక పాత్రల్లో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’. తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘తెలుగులో ఇప్పటి వరకూ రాని కామెడీ, హారర్ థ్రిల్లర్ చిత్రమిది. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘రేలంగి నరసింహారావుగారి 76వ చిత్రం ఇది. అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది. పాటలు చక్కగా కుదిరాయి’’ అన్నారు ప్రసన్నకుమార్. -
'లైగర్' ఫ్లాప్తో హీరోయిన్ అనన్య సంచలన నిర్ణయం!
స్టార్ కిడ్గా ఎంట్రీ ఇచ్చినా కొన్నిసార్లు అదృష్టం కలిసిరాదు. ఒక్క ఫ్లాప్ రాగానే అవకాశాలు చేజారిపోతుంటాయి. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేకు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అనన్యకు సినిమా ఫ్లాప్ కావడంతో వచ్చిన అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయి. ఊహించని విధంగా లైగర్ డిజాస్టర్ కావడంతో దాని ఎఫెక్ట్ అనన్య మీద గట్టిగానే పడింది. ఆమె నటనను బాగా ట్రోల్ చేసిన నెటిజన్లు అనన్య స్థానంలో వేరే వాళ్లని తీసుకొని ఉంటే బాగుండేదని కామెంట్స్ చేశారు. ఇక లైగర్ రిజల్ట్ తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు కూడా తగ్గాయని తెలుస్తుంది. దీంతో చేసేదేమి లేక అనన్య తన రెమ్యునరేషన్ తగ్గించేసిందట. ఇంతకుముందు సుమారు రూ. 80 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకునే అనన్య ఇప్పుడు దాదాపు రూ. 50 లక్షల వరకు రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి అనన్య అనుకున్నట్లుగా అవకాశాలు వస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
‘పుష్ప’ ఐటం సాంగ్ టైటిల్తో సినిమా
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రంలోని ఐటం సాంగ్ ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ పాట పేరుతోనే ఓ సినిమా తెరకెక్కుతుంది. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జబర్దస్త్ రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై తుమ్మల ప్రసన్నకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తయినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. మిగిలిన రెండు పాటల షూట్ కోసం కశ్మీర్ వెళ్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్లో టైటిల్ అనౌన్స్మెంట్ కార్యక్రమం చేపట్టింది. నిర్మాత మాట్లాడుతూ ‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రమిది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందనే నమ్మకం వుంది. బ్యాలెన్స్ రెండు పాటలను కాశ్మీర్లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరిస్తాం. జూలై చివరివారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. అందరూ ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా రేలంగి నరసింహారావు గారు గత సినిమాల రికార్థులను ఈ సినిమా అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు. దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ..ఇప్పటి వరకు చేసిన కామెడీ సీనిమాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. ఇది కామెడీ తో కూడుకున్న హార్రర్ సినిమా. కాశ్మీర్ లో జరిగే పాటల షూట్ తో సినిమా పూర్తి చేసుకొని జులై చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేస్తాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్తో పాటు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు కొల్లి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, దర్శకులు అజయ్ కుమార్, రాజా వన్నెం రెడ్డి, సత్య ప్రకాష్, ఆచంట గోపినాథ్, దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
Ananya Nagalla Latest Photos: అనన్య నాగళ్ల మెస్మరైజింగ్ స్టిల్స్ (ఫొటోలు)
-
Ananya: ఏదో ఒకరోజు అనన్య నంద సైంటిస్ట్ కావడం ఖాయం!
ఒడిషాలోని భువనేశ్వర్కు చెందిన అనన్య శ్రీతమ్ నంద ‘స్కూల్ టాపర్’ అనే మెచ్చుకోలు దగ్గరే ఆగిపోనక్కర్లేదు. చదువులో కూడా ఆమె సూపర్స్టార్! చిన్నప్పుడు హిందుస్థానీ రాగాలు నేర్చుకుంది. హార్మోని వాయించడంలో ప్రావీణ్యం సంపాదించింది. నాట్యంలోనూ నందాకు ప్రవేశం ఉంది. ఇండియన్ ఐడల్ జూనియర్ 1లోకి అడుగుపెట్టినప్పుడు నందాకు నిరాశ ఎదురైంది. అయినా రెట్టించిన ఉత్సాహంతో తిరిగివచ్చి ‘ఇండియన్ ఐడల్ జూనియర్ 2’ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా ఆమెకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకునే అవకాశం వచ్చింది. ‘మోదీజీని కలుసుకునే అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదు. అంత బిజీ హెడ్యూల్లో కూడా 30 నిమిషాల పాటు మాట్లాడారు. ఆ రోజును ఎన్నటికీ మరిచిపోలేను’ అంటుంది అనన్య. యూనివర్శల్ మ్యూజిక్ లేబుల్పై తన తొలి ఆల్బమ్ ‘మౌసమ్ మస్తాన’ విడుదల చేసింది. దీనికి మంచి స్పందన లభించడంతో బాలీవుడ్లో అవకాశాలు వచ్చాయి. ‘ఎంఎస్ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’ సినిమాతో బాలీవుడ్లో సింగర్గా తొలి అడుగు వేసింది అనన్య. కలర్స్ టీవి ‘రైజింగ్ స్టార్’లో పాల్గొని టాప్ 5లో నిలిచింది. ‘మీ లక్ష్యం ఏమిటి?’ అనే ప్రశ్నకు నంద నుంచి...‘సింగర్గా మంచి పేరు తెచ్చుకోవడం. కొత్త ఆల్బమ్లను తీసుకురావడం...’ అనే జవాబు వస్తుందని అనుకుంటాం. అయితే తన లక్ష్యం సైంటిస్ట్ కావడం అని చెబుతుంది నంద. చదువులో ఆమె ప్రతిభను గమనిస్తే ‘ఏదోఒకరోజు అనన్య నంద సైంటిస్ట్ కావడం ఖాయం’ అని ఖాయంగా అనుకుంటాం. -
మజిలీ బ్యూటీతో బిగ్బాస్ సోహైల్ రొమాన్స్
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న ‘ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు’ చిత్రం హైదరాబాద్లో ఆరంభమైంది. ఇందులో ‘బిగ్ బాస్’ ఫేమ్ సోహైల్ హీరోగా, ‘మజిలీ’ ఫేమ్ అనన్య హీరోయిన్గా నటిస్తున్నారు. కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సీన్కి నిర్మాత కె. అచ్చి రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కొబ్బరి బోండాం, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు’ వంటి హిట్ చిత్రాలను నాతో తీసిన కృష్ణారెడ్డితో మళ్లీ చాలా కాలం తర్వాత సినిమా చేస్తుండటం హ్యాపీ’’ అన్నారు. ‘‘నేను, కృష్ణారెడ్డి చెన్నైలో ఒకే రూమ్లో ఉండేవాళ్లం. తన దర్శకత్వంలో సినిమా నిర్మించాలనే నా కోరిక ఈ సినిమా ద్వారా తీరుతోంది’’ అన్నారు సి. కల్యాణ్. ‘‘అమెరికాలో ఒక ఇంగ్లిష్ సినిమా చేయడానికి నాకు మూడేళ్లు పట్టింది. అందుకే అక్కడ ఉండాలనిపించలేదు. తెలుగువారి ఆదరణ ఎప్పుడూ మనసుకి నిండుగా తృప్తిగా ఉంటుంది. అవే కావాలనుకుని ‘ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు’ స్టార్ట్ చేశా’’ అన్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) -
వయ్యారాలతో అదరగొడుతున్న అనన్య నాగళ్ల (ఫోటోలు)
-
తమిళంలో ఎంట్రీ ఇచ్చేసిన వకీల్సాబ్ బ్యూటీ
Annaya Nagalla Enter Into Kollywood: మల్లేశం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల. వకీల్సాబ్ సినిమాతో మాంచి క్రేజ్ సంపాదించుకున్న అనన్య ఇప్పుడు తమిళంలో సైతం ఎంట్రీ ఇచ్చేసింది. కోలీవుడ్ హీరో శశికుమార్ సినిమాలో కీలక పాత్ర చేసేందుకు అనన్య ఎంపికైంది. దీనికి సంబంధించిన అప్డేట్ను అనన్య ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. టైమ్ ట్రావెల్ బేస్డ్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి అంజల ఫేమ్ తంగం పా శరవణన్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. Tamil debut❤️ https://t.co/Qq35I2dDon — Ananya Nagalla (@AnanyaNagalla) February 15, 2022 -
‘30 వెడ్స్ 21’వెబ్సిరీస్ సీజన్-2 రెడీ.. ఫస్ట్లుక్ రిలీజ్
గతేడాది యూట్యూబ్లో విడుదలైన ‘30 వెడ్స్ 21’వెబ్సిరీస్ ఎంతలా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 30 ఏళ్ల బ్యాచిలర్కు, 21 ఏళ్ల యువతిని ఇచ్చి పెళ్లి చేస్తే వారి మధ్య ఉండే భావేద్వేగాలు ఎలా ఉంటాయన్న కాన్సెప్ట్తో తీర్చిదిద్దిన ఈ వెబ్సిరీస్ అప్పట్లో యూట్యూబ్ను షేక్ చేసింది. చైతన్య, అనన్య జోడి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఫ్రెష్ కాన్సెప్ట్తో యూత్ని బాగా అట్రాక్ట్ చేసిన ఈ వెబ్సిరీస్ ఇప్పుడు రెండో సీజన్కి రెడీ అవుతుంది. ఈ సందర్భంగా సీజన్-2 సిరీస్కు సంబంధించిన ఫస్ట్లుక్ను యూనిట్ రిలీజ్ చేసింది. టీజర్ను రేపు(జనవరి31)విడుదల కానుంది. This valentine's month, Meet our most loved married couple, Meghana and Prudhvi again 💝 Presenting the first look of #30Weds21 season 2 Teaser out on 31 Jan@ananyaontweet @IamChaitanyarao @prithvi_vanam@anuragmayreddy @SharathWhat @scaler_official pic.twitter.com/EahWAhhNLh — ChaiBisket (@ChaiBisket) January 30, 2022 -
చీరకట్టుతో కనికట్టు చేస్తోన్న అనన్య నాగళ్ల
-
‘ఏవమ్ జగత్’ సాంగ్ విడుదల చేసిన 'వకీల్ సాబ్' ఫేమ్ అనన్య
కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేశం, ఇనయ సుల్తానా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఏవం జగత్’. దినేష్ నర్రా దర్శకుడు. మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై ముణిరత్నం నాయుడు.ఎన్, రాజేశ్వరి.ఎన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రంలోని ‘రాధాస్ లవ్’ సాంగ్ ని 'వకీల్ సాబ్' ఫేమ్ అనన్య నాగళ్ల విడుదల చేసింది. శివ కుమార్ మ్యూజిక్ అందించగా సందీప్ కూరపాటి, సమీరా భరద్వాజ్ పాడారు. పాటను విడుదల చేసిన అనన్య చిత్ర యూనిట్కి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఈ సందర్భంగా దర్శకుడు దినేష్ నర్రా మాట్లాడుతూ.. ‘వ్యవసాయం భవిష్యత్తు ఏంటి..? రాబోయే తరానికి కావాల్సిన ఆహార అవసరాలు తీర్చేంతా సాగు భూమి కానీ, పండించే అనుభవం కానీ మన దేశ యువతకి ఉందా..? అనే అంశాలను ప్రధానంగా 'ఏవం జగత్' మూవీలో చూపిస్తున్నాం. వ్యవసాయం, మానవ సంబంధాలతో ముడిపడిన అనేక ప్రశ్నలకు సమాధానం వెతికే ఓ 20 ఏళ్ల యువకుడి కథే మా సినిమా’ అని తెలిపారు. కాగా త్వరలోనే సినిమాని విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది. -
బ్యాక్లెస్ టాప్ షాకిచ్చిన సమంత..ఈజీగా అర్థం కావొద్దంటున్న అంజలి
అసాధ్యమని భావించినప్పటికీ అధిగమించిన విషయాలు గుర్తు చేసుకోండి అంటోంది సమంత. బ్యాక్లెస్ వైట్ టాప్లో దిగిన ఫోటోని షేర్ చేసి అందరికి షాకిచ్చింది ఈ అక్కినేని కోడలు పిల్ల అంత ఈజీగా అవతలి వాళ్లకు అర్థం కావొద్దని చెబుతోంది హీరోయిన్ అంజలి. మీ గురించి ఆశ్చర్యపోయేలా చేయండి అంటూ వీకెండ్ వైబ్స్ పేరుతో సెల్ఫీలు పోస్టు చేసింది. ‘వ్యాక్సినేషన్ తప్పు చేయదు.. టీకా వేసుకోక తప్పదు’అంటూ టీకా వేయించుకుంటున్నప్పటి ఫొటోని షేర్ చేశాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఫంక్షన్ కోసం కూతరు అర్హని రెడీ చేయిస్తున్న వీడియోని అభిమానులతో పంచుకుంది అల్లు అర్జున్ సతీమణి స్నేహ. View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
హల్చల్ : నాన్నే నా హీరో అంటున్న మహేశ్.. డీఎస్పీ ఎమోషనల్
View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) Very Few know that my FATHER’s passion was Photography/Cinematography🎥 Tho he was a Writer/Director🖊 He is d Reason 4 d Photography Passion in me..He taught me😁 Lov U Daddy..4 painting our LIVES with Beautiful COLOURS❤️🎶🤗#HappyFathersDay2021 ❤️@sagar_singer pic.twitter.com/OSN4CSc0q5 — DEVI SRI PRASAD (@ThisIsDSP) June 20, 2021 View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by MONNALLISA (@aslimonalisa) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Varsha Bollamma (@varshabollamma) View this post on Instagram A post shared by Mannara❤️ (@memannara) And we grew up, with the help of ever growing love and care. Happy #FathersDay Nanna ❤️ Best of the best 🤗 pic.twitter.com/X6RrY5CU8r — Sudheer Babu (@isudheerbabu) June 20, 2021 -
హల్చల్ : సోహేల్ను ఎత్తుకున్న మెహబూబ్..పద్ధతి అంటున్న నిఖిల్
♦ స్వీట్ వాయిస్తో అలరిస్తోన్న హారిక ♦ బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్లో మహాతల్లి ♦ పద్ధతిగా అంటోన్న యూట్యూబర్ నిఖిల్ ♦ భార్యకు ప్రేమతో బర్త్డే విషెస్ తెలిపిన శేఖర్ మాస్టర్ ♦ సోహేల్ను ఎత్తుకున్న మెహబూబ్ ♦ భర్తను త్వరగా కోలుకోమంటున్న హీరోయిన్ నిత్య ♦ వీకెండ్కి రెడీ అంటోన్న అంకితా View this post on Instagram A post shared by Harika Narayan (@harika_narayan) View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) View this post on Instagram A post shared by NIKHIL VIJAYENDRA (@nikhiluuuuuuuuu) View this post on Instagram A post shared by Sekhar Master (@sekharmaster) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by MsNegi (@ashanegi) View this post on Instagram A post shared by Nititaybawa (@nititaylor) View this post on Instagram A post shared by Ankita Lokhande (@lokhandeankita) View this post on Instagram A post shared by HK (@realhinakhan) View this post on Instagram A post shared by Ashmita karnani (@ashmita_9) -
సోషల్ హల్చల్ : అనన్య ఆట.. అలీరెజా తిప్పలు
మల్లెశం మెమోరీస్ అంటూ.. గచ్చకాయలు ఆడుతున్న వీడియోని పంచుకుంది హీరోయిన్ అనన్య నాగళ్ల అప్పుడప్పుడు గిల్లు కోవడం అంటూ.. బుల్లితెర నటి, యాంకర్ సమీర చిందులేస్తుంది చాటుగా స్నాక్స్ తినేసిన అలీ రేజా.. అవే స్నాక్స్ను తన భార్య తీసుకెళ్లి కుక్కపిల్లకు పెట్టడంతో కక్కలేక మింగలేక అవస్థపడ్డాడు బ్యాడ్ సెల్ఫీ అంటూ సిమ్రాత్ కౌర్ ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది. తుమ్మడం కరోనా లక్షణం అని కుక్క పిల్లకు కూడా తెలిపోనట్లుందంటూ ఓ ఫన్నీ వీడియోని షేర్ చేసింది బిగ్బాస్ ఫేమ్ హిమజ View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ali Reza (@i.ali.reza) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) \ View this post on Instagram A post shared by Sameera Sherief (@sameerasherief) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) View this post on Instagram A post shared by Sesh Adivi (@adivisesh) -
30 Weds 21: నెలకు 3 లక్షల జీతం.. అయినా వద్దనుకున్నా: చైతన్య
హీరో చైతన్య రావు తెలుసా మీకు.. అబ్బే.. ఈ పేరు ఎక్కడ వినలేదండి అంటారా? ఆగండి అయితే.. 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ పేరు విన్నారా? వినడమేంటండి అల్రెడీ 6 ఎపిసోడ్స్ చూసేశాం అంటారా? అందులో 30 ఏళ్ల బ్యాచిలర్ పృథ్వి గుర్తు ఉన్నాడు కదా.. ఆ క్యారెక్టర్ చేసిన వ్యక్తే చైతన్య. తనదైన శైలీలో సహజంగా, అద్భుతంగా నటించి సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. కొత్తగా పెళ్లైన కుర్రాడిగా, అమాయకపు భర్తగా, ఉద్యోగిగా, మంచి స్నేహితుడిగా అందరికి కనెక్ట్ అయ్యాడు చైతన్య. తాజాగా ఆయన తన వ్యక్తిగత విషయాలను ఓ మీడియాతో పంచుకున్నాడు. తనకు సినిమాలంటే పిచ్చి అని, అందుకే నెలకు మూడు లక్షలకు పైగా జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకోని వచ్చానని చెప్పాడు. ‘నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. అమ్మ నాన్న మాట కాదనలేక అస్ట్రేలియాకు వెళ్లి ఎంబీఏ పూర్తి చేశాను. అక్కడే ఓ ఎమ్మెన్సీలో ఉద్యోగంలో చేరాను. నెలకు మూడు లక్షల జీతం వచ్చేది. అయినా సంతృప్తిగా అనిపించలేదు. సినిమాలపై పిచ్చితో ఆ ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్కి వచ్చాను. అప్పుడు అందరూ నన్ను తిట్టారు. కానీ నేను మాత్రం మొండిగానే సినిమాల కోసం ప్రయత్నించాను. అలా 2016లో ‘బందూక్’ సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. నటనకి మంచి పేరు వచ్చినా అది పెద్దగా ఆడలేదు. అయినా నేను ప్రయత్నాలు ఆపలేదు. ప్రేమమ్, శమంతకమణి, గువ్వా గోరింక, హవా, సినిమాల్లో రెండో హీరోగా వకీల్సాబ్లో చిన్న పాత్ర చేశాను. ఇక ఇప్పుడు ఈ సిరీస్ హిట్ అవ్వడంతో అందరూ ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. అమ్మాయిల నుంచి ప్రపోజల్స్ వస్తున్నాయి. కానీ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. హీరోగా సెటిల్ అయ్యాకనే పెళ్లి చేసుకుంటా’అని చైతన్య చెప్పుకొచ్చాడు. చదవండి: ‘30 వెడ్స్ 21’ వెబ్ సిరీస్ రివ్యూ నేను చిన్నపిల్లని, బ్రేకప్ లాంటివి లేవు: అనన్య -
నేను చిన్నపిల్లని, బ్రేకప్ లాంటివి లేవు: అనన్య
30 ఏళ్ల బ్యాచిలర్కు, 21 ఏళ్ల యువతికి వివాహం జరిగితే ఎలా ఉంటుంది? పెళ్లి తర్వాత వారి మధ్య చోటు చేసుకునే సన్నివేశాలు, భావోద్వేగాలు, చిలిపి తమాషాలు ఎలా ఉంటాయనే కాన్సెప్ట్తో వచ్చింది "30 వెడ్స్ 21". 'నో ప్రెజరమ్మా..', 'మోకాల్ చిప్పలు పగలగొడ్త..' వంటి హీరోయిన్ డైలాగులు బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా 'జీవితమే ఒక సముద్రమైతే అందులో ఉప్పు నా దరిద్రం' అన్న కొటేషన్ను బీభత్సంగా వాడేస్తున్నారు. తాజాగా 30 వెడ్స్ 21 టీమ్ చైతన్య, అనన్య, శరత్ సాక్షి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వెబ్ సిరీస్లో మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉన్నాయని చెప్పారు. దీనికి భీమవరం అబ్బాయి జోస్ జిమ్మీ సంగీతం అందించాడని, ఈ టీమ్లో అందరూ కొత్తవాళ్లేనని పేర్కొన్నారు. ఇక హీరో చైతన్యది కరీంనగర్ కాగా హీరోయిన్ అనన్య వరంగల్ పుట్టి కరీంనగర్లో పెరిగానని చెప్పింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తను ఈసీఎమ్ చదువుతున్నానని, కాలేజీ డేస్ నుంచే నాటకాల్లో పాల్గొనేదాన్నని తెలిపింది. తనింకా చిన్నపిల్ల అని, బ్రేకప్లాంటివి ఏమీ లేవని చెప్పుకొచ్చింది. ఈ సిరీస్ చిత్రీకరణ సమయంలో ఆన్లైన్ క్లాసులు వింటూ యాక్టింగ్ చేసేదాన్నని చెప్పింది. మరి వాళ్లు ఇంకా ఏమేం విషయాలు చెప్పారో తెలియాలంటే కింది ఇంటర్వ్యూ చూసేయండి.. చదవండి: మహేశ్ 'పార్థు' మూవీ! ఫారిన్లో షూట్? -
సూదంటి కళ్లు, తేనేటీగ ఒళ్లుతో చంపేస్తున్న ముద్దుగుమ్మలు
♦ చీరలో మెరుస్తున్న విష్ణుప్రియ ♦ కొన్నేళ్ల క్రితం ఈ స్టంట్ చేశా అంటోన్న భూమిక ♦ చీరతో చిత్రాలు చూపిస్తోన్న అనన్య నాగళ్ల ♦ ప్రేమకు నిజమైన అర్థం అమ్మ అంటోన్న పూజా హెగ్డే ♦ ఎప్పుడూ నవ్వుతూ ఉండంటూ శ్రీముఖికి బర్త్డే విషెస్ చెప్పిన నాగబాబు ♦ సూదంటి కళ్లే...పాటకు ఎక్స్ప్రెషన్స్తో తెగ నవ్వించేస్తున్న శ్రీముఖి ♦ అసలు ఈ జీవితానికి అర్థం ఏంటి? అని అడుగుతున్న తేజస్వి View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) -
వకీల్ సాబ్ ఫేమ్ అందాల అనన్య నాగల్ల ఫోటోలు
-
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
'నన్ను పావుగా వాడుకోడానికే ఆహ్వానించారు'
మీరు ఇటీవలే ఈమె ఫొటోను మన ‘ఫ్యామిలీ’లో చూసి ఉంటారు. ఈమె కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న తొలి ట్రాన్స్ ఉమన్ అని, ఎమ్మెల్యేగా గెలిస్తే మహిళలు, ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఈమె అనినట్లు చదివిన జ్ఞాపకం కూడా మీకు ఉండి ఉంటుంది. ఈమె పేరు అనన్యా అలెక్స్. వెంగర్ నియోజకవర్గం నుంచి ‘డెమోక్రాటిక్ సోషల్ జస్టిస్ పార్టీ’ అభ్యర్థిగా మార్చి 19 న నామినేషన్ వేశారు. నామినేషన్ ఉపసంహరణ గడువు మార్చి 22 కూడా దాటì పోయింది. ఏప్రిల్ 6న పోలింగ్కి అన్ని పార్టీల అభ్యర్థులూ ముగింపు ప్రచార కార్యక్రమాల్లో ఉండగా అనన్య అకస్మాత్తుగా.. తను పోటీ నుంచి తప్పుకుంటున్నానని ఏప్రిల్ 3 న ప్రకటించారు!! ఎందుకలా ఈమె అర్ధంతరంగా తన ప్రచార వేదికను, రాజకీయ రంగాన్ని దిగి వెళ్లిపోయారు?! అనన్యా అలెక్స్ ఆఖరి నిముషంలో మనసు మార్చుకోడానికి కారణం ఆ మనసు పడిన ఆవేదన! రాజకీయాల్లోకి వచ్చాక ఈ వేదనలు, ఆవేదనలు ఉంటాయా అనే ప్రశ్న వేసే ముందు ఆమేం చెబుతున్నారో వినవలసిన బాధ్యత ఉంటుంది ఎవరికైనా. అనన్య ఏదో అయిపోదామని పాలిటిక్స్లోకి రాలేదు. ఏదో చేద్దామని వచ్చారు. ఆమె ఏ పార్టీ అభ్యర్థిగా అయితే పోటీ చేస్తున్నారో ఆ ‘డెమోక్రాటిక్ సోషల్ జస్టిస్ పార్టీ’ (డి.ఎస్.జె.పి.) కూడా నిన్నమొన్నటి పార్టీనే. రాజకీయాల్ని ప్రక్షాళన చేయబోతున్నాం అంటూ 2019లో ఆవిర్భవించిన ఆ పార్టీ ఇప్పుడు తనని తనే ప్రక్షాళన చేసుకోవలసిన అవసరాన్ని తెచ్చుకున్నట్లు అనన్య మాటల వల్ల స్పష్టం అవుతోంది. ‘‘నన్ను ఒక పావుగా వాడుకోడానికి మాత్రమే రాజకీయాల్లోకి ఆహ్వానించారు’’ అంటున్నారు అనన్య. సొంత పార్టీవాళ్లే ఆమెను మానసికంగా వేధిస్తూ, అసభ్యంగా దూషిస్తూ ప్రత్యర్థులపై వ్యక్తిగత దుష్ప్రచారం చెయ్యాలని ఆమెను బలవంత పెడుతున్నారట! ఇప్పుడిక హత్యచేస్తామన్న బెదరింపులు కూడా వస్తున్నాయని ఆమె చెబుతున్నారు. ఎందుకంటే.. చెప్పినట్లు వినడం లేదని! వాళ్లేం చెబుతున్నారంటే.. అనన్యను ఎన్నికల ప్రచారంలో బురఖా వేసుకొమ్మని బలవంతం చేస్తున్నారు. వెంగర్ నియోజకవర్గంలో ముస్లిం మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. ‘నేనలా చేయలేను’ అన్నారు అనన్య. ఆమె ప్రత్యర్థి, ముస్లిం లీగ్ పార్టీ సీనియర్ నాయకుడు పీకె కున్హలికుట్టి చెడ్డవాడని; మరొక ప్రత్యర్థి, లెఫ్ట్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి పి.జీజీ ఒక తెలివి లేని మనిషి అని ప్రచారం చెయ్యమని ఒత్తిడి తెస్తున్నారు. ‘‘నేనలా చేయలేను’’ అన్నారు అనన్య. అంతే.. ట్రాన్స్ ఉమెన్గా ఆమెపై వేధింపులు, లైంగిక హింస మొదలయ్యాయి. పార్టీలోని పైవాళ్లకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా అనన్యతో అదే విధంగా, గౌరవం లేకుండా ప్రవర్తించారు! దాంతో మనస్తాపం చెంది, తన ఆత్మగౌరవాన్ని నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా ఆఖరి నిముషంలో ప్రచారం నుంచి తప్పుకున్నారు అనన్య. ‘‘నా వ్యక్తిత్వాన్ని చంపేసే ఏ పనినీ నేను చేయలేను’’ అని ఆమె అంటున్నారు. మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చేందుకు ఉత్సాహం కనబరిచిన అనన్యకు... అభివృద్ధి పనుల గురించి చెప్పకుండా తన ప్రత్యర్థుల వ్యక్తిగత బలహీనతల గురించి మాట్లాడమని పార్టీ ఆదేశించడం ఆగ్రహం తెప్పించింది. కేరళ తొలి ట్రాన్స్ ఉమన్ రేడియో జాకీ అయిన అనన్య.. జీవితంలోని మంచి చెడుల గురించి రోజూ రేడియో శ్రోతలకు తనదైన ఆకట్టుకునే శైలిలో వినిపిస్తూ ఉంటారు. ‘‘ఇప్పుడు కనుక పార్టీ చెప్పినట్లు చేస్తే ఇప్పటì వరకు నువ్వు సంపాదించుకున్న మంచి పేరుతో పాటు రేడియో జాకీ ఉద్యోగం కూడా పోతుంది’’ అని సన్నిహితులు చేసిన హెచ్చరికలకు కూడా విలువ ఇచ్చి ఆమె బరి నుంచి బయటికి నడిచారు. అనన్య రేడియో జాకీ మాత్రమే కాదు. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్, న్యూస్ యాంకర్ కూడా. శుక్రవారం నాడు అర్థంతరంగా ప్రచారాన్ని వదిలేసి వచ్చాక కూడా తన వెంటపడి ఎంత హీనంగా తనను ఎన్ని మాటలు అన్నారో అవన్నీ రాసి తన పార్టీ పెద్దలపై పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు అనన్య. అంతేకాదు.. మహిళలు, ట్రాన్స్జెండర్లంటే మర్యాద లేని డి.ఎస్.జె.పి.కి ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్ణీత వేళలంటూ లేకుండా ఆమె చేత ప్రచారం చేయించడంతో అనన్య ఆరోగ్యం క్షీణించింది. కొల్లం జిల్లా పెరుమన్ గ్రామంలో పుట్టి తనకంటూ కేరళ వ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చుకున్న అనన్య పాఠశాల విద్యతోనే చదువు మానేశారు. ఇక ఏ రాజకీయ గొడవలూ లేకుండా, చేస్తున్న ఉద్యోగాలలోనే కొనసాగుతూ ఉన్నత విద్యను పూర్తి చేయాలని ఇప్పుడు ఆశిస్తున్నారు. జెండర్కు అతీతంగా చదువు గౌరవాన్ని ఇస్తుందని ఆమె నమ్ముతున్నారు. -
ఏప్రిల్ 9న లంచ్, డిన్నర్ కలిసి చేద్దాం : దిల్ రాజు
పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వకీల్ సాబ్’. నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో అభిమానుల మధ్య ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ‘సరిగ్గా చెప్పండి.. ఏం చెప్పారు.. ఏం చేశారు’, ‘అలా జరగద్దు.. జరగకూడదు’ అనే డైలాగ్స్తో టీజర్ సాగుతుంది. టీజర్ విడుదల సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘పవన్ కల్యాణ్ను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు మనం మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నాం. వెయిటింగ్ పూర్తయింది. ట్రైలర్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే. ఏప్రిల్ 9న లంచ్, డిన్నర్ కలిసి చేద్దాం’’ అన్నారు. ‘‘ట్రైలర్ కంటే సినిమా ఇంకా బాగుంటుంది’’ అన్నారు వేణు శ్రీరామ్. హిందీ హిట్ ‘పింక్’ చిత్రానికి తెలుగు రీమేక్గా ‘వకీల్ సాబ్’ రూపొందిన విషయం తెలిసిందే. చదవండి: లవ్స్టోరీ’ వాయిదాపై చిత్ర యూనిట్ క్లారిటీ పదహారువందల మందిని ప్రేమించా' -
ఎన్నికల బరిలో తొలి ట్రాన్స్జెండర్
కేరళలో ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ ఎలక్షన్లలో ఆ నియోజకవర్గం నుంచి రాష్ట్రంలోనే మొదటి ట్రాన్స్జెండర్ అభ్యర్థిగా అనన్య పోటీకి దిగింది. అయితే అక్కడ పోటీలో ఉన్నది అత్యంత బలమైన అభ్యర్థి. ‘అతను స్త్రీలు ఇంటిపట్టునే ఉంటే చాలనుకునే భావజాలం ఉన్న అభ్యర్థి. అతనికి స్త్రీ గురించి ట్రాన్స్జెండర్ల గురించి కూడా గౌరవం నేర్పడానికి రంగంలో దిగాను’ అని అనన్య అందరినీ ఆకట్టుకుంటోంది. పి.కె.కున్హాలి కుట్టి అంటే మలప్పురంలో చాలా సీనియర్. ఎం.పి.గా ఎం.ఎల్.ఏగా సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తి. మంత్రిగా పని చేశాడు. ‘కుంజప్ప’గా ముద్దు పేరు కలిగినవాడు. ఔట్లుక్ పత్రిక వ్యాఖ్యానం ప్రకారం కేరళలో ‘ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్’ (ఐ.యు.ఎం.ఎల్) పార్టీకి వెన్నుముకలాంటివాడు. ఇప్పుడు ఆ కొండను ఢీకొనడానికి ఒక శివంగి రంగంలో దిగింది. ఆ శివంగి పేరు అనన్య కుమారి. ఏప్రిల్ జరగనున్న అసెంబ్లీ ఎలక్షన్లలో ‘వెంగర్’ నియోజక వర్గం నుంచి కున్హాలి కుట్టి నిలబడితే ‘డెమొక్రటిక్ సోషల్ జస్టిస్ పార్టీ’ తరఫున ప్రత్యర్థిగా నిలిచింది. టెలివిజన్ సెట్ను ఆమె ఎన్నికల గుర్తుగా కేటాయించారు.‘ఇది మొదలు. నాది తొలి అడుగు. నేను సఫలం అయితే దేశంలోని ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ చట్టసభల్లో పోటీకి నిలవడానికి మరింత ముందుకు వస్తారు’ అని 28 ఏళ్ల అనన్య కుమారి అంది. కేరళలో ఇది వరకే ‘తొలి ఎఫ్.ఎమ్ ట్రాన్స్జెండర్ రేడియో జాకీ’గా అనన్య గుర్తింపు పొందింది.‘కున్హాలి కుట్టి ప్రాతినిధ్యం వహించే పార్టీ ఎన్నో ఏళ్లుగా స్త్రీలను ప్రత్యేక్ష ఎన్నికలలో అనుమతించలేదు. కున్హాలి భావజాలం కూడా అదే. స్త్రీలు, టాన్స్జెండర్లు మంచిపాలన అందిస్తారని నిస్వార్థంగా పని చేస్తారని నేను నిరూపించదలుచుకున్నాను’ అంటుంది అనన్య. కొళ్లాం ప్రాంతానికి చెందిన అనన్య ఇంటర్ వరకూ చదువుకుంది. అనన్య అభ్యర్థిత్వం వెలువడగానే కేరళలోని ట్రాన్స్జెండర్ల సమూహం హర్షం వ్యక్తం చేసింది. ‘ఇది చాలా ఉత్సాహం కలిగించే వార్త’ అని రియా ఇషా అనే ట్రాన్స్జెండర్ మోడల్ అంది. ఎలక్షన్లు ఎంత ఖర్చుతో కూడుకున్నవో ఎన్ని మతలబుల వ్యవహారమో సామాన్యులకు తెలుసు. కాని వివక్షకు గురయ్యే సమూహం నుంచి ఒక అభ్యర్థి వచ్చి పోటీకి నిలవడాన్ని చాలా మంది హర్షిస్తున్నారు. -
స్క్రీన్ ప్లేలో... ప్రయోగాత్మక సినిమా
దినేష్ తేజ్, అనన్య హీరో హీరోయిన్లుగా హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ప్లే బ్యాక్’. ప్రసాదరావు పెద్దినేని నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. హరిప్రసాద్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో 2019లో ఉన్న ఓ వ్యక్తి, 1993లో ఉన్న మరో వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతుంటాడు. ఇది క్రాస్ టైమ్ కనెక్షన్ మూవీ. ఈ కాన్సెప్ట్ మీద కూడా కొన్ని సినిమాలు ఉన్నప్పటికీ మా సినిమా కథ వేరు. సినిమాలోని క్యారెక్టర్స్కు మాత్రమే కాదు... కనిపించే సినిమా పోస్టర్, చెట్టు, ఫోను వంటి వాటికి కూడా సినిమాలో కనెక్షన్ ఉంటుంది. ఇందులో ఒక్క పాట కూడా లేదు. ఈ సినిమా కథ పరంగా ప్రయోగాత్మకం కాదు కానీ స్క్రీన్ ప్లే పరంగా మాత్రం ప్రయోగాత్మక సినిమా’’ అని అన్నారు. -
ఎగ్జిబిషన్ను ప్రారంభించిన అందాల అనన్య
-
మమ్మల్ని బయటకు గెంటేశారు: అనన్య బిర్లా
వాషింగ్టన్: ‘‘స్కోపారెస్టారెంట్ నిర్వాహకులు నన్ను, నా కుటుంబాన్ని బయటకు గెంటేశారు. జాతి వివక్ష ప్రదర్శించారు. ఇది నిజంగా విషాదకరం. కస్టమర్ల పట్ల ఇలాంటి వైఖరి సరైంది కాదు. మీ రెస్టారెంటులో భోజనం చేయడానికి మేం మూడు గంటలు ఎదురుచూశాం. కానీ, మీ వెయిటర్ జోషువా సిల్వర్మాన్ మా అమ్మతో అత్యంత దురుసుగా ప్రవర్తించారు. జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇది అస్సలు సరైంది కాదు. వెరీ రేసిస్ట్’’ అంటూ సింగర్, బిర్లా కుటుంబ వారసురాలు అనన్య బిర్లా అమెరికన్ రెస్టారెంటులో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి నెటిజన్లతో పంచుకున్నారు. తమ పట్ల జాతి వివక్ష చూపిన రెస్టారెంటు నిర్వాహకులకు సోషల్ మీడియా వేదికగా చురకలు అంటించారు. (చదవండి: ట్రోలింగ్: ‘సంజూ గ్రేట్.. పంత్ నువ్వు హల్వా, పూరీ తిను’ ) కాగా ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్, బిలియనీర్ కుమార్ మంగళం బిర్లా కూతురైన అనన్య బిర్లా గాయనిగా, ఆర్టిస్టుగా తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. శనివారం ఆమె తన తల్లి నీరజా బిర్లా, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కాలిఫోర్నియాలోని ప్రముఖ ఇటాలియన్- అమెరికన్ రెస్టారెంటుకు వెళ్లారు. ఈ క్రమంలో భోజనం ఆర్డర్ చేసిన తమను, గంటల కొద్దీ వెయిట్ చేయించారని, కస్టమర్లన్న కనీస మర్యాద లేకుండా అనుచితంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెఫ్ ఆంటోనియా లొఫాసో నేతృత్వంలోని ఇటాలియన్ మూలాలున్న సదరు రెస్టారెంటు నిర్వాహకుల తీరును నెటిజన్ల దృష్టికి తీసుకువచ్చారు. ఇక కూతురి ట్వీట్పై స్పందించిన నీరజా బిర్లా సైతం.. ‘‘ఇది నిజంగా షాకింగ్గా ఉంది.. అత్యంత అనుచితంగా ప్రవర్తించారు. కస్టమర్లతో ఇలా వ్యవహరించేందుకు మీకు ఎలాంటి హక్కు లేదు’’అంటూ రెస్టారెంట్లు నిర్వాహకుల తీరును ఎండగట్టారు. అనన్య సోదరుడు ఆర్యమన్ బిర్లా కూడా ఈ విషయంపై స్పందించాడు. గతంలో తమకు ఎన్నడూ ఇలాంటి రేసిస్ట్ అనుభవాలు ఎదురుకాలేదని, జాతి వివక్ష ఉందన్న విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు. This restaurant @ScopaRestaurant literally threw my family and I, out of their premises. So racist. So sad. You really need to treat your customers right. Very racist. This is not okay. — Ananya Birla (@ananya_birla) October 24, 2020 We waited for 3 hours to eat at your restaurant. @chefantonia Your waiter Joshua Silverman was extremely rude to my mother, bordering racist. This isn’t okay. — Ananya Birla (@ananya_birla) October 24, 2020 Very shocking ..absolutely ridiculous behaviour by @ScopaRestaurant . You have no right to treat any of your customers like this. https://t.co/szUkdxAgNh — Neerja Birla (@NeerjaBirla) October 24, 2020 I have never experienced anything of this sort. Racism exists and is real. Unbelievable. @ScopaRestaurant https://t.co/FU0NE8e7Qu — Aryaman Birla (@AryamanBirla) October 24, 2020 -
ప్లే బ్యాక్ డిఫరెంట్గా ఉంటుంది
దినేష్ తేజ్, అనన్య జంటగా హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో పెద్దినేని కవిత సమర్పణలో పెద్దినేని ప్రసాద్రావు నిర్మిస్తున్న చిత్రం ‘ప్లేబ్యాక్’. ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేసిన దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ– ‘‘నేను చేయాలనుకున్న కథ ఈ ‘ప్లేబ్యాక్’. విభిన్నమైన కథ. హరిప్రసాద్కు ఈ సినిమా మంచి పేరు తెస్తుంది. చిన్న సినిమాలు ఆడుతున్న రోజులు ఇవి. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుంది’’ అన్నారు. ‘‘నేను, సుకుమార్ పాతికేళ్లుగా స్నేహితులం. పెద్ద కథను కేవలం 35 రోజుల్లో పూర్తి చేశాం. కెమెరామేన్ బుజ్జి ఇందుకు కారణం. హీరో దినేష్ చాలా కష్టపడి చేశాడు’’ అన్నారు హరిప్రసాద్. ‘‘నా కెరీర్లో ఈ సినిమా మైల్స్టోన్గా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు దినే‹ష్. ‘‘డైరెక్టర్ రాసుకున్న థ్రిల్లింగ్ పాయింట్ను కెమెరామేన్ బుజ్జి అందంగా చూపించారు. అర్జున్ కల్యాణ్, స్పందన, ఐశ్వర్య బాగా నటించారు’’ అన్నారు నిర్మాత డీజే రాజు. ‘‘కొత్త కాన్సెప్ట్తో రాబోతున్న ఈ సినిమా విజయం సాధిస్తుంది’’ అన్నారు అర్జున్ కల్యాణ్. -
2019 అబ్బాయి.. 1993 అమ్మాయి!
2019 కాలానికి చెందిన అబ్బాయితో తాను ఇంకా 1993లోనే ఉన్నానంటూ ఓ అమ్మాయి ఫోన్ కాల్ చేస్తుంది. ఆ తర్వాత ఏంటి? అంటే ప్రస్తుతానికి సస్పెన్స్. ‘దర్శకుడు’ సినిమాతో ప్రేక్షకుల ప్రశంసలు పొందిన హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో తెరకెక్కనున్న తర్వాతి చిత్రానికి ‘ప్లేబ్యాక్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇంతకుముందు మహేశ్బాబుతో సుకుమార్ తెరకెక్కించిన ‘నేనొక్కడినే’కి స్క్రిప్ట్, నాగచైతన్యతో తీసిన ‘100% లవ్’ చిత్రాలకు స్క్రీన్ప్లే అందించారు హరిప్రసాద్. ఆయన దర్శకత్వంలో తాజా చిత్రాన్ని పీఎన్కే ప్రసాద్రావు నిర్మించనున్నారు. ఈ చిత్రంలో ‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, ‘మల్లేశం’ ఫేమ్ అనన్య హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. ఈ నెల 5న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయాలనుకుంటున్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. కెమెరా: కె. బుజ్జి. -
లక్ష్యం ఒలింపిక్స్
ఆమె వయస్సు 16 సంవత్సరాలు. జిమ్నాస్టిక్స్లో ఆమె చేసే విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మాస్కోలో జరిగిన అంతర్జాతీయ ‘రిథమిక్ జిమ్నాస్టిక్స్’ పోటీల్లో మొట్టమొదటి సారి బంగారు పతకాన్ని సాధించి దేశం కళ్లు ఆమెవైపు తిప్పుకునేలా చేసింది అనన్య గరికిపాటి. సరదా కోసం ప్రారంభించిన జిమ్నాస్టిక్స్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు, పేరు, ప్రఖ్యాతలను సాధించుకుంది. రానున్న ఒలింపిక్స్లో దేశానికి బంగారు పతకం సాధించాలనే ఆశయంతో ముందుకెళ్తున్న అనన్య గరికిపాటిపై ప్రత్యేక కథనం. బాచుపల్లిలో నివాసముండే గరికిపాటి శ్రీధర్, డాక్టర్ పద్మజల మొదటి కుమార్తె అనన్య. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో టెన్త్ పూర్తి చేసిన ఆమె గాంజెస్ వ్యాలీ హైస్కూల్లో ప్రస్తుతం 11వ తరగతి చదువుతోంది. చిన్నప్పుడు తన ఫ్రెండ్స్ జిమ్నాసిక్ట్ చేస్తున్నప్పుడు చూసి తను కూడా సరదా కోసం ఆడటం ప్రారంభించింది. ఫ్రెండ్స్, టీచర్స్, ఇంట్లోవాళ్లు, బంధువులు అంతా బాగా చేస్తున్నావ్ అనే కాంప్లిమెంట్స్ రావడంతో ఆటపై మక్కువ పెంచుకున్నారు. 2010 ఢిల్లీ కామన్వెల్త్ ఛాంపియన్షిప్ నాజ్మీజాన్స్టన్ వద్ద 2016లో కోచింగ్ తీసుకున్నారు. ఇవీ సాధించిన పతకాలు ♦ పలు దేశాల్లో నిర్వహించిన అంతర్జాతీయ రిథమిక్ జిమ్నాసిక్స్ పోటీల్లో అనన్య సత్తా చాటింది. జూనియర్ విభాగాల్లో బంగారు, కాంస్యం, వెండి పతకాలను సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ♦ 2016లో లండన్లో జరిగిన ‘లండన్ స్ప్రింగ్కప్’ పోటీల్లో మూడు కాంస్య పతకాలు, ఆల్రౌండ్ విభాగంలో మరో మూడు కాంస్య పతకాలు, ‘మిస్హోప్ ట్రోఫీ’ కైవసం చేసుకుంది. ♦ 2016 దుబాయిలో జరిగిన ‘డూజియంకప్’ పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించింది. ♦ 2017 తాష్కంట్ ఉజ్బెకిస్థాన్లో జరిగిన పోటీల్లో ఆల్రౌండ్లో సిల్వర్తో పాటు ‘మిస్ ఎమోషన్ క్రౌన్ పతకం’ సాధించింది. ♦ 2017 దుబాయిలో జరిగిన ‘ఎమిరేట్స్ కప్’లో ఒక కాంస్య పతకం, ఒక స్పెషల్ ప్రైజ్. ♦ 2018లో మాస్కోలో జరిగిన పోటీల్లో ఒక స్పెషల్ ప్రైజ్, బాల్ విభాగంలో థర్డ్, ఫ్రూఐజ్ క్లబ్స్లో 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. లండన్ స్ప్రింగ్కప్తో ఆరంభం 2016లో లండన్లో ‘లండన్ స్ప్రింగ్ కప్’ పేరుతో మేజర్ ఇంటర్నేషనల్ పోటీలు జరిగాయి. పోటీల్లో అప్పుడు జూనియర్గా ఉన్న అనన్య పాల్గొని ఆల్రౌండ్స్లో తన ప్రతిభ కనబర్చింది. ఈ పోటీల్లో మూడు కాంస్య పతకాలతో పాటు, ఆల్రౌండ్ మిస్హోప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. మాస్కోతో మనసు దోచుకుంది మే నెలలో ‘మాస్క్వో’ దేశంలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో దేశం నుంచి ‘రిథమిక్ జిమ్నాస్టిక్స్’ విభాగంలో అనన్య ఒక్కరే పాల్గొన్నారు. ఈ పోటీల్లో తన ప్రతిభను కనబరచి దేశం మొత్తం తనవైపు తిప్పుకునేలా చేసింది. ఇక్కడ జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నమెంట్స్లో ‘జూనియర్స్ స్టార్లో ఆర్రౌండ్ విభాగంలో బంగారు పతకం, స్పెషల్ ప్రైజ్తో పాటు మిస్ ఛాంపియన్షిప్ను కూడా సొంతం చేసుకుంది. ‘సెల్యూట్ కప్’లో ఆర్రౌండ్ విభాగంలో సిల్వర్, సీనియర్ విభాగంలో ‘నోవాగోర్స్ స్టార్స్’లో ఆర్టిస్ట్రీ విభాగంలో స్పెషల్ ప్రైజ్ను సాధించింది. ఒలింపిక్స్లో గోల్డ్ నా డ్రీమ్ ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనాలనేది జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నప్పుడు కన్న కల. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. ఈ ప్రయత్నాలు ప్రస్తుతం సంతృప్తిని ఇస్తున్నప్పటికీ.. నా డ్రీమ్ అంతా ఒలింపిక్సే. ఒలింపిక్స్లో పాల్గొని రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో దేశానికి బంగారు పతకం తేవాలనేది నా డ్రీమ్, నా లక్ష్యం, నా కర్తవ్యం కూడా.– అనన్య గరికిపాటి టాలెంట్ గుర్తించాం అనన్యలో టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ను గుర్తించాం. అందుకే నా డాక్టర్ వృత్తిని కూడా పక్కన పెట్టి మరీ అనన్యకు తోడుగా ఉంటున్నాను. విదేశాలకు వెళ్లడం, రావడం, ఆడటం కష్టంగా ఉన్నప్పటికీ అనన్య కలల్ని సాకారం చేయాలనేదే మా కోరిక. అందుకే తనని ప్రతి అంశంలో ప్రోత్సహిస్తున్నాం. రిథమిక్ జిమ్నాస్టిక్స్లోని నాలుగు విభాగాల్లో అనన్య అందర్నీ ఆకట్టుకోవడం తల్లిగా నాకు చాలా సంతోషంగా ఉంది. – డాక్టర్ పద్మజ గరికిపాటి,అనన్య తల్లి -
సుహానా బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడంటే!
షారుఖ్ ఖాన్ గారాలాపట్టి సుహాన్ ఖాన్ బాలీవుడ్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా? ఆమెను ఎప్పుడు వెండితెర మీద చూద్దామా? అని సుహానా ఫ్యాన్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే, ఆమె బాలీవుడ్లోకి ఎంటరవ్వడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల లండన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సుహానా ప్రస్తుతం న్యూయార్క్లోని ఓ ప్రముఖ ఫిలిం స్కూల్లో నటనలో శిక్షణ తీసుకుంటున్నారు. మరోవైపు సుహానా బాల్య స్నేహితురాలు అనన్య పాండే ఇప్పటికే సినిమాల్లోకి వచ్చేశారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2 సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తాజాగా ‘జూమ్’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన బెస్టీ సుహానా ఖాన్ ఎప్పుడు సినిమాలోకి రాబోతుందో తెలిపారు. చదువులో భాగంగా న్యూయార్క్లో ఫిలిం స్కూల్కు వెళ్లబోతున్న సుహనా తన చదువు పూర్తికాగానే సినిమాల్లోకి వచ్చే అవకాశముందని, చదువు పూర్తయిన తర్వాత తనకు ఎప్పుడు ఇష్టమైతే.. అప్పుడు సుహానా సినిమాల్లోకి వస్తారని తెలిపారు. సుహానా ఎంతో టాలెంటెడ్ అని అంతకుముందు ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనన్య పొగడ్తల వర్షం కురిపించారు. ‘స్కూల్లో నేను, సుహానా ఎన్నో ఆటలు ఆడేవాళ్లం. తను చాలా మంచి నటి. తన నుంచి నేను ఎన్నో నేర్చుకున్నా. తను చాలా మంచిది. నేను తనకేమీ టిప్స్ ఇవ్వను. నిజానికి తన నుంచి నేను టిప్స్ తీసుకుంటాను’ అని అనన్య వివరించారు. -
నిజానికి అప్పుడే చచ్చిపోవాల్సింది :హీరోయిన్
సినిమాలో చూపించని సీన్ కోసం తాను చావు అంచుల దాకా వెళ్లాల్సింది వచ్చిందని హీరోయిన్ అనన్య పాండే అన్నారు. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురైన అనన్య ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్- 2’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా షూటింగ్లో రిస్కీ షాట్కు ప్రయత్నించినందుకు వల్ల.. తాను గాయపడినట్లు అనన్య పేర్కొన్నారు. తాజాగా ఓ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘ చావు అంచుల దాకా వెళ్లాను. నిజానికి అప్పుడే చచ్చిపోవాల్సింది. కానీ ఎయిర్బ్యాగ్స్ తెరచుకోవడంతో బతికి పోయాను. నన్ను కాపాడేందుకు టైగర్ ముందుకు వచ్చాడు. కానీ కారు పేలిపోతుందనే భయంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు. ప్రతీ ఒక్కరు నన్ను వదిలి వెళ్లిపోయారు. ఎన్నో భయంకర యాక్సిడెంట్ స్టోరీలు విన్నాను. అయితే తొలిసారి ప్రత్యక్షంగా ఆ అనుభవం ఎదుర్కొన్నా’ అని చెప్పుకొచ్చారు. చెట్టుకు కారు ఢీకొట్టడంతో తాను ప్రమాదానికి గురయ్యానని.. ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నపుడు తన ముక్కు పగిలిందన్నారు. అయితే యూనిట్ వెంటనే ఆస్పత్రికి తీసుకు వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని పేర్కొన్నారు. ఆ తర్వాత యథావిధిగా షూటింగ్లో పాల్గొన్నానన్నారు. ఇంత రిస్క్ తీసుకుంటే తీరా సినిమాలో అందుకు సంబంధించిన సీన్ లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యానని చెప్పుకొచ్చారు. కాగా 2012లో విడుదలైన సూపర్హిట్ సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సీక్వెల్గా తెరకెక్కిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’ సినిమా అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించగా అనన్య పాండే, తారా సుతారియా హీరోయిన్లుగా నటించారు. -
డెనిమ్ అంబాసిడర్గా అనన్యపాండే
సాక్షి, చెన్నై: యూరోపియన్ డెనిమ్ బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటి, మోడల్ అనన్య పాండే వ్యవహరించనున్నారు. స్ప్రింగ్ సమ్మర్ – 2019 పేరిట కలెక్షన్లకు ఆమె ప్రచారకర్తగా వ్యవహరించనున్నట్టు ఆ బ్రాండ్ సీఈఓ వినీత్ గౌతమ్ తెలిపారు. సోమవారం స్థానికంగా జరిగిన వేడుకలో యూరోపియన్ డెనిమ్ కలెక్షన్లను పరిచయం చేశారు. ఈ సందర్భంగా తమ అంబాసిడర్ను ప్రకటించారు. యూరోపియన్ డెనిమ్ బ్రాండ్ స్ప్రింగ్ సమ్మర్ –2019కు మాత్రమే అనన్య పాండే ప్రచారకర్తగా ఉంటారని, లిమిటెడ్ ఎడిషన్గా ఈనెల 17న తమ ఉత్పత్తులను ప్రవేశ పెట్టనున్నట్టు వివరించారు. -
మల్లేశం వచ్చిండు
అగ్గిపెట్టెలో పట్టేంత చిన్న చీరను నేచి, చేనేత రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించు కున్నారు చింతకింది మల్లేశం. పెద్ద చదువులు చదవకపోయినా చేనేత శ్రమజీవుల కోసం ఆయన ఆసు యంత్రాన్ని ఆవిష్కరించారు. ఇందుకుగాను ఆయన్ని ‘పద్మశ్రీ’ అవార్డు వరించింది. తాజాగా చింతకింది మల్లేశం బయోపిక్ని ‘మల్లేశం’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. టైటిల్ రోల్లో ప్రియదర్శి నటిస్తున్నారు. రాజ్ ఆర్ దర్శకత్వంలో శ్రీ అధికారి, రాజ్ ఆర్ నిర్మిస్తున్నారు. అనన్య, ఝాన్సీ, చక్రపాణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లాలో ఈ చిత్రం ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. మార్క్ కె.రాబిన్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి గోరేటి వెంకన్న, చంద్రబోస్ పాటలు రాస్తున్నారు. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్ సిద్ధారెడ్డి. -
‘ఇవన్నీ నాన్న సీక్రెట్ ఇన్స్టాలో చూస్తారు’
న్యూఢిల్లీ : ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లాకు సీక్రెట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందంట. ఈ అకౌంట్ను కేవలం తన కూతురుతో మాత్రమే మాట్లాడానికి వాడతారంట. ఈ విషయాన్ని స్వయంగా ఆయన కూతురే తెలిపారు. పాటల రచయిత, సింగర్ అయిన అనన్య బిర్లా.. తండ్రి కుమార్ మంగళం బిర్లాతో దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దాంతో పాటు ‘నాన్న నన్ను ఇంత బాగా ఎలా అర్థం చేసుకుంటారో నిజంగా నాకు తెలీదు. నా గురించి ఎంత ఆలోచిస్తారంటే.. తన టై రంగు, నా డ్రెస్ కలర్కు మ్యాచ్ అయ్యేలా చూసుకున్నారు. నాన్న ఈ ఫోటోను మీరు మీ సీక్రెట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి చూస్తారని నాకు తెలుసు. లవ్ యు పప్పా’ అంటూ తండ్రితో దిగిన ఫోటోని షేర్ చేశారు అనన్య. ఈ ఫోటోను ఇప్పటికే దాదాపు 24 వేల మంది లైక్ చేశారు. View this post on Instagram I don’t understand how he understands me so deeply! Love you so much papa ❤️❤️ He tried his best to match his tie to the colour of my gown .. and he almost succeeded. Papa, you can see this from your secret account that you created just to stalk me 😂😋🙏🏽 #takemebacktuesday A post shared by Ananya (@ananya_birla) on Jan 28, 2019 at 11:49am PST -
కేరళ వరద బాధితుల్లో నటి అనన్య కుటుంబం
-
వరద బాధితుల్లో నటి కుటుంబం
తమిళసినిమా: వరద బాధితుల్లో నటి అనన్య కుటుంబం చిక్కుకుంది. తమిళంలో ఎంగేయుమ్ ఎప్పోదుమ్, సీడన్ చిత్రాల్లో నటించిన నటి అనన్య. మలయాళ కుటుంబానికి చెందిన ఈమె కేరళలోని కొచ్చిలో నివసిస్తోంది. కేరళా రాష్ట్రం 10 రోజులకుపైగా వరదల్లో మునిగిపోయిన విషయం తెలిసిందే. అక్కడి ప్రజలు అష్ట కష్టాల పాలవుతున్నారు. ఎవరైనా కాపాడండి అంటూ చేతులెత్తి మొక్కుతూ అర్థిస్తున్నారు. ఇప్పటికే ఎంతో ప్రాణనష్టం జరిగిపోయింది. అయినా ఇప్పటికీ వరణదేవుడు ఆ రాష్ట ప్రజలను కరుణించలేదు. పేద, ధనవంతులు అన్న తేడా లేకుండా అందరూ వరద బాధితులయ్యారు. ఇటీవల నటుడు జయరామ్ ఇల్లు నీట మునిగిపోవడంతో ఆయన కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ ఇల్లు కూడా నీటిలో మునిగిపోయింది. అదేవిధంగా కొచ్చిలోని నటి అనన్య ఇల్లు నీట మునిగిపోయింది. దీని గురించి ఆమె వాట్సాప్లో ఒక ఫొటోను విడుదల చేస్తూ తన ఇల్లు పూర్తిగా వరద నీటితో మునిగిపోయిందని తెలిపింది. కుటుంబ సభ్యులమంతా చాలా భయభ్రాంతులకుగురయ్యామని, గత శుక్రవారం సురక్షితంగా బయటపడ్డామని పేర్కొంది. ప్రస్తుతం పెరంబావేరులోని తన స్నేహితురాలి ఇంట్లో తల దాచుకుంటున్నామని చెప్పింది. తమ లాగే ఏందరో వరదల్లో చిక్కుకుని ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారని, సహాయకులు ముందుకొచ్చి వారందరిని రక్షించాలని పేర్కొంది. అదేవిధంగా మలయాళ సీనియర్ నటుడు సలీమ్కుమార్ తన కుటుంబంతో పాటు చుట్టు పక్కల వారు 50 మంది తన ఇంటిపై భాగంలో ఉంటూ సహాయార్థం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా చాలా మంది తమను రక్షించాలంటూ ఫోన్లు, వాట్సాప్లు వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వేడుకుంటున్నారు. -
కంట్రోల్ తప్పింది
తొలి సినిమా కావడంతో రెట్టింపు ఉత్సాహంతో షూటింగ్లో పాల్గొంటున్నారు కథానాయిక అనన్యా పాండే. కానీ బ్యాడ్లక్. సెట్లో ఆమెకు స్మాల్ యాక్సిడెంట్ అయ్యిందట. అయితే ముందస్తు జాగ్రత్తలు పాటించడం వల్ల పెద్ద ప్రమాదం నుంచి ఆమె తప్పించుకున్నారు. ఆరేళ్ల క్రితం విడుదలైన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రానికి సీక్వెల్గా పునీత్ మల్హోత్రా దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్, అనన్యా పాండే, తారా సుతారియా ముఖ్య పాత్రలుగా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం డెహ్రాడూన్లో జరుగుతోంది. టైగర్ ష్రాఫ్, అనన్యా పాండే, తారా సుతారియాలపై హై స్కూల్నాటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఓ సీన్లో భాగంగా అనన్యా కారు డ్రైవ్ చేశారు. ఆ సమయంలో కారు కంట్రోల్ తప్పి చెట్టును ఢీ కొట్టింది. అదృష్టవశాత్తు చిత్రబృందం ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏ ప్రమాదం జరగలేదు. దాంతో రిలీఫ్ అయ్యారట. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నార -
అయ్యో అనన్య.. ఎంత ఘోరం!
శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్): అతి వేగం ఓ విద్యార్థిని ప్రాణాలు బలితీసుకుంది. స్నేహితుడి పుట్టినరోజు కావడంతో కేక్ కట్ చేసి విందు కోసం వెళుతుండగా.. కారు అదుపు తప్పింది. డివైడర్ను దాటి 50 మీటర్ల వరకూ పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న ఓ యువతి మృత్యువాత పడగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ మండలం బుర్జుగడ్డ తండా సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే కారులో మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో ప్రమాదానికి అతివేగంతోపాటు తాగి నడపడం కూడా కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీకి చెందిన అనన్య గోయల్(21) హైదరాబాద్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈమెకు నేపాల్ వాసి నిఖిత స్నేహితురాలు. ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాలలో ఎంబీఏ చదివేటప్పటి నుంచి వీరిద్దరూ ఒకే రూమ్లో ఉండేవారు. జోధ్పూర్ వాసి జతిన్ పవార్ వీరితో కలసి ఎంబీఏ చదివాడు. ప్రస్తుతం నిఖిత హైదరాబాద్లోనే ఉద్యోగాన్వేషణలో ఉంది. జతిన్ కొండాపూర్లోని కేపీఎంజీ కంపెనీలో ఇన్కంట్యాక్స్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు. డివైడర్పై నుంచి పల్టీలు కొట్టి.. సోమవారం జతిన్ పుట్టిన రోజు కావడంతో కొండాపూర్లో స్నేహితులతో కలసి కేక్ కట్ చేశారు. అక్కడికి అనన్య, నిఖిత వెళ్లారు. కేక్ కటింగ్ అనంతరం విందు కోసం బయలుదేరారు. జతిన్ వీరిద్దరితో కలసి కారులో కొం డాపూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వచ్చి పెద్ద గోల్కొండ వద్ద జంక్షన్ నుంచి కిందకు దిగారు. అక్కడి నుంచి పీ–వన్ రోడ్డు మార్గంలో పాల్మాకుల వైపు వెళ్తున్నారు. బుర్జుగడ్డ తండా సమీపంలోకి రాగానే మూల మలుపు వద్ద కారు అదుపుతప్పింది. రోడ్డు డివైడర్పై నుంచి పల్టీలు కొడుతూ కుడి వైపు ఉన్న రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు వెనుక సీట్లో కూర్చున్న అనన్య తలకు బలమైన గాయాలవ్వగా.. నిఖిత, జతిన్ గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ముగ్గురిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అనన్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనన్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రాణాలు కాపాడిన సీటు బెల్టు కారు డివైడర్పై నుంచి 50 మీటర్ల దూరం వరకు వెళ్లి రోడ్డు అవతలి వైపు పడింది. ఈ సమయంలో జతిన్ డ్రైవింగ్ చేస్తుండగా.. నిఖిత ముందు సీట్లో కూర్చుంది. వీరిద్దరూ సీటు బెల్టు పెట్టుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెనక సీట్లో కూర్చున్న అనన్య సీటు బెల్టు ధరించకపోవడంతో కారు బోల్తా పడిన సమయంలో కింద పడి తలకు తీవ్ర గాయాలై మృతి చెందింది. కాగా, కారు నడుపుతున్న జతిన్ మద్యం సేవించినట్లు అనుమానిస్తున్నారు. కారులో ఖాళీ మద్యం సీసాలు బయటపడటంతో జతిన్ రక్త నమూనాలను సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయ్యో అనన్య.. ఎంత ఘోరం! -
అదిరె.. అదిరె స్టైల్!
బాలీవుడ్ స్టార్ కిడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు సోషల్ మీడియాలోనూ, అటు మీడియాలోనూ వారికి ఫుల్ పాపులారిటీ ఉంది. వారు కూడా ఎప్పటికప్పుడు కొత్త స్టైల్ ఫాలో కావడంలో ముందుంటారు. కెమెరా కంట ఎప్పుడు కనపడినా.. తమ స్టైలిష్ లుక్తో అబ్బో అనిపిస్తున్నారు. అలా ఈ నలుగురు సుందరాంగులు తాజాగా కెమెరా కంటికి చిక్కారు. వారి స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మీరు ఓ లుక్ వేయండి. బ్లాక్ డ్రెస్లో.. కింగ్ ఖాన్ షారుఖ్ గారాలపట్టి సుహానా ఖాన్. ఇటీవల తల్లి గౌరీఖాన్తో కలిసి ఢిల్లీలో జరిగిన ఓ వేడుకలో తళుక్కుమంది ఈ సుందరాంగి. బ్లాక్ అసిమెట్రిక్ టాప్, హాట్ప్యాంట్స్ ధరించి.. నడుముకు గోల్డ్లేస్ విస్ట్బ్యాండ్తో ఫ్యాబులస్ లుక్తో సుహానా అదరగొట్టింది. ఆహా.. అనన్య..! నటుడు చుంకీ పాండ్యా తనయ అనన్య పాండ్యా గురించి తెలియనివారుండరు. సుహానా ఖాన్ బెస్టీ అయిన అనన్య ఇటీవల తన కజిన్ బర్త్డేలో అదిరె లుక్తో కనిపించింది. మెటాలిక్ షేడ్ స్లిప్ డ్రెస్తో అందరి లుక్స్ను తనవైపునకు తిప్పుకుంది. అబ్బో.. అలన్నా..! అనన్య పాండే చిట్టిచెల్లెలు అలన్నా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది. మోనిషా జైసింగ్ డిజైన్ చేసిన డ్రెస్లో ఈ అమ్మడు అదరగొట్టింది. స్టైలిష్ జాన్వీ..! జాన్వీ ఆ పేరు వింటేనే కుర్రకారు పడిచస్తారు.. ఆమె అందానికి ఫిదా అవుతారు. అతిలోక సుందరి శ్రీదేవి గారాల తనయ అయిన జాన్వీ ఇటీవల జిమ్ సెషన్ను ముగించుకొని.. అదిరే స్టైలిష్ డ్రెస్లో ఇలా దర్శనమిచ్చింది. -
ఆ నటుడి కూతురా? నమ్మలేం.. డీఎన్ఏ టెస్ట్ చేయండి!
బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య (18) ఇప్పుడు సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్గా మారింది. అనన్య ఫొటోను ఆమె తల్లి భావన పాండే ఇటీవల ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయగా.. కాసేపట్లోనే ఈ ఫొటో వైరల్గా మారింది. అనన్య అందం అదుర్స్ అంటూ ఎంతోమంది నెటిజన్లు కితాబిచ్చారు. అయితే, అంతకుమించి అన్నట్టు ఈ ఫొటోపై బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫర్హా ఖాన్ బాంబులాంటి కామెంట్ చేశారు. అనన్య చుంకీపాండే కూతురంటే నమ్మలేం.. డీఎన్ఏ పరీక్ష చేయించాలంటూ ఆమె పేర్కొన్నారు. సరదాగా ఆటపట్టించేందుకు ఆమె పెట్టిన ఈ కామెంట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. క్యూట్గా ఉన్న అనన్య ఫొటోకు ఇన్స్టాగ్రామ్లో 1700లకుపైగా లైకులు వచ్చాయి. ఎంతోమంది కామెంట్ పెట్టారు. ఫర్హా ఖాన్ కూడా సరదాగా స్పందిస్తూ.. 'దయ చేసి డీఎన్ఏ పరీక్ష చేయించండి. తను చుంకీ కూతురంటే నమ్మలేం. చాలా లవ్లీగా ఉంది' అంటూ లాఫ్టర్ ఎమోజీతో కామెంట్ చేసింది. -
అనన్య జోడీకి టైటిల్
సెయిలింగ్ చాంపియన్షిప్ సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్–గ్రీన్కో యూత్ ఓపెన్ రెగెట్టాలో అనన్య చౌహాన్ –అనన్య సివాచ్ జోడీ టైటిల్ కైవసం చేసుకుంది. హుస్సేన్ సాగర్లో బుధవారం ముగిసిన ఈ పోటీల్లో హైదరాబాద్ ఈఎమ్ఈఎస్ఏకు చెందిన అనన్య జంట 420 క్లాస్ ఈవెంట్లో బంగారు పతకం గెలుచుకుంది. మూడు రోజుల పాటు జరిగిన మొత్తం 10 రేసుల్లో ఈ జంట ఆరు రేసుల్లో గెలుపొందింది. దీంతో 10 పాయింట్లతో విజేతగా నిలిచింది. హైదరాబాద్కు చెందిన సంజయ్ రెడ్డి–అజయ్ యాదవ్ ద్వయం 12 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకుంది. మిగతా ఈవెంట్లలో భోపాల్ ఎన్ఎస్ఎస్కు చెందిన సెయిలర్లు సత్తా చాటుకున్నారు. లేజర్ 4.7 క్లాస్లో రామ్మిలన్ యాదవ్, ఆప్టిమిస్ట్ క్లాస్లో శ్రద్ధా వర్మ టైటిల్స్ గెలిచారు. లేజర్ 4.7 క్లాస్లో రామ్మిలన్ 10 రేసుల్లో ఏడు రేసులు గెలిచాడు. 9 పాయింట్లతో టైటిల్ చేజిక్కించుకున్నాడు. తమిళనాడు సెయిలర్లు మహేశ్ బాలచందర్ 25 పాయింట్లతో రెండో స్థానంలో నిలువగా... అతని సహచరుడు అనికేత్ రాజారామ్ 27 పాయింట్లతో కాంస్యం నెగ్గాడు. ఆప్టిమిస్ట్ క్లాస్లో భోపాల్ సెయిలర్లు క్లీన్స్వీప్ చేశారు. ప్రతీ రేసులోనూ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న శ్రద్ధా వర్మ విజేతగా నిలిచింది. ఓవరాల్గా ఆమె ఆరు రేసుల్లో గెలిచి 11 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆశిష్ విశ్వకర్మ 20 పాయింట్లతో రెండో స్థానంలో నిలువగా... దావుద్ ఖురేషి 22 పాయింట్లతో మూడో స్థానం పొందాడు. -
అనన్య జోడి ఆధిపత్యం
సెయిలింగ్ చాంపియన్షిప్ సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ గ్రీన్కో యూత్ ఓపెన్ రెగెట్టా చాంపియన్షిప్లో అనన్య చౌహాన్–అనన్య సివాచ్ జోడి ఆధిపత్యం కొనసాగుతోంది. హుస్సేన్సాగర్లో జరుగుతోన్న ఈ టోర్నీలో తొలి రోజు 420 క్లాస్ ఈవెంట్లో జరిగిన రెండు రేసుల్లోనూ అగ్రస్థానంలో నిలిచిన ఈ జంట రెండోరోజు సోమవారం జరిగిన తర్వాతి మూడు రేసుల్లోనూ విజేతగా నిలిచి అబ్బుర పరిచింది. మొత్తం ఈ విభాగంలో ఐదు రేసులు జరుగగా, అన్నింట్లోనూ అనన్య ద్వయమే విజేతగా నిలిచింది. సంజయ్ రెడ్డి–అజయ్ యాదవ్ జంట సోమవారం జరిగిన మూడు రేసుల్లోనూ రన్నరప్గా నిలిచి ఓవరాల్గా రెండో స్థానంలో ఉంది. లేజర్ 4.7 విభాగంలో రామ్ మిలన్ యాదవ్ జోరు కొనసాగింది. సోమవారం జరిగిన మూడు రేసుల్లోనూ అతనే అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మూడో రేసులో మహేశ్ బాలచందర్, గోవింద్ బైరాగి, నాలుగో రేసులో సతీశ్ యాదవ్, మహేశ్ బాలచందర్, ఐదో రేసులో అనికేత్ రాజారామ్, కృష్ణ మోంగియా వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆప్టిమిస్ట్ క్లాస్ ఈవెంట్ మూడో రేసులో శ్రద్ధా వర్మ, ఆశిష్ విశ్వకర్మ, దావూద్ ఖురేషి... నాలుగో రేసులో ఆశిష్ విశ్వకర్మ, హృతిక్ అమర్, రాజ్ విశ్వకర్మ... ఐదో రేసులో శ్రద్ధా వర్మ, దావూద్ ఖురేషి, ఆశిష్ విశ్వకర్మ వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. ఈ విభాగంలో ఐదు రేసులు ముగిసేసరికి ఆశిష్ విశ్వకర్మ ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. -
కుక్కల దాడి: రెండేళ్ల చిన్నారి మృతి
కంచికచర్ల: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుక్కల దాడిలో రెండేళ్ల చిన్నారి మృతిచెందింది. వివరాలు.. గ్రామానికి చెందిన పుల్లయ్య కుమార్తె అనన్య(2) గురువారం ఉదయం నుంచి కనిపించకుండా పోయింది. మధ్యాహ్నం సమయానికి ఆమె గ్రామ సమీపంలోని పొలాల్లో విగతజీవిగా ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆమె శరీరంపై గాట్లు ఉండటంతో గ్రామంలో తిరుగుతున్న కుక్కలే ఆమెను ఈడ్చుకెళ్లి చంపి ఉంటాయని భావిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
రూపాయి అడ్వాన్స్గా ఇవ్వండి
నటి అనన్యకు తన చిత్రంలో నటించినందుకు దర్శకుడు బాల శ్రీరాం ఒక రూపాయి మాత్రం అడ్వాన్సుగా ఇచ్చారట. దర్శకుడు ఎ.వెంకటేష్ వద్ద అసిస్టెంట్ డెరైక్టర్గా పనిచేశారు బాల శ్రీరాం. ‘ఇరవుం పగలుం వరుం’ అనే చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమయ్యారు. ఇందులో మహేష్, అనన్య జంటగా నటించారు. అనన్యతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆమె వెంటబడిన సంఘటన గురించి దర్శకుడు మాట్లాడుతూ, అనన్యను ఈ చిత్రంలో ఒప్పందం చేసుకునేందుకు అనేక సార్లు ఆమెను కలిసి కథ చెప్పేందుకు ప్రయత్నించానన్నారు. చెన్నైలో కలవగా కేరళకు వచ్చి కథ చెప్పమని చెప్పి హఠాత్తుగా బయలుదేరి వెళ్లారన్నారు. ఆమె ఇల్లు వెతికి పట్టుకుని వెళ్లగా కథ వినేందుకు సమ్మతించారన్నారు. ఈ సందర్శంగా నటి అనన్య మాట్లాడుతూ ఇంతవరకు భారీ బ్యానర్, ఇదివరకే చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకులతోపాటు పనిచేశానన్నారు. మీరు కొత్త దర్శకులు కావడంతో కథ వినేందుకు సంశయించానని తెలుపుతూ కథ వినిపించమన్నారు. ఈ కథ చెప్పడంతోనే నచ్చడంతో ఒక్క రూపాయి అడ్వాన్స్గా ఇవ్వండి, ఈ చిత్రాన్ని మీరు ఎప్పుడు తీసినా తాను ఖచ్చితంగా నటిస్తానన్నారు. ఆ విధంగా ఒక రూపాయి అడ్వాన్సు తీసుకున్నారని, తర్వాత పారితోషికాన్ని తగ్గించుకుని నటించారన్నారు. ఈ చిత్రం పూర్తికావచ్చిందని, ఒక వివాదం కారణంగా కోర్టులో చిత్రానికి స్టే విధించబడిందన్నారు. ప్రస్తుతం ఈ స్టే తొలగిపోయిందని, 20వ తేదీ చిత్రం విడుదల కానుందన్నారు. బాలసుబ్రమణియం పెరియసామి నిర్మించిన ఈ చిత్రాన్ని ఎస్. తనిగైవేలు విడుదలచేయనున్నట్లు తెలిపారు. -
రక్తం మరిగిన ‘జాబాలి’
మనిషికి దాహమేస్తే నీళ్లు తాగుతాడు, జాబాలికి దాహమేస్తే మనిషి నెత్తురు తాగుతుంది. ఆ భూతం చుట్టూ తిరిగే కథ - ‘జాబాలి’. జేఆర్ఈ గ్రూప్ బ్యానర్పై ఎం.అరుణ్, షర్మిష్ఠ, అనన్య త్యాగి ముఖ్యతారలుగా రూపొందిన ఈ చిత్రానికి హేమరాజ్ దర్శకుడు. ఈ నెల 20న చిత్రం విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘80 శాతం అడవుల్లో, 20 శాతం సిటీలో చిత్రీకరించిన ఈ సినిమా ఇప్పుడొస్తున్న హారర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది’’ అని తెలిపారు. -
నాకు స్వేచ్ఛ ఉంది
నటన విషయంలో నటి అనన్యకు ఆమె భర్త షరతులు విధించారట. ఈ విషయాన్ని ఆమె స్పష్టం చేశారు. ఎంగేయుం ఎప్పోదుం, నాడోడిగళ్ లాంటి కొన్ని తమిళ చిత్రాల్లో నటించిన కేరల కుట్టి అనన్య కుటుంబ కథా చిత్రాల కథా నాయకిగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆంజనేయన్ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లిని ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకించినా పట్టుబట్టి మరీ పెళ్లి చేసుకున్నారు. దీంతో పలు అవకాశాలు కోల్పోయింది. అంతేకాదు నటనకు స్వస్తి పలికినట్లు కూడా ప్రచారం జరిగింది. వీటన్నింటి కీ అనన్య బదులిస్తూ తాను నటనకు దూరమయ్యానని ఎవరు చెప్పారు? అంటూ ప్రశ్నించారు. అయితే తనకు సంతృప్తి కలిగించే చిత్రాలనే అంగీకరిస్తున్నానన్నారు. అందువలన చిత్రాల సంఖ్య తగ్గిందన్న మాట వాస్తవేమనన్నారు. ఇటీవల మలయాళంలో రిపోర్టర్ చిత్రంలో నటించానని చెప్పారు. వివాహానంతరం తాను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. తన భర్త ఆంజనేయన్ కూడా తనకు అండగా నిలుస్తున్నారని అన్నారు. నటన వరకు ఆయన తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని చెప్పారు. అయితే గ్లామరస్ పాత్రలను అంగీకరించనట్టు, మంచి కథా పాత్రల్ని ఎంపిక చేసుకుని నటించులాంటి కొన్ని సూచనలు చేశారని చెప్పారు. ప్రస్తుతం తమిళ చిత్రాల్లో నటించడం కోసం పలు కథలు వింటున్నానని త్వరలోనే కొత్తగా నటించే చిత్రాల గురించి వివరిస్తానని అనన్య పేర్కొన్నారు. -
అడ్వాన్స్ రూపాయేనట
టీనగర్: తాను దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కేవలం ఒక్క రూపాయి మాత్రమే అడ్వాన్స్ తీసుకుని అనన్య నటిస్తున్నారని దర్శకుడు బాలశ్రీరాం తెలిపారు. ఆర్.ఎస్.ఎస్.ఎస్ పిక్చర్స్ ఎస్.తనిగైవేల్ సమర్పిస్తున్న స్కైడాట్ ఫిలింస్ ఆధ్వర్యంలో బాల సుబ్రమణియన్ పెరియసామి రూపొందిస్తున్న చిత్రం ‘ఇరవుం పగలుం వరుం’. మహేష్, అనన్య, జగన్, స్వామినాథన్తో సహా పలువురు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం కృష్ణసామి చేపడుతుండగా దీనా సంగీతం సమకూరుస్తున్నారు. పాటలు లలితానంద్ రాస్తున్న ఈ చిత్రానికి బాలశ్రీరాం దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఈ కథ విన్నంతనే ఒక్క రూపాయి మాత్రమే అడ్వాన్స్గా తీసుకుని నటించేందుకు అనన్య సమ్మతించారని, ఇది ఎంతో ఆశ్ఛర్యం కలిగించిందని తెలిపారు. ఇంజినీరింగ్ చదివే విద్యార్థి ఒకరు పగలు మంచివాడిగాను, రాత్రి సమయాల్లో దొంగగాను వ్యవహరిస్తాడన్నారు. ఇతను ఎందుకు చోరీలకు పాల్పడతాడన్నదే ఈ చిత్రం కథ అని ముగించారు. -
ఆ నష్టం నా వల్ల కాదు
అతిథి చిత్ర నిర్మాణంలో జాప్యానికి, అధిక నిర్మాణ వ్యయానికి తానేమి కాణం కాదని నటి అనన్య స్పష్టం చేసింది. ఎంగేయుం ఎప్పోదుం, నాడోడిగళ్ చిత్రాలతో తమిళంలో ప్రాచుర్యం పొందిన మలయాళ భామ అనన్య. ఈమె నటించిన తాజా చిత్రం అతిథి ఇటీవల తెరపైకి వచ్చింది. అయితే ఈ చిత్ర నిర్మాత, ప్రతినాయకుడు నిఖేష్రామ్ నటి అనన్య చాలా ఇబ్బందులకు గురి చేసిందని, ఆమె వల్ల 50 లక్షల వరకు నష్టం కలిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. అనన్య సరైన సమయానికి షూటింగ్కు వచ్చేది కాదని నక్షత్ర హోటల్లో తన భర్తతో కలిసి బస చేసి ఇష్టానికి ఖర్చు చేసిందని పలు ఆరోపణలు గుప్పించారు. అయితే నటి అనన్య అవన్నీ అవాస్తవ ఆరోపణలని కొట్టిపారేసింది. ఆమె స్పందిస్తూ తన వల్ల అతిథి చిత్రానికి ఎలాంటి సమస్యలు కలగలేదని పేర్కొంది. చిత్ర షూటింగే ప్రణాళిక ప్రకారం జరగలేదని చెప్పింది. ఇతర కారణాల వల్లే చిత్ర షూటింగ్ చాలా సార్లు రద్దు అయ్యిందని తెలిపింది. అందువల్ల తన కాల్షీట్స్ చాలా వృథా అయ్యాయని అంది. తన బసకు ఏర్పాటు చేసిన హోటల్ నచ్చక పోవడంతో వేరే హోటల్కు మారానని అందుకు అయిన అదనపు ఖర్చును తానే భరించానని చెప్పింది. చాలాసార్లు షూటింగ్ ప్రారంభానికి ముందే స్పాట్కు వచ్చేదానినని తెలిపింది. షూటింగ్ లేకుండా చాలా రోజులు ఖాళీగా గడిపానని చెప్పింది. కాబట్టి షూటింగ్ జాప్యానికి తాను కారణం కాదని స్పష్టం చేసింది. తన కెన్యా పర్యటన రద్దు అయ్యిందని అందువల్లే ఆ ఖర్చును చెల్లించమని అడిగానంది. అలాగే మలయాళ చిత్రాల షూటింగ్లలో బిజీగా ఉండడంతో అతిథి చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొనలేక పోయానని అనన్య అంది. -
క్రిమినల్ ప్రేమకథ
డెంకాడ: సమాజంలో యువతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాన ఇతివృత్తంగా క్రిమినల్ ప్రేమకథ చిత్రాన్ని తీస్తున్నామని సినీదర్శకుడు సునీల్కుమార్ రెడ్డి చెప్పారు. జొన్నాడ వద్ద ఉన్న లెండి ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతులు సమాజంలో అనేక మంది ఉన్మాదులు, శాడిస్టులు వంటి రకరకాల వ్యక్తులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇలాంటి అంశాలను ఆధారంగా చేసుకుని, కళాశాలల్లో తాను వెళ్లేటప్పుడు విద్యార్థినుల వద్ద సేకరించిన అంశాలనే ఆధారంగా తీసుకుని క్రిమినల్ ప్రేమకథ సినిమా తీయటం జరిగిందన్నారు. ఈ సినిమాల్లో లెండి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన అనణ్య, ప్రత్యూష, రమణి, కౌషిక్లకు పాట పాడే అవకాశం కల్పించామన్నారు. కళాశాల ప్రిన్స్పాల్ డాక్టర్ వీవీ రామారెడ్డి మాట్లాడుతూ లెండి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించటం హర్షనీయమన్నారు. మ్యూజిక్ డెరైక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఆర్తిని ఈ సినిమా పాటల్లో చూపించటం జరుగుతుందన్నారు. సమావేశంలో ఎన్ఎస్ఎస్ పీఓ టి.హరిబాబు, చిత్ర నటులు మనోజ్, అనిల్, ప్రియాంక, పల్లవి, దివ్య, మనోప్రియ తదితరులు పాల్గొన్నారు. -
ఆయన నాకు మావయ్యే
చిత్ర పరిశ్రమలో మనుషుల మధ్య బంధాలన్నీ అవసరాల వరకే పరిమితం అంటారు. అయితే అందరిలో కాకపోయినా కొందరిలో సత్సంబంధాలు కొనసాగుతాయి. అలాంటి వారు వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంటారు. అలాంటి ఆత్మీయుడు తనకు దర్శక, నిర్మాత, నటుడు శశికుమార్ అంటోంది నటి అనన్య. నాడోడిగళ్ చిత్రంతో కోలీవుడ్ రంగ ప్రవేశం చేసిన ఈ మాలీవుడ్ బ్యూటీ ఆ తరువాత శీడన్, ఎంగేయుమ్ ఎప్పోదుమ్ తదితర చిత్రాల్లో నటించింది. టాలీవుడ్లోనూ కొన్ని చిత్రాలు చేసిన ఈ అమ్మడికి తమిళంలో అవకాశాలు అంతంత మాత్రమే. దీనికి కారణాలేంటో ఆమెనే అడిగి తెలుసుకుందాం. మీతో పాటు పరిచ యం అయిన నటీమణులు ప లు చిత్రాలలో నటిస్తున్నారు. మీకు మాత్రం గ్యాప్ రావడానికి కారణం ఏమిటంటారు? నేను మలయాళంలో చాలా చిత్రాలు చేశాను. తమిళంలో మాత్రం నాలుగు చిత్రాల్లో నటించాను. మరో రెండు చిత్రాలు విడుదల దశలో న్నాయి. తమిళంలో ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రం తరువాత కొంచెం గ్యాప్ వచ్చిన మాట నిజమే. అయితే ఎక్కువ చిత్రాలు చేసే కంటే తక్కువ చిత్రాలలోనైనా మంచి కథా చిత్రాలు చేయాలన్నదే నా పాలసీ. మలయాళ హీరోయిన్లు చాలామంది గాయనీమణులుగా అవతారమెత్తుతున్నా రు. మీకు అలాంటి ఆశ లేదా? ఆశ మాత్రమే కాదు. నేను గాయనినే. మలయాళంలో ఒక సంగీత ఆల్బమ్లో పాడాను. అందులో ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఒక పాట ఉంటుంది. అదే విధంగా 100 డిగ్రీల సెల్సియస్ అనే మలయాళ చిత్రంలో ఒక పాట పాడాను. అవకాశం వస్తే తమిళంలోనూ నా గాన మాధుర్యాన్ని వినిపించడానికి రెడీనే. మీ స్నేహితుడు నటుడు శశికుమార్ గురించి? శశికుమార్ నాడోడిగళ్ చిత్రంతో నాకు గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి. ఆ చిత్రంలో నేను ఆయన్ని మామ య్య అని పిలుస్తాను. బయట కూడా ఇప్పటికీ మావయ్య అనే పిలుస్తాను. సినిమాకు సంబంధించి ఎలాంటి సందేహం కలిగినా ముందుగా ఆయన్నే అడిగి తీర్చుకుం టాను. సహ నటుడన్నదానికంటే శశికుమార్ నాకు చాలా ఎక్కువే. మీ నటన సహజంగా ఉంటుందంటారు? థ్యాంక్స్. అయితే అందుకు కారణం షూటింగ్కు ముందు ఎలాంటి రిహార్సల్స్ చేయకుండా మామూలు అనన్యగానే పాల్గొం టాను. దర్శకుడు ఏమి చెబితే అదే చేస్తాను. అందువలనే నా నటన సహజత్వంతో ఉంటుంది. మీ వివాహం గురించి చాలా కథనాలు ప్రచారం అవుతున్నాయే? నేను నా భర్తతోనే కలిసి జీవిస్తున్నాను. నా గురించి జరుగుతున్న ప్రచారం ఏది నిజం కాదు. మా ఆయన నా కెంతో తోడ్పాటు నందిస్తున్నారు. వివాహానికి ముందు చిన్న అమ్మాయిగా ఉండేదాన్ని. పెళ్లి తరువాతనే మెచ్యూరిటీ సాధించాను. -
మా ఆయనకో ఛాన్స్ ఇవ్వరూ!
సాధారణంగా ఎవరైనా తన కోసం అవకాశాలడుగుతారు. నటి అనన్య మాత్రం తన భర్త కో ఛాన్స్ ఇవ్వరూ అంటూ తనకు తెలిసిన దర్శక, నిర్మాతలను అడుగుతున్నారు. కుటుంబ కథా పాత్రలనే పోషిస్తానంటూ తన నిర్ణయానికి కట్టుబడిన అనన్య తమిళంలో నాడోడిగళ్, ఎంగేయుమ్ ఎప్పోదుమ్ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ఈ మలయాళ కుట్టి వ్యాపారవేత్త ఆంజనేయన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం కలకలం సృష్టించింది. అందుకు కారణం ఆంజనేయన్ ఇంతకుముందే పెళ్లైన వ్యక్తి కావడం. అనన్య ప్రేమ వివాహాన్ని ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా ఈ ప్రేమ జంట ఆ మధ్య తిరుపతిలో రహస్య వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం భర్తతో తిరువనంతపురంలో నివసిస్తున్న అనన్య సమస్యలు సద్దుమణగడంతో మళ్లీ నటనపై దృష్టి సారించారు. భరతన్ దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రంలో అనన్య హీరోయిన్గా నటిస్తున్నారు. ఈమెకు జంటగా గాయకుడు ప్రసన్న హీరోగా పరిచయం అవుతున్నారు. ఇది మలయాళంలో హిట్ అయిన కాక్టెయిల్ చిత్రానికి రీమేక్. వివాహానంతరం మళ్లీ నటించడానికి రెడీ అయిన అనన్య తనతో పాటు తన భర్తను నటింప చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. తన భర్తకు అవకాశాలివ్వరూ అంటూ దర్శక నిర్మాతలను అడుగుతున్నారట. -
కోలీవుడ్కే ఓటు నటి అనన్య
తనకు మాలీవుడ్ కంటే కోలీవుడే బాగుందంటోంది మలయాళ సంచలన నటి అనన్య. తమిళంలో నాడోడిగళ్ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది ఈ భామ. ఎంగేయుమ్ ఎప్పోదుమ్ తదితర చిత్రాలతో నటిగా తనకంటూ ఒక గుర్తింపు పొందింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను మలయాళ నటినైనా తమిళంలోనే నటించడం సౌలభ్యంగా ఉందని పేర్కొంది. కోలీవుడ్లోనే మంచిపాత్రలు లభిస్తున్నాయని, ఇక్కడ తాను నటించిన చిత్రాలన్నీ విశేష ప్రజాదరణ పొందుతున్నాయని చెప్పింది. చిత్రాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నానని, వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించి నటించేయాలన్న తొందర లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం కోలీవుడ్లో పులివాల్, కాక్టైల్ చిత్రాలు చేస్తున్నట్లు అనన్య తెలిపింది.