Arguments
-
అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్
హైదరాబాద్, సాక్షి: సంధ్య ధియేటర్ వద్ద తొక్కిసలాట కేసుకు సంబంధించి నటుడు అల్లు అర్జున్కు భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్కు వర్తించవని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో చంచల్గూడ జైలు నుంచి ఆయన విడుదల కానున్నారు. ఈ కేసులో శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ను ఆయన నివాసంలో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై వైద్యపరీక్షల అనంతరం ఆయన్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇటు నాంపల్లి కోర్టులో.. అటు తెలంగాణ హైకోర్టులో కాసేపు వ్యవధిలో అల్లు అర్జున్ కేసులో వాదనలు జరిగాయి. అయితే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. ఈలోపే.. హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్లో అల్లు అర్జున్కు ఊరట లభించింది.నాంపల్లి కోర్టులో వాదనలు ఇలా.. ‘‘ఇది అక్రమ అరెస్ట్. బీఎన్ఎస్ 105 సెక్షన్ అల్లు అర్జున్కు వర్తించదు. సినిమా చూసేందుకు ఒక నటుడికి ఎవరి అనుమతి అవసరం లేదు. సాధారణ ప్రేక్షకుడిగానే వెళ్లారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారు. అరెస్టును తిరస్కరించండి’’ అని మేజిస్ట్రేట్కు అల్లు అర్జున్ తరఫు లాయర్ కోరారు.ఈ సందర్భంగా.. 2017 నటుడు షారూఖ్ ఖాన్ గుజరాత్ పర్యటనలో చోటుచేసుకున్న అపశ్రుతి ఘటనను ప్రస్తావించారు. ‘2017లో షారూఖ్ పర్యటన సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ కేసులో షారూఖ్కు ఊరట లభించింది’ మేజిస్ట్రేట్ దృష్టికి అల్లు అర్జున్ లాయర్ తీసుకెళ్లారు. ఇది చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్.. ఇది మరీ టూమచ్!అయితే.. భద్రత కోరుతూ సంధ్య థియేటర్ యాజమాన్యం చేసిన విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారని, అయినా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వచ్చారని, అలా ర్యాలీగా వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు వాదించారు. ఈ క్రమంలో.. రెండుగంటలపాటు వాదనలు విన్న నాంపల్లి కోర్టు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్(ఈ నెల 27వ తేదీ దాకా) విధించారు. అయితే పైకోర్టులో(హైకోర్టులో) తన క్లయింట్ వేసిన క్వాష్ పిటిషన్ విచారణ జరుగుతుందని అల్లు అర్జున్ లాయర్.. మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ రిమాండ్కు ఆదేశించడంతో పోలీసులు అల్లు అర్జున్ను చంచల్గూడ జైలుకు తరలించారు.మరోవైపు.. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై అల్లు అర్జున్ తరఫున నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. ఇదీ చదవండి: ‘అల్లు అర్జున్ అరెస్ట్తో నాకేం సంబంధం లేదు’హైకోర్టులో వాదనలు ఇలా.. ‘‘సంచలనం కోసమే అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్, రిమాండ్ రెండూ అక్రమమే. అల్లు అర్జున్ థియేటర్కు వస్తున్నారనే సమాచారం పోలీసుల దగ్గర ఉంది. కానీ, అక్కడ తగినంత పోలీసులు లేరు. థియేటర్ వద్ద ఉన్న జనాల్ని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. ఉన్న పోలీసులు కూడా అల్లు అర్జున్ను చూస్తూ ఉండిపోయారు. ఈ కేసు విచారణకు అల్లు అర్జున్ సహకరిస్తున్నారు. ఆయన ఎక్కడికి పారిపోవడం లేదు. మధ్యంతర బెయిల్ మంజూర చేయాలని అల్లు అర్జున్ తరఫు లాయర్ కోరారు. వాదనల సందర్భంగా.. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్కు వర్తించవని, గతంలో బండి సంజయ్ అరెస్ట్పై హైకోర్టు స్టే విధించిన విషయాన్ని లాయర్ నిరంజన్రెడ్డి ప్రస్తావించారు. ఆ సమయంలో పీపీని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నిస్తూ.. రేవతి మృతికి అల్లు అర్జున్ ఎలా కారణం అవుతారు?.సెక్షన్ 105, 118(1)లు అల్లు అర్జున్కు వర్తిస్తాయా? అని అడిగారు. 👉పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తూ.. అల్లు అర్జున్ ఓ సెలబ్రిటీ. జనాలు వస్తారని ఆయనకు తెలుసు. తొక్కిసలాటతో ఓ మహిళ ప్రాణం పోయింది. అల్లు అర్జున్ వల్లే తొక్కిసలాట జరిగింది. నేర తీవ్రతను బట్టే పోలీసులు ఈ కేసు పెట్టారు. మధ్యంతర బెయిల్ ఇవ్వదగిన కేసు ఇది కాదు. ఇది క్వాష్ పిటిషన్ మాత్రమే. ఇప్పటికే కింది కోర్టులో అల్లు అర్జున్కు రిమాండ్ విధించారు. ఆయన్ని ఈపాటికే చంచల్గూడ జైలుకు తరలించారు. కాబట్టి.. వాళ్లు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు అన్నారు.ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్👉ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై తీర్పు వెల్లడించింది. ‘‘ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్కు వర్తించవు. యాక్టర్ అయినంత మాత్రానా సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేం. కేవలం నటుడు కాబట్టే ఆ సెక్షన్లు ఆపాదించాలా?. మృతురాలు రేవతి కుటుంబంపై సానుభూతి ఉంది. అంతమాత్రాన నేరాన్ని ఒకరిపై రుద్దలేం. అల్లు అర్జున్కు కూడా జీవించే హక్కు ఉంది’’ అని పేర్కొంటూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఇక తీర్పు సందర్భంగా.. అర్ణబ్గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీం కోర్టు తీర్పును జడ్జి ప్రస్తావించారు. వ్యక్తిగత పూచీకత్తు(రూ.50 వేలు)కింద బెయిల్ మంజూరు చేయాలంటూ చంచల్గూడ జైలు సూపరిండెంట్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
‘హైడ్రా’పై కేఏ పాల్ వాదనలు.. హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: హైడ్రాపై కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం(అక్టోబర్ 23) హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో బెంచ్ ముందు పాల్ తానే స్వయంగా వాదనలు వినిపించారు. పాల్ వాదనలు విన్న కోర్టు హైడ్రాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టవద్దని హైడ్రాను ఆదేశించింది.నిర్వాసితులు ప్రత్యామ్నాయం చూసుకునేంతవరకు బాధితులకు సమయం ఇవ్వాలని సూచించింది. మూసీ బాధితులకు ఇల్లు కట్టించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. బాధితులకు ఇల్లు కేటాయించిన తర్వాతే కూల్చివేస్తున్నామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. -
‘మార్గదర్శి’ ఎగవేతదారుల వివరాలు తెలుసుకోండి: తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్, సాక్షి: సుప్రీం కోర్టు ఆదేశాలతో మార్గదర్శి కేసు విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శి ఎగవేతదారుల వివరాలు తెలుసుకోవాలని, ఇందుకోసం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ దినపత్రికల్లో నోటీసులు ఇచ్చి విస్తృత ప్రచారం కల్పించాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. మార్గదర్శి కేసును ఇవాళ తెలంగాణ హైకోర్టులో డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. జస్టిస్ సుజోయపాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం వాదనలు వింది. ఉండవల్లి అరుణ్కుమార్, మార్గదర్శి న్యాయవాది సిద్దార్థ లూద్రా అన్లైన్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆర్బీఐ దాఖలు చేసిన కౌంటర్పై స్పందన తెలిపేందుకు రెండు వారాలు సమయం కావాలని కోరారు మార్గదర్శి లాయర్ లూద్రా. అయితే..ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్) ప్రకారం మార్గదర్శి చందాలు వసూలు చేయడం చట్టవిరుద్ధమని ఆర్బీఐ కౌంటర్లో తేల్చిందన్న విషయాన్ని ఉండవల్లి బెంచ్ ముందు ప్రస్తావించారు. దీనిపై పూర్తి విచారణ జరపాలని, బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని చెప్పిందని గుర్తు చేశారు. అలాగే.. మొత్తం 70,000 చందాదారుల వివరాలు సుప్రీంకోర్టుకు మార్గదర్శి సమర్పించిందని, ఆ వివరాలను హైకోర్టుకు పెన్డ్రైవ్లో ఇచ్చేలా ఆ సంస్థను ఆదేశించాలని ఉండవల్లి కోరారు. అయితే.. ఆ వివరాలు కోరుతూ ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని ఉండవల్లికి హైకోర్టు సూచించింది. ఎగవేత దారుల వివరాలు తెలుసుకునేందుకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మరోవైపు.. రెండు వారాల్లో కౌంటర్లు వేయాలని ఏపీ, తెలంగాణ సర్కారుకు ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. -
Parliament Budget Session 2024: మాటల యుద్ధం
న్యూఢిల్లీ: అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదాలు, నినాదాలతో లోక్సభ గురువారం దద్దరిల్లింది. పలుమార్లు వాయిదా పడింది. కేంద్ర బడ్జెట్పై ప్రారంభమైన చర్చ పూర్తిగా పక్కదారి పట్టింది. తొలుత కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి రవనీత్సింగ్ బిట్టూ తాత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్సింగ్ హత్య ఘటనను ప్రస్తావించారు. దీనిపై బిట్టూ అభ్యంతరం వ్యక్తం చేశారు. చన్నీ, బిట్టూ మధ్య మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ నేత సోనియా గాం«దీతోపాటు చన్నీపై బిట్టూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. దీంతో విపక్ష ఎంపీలు ఒక్కసారిగా ఆయనపై విరుచుకుపడ్డారు. బిట్టూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యుడు అమరీందర్సింగ్ రాజా వెల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయతి్నంచారు. రాహుల్ గాంధీ ఆయనను ఆపేశారు. బిట్టూతోపాటు పలువురు బీజేపీ ఎంపీలు వెల్లోకి ప్రవేశించేందుకు ప్రయతి్నంచగా స్పీకర్ స్థానంలో ఉన్న సంధ్యా రే సభను వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. సభ సజావుగా జరిగేలా చూడాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. సభ్యులంతా సభ గౌరవాన్ని కాపాడాలని స్పీకర్ అన్నారు. నిబంధనలు అతిక్రమించకూడదని చెప్పారు. తర్వాత చన్నీ తన ప్రసంగం కొనసాగించారు. రైతులకు ఇచి్చన హామీలను మోదీ ప్రభుత్వం నిటబెట్టుకోలేదని విమర్శించారు. రైతులను ఖలిస్తానీలు చిత్రీకరించారని బీజేపీ నేతలపై మండిపడ్డారు. సభను చన్నీ తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. చన్నీ మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ చన్నీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆయనపై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని అన్నారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య మళ్లీ వాగ్వాదం కొనసాగింది. తర్వాత సభ రెండుసార్లు వాయిదా పడింది. పార్లమెంట్ బయట బిట్టూ మీడియాతో మాట్లాడారు. చన్నీ జాతి వ్యతిరేక శక్తిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇండియా నుంచి పంజాబ్ను విడదీయాలన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ: చన్నీ దేశంలో నరేంద్ర మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని చరణ్జిత్ సింగ్ చన్నీ మండిపడ్డారు. 20 లక్షల మంది ప్రజలు ఎన్నుకున్న ఎంపీని(అమృత్పాల్ సింగ్) జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేసిన ప్రజల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించే అవకాశం ఆయనకు ఇవ్వడం లేదని, ఇది ఎమర్జెన్సీ కాక మరేమిటని ప్రశ్నించారు. చన్నీ లోక్సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. అయితే, అమృత్పాల్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లోని ఖదూర్సాహిబ్ నియోజకవర్గం నుంచి వివాదాస్పద సిక్కు మత బోధకుడు, ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్ స్వతంత్ర అభ్యరి్థగా 2 లక్షల మెజారీ్టతో గెలిచిన సంగతి తెలిసిందే. ఆంధ్రా–బిహార్ బడ్జెట్: సౌగతా రాయ్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ లోక్సభలో విమర్శలు గుప్పించారు. అది ఆంధ్రా–బిహార్ బడ్జెట్ అని ఆక్షేపించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శిక్షణ పొందిన ఆర్థికవేత్త కాదని అన్నారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా కేవలం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచి్చన సూచనల ఆధారంగా బడ్జెట్ రూపొందించారని విమర్శించారు. గతంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, పి.చిదంబరం హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారని, నిర్మలా సీతారామన్ మాత్రం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకున్నారని సౌగతా రాయ్ వ్యాఖ్యానించారు. -
‘హియర్ సే ఎవిడెన్స్’ సాక్ష్యంగా చెల్లదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్రెడ్డి, గజ్జల ఉదయ్కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. హియర్ సే ఎవిడెన్స్ (నాకు మరొకరు చెప్పారని సాక్ష్యం చెప్పడం) చట్ట ప్రకారం సాక్ష్యంగా చెల్లదని, గూగుల్ టేక్ అవుట్ ప్రామాణికమని ఆ సంస్థే ధ్రువీకరణ ఇవ్వదని భాస్కర్రెడ్డి, ఉదయ్కుమారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి కోర్టుకు నివేదించారు. అలాంటి సాక్ష్యాలతో అరెస్టు సమర్థనీయం కాదని చెప్పారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పక్షపాత వైఖరితో సాగుతోందని, కావాలనే ఈ కేసులో తమను ఇరికించారని, తమకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం లేదని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘మూడో చార్జీషీట్ (ఈ కేసులో 2వ మధ్యంతర చార్జిషీట్) దాఖలు చేసే వరకు పిటిషనర్లపై ఎలాంటి ఆరోపణలు లేవు. ఆ తర్వాత నిందితులుగా చేర్చడంలో కుట్ర కోణం దాగి ఉంది. అవినాశ్రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన వారు కిరాయి హంతకుడు దస్తగిరి (ఏ–4) యథేచ్ఛగా తిరగడానికి మాత్రం పూర్తిగా సహకరిస్తున్నారు. హత్య వెనుక భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్ ఉన్నారని గంగిరెడ్డి తనకు చెప్పారంటూ దస్తగిరి వాంగ్మూలం ఇవ్వగా.., గంగిరెడ్డి మాత్రం తాను అలా చెప్పలేదని స్పష్టం చేశారు. దస్తగిరి చెప్పిన విషయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సీబీఐ.. ఇతరుల వాంగ్మూలాలను మాత్రం పట్టించుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. ‘రెండున్నర నెలలు ఢిల్లీలో సీబీఐ కస్టడీలో ఉన్నానని దస్తగిరి చెప్పాడు. ఆ తర్వాతే అప్రూవర్గా మారి పిటిషనర్ల పేర్లు చెప్పాడు. దస్తగిరి బెయిల్కు సీబీఐ పూర్తిగా సహకరించింది. నాటి దర్యాప్తు అధికారి రాంసింగ్పై తీవ్ర ఆరోపణలున్నాయి. ఆయనపై సుప్రీం కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దీంతో అత్యున్నత న్యాయస్థానం కేసు దర్యాప్తు బాధ్యత నుంచి ఆయన్ని తప్పించి, మరొకరిని నియమించింది. హత్య జరిగిన రోజున అవినాశ్రెడ్డికి భాస్కర్రెడ్డి ఫోన్ చేయడాన్ని కూడా సీబీఐ కుట్ర కోణంగా పేర్కొనడం సమంజసం కాదు. తండ్రి కుమారుడికి ఫోన్ చేయడం కూడా కుట్రేనా? కావాలనే ట్రయల్ కోర్టులో విచారణను సీబీఐ సాగదీస్తోంది. ముఖ్యంగా నాలుగు అంశాలను ఇక్కడ పరిశీలించాలి. ఇందులో మొదటిది పిటిషనర్లపై ఉన్నది ఆరోపణలు మాత్రమే. వాటికి సాక్ష్యాలు లేవు. రెండోది భాస్కర్రెడ్డి వయస్సు. ఆయన వయస్సు దాదాపు 72 ఏళ్లు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం మూడో అంశం. ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన ట్రయల్ కోర్టు పలుమార్లు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. ఆయనకు అత్యవసరమైతే 30 నిమిషాల్లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణకు చేర్చాలి. జైలులో ఉంటే అది సాధ్యం కాదు. ఆయనకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? నాలుగోది ఆయన్ని అరెస్టు చేసి సంవత్సరమయ్యింది. ఏడాదిగా జైలులో ఉంటున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని భాస్కర్రెడ్డితోపాటు ఉదయ్కుమార్కు బెయిల్ మంజూరు చేయాలి. ఇదే హైకోర్టు శివశంకర్రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అదే వీరికి కూడా వర్తిస్తుంది. సరైన సాక్ష్యాలు లేనప్పుడు నెలల తరబడి నిందితుల పేరుతో జైలులో ఉంచడం వారి హక్కులను హరించడం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పింది’ అని నిరంజన్రెడ్డి వాదించారు. అనంతరం సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వు చేశారు. -
పాన్ షాప్ దగ్గర రాజకీయ ముచ్చట్లు.. విసుగెత్తిన ఓనర్ ఏం చేశాడంటే..
రాయ్పూర్: ఎన్నికలు వచ్చాయంటే చాలు ఊళ్లలోని టీ కొట్లు, పాన్ షాప్ల దగ్గర జనం రాజకీయ ముచ్చట్లు పెడుతుంటారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఎందుకు గెలుస్తారు.. ఏ పార్టీ అధికారంలోని వస్తుంది.. ఇలా చర్చోపచర్చలు చేస్తుంటారు. ఇవి ఒక్కోసారి శ్రుతి మించి ఘర్షణలు, గొడవలకు దారి తీస్తుంటాయి. ఛత్తీస్గడ్లోని ఓ పాన్ షాప్ వద్ద కూడా జనం ఇలాగే చేస్తుండటంతో విసుగెత్తిపోయిన ఆ షాప్ నిర్వాహకుడు ఏం చేశాడంటే.. డిసెంబర్ 3 వరకు ఆగండి.. ఛత్తీస్గఢ్లోని మారుమూల ముంగేలి జిల్లాలోని ఓ ఊరిలో పాన్, టీ విక్రయించే చిన్నపాటి దుకాణంలో ఓ బోర్డు దర్శనమిస్తోంది. ‘డిసెంబర్ 3 వరకు ఆగండి. ఇక్కడ రాజకీయాల గురించి చర్చలు పెట్టి నా సమయాన్ని వృధా చేయకండి.. మీ సమయాన్ని చేసుకోకండి’ అని ఆ బోర్డులో రాసిఉంది. ఇక్కడికి వచ్చే జనం రాజకీయాల గురించి చర్చిస్తున్నారని, పార్టీలవారీగా విడిపోయి వాదనలకు దిగుతున్నారని పాన్ షాప్ నిర్వహకుడు మహావీర్ సింగ్ ఠాకూర్ చెబుతున్నారు. వీరి వాదనలు శ్రుతి మించి తరచుగా గొడవలు జరుగుతుండటంతో తన షాప్ వద్ద రాజకీయ చర్చలు వద్దని బోర్డును పెట్టినట్లు పేర్కొన్నారు. దీని వల్ల వ్యాపారం తగ్గినా పరవాలేదని ఆయన చెబుతున్నారు. బోర్డు పెట్టినప్పటి నుంచి అక్కడి వచ్చే జనంలో మార్పు వచ్చిందని, రాజకీయ చర్చలు తగ్గుముఖం పట్టాయని ఠాకూర్ తెలిపారు. కాగా ముంగేలి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. కాంగ్రెస్కు చెందిన సంజీత్ బంజారే, మాజీ మంత్రి బీజేపీ అభ్యర్థి పున్నూలాల్ మోహ్లేల మధ్య ఇక్కడ తీవ్ర పోటీ ఉంది. ఛత్తీస్గఢ్లో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న మిగిలిన నాలుగు రాష్ట్రాలతోపాటు ఓట్ల లెక్కింపు జరగనుంది. -
ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వండి: ఈసీకి సుప్రీం ఆదేశం
సాక్షి, ఢిల్లీ: రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సమీకరించే పథకం ద్వారా లంచాలను చట్టబద్ధం చేశామా? అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్స్లో అవకతవకలు, గోప్యతల విషయంలో దాఖలైన వాజ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తోపాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన రాజ్యాంగ ధర్మాసం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. కేసు విచారణ మంగళవారం మొదలు కాగా..మూడో రోజైన గురువారం కూడా కొనసాగింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పొందిన విరాళాల వివరాలను ఎన్నికల సంఘానికి సీల్డ్ కవర్లో అందించాలని ఆదేశిస్తూ 2019 ఏప్రిల్ 12 నాడు సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఆదేశశాలను ప్రస్తావించింది. ఏప్రిల్ 2019 ఉత్తర్వులు ప్రకటించిన తేదీకే పరిమితం కాదని పేర్కొంది. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ఏదైనా సందేహాలు ఉంటే సర్వోన్నత న్యాయస్థానం నుంచి స్పష్టత తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే ఎలక్టోరల్ బాండ్ల పథకం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సాగిన విచారణలో.. ఈసీఐ తన వద్ద తాజా వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని ధర్మాసనం పేర్కొంది. అయితే ఏప్రిల్ 12, 2019న జారీ చేసిన మధ్యంతర ఆదేశాల ప్రకారం.. ఎన్నికల కమిషన్ 2023 సెప్టెంబర్ 30 వరకు వివిధ రాజకీయపార్టీలు ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా పొందిన విరాళాల వివరాలను తమ అందించాలని ఆదేశిస్తున్నట్లు బెంచ్ తెలిపింది అంతకుముందు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరపున తన వాదనలను కొనసాగిస్తూ... ‘‘నిర్ణయం మరీ ఏకపక్షమైంద కానంత వరకూ ప్రయోగాలు చేసే హక్కు చట్టసభలకు ఉంది. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిన తరువాత ఏమైందన్నది ప్రశ్న. ఆ ధోరణలను బెంచ్ ముందు ఉంచాం’’ అని ధర్మాసనానికి వెల్లడించారు. ఈ సందర్భంగా న్యాయవాది కనూ అగర్వాల్ కల్పించుకుని మాట్లాడుతూ గతంలో రూ.20 వేల కంటే తక్కువ మొత్తం నిధులు చెల్లించే వారి వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండేది కాదని.. పార్టీలు ఈ అంశాన్ని అవకాశంగా మార్చుకుని అధికశాతం విరాళాలు ఈ మొత్తం కంటే తక్కువ ఉండేలా జాగ్రత్త పడ్డాయని, పథకాన్ని దుర్వినియోగం చేశాయని బెంచ్ దృష్టికి తీసుకు వచ్చారు. సోలిసిటర్ జనరల్ దీనికి ఉత్తరమిస్తూ... ప్రస్తుతం కొంచెం అనుమానాస్పదమైన రూ.20 వేల కంటే తక్కువ మొత్తమున్న విరాళాలు తగ్గాయని, ఎలక్టోరల్ బాండ్లు పెరిగాయని తెలిపారు. ఈ దశలో జస్టిస్ ఖన్నా కలుగజేసుకుని మాట్లాడుతూ రూ.20 వేల కంటే తక్కువ మొత్తమున్న ఎలక్టోరల్ బాండ్లు ఎంత మేరకు వచ్చాయో చూపాలని కోరారు. బాండ్లు ఎక్కువై ఉంటే ఆ విషయం దీని ద్వారా తెలుస్తుందన్నారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించేందుకు నిరాకరించిన పార్టీ ఇప్పటికీ అంతకంటే తక్కువ మొత్తమున్న స్వచ్ఛంద విరాళాలను స్వీకరిస్తోందని సోలిసిటర్ జనరల్ తెలిపారు. ఎలక్టోరల్ బాండ్లు పెరిగితే రూ.20 వేల కంటే తక్కువ విరాళాలు తగ్గుతాయని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించమన్న పార్టీ విషయంలో మాత్రమే రూ.20 వేల కంటే తక్కువ విరాళాలు తగ్గడం లేదని తెలిపారు. అందుకే ఆ పార్టీ పాత పద్ధతి కోసం డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. అనంతరం.. కేంద్రం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. ఎలక్షన్ ఫండింగ్, పార్టీ ఫండింగ్, క్యాంపెయిన్ ఫండింగ్ ఇవన్నీ కాలిడోస్కోప్(రంగురంగుల చిత్రాలను ప్రదర్శించే గాజుగొట్టం) లాంటిది. ఇదంతా ఆసక్తికరమైన ప్రయోగాంశంమేనన్నారు. -
చంద్రబాబు మధ్యంతర బెయిల్పై ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ అనుభవిస్తున్న చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై హైకోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తన నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యంతర బెయిల్పై నిర్ణయం ఆధారంగా ప్రధాన బెయిల్ పిటిషన్పై విచారణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కంటి శస్త్ర చికిత్సను కారణంగా చూపుతూ తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ మల్లికార్జునరావు విచారణ జరిపారు. ‘ఆరోగ్య సమస్యల దృష్ట్యా బెయిలివ్వండి’ సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు పలు అరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. అందువల్ల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తిని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. అందుకు ఆయనపై పెడుతున్న వరుస కేసులే నిదర్శనమని తెలిపారు. గత 52 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారని వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కుట్రపూరితంగా అరెస్ట్ చేశారన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును సీఐడీ ప్రశ్నించడం పూర్తయిందని, అందువల్ల అతనిని జైలులో ఉంచాల్సిన అవసరం ఎంత మాత్రం లేదన్నారు. సీఐడీ రిమాండ్ రిపోర్టులో చంద్రబాబుపై నిర్ధిష్ట ఆరోపణలేవీ లేవన్నారు. జైలులో చంద్రబాబు 5 కేజీల బరువు తగ్గారన్నారు. పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వివరించారు. కుడి కన్నుకు అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉందని, ఇదే విషయాన్ని వైద్యులు సైతం ధ్రువీకరించారని పేర్కొన్నారు. నచ్చిన వైద్యునితో చికిత్స చేయించుకునే ప్రాథమిక హక్కు పిటిషనర్కు ఉందన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ‘ఆరోగ్య సమస్యల్ని సాకుగా చూపుతున్నారు’ సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి, స్పెషల్ పీపీ యడవల్లి నాగవివేకానంద, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శెట్టిపల్లి దుష్యంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు జైలు నుంచి బయటకొచ్చేందుకు అరోగ్య సమస్యలను కారణంగా చూపుతున్నారని స్పష్టం చేశారు. ప్రధాన బెయిల్ పిటిషన్లో వాదనలు వినిపించేందుకు గడువు కావాలని సుధాకర్రెడ్డి కోర్టును కోరగా.. గడువు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని, ముందు మధ్యంతర బెయిల్పై వాదనలు వినిపించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చంద్రబాబు బరువు తగ్గారన్న వాదనలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఒకటిన్నర కేజీ బరువు పెరిగారని సుధాకర్రెడ్డి తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య స్థితిపై వైద్యుల నివేదికలను ఆయన కోర్టు ముందుంచారు. చంద్రబాబుకు జైల్లోనే అన్ని రకాల పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కంటి శస్త్రచికిత్స అత్యవసరం ఎంతమాత్రం కాదన్నారు. వైద్యులు సైతం ఇదే చెప్పారన్నారు. చంద్రబాబుకున్న అనారోగ్య సమస్యలు వయోభారంతో బాధపడే వారికి ఉండేవేనన్నారు. అవేమీ అసాధారణ సమస్యలు కాదన్నారు. జైలు నుంచి బయటకు వచ్చేందుకు ఆరోగ్య సమస్యలను కారణంగా మాత్రమే చూపుతున్నారని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు మధ్యంతర బెయిల్పై మంగళవారం నిర్ణయాన్ని వెల్లడిస్తానని స్పష్టం చేశారు. -
సూరత్ కోర్టులో వాదనలు.. ‘మరీ ఇంత పెద్ద శిక్షా ?’
సూరత్: మోదీ ఇంటి పేరును అనుచితంగా వాడారనే పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష, ఎంపీగా అనర్హత వేటును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తరఫున ఆయన న్యాయవాదులు గురువారం సూరత్ కోర్టులో వాదనలు వినిపించారు. ‘ నేర నిరూపణ విధానం సవ్యంగా లేదు. ఈ కేసులో ట్రయల్ కోర్టు జడ్జి అసమతుల్య సాక్ష్యాధారాలను ఆధారం చేసుకుని తీర్పు చెప్పారు. ఎలక్ట్రానిక్ సాక్ష్యాలతో మొత్తం కేసు ఆధారపడింది. రాఫెల్ కేసులో రాహుల్ చెప్పిన బేషరతు క్షమాపణ అంశాన్ని ఈ కేసుకు సంబంధంలేకున్నా ఇందులో జతచేశారు. మరీ ఇంత పెద్ద శిక్షా ?. ఈ కేసులో గరిష్ట శిక్షను అమలుచేయాల్సిన అవసరం లేదు’ అని అదనపు సెషన్స్ జడ్జి ఆర్పీ మొగెరా ముందు రాహుల్ లాయర్ ఆర్ఎస్ ఛీమా వాదించారు. శిక్షను నిలుపుదల చేయాలని కోరారు. ‘ దొంగలందరి ఇంటి పేరు మోదీ అనే ఎందుకుంది? అనే ప్రసంగం చేసే నాటికి రాహుల్ దేశంలోనే రెండో అతిపెద్ద పార్టీకి అధ్యక్షునిగా ఉన్నారు. దేశ ప్రజలపై ఆయన ప్రసంగ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రసంగాన్ని సంచలనం చేయాలనేది ఆయన ఉద్దేశ్యం. ఇలాంటి పరువునష్టం కేసులు ఆయన వేర్వేరు చోట్ల చాలా ఎదుర్కొంటున్నారు. రాఫెల్ కేసులో అనుచిత వ్యాఖ్యలు, ఆనక క్షమాపణల తర్వాతా ఆయన ఇలాంటి ప్రసంగాలు చేశారు’ అని పరువునష్టం కేసు వేసిన పూర్ణేశ్ మోదీ తరఫు లాయర్ హర్షిత్ తోలియా వాదించారు. తర్వాత జడ్జి తీర్పును 20వ తేదీకి వాయిదావేశారు. -
రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు..పోలీసులతో వాగ్వాదం
-
సుప్రీంకోర్టులో మొదలైన ప్రత్యక్ష ప్రసారాలు.. విచారణలు ఇలా చూడండి
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. మంగళవారం తమ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం ప్రారంభించింది. సుప్రీంకోర్టులోని మూడు వేర్వేరు రాజ్యాంగ ధర్మాసన కేసుల విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది. వీటిని యూట్యూబ్లో అందుబాటులో ఉంచారు. రానున్న రోజుల్లో సొంత వేదిక ద్వారా విచారణలు ప్రసారం చేయనున్నట్లు సీజేఐ యూయూ లలిత్ తెలిపారు. ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసన విచారణను మాత్రమే ప్రసారం చేస్తున్నారు. తర్వాత మిగతా అన్నింటిని లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. కోర్టులో జరిగే వాదనలకు, లైవ్ స్ట్రీమింగ్కు 30 సెకన్లు వ్యవధి తేడా ఉండనుంది. కాగా మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ రోజు ఆగస్టు 26న తొలిసారి ధర్మాసనం కార్యకలాపాలను దేశ ప్రజలంతా వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అయితే నాలుగేళ్ల క్రితం 2018 సెప్టెంబర్ 27సుప్రీంకోర్టు కేసుల వాదనలను లైవ్ స్ట్రీమింగ్ చేయాలని అప్పటి సీజేఐ దీపక్ మిశ్రా నిర్ణయం తీసుకున్నారు. అయినా ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదు. చివరికి సెప్టెంబర్ 27 నుంచి అన్ని రాజ్యాంగ ధర్మాసన కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీజేఐ యూయూ లలిత్ ఈనెల 20న నిర్ణయించారు. మొదటి స్ట్రీమింగ్లో భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ అధ్యక్షతన ఇడబ్ల్యూఎస్ కోటా కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసు 103వ రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ దాఖలైందిద. మరో విచారణలో మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే Vs ఏక్నాథ్ షిండే వర్గం మధ్య విబేధాలకు సంబంధించిన పిటిషన్పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇక జస్టిస్ ఎస్కే కౌల్ అధ్యక్షతన జరిగే మూడో విచారణలో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ చెల్లుబాటుకు సంబంధించిన అంశంపై వాదనలు కొనసాగుతున్నాయి. చదవండి: జపాన్ ప్రధానికి మోదీ ఘన నివాళులు -
భౌతికంగా కేసుల విచారణ కొనసాగించాలని ఏపీ హైకోర్టు నిర్ణయం
-
గాంధీ వర్ధంతి: మాంసం కోసం కొట్టుకున్న యువకులు
సాక్షి, రాయచూరు (కర్ణాటక): మాంసం కొనుగోలు విషయంలో చిన్నపాటి ఘర్షణ జరిగి 21 మంది గాయపడిన ఘటన ఆదివారం రాయచూరు నగరంలో చోటు చేసుకుంది. వివరాలు... మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మాంసం దుకాణాలు బంద్ చేశారు. సాయంత్రం నీరుబావి కుంటలో మాంసం దుకాణాలు తెరవడంతో శివప్ప, సూర్య ప్రకాశ్లు అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాంసం కొనుగోలు సందర్భంగా చిన్నపాటి గలాటా జరిగింది. దీంతో ఇద్దరు వారి స్నేహితులకు సమాచారం ఇచ్చారు. పెద్ద ఎత్తున యువకులు అక్కడికి చేరుకుని కొట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ వీరారెడ్డి తెలిపారు. చదవండిః సిద్ధు భస్మాసురుడు వంటి వాడు -
మాతృ భాషలో వాదనలు తప్పు కాదు
సాక్షి, అమరావతి: హైకోర్టులో మాతృ భాషలో వాదనలు వినిపించడం కోర్టును అవమానించడం ఏ మాత్రం కాదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తను ఇంగ్లిష్లో అడిగిన ప్రశ్నకు ఓ న్యాయవాది తెలుగులో సమాధానం ఇచ్చినందుకు ఆగ్రహించిన సింగిల్ జడ్జి రూ.25 వేలు ఖర్చుల కింద చెల్లించాలంటూ ఆ కేసు దాఖలు చేసిన పిటిషనర్ను ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం రద్దు చేసింది. విశాఖలో ఓ భవన నిర్మాణం అనుమతుల విషయమై అగనంపూడికి చెందిన గురు భాస్కరరావు 2019లో హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సింగిల్ జడ్జి విచారణ జరిపారు. న్యాయమూర్తి పిటిషనర్ విచారణార్హతపై ఓ ప్రశ్న అడిగారు. అప్పటివరకు ఇంగ్లిష్లోనే వాదనలు వినిపిస్తూ వచ్చిన న్యాయవాది.. తెలుగులో స్పందిస్తూ.. ‘తమరు పేజీ నెంబర్ 18, 19 ఓసారి చూడండి’ అంటూ సమాధానం ఇచ్చారు. దీనికి న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టులో తెలుగులో వాదనలు వినిపించడం కోర్టు ప్రొసీడింగ్స్ను అవమానించడమేనంటూ కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండానే ఆ పిటిషన్ను కొట్టేశారు. ఆ వెంటనే సదరు న్యాయవాది బేషరతు క్షమాపణలు కోరారు. తెలుగులో చెప్పిన సమాధానాన్ని పట్టించుకోవద్దంటూ.. తిరిగి ఇంగ్లిష్లో విన్నవించారు. అయినా న్యాయమూర్తి వినిపించుకోకుండా రూ.25 వేల జరిమానాను 4 వారాల్లో హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థకు జమ చేయాలని పిటిషనర్ను ఆదేశించారు. ధర్మాసనం ముందు అప్పీల్ వేసిన పిటిషనర్ జరిమానా చెల్లించాలనడంపై పిటిషనర్ సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయగా, ఇటీవల ఇది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. మొత్తం విషయం తెలుసుకున్న ధర్మాసనం.. ‘కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి ఈ అప్పీల్ను తేల్చాలని పిటిషనర్ కోరడం లేదు. అందువల్ల మేం కూడా ఈ కేసు లోతుల్లోకి వెళ్లడం లేదు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను పరిశీలిస్తే, న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రమే తెలుగులో చెప్పారు. అంతే తప్ప ఆ న్యాయవాది కేసు మొత్తాన్ని తెలుగులో వాదించలేదు. హైకోర్టులో కార్యకలాపాలు జరిగే భాష ఇంగ్లిష్. అయితే మాతృభాషలో వాదనలు వినిపించడం కోర్టు ప్రొసీడింగ్స్ను అవమానించడం ఎంత మాత్రం కాదు. అందువల్ల సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం’ అని చెప్పారు. -
మాట్లాడే అవకాశం ఇవ్వలేదని.. లైవ్ డిబేట్లో ఏం చేసిందో తెలుసా?
కోల్కతా: సాధారణంగా టీవీ డిబేట్లలో పాల్గొనడానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులను, ఆయా రంగాలకు ప్రముఖులను ఆహ్వనిస్తుంటారు. కొన్నిసార్లు ఈ డిబేట్లు ఆసక్తికరంగా సాగితే మరికొన్ని సార్లు ఫన్నీగాను సాగుతుంటాయి. ఈ డిబేట్లలో పాల్గొనే వక్తలు ఒకరిపై మరొకరు ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంటారు. కొన్నిసార్లు లైవ్ డిబేట్లలో మాటమాట పెరిగి.. సభ్యులు ఒకరిపై మరొకరు దాడిచేసుకొవడం, తిట్ల దండకాన్ని అందుకోవడం మనకు తెలిసిందే. కొన్నిసార్లు ఈ డిబేట్లలో హద్దులు దాటి కూడా ప్రదర్శిస్తుంటారు. కొందరు ఎదుటివారి దృష్టిని తమవైపు ఆకర్శించడానికి కొందరు తమ నోటికి పనిచేబితే.. మరికొందరు ఎదుటివారి వాదనలు వినకుండా ఫన్నీగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా.. ఈ కోవకు చెందిన ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పశ్చిమ బెంగాల్కు చెందిన ఒక టీవీ ఛానెల్ డిబేట్లో యాంకర్, ఐదుగురు సభ్యులు డిబెట్లో పాల్గొన్నారు. దీనిలో అందరు తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈక్రమంలో డిబెట్లో పాల్గొన్న ఒక మహిళ తన వంతు కోసం వేచిచూస్తుంది. ఏదో చెప్పాలనుకుంటుంది. అయితే, మిగతా సభ్యులు మాత్రం ఆమెకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. దాంతో ఆమె హైడ్రామా క్రియేట్ చేసింది. ఆ మహిళ లైవ్లోనే స్టెప్పులేయడం ప్రారంభించింది. దీంతో పక్కనున్న సభ్యులు మహిళ చర్యపట్ల ఆశ్చర్యంతో ఆమె వైపే చూస్తు ఉండిపోయారు. ఆ మహిళ మాత్రం.. తన రెండు చేతులను వివిధ భంగిమలతో చూపిస్తూ .. వెరైటీగా డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత.. గట్టిగా అరుస్తు వెరైటీగా స్పందించింది. ఈ ఫన్నీ డిబెట్ గతంలోనే జరిగింది. ఆకుపచ్చని కుర్తీవేసుకున్న మహిళ రోష్నిఆలీ. ఆమె పర్యావరణ వేత్త. తాజాగా, దీన్ని ఎలిజబెత్ అనే ట్విటర్యూజర్ తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీంతో మరోసారి ఇది వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వావ్.. భలే స్టెప్పులేసింది..’, ‘మహిళ ఎవరిని తిట్టలేదు.. బాగా నిరసన తెలిపింది’, ‘ పాపం.. మాట వినకుంటే ఏంచేస్తుంది..’, ‘మా సపోర్ట్ ఆ మహిళకే..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. See what the participant in green kurti does when not given a fair chance to speak! 😂😂😂 pic.twitter.com/M58kKkbpxB — Elizabeth (@Elizatweetz) January 16, 2022 చదవండి: మాజీ సర్పంచ్ దాష్టికం!..మహిళా ఆఫీసర్ని జుట్టు పట్టుకుని, చెప్పుతో కొట్టి... చివరికి -
పూటుగా మద్యం తాగి.. సెల్ఫోన్ కోసం గొడవ..
సాక్షి, జగద్గిరిగుట్ట (హైదరాబాద్): సెల్ఫోన్ కోసం జరిగిన వివాదంలో ఒకరు ప్రాణం కోల్పోయిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఉన్న శశి వైన్స్ వద్ద సోమవారం భూక్య భీమా(45), తన స్నేహితుడు ఫుల్గా మద్యం సేవించారు. తాగిన మత్తులో వారిద్దరి మధ్య సెల్ఫోన్ కోసం గొడవ జరిగినట్లు ప్రత్యక్ష సాక్షి వైన్స్ షాపు సెక్యూరిటీ గార్డ్ తెలిపాడు. వైన్స్ మూసేసిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ భోజనం చేయడానికి పక్కకు వెళ్లగా ఒక పెద్ద బండరాయి శబ్ధం రావడంతో తిరిగి వైన్స్ వద్దకు చేరుకొని చూడగా ఓ వ్యక్తి తలపై బండరాయితో మోది హత్య చేయబడ్డాడని గమనించి వెంటనే జగద్గిరిగుట్ట పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని హత్య కాబడ్డ వ్యక్తి జేబులో ఉన్న బుక్ను చెక్ చేయగా అతడి పేరు భూక్య భీమాగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. హత్య చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని సీఐ సైదులు తెలిపారు. చదవండి: న్యూడ్ ఫొటోలు అప్లోడ్ చేస్తానంటూ బెదిరింపులు -
గల్లీల్లో ఘర్షణ.. టెన్షన్లో జనం
సాక్షి, అంబర్పేట(హైదరాబాద్): ఆకతాయిలు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. గల్లీ ఘర్షణలు ఎక్కువవుతున్నాయి. అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని పలు బస్తీల్లో ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయి. కాస్త చీకటి పడగానే గల్లీల్లో తిష్టవేసి వారు చేసే ఆగడాలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రేమ్నగర్, ఆజాద్నగర్, మహ్మద్నగర్, న్యూ పటేల్నగర్, గోల్నాకలోని లంకా బస్తీలు, దుర్గానగర్ తదితర ప్రాంతాల్లో ఆకతాయిల ఆగడాలు హద్దులు దాటుతున్నాయి. దీంతో మహిళలు, యువతులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఫిర్యాదులకు కనిపించని స్పందన.. ► ఆకతాయిల ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేసినప్పుడే తూతూ మంత్రంగా ఘటనా స్థలాన్ని సందర్శించి పోతున్నారు. మితిమీరిన ఆగడాలతో స్థానికులు ఫిర్యాదు చేయడానికి సైతం ధైర్యం చేయడం లేదు. నేరుగా ఫిర్యాదులు చేస్తేనే పట్టించుకుంటామని పోలీసులు తేల్చి చెబున్నారు. ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించి ఆకతాయిల ఆగడాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. మత్తులో యువత హంగామా.. ► యువకులు డ్రగ్స్, మద్యం మత్తులో ఘర్షణ పడుతున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ స్థానికంగా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. వీరి మధ్యలో అడ్డుపడితే వారిపై సైతం దాడులు చేస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదులు వచ్చినా పోలీసులు పెద్దగా స్పందిస్తున్న దాఖలాలు లేవు. వారిలో వారు కొట్టుకుంటున్నారులే అనే చందంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం అయిందంటే బయటకు వెళ్లే పరిస్థితి లేదని, పోలీసులు తక్షణమే స్పందించి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళలు కోరుతున్నారు. చదవండి: మహంకాళి దేవాలయం వద్ద మొండెం లేని మనిషి తల -
విశాఖ తీరంలో మరోసారి ఉద్రిక్తత
-
మత్య్సకారుల మధ్య ఘర్షణ: బోట్లపై సినీ ఫక్కీలో ఛేజింగ్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో రింగువలల కోసం మత్య్సకారుల మధ్య గొడవ చెలరేగింది. దీనిపై రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. అంతటితో ఆగకుండా, రెండు వర్గాలు సినీ ఫక్కీలో సముద్రంపై ఛేజింగ్లు చేసుకున్నాయి. దీంతో విశాఖలోని.. పెద్ద జాలరీపేట గంగమ్మ గుడివద్ద ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం సంభవించింది. దీంతో సముద్రతీరం రణరంగంగా మారింది. చదవండి: ధర్మేంద్ర ప్రధాన్తో సీఎం జగన్ భేటీ -
నీ కుక్కను సరిగ్గా ట్రైన్ చేసుకో.. నా కుక్కనే అంటావా!
బెర్లిన్: సాధారణంగా కొందరు శునకాలను చాలా ఇష్టంగా పెంచుకుంటారు. వాటిని తమ ఇంట్లో మనుషుల మాదిరిగా చూసుకుంటారు. వాటిని ఎవరు ఏమన్నా.. ఆగ్రహంతో ఊగిపోతుంటారు. తాజాగా, ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాలు.. జర్మనీలోని తురింజియా పట్టణంలో 27 ఏళ్ల మహిళ, 51 ఏళ్ల మరో మహిళ తమ పెంపుడు కుక్కలను తీసుకుని స్థానికంగా ఉన్న పార్కులో వాకింగ్కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఒక శునకం.. మరో శునకాన్ని చూస్తు అరుస్తూ దాడికి తెగబడింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన 51 ఏళ్ల మహిళ.. మరో మహిళపై వాగ్వాదానికి దిగింది. శునకాన్ని సరిగ్గా ట్రైన్ చేసుకోవాలని చెప్పింది. దీంతో వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవ పెరిగి.. ఒకరిపై మరొకరు దాడిచేసుకోవడం వరకు వెళ్లింది. ఒకరిని మరోకరు కొరుక్కుంటూ గాయపర్చుకున్నారు. పాపం.. మహిళలిద్దరు కొట్టుకోవడాన్ని వారి శునకాలు చూస్తూ ఉండిపోయాయి. ఆ ప్రదేశంలో ఉన్న స్థానికులు వారి గొడవను ఆపటానికి సాహసించలేదు. ఈ సంఘటన తర్వాత ఇరువురు స్థానిక పోలీసుస్టేషన్ వెళ్లి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త క్లిప్పింగ్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘మీ కన్నా.. శునకాలే నయం..’, ‘వామ్మో.. ఇలా కరుచుకున్నారేంటీ..’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. -
బ్యూటీషియన్ అదృశ్యం
సాక్షి, సిరిసిల్ల(కరీంనగర్): ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన కూతురు తిరిగి రాలేదని తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ అనిల్కుమార్ తెలిపారు. సిరిసిల్ల పట్టణం ఇందిరానగర్కు చెందిన కల్లెపల్లి అక్షిత(27) ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. మళ్లీ తిరిగి రాలేదు. అక్షిత తల్లి ఎల్దండి కళావతి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జీవనోపాధి కోసం బ్యూటీపార్లర్ నడుపుతూ ఉండేదన్నారు. సర్ది చెప్పడానికి వచ్చిన మహిళపై దాడి సిరిసిల్ల: తమ ఇంటి ముందు జరుగుతున్న గొడవను నిలువరించేందుకు ప్రయత్నించిన మహిళపై దాడి చేసిన వ్యక్తి సోమవారం సిరిసిల్లటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముస్తాబాద్ మండలం రాంరెడ్డిపల్లికి చెందిన పల్లపు సునీత సిరిసిల్ల పట్టణం ఇందిరానగర్లో నివసించే వాళ్ల అక్కయ్య ఇంటికెళ్లింది. అక్క కూతురు, ఆమె భర్తకు మధ్య గొడవలను సద్దుమణిచేందుకు మాట్లాడడం గురించి వచ్చింది. ఈక్రమంలోనే కుటుంబికుడైన అరవింద్ అకారణంగా దాడి చేశాడు. దీంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో దాడిచేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: మాల్దీవ్స్లో ఫుడ్, బెడ్, స్పా అంతా మాదే -
భార్యాభర్తల గొడవ.. కూతురిని ఒంటరిగా తీసుకెళ్లి..
ముంబై: కోపం మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఆ సమయంలో విచక్షణ మరచి ప్రవర్తిస్తే అఘాయిత్యాలే జరుగుతాయి. తాజాగా ఓ కన్న తండ్రి కసాయిలా మారి తన కుమార్తెను పీకపిసికి కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో వెలుగు చూసింది. నిందితుడిని థానేలోని ముంబ్రాకు చెందిన అనీష్ మల్దార్ అనే కార్మికుడిగా పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం.. థానే ప్రాంతంలో మల్దార్ తన భార్య, కుమార్తెతో కలిసి నివసిస్తున్నాడు. గతకొంత కాలంగా ఆ దంపతులు ఇంట్లో చిన్నచిన్న విషయాలపై వారు తరచూ గొడవ పడేవారు. శుక్రవారం రాత్రి, ఏదో విషయమై మల్దార్కు తన భార్యతో గొడవ ప్రారంభమై, అది కాస్త తీవ్ర వాగ్వాదంగా మారింది. దీంతో కోపం తెచ్చుకున్న సదరు వ్యక్తి.. ఏడేళ్ల తన కుమార్తెపై ఆ కోపం చూపించాడు. క్షణికావేశంలో ఆ బాలికను ఒంటరిగా బయటకు తీసుకెళ్లి పీక పిసికి చంపేశాడు. కుమార్తె మృతి గురించి అతని భార్యకు తరువాత తెలియడంతో, ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నరు. చదవండి: మీరే నన్ను చంపేశారు.. నేనే బతికే ఉన్నానయ్య -
మేం చెప్పినట్లుగానే కేసు కట్టాలి.. కేకలు.. అరుపులతో హంగామా..
సాక్షి, అనంతపురం: నగరంలోని రెండో పట్టణ పోలీసు స్టేషన్లో సీపీఐ, టీడీపీ నాయకులు హైడ్రామాకు తెరలేపారు. తమ పార్టీలకు చెందిన అనుబంధ విద్యార్థి సంఘాల నేతలపై 30 యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తప్పుబట్టి వాగ్వాదానికి దిగారు. తాము సూచించిన సెక్షన్ల ప్రకారమే కేసులు నమోదు చేయాలని పట్టుబట్టారు. ఇందుకు పోలీసులు నిరాకరించడంతో స్టేషన్ ఎదుట నానా రభస చేశారు. వివరాలు... ఏఐఎస్ఎఫ్ ఆందోళన.. నగరంలోని ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాలను ఎయిడెడ్గానే కొనసాగించాలంటూ ఏఐఎస్ఎఫ్ నాయకులు గురువారం ఆ కళాశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 8న జరిగిన ఘటనపై ఉన్నతస్థాయి అధికారులతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 30 యాక్ట్ అమలులో ఉండడంతో ఆందోళన విరమించాలని అనంతపురం డీఎస్పీ వీరరాఘవ రెడ్డి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో అరెస్ట్ చేసి, రెండో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆందోళన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మనోహర్, రాజేంద్ర ప్రసాద్, చిరంజీవి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. కేకలు.. అరుపులతో హంగామా.. ఏఐఎస్ఎఫ్ నాయకుల అరెస్ట్ విషయం తెలుసుకున్న సీపీఐ, టీడీపీ నాయకులు వెనువెంటనే రెండో పట్టణ పోలీస్ స్టేషన్ను చేరుకున్నారు. తమ అనుబంధ విద్యార్థి సంఘాల నేతలపై 30 యాక్ట్ కింద కేసులు ఎలా నమోదు చేస్తారంటూ సీపీఐ నేత యల్లుట్ల నారాయణస్వామి, టీడీపీ నగర అధ్యక్షుడు మారుతీ ప్రసాద్, నరసింహులు తదితరులు పోలీసులను ప్రశ్నించారు. సీఐలు ప్రతాప్రెడ్డి, జాకీర్హుస్సేన్, రెడ్డెప్ప, కత్తి శ్రీనివాసులు నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తుండగానే గట్టిగా కేకలు, అరుపులతో హంగామాకు తెరలేపారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న డీఎస్పీ వీరరాఘవరెడ్డిని ఏకవచనంతో సంభోధిస్తూ తాము చెప్పిన సెక్షన్ల మేరకే కేసు కట్టాలంటూ డిమాండ్ చేశారు. రూల్ ధిక్కరించడం సబబు కాదని ఈ విషయంగా అనవసర రాద్ధాంతం వద్దని డీఎస్పీ నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తే వారు ససేమిరా అంటూ నానా రభస చేశారు. చివరకు పార్టీ నేతలను డీఎస్పీ బయటకు పంపి 30 యాక్ట్ ధిక్కరించిన టీఎన్ఎస్ఎఫ్ నేతలు పరుశురాం, గుత్తా ధనుంజయనాయుడు, ఏఐఎస్ఎఫ్ నేతలు మనోహర్, కుళ్లాయస్వామి, వంశీ, పృథ్వీ, రమణయ్య, ఉమామహేష్, రవి, రాజేంద్ర తదితరులపై కేసు నమోదు చేశారు. టూటౌన్ పోలీసు స్టేషన్లో హంగామా చేస్తున్న టీడీపీ, సీపీఐ నాయకులు -
Twitter: కొత్త ప్రయోగం.. ట్విటర్ కూల్
సోషల్ మీడియా వేదికగా రకరకాల చర్చలు జరుగుతుంటాయి. ఒక్కోసారి ఆ చర్చలు వాడీవేడి పరిణామాలకు.. అటుపై విపరీతాలకూ దారితీస్తుంటాయి. అయితే ఆ హీట్ డిబేట్లను తగ్గించే ప్రయత్నాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు చేయలేవా?.. ఇందుకోసమే ట్విటర్ ఇప్పుడు రంగంలోకి దిగింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విటర్ త్వరలో ఓ కూల్ ఫీచర్ను తీసుకురాబోతోంది. చర్చ అటుఇటు తిరిగి వాదులాటకు దారితీసే క్రమంలో ట్విటర్.. సదరు ట్వీపుల్స్(ట్విటర్ పీపుల్స్)ను అప్రమత్తం చేస్తుందట. ఇందుకోసం యూజర్ల సంభాషణ మధ్యలో కింద ఆఫ్షన్స్తో ఓ ఫీచర్ను డిస్ప్లే చేయబోతోంది. అప్పుడు యూజర్లు విచక్షణతో స్పందిస్తే.. ఆ ట్వీట్-రీట్వీట్ల సంభాషణపర్వం వేడెక్కకుండా అక్కడితోనే చల్లబడే ఛాన్స్ ఉంటుంది. అయితే సంభాషణకు సంబంధించి ఏ సందర్భంలో అలర్ట్ చేస్తుంది, అసలు ఎలా అంచనా వేయగలుగుతందనేది, ఎలా పని చేస్తుందనే విషయాల్ని ట్విటర్ ఇప్పుడే చెప్పట్లేదు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందట. ఇది పూర్తయ్యాక ఆండ్రాయిడ్, ఐవోఎస్.. రెండింటిలోనూ ఈ కూల్ ఫీచర్ను అప్డేట్ ద్వారా తీసుకురాబోతున్నారు. ఇదిలా ఉంటే ట్విటర్లో ఈమధ్య సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయని యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా ట్విటర్ టైం లైన్లో వాటికవే రిఫ్రెష్ అయ్యి.. ట్వీట్లు కనిపించకుండా పోతున్నాయి. దీనిపై స్పందించిన ట్విటర్ ఈ సమస్యకు చెక్ పెట్టేలా ఓ ఫీచర్ను తెస్తామని హామీ ఇచ్చింది. చదవండి: ఫేస్బుక్కి దెబ్బ.. వీళ్లేమో పండగ చేస్కున్నరు -
NGT: తాగునీటి కోసమే రిజర్వాయర్లు
సాక్షి, న్యూఢిల్లీ: తాగునీటిని అందించడానికే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణాన్ని చేపట్టామని తెలంగాణ స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం ముందు వాదనలు వినిపించింది. అయితే, కేంద్రం వైఖరి చెప్పకుండా ఆదేశాలు ఇవ్వొద్దని ఏపీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు లేవంటూ ఏపీ రైతుల డి.చంద్రమౌళీశ్వరరెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎన్జీటీలో పిటిషన్ దాఖలుకు 6 నెలల కాలపరిమితి ఉంటుందని, ఆ సమయం మించి దాఖలైన పిటిషన్లను విచారించరాదని తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్రావు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులోనూ ఈ అంశంలో పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు రాలేదన్న విషయం తెలిసీ ఎన్జీటీని ఆశ్రయించారన్నారు. 2015లో ఇచ్చిన జీవో ప్రకారం.. తాగునీటి కోసమే ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు. పర్యావరణ అనమతులు వచ్చే వరకూ సాగునీటి ప్రాజెక్టు పనులు చేపట్టబోమని రాంచందర్రావు వెల్లడించారు. తాగునీటి కోసమే అయితే అంత సామర్థ్యమున్న రిజర్వాయర్లు ఎందుకు కడుతున్నారు.. సాగునీటి కోసం కూడా ప్రాజెక్టు వినియోగించాలన్న ఉద్దేశంతోనే చేపడుతున్నట్లుంది కదా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. కృష్ణాలో నిరంతరం నీరు ఉండదని, వర్షాలు తక్కువ పడినా, వరదలు లేకున్నా నాలుగేళ్లపాటు నిర్విరామంగా తాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ సర్కార్ ఈ ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు కడుతోంందని రాంచందర్రావు చెప్పారు. ప్రాజెక్టు సమీప 13 మండలాలు ఫోర్లైడ్ బాధిత గ్రామాలని, భూగర్భజలాలు వినియోగం వల్ల ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో భారీ రిజర్వాయర్లు కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ విచారణ ప్రాథమిక దశలోనే ఉందని తుది విచారణలో తప్పకుండా తమ వైఖరి వెల్లడిస్తామని కేంద్రం తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. తదుపరి వాదనలు గురువారం (నేడు) వింటామన్న ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. చదవండి: టీఆర్ఎస్ జెండాను ఎత్తుకెళ్లిన దుండగులు -
భర్తకు నిప్పంటించి.. బండతో బాదిన భార్య.. కారణం ఏంటంటే..
సాక్షి, తుమకూరు(కర్ణాటక): భార్యభర్తల మధ్య జరిగిన గొడవ భర్త హత్యకు దారితీసింది. తుమకూరు నగరం జయనగరలో ఆదివారం మధ్యాహ్నం నారాయణ (45), భార్య అన్నపూర్ణమ్మ కొట్లాటకు దిగారు. నారాయణ నెలమంగల దగ్గరున్న మద్యం ఫ్యాక్టరీలో ఎలక్ట్రిషియన్గా పని చేసేవాడు. భార్యకు అక్రమ సంబంధం ఉందని నారాయణ అనుమానించేవాడని సమాచారం. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గొడవలో తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య ఇంట్లో ఉన్న కిరోసిన్ తీసుకొని భర్త పైన పోసి నిప్పు అంటించింది. మంటలో కాలిపోతున్న భర్త కిందపడిపోగా అతని తల పైన బండరాయితో కొట్టడంతో తల ఛిద్రమైంది. చుట్టుపక్కలవారు జయనగర పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. భార్యను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. చదవండి: ఏడు రోజుల్లో పెళ్లి.. బండరాయితో కొట్టుకొని పెళ్లి కొడుకు ఆత్మహత్య -
బలమైన వాదనలు వినిపించండి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీపై సెప్టెంబర్ 1న జరగనున్న పూర్తిస్థాయి కృష్ణా బోర్డు సమావేశంలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. బోర్డు భేటీలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు. బోర్డు సమావేశంలో చర్చకు రాబోయే ఎజెండాలోని అంశాలపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన నీటి వాటా కోసం కృష్ణా బోర్డు, ట్రిబ్యునళ్లు సహా అన్ని రకాల వేదికలపై బలమైన వాదనలు వినిపించాలన్నారు. బోర్డు సమావేశంలో సాధికారిక సమాచారంతో సమర్థంగా వాదనలు వినిపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండే, మాజీ అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో సీనియర్ న్యాయవాది రవీందర్రావు, ఇంటర్ స్టేట్ విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్, సూపరింటెండెంట్ ఇంజనీర్ కోటేశ్వర్రావు పాల్గొన్నారు. -
Tamilnadu: సీఐ సమక్షంలో ఎస్ఐల డిష్యుం..డిష్యుం
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకోవడంలో ఇద్దరు ఎస్ఐల మధ్య వివాదం చెలరేగింది. ఇన్స్పెక్టర్ సమక్షంలోనే ముష్టియుద్ధం చేసుకున్నారు. తంజై జిల్లా ఒరత్తనాడు పోలీసుస్టేషన్లో ఈ నెల 13వ తేదీ ఎస్ఐ కామరాజ్ డ్యూటీలో ఉన్నారు. ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అయితే కామరాజ్ ఫిర్యాదు తీసుకోకుండా మరుసటి రోజు రావాలని తెలిపాడు. మరుసటి రోజు వచ్చిన ఆ వ్యక్తి ఎస్ఐ దురైకన్నుకు ఫిర్యాదు చేసి ముందు రోజు జరిగిన విషయం చెప్పాడు. ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ వెంకటేశన్ సమయంలో ఎస్ఐలు ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ విషయం ఎస్పీ రవళిప్రియ దృష్టికి వెళ్లడంతో సోమవారం ఇద్దరిని పిలిపించి విచారణ చేశారు. వారిని తంజావూరు సాయుధ దళం విభాగానికి బదిలీ చేశారు. -
అమానుషం: డీసీఎం డ్రైవర్ను 5 కిలోమీటర్లు లాక్కొనిపోయారు..
లక్నో: ఉత్తర ప్రదేశ్లో కొందరు వ్యక్తులు డీసీఎం డ్రైవర్పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఈ సంఘటన కాన్పూర్లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గత సోమవారం సాయంత్రం లక్నో-కాన్పూర్ హైవే ఫ్లైఓవర్మీద డీసీఎం, కారు ఢీకొన్నాయి. ఈప్రమాదంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. కాగా, డీసీఎంలోని డ్రైవర్.. కారులోని వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిని మరొకరు తీవ్రంగా దూశించుకున్నారు. అంతటితో ఆగకుండా కొట్టుకొవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో, డీసీఎం డ్రైవర్.. కారు ముందు వెళ్లి నిల్చున్నాడు. అయితే, కారులో ఉన్న సదరు వ్యక్తులు.. కారును వేగంగా ముందుకు నడిపారు. దీంతో అతను కారు ముందు భాగం మీదపడిపోయి వైపర్ను పట్టుకున్నాడు. కారులోని వ్యక్తులు ఏమాత్రం జాలీ లేకుండా.. కారును దంచి కొట్టారు. ఆ యువకుడు వైపర్ను పట్టుకుని వేలాడుతున్నాడు. సుమారు 5 కిలోమీటర్ల వరకు అతడిని లాక్కొని పోయారు. ఈ అమానుషాన్ని అక్కడి స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్గా మారింది. ఈ మేరకు కేసును నమోదు చేసిన కాన్పూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
భవన నిర్మాణ కార్మికుడి పైశాచికం.. బాలికను బెదిరించి..
సాక్షి, కెలమంగలం (కర్ణాటక): అంచెట్టి తాలూకా వన్నాతిపట్టి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు మాదప్పన్(26). ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇతడు ఓ నిర్మాణ పనులకోసం వెళ్లి 16 ఏళ్ల బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం బాలిక అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన డాక్టర్లు బాలిక రెండు నెలల గర్భవతిగా తేల్చారు. దీంతో తల్లిదండ్రులు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాదప్పపై పోక్సో కేసు నమోదు చేసి తీవ్రంగా గాలిస్తున్నారు. వివాహిత ఆత్మహత్య హోసూరు: దంపతుల మధ్య ఏర్పడిన గొడవ ఒకరి ఆత్మహత్యకు దారి తీసింది. వివరాలు... ఊత్తంగేరి సమీపంలోని పెరుమాళ్కుప్పం గ్రామానికి చెందిన గుణశేఖరన్, విజయలక్ష్మి (24)కి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఒక పాప ఉంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. శనివారం రాత్రి కూడా రగడ జరగడంతో జీవితంపై విరక్తి చెందిన విజయలక్ష్మీ ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఊత్తంగేరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
దారుణం: తండ్రి శవం పక్కనే 3 రోజులుగా చిన్నారులు..
లక్నో: ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. భార్యభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా, భర్త ఉరి వేసుకుని చనిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. నోయిడాలో మనోజ్ దయాల్ తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. అతను ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి 4, 6 ఏళ్ల వయస్సున్న ఇద్దరు ఆడపిల్లలు. కరోనా వలన గత కొన్ని రోజులుగా మనోజ్ దయాల్ ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబంలో తరచుగా గొడవలు జరిగేవి. దీంతో విసిగిపోయిన మనోజ్ భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మనోజ్ తన ఇద్దరు బిడ్డలను చూసుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలో మనోజ్ కొన్ని రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో, ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, పాపం.. తండ్రి చనిపోయాడనే విషయం తెలియని ఆ బిడ్డలు.. నాన్నను ఎంత పిలిచిన పలకడం లేదని ఆకలి వేయడంతో ఇంటి నుంచి బయటకు వచ్చారు. అప్పడికే మూడు రోజుల నుంచి ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావడం లేదని చుట్టుపక్కల వారు అనుమానంగా చూశారు. ఇంతలోనే పిల్లలు బయటకు వచ్చి మానాన్న .. మాట్లాడటం లేదని చుట్టుపక్కల వాళ్లకు తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు ఆ ఇంటికి వెళ్లి చూశారు. అయితే, అప్పటికే మనోజ్ ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు. అతని, శవం నుంచి దుర్వాసన వెలువడుతుంది. దీంతో చిన్నారులు మూడు రోజులు నుంచి శవంతోనే ఉన్నారని వారు భావించారు. వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం బారేల్లీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. శవాన్ని వైద్యపరీక్షల కోసం తరలించారు. కాగా, కేసును నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతామని తెలిపారు. ఆ చిన్నారులిద్దరిని వారి బంధువులకు అప్పగించామని రోహిత్ సింగ్ అనే పోలీసు అధికారి పేర్కొన్నారు. చదవండి: షాకింగ్: తల్లి శవాన్ని కొరుక్కుతిన్న రాక్షస కుమారుడు -
ఎంపీపీ వర్సెస్ జెడ్పీ చైర్పర్సన్.. ఆ మాత్రం తెలియదా..
సాక్షి, ఇల్లందకుంట(కరీనంగర్): ప్రొటోకాల్ పాటించకుండా జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షత వహిస్తూ చెక్కులు ఏ విధంగా పంపిణీ చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సమక్షంలో జెడ్పీ చైర్పర్సన్ను ఎంపీపీ పావని నిలదీసింది. దీంతో ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ మధ్య కొంతసేపు మాటల యుద్ధం నడిచింది. బుధవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తుండగా ఇరువురు ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో లబ్ధిదారులు ఆందోళన గురయ్యారు. అసలే చెక్కుల కోసం కొంతకాలంగా ఎదురు చూస్తున్నామని, ఈ సమయంలో మీ గొడవలు ఏంటని ప్రశ్నించారు. చెక్కులు పంపిణీ చేయాలని కోరారు. అయితే ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న చెక్కుల పంపిణీని అడ్డుకోవడానికి ఈటల వర్గీయులు ఇలా మాట్లాడుతున్నారని జెడ్పీ చైర్పర్సన్ ఆరోపించారు. దీంతో ఇరువురి మధ్య వాదోపవాదనలు పెరుగగా, ఆర్డీవో రవీందర్రెడ్డి కలుగజేసుకొని సముదాయించారు. అనంతరం సర్పంచులు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో ఆయా గ్రామాలకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. చదవండి: ఫోన్కాల్ కలకలం: ‘నువ్వేమైనా కేసీఆర్వా.. లేక ఎర్రబెల్లివా?’ -
అనాథ మహిళ మృతి.. రెండు గ్రామాల మధ్య ‘ఖనన’ పంచాయితీ
సాక్షి, అమరచింత(మహబూబ్నగర్): ఓ అనాథ మహిళ మృతి చెందగా ఇరు గ్రామాల మధ్య ‘ఖనన’ పంచాయితీ తలెత్తింది. చివరకు ఒకరిద్దరు గ్రామ పెద్దల జోక్యంతో అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని కిష్టంపల్లికి శ్మశాన వాటిక లేదు. దీంతో పక్క గ్రామమైన నందిమల్ల ఎక్స్రోడ్డు శివారులో ఇటీవల అధికారులు రెండెకరాలు కేటాయించారు. అయితే కిష్టంపల్లిలో ఎవరు చనిపోయినా అంత్యక్రియలు నిర్వహించేందుకు నందిమల్ల ఎక్స్రోడ్డు మధ్య నుంచే వెళ్లాలి. దీంతో ఇరు గ్రామాల మధ్య పంచాయితీ న డుస్తోంది. కాగా, కిష్టంపల్లికి చెందిన అనాథ దాసరి కొండమ్మ (80) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. సర్పంచ్ చెన్నమ్మతో పాటు గ్రామస్తులు ఆర్థికసాయం అందించి మధ్యాహ్నం అంతిమ సంస్కారాలకు సిద్ధమయ్యారు. ఖననానికి తీసుకెళ్తుండగా తమ గ్రామం మీదుగా వద్దని నందిమల్ల ఎక్స్రోడ్డు గ్రామస్తులు అడ్డుకున్నారు. మృతదేహాన్ని అక్కడే ట్రాక్టర్పై నుంచి కిందికి దింపారు. ఇరు గ్రామస్తుల మధ్య గంటన్నర పాటు వాదోపవాదా లు నడిచాయి. కొందరు నాయకులు జోక్యం చేసుకు ని మృతదేహాలు తీసుకెళ్లడానికి వేరే మార్గం చూపి స్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. చివరకు అనాథ మహిళ మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: రిమ్స్లో దారుణం: కాలం చెల్లిన ఇంజక్షన్లతో చికిత్స.. -
ఎస్సైతో గొడవపడిన మహిళ..
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): మొబైల్ఫోన్లో మాట్లాడుతూ కారు నడుపుతున్న మహిళను ఎస్సై ఆపి జరిమానా కట్టమనడంతో గొడవకు దిగింది. ఉడుపిలో శనివారం ఎస్సై ఖాదర్ ఆ మహిళను గమనించి అడ్డగించారు. ఆ సమయంలో ఆమె ఎస్సైతో గట్టిగా మాట్లాడుతుండగా ఓ కానిస్టేబుల్ వీడియో తీయసాగాడు. దీంతో మహిళకు చిర్రెత్తిపోయింది. అధికారం ఉందని వీడియో తీయటం సరికాదని, జరిమానా చెల్లిస్తానని కేకలు వేసింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. -
సిబ్బంది మధ్య వార్.. నిలిచిపోయిన కరోనా పరీక్షలు..
సాక్షి, బన్సీలాల్పేట్(సికింద్రాబాద్): సికింద్రాబాద్ బోయిగూడ పట్టణ ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది మధ్య కోల్డ్వార్ సాగుతుంది. రోగులకు సేవలందించే విషయంలో సిబ్బంది మధ్య సమన్వయం కొరవడడంతో కరోనా రోగులకు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో గురువారం కరోనా పరీక్షలకు కొంత అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి రంగంలోకి దిగి స్వయంగా పీపీఈకిట్ వేసుకొని కరోనా పరీక్షలు నిర్వహించారు. వైద్యాధికారి, సిబ్బంది మధ్య అంతర్గత పోరు... బోయిగూడ అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్యాధికారిణి, స్టాఫ్ మధ్య వైద్య సేవల విషయంలో కొంత కాలం నుంచి అంతర్గత పోరు కొనసాగుతుంది. సెంటర్లో పలువురు సిబ్బంది వైద్యాధికారిణి డాక్టర్ ఆశాజ్యోతి చెప్పిన మాట వినకుండా ఎదురు తిరుగుతున్నట్లు సమాచారం. వీరి మధ్య విబేధాలు గురువారం ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. సెంటర్లో కరోనా పరీక్షలు నిర్వహించే ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సుకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో సదరు సిబ్బంది గురువారం విధులకు రాలేదు. దీంతో సెంటర్ వైద్యాధికారిణి డాక్టర్ ఆశాజ్యోతి కరోనా పరీక్షలు చేయాల్సిందిగా ఏఎన్ఎంను ఆదేశించారు. శిక్షణ లేకుండా తాము ఏ విధంగా పరీక్షలు నిర్వహించాలని, ఫర్మనెంట్ స్టాఫ్ను పిలిపించి పరీక్షలు నిర్వహించాలని సిబ్బంది బదులిచ్చినట్లు సమాచారం. వైద్యాధికారణి, సిబ్బందికి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. పరీక్షలు చేసిన డీఎంహెచ్ఓ.. వైద్యాధికారిణి డాక్టర్ ఆశాజ్యోతి సిబ్బందితో వాగ్వాదం జరిగిన విషయాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఆయన హుటాహుటిన బోయిగూడ సెంటర్కు వచ్చి అక్కడ పరీక్షల కోసం నిరీక్షిస్తున్న ప్రజలను చూసి చలించిపొయాడు. వెంటనే డాక్టర్ వెంకటి పీపీకిట్ ధరించి సాయంత్రం వరకు కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో అక్కడున్న ప్రజలు జిల్లా వైద్యాధికారి తీరును చూసి సంతోషం వ్యక్తం చేశారు. -
వైద్యుల వాగ్వాదం; ఎగ్జామినర్ నేనంటే.. నేను..
సాక్షి, గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ ఆర్ధోపెడిక్ విభాగ వైద్యుల మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఇరువురు వైద్యులను ఇంటర్నల్ ఎగ్జామినర్గా నియమిస్తూ ఆదేశాలు జారీ కావడంతో సోమవారం పరీక్ష కేంద్రంలోనే ఎగ్జామినర్ నేనంటే.. నేనని చెప్పడంతో వైద్యవిద్యార్థులు అవాక్కయ్యారు. రంగంలోకి దిగిన కాలేజీ అధికారులు ఆ ఇద్దరు వైద్యులను సముదాయించి సమస్యను సామరస్యంగా పరిష్కరించారు. వివరాలు... ఎంబీబీఎస్ ఫైనలియర్ పార్ట్–2 ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఈనెల 26వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహించాలని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఆదేశాలు అందాయి. ఆర్ధోపెడిక్ విభాగం పరీక్షల ఇంటర్నల్ ఎగ్జామినర్గా ప్రొఫెసర్ ఎన్.రవీందర్కుమార్ను నియమిస్తూ ఈనెల 24వ తేదీన కేఎన్ఆర్యుహెచ్ఎస్ ఎగ్జామినేషన్ డిప్యూటీ రిజిస్టార్ డాక్టర్ రామానుజరావు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెసర్ బీ.వాల్యాను ఎగ్జామినర్గా నియమిస్తున్నట్టు ఈనెల 26వ తేదీన మరో నియామక ఉత్తర్వులు జారీ చేశారు. గాంధీ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో సోమవారం ఉదయం 9.30 గంటలకు వైద్యవిద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రంలో ఎగ్జామినర్ నేనే అంటూ ఇద్దరు వైద్యులు వాగ్వాదానికి దిగారు. ఎవరు ఎగ్జామినరో తెలియక వైద్య విద్యార్థులు అయోమయంలో పడ్డారు. రాత్రంతా నిద్రలేకుండా పరీక్షలకు ప్రిపేర్ అయ్యామని, పరీక్ష కేంద్రంలో ఈ రాద్ధాంతం ఏమింటని పలువురు వైద్యవిద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా 8 రోజులపాటు జరిగే పరీక్షల్లో నాలుగు రోజులకు ఒకరు, మిగిలిన నాలుగు రోజులు మరొకరు ఎగ్జామినర్గా వ్యవహరిస్తారని కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ప్రకాశరావు వివరణ ఇచ్చారు. రెండేళ్ల నుంచి కొనసాగుతున్న విభేదాలు.. గాంధీ ఆర్ధోపెడిక్ విభాగంలో వైద్యుల మధ్య రెండేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఆర్ధోపెడిక్ హెచ్ఓడీగా బీ వాల్య ఉండగా, నిబంధనల ప్రకారం మరో ప్రొఫెసర్ సత్యనారాయణ హెచ్ఓడీగా నియమితులయ్యారు. గాంధీ ఆస్పత్రి ఆర్ధోపెడిక్ విభాగంలోని హెచ్ఓడీ రూం విషయమై వైద్యుల మధ్య విభేదాలు ప్రారంభమై తారస్థాయికి చేరుకుని రెండు వర్గాలుగా విడిపోయారు. ఇరువర్గాలు పలుమార్లు గొడవ పడ్డారు. గాంధీ ఆస్పత్రి, కాలేజీ అధికారులు కలుగజేసుకున్నా పరిష్కారం కాలేదు. దీంతో నిరుపేద రోగులతోపాటు వైద్యవిద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. -
వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద డాక్టర్ హంగామా.. ఎందుకంటే..
సాక్షి, యైటింక్లయిన్కాలనీ(రామగుండం): రామగిరి మండలం ముస్త్యాల ప్రభుత్వం పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద అదే గ్రామానికి చెందిన డాక్టర్ విజయ్కుమార్ హంగామా చేసినట్లు సర్పంచ్ లావణ్య తెలిపారు. సెంటర్ ఇక్కడ ఎందుకు పెట్టారు అంటూ ఏఎన్ఎం, ఆశ వర్కర్లను, మెడికల్ ఆఫీసర్ను, కార్యదర్శితో గొడవకు దిగినట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ సెంటర్కు ప్రజలు రాకుండా ఇబ్బంది కలిగేలా తన బైక్ను అడ్డుగా పెట్టడంతో, బైక్ తీయాలని అడిగిన నాగరాజుపై చేయిచేసుకున్నట్లు తెలిపారు. దీనిపై గోదావరిఖని టూటౌన్ పోలీసులకు సమాచారం అందించగా కానిస్టేబుల్ రావడంతో గొడవ సద్దుమణిగినట్లు తెలిపారు. ఈ విషయంపై పెద్దపల్లి డీఎంహెచ్ఓ దృషికి తీసుకెళ్తామని తెలిపారు. కాగా విజయ్కుమార్ యైటింక్లయిన్కాలనీ అల్లూరు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. -
కుటుంబంలో గొడవలు.. విచక్షణ కోల్పోయిన ఆమహిళ..
సాక్షి, సుభాష్నగర్(కుత్బుల్లాపుర్): కుటుంబంలో చిన్నపాటి గొడవలతో కొంత మంది విచక్షణ కోల్పోయి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అలాంటి ఘటన గురువారం దూలపల్లిలో చోటు చేసుకుంది. దూలపల్లి కమ్మరిబస్తీ గుడిసెల్లో ఉండే భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకునేందుకు పక్కనే ఉన్న లింగయ్య చెరువులో దూకింది. ఈ విషయాన్ని గుర్తించిన ఇద్దరు యువకులు వెంటనే చెరువులోకి దూకి మహిళను కాపాడికి ఒడ్డుకు తీసుకు వచ్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
భారత జలాల్లో అమెరికా దుందుడుకు చర్య
న్యూఢిల్లీ/వాషింగ్టన్: అంతర్జాతీయ జలాల పరిధి విషయంలో భారత వాదనను సవాలు చేస్తూ, భారతదేశం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే, ఈ వారం లక్షద్వీప్ సమీపంలోని భారతీయ జలాల్లో ‘ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఆపరేషన్(ఎఫ్ఓఎన్ఓపీ)’ను నిర్వహించామని అమెరికా ప్రకటించింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. సముద్ర జలాల విషయంలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లం ఘించడం సరికాదని యూఎస్కు స్పష్టం చేసింది. దేశాల ప్రత్యేక ఆర్థిక ప్రాంతాలు(ఈఈజెడ్), కాంటినెంటల్ జోన్ల పరిధిలో ఇతర దేశాలు.. అనుమతి లేకుండా కార్యకలాపాలు చేపట్టడం, ముఖ్యంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు వినియోగించడం ‘యూఎన్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ’కి వ్యతిరేకమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ‘క్షిపణి విధ్వంసక నౌక ‘జాన్ పాల్ జోన్స్ భారతీయ జలాల్లో ‘ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఆపరేషన్’లో పాల్గొంది. తద్వారా ఆ జలాల పరిధిపై భారత దేశం పేర్కొంటున్న మితిమీరిన హక్కును సవాలు చేశాం. ఎఫ్ఓఎన్ఓపీ ద్వారా అంతర్జాతీయ చట్టాలు గుర్తించిన సముద్ర జలాల్లో నేవిగేషన్కు ఉన్న స్వేచ్చను, హక్కులను, చట్టబద్ధ వినియోగాన్ని నిర్ధారించాం’ అని అమెరికా నౌకాదళానికి చెందిన 7వ ఫ్లీట్ ఏప్రిల్ 7న ప్రకటించింది. సముద్ర జలాల పరిధిపై భారత వాదనను సవాలు చేస్తూ, అంతర్జాతీయ నిబంధనల మేరకు లక్షద్వీప్కు పశ్చిమంగా 130 నాటికల్ మైళ్ల దూరంలో, భారత ఈఈజెడ్ పరిధిలో ఎఫ్ఓఎన్ఓపీ నిర్వహించామని పేర్కొంది. దీనిపై అమెరికాకు భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘పర్షియన్ గల్ఫ్ నుంచి మలక్కా సంధి వరకు అమెరికా నౌక ఆపరేషన్స్ జరిపింది. ఈ విషయంపై భారత అభ్యంతరాలను అమెరికా ప్రభుత్వానికి దౌత్య మార్గాల ద్వారా వెల్లడించాం’ అని శుక్రవారం భారత విదేశాంగ శాఖ పేర్కొంది. భారతీయ ఈఈజెడ్ పరిధిలో ఇతర దేశాలు మిలటరీ ఆపరేషన్లు నిర్వహించాలంటే తమ అనుమతి తప్పనిసరి అన్న భారత వాదనను అమెరికా కొట్టివేస్తోంది. -
అటు ధోని... ఇటు అంపైర్లు!
భారత జట్టును నడిపించేటప్పుడు ‘కెప్టెన్ కూల్’గానే కనిపించిన ధోని పసుపు రంగు దుస్తుల్లో ‘హాట్’గా మారిపోతాడేమో? గత ఏడాది ఐపీఎల్లో రాజస్తాన్తో మ్యాచ్లోనే మైదానంలోకి వచ్చి మరీ అంపైర్లతో వాదనకు దిగిన ధోని మంగళవారం కూడా అదే తరహాలో ప్రవర్తించాడు. దీపక్ చహర్ వేసిన రాయల్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఐదో బంతికి టామ్ కరన్ను అంపైర్ షంషుద్దీన్ అవుట్ (కీపర్ క్యాచ్)గా ప్రకటించాడు. అయితే కరన్ మాత్రం కదలకుండా అక్కడే నిలబడిపోయాడు. తన నిర్ణయంపై సందేహం వచ్చిన షంషుద్దీన్ మరో అంపైర్ వినీత్ కులకర్ణితో చర్చించి థర్డ్ అంపైర్గా నివేదించగా అది నాటౌట్గా తేలింది. బంతి కరన్ బ్యాట్కు తగలకపోగా... ధోని కూడా బంతి నేలను తాకిన తర్వాతే అందుకున్నాడు. అయితే ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై మళ్లీ చర్చ ఏమిటంటూ ధోని అసహనం వ్యక్తం చేశాడు. అంపైర్ తప్పు చేయడం వాస్తవమే అయినా... తమ నిర్ణయాన్ని పునస్సమీక్షించే అధికారం నిబంధనల ప్రకారం ఫీల్డ్ అంపైర్లకు ఉంది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో అంచనా తప్పని ధోని... క్యాచ్ కాని క్యాచ్ కోసం ఇంతగా వాదించడం ఆశ్చర్యకరంగా అనిపించింది! -
‘మా’ సమస్య పరిష్కారమైంది
‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ) సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, నరేశ్ మధ్య వాగ్వివాదాలు జరిగాయి. ఈ వివాదం త్వరగానే సద్దుమణిగింది. ఇండస్ట్రీ ప్రముఖులం ‘తెలుగు ఇండస్ట్రీ కలెక్టీవ్ కమిటీ’ ఏర్పరచుకొని, జరిగిన సమస్యను పరిష్కరించుకున్నాం అంటూ శనివారం ప్రెస్మీట్లో వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మాత సురేశ్బాబు మాట్లాడుతూ – ‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఫెడరేషన్, ఫిల్మ్ చాంబర్, కౌన్సిల్ మరికొన్ని.. వాటిన్నింటిని కలిపితేనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇటీవల మా మధ్యలో కొన్ని మనస్పర్థలు వచ్చాయి. దాని కోసం అందరం కలసి ఓ సపరేట్ బాడీ ఏర్పర్చుకున్నాం. ఏదైనా ఇష్యూ ఉంటే ముందు మాలో మేం మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆ ఇష్యూ జరిగినట్టు ఇంకోసారి జరగకూడదని భావించాం. ‘మా’కి రావాల్సిన డబ్బులన్నీ వచ్చేశాయి. అందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు. వాళ్లు సైన్ చేసుకున్న అగ్రిమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. అగ్రిమెంట్లో లేని చాలా విషయాలు ఇండస్ట్రీ చేతుల్లో ఉండవు. థర్డ్ పార్టీ వాళ్ళ వల్ల ఏర్పడే వాటిని మేం సెటిల్ చేయలేం కదా? దాని వల్ల మాకు ఎటువంటి లాస్ రాలేదు’’ అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ – ‘‘ఇటీవలే ‘తెలుగు ఇండస్ట్రీ కలెక్టీవ్ కమిటీ’ అని పెట్టుకున్నాం. ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించుకోవాలి అనుకుంటూ వస్తున్నాం. అనుకోకుండా చిన్న సమస్య ఏర్పడింది. అది పరిష్కరించాం. ఇక నుంచి కూడా హెల్తీగానే జరుగుతుంది, జరగాలి కూడా. సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా కలెక్టివ్ కమిటీనే చూస్తుంది. సాల్వ్ చేస్తుంది. ప్యూచర్లో చేసే ఈవెంట్స్ కూడా ఇది వరకులానే మాములుగానే చేస్తారు’’ అన్నారు. ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్ మాట్లాడుతూ – ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలకు, సామాన్యులకు డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంది. ఇందులో కొన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అభిప్రాయభేదాలు రావడం సహజం. మనుషులు కలసి పని చేసేది కాబట్టి. టీఎఫ్ఐ కమిటీ ఏర్పాటు చేసి పెద్దలను కూర్చోబెట్టి వాళ్ళకు మా సమస్యలను వివరించి, చర్చించుకున్నాం. ఇండస్ట్రీ ఇంకా బెటర్ అవ్వడానికి ఈ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. గతం గతః. రానున్న రోజుల్లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ బాగా చేయడమే మా లక్ష్యం. త్వరలో మహేశ్బాబు ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇవన్నీ సక్సెస్ చేస్తాం. దానికి పూర్తి సపోర్ట్ చేస్తాం. ఇక నుంచి అన్ని కార్యక్రమాలు పారదర్శకంగా 100శాతం సక్సెస్ చేస్తాం. ఒకటో తారీఖు నుంచి జనరల్ సెక్రటరీగా పూర్తి బాధ్యతలు తీసుకుంటున్నాను’’ అన్నారు. ‘‘టీఎఫ్సీసీ నిర్ణయమే మా అందరి నిర్ణయం. చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నాయి. అన్ని ఫైల్స్నీ పెద్దల చేతుల్లో పెట్టాం. ఈ పెద్దలంతా మా ఇద్దరికీ చుట్టాలు కాదు. మొత్తం చూసి ఇందులో ఎటువంటి తప్పు జరగలేదని చెప్పారు. ఇకముందు మహేశ్బాబు, ప్రభాస్ ప్రోగ్రామ్లను కలసి కట్టుగా చేస్తాం. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ని ఉన్నత స్థితిలో నిలబెట్టడమే మా లక్ష్యం’’ అని ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా అన్నారు. ఈ కార్యక్రమంలో పి.కిరణ్, డా. కె.ఎల్. నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గెలుపు హింస
ఒకసారి బుద్ధునితో ఒక వ్యక్తి వాదానికి దిగాడు. వాదం చివరి దశకు వచ్చింది. అవతలి వ్యక్తి ఓటమి అంచుల దాకా వచ్చాడు. అలాంటి సమయంలో.. ‘‘నేనీ వాదన నుంచి విరమించుకుంటున్నాను’’అని ప్రకటించి వెళ్లిపోయాడు బుద్ధుడు. బుద్ధుని పక్కనే ఉన్న భిక్షువులే కాదు, ప్రత్యర్థి కూడా ఆశ్చర్యపోయాడు. గెలుస్తానని తెలిసి కూడా బుద్ధుడు అలా ఎందుకు విరమించుకున్నాడో వారెవరికీ అర్థం కాలేదు. అప్పుడు ఆ వ్యక్తి బుద్ధుని దగ్గరకు వెళ్లి ‘‘గౌతమా! నేను ఓడిపోతానని తెలిసి కూడా నీవెందుకు మధ్యలోనే లేచి వచ్చావు?’’అని అడిగాడు. మిగిలిన భిక్షువులు కూడా అలాగే అడిగారు.. ‘‘భగవాన్ గెలుపును ఎందుకు తోసిపుచ్చారు?’’అని. అప్పుడు బుద్ధుడు ఇలా చెప్పాడు. ‘‘నేను ఇలా విరమించుకోవడానికి మూడు కారణాలున్నాయి. ఒకటి: ఇప్పటికి ప్రత్యర్థికి నన్ను ఓడించే జ్ఞానశక్తి లేకపోవచ్చు. రెండు: నేను ఇప్పుడు వాదించిన విషయం కూడా రేపు కార్యాచరణలో మరిన్ని మార్పులు తీసుకోవచ్చు. దేన్నీ ‘ఇదే అంతిమ లక్ష్యం’ అని తేల్చలేం. ఇప్పుడు నేను గెలుపును అందుకున్నానంటే అది అంతిమ సత్యమై ఉండాలి. అంతిమ సత్యం కాని దాన్ని పట్టుకుని ఎలా గెలుపును సొంతం చేసుకోగలం? ఇక మూడు: ఒక అంతిమ సత్యం కాని దానితో నేను గెలిచాను అంటే.. అవతలి వ్యక్తిని నేను సత్యం కాని దానితో ఓడించినట్టే. అలా ఓడిన వ్యక్తి మనసు గాయమవుతుంది. ఓటమి వల్ల సిగ్గు చెందుతాడు. దుఃఖపడతాడు. ఒక వ్యక్తిని గెలుపు పేరుతో ఇలా ఓడించడం కూడా హింసే అవుతుంది’’ అని చెప్పాడు. బుద్ధుని విశాల దృక్పథానికి భిక్షువులతోపాటు ప్రత్యర్థి కూడా ప్రణమిల్లాడు. – బొర్రా గోవర్ధన్ -
సూర్యాపేట కలెక్టరేట్పై ముగిసిన వాదనలు
సాక్షి, హైదరాబాద్: కొందరు ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే సూర్యాపేట జిల్లాలో కలెక్టరేట్ నిర్మాణానికి ప్రభుత్వం భూ సేకరణ చేస్తోందంటూ హైకోర్టులో దాఖలైన పిల్పై మంగళవారం వాదనలు ముగిశాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ల ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. సూర్యాపేటలో ప్రభుత్వ భూమి ఉన్నా..పట్టణానికి దూరంగా కుడకుడ, బీబీగూడెం గ్రామాల పరిధిలోని ప్రైవేటు భూముల్లో కలెక్టరేట్ నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీహెచ్.రాజేశ్వరరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై మంత్రి జగదీశ్రెడ్డికి చెందిన వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే ప్రైవేట్ భూముల్లో కలెక్టరేట్ను నిర్మిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇరువురి వ్యాజ్యాలపై వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. -
అదే తీరు.. 9తోనే సరి
సాక్షి, చిత్తూరుఎడ్యుకేషన్ : ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రతి మూడు నెలలకొకసారి జరిగే జెడ్పీ సర్వ సభ్య సమావేశం నిర్వహణలో తీరు మారలేదు. ఎప్పటి లాగే ప్రధాన అంశాలు చర్చకు రాలేదు. శనివారం స్థానిక అంబేడ్కర్ భవనంలో జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి అధ్యక్షతన జరిగిన జిల్లా పరి షత్ సర్వసభ్య సమావేశంలో చిన్న చిన్న సమస్యలపైనే చర్చించి, మమ అనిపించారు. సమావేశానికి పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి హాజరయ్యారు. ఎంపీ, టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూ డా సమావేశానికి కాకపోవడం గమనార్హం. ఇక జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు మాత్రం సమావేశానికి యథావిధిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో జేసీ గిరీషా, జెడ్పీ సీఈఓ రవికుమార్నాయుడు, ఏఓలు ప్రభాకర్రెడ్డి, వెంకటరత్నం, అధికారులు పాండురంగస్వామి, విజయకుమార్, రవిప్రకాష్రెడ్డి, కుర్మానాథ్, ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు, దొరబాబు, జిల్లా గ్రంథా లయ చైర్మన్ కన్నయ్యనాయుడు పాల్గొన్నారు. టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలి బైఠాయింపు జెడ్పీ పాలకవర్గం తమకు అనుకూలంగా ఉన్న వారికే నిధులు కేటాయిస్తోందని నాగలాపురం టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు సుజాత సమావేశంలో స్టేజీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాను బీసీ మహిళనని తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ రోడ్లు, తదితర పనులను తమ మండలానికి కేటాయించడం లేదని తెలిపారు. తొమ్మిదింటితో సరిపెట్టేశారు జెడ్పీ సమావేశం ఉదయం 11.10 గం టలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో టీడీపీ జెడ్పీటీసీ సభ్యుల కాంట్రాక్టులకు సంబంధించిన జీఎస్టీపై 45 నిమిషాలు గడిపేశారు. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు దేశాయ్ తిప్పారెడ్డి, సునీల్కుమార్, పుంగనూరు జెడ్పీటీసీ సభ్యుడు, వైఎస్సార్ సీపీ ఫ్లోర్లీడర్ వెంకటరెడ్డి యాదవ్ గళం విప్పారు. అజెండాలో 42 అంశాలు ఉండగా కేవలం 9 అం శాలపై మాత్రమే చర్చలు జరిపి తూతూ మం త్రంగా సభను ముగించేశారు. సాక్షరభారత్ రద్దుపై వాడివేడి చర్చ రాష్ట్ర ప్రభుత్వం సాక్షరభారత్పై కుట్రపన్ని ఆ కార్యక్రమాన్ని రద్దు చేసిందని పుంగనూరు జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డియాదవ్ ఆరోపించారు. దీనిపై మంత్రి అమరనాథరెడ్డి జోక్యం చేసుకుని ఆ నిర్ణయం తమది కాదని కేంద్రప్రభుత్వం రద్దు చేసిందని సమాధానమిచ్చారు. ఏ ఇతర రాష్ట్రాల్లో లేని రద్దు రాష్ట్రంలో మాత్రమే ఎందుకు విధించారని సభ్యులు ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా ఇక్కడ మాట్లాడితే ఏం లాభముంటుందని మంత్రి అన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ ‘నువ్వు వైఎస్సార్ సీపీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి.. పార్టీ మారావు. నీవు మాకు నీతులు చెప్పడం ఏమిటి?.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ, టీడీపీ జెడ్పీటీసీ సభ్యుల మధ్యవాదోపవాదాలు జరిగాయి. విద్యాశాఖపై సుదీర్ఘచర్చ అజెండాలో రెండో అంశమైన విద్యాశాఖపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్నభోజన నిధులు విడుదల కావడం లేదని, విద్యాసంవత్సరం ప్రారంభమైనా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందించలేకపోయారన్నారు. ప్రభుత్వ సొమ్మును ఖర్చుపెట్టి ఇషా విద్యను నడపడం సబబు కాదన్నారు. రామసముద్రం జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జెడ్పీ పాఠశాల స్థలాలను ఎందుకు కాపాడుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సునీల్కుమార్ మా ట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకనే దాన్ని టీడీపీ నాయకుల ఘనతగా పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలనడం సరైన పద్ధతి కాదన్నారు. రైతులకు జిప్సం అందడంలేదు ఐరాల, పూతలపట్టు ప్రాంతాల్లో చాలా మంది రైతులకు జిప్సం అందడం లేదు. జిల్లా పరిషత్ సమావేశంలో ప్రజాసమస్యలపై మాట్లాడుతుంటే టీడీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడం బాధాకరం. ప్రజా సమస్యలపై వారు చర్చించరు... మేము చర్చిస్తే విరుద్ధంగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నాయే గాని బోధించేందుకు టీచర్లు లేకపోవడం దారుణం. – సునీల్కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు జరపడం లేదు మోడల్ స్కూళ్లల్లో పేద విద్యార్థులు చేరడానికి వెళుతుంటే అడ్మిషన్లు లేవని ప్రిన్సిపాళ్లు తిప్పి పంపుతున్నారు. 20 శాతం అధికంగా విద్యార్థులను చేర్చుకోవచ్చనన్న నిబంధన ఉన్నప్పటికీ అడ్మిషన్లు చేయడం లేదు. ఈ విషయంపై డీఈఓ మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత ఉండడంతో పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. – దేశాయ్ తిప్పారెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే ఫలితం దక్కడం లేదు ప్రతిసారీ సర్వసభ్య సమావేశానికి, స్థాయి సంఘ సమావేశాలకు హాజరవుతూనే ఉన్నాం. జెడ్పీకి ఎన్ని నిధులు వచ్చా యి... ఏఏ పనులకు ఖర్చు పె ట్టారు... అన్న వివరాలను చెప్పడం లేదు. పాఠశాలలో అదనపు తరగతులు అవసరమున్న చోట కట్టకుండా ప్రభుత్వ నిధులను వృథా చేస్తున్నారు. సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చిస్తున్నా ఫలితం దక్కడం లేదు. – వెంకటరెడ్డి యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు, పుంగనూరు -
అసెంబ్లీలో తూత్తుకుడి అలజడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: తూత్తుకుడి కాల్పుల ఘటన తమిళనాడు అసెంబ్లీని కుదిపేసింది. మంగళవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యులు తూత్తుకుడి ఘటనపై తీవ్ర వాగ్వాదానికి దిగారు. స్టెరిలైట్ కర్మాగారాన్ని మూసివేయాలంటూ కేబినెట్ తీర్మానం చేసేదాకా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్ష డీఎంకే ప్రకటించింది. దీంతో ప్రభుత్వం కాస్తంత దిగివచ్చింది. తూత్తుకుడి ఘటనకు నిరసనగా మంగళవారం డీఎంకే సభ్యులు నలుపు రంగు దుస్తులు ధరించి సభకు హాజరయ్యారు. సభ ప్రారంభం కాగానే తూత్తుకుడిలో పోలీసు కాల్పుల అనంతరం తీసుకున్న నష్ట నివారణ చర్యలు, స్టెరిలైట్ కంపెనీని శాశ్వతంగా మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై అధికార అన్నాడీఎంకే సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అయితే, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మాత్రం వాటిని కంటితుడుపు చర్యలుగా పేర్కొంది. కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం పళనిస్వామి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. వెంటనే కేబినెట్ను సమావేశపరిచి స్టెరిలైట్ కర్మాగారాన్ని మూసివేస్తూ తీర్మానం చేయాలని పేర్కొంది. ఆ తీర్మానం చేసేదాకా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోమంటూ డీఎంకే నేత స్టాలిన్ సహా ఆ పార్టీ సభ్యులంతా వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం..ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు వేదాంత గ్రూప్ స్టెరిలైట్ ప్లాంట్ విస్తరణ రెండోదశకు ఇచ్చిన 342.22 ఎకరాల భూ కేటాయింపును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు 13 మంది మరణానికి కారణమైన పోలీసు కాల్పులపై సీబీ–సీఐడీ విచారణకు ఆదేశించింది. తూత్తుకుడిలోని వేదాంత గ్రూప్నకు చెందిన స్టెరిలైట్ కర్మాగారం కాలుష్యాన్ని వెదజల్లుతోందంటూ ప్రజలు ఆందోళన చేయడం తెల్సిందే. -
వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాదోపవాదాలతో...
కుప్పం : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాదోపవాదాలతో రసాభాసగా మారింది. కోరం లేకుండానే సమావేశాన్ని నిర్వహించడం చట్టవిరుద్ధమని వైఎస్సార్సీపీ సభ్యులు ఎంపీపీ సాంబశివాన్ని ప్రశ్నించడంతో టీడీపీ ప్రజాప్రతినిధులు వాదనకు దిగారు. ఓ స్థాయిలో మల్లానూరు సర్పంచ్ రామచంద్ర వైఎస్సార్సీపీ సర్పంచ్ మురళిపై తీవ్ర స్థాయిలో దుర్భాషలాడారు. వైఎస్సార్సీపీ సభ్యులను టీడీపీ సభ్యులు చుట్టుముట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు లోపలికి వచ్చి ఇరు వర్గాలను శాంతింపజేశారు. కోరం ఉన్నది లేనిది తేల్చిన తరువాతే సమావేశం నడపాలని మురళి వాదనకు దిగడంతో ఎంపీపీ సమావేశానికి వచ్చిన సభ్యుల వివరాలను చదివి వినిపించారు. ఓ దశలో ఎంపీపీ ప్రతిపక్ష సభ్యులపై మండిపడ్డారు. మీకు సమాధానం చెప్పనవసరం లేదు.. నిశ్శబ్దంగా కూర్చొని ఉండండి.. లేకుంటే వెళ్లిపోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు వాదనకు దిగటంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సీఐ రాఘవన్ సైతం మురళిని సర్పంచ్ హోదాలో ప్రశ్నించే హక్కు ఉంటే జీఓ కాపీని చూపించి మాట్లాడాలని అనడంతో సభ్యులు మండిపడ్డారు. హౌసింగ్ శాఖలో జరుగుతున్న అన్యాయాలను వైఎస్సార్సీపీ సభ్యులు వివరించారు. నాలుగేళ్లుగా అర్జీలిస్తున్నా ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా పూర్తి స్థాయిలో నిర్మించిన పాపాన పోలేదని ప్రశ్నించారు. దీనిపై ఎంపీపీ సమాధానం ఇవ్వకపోవడంతో వైఎస్సార్సీపీ సభ్యులు బాయ్కాట్ చేశారు. అనంతరం నామమాత్రంగా మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. -
టీడీపీ-బీజేపీ సభ్యుల మధ్య వాగ్వివాదం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఏపీ పెట్టుబడుల విషయంపై టీడీపీ-బీజేపీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతపురంలో కియో మోటార్స్ రాష్ట్ర ప్రభుత్వం చొరవ వల్లే వచ్చిందని, అయితే కర్నాటక ఎన్నికల ప్రచారంలో మాత్రం కియో బీజేపీ వల్ల వచ్చిందని చెప్పుకుంటోందని మంత్రి పల్లె రఘనాథరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే మంత్రి ప్రసంగానికి అడ్డుతగిలిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రధాని నరేంద్రమోదీ కారణంగానే కియో వచ్చిందని అనడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం మొదలైంది. దీంతో కొద్దిసేపు సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేస్తారా..?లేదా..? ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేస్తారా..?లేదా..? అని ఎమ్మెల్సీ కరణం బలరాం ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రకాశం జిల్లాలో పేపర్ మిల్లుల ఏర్పాటుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఏపీ పటంలో ప్రకాశం జిల్లాను పక్కన పెట్టారని, పరిశ్రమలు పెడతామని వచ్చేవారిని వెనక్కు పంపుతున్నారని కరణం బలరాం విమర్శించారు. ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నారు.. ప్రైవేట్ పాఠశాలల్లో ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నారని, ఫీజుల వసూలుపై ప్రభుత్వానికి నియంత్రణ లేదని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు విమర్శించారు. శాసనమండలిలో ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు - సంక్షేమ చర్యలు అంశంపై జరిగిన చర్చలో వారు మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఏం జరుగుతుందోనన్న సమాచారం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు భద్రత లేదని, కార్మిక చట్టాలు పని చేయడం లేదని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులందరికి గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. జీ.ఓ నెం వన్ అమలు కావడం లేదన్నారు. -
వాదనలు ముగిసిన 60 రోజుల్లో తీర్పు ఇచ్చి తీరాలి
సాక్షి, హైదరాబాద్: సివిల్ కేసుల సత్వర పరిష్కారం దిశగా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసుల పరిష్కారానికి సంబంధించి ఉభయ రాష్ట్రాల్లోని కిందికోర్టులకు, అక్కడి న్యాయవాదులకు దిశానిర్దేశం చేసింది. ముఖ్యంగా సివిల్ కేసుల పరిష్కారం విషయం లో కిందికోర్టులు అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కేసులో వాదనలు పూర్తయిన నాటి నుంచి గరిష్టంగా 60 రోజుల్లోపు తీర్పు చెప్పాలని నిబంధనలు స్పష్టం చేస్తుంటే.. కింది కోర్టులు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయని ఆక్షేపించింది. హైకోర్టు ఇచ్చిన సర్క్యులర్లూ అమలుకు నోచుకోవట్లేదంది. అనవసరమైన జాప్యానికి తావిస్తూ.. ఓ పద్ధతంటూ లేకుండా విచారిస్తూ ఏళ్ల తరబడి కేసులు అపరిష్కృతంగా ఉండేందుకు కారణమవుతుండటంపై తీవ్ర అసహనం వెలిబుచ్చింది. తీర్పు వాయిదా వేశాక కిందికోర్టులు కారణాల్ని వెల్లడించకుండానే కేసులను సుమోటోగా తిరిగి తెరుస్తుండటంపై విస్మయం వ్యక్తపరిచింది. ఈ తీరువల్ల జడ్జీల విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తమయ్యే పరిస్థితి వస్తోందని, ఇకపై పద్ధతి మార్చుకోవాలని, కేసుల విచారణకు, పరిష్కారానికి ఓ నిర్దిష్ట విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. ఉభయపక్షాల న్యాయవాదుల వాదనలు పూర్తయి.. కోర్టుకు ఎలాంటి సందేహాలకు తావులేకుండా స్పష్టత వచ్చేంతవరకు కేసులో తీర్పును రిజర్వ్ చేయవద్దని సూచించింది. వాదనలు ముగిసిన 60 రోజుల్లోగా తీర్పు ఇచ్చి తీరాలింది. ఒకసారి తీర్పును రిజర్వ్ చేశాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కేసును సుమోటోగా తిరిగి తెరవడానికి వీల్లే దంది. అసాధారణ పరిస్థితుల్లో తెరవాల్సి వస్తే అందుకు కారణాల్ని వెల్లడిస్తూ.. ఉభయపక్షాలకు నోటీసులివ్వాలంది. ఈ విషయాన్ని ఓ ప్రొఫార్మా రూపంలో జిల్లా ప్రధాన న్యాయాధికారికి తెలియచేయాలని, జిల్లా ప్రధాన న్యాయాధికారి ఈ విషయాల్ని ఎప్పటికప్పుడు హైకోర్టుకు తెలపాలని స్పష్టం చేసింది. ఓ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి గతవారం ఈ తీర్పిచ్చారు. ప్రాథమిక దశలోనే డాక్యుమెంట్లు సమర్పించాలి... ఈ సందర్భంగా న్యాయవాదులకూ కొన్ని సూచనలు చేశారు. న్యాయవాదులు జాప్యానికి తావులేకుండా కేసు ప్రాథమిక దశలోనే అన్ని దరఖాస్తుల్ని సమర్పించాలన్నారు. అభ్యర్థనల్ని మెరుగుపరచడం, కేసులో పార్టీల చేర్పు, తొలగింపు తదితర విషయాల్లో న్యాయవాదులు చివరిదశలో దరఖాస్తులు వేస్తున్నారని, దీనివల్ల కేసుల పరిష్కారంలో అసాధారణ జాప్యం జరుగుతోందన్నారు. కోర్టు సైతం ప్రాథమిక విచారణ పూర్తయ్యాక న్యాయవాదులతో మాట్లాడి వాదనలకు ఎంత సమయం పడుతుంది.. ఇంకా సమర్పించాల్సిన వివరాలున్నాయా.. తదితర వివరాలు తెలుసుకుని విచారించే కేసులకు సంబంధించి ఓ ప్రత్యేక జాబితాను రూపొందించాల్సి ఉండగా, ఆ పని చేయట్లేదన్నారు. సివిల్ ప్రొసీజర్ కోడ్(సీపీసీ), ఏపీ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సర్క్యులర్ ఆర్డర్స్–1980లోని నిబంధనల్ని కచ్చితంగా పాటించి తీరాలన్నారు. వీటితోపాటు వీటి ఆధారంగా హైకోర్టు జారీచేసిన, చేయబోయే సర్క్యులర్లను కిందికోర్టులు పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు హైకోర్టు పాలనాపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇదీ కేసు... తన ఇంట్లో ఉన్నవారిని ఖాళీ చేయించే విషయంలో విశాఖపట్నం మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాలుచేస్తూ భామిడిమర్రి విజయలక్ష్మి అనే మహిళ హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్(సీఆర్పీ) వేశారు. తాను దాఖలు చేసిన సవరణ పిటిషన్ను విశాఖ కోర్టు కొట్టివేయడంపై అభ్యంతరం తెలిపారు. విజయలక్ష్మి పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఇటీవల తీర్పు ఇచ్చారు. కిందికోర్టు వాదనలు విని తీర్పును రిజర్వ్ చేశాక.. తీర్పును పదేపదే వాయిదా వేసి, మళ్లీ కేసును సుమోటోగా తెరిచి వాదనలు వినడాన్ని న్యాయమూర్తి గమనించారు. ఇలా తీర్పు రిజర్వ్ చేశాక మళ్లీ సుమోటోగా కేసును తెరవడం సరికాదని, ఇది అనారోగ్యకరమైన వ్యవహారమని తేల్చారు. అయితే విజయలక్ష్మి వేసిన సవరణ పిటిషన్ను కొట్టేస్తూ విశాఖకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని న్యాయమూర్తి సమర్థించారు. ఆమె పిటిషన్ను కొట్టేశారు. -
సింగపూర్ని మించిన కంపెనీలు ఇండియాలో..
హైదరాబాద్: స్విస్ చాలెంజ్పై ప్రతి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాస్తోందని ఆదిత్యా కన్స్ట్రక్షన్స్, ఎన్వీఎన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరుపున న్యాయవాదులు ప్రకాశ్ రెడ్డి, వేదుల వెంకట రమణ వాదనలు వినిపించారు. విదేశీ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. స్విస్ ఛాలెంజ్పై ప్రస్తుతం హైకోర్టులో వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విచారణ రేపటికి వాయిదా పడింది. గురువారం ప్రభుత్వం తరుపున అటార్నీ జనరల్ వాదనలు వినిపించనున్నారు. బుధవారం నాటి వాదనల సందర్భంగా పిటిషనర్ల తరుపున పలు అంశాలను న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విదేశాల్లో అనుభవం ఉండాలనే నిబంధన సరికాదని కోర్టుకు తెలిపారు. సింగపూర్ కన్సార్టియంకు లబ్ది చేకూర్చేందుకే ఆ నిబంధన పెట్టారని చెప్పారు. సింగపూర్ కన్నా ఎక్కువ ప్రాజెక్టులను డెవలప్ చేసిన కంపెనీలు ఇండియాలో చాలా ఉన్నాయని గుర్తుచేశారు. స్విస్ చాలెంజ్ విషయంలో ప్రభుత్వం ప్రతి విషయాన్నిదాస్తోందని, సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తమకు అనుకూలమైన వారికి టెండర్ దక్కేలా బిడ్డింగ్ ప్రాసెస్ చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. -
‘కృష్ణా’పై మళ్లీ ట్రిబ్యునల్కు
రేపు, ఎల్లుండి వాదనలు వినిపించనున్న రాష్ట్రం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్ నీటి కేటాయింపుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలంగాణ ప్రభుత్వం మరోమారు బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించనుంది. శని, ఆదివారాల్లో (9, 10 తేదీలు) రాష్ట్రం వాదనలు వినిపించనుండగా 14, 15 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ వాదనలు వినిపించే అవకాశం ఉంది. కృష్ణా పరీవాహకాన్ని వాడుకుంటున్న నాలుగు రాష్ట్రాలకు తిరిగి పునఃకేటాయింపులు జరపాలని, గతంలో జరిగిన అన్యాయాన్ని సవరించాలని ట్రిబ్యునల్కు రాష్ట్రం కోరనుంది. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలు తమకు ఉన్న నికర జలాల కేటాయింపుల మేరకే అయినా.. వచ్చిన ప్రవాహాన్ని వచ్చినట్లుగా ఎగువనే వాడుకోవడంతో దిగువ కు చుక్క నీరు చేరడం లేదని, దీంతో నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులన్నీ డెడ్స్టోరేజీకి చేరి మట్టిదిబ్బలుగా మారుతున్నాయన్న అంశాలను ప్రభుత్వం వివరించనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న బచావత్ అవార్డు మేరకు కృష్ణాలో కర్ణాటక, మహారాష్ర్టల్రు 1,319 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాయి. అయితే బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ మాత్రం మిగులు జలాలను కూడా పంపిణీ చేసింది. మొత్తం 285 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టు గుర్తించి వాటిలో కర్ణాటకకు 105 టీఎంసీలు, మహారాష్ట్రకు 35 టీఎంసీలను కేటాయించింది. నికర జలాలే వినియోగించుకుంటేనే ఖరీఫ్ తొలి రెండు నెలల్లో చుక్కనీరు కిందకు రాని పరిస్థితి ఉంటే, మిగులు జలాలను నిల్వ చేసుకుంటే పరిస్థితి మరింత భయానకంగా మారుతుందని ట్రిబ్యునల్ దృష్టికి రాష్ట్రం తీసుకెళ్లనుంది. నీటి లభ్యతను అంచనా వేయడానికి తీసుకున్న 65 శాతం డిపెండబులిటీ పద్ధతి, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపునకు అనుమతి వంటి కారణాలతో రాష్ట్రం 130 టీఎంసీల వరకు నీటిని కోల్పోతుందని వివరించనుంది. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం, ఆంధ్రా, రాయలసీమలు కలుపుకొని 31.5 శాతం మాత్రమే ఉన్నా కేటాయింపులు మాత్రం ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ జరిపారని, వాటిని సవరించాలని కోరనుంది. -
దాల్మియా పిటిషన్లపై ముగిసిన వాదనలు
తీర్పు వాయిదా సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ కోర్టులో విచారణ జరుగుతుండగానే ఈడీ అధికారులు జారీ చేసిన సమన్లను కొట్టేయాలని కోరుతూ దాల్మియా సిమెంట్ కంపెనీ ప్రతినిధులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు పునిత్ దాల్మియా తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ... మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ ఈసీఐఆర్ దాఖలు చేసిందని, ఇందులో పిటిషనర్ను నిందితుడిగానే పేర్కొందని తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణ సమయంలో మౌనంగా ఉండే హక్కు పిటిషనర్కు చట్టబద్ధంగా లభించిందని వివరించారు. ఈడీకి కేవలం విచారణ చేపట్టే అధికారమే ఉంది తప్ప, సీబీఐలాగా సమన్లు జారీ చేసే అధికారం లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
వలపుల మార్కెట్
చీకటి పడే వరకు బయట ఉండరు. పార్టీలకు వెళ్లరు. తాగరు. నచ్చినవాడిని చేసుకునే సాహసం చెయ్యరు. ఇక డేటింగ్ ఎక్కడి మాటా! ఇదీ భారతీయ మహిళలపై ప్రపంచానికి ఉన్న అభిప్రాయం. అవునా?! ఆలోచించాలి. అసలు డేట్ అంటే ఏంటి? మరీ ఆమాత్రం తెలియకుండా అడుగుతున్నారా! డేట్ అంటే క్యాలెండర్లో ఒక నంబర్. (కాదు లెండి). డేట్ అంటే అబ్బాయి అమ్మాయికీ, అమ్మాయి అబ్బాయికీ మీటింగ్ టైమ్ ఇవ్వడం. ఇప్పుడు అర్థమయిందా? ఇక చదవండి. టిండర్, ఫ్రివిల్, ట్రూలీమ్యాడ్లీ, ఓకే క్యుపిడ్, వూ.. కొంతకాలం క్రితమే ఇండియాలోకి ప్రవేశించాయి. ఇవన్నీ ఆన్లైన్ డేటింగ్ యాప్స్. ప్రేమలకు, పెళ్లిళ్లకు ‘డేట్స్’ కుదిర్చిపెడతాయి. మరి.. అన్నిటికీ దూరంగా ఉన్నట్లే మన సంప్రదాయ మహిళలు వీటికీ దూరంగా ఉంటున్నారా? లేదు! రుజువేమిటి? ఇక్కడుంది. గత ఒక్క ఏడాదిలోనే టిండర్ యాప్ను డౌన్ లోడ్ చేసుకున్న భారతీయుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగిందట! ఇలా డౌన్లోడ్ చేసుకున్న వారిలో ఎక్కువ మంది మహిళలే కావడం విశేషం! సంప్రదాయవాదులు, శుద్ధ సంప్రదాయ స్త్రీవాదులు ఈ యాప్స్ను ఎంత దుయ్యబడుతున్నారో... అంతగా యువతులు వీటిని ఇష్టపడుతున్నారు. వీళ్లంతా 18-35 ఏళ్ల మధ్య వయసు వారు. ‘ముఖ్యంగా టిండర్ను లైక్ చేస్తున్నారు. ఒక వారం మొత్తంలో మగవాళ్ల నుంచి వచ్చే ‘సూపర్ లైక్స్’ కన్నా ఆడవాళ్లు కొట్టే లైక్లే ఎక్కువగా ఉంటున్నాయి. ఇంతకు మించి సాధికారత ఉంటుందా?’ అని తారూ కపూర్ అడుగుతున్నారు. టిండర్ ఇండియాకు ఆవిడ హెడ్డు. టిండర్ 2012లో ప్రారంభం అయింది. ప్రస్తుతం 196 దేశాల్లో విస్తరించి ఉంది. 30 భాషల్లో అందుబాటులో ఉంది. అన్నిటికన్నా ఆసక్తికరమైన సంగతి ఏంటంటే.. టిండర్ యాప్లో జరిగే స్త్రీపురుష సంభాషణల్లో మిగతా దేశాలన్నింటి కన్నా భారత్ ముందుండడం. టిండర్ యాప్లోని ‘సూపర్ లైక్’ ఫీచర్ని వారానికి దాదాపు పది లక్షల మంది ఉపయోగిస్తున్నారు. అందులో యాక్టివ్ పార్ట్ మళ్లీ మహిళలదే. స్త్రీలు ఏం కోరుకుంటున్నారు? ఇదేమీ సమాధానం లేని ప్రశ్న కాదు. జీవన శైలులు మారుతున్నాయి. పెద్దలు చూసిన సంబంధాన్ని చేసుకోవడం మన సంప్రదాయం. అయితే ఇప్పటి అమ్మాయిలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. భారీ జీతాలను సంపాదిస్తున్నారు. ఆర్థికంగా స్వతంత్రులు అవుతున్నారు. దాంతో తమ పెళ్లి ఎప్పుడు జరగాలి? ఎవరితో జరగాలి అనే స్వతంత్ర నిర్ణయం తీసుకునే వెసులుబాటు వారికి కలుగుతోంది. ఉన్నతమైన కెరియర్లో ఉన్నవారు సహజంగానే, తమకు దీటైన కెరియర్లో ఉన్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎన్నుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. అందుకు టిండర్ లాంటి యాప్స్ వీళ్లకు సహాయం చేస్తున్నాయి. ఇలాంటి యాప్స్ కొందరు అమ్మాయిలకు స్ట్రెస్ బస్టర్గా కూడా పనిచేస్తున్నాయి! మగాళ్లను సరదగా ఒక ఆట ఆడించడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడుతున్నాయట! విమర్శలు.. వివాదాలు ఫ్రెండ్స్, డేట్స్, రిలేషన్షిప్స్.. వీటి కోసమే నేనున్నది అని టిండర్ చెప్పుకుంటోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా టిండర్ 900 కోట్ల పెళ్లిళ్లు చేసిందట! ఇండియాలో రోజూ ఇన్నిన్ని డౌన్లోడ్ జరుగుతున్నాయంటే.. మన ఆడపిల్లలు సంస్కృతి, సంప్రదాయం, ఆచారాలు... వీటన్నిటినీ దాటుకుని వచ్చేస్తున్నారనే కదా అన్నది తారూ పాయింట్. అయితే ఈ ధోరణి వల్ల అంతా హ్యాపీనే అని చెప్పడానికి వీల్లేకుండా ఉంది. భార్యాభర్తల మధ్య కూడా అడపాదడపా టిండర్ చిచ్చుపెడుతోంది. భార్యకు తెలీకుండా ఓ భర్త.. కొత్త రిలేషన్ కోసం టిండర్లోకి అడుగుపెట్టడం... డేటింగ్ కోసం టిండర్లోకి తొంగి చూసిన భార్యకు అక్కడ తన భర్త కనిపించడం వంటి ట్విస్టులు కూడా ఇందులో ఉన్నాయి. ఫ్రివిల్ అనే డేటింగ్ యాప్కైతే.. సంప్రదాయ స్త్రీవాదుల నుంచి బెదిరింపులు కూడా వస్తున్నాయట. ఫ్రివిల్ వెనుక ఉన్నది షాదీ వెబ్సైట్. ఒకావిడ అయితే మీరు సాధికారతను ప్రమోట్ చెయ్యడం లేదు. వట్టి డొల్లతనం తప్ప ఇంకేం లేదు అని ఫ్రివిల్ మీద విరుచుకు పడింది. చూపులకు ఆకర్షణీయంగా ఉండేవారే డేటింగ్లో పడిపోతారు కాబట్టి ‘డేట్’కి అందమే ప్రామాణికమని మీరు ప్రచారం చేస్తున్నారా అని ఆవిడ వాదన. ఈ వాదనలు, ఆగ్రహాలు ఎలా ఉన్నా... సంప్రదాయ బద్ధులైన భారతీయ స్త్రీమూర్తులు మెల్లిమెల్లిగా రెక్కలు విప్పుకుంటున్నారని రోజురోజుకూ డేటింగ్ ఆప్స్కు పెరుగుతున్న ఆదరణను బట్టి తెలుస్తోందని తారా అంటున్నారు. -
హైకోర్టు విభజనపై ఇరు రాష్ట్రాల వాదనలు
హైదరాబాద్: హైకోర్టు విభజనపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులో తమతమ వాదనలు వినిపించాయి. హైకోర్టు విభజన తప్పనిసరి అని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. ఏపీ హైకోర్టు కోసం ప్రత్యేక భవనం కేటాయించేందుకు తాము సిద్దమేనని తెలిపింది. హైకోర్టు విభజనకు తాము వ్యతిరేకం కాదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ప్రత్యేక ప్యాకేజీ, భూ సమీకరణ, ఆర్థిక వనరుల సమీకరణకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని కోర్టుకు వివరించింది. భూసేకరణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం హైకోర్టు తెలిపింది. విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. -
జగన్ పిటిషన్పై ముగిసిన విచారణ: తీర్పు 15కు వాయిదా
హైదరాబాద్: దేశవ్యాప్త పర్యటనకు అనుమతించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ ప్రత్యేక కోర్టులో ఈరోజు వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే లక్ష్యంతో ఈనెల 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. సమైక్యాంద్రకు మద్దతు కూడగట్టేందుకు తాను పశ్చిమబెంగాల్తో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉందని, అందువల్ల బెయిల్ షరతులను ఆ మేరకు సడలించాలని కోరుతూ ఈ నెల 6న జగన్ పిటిషన్ దాఖలు చేశారు. తన బెయిల్ షరతులను గత నెల 30న సీబీఐ ప్రత్యేక కోర్టు సడలించిన విషయాన్ని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగాను, ఢిల్లీ వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా జాతీయ పార్టీల నేతలను, పార్లమెంట్ సభ్యులను కలిసి మద్దతు కూడగట్టాల్సి ఉందని వివరించారు. పార్లమెంట్ సభ్యునిగా నియోజకవర్గంతో పాటు పార్టీ అధ్యక్షునిగా ప్రజలకు సేవలు అందించే హక్కును కాలరాయకూడదని పేర్కొన్నారు. తనపై సీబీఐ మోపినవన్నీ ఆరోపణలేనని, నేరం రుజువు కాలేదని తెలిపారు. కోర్టు విధించిన షరతులను పాటిస్తానని, రాజకీయ కారణాల రీత్యా ఇతర రాష్ట్రాల్లో పర్యటించేందుకు వీలుగా బెయిల్ షరతులు సడలించాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్పై విచారణను సీబీఐ కోర్టు ఈ రోజుకు వాయిదా వేసింది. ఈరోజు వాదనలు ముగిసిన తరువాత తీర్పు కోర్టు 15వ తేదీకి వాయిదా వేసింది. -
వాదనలొవద్దు... వేదనపడొద్దు
భార్యాభర్తలు దేని గురించి ఎక్కువగా వాదించుకుంటారో మీకు తెలుసా? సంసారం అంటే సీరియస్ వ్యవహారం కాబట్టి ఆషామాషీ విషయాలపై ఆలుమగలు ఆర్గ్యుమెంట్కు దిగరన్నది మీ సమాధానమైతే పొరబడినట్టే. ప్రాధాన్యం లేని చిన్నచిన్న విషయాలకే దంపతులు వాదించుకుని తగవులకు దిగుతున్నారంటే నమ్మాల్సిందే. దాంపత్యంలో గిల్లికజ్జాలు సహజమైనప్పటికీ అనవసరపు వాదనలతో ఆలుమగలు తమ కాపురాలను నిత్యనరకంగా మార్చకుంటున్నారు. సంసారం సాగరం అనేవారు కొందరయితే, సంసారం స్వర్గసీమ అనేవారు మరి కొందరు. వివాహ జీవితంలో తమకెదురైన అనుభవాల ఆధారంగా ఈ రెండు రకాల భావాలను వ్యక్తపరుస్తుంటారు. తొలినాళ్లలో దాంపత్య జీవితం మధురంగా ఉంటుందని, రాన్రాను మొద్దుబారిపోతుందని సీనియర్ సంసారులు సెలవిస్తుంటారు. ఈ మాటెలావున్నా భార్యాభర్తల మధ్య గొడవలకు వాదనతో ప్రారంభమవుతాయని అధ్యయనకర్తలు అంటున్నారు. అదికూడా అర్థంలేని విషయాలకే ఆలుమగలు అరుచుకుంటున్నారని పేర్కొన్నారు. టీవీలో ఏ కార్యక్రమం చూడాలి, ఫ్రిజ్లో వస్తువులు ఎక్కడ పెట్టాలి, పిల్లలను ఎలా రెడీ చేయాలి, బాత్రూమ్ను ఎవరు శుభ్రం చేయాలి, పెంపుడు కుక్కకు ఏ పేరు పెట్టాలి, తిన్నతర్వాత గిన్నెలు ఎవరు తోమాలి తదితర విషయాల్లో భార్యాభర్తలు ఎక్కువగా వాదనలు వేసుకుంటారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు 'అత్తగారు' మన్నింట్లో ఎన్ని రోజులుంటారనే విషయంలోనూ అధికంగానే వాదులాడుకుంటున్నారు(ట). పండుగలు ఎవరి తరపువారింట్లో జరుపుకోవాలి, ముస్తాబుకు ఎవరెక్కువ సమయం తీసుకుంటున్నారనే దాని గురించి కూడా ఫ్యామిలీస్లో పోరాటాలు మొదలతున్నాయి. ఆఖరికి పడకగదిలో ఉష్ణోగ్రత ఎంత ఉండాలనే విషయంలోనూ వాదనలు జరుగుతున్నాయి. తిండి, వంటలు విషయంలో ఒకరికొకరు వంకలు పెట్టుకోవడం ఆలుమగల మధ్య సహజంగా జరిగిపోతుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దదవుతుంది. మంచిచెడు అనేవి ప్రతి విషయంలోనూ ఉంటాయి. అర్థంలేని వాదనతో వివాహ బంధాన్ని విచ్చిన్నం చేసుకుకోవం అవివేకం. ప్రతి చిన్న విషయానికి వాదనకు దిగకుండా సహనంతో సర్దుకుపోతే సంసారం స్వర్గసీమ అవుతుందనడంతో సందేహమేముంది! -
నిర్భయ కేసులో వాదనలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసుకు సంబంధించి ఢిల్లీలోని సాకేత్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో డిసెంబర్16న నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో మొత్తం ఆరుగురు నిందితులు నేరానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. వారిలో బస్సుడ్రైవర్ రామ్ సింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరిని జువెనైల్ జస్టిస్ బోర్డు బాలనేరస్థుడుగా నిర్ధారించింది. ఆ బాల నేరస్థుడిని మూడేళ్ల పాటు స్పెషల్ హోంలో ఉంచాలని జువెనైల్ జస్టిస్ బోర్డు ఆదేశించింది. మిగిలిన నలుగురు నిందితులు ముకేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్. అత్యాచారం, హత్య, అపహరణ, దోపిడీ, సాక్షాధారాలను నాశనం చేయడం, అసహజ నేరాలు వంటి 13 అభియోగాల్లో ఈ నలుగురిని దోషులుగా నిర్థారించారు. వాదనలు విన్న ఆడిషినల్ సెషన్ జడ్జి యోగేశ్ ఖన్నా నిందితులకు శిక్షల ఖరారు ఈ నెల 13వ తేదీ శుక్రవారానికి వాయిదావేశారు. ఇరువర్గాల వాదనలు ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి. నిందితుల తరపు న్యాయవాదుల వాదనలు: నిందితుల విషయంలో కోర్టు జాలి చూపాలి. మరణదండన నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఉరిశిక్ష విధించడం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం. మానవజాతి మనుగడ సాగించాలంటే మానవత్వం ఎంతో అవసరం. పుట్టుకతోనే ఎవ్వరూ నేరస్తులు కాదని గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. మీడియా సమాజాన్ని ప్రభావితం చేసింది. నేరం జరిగిన సమయానికి నిందితుడు పవన్ గుప్తా వయస్సు 19 ఏళ్ల లోపేనని, అందువల్ల చట్టాలను పునస్సమీక్షించాలి. ప్రాసిక్యూషన్ వాదనలు : దోషులకు ఉరిశిక్ష విధించాలి. సమాజం మొత్తం నిందితులకు మరణశిక్ష విధించాలని కోరుకుంటోంది. అమాయకురాలైన అమ్మాయిని క్రూరంగా హత్య చేశారు. దోషులపై జాలి చూపాల్సిన అవసరం లేదు. దోషులందరికీ ఉరిశిక్ష విధించాలి. నిర్భయ మరణవాంగ్మూలం: తనపై క్రూరమైన దాడి జరిగిన ఐదురోజులకు ఓ మేజిస్ట్రేట్ ఎదుట హిందీలో నిర్భయ వాంగ్మూలం ఇచ్చింది. కదులుతున్న బస్సులో గంటసేపు తనను కిరాతకంగా ఎలా హింసించారో ఆమె వివరించింది. రెండుసార్లు తాను స్పృహ కోల్పోయినప్పటికీ తనను తిరిగి స్పృహలోకి తెచ్చి చెప్పలేని రీతిలో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపింది. నిందితులకు ఎటువంటి శిక్ష విధించాలి అని మేజిస్ట్రేట్ ప్రశ్నించగా, ‘‘మరో మహిళపై ఇటువంటి అఘాయిత్యం చోటుచేసుకోకుండా ఉండాలంటే వారిని ఉరి తీయాలి. వారిని సజీవంగా దహనం చేయాలి’’ అని చెప్పింది.