Asthma
-
నన్ను అందరూ ఉన్న సెల్లోకి మార్చండి
విజయవాడ లీగల్ : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మూడ్రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు వంశీని గురువారం రెండవ అదనవు జిల్లా మరియు సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వద్ద ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జైలు బ్యారక్లో తనను ఒంటరిగా ఉంచారని, ఆస్తమా సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపారు. భద్రతాపరంగా తనకు ఇబ్బంది లేనప్పటికీ అందరూ ఉన్న సెల్లోకి తనను మార్చాలని కోరారు. తాను ఇన్ఛార్జి న్యాయమూర్తిగా ఉన్నందున వేరేవారిని సెల్లో ఉంచేందుకు ఉత్తర్వులు ఇవ్వలేనని న్యాయమూర్తి తెలిపారు. సెల్ మార్చాలనే అంశంపై రెగ్యులర్ కోర్టులో మెమో దాఖలు చేసుకోవాలని సూచించారు. ఇక తనను కేసుతో సంబంధంలేని ప్రశ్నలు అడిగారని.. సత్యవర్థన్కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తే అసలు నిజాలు బయటకొస్తాయని న్యాయమూర్తికి వంశీ చెప్పారు. కాగా.. వంశీ ఆరోగ్యం దృష్ట్యా ఒక వార్డెన్ను ఏర్పాటుచేయడానికి తమకు అభ్యంతరంలేదని.. ఆయన భద్రత దృష్ట్యా మాత్రమే ఆయన్ను సెల్లో ఒంటరిగా ఉంచినట్లు ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు: వంశీ సతీమణిఈ కేసుకు సంబంధించి వంశీని ఎందుకు అరెస్టుచేశారో ఇంతవరకు తమకు తెలీదని.. ఇప్పటివరకు తమకు ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదని, ఏ విషయంలో అరెస్టుచేశారో కూడా తెలీడంలేదని వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ మీడియాకు తెలిపారు. మూడ్రోజుల కస్టడీలో పోలీసులు తన భర్తను అర్థంపర్థంలేని ప్రశ్నలతో విసిగించారని ఆమె తెలిపారు. వంశీని ప్రభుత్వం టార్గెట్ చేసింది.. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు మాటా్లడుతూ.. ప్రభుత్వం కావాలనే వంశీని టార్గెట్ చేసిందని, అందులో భాగంగానే అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలందరికీ ఈ విషయం అర్థమైందన్నారు. న్యాయవాది తానికొండ చిరంజీవి మాట్లాడుతూ.. కేసుకు సంబంధించిన సమాచారం లేకుండా కేవలం సెక్షన్లు మాత్రమే పెట్టారని.. ఏ విషయంలో పెట్టారో తమకు సమాచారం ఇవ్వకపోవడం కూడా అక్రమ నిర్బంధం కిందకు వస్తుందన్నారు. వంశీ కస్టడీకి మళ్లీ పిటిషన్ వేస్తాం : ఏసీపీ వంశీ, అతని అనుచరులు సత్యవర్థన్ను బెదిరించి, భయపెట్టి కేసును తారుమారు చేయాలని చూసినట్లు సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలను సేకరించామని ఏసీపీ దామోదర్ మీడియాకు వివరించారు. విచారణలో కొన్ని ప్రశ్నలకు అవునని చెప్పిన వంశీ, మరికొన్నింటికి తెలీదని, గుర్తులేదని చెప్పారన్నారు. తమకు పూర్తి సమాచారం రావాల్సి ఉన్నందున కస్టడీ కోరుతూ మరోసారి పిటిషన్ వేస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. సత్యవర్థన్ కేసులో మరో ఇద్దరు నిందితులు వంశీబాబు వీర్రాజులను 10 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు గురువారం పిటిషన్ వేశారు. -
ఒత్తిడికి గురైతే ఆస్తమా అటాక్ అవుతుందా..?
తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తూ, టార్గెట్లు ఛేదించడానికి శ్రమపడుతూ ఉండే వారిలో... ఒత్తిడి తీవ్రత పెరిగినప్పుడు ఆస్తమా రావడం కొందరిలో కనిపిస్తుంది. అందుకే ఈ అంశం అటు పరిశోధనల్లో, ఇటు వైద్యవర్గాల్లో చాలావరకు ఓ చర్చనీయాంశం (డిబేటబుల్ సబ్జెక్ట్)గా ఉంది. ఏతావాతా చెప్పదగిన అంశమేమిటంటే... ఆస్తమా లేనివారిలో అధిక ఒత్తిడి కొత్తగా ఆస్తమాను కలిగించదుగానీ... అప్పటికే ఆస్తమా సమస్య ఉన్నవారిలో ఒత్తిడి అనేది ఓ ట్రిగరింగ్ ఫ్యాక్టర్గా పనిచేసి ఆస్తమాను ప్రేరేపించగలదు.మిగతా ఆరోగ్యవంతులతో పోలిస్తే... తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొనేవారిలో ఆస్తమా ఎటాక్స్ చాలా తరచుగా కనిపిస్తుంటాయి. పరిశోధకులు ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఆస్తమా లక్షణాలు కనిపించడాన్ని చాలా సందర్భాల్లో నమోదు చేశారు. ఇదే విషయాన్ని చాలామంది ఇతర అధ్యయనవేత్తలూ రూఢి చేశారు. ఉదాహరణకు పిల్లల్లోనైతే స్కూలు పరీక్షలు, ఎక్కడైనా నలుగురిలో మాట్లాడాల్సి రావడం, పెద్దల్లో కుటుంబాల్లో విభేదాలు, విపత్తుల్లో చిక్కుకు΄ోవడం, హింసకు లోనుకావడం వంటి సంఘటనల్లో ఒత్తిడి పెరిగితే అది ఆస్తమాను ట్రిగర్ చేయవచ్చు. మొదట ఒత్తిడి అనేది యాంగ్జైటీని పెంచి అటాక్ వచ్చేందుకు అనువైన పరిస్థితులను కల్పిస్తుంది. అంటే ఆస్తమా అటాక్ను ప్రేరేపించే హిస్టమైన్, ల్యూకోట్రైన్ వంటి రసాయనాలను విడుదలయ్యేలయ్యేలా చేస్తుంది. ఆ ప్రభావంతో వాయునాళాలు సన్నబారిపోతాయి. ఇక మిగతా సాధారణ వ్యక్తులతో పోలిస్తే... ఒత్తిడీ, యాంగ్జైటీ వంటి సమస్యలతో బాధపడేవారిలో ఆస్తమా ఉన్నప్పుడు వారి పరిస్థితిని నియంత్రించడం మరింత కష్టమవుతుంది.ఒత్తిడినీ, దాంతో వచ్చే ఆస్తమానూ అరికట్టడం ఎలా...? మొదట తమకు ఒత్తిడి కలిగిస్తున్న అంశాలేవో తెలుసుకోవాలి. ఉదాహరణకు ఆర్థిక సమస్యలా, కుటుంబ సభ్యులతో విభేదాలా, ఎవరూ సహాయసహకారాలు అందించకపోవడం, ఎప్పుడూ పనిలోనే ఉండాల్సి రావడం లేదా నిత్యం డెడ్లైన్స్తో సతమతమవుతుండటమా అనేది తొలుత గుర్తించాలి. సమస్యను గుర్తించాక... దాన్ని ఎదుర్కోవడమనేది తమ వల్ల అవుతుందా, ఎవరి సహాయమూ లేకుండానే సమస్యకు పరిష్కారం సాధ్యపడుతుందా లేదా ఎవరైనా వృత్తినిపుణుల సహాయం అవసరమా తెలుసుకొని, ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అన్ని పనులూ ఒకరే పూర్తి చేయలేరని గుర్తించాలి. తొలుత పనుల జాబితా రూపొందించి, ఎవరు చేయదగ్గపనుల్ని వారికి అప్పగించాలి. ఉదాహరణకు డెడ్లైన్లోపు ఒకరే ఆ పని చేయలేరనుకుంటే... దాన్ని విడదీసి తలా కాసింత బాధ్యత అప్పగించాలి. దీన్నే వర్క్ప్లేస్ స్ట్రాటజీ అంటారు. ఆఫీసు పనిచేసే సమయాల్లో ఈ వర్క్ప్లేస్ స్ట్రాటజీ అనుసరించాలి. అంతేకాదు... పని ఒత్తిడి అన్నది ఆఫీసులో ఒక్కరికే పరిమితమైనది కాదు... అది అక్కడ పనిచేసే అందరికీ వర్తించేదన్న విషయాన్ని గుర్తెరగాలి. దాంతో సగం ఒత్తిడి తగ్గుతుంది. ప్రతిరోజూ అలసట కలిగించని వ్యాయామాలు చేయాలి. వ్యాయామం మంచి స్ట్రెస్ బస్టర్. ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ విధానాల వంటివి అనుసరించాలి. యోగా, ధ్యానం వంటివీ ప్రాక్టీస్ చేయడం స్ట్రెస్ను చాలావరకు తగ్గిస్తుంది. అటాక్ వచ్చినప్పుడు వాడే మందులు, అటాక్ రాకుండా నివారించే మందులు ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి . రోజూ కంటినిండా నిద్రపోవాలి. ఒత్తిడితో కూడిన అటాక్ వచ్చినప్పుడు 5 – 10 నిమిషాల్లో మీరు నార్మల్ స్థితికి రాకపోతే తక్షణం తప్పనిసరిగా వైద్యుల సహాయం తీసుకోవాలి. చికిత్స : విండ్పైపులు (వాయునాళాలు) వాపునకు (ఇన్ఫ్లమేషన్కు) గురైనప్పుడు... ఆ వాపు వల్ల గాలి ప్రవహించే లోపలి దారి సన్నబారి΄ోవడంతో శ్వాసతీసుకోవడం కష్టమవుతుంది. దాంతో ఆయాసం, పిల్లికూతల వంటి లక్షణాలతో ఆస్తమా కనిపిస్తుంది. ఈ లక్షణాలు తగ్గాలంటే మొదట తక్షణమే వాయునాళాలను విప్పార్చే / విస్తరింపజేసే మందులను లేదా ఇన్హేలర్స్ను వాడాలి. అదే రాకముందు లేదా వచ్చి తగ్గాక డాక్టర్ సలహా మేరకు ... ఆస్తమా రాకుండా నివారించే ప్రివెంటివ్ మందులు / ఇన్హేలర్స్ వాడాలి. ఆస్తమా తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గించేందుకు అవసరాన్ని బట్టి డాక్టర్లు యాంటీ హిస్టమైన ఇంజెక్షన్స్ కూడా వాడవచ్చు.అపోహ – వాస్తవం : ఇన్హేలర్ అలవాటు అవుతుందనీ, అది మంచిది కాదనే అ΄ోహ కొంతమందికి ఉంటుంది. నిజానికి టాబ్లెట్లతో పోలిస్తే ఇన్హేలర్స్తో దేహంలోకి ప్రవేశించే మందు మోతాదు చాలా తక్కువ. దాంతో సైడ్ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ. అందుకే ఇన్హేలర్స్ సురక్షితమని గుర్తించాలి. ప్రివెంటివ్ మందు ఉండే ఇన్హేలర్స్ వాడుతుంటే అటాక్ రాకుండా అవి ఆస్తమాను అదుపులో ఉంచుతాయి.డాక్టర్ రవీంద్ర రెడ్డి, పల్మనాలజిస్ట్(చదవండి: మానసిక ఆరోగ్యంపై శృతి హాసన్ హెల్త్ టిప్స్!) -
చేప ప్రసాదంగా కొల్లేరు కొర్రమీను
కైకలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కొల్లేరు కొర్రమీను పిల్లలు (సీడ్) ఆస్తమా నివారణలో ఔషధంగా మారాయి. మృగశిరకార్తె రోజున హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బత్తిన సోదరులు అందించే చేప ప్రసాదానికి కొల్లేరు ప్రాంత కొర్రమీను పిల్లలను సరఫరా కానున్నాయి. తెలంగాణ స్టేట్ ఫిషరీస్ కో–ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ (టీఎస్ ఎఫ్సీఓఎఫ్) ఆధ్వర్యంలో చేప మందు ప్రసాదం నిమిత్తం టెండర్లను ఆహా్వనించింది. దాదాపు 5 లక్షల నుంచి 7 లక్షల వరకు కొర్రమీను పిల్ల అవసరమని గుర్తించారు. తెలంగాణ మత్స్యశాఖ అధికారులు కొర్రమీను సీడ్ అందించే సీడ్ ఫామ్లను పరిశీలించి నివేదికను అక్కడి ప్రభుత్వానికి అందించారు. తెలంగాణలో లభ్యత లేకపోవడంతో.. చేప ప్రసాదానికి తెలంగాణలో సరిపడినన్ని చేప పిల్లల లభ్యత లేకపోవడంతో ఏపీ నుంచి కొర్రమీను పిల్లలకు మే 21న టెండర్లు ఆహా్వనించింది. ఏపీ నుంచి కొల్లేరు ప్రాంతాలైన ఏలూరు జిల్లాలోని ముదినేపల్లి మండలం దేవపూడి ఫణిరామ్ ఫిష్ సీడ్ ఫామ్, ఏలూరుకు చెందిన దుర్గమల్లేశ్వర ఫిష్ హేచరీస్, కలిదిండి మండలం పోతుమర్రు, పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు నుంచి దుర్గ ఫిష్ సీడ్ ఫామ్తో పాటు తెలంగాణలోని నల్గొండ, హైదరాబాద్కు చెందిన ముగ్గురు కలిపి మొత్తం ఏడుగురు టెండర్లను దాఖలు చేశారు. తెలంగాణకు చెందిన వనపర్తి, ఖమ్మం, హన్మకొండ, సంగారెడ్డిలకు చెందిన జిల్లా మత్స్యశాఖ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతను అక్కడి ప్రభుత్వం అప్పగించింది. ఖమ్మం మత్స్యశాఖ అధికారి డి.ఆంజనేయస్వామి నేతృత్వంలో అధికారులు టెండర్లు వేసిన ఏపీలో సీడ్ ఫామ్లను పరిశీలించి ఈ నెల 25 తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించారు. పోషకాల గని కొర్రమీను కొర్రమీను పిల్ల చాలా హుషారుగా ఉంటుంది. ఇది మీటరు వరకు పెరుగుతుంది. మంచినీటి సరస్సులు, పొలాల బోదెలు, బురద నేలల్లో ఇవి పెరుగుతాయి. వీటిలో 18–20 శాతం మాంసకృత్తులు ఉంటాయి. ఆకు కూరల్లో లభించే విటమిన్ ‘ఏ’ కంటే కొర్రమీనులో ఉండే విటమిన్ ‘ఏ’ తేలిగ్గా జీర్ణమవుతుంది. వీటిలో గంధకం కలిగిన లైసిన్, మిథియానిక్, సిస్టిన్ అమినో యాసిడ్లు లభిస్తాయి.చేప మందుతో కొర్రమీనుకు గుర్తింపు ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేప ప్రసాదాన్ని హైదరాబాద్లో బత్తిన సోదరులు ఉచితంగా అందిస్తారు. కరోనా కారణంగా మూడేళ్లు ఆగిన ప్రసాదం పంపిణీ ఈ ఏడాది జూన్ 8న మృగశిరకార్తె ప్రారంభమయ్యే ఉదయం 11 నుంచి 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు పంపిణీ చేయనున్నారు. వీరు తయారు చేసిన ప్రత్యేక మందును కొర్రమీను పిల్ల సహా నోటిలో వేస్తారు. తెలంగాణకు సరఫరా చేసే కొర్రమీను పిల్ల సైజు 2 అంగుళాల నుంచి 3 అంగుళాలు ఉండాలి. నల్ల రంగులో హుషారుగా ఉండాలి. ప్రస్తుత మార్కెట్లో ఒక్కో కొర్రమీను పిల్ల రూ.30 ధర పలుకుతోంది. పిల్ల సేకరణ ఓ సవాల్ కొర్రమీను పిల్లను సేకరించడం పెద్ద సవాల్గా మారుతోంది. కొల్లేరు సరస్సు, పొలాల గుంతల్లో కొర్రమీను తల్లి చేపను గుర్తిస్తారు. తల్లి వద్ద తిరిగే వేలల్లో పిల్లలను సేకరించి సిమెంటుతో చేసిన కుండీలలో ప్రత్యేకంగా పెంచుతారు. రోజుకు మూడుపూటలా నీరు మారుస్తారు. నాలుగు పూటలా మేత వేస్తారు. తెలంగాణ వరకు వ్యాన్లలో అత్యంత జాగ్రత్తగా వీటిని రవాణా చేస్తారు. కొల్లేరు ప్రాంతాల నుంచి వెళ్లే వ్యాన్లలో పిల్లలకు మూడు ప్రాంతాల్లో నీటిని మార్పు చేస్తారు. చేప మందు ప్రసాదం నిమిత్తం జూన్ 6వ తేదీన ఉదయం హైదారాబాద్కు కొల్లేరు కొర్రమీను పిల్లల్ని తరలించనున్నారు.కొల్లేరు ప్రాంతం అనుకూలం చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరు సరస్సులో సహజసిద్ధంగా కొర్రమీను పెరుగుతుంది. నల్లజాతి చేపల్లో కొర్రమీనుకు ప్రత్యేక స్థానం ఉంది. కొల్లేరు పరీవాహక ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు వీటిని సరఫరా చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొర్రమీను సాగు సైతం చేస్తున్నారు. కొర్రమీనులో పోషకాహారాలు అధికంగా ఉంటాయి. – షేక్ చాన్బాషా, ఫిషరీస్ ఏడీ, కైకలూరు -
ఇవి తింటే.. ఆస్తమా అటాక్ అవ్వదు!
ఆస్తమా నివారణ ఇలా... ఆస్తమా ఊపిరాడనివ్వకుండా చేస్త... ఎంతగా ఇబ్బంది పెడుతుందో తెలిసిన విషయమే. పైగా వర్షాలతో ఇప్పుడున్న వాతావరణం ఆస్తమాకు మరింత దోహదం చేస్తుంది. కొన్ని ఆహారాలతో ఆస్తమా అటాక్ రాకుండా నివారణ ఇలా... తమకు సరిపడని పదార్థాలతో ఆస్తమా ట్రిగర్ అవుతుంది. అందుకే ఆహారాల్లో తమకు సరిపడని వాటికి దూరంగా ఉండాలి. భోజనంలో... ఆకుకూరల్లో పాలకూర, బచ్చలి వంటి వాటివి... కాయగూరల్లో కాకర, గుమ్మడి, క్యారట్, బీట్రూట్, మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యాలు తీసుకోవాలి. పండ్లలో పుల్లటి పండ్లయిన కమలాలు, నిమ్మ, బత్తాయి, అరటిపండు వంటి వాటిని మినహాయించి, మిగతావాటిని అంటే ఉదాహరణకు బెర్రీ, బొప్పాయి వంటి పండ్లను తీసుకోవచ్చు. ఆహారాన్ని వండేందుకు ఉపయోగించే దినుసుల్లో వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్ వంటివి వాడుకోవచ్చు. ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, అల్లం, పసుపు వంటి సహజ మసాలాదినుసులు ఆస్తమా తీవ్రతను తగ్గిస్తాయి. (చదవండి: షిజెల్లోసిస్..! పిల్లల్ని బంకలా పట్టేస్తాయి!) -
Health: ఆస్తమా ఉందా? కాకర, గుమ్మడి, లవంగాలు.. తరచుగా తింటున్నారా? అయితే
కొన్ని పదార్థాలు (అలర్జెన్స్) మాత్రమే కాకుండా ఒక్కోసారి కొన్ని ఆహారాలూ ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అయితే మరికొన్ని ఆహారపదార్థాలు ఆస్తమాను నివారిస్తాయి కూడా. ఆస్తమాను అదుపులో ఉంచుకోడానికి మనకు సరిపడని ఆహారాలకు దూరంగా ఉంటూ, ఆస్తమాను నివారించే వాటిని తీసుకోవడం మంచిది. అయితే తమ తమ వ్యక్తిగత తత్త్వాన్ని బట్టి ఆస్తమాను నివారించేవిగా పేర్కొన్న అదే ఆహారం... మరికొందరిలో ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే తమ తమ శరీరతత్త్వాన్ని బట్టి తమకు ఏయే ఆహారాలు సరిపడవో జాగ్రత్తగా పరిశీలించుకుని సరిపడేవే వాడాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సాధారణంగా ఆస్తమాను నివారించే, ప్రేరేపించే ఆహారాల జాబితా ఇది. ఆరోగ్యాన్నిచ్చి.. ఆస్తమాను అదుపు చేసే ఆహారాలు... కాయగూరలూ, ఆకుకూరలు : ►ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఆస్తమా అదుపులో ఉంటుంది. ►ఇందుకోసం కాకర, గుమ్మడి, అరటి వంటి కూరగాయలు, పాలకూర వంటి ఆకుకూరలు.. మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఇ, బీటాకెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. వండకుండానే తినే వాటిల్లో : ►కిస్మిస్, వాల్నట్ వంటి డ్రైఫ్రూట్స్, క్యారట్, బీట్రూట్, తాజా కాయగూరలు తీసుకోవాలి. అలాగే కమలాలు, నిమ్మ, బత్తాయి వంటి పండ్లలో సాధారణంగా విటమిన్–సితో పాటు అనేక ఇతర విటమిన్లు, పోషకాలు ఉండటం వల్ల అవి ఆస్తమాను నివారించేవే. అయితే ఇవే పండ్లు కొందరిలో ఆస్తమాను ప్రేరేపించనూ వచ్చు. ►అలాగే అరటిపండు, పెరుగు వంటివి కొందరిలో ఆస్తమాను ట్రిగర్ చేయవచ్చు. వ్యక్తిగతంగా అవి తమకు సరిపడనప్పుడు మాత్రమే వీటి నుంచి దూరంగా ఉండాలి. ఒకవేళ తమ శరీర తత్వాన్ని బట్టి అవి ఆస్తమాను ప్రేరేపించనివైతే... ఈ ఆహారాలు ఆస్తమాను సమర్థంగా నివారించడమే కాదు... ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తాయి. ఆస్తమాతో పాటు మరెన్నో రుగ్మతలను నివారిస్తాయి. ►అలాగే బొప్పాయి, ఆపిల్ వంటి తాజా పండ్లు నివారణకు ఎంతో తోడ్పతాయి. ►వెల్లుల్లి, ఉల్లి, ఆలివ్ ఆయిల్, బాదం, సోయా గింజలు, కొవ్వు తీసిన పాలు రోజూ తీసుకోవచ్చు. ►ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పసుపు వంటి సహజమైన మసాలాదినుసులు ఆస్తమాను నివారిస్తాయి, తీవ్రతనూ తగ్గిస్తాయి. ►అయితే మసాలాల తీవ్రత పెరగడం కొందరిలో ఆస్తమాకు దారితీయవచ్చు. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తమా తీవ్రతను పెంచే ఆహారాలు: ►రంగులు వేసిన ఆహారం, ప్రిజర్వేటివ్స్తో కూడిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ►కూల్డ్రింకులు, ఊరగాయలు, స్వీట్లు... ఇవి ఆస్తమా సమస్యను తీవ్రతరం చేస్తాయి. కాబట్టి వీటిని మానేయాలి. ►ఉప్పు బాగా తగ్గించాలి. ►ఆస్తమా రావడానికి చిన్నప్పటి ఆహారపు అలవాట్లు కూడా కారణమేననే కోణంలో చాలా అధ్యయనాలు జరిగాయి. ►చిన్నపిల్లలకు ఆ వయసప్పుడే మంచి ఆహారపు అలవాట్లను నేర్పడం వల్ల పెద్దయ్యాక వారిలో ఆస్తమా వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చు. నోట్: కేవలం ఆరోగ్యం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. పలు అధ్యయనాలు, ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల ఆధారంగా అందించిన వివరాలు ఇవి. శరీర తత్త్వాన్ని బట్టి ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉండవచ్చు. ఏదేమైనా వైద్యులను సంప్రదించిన తర్వాతే సమస్యలకు సరైన, చక్కటి పరిష్కారం దొరుకుతుంది. చదవండి: Cervical Spondylosis: మెడ వెన్నుపూసలు అరిగిపోయాయా? వేపాకు, వేప పువ్వుల రసం.. ఇంకా.. Health Tips In Telugu: ఆర్థరైటిస్తో బాధ పడుతున్నారా? ఇలా చేస్తే.. -
గుండె జబ్బులు, నిమోనియా, ఆస్తమా..
న్యూఢిల్లీ: దేశంలో 2020లో సంభవించిన మరణాల్లో 42 శాతం మరణాలకు కేవలం గుండె జబ్బులు, నిమోనియా, ఆస్తమా కారణమని అధ్యయనంలో తేలింది. ఏడాదిలో 18,11,688 మెడికల్లీ సర్టిఫైడ్ మరణాల గణాంకాల ఆధారంగా ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. ‘ఇండియా రిజిస్ట్రార్ జనరల్, సెన్సెస్ కమిషనర్’ తాజాగా మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ 2020 పేరిట నివేదిక విడుదల చేశారు. కరోనా మహమ్మారి వల్ల 2020లో 1,60,618 మంది మృతిచెందినట్లు నివేదికలో పేర్కొన్నారు. అంటే మొత్తం మరణాల్లో కరోనా సంబంధిత మరణాలు కేవలం 8.9 శాతమే. అలాగే రక్తప్రసరణ సంబంధిత వ్యాధుల కారణంగా 32.1 శాతం మంది, శ్వాస సంబంధిత జబ్బుల వల్ల 10 శాతం మంది మరణించినట్లు గుర్తించారు. ఇక టీబీ, సెప్టిసెమియా కారణంగా 7.1 శాతం మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధ్యయనకర్తలు తెలిపారు. అంతేకాకుండా డయాబెటిస్, పోషకాహార లేమి వంటి వాటితో 5.8 శాతం మంది, గాయాలు, విషం సేవించడం, మాదక ద్రవ్యాలు తీసుకోవడం వంటి వాటితో 5.6 మంది, క్యాన్సర్తో 4.7 శాతం మంది మృతిచెందారు. 2020లో మెడికల్లీ సర్టిఫైడ్ మరణాల్లో 64 శాతం మంది పురుషులు, 36 శాతం మంది మహిళలు ఉన్నారు. మొత్తం మరణాల్లో 28.6 శాతం మంది(5,17,678) బాధితులు 70 ఏళ్ల వయసు దాటినవారే కావడం గమనార్హం. బాధితుల్లో ఏడాదిలోపు వయసు ఉన్నవారు 5.7 శాతం మంది ఉన్నారు. 15 నుంచి 24 ఏళ్లవారిలో 19 శాతం మందిని రక్తప్రసరణ సంబంధిత వ్యాధులే పొట్టనపెట్టుకున్నాయి. -
కొత్త ప్రక్రియలతో ఆస్తమాను ఇలా అధిగమించవచ్చు..!
ఆస్తమా అదుపు చేయడానికి మందులు, స్టెరాయిడ్స్, ఇన్హేలర్స్ వంటి సంప్రదాయ మందులు వాడటం మామూలే. ఇప్పటికీ ఇవి అందుబాటులో ఉన్నాయి. అయితే మరికొన్ని కొత్త కొత్త ప్రక్రియల ద్వారా ఆస్తమాను అదుపు చేయడం ఇప్పుడు మరింత తేలికగా మారింది. ఈ కొత్త ప్రక్రియలను తెలుసుకుందాం. తీవ్రమైన ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఇప్పుడు బ్రాంకియల్ థర్మోప్లాస్టీ, బయలాజిక్ మెడిసిన్ అనే రెండు ఆధునిక చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. వీటి సహాయంతో ఆస్తమా కాస్తంత తీవ్రమైన సమస్యగా ఉన్నవారు కూడా సాధారణ జీవితం గడపడం సాధ్యమవుతుంది. బ్రాంకియల్ థర్మోప్లాస్టీ ప్రక్రియలో ఒక ప్రత్యేకమైన పరికరం సహాయంతో శ్వాసనాళపు గోడల్ని వేడి చేస్తారు. ప్రోబ్ అనే పరికరాన్ని బ్రాంకోస్కోప్ సహాయంతో లోపలికి పంపుతారు. అది అక్కడ వేడిమిని వెలువరిస్తుంది. ఆ వేడిమి తో శ్వాసమార్గంలో చేరిన అదనపు మ్యూకస్ను తొలగిస్తుంది. ఫలితంగా శ్వాస తీసుకునే నాళం విశాలంగా తెరుచుకుంటుంది. దాంతో హాయిగా శ్వాస పీల్చుకోవడం సాధ్యపడుతుంది. ఈ ప్రక్రియను మూడు వారాల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ మూడు దఫాల చికిత్స పూర్తయ్యేసరికి తీవ్రమైన ఆస్తమా వ్యాధి లక్షణాలు బాగా తగ్గిపోతాయి. మంచి ఉపశమనం దొరుకుతుంది. జీవననాణ్యత గణనీయంగా పెరగడంతో పాటు, ఆస్తమా అటాక్స్ తగ్గుతాయి. దాంతో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాలూ తగ్గుతాయి. ఈ చికిత్స ఫలితాలు చాలా కాలం... అంటే దాదాపుగా ఎనిమిదేళ్లు ఉంటాయి. ఇన్హేలర్స్ వాడినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించని, పద్ధెమినిమిదేళ్లు పైబడిన యుక్తవయస్కులైన బాధితులకు ఎవరికైనా ఈ చికిత్స అందించవచ్చు. అలాగే ఇప్పుడు బయోలాజిక్ మెడిసిన్స్ అనే కొత్తరకం మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆస్తమా వ్యాధిగ్రస్తుల్లో శ్వాసనాళాల వాపు కారణంగా ఆ నాళాలు సన్నబడతాయి. ఆ వాపును ఈ మందులు తగ్గించడం ద్వారా ఆస్తమాను అదుపు చేస్తాయి. -
కనిపించని శత్రువు.. ముందే గుర్తిస్తే మందులతో నయం!
ఎలా సోకుతుంది....? వంశపారంపర్యంగా... దుమ్ము,ధూళిలో ఎక్కువగా ఉండేవారికి పని ప్రదేశాలలో శుభ్రత లేకపోతే ఎలర్జీ, జీవన విధానం లక్షణాలు శరీరంలో గాలిగొట్టాలు ముడుచుకుపోవడం పిల్లికూతలు ఊపిరి ఆడనంతగా ఆయాసం ఎడతెరపిలేకుండా దగ్గు రావడం పెదవాల్తేరు (విశాఖతూర్పు): ప్రపంచంలో పూర్తిగా నయమయ్యే వ్యాధులలో ఆస్తమా ఒకటి. చైనాలో క్రీస్తుపూర్వం 2,600 సంవత్సరంలో ఒక వ్యక్తి దగ్గు, ఆయాసంతో బాధపడడంతో తరువాతి కాలంలో ఇది ఆస్తమా అని వైద్యనిపుణులు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఇచ్చిన పిలుపు మేరకు 1993 సంవత్సరం నుంచి ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని ఏటా మే 3వ తేదీన జరుపుకుంటున్నారు. ఇది అంటువ్యాధి కాకపోవడంతో రోగుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. చినవాల్తేరులోని ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో దాదాపుగా 500 మంది ఆస్తమా రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది కేంద్ర ఆరోగ్యశాఖ ఆస్తమా దినోత్సవాన్ని ‘క్లోజింగ్ గేప్స్ ఇన్ ఆస్తమా కేర్’ నినాదంతో జరుపుకోవాలని పిలుపు ఇచ్చింది. ఆస్తమా వ్యాధి సాధారణంగా రెండేళ్ల వయసు నుంచి 78 సంవత్సరాల వయసు గల వ్యక్తులలో కనిపిస్తుంది. రెండు వారాలకు మించి దగ్గు, ఆయాసం వుంటే వెంటనే పల్మనాలజిస్టును సంప్రదించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఇది దీర్ఘకాలిక వ్యాధి కాదని వారు స్పష్టం చేస్తున్నారు. భారతదేశంలో 10 నుంచి 15 శాతం మంది ఆస్తమాతో బాధపడుతున్నారని అంచనా. ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో మొత్తం 288 పడకలు వుండగా, సూపరింటెండెంట్ పర్యవేక్షణలో నలుగురు ప్రొఫెసర్లు, ముగ్గురు అసోసియేట్, పది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 45మంది పీజీలు, ఏడుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి గిరిజనులకు ఎక్కువగా సోకుతుండడం విచారకరం. చికిత్స ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో ఆస్తమా రోగులకు సాధారణంగా రెండునుంచి మూడు వారాల పాటు చికిత్స అందిస్తారు. ఈ రోగులు ఇన్హేలర్, కొన్నిరకాల మాత్రలు వాడాల్సి వుంటుంది. ఆస్తమా సోకితే ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో గుండెజబ్బులకు దారితీసే ప్రమాదం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి వైటల్ ఆర్గానిక్స్, కిడ్నీపై కూడా ప్రభావం చూపే అవకాశం కూడా వుంటుంది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆస్తమా రోగులకు అన్నిరకాల చికిత్స ఉచితంగానే అందిస్తున్నారు. తీవ్రమైన ఆస్తమాతో బాధపడే రోగులకు వెంటిలేటర్లపై చికిత్స చేస్తారు. ఏరో థెరపీ, ఇన్హీలర్థెరపీ, నిబ్యులైజేషన్ చికిత్సలతో రోగులకు ఇట్టే నయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలనుంచి దిగుమతి చేసుకున్న వైద్య పరికరాలతో చికిత్స అందుబాటులో ఉండడం విశేషం. చాలాకాలంగా ఆస్తమా రోగుల్లో మరణాలు నమోదు కాకపోవడం సంతోషకరం. ఓపీలో సేవలు స్థానిక ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో రోజూ ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటలు, తిరిగి 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఓపీ విభాగంలో వైద్యసేవలు అందిస్తున్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో గతనెలనుంచి ఛాతీ ఆస్పత్రిలో మళ్లీ సాధారణ వైద్యసేవలు అన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఓపీ విభాగంలో రోజూ 120 మంది వరకు రోగులు వైద్యం పొందుతున్నారు. అవగాహన సదస్సు ప్రపంచ ఆస్తమా దినోత్సవం పురస్కరించుకుని ఆస్పత్రిలో మంగళవారం ఉదయం 10 గంటలనుంచి అవగాహన సదస్సు జరుగింది. వైద్యనిపుణులు ఆస్తమాపై అవగాహన కల్పించి, రోగుల సందేహాలకు సమాధానాలిచ్చారు. ఎయిర్కూలర్లు, ఏసీ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఆస్తమాని త్వరగా గుర్తిస్తే చికిత్సతో పూర్తిగా నయం అవుతుంది. అంతర్జాతీయ వైద్యనిపుణుల సూచనలతో ఆధునిక చికిత్స చేస్తున్నాం. –డాక్టర్ ఆర్.సునీల్కుమార్, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి, చినవాల్తేరు -
Inhaler Usage: చిన్నారులు ఇన్హేలర్స్ వాడుతున్నారా? అయితే..
ఆస్తమా ఉన్నవారికి డాక్టర్లు ఇన్హేలర్స్తో చికిత్స చేస్తుంటారు. వీటిపై ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా మందును ఊపిరితిత్తులోకి పీలుస్తుండాలి కాబట్టి... వాటితో ఏదైనా హాని జరుగుతుందేమో అని కొందరు ఆందోళన పడుతుంటారు. ముఖ్యంగా చిన్నారులు, పసివాళ్లకు అవి మంచివేనా అంటూ సందేహ పడుతుంటారు. నిజానికి ఇన్హేలర్స్ చాలా సురక్షితం. ఓ మందును మింగడం వల్ల అది కేవలం ఊపిరితిత్తులకే కాకుండా... మిగతా అన్ని అవయవాల కణాలకూ చేరుతుంది. కానీ ఇన్హేలర్స్ కేవలం సమస్య ఉన్న చోటే చికిత్స జరిగేలా చూస్తాయి. ఇన్హేలర్స్లో వాడే మందు మోతాదు కూడా చాలా తక్కువ. ఇది మైక్రోగ్రాముల్లో ఉంటుంది. ముఖ్యంగా టానిక్స్, ట్యాబ్లెట్లతో పోలిస్తే ఇది మరీ మరీ తక్కువ. ఇక స్పేసర్ డివైజ్ వాడితే... మందు ఏమాత్రం వృథా కాదు. అందుకే... ఎలాంటి అపోహలూ లేకుండా ఇన్హేలర్స్ వాడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. చదవండి: మొదటిసారే గుండెపోటు తీవ్రంగా.. మరణానికి దారితీసే పరిస్థితి, ఎందుకిలా? Kiwi Fruit: కివీ పండు పొట్టు తీయకుండా తింటున్నారా? ఇందులోని ఆక్టినిడెన్ అనే ఎంజైమ్ వల్ల... -
అలర్జీలూ, ఆస్తమాలతో జాగ్రత్త!.. గుడ్లు, పల్లీలు, పచ్చళ్లు.. ఇంకా..
Winter Season: Tips To Handle Asthma Allergy Doctors Suggestions: ఆస్తమా, అలర్జీ ఈ రెండూ వేర్వేరని అనుకుంటారు కొందరు. కానీ ఆస్తమా అన్నది కూడా అలర్జీ తాలూకు ఒక రకమైన వ్యక్తీకరణ. సౌకర్యం కోసం శ్వాస వ్యవస్థను అప్పర్ రెస్పిరేటరీ ఎయిర్ వే అనీ... కింది భాగాన్ని లోయర్ రెస్పిరేటరీ ఎయిర్ వే అని చెబుతుంటారు గానీ... ఈ రెండూ ఒకటే. డూప్లె(క్స్) భవనంలోని పై భాగం అప్పర్ ఎయిర్ వే అయితే... కింది భాగం లోయర్ ఎయిర్ వే... ఈ రెండూ కలిసిన ఒకే ఇల్లు లాంటివివి. అలర్జీ వల్ల పై భాగం ప్రభావితమైతే ‘అలర్జిక్ రైనైటిస్’. అదే కింది భాగం అయితే అది ఆస్తమా. గమనించి చూస్తే 60% నుంచి 70% మందిలో అలర్జీలూ, ఆస్తమా ఈ రెండూ ఉంటాయి. ఈ సీజన్లో వీటి బెడద మరింత ఎక్కువ. అందుకే చలికాలంలో మరింత ప్రభావం చూపే అలర్జీలూ, ఆస్తమా... తీవ్రతను తగ్గించుకోవడం ఎలాగో చూద్దాం. అలర్జీలు అలర్జీ అంటే ఏదైనా మనకు సరిపడని పదార్థం మనలోకి ప్రవేశిస్తే... దాన్ని ఎదుర్కొనేందుకు మన వ్యాధి నిరోధకశక్తి దానికి వ్యతిరేకంగా స్పందించడం. కొందరిలో ఈ ప్రతిస్పందన చాలా ఎక్కువ!. అదెంత ఎక్కువగానంటే... మన ఆరోగ్యాన్నే దెబ్బతీసేంత తీవ్రంగా! అప్పుడు మన దేహంపై పడే ప్రతికూల ప్రభావాన్నే ‘అలర్జీ’ అంటారు. అలా అలర్జీని కలిగించే పదార్థాల్ని ‘అలర్జెన్’ అంటారు. అలర్జీలు వేటివేటితో... నిర్వహణ ఎలా? సాధారణంగా పిల్లల్లో / పెద్దల్లో చాలా మందికి చాలా రకాల అంశాలు సరిపడవు. ఆహారాలు : చాక్లెట్స్, గోధుమలతో వండిన ఆహారాలు, కొందరికి గుడ్లు, పల్లీలు, పచ్చళ్లు, పాలతో చేసిన పదార్థాల వంటి వాటితో రావచ్చు. పాలు తాగే పసిపాపల్లో సైతం బాటిల్ ఫుడ్, పోతపాలు, టిన్డ్ ఫుడ్ వంటివాటితో అలర్జీలు రావచ్చు. నిర్వహణ (మేనేజ్మెంట్) : పిల్లలకు సరిపడని వాటిని... వారినుంచి దూరంగా ఉంచడమే దీనికి తొలి చికిత్స అని గుర్తుపెట్టుకోవాలి. పరిసరాలు/ వాతావరణం : పొగ, దుమ్ము ధూళి, పుప్పొడి, దోమల మందు వంటివి. నిర్వహణ (మేనేజ్మెంట్) : పైన పేర్కొన్నవి కమ్ముకుని ఉండే చోట్ల నుంచి దూరంగా ఉండాలి. మందులు / ఇతరాలు : కొందరు పిల్లలకు పెన్సిలిన్, యాస్పిరిన్ వంటివి సరిపడకపోవచ్చు. మరికొందరికి కాస్మటిక్స్ పడకపోవచ్చు. సోయా అలర్జీ, మోల్డ్ అలర్జీ, సన్ అలర్జీ, కొందరికి రబ్బర్ వస్తులతో కలిగే లేటెక్స్ అలర్జీ... ఇలా ఎన్నెన్నో కారణాలతో... రకాల అలర్జీలు వచ్చే అవకాశముంది. నిర్వహణ (మేనేజ్మెంట్) : మనకు అలర్జీ కలిగించే అంశం ఏదైనా దాన్ని నుంచి దూరంగా ఉండటమే దాని నివారణకూ, నిర్వహణకు మేలైన మార్గమని గుర్తుంచుకోవాలి. ఆస్తమా ఆస్తమాను ప్రేరేపించే అంశాలు... దాని నిర్వహణ అలర్జిక్ ఆస్తమా : అలర్జీ తీవ్రతరమైనప్పుడు ఆస్తమాలా రావచ్చు. అలాగే తమకు సరిపడని పదార్థాన్ని తిన్నప్పుడు లేదా దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆయాసం మొదలుకావచ్చు. నిర్వహణ (మేనేజ్మెంట్) : మనకు సరిపడని ఆహారానికి/వాతావరణానికి/పరిసరాలకు దూరంగా ఉండటం వ్యాయామం : తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు కొందరిలో ఆస్తమా రావచ్చు. మనం గాలిని పీల్చగానే ముక్కులోకి ప్రవేశించిన బయటి చలి గాలిని కాస్తంత వెచ్చబరచడం, తేమ ఉండేలా చేయడం వంటి పనులను ముక్కు చేస్తుంది. వ్యాయామ సమయంలో సాధారణ సమయంలో కంటే పెద్దమొత్తంలో గాలిని పీల్చుకుంటుంటాం. దాంతో బయటి గాలి తాలూకు టెంపరేచర్, తేమల తేడాలను తట్టుకోలేని శ్వాసనాళాలు ముడుచుకుపోతాయి. వ్యాయామం కారణంగా ఎక్కువ మోతాదులో గాలి అవసరమవుతుంది. కానీ ముడుచుకుపోయిన శ్వాసనాళాల నుంచి అవసరమైన మేరకు గాలి అందదు. దాంతో ‘ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా’ వస్తుంది. నిర్వహణ (మేనేజ్మెంట్) : సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా మొదలవుతుంది. బయటి గాలిలో, ముక్కు నుంచి దేహంలోకి లోపలికి ప్రవేశించాక ఉన్నగాలిలో తేడాలు ఎక్కువైతే ఇది వస్తుంది కాబట్టి దేహం కూడా దీన్ని తట్టుకునేలా నేరుగా వ్యాయామం మొదలుపెట్టకుండా... కనీసం 5 – 10 నిమిషాల పాటు వార్మ్ అప్ వ్యాయామాలు చేయాలి. వార్మ్ అప్ వ్యాయామాలు ఎంతసేపు చేస్తే... ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా వచ్చే అవకాశాలు అంతగా తగ్గుతాయి. ఒకవేళ అప్పటికీ వస్తూనే ఉంటే వ్యాయామం తాత్కాలికంగా ఆపేసి, డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే మొదలుపెట్టాలి. జీఈఆర్డీ సమస్యతో అజీర్తి / పులితేన్పులుతో : కొందరిలో ఆహారం తీసుకున్న తర్వాత వారి కడుపులో జీర్ణం చేసేందుకు ఉపయోగపడే యాసిడ్ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుంది. దీని ప్రభావం కడుపులోంచి గొంతులోకి వెనక్కు వెళ్లినప్పుడు (రిఫ్లక్స్) గొంతు, పొట్టపైభాగంలో మంట, నొప్పి వస్తాయి.కొందరిలో తిన్నది గొంతులోకి వస్తున్నట్లుగా అనిపిస్తు్తంది. దీన్నే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) అంటారు. పులితేన్పుల రూపంలో యాసిడ్ గొంతులోకి రాగానే గొంతు మండడం, కడుపు ఉబ్బరం చాలామందికి అనుభవంలోకి వచ్చేదే. జీఈఆర్డీ సమస్య ఒక్కోసారి ఆస్తమాను ప్రేరేపించవచ్చు. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత కడుపు బరువుగా ఉండటం, ఆయాసంగా అనిపించడం, నిద్రలో సమస్య ఎక్కువై, మెలకువ వచ్చి ఆయాసంతో బాధపడతారు. నిర్వహణ (మేనేజ్మెంట్) : సాధారణంగా ఒకేసారి ఎక్కువ మోతాదులో తినేవారిలో ఇలాంటి ఆస్తమా ఎక్కువ. అందుకే తక్కువ మోతాదుల్లో తింటూ కడుపును తేలిగ్గా ఉంచుకునే వారిలో ఈ సమస్య తగ్గుతుంది. రాత్రివేళ వీలైనంత ముందుగా భోజనం పూర్తి చేయాలి. తిన్న వెంటనే (ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత) పడుకోకుండా / నిద్రకు ఉపక్రమించకుండా కాసేపు అటు ఇటు నడిచాకే పక్క మీదికి చేరాలి. ఇతర కారణాలతో... పొగాకు పొగ, కట్టెల పొయ్యినుంచి వెలువడే పొగ, రంగుల (పెయింట్స్) లేదా అగరుబత్తీల వంటి వాటి వాసన సరిపడకపోవడం వంటి అంశాలతోనూ ఆస్తమా రావచ్చు. కొందరిలో తాము పనిచేసే ప్రదేశం సరిపడకపోవడం వల్ల కూడా ఆస్తమా రావచ్చు. దీన్నే ‘వర్క్ప్లేస్ ఆస్తమా’ అంటారు. కొందరిలో కొన్ని మందులు సరిపడకపోవడం వల్ల కూడా ఆస్తమా రావచ్చు. నిర్వహణ (మేనేజ్మెంట్) : తమకు సరిపడని వాటి నుంచి దూరంగా ఉండటమే ఈ సమస్యల నివారణకు మార్గం. అలాగే వర్క్ప్లేస్ ఆస్తమా ఉన్నవారు... వీలైతే తమ వృత్తిని మార్చుకోవడమే మేలు. ఇక మందులతో ఆస్తమా వచ్చేవారు... ఏవి తమకు సరిపడటం లేదో గుర్తించి, ఆ విషయాన్ని డాక్టర్కు తెలిపి, మందులను మార్పించుకోవాలి. -డాక్టర్ రఘుకాంత్..సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ చదవండి: Bottle Gourd Juice: సొరకాయ తిని మరుసటి రోజు బీపీ చెక్ చేసుకుంటే అద్భుత ఫలితాలు! జ్యూస్ అస్సలు వదలరు! -
పిల్లలకు ఇవి తినిపించండి... ఆస్తమాకు దూరంగా ఉంచండి
ఇటీవల ఆస్తమాతో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం. చిన్నప్పుడు తాజాపండ్లు, కూరగాయలు అంతగా తినకుండా చాలావరకు ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకునే వారు... పెద్దయ్యాక ఆస్తమా బారిన పడడానికి అవకాశాలెక్కువ. అందుకే దాని నివారణకు పిల్లల ఆహారం మీద దృష్టి కేంద్రీకరించాలి. పిల్లలకు తినిపించాల్సినవి... కిస్మిస్, బాదం, వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్, బెర్రీ పండ్లు, బొప్పాయి, ఆపిల్ వంటి తాజా పండ్లు, పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, కూర అరటి, మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఇ, బీటాకెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు పిల్లల చేత తినిపించాలి. క్యారట్, బీట్రూట్ (పచ్చిగా తినగలిగినవి), తాజా కాయగూరలు తీసుకోవాలి. వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్, పాలు రోజూ తీసుకోవచ్చు. ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, అల్లం, పసుపు వంటి సహజమైన మసాలా దినుసులతో చేసిన పదార్థాలు ఆస్తమా తీవ్రతను తగ్గిస్తాయి. వీటిని ప్రయత్నించి చూడవచ్చు... పాలలో చిటికెడు పసుపు కలిపి తాగించడం, ఒక స్పూన్ పసుపులో అంతే మోతాదులో తేనె కలిపి పరగడుపున తీసుకోవడం... ఉపశమనంతోపాటు నివారణకూ తోడ్పడుతుంది. పాలు లేదా టీలో అరస్పూన్ అల్లం పొడి లేదా మిరియాల పొడి వేసి తాగించాలి. ఇవి ఆస్తమాను పెంచుతాయి! రంగులు వేసిన ఆహారం, ప్రిజర్వేటివ్స్తో కూడిన ఆహారం, బ్రెడ్, కూల్డ్రింక్స్ తీసుకోకపోవడం మంచిది. చదవండి : కాకరకాయ కూర తరచూ తింటే చక్కెర అదుపులోకి వస్తుందా? -
గ్యాస్ స్టవ్లతో కూడా ‘ఆస్తమా’!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇప్పటికీ మీరు కట్టెల పొయ్యి ఉపయోగిస్తున్నారా?’ అంటూ అవాక్కవుతాం, గ్యాస్ పొయ్యి వాడని వారిని చూసి. కట్టెల పొయ్యి నుంచి పొగ వస్తుందని, ఆ పొగ వల్ల వంటచేస్తున్న వారు ఉక్కిరిబిక్కిరవుతారని, వారి ఊపిరి తిత్తులు దెబ్బతింటాయని, పైగా ఆ పొగ వల్ల వాతావరణ కాలుష్యం కూడా పెరగుతుందని ఎవరైనా చెబుతారు. అందుకే కట్టెల పొయ్యిలతో నేటికి కుస్తీలు పడుతున్న మహిళలను కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ‘ఉజ్వల పథకం’ కింద ఇంటింటికి గ్యాస్ స్టవ్ పథకాన్ని ప్రారంభించారు. వాస్తవానికి గ్యాస్ స్టవ్ల వల్ల కూడా పిల్లలకు ఆస్తమా వస్తోందని, వాతావరణ కాలుష్యం కూడా పెరగుతోందని శాస్త్రవేత్తలు ఇప్పుడు చెబుతున్నారు. గ్యాస్ స్టవ్ వెలిగించి నేచురల్ గ్యాస్ను మండించడం వల్ల మంచి నీలి రంగు మంట వస్తుంది. మంటను ఏ స్థాయిలో పెట్టుకోవాలంటే ఆ స్థాయిలో పెట్టుకోవచ్చు. ఊపిరి తిత్తులను ఉక్కిరిబిక్కిరి చేసే పొగకు అవకాశమే ఉండదు. కానీ మంట వల్ల కూడా కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. అలా వెలువడే కిలో కార్బన్ డయాక్సైడ్తోపాటుగా 34 గ్రాముల కార్బన్ మోనాక్సైడ్, 79 గ్రాముల నైట్రోజన్ ఆక్సైడ్, ఆరు గ్రాముల సల్ఫర్ ఆక్సైడ్లు విడుదలవుతాయి. (రైతుల ఫేస్బుక్, ఇన్స్టా బ్లాక్ : ఫేస్బుక్ స్పందన) ఇక వాతావరణాన్ని కాలుష్యానికి కారణమయ్యే ధూళి లేదా నుసి రేణువులు ‘పీఎం 2.5 (పర్టికులేట్ మ్యాటర్ డయామీటర్లో 2.5 మైక్రోమీటర్కన్నా తక్కువ పరిణామం ఉండడం)’ కూడా విడుదలవుతాయి. ఎలక్ట్రిక్ స్టవ్లకన్నా గ్యాస్ స్టవ్ల వల్ల నుసి రేణువులు రెట్టింపు విడుదలవుతాయి. అదే కట్టెల పొయ్యిల వల్ల ఈ నుసి రేణువులు ఏడు వందల రెట్లు పెరగుతాయి. ఆ పొయ్యిల వల్ల సల్ఫర్ డయాక్సైడ్ కూడా ఎక్కువగానే విడుదలవుతుంది. బొగ్గులు, కట్టెల పొయ్యిల కన్నా గ్యాస్ స్టవ్లు తక్కువ కాలుష్యాన్ని కలుగ జేస్తాయంటూ వాదించే వారు లేకపోలేదు. పొదలు, అడవులు అంటుకోవడం వల్ల, డీజిల్ వాహనాల వల్ల, కట్టెల పొయ్యిలు, కట్టెల బాయిలర్లు వల్ల, పంట దుబ్బలను తగుల పెట్టడంతోపాటు గ్యాస్ స్టవ్ల వినియోగం వల్ల వెలువడే నైట్రోజెన్ డయాక్సైడ్, పీఎం 2.5’ రేణువులతో మనుషుల, ముఖ్యంగా పిల్లల ఊపిరితుత్తులు దెబ్బతింటాయి, ఆస్తమా లాంటి జబ్బులు వస్తాయి. గ్యాస్ ఈటర్ల వల్ల కూడా ఈ ప్రమాదం పొంచి ఉంది. ‘పిల్లలకు సహజంగా వచ్చే ఆస్తమా కన్నా గ్యాస్ కుకింగ్ ఇళ్లలో నివసిస్తోన్న పిల్లల్లో ఆస్తామా వచ్చే అవకాశాలు 42 శాతం పెరిగినట్లు ‘నెదర్లాండ్స్లో నిర్వహించిన ఓ సర్వే’లో వెల్లడయింది. అమెరికా ఇళ్లలో గ్యాస్ కూకర్స్ను ఉపయోగించడం వల్ల నైట్రోజన్, డయాక్సైడ్ ఎక్కువగా విడుదలవుతున్నట్లు అమెరికాలో నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. గ్యాస్ స్టవ్ వినియోగం వల్ల 80 ఇళ్లలో ఏడేళ్ల నుంచి 14 ఏళ్ల లోపు మధ్య వయస్కు పిల్లలు ఆస్తమా బారిన పడినట్లు ‘ఆస్ట్రేలియన్ స్టడీ ఇన్ ది లాత్రోబ్ వ్యాలీ’లో వెల్లడయింది. ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ స్టవ్ల వినియోగం వల్ల పిల్లల్లో అస్తమా వచ్చే అవకాశాలు 12.8 శాతం ఉండగా, మంచి వెంటిలేషన్ వల్ల లేదా మంచి చిమ్నీల వల్ల ఆ ప్రమాదాన్ని 3.4 శాతం తగ్గుంచుకోవచ్చు’ అని అడెలేడ్ యూనివర్శిటీలో ఫార్మకాలోజీ సీనియర్ అధ్యాపకులు ఐయాన్ ముస్గ్రేవ్ తెలిపారు. -
ఆలస్యం చేయకండి..!
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరంపై ఒకవైపు కరోనా వైరస్.. మరోవైపు సీజనల్ వ్యాధులు విశ్వరూపం చూపుతున్నాయి. జ్వరాలపట్ల అలసత్వంగా ఉన్నా, చికిత్సకు ఆలస్యం చేసినా పంజా విసిరి జనాలను ఆగం చేస్తున్నాయి. కరోనాలోనూ, మలేరియా, డెంగీ, టైఫాయిడ్లోనూ జ్వరమే సాధా రణంగా కనిపించే లక్షణం. కరోనా కాలంలో ఎవరిలో? ఏ జ్వరం ఉందో? గుర్తించడం బాధితులకే కాదు.. వైద్యులకూ ఇబ్బందిగా మారింది. చాలామంది కరోనా జ్వరాలను కూడా సాధారణ జ్వరంగా భావించి చికిత్సను నిర్లక్ష్యం చేస్తున్నారు. కనీసం టెస్టు కూడా చేయించుకోవడం లేదు. ముఖ్యంగా యాభై ఐదేళ్లు పై బడిన బీపీ, షుగర్, ఆస్తమా, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు చికిత్సను నిర్లక్ష్యం చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుం టున్నారు. తీరా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. అప్పటికే పరిస్థితి చేయిదాటి పోతుండటంతో వైద్యులు కూడా ఏమీ చేయలేక నిస్సహా యతను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మృతి చెందిన బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావుసహా ప్రముఖ గాయకుడు నిస్సార్, బహుజన మేధావి ఉ.సా, ప్రముఖ జర్నలిస్టు పీవీరావుతోపాటు పలువురిలో అక స్మాత్తుగా శ్వాస సంబంధ సమస్యలు తలెత్తి మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఊపిరి తీసుకోవడం కష్టమవడంతో.. ఇప్పటివరకు కోవిడ్ బారిన పడిన బాధితుల్లో 40 ఏళ్లలోపువారు 57.1 శాతం మంది ఉండగా, ఆపై వయసు వారు 48.8 శాతం మంది ఉన్నారు. 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరిలోనూ హైపర్ టెన్షన్, మధుమేహం, ఆస్తమా ఇలా ఏదో ఒక ఇతర అనారోగ్య సమస్య ఉంటుంది. సాధారణ యువకులతో పోలిస్తే వీరిలో రోగనిరోధకశక్తి తక్కువ. వీరిలో చాలామంది తమ పని ప్రదేశాల్లో 35 ఏళ్లలోపు సాధారణ యువకులతో కలిపి పని చేస్తుంటారు. యువకులు అసింప్టమేటిక్గా ఉంటున్నారు. వీరిలో చాలామందికి తమకు వైరస్ సోకిన విషయమే తెలియడం లేదు. వీరంతా తాము ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు భావిస్తున్నారు. మాస్కులు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా, శానిటైజర్ ఉపయోగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారు. అసింప్టమేటిక్ బాధితుల నుంచి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే 55 ఏళ్లు పైబడినవారికి వైరస్ సోకుతోంది. వీరిలో చాలామంది సాధారణ జ్వరం, జలుబు, దగ్గుగా భావించి టెస్టులు, చికిత్సలను లైట్గా తీసుకుంటున్నారు. తీరా ఊపిరి తీసుకోవడం కష్టమవుతుండటంతో ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. శరీరంలో ఆక్సిజన్ శాతం పడి పోయి ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రికి వచ్చిన వీరిని కాపాడేందుకు వైద్యులు ఎంతో శ్రమిం చాల్సి వస్తోంది. పరిస్థితి విషమించి చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. అంతేకాదు, పడకలు, వైద్య సిబ్బంది నిష్పత్తికి మించి బాధితులు వస్తుండటంతో అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేయాల్సి వస్తోంది. అంతో, ఇంతో అవగాహన ఉన్నవారే... సాధారణ ప్రజలతో పోలిస్తే.. వైరస్పై అంతో, ఇంతో అవగాహన ఉన్నవారే చికిత్స లను ఎక్కువ నిర్లక్ష్యం చేస్తున్నారని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఒంట్లో ఏ చిన్న లక్షణం కన్పించినా చాలామంది వెంటనే అప్రమత్తమైపోతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా వివిధ కషాయాలు తాగుతూ పౌష్టికాహారం తీసుకుంటూ ప్రాణాయామం వంటి యోగాసనాలు చేస్తూ వైరస్ను జయిస్తు న్నారు. కానీ, వైద్యంపై కనీస అవగాహన లేని ఇలాంటివారితో పోలిస్తే.. ఉన్నత చదువులు చదివి, వైరస్పై అంతో, ఇంతో అవగాహన ఉన్నవారే ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఇటీవల వెలుగు చూసిన పలు ఘటనలు పరిశీలిస్తే అవగతమవుతుంది. వీరు అతి తెలివిగా ఆలోచించి, చివరకు చిక్కుల్లో పడుతున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు మొదలు.. చికిత్స వరకు... ఇలా ప్రతి విషయంలోనూ దాటవేత ధోరణినే అవలం బిస్తూ చివరకు తమ ప్రాణాల మీదకు తెచ్చు కుంటున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయ పడుతున్నారు. వైరస్ను ముందే గుర్తించి అప్రమత్తమైతే... ప్రమాదం నుంచి బయట పడేవారని, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్వాసనాళాలపైనే ఎక్కువ ప్రభావం.. ప్రస్తుతం కంటికి కన్పించని ప్రమాదకరమైన కరోనా వైరస్తో పోరాడుతున్నాం. ఇది ఒకరి నుంచి మరొకరికి ముక్కు, కన్ను, చెవి, నోరు వంటి భాగాల ద్వారా ప్రవేశిస్తుంది. ముందు గొంతు, శ్వాసనాళాలు, ఆ తర్వాత గుండె, మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. వృద్ధులు, మధుమేహులు, ఆస్తమా బాధితులపై ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది. ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా వైరస్ బారి నుంచి బయటపడొచ్చు. నిర్లక్ష్యం చేయడం ద్వారా వైరస్ శ్వాసనాళాల పనితీరును దెబ్బతీస్తుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. శరీరంలో ఆక్సిజన్ శాతం పడిపోతుంది. ఆకస్మిక గుండెపోటుకు కారణమవుతుంది. ముందుగానే టెస్టు చేయించుకుని, చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది. కానీ, చాలామంది ఈ వైరస్ను నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. – డాక్టర్ రఫీ, పల్మనాలజిస్ట్, కేర్ ఆస్పత్రి -
ఆస్తమా నియంత్రణతో హ్యాపీ ఊపిరి
చలికాలం వచ్చిందంటే చాలమంది చిన్నపిల్లలకు ఇబ్బంది. ఆ పిల్లల తల్లిదండ్రులకూ వణుకు. కారణం... ఈ వాతావరణంలో పిల్లల్లో ఆస్తమా మరింత పెచ్చరిల్లుతుంది. ఆస్తమా ఉన్నవారిలో ఊపిరితిత్తులకు ఇన్ఫ్లమేషన్ (వాపు, మంట) వస్తుంది. అప్పుడప్పుడూ ఎటాక్ చేస్తూ ఇది దీర్ఘకాలికంగా బాధిస్తుంది. ఈ సీజన్లో మరిన్ని ఎక్కువసార్లు, మరింత తీవ్రతతో కనిపించేందుకు అవకాశాలెక్కువ. అలర్జీ కారణంగా వచ్చే ఆస్తమా... ఈ సీజన్లో అయితే సరిపడని వాతావరణంతోనూ వస్తుంది. ఆస్తమాపై అవగాహనకు, దానిని నియంత్రణలో ఉంచుకునేందుకే ఈ కథనం... ఆస్తమాను అర్థం చేసుకోవాలంటే మన ఊపిరితిత్తుల్లోని వాయు నాళాల పనితీరును అవగతం చేసుకోవాలి. మన దేహానికి అవసరమైన ఆక్సిజన్ను ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్లి, అక్కడి కాలుష్య కార్బన్ డై ఆక్సైడ్ను మళ్లీ బయటకు వదలడానికి అంచెలంచెలుగా అనేక నాళాలు ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ (వాపు, మంట, ఎర్రబారడం) కారణంగా అవి ఉబ్బుతాయి. దాంతో సెన్సిటివ్గా మారిపోతాయి. ఉదాహరణకు చర్మంపై ఏదైనా గాయమైనప్పుడు అది ఎర్రబారి, వాచి, ముట్టుకుందామన్నా ముట్టనివ్వని విధంగా మారడాన్ని ఇన్ఫ్లమేషన్ అని చెప్పవచ్చు. ఇలా ఊపిరితిత్తుల్లోని నాళాల కండరాలు ఉబ్బడం వల్ల వాటి మధ్యభాగంలోని స్థలం సన్నబడిపోయి, శ్వాసమార్గాలు మూసుకు పోయినట్లుగా అవుతాయి. ఫలితంగా ఆ నాళాల్లో గాలి ఫ్రీగా కదిలేందుకు సరిపడనంత స్థలం లేక శ్వాస సరిగా అందదు. దాంతో మనకు ఆస్తమా అటాక్ వస్తుందన్నమాట. ఏవైనా మనకు సరిపడని వాటిని తిన్నా, పీల్చుకున్నా మన వాయునాళాలు తీవ్రంగా ప్రతిస్పందించడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ సీజన్లో చల్లటి వాతావరణంలోని గాలిలో మంచు కారణంగా వాయునాళాలు ఉబ్బుతాయి. దాంతో పాటు వాయునాళాల్లో కాస్త జిగురుగా ఉండే మ్యూకస్ అనే పదార్థం స్రవిస్తుంది. అసలే నాళాలు సన్నబడి ఉండటంతో పాటు... ఈ మ్యూకస్ కూడా అడ్డుపడటం వల్ల వాయువులు కదిలే ప్రాంతం మరింత మూసుకుపోతుంది. ఫలితంగా గాలి పీల్చడమూ, వదలడమూ... అంటే మొత్తంగా శ్వాస తీసుకోవడమే చాలా కష్టమవుతుంది. కారణాలు: ఆస్తమాకు ప్రధాన కారణం జన్యుపరమైనవని అనేక అధ్యయనాల్లో స్పష్టమైంది. అయితే ఇటీవల జన్యుపరమైన కారణాలేమీ లేకుండానే ఇది వస్తోందంటూ కూడా మరికొన్ని అధ్యయనాల్లో తేలింది. ఇక మనకు సరిపడని వాతావరణం దీన్ని ట్రిగ్గర్ చేస్తుందనేది చాలామందికి తెలిసిన విషయమే. మనం శ్వాసించే సమయంలో ఏదైనా మనకు సరిపడని పదార్థం (దీన్ని అలర్జెన్ అంటారు) మన ఊపిరితిత్తుల మార్గంలోకి ప్రవేశిస్తే అది అలర్జిక్ రియాక్షన్కు కారణమవుతుంది. ఇలా అలర్జిక్ రియాక్షన్ రావడానికి కారణమయ్యే అంశాల్లో ఇవి కొన్ని... ►గదుల్లోపల (ఇన్డోర్స్లో)ఉండే అలర్జెన్స్ (ఉదా... పక్కబట్టల్లో, కార్పెట్స్లో, ఇరుగ్గా ఉండే ఫర్నిచర్లో ఉండే డస్ట్మైట్స్, కాలుష్యంలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉండే ధూళి కణాలు, పెంపుడు జంతువుల వెంట్రుకలు. ►ఆరుబయట ఉండే అలర్జెన్స్: పుప్పొడి, బూజు వంటి పదార్థాలు. ►పొగాకు కాలినప్పుడు / మండినప్పుడు వచ్చే పొగ ►ఘాటైన రసాయనాలు, స్ప్రేలు.. వాటి తాలూకు ఘాటైన వాసనలు కొందరిలో ఆస్తమాకు కారణం కావచ్చు. అలర్జిక్ ఆస్తమా కోసం చేసే కొన్ని అలర్జీ పరీక్షలు కొన్ని ట్రిగరింగ్ అంశాల కారణంగా పిల్లల్లో ఆస్తమా కనిపిస్తుంటే... అలాంటి పిల్లల్లో డాక్టర్లు అలర్జీ స్కిన్ టెస్ట్ చేయిస్తారు. ఇందులో ఏదైనా అలర్జీ కలిగించే పదార్థాన్ని (అంటే జంతువుల వెంట్రుకలో లేదా బూజునో) ఉపయోగించి చర్మంలోని కొంత భాగాన్ని సేకరిస్తారు. ఇలా చేయడం ద్వారా చర్మంపై ఏదైనా అలర్జిక్ రియాక్షన్ జరుగుతుందేమోనని గమనిస్తారు. కొన్నిసార్లు చర్మంపై లక్షణాలు కనిపిస్తూ ఉండేవారికి, యాంటీ హిస్టమైన్ మందులు తీసుకునే వారికి అలర్జీ బ్లడ్ టెస్ట్ల వల్ల ఉపయోగం ఉంటుంది. అయితే కొంతమందికి ఆహారం కారణంగా అలర్జీ వచ్చి ఆస్తమా కనిపించవచ్చు. అలాంటప్పుడు ఏయే రోగులకు ఏయే ఆహారం వల్ల అలర్జీ కలుగుతుందో తెలుసుకోవడం చాలా కష్టమైన పని. అది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది. అందుకే పెద్దవారైతే తమకు తాము... పిల్లల విషయంలోనైతే తల్లిదండ్రులు... ఏయే పదార్థాలు తిన్న తర్వాత లక్షణాలు కనిపిస్తున్నాయో జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఫలానా పదార్థాలతోనే ఆస్తమా లక్షణాలు బయటపడుతున్నాయని ఒకటి రెండుసార్లు గమనించాక తెలిసిపోతుంది. అలాంటప్పుడు ఆయా పదార్థాలకు దూరంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు మరింత సూక్ష్మస్థాయి పరీక్షలనూ ఆశ్రయించాల్సి రావచ్చు. చికిత్స సాధారణంగా చిన్నపిల్లల్లో ఆస్తమా వస్తే చాలామందిలో వారు పెరుగుతున్న కొద్దీ... అంటే టీన్స్లోకి ప్రవేశిస్తున్నప్పుడుగానీ లేదా యుక్తవయస్కులుగా మారుతున్నప్పుడుగానీ ఆ ఆస్తమా లక్షణాలు క్రమంగా తగ్గిపోవచ్చు. అయితే కొంతమందిలో కొన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆ లక్షణాలు కొంతకాలం తర్వాత మళ్లీ వ్యక్తం కావచ్చు. ఇక చిన్నప్పుడు మరీ తీవ్రమైన ఆస్తమా ఉన్న పిల్లల్లో పెద్దయ్యాక కూడా తగ్గకపోవచ్చు. రెండు రకాల చికిత్స ... ►దీర్ఘకాలంలో మళ్లీ రాకుండా నివారించేందుకు అవసరమైన ప్రివెంటివ్ చికిత్స. వాయునాళాల ఇన్ఫ్లమేషన్ నివారణకు ఈ మందులను వాడాలి. వీటిని రోజూ తీసుకోవాలి. ►తక్షణ ఉపశమనం కోసం: ఆస్తమా వచ్చినప్పుడు వాయునాళాల వాపు తగ్గించి, హాయిగా శ్వాస తీసుకోవడానికి దోహదపడేందుకు ఉపయోగించే మందులు వాడాలి. వీటినే రెస్క్యూ మెడికేషన్ అనీ, క్విక్ రిలీఫ్ మెడికేషన్ అనీ అంటారు. ఇది ఆస్తమా అటాక్ ఉన్నప్పుడు చేసే స్వల్పకాలిక చికిత్స. కొందరు పిల్లల్లో ఆటలు లేదా వ్యాయామానికి ముందు కూడా ఈ చికిత్సను డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. ►మూడేళ్ల లోపు పిల్లలకు ఇన్హేలర్స్తో చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు ఆ మందు పిల్లల ఊపిరితిత్తుల్లోకి సమర్థంగా వెళ్లడానికి స్పేసర్ డివైజ్ విత్ మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇందువల్ల మందు వృథా కాకుండా ఉంటుంది. ఇక ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల్లో స్పేసర్తో ఇన్హేలర్ ఉపయోగించాలి. ►ఇప్పుడు ఆస్తమాకు ఇమ్యూనోథెరపీ చికిత్స కూడా అందుబాటులో ఉంది. చివరగా... కేవలం కొన్నాళ్లు మందులు వాడటం లేదా చికిత్స తీసుకోవడంతో మాత్రమే ఆస్తమా తగ్గిపోదు. దీన్ని అనుక్షణం నియంత్రణలో ఉంచడం అవసరం. అందుకే పిల్లలకు ఆస్తమా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆ విషయాన్ని అంగీకరించి, దీర్ఘకాలం పాటు చికిత్సకు సిద్ధపడాలి. ఆస్తమాను ప్రేరేపించే అంశాలకు రోగిని దూరంగా ఉంచడం, తమకు ఆస్తమాను ప్రేరేపించే అంశాలేమిటో క్రమంగా గుర్తించి, వాటినుంచి ఎల్లప్పుడూ దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా డాక్టర్ను సంప్రదిస్తూ ఉండటం చేస్తుండాలి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆస్తమా నివారణ, నియంత్రణ చాలా సులభమే. అందుకే ఆందోళనకు గురికాకుండా తమ డాక్టర్తో నిత్యం ఫాలోఅప్లో ఉండాలి. ఆస్తమా లక్షణాలు ►దగ్గు, ఆయాసం... ప్రధానంగా రాత్రివేళల్లో ఎక్కువగా ఉంటుంది. శరీరానికి శ్రమకలిగే వ్యాయామం చేడం లేదా గట్టిగా నవ్వడం, ఏడ్వటం, పరుగెత్తడం వంటివి చేస్తే ఈ దగ్గు, ఆయాసాలు మరింతగా పెరుగుతాయి. ►శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది ►ఛాతీ బిగుతుగా పట్టేసినట్లుగా ఉండటం ►హాయిగా ఊపిరి అందకపోవడం, సాఫీగా ఊపిరాడకపోవడం ►పిల్లికూతలు (శ్వాస తీసుకునే సమయంలో... అందునా మరీ ముఖ్యంగా గాలి వదిలే సమయంలో సన్నటి పిల్లికూతలు వినిపిస్తుంటాయి). ►కొందరిలో ఆస్తమా వచ్చినప్పుడు ఒళ్లు (చర్మం) కూడా ఎర్రబారి పొడిగా మారుతుంది. మరికొందరిలో ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, గురక వంటి లక్షణాలు కనిపించవచ్చు. పిల్లల్లో పైన పేర్కొన్న లక్షణాల్లో ఏదో ఒకటిగాని లేదా కొన్ని లక్షణాలు కలగలిసి గాని కనిపించవచ్చు. ఇలా లక్షణాలు కనిపించినప్పుడు దాన్ని జలుబు లేదా బ్రాంకైటిస్ కావచ్చని అనుకుంటాం. అయితే అవే లక్షణాలు పదే పదే కనిపిస్తుంటే అప్పుడు అది ఆస్తమా కావచ్చని అనుమానించాలి. ఆ పిల్లలకు ఆస్తమాను ప్రేరేపించే అంశం (ట్రిగరింగ్ ఫ్యాక్టర్) ఏదైనా ఎదురైతే వారి పరిస్థితి మరింత దుర్భరమవుతుంది. వెంటనే ఆస్తమా లక్షణాలు మొదలైపోతాయి. పొగ, ఘాటైన వాసనలు, పుప్పొడి, పెంపుడు జంతువుల వెంట్రుకలు, డస్ట్మైట్స్... ఇవి సోకీ సోకగానే ఆస్తమాను తక్షణం ప్రేరేపిస్తాయి. నిర్ధారణ ఆస్తమా నిర్ధారణ కాస్తంత కష్టమైన ప్రక్రియ. లక్షణాలతో పాటు... అవి ఎంత వ్యవధిలో మళ్లీ మళ్లీ వస్తున్నాయనే అంశం ఆధారంగా అది ఆస్తమా కావచ్చేమోనని అనుమానిస్తారు. దాంతో నిర్ధారణ కోసం కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా బాల్యంలో వచ్చే మరికొన్ని సమస్యల లక్షణాలూ ఆస్తమా లక్షణాలతో కలగలసి ఉంటాయి. దాంతో ఆయా లక్షణాలు ఆస్తమా వల్లనే కనిపిస్తున్నాయా లేక ఇతర మరికొన్ని ఆరోగ్య సమస్యల వల్లనా అని నిర్ధారణ చేయడం కష్టమవుతుంది. ఉదాహరణకు ఆస్తమా లాంటి లక్షణాలే కనబరిచే మరికొన్ని కండిషన్లు.... ►రైనైటిస్ ►సైనసైటిస్ ►ఆసిడ్ రిఫ్లక్స్ లేదా గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) ►వాయునాళాలలో ఏమైనా తేడాలు (ఎయిర్ వే అబ్నార్మాలిటీస్) ►స్వరపేటిక సరిగా పనిచేయకపోవడం (వోకల్ కార్డ్ డిస్ఫంక్షన్) ►బ్రాంకైటిస్ వంటి శ్వాసమార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్లు ఆస్తమా నిర్ధారణ ఇంత సంక్లిష్టం కాబట్టే డాక్టర్లు చిన్నారి లక్షణాలను నిశితంగా పరిశీలించడంతో పాటు కొన్ని వైద్య పరీక్షలూ చేయించాల్సి రావచ్చు. అవి... ►ఐదేళ్లు లేదా అంతకంటే పైబడిన వయసు పిల్లల విషయానికి వస్తే పెద్దవాళ్లలోనూ నిర్ధారణ చేసేందుకు నిర్వహించే లంగ్ ఫంక్షన్ పరీక్షలు (స్పైరోమెట్రీ) వంటివి చేస్తారు. ఇందులో పిల్లలు ఎంత సమర్థంగా గాలిని బయటకు వదలగలరో చూస్తారు. సాధారణ స్థితితో ఈ పరీక్ష చేయడంతో పాటు, కాస్త వ్యాయామం తర్వాత, అటుపైన కొంత ఆస్తమా మందు ఇచ్చాక ఆ పరీక్షల్లో కనిపించే తేడాలను సునిశితంగా గమనించాకే ఆస్తమా అని నిర్ధారణ చేస్తారు. ►ఇక మూడేళ్లు కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో లంగ్ ఫంక్షన్ పరీక్షతో ఆస్తమా నిర్ధారణ ఒకింత కష్టం. దాంతోపాటు రోగి చెప్పేవి, తల్లిదండ్రులు గమనించే అనేక లక్షణాల ఆధారంగా ఆస్తమాను నిర్ధారణ చేస్తారు. పిల్లల్లో ఆస్తమా చిన్న పిల్లల్లో సాధారణంగా ఐదేళ్ల వయసు తర్వాత ఆస్తమా లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే అంతకంటే తక్కువ వయసున్న చిన్నారుల్లో ఆస్తమాను గుర్తించడం అటు తల్లిదండ్రులకు, ఇటు డాక్టర్లకు కూడా ఒకింత కష్టమవుతుంది. చిననపిల్లల్లో ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే బ్రాంకియల్ ట్యూబులు మొదటే చాలా సన్నగా, చిన్నగా ఉంటాయి. ఇక జలుబు, పడిశం వంటి వాటి కారణంగా ఆ మార్గాలు మామూలుగానే ఇన్ఫ్లమేషన్కు గురవుతుంటాయి. దాంతో అవి మరింత సన్నగా మారతాయి. అందువల్ల అవి ఆస్తమా వల్ల సన్నబడ్డాయా లేక పడిశం, జలుబు తాలూకు లక్షణాలా అన్నది గుర్తించడం కొంత కష్టమవుతుంది. డా. రమేశ్బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
వ్యాయామంతో తీవ్రమైన ఆయాసం
నా వయసు 34. నాకు దుమ్ము సరిపడదు. డస్ట్ అలర్జీ ఉంది. దుమ్ముకు ఎక్స్పోజ్ అయితే ఆయాసం వస్తుంటుంది. వింటర్ వచ్చింది కదా అని వ్యాయామం చేయదలచినప్పుడల్లా నాకు ఆయాసం వస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వగలరు. వ్యాయామ ప్రక్రియ ఒక్కోసారి ఆస్తమాను ప్రేరేపించి, ఆయాసం వచ్చేలా చేస్తుంటుంది. దీర్ఘకాలిక ఆస్తమాతో బాధపడే చాలామందిలో వ్యాయామం చేసినప్పుడల్లా ఆస్తమా కనిపిస్తుంటుంది. సాధారణంగా మనం శ్వాస తీసుకునే సమయంలో బయటిగాలి కాసేపు ముక్కురంధ్రాలలో ఉండి వెచ్చబడటంతో పాటు తేమపూరితమవుతుంది. కానీ వ్యాయామం చేసే సమయంలో గాలి ఎక్కువగా తీసుకోవడం కోసం నోటితోనూ గాలిపీలుస్తుంటారు. అంటే వారు తేమలేని పొడిగాలినీ, చల్లగాలినీ పీలుస్తుంటారన్నమాట. దాంతో గాలిని తీసుకెళ్లే మార్గాలు ఈ చల్లగాలి వల్ల ముడుచుకుపోతాయి. ఫలితంగా గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకేళ్లే మార్గాలన్నీ సన్నబడతాయి. దాంతో కొన్ని లక్షణాలు కనబడతాయి. అవి... ►పొడి దగ్గు వస్తుండటం ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ►పిల్లికూతలు వినిపించడం వ్యాయామం తర్వాత తీవ్రమైన అలసట (మామూలుగా వ్యాయామం చేసేవారిలో ఇంత అలసట ఉండదు) ►వ్యాయామ సమయంలో గాలి తీసుకోవడంలో ఇబ్బంది / ఆయాసం. సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. లేదా కొద్దిగా వ్యాయామం చేసి ఆపేసినా... 5 – 10 నిమిషాల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో డాక్టర్ను తప్పక సంప్రదించాలి. అయితే వ్యాయామంతో వచ్చే ఆయాసం (ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా) కారణంగా వ్యాయామ ప్రక్రియను ఆపాల్సిన అవసరం లేదు. దీన్ని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందుగా పీల్చే మందులైన బ్రాంకో డయలేటర్స్ వాడి, వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇక తక్షణం పనిచేసే లెవోసాల్బ్యుటమాల్ వంటి బీటా–2 ఔషధాలను వ్యాయామానికి 10 నిమిషాల ముందుగా వాడి, వ్యాయామ సమయంలో గాలిగొట్టాలు మూసుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. దీనితో పాటు వ్యాయామానికి ముందర వార్మింగ్ అప్, వ్యాయామం తర్వాత కూలింగ్ డౌన్ ప్రక్రియలను చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. సాధారణంగా వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు గాలిలో పుప్పొడి ఎక్కువగా ఉంటుంది. కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు ఉదాహరణకు జలుబు, ఫ్లూ, సైనసైటిస్ వంటివి ఆస్తమాను మరింత ప్రేరేపిస్తాయి. ఇలా నలతగా ఉన్న సమయాల్లో వ్యాయామం చేయకూడదు. ఆస్తమా ఉన్నవారు త్వరగా ముగిసే ఆటల్లాంటివి... అంటే వాలీబాల్, బేస్బాల్, వాకింగ్ వంటివి చేయాలి. అంతేగానీ దీర్ఘకాలం పాటు కొనసాగుతూ, దూరాలు పరుగెత్తాల్సి వచ్చే సాకర్, బాస్కెట్బాల్, హాకీ వంటివి ఆడకూడదు. అయితే నీరు వేడిగా ఉన్న సమయాల్లో ఈతను అభ్యసిస్తూ, క్రమంగా వ్యవధిని పెంచుకుంటూ పోతే దేహానికి వ్యాయామం సమకూరడంతో పాటు వ్యాధి తీవ్రత కూడా తగ్గుతుంది. పల్మునరీ ఫైబ్రోసిస్ అంటే ఏమిటి? నాకు కొద్దినెలలుగా నెలలుగా దగ్గు, విపరీతమైన ఆయాసం వస్తోంది. చాలామంది డాక్టర్లకు చూపించుకున్నాను. చివరకు ఒక డాక్టర్గారు దాన్ని పల్మునరీ ఫైబ్రోసిస్ అని నిర్ధారణ చేశారు. ఆ తర్వాత ‘జబ్బుకు కారణమేమిటో తెలుసుకోవా’లన్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. పల్మునరీ ఫైబ్రోసిస్ అంటే ఏమిటి? దయచేసి తగిన సలహా ఇవ్వండి. పల్మునరీ ఫైబ్రోసిస్ అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక జబ్బు. ఇందులో ఊపిరితిత్తుల మీద చారల్లాగా వస్తాయి. ఇలా చార (స్కార్) రావడం పెరిగిపోతే కనెక్టివ్ టిష్యూ అనే కణజాలమంతా ఒకేచోట పోగుబడుతుంది. దాంతో మృదువుగా ఉండాల్సిన ఊపిరితిత్తుల గోడలు మందంగా మారతాయి. ఫలితంగా రక్తానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీని వల్ల రోగులు ఆయాసపడుతూ ఉంటారు. కొంతమంది రోగుల్లో దీనికి కారణం ఏమిటో తెలుసుకుంటారు. అయితే కొందరికి ఇలా జరగడానికి కారణం ఏమిటో తెలియదు. ఇలాంటి జబ్బును ఇడియోపతిక్ పల్మునరీ ఫైబ్రోసిస్ అంటారు. సాధారణంగా ఆయాసం, ఏదైనా పనిచేస్తున్నప్పుడు అది మరింత ఎక్కువ కావడం, ఎప్పుడూ పొడిదగ్గు వస్తుండటం, అలసట, ఛాతీలో ఇబ్బంది, కొంతమందిలో ఛాతీనొప్పి, ఆకలి తగ్గడం, నీరసించిపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఇది ప్రధాన జబ్బు కాదు. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య తర్వాత రెండో (సెకండరీ) సమస్యగా ఇది వస్తుంది. కొన్నిసార్లు మన వ్యాధి నిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం (ఆటో ఇమ్యూన్), వైరల్ ఇన్ఫెక్షన్స్, టీబీ లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వంటి కారణాలతో ఇది వస్తుంది. ఇక ఎప్పుడూ ఆస్బెస్టాస్, సన్నటి ఇసుక రేణువులనూ, సిమెంటు నిండి గాలి పీలుస్తుండటం, నిమోనియాను కల్పించే బ్యాక్టీరియా, ఫంగస్లతో ఉన్న గాలిని పీల్చడం, కోళ్ల దాణా వంటి వ్యవసాయ పరిశ్రమలకు సంబంధించిన వాసనలు ముక్కుకు తగులుతూ ఉండటం వల్ల కూడా ఈ జబ్బు రావచ్చు. సిగరెట్ పొగ ఈ కండిషన్ను మరింత తీవ్రతరం చేస్తుంది. సాధారణంగా దీనికి చాలా పరిమితమైన చికిత్స మాత్రమే లభ్యమవుతోంది. మంచి మందులు ఇంకా ప్రయోగదశలోనే ఉండి, అందుబాటులోకి రావల్సి ఉంది. ప్రస్తుతం కార్టికోస్టెరాయిడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటర్ మందులు వాడుతూ ఊపిరితిత్తుల్లో వచ్చే వాపు, నొప్పి, ఎర్రబారే పరిస్థితిని (ఇన్ఫ్లమేషన్ను) అదుపు చేసే స్థితిలోనే వైద్యశాస్త్రం ఉంది. దీనికి తోడు అవసరమైనప్పుడు ఆక్సిజన్ పెట్టాల్సి ఉంటుంది. మీరు పెద్ద సెంటర్లలో నిపుణులైన పల్మునాలజిస్ట్లను సంప్రదించండి. డాక్టర్ రమణ ప్రసాద్, కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
వచ్చే నెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదం
-
8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్ : ఆస్తమా రోగులకు వచ్చే నెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జూన్ 8న సాయంత్రం 6 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు చేప ప్రసాద పంపిణీ చేపడతామన్నారు. మంగళవారం సచివాలయంలో చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె. జోషి, వివిధ శాఖల అధికారులతో తలసాని సమన్వయ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బత్తిని హరినాధ్గౌడ్ కుటుంబీకులు 173 ఏళ్ల నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారని గుర్తుచేశారు. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 3 లక్షల మందికిపైగా ప్రజలు వస్తారని, వారికి అవసరమైన చేప పిల్లలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని అదనంగా మంచినీరు, వైద్య సదుపాయాలు కల్పించడంతోపాటు ట్రాఫిక్, బ్యారికేడింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. అగ్నిమాపక నిరోధక వ్యవస్ధకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జీహెచ్ఎంసీ ద్వారా పారిశుద్ధ్యం, మొబైల్ టాయిలెట్స్, అదనపు సిబ్బంది, రోడ్లకు రిపేర్లు, రూ. 5 భోజనం వసతి కల్పించాలని వివరించారు. మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా మంచినీటి ప్యాకెట్లు, మంచినీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ఆర్టీసీ ద్వారా వివిధ ప్రాంతాల నుంచి 150 బస్సులను నడుపుతున్నట్లు తలసాని తెలిపారు. పనుల పరిశీలనకు జూన్ 4న ఉదయం 11 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో సమావేశం అవుతామన్నారు. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, ఫైర్ సర్వీసెస్ డీజీ గోపీకృష్ణ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాణిక్రాజ్, ఫిషరీస్ కమిషనర్ సువర్ణ, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డిలతోపాటు బత్తిని హరినాధ్గౌడ్ కుటుంబీకులు పాల్గొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆక్సిజన్ సిలిండర్తో పరీక్షకు..
తుర్కయంజాల్: లక్ష్యం ముందు ఎంత పెద్ద సమస్య అయిన చిన్నదే అని నిరూపించింది ఆ విద్యార్థిని. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్కు చెందిన బాలయ్య, వసంతల కూతురు నవీన ఇంజాపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. నవీన మూడు నెలలుగా ఆస్తమాతో బాధ పడుతోంది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నప్పటికీ ఇంకా నయం కాలేదు. ఆస్తమా తీవ్ర స్థాయిలో ఉండటంతో నవీనకు 24 గంటలూ ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో శ్వాస అందించాల్సి ఉంది. కాగా, నవీన శనివారం రాగన్నగూడలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి తెలుగు పరీక్షకు సిలిండర్ ద్వారా శ్వాస తీసుకుంటూనే హాజరైంది. ఎంత కష్టమైనా పరీక్ష రాస్తానని తమ కూతురు చెప్పిందని, అందుకే పరీక్ష రాసేందుకు తీసుకువచ్చామని తల్లి వెల్లడించింది. -
ఉబ్బసానికి విరుగుడు మితాహారమా?
ఉబ్బసంతో బాధపడేవారు వీలైనన్ని తక్కువ కేలరీలను తీసుకోవడం ద్వారా వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చునని అంటున్నారు హాప్కిన్స్ మెడిసిన్ శాస్త్రవేత్తలు. అంతేకాకుండా శరీరానికి అందే కేలరీలు కొవ్వుల నుంచి వచ్చినా.. చక్కెరల నుంచి వచ్చినా ఈ ఫలితాల్లో తేడాలేవీ ఉండవని వారు ఎలుకలపై జరిపిన పరిశోధనల ఆధారంగా చెబుతున్నారు. అధికాహారం కారణంగా ఊబకాయులైన వారి ఊపిరితిత్తులు మంట/వాపులకు గురవుతాయని.. ఫలితంగా ఉబ్బస లక్షణాలు కనిపిస్తాయని.. మంట/వాపు నివారణకు మందులు వేసుకుంటే పరిస్థితి సాధారణమవుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వసెవోలోడ్ పొలోట్స్కీ అంటున్నారు. ఎలుకలకు తాము నాలుగు రకాల ఆహారాన్ని అందించి వాటిపై పరిశీలనలు జరిపామని, ఎనిమిది వారాల తరువాత తక్కువ కేలరీలు తీసుకున్న ఎలుకల ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉన్నట్లు తెలిసిందని, కొవ్వు ఎక్కువగా తీసుకున్న ఎలుకల ఊపిరితిత్తుల్లోని వాయుమార్గాలు సాధారణం కంటే చాలా రెట్లు కుంచించుకుపోయినట్లు తెలిసిదని వివరించారు. దీన్నిబట్టి మితాహారానికీ ఊబ్బస లక్షణాలకూ మధ్య సంబంధం ఉన్నట్లు తాము అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఉబ్బసం వ్యాధికి మరింత మెరుగైన చికిత్స కల్పించేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని అన్నార -
దాచాల్సిన అవసరం లేదు!
గొప్పలు చెప్పుకోవడానికి కాదు మనలో ఉన్న లోపాలను ఒప్పుకోవడానికి నిజంగా ధైర్యం కావాలి. ఈ విషయంలో ప్రియాంకా చోప్రా ముందు వరసలోనే ఉన్నారు. ‘‘నేను ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నా’’ అని సూటిగా చెప్పేశారు. ఆస్తమా వ్యాధిగ్రస్తుల కోసం ఓ సంస్థ కోరిన మీదట వారిలో ధైర్యం నింపే విధంగా మాట్లాడారు ప్రియాంక. ‘‘నాకు బాగా దగ్గరగా ఉన్నవారికి నేనూ ఆస్తమా పేషంట్ అని తెలుసు. ఈ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆస్తమా నన్ను కంట్రోల్ చేయడానికి ముందే నేనూ ఆస్తమాను కంట్రోల్ చేయగలనని నమ్మాను. ఆస్తమా ఉందని అధైర్యపడలేదు. నా గోల్ను సాధించుకోవడంలో బెదరలేదు’’ అని చెప్పుకొచ్చారు ప్రియాంకా చోప్రా. ఇక ప్రియాంకా చోప్రా సినిమాల దగ్గరకు వస్తే సోనాలీ బోస్ దర్శకత్వంలో ‘ద స్కై ఈజ్ పింక్’ అనే సినిమాలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పర్సనల్ లైఫ్లోకి తొంగి చూస్తే.. కాబోయే భర్త నిక్ జోనస్కు ముద్దు రూపంలో మంచి గిఫ్ట్ ఇచ్చారు ప్రియాంకా చోప్రా. ఇటీవల నిక్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్గా పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో నిక్ని ముద్దాడారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక్కడ ఇన్సెట్లో ఉన్న ఫొటో అదే. -
పారాసిట్మాల్తో ఆస్తమా!
మెల్బోర్న్: బాల్యంలో పారాసిట్మాల్ తీసుకున్న వారికి భవిష్యత్తులో ఆస్తమా వచ్చే అవకాశం ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. రెండేళ్ల వయసు వరకు పారసిట్మాల్ తీసుకున్న పిల్లల్లో 18 ఏళ్ల వయసు దాటాక ఆస్తమా లక్షణాలు పరిశోధకులు గుర్తించారు. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేపట్టారు. కుటుంబంలో ఒక్కరికైనా ఆస్తమా ఉన్న వారి పిల్లలను పుట్టక ముందే ఎంచుకున్నారు. ఇలా 620 మంది పిల్లలపై పుట్టినప్పటి నుంచి 18 ఏళ్లు వచ్చే వరకు అధ్యయనం చేపట్టారు. అయితే పారసిట్మాల్ తీసుకోని వారిలో ఆస్తమా లేదని పరిశోధకులు తెలిపారు. ఫలితాలపై స్పష్టత రానందున పారసిట్మాల్ వాడకంపై మార్గదర్శకాలు జారీ చేసేందుకు ఇంకా పరిశోదనలు జరపాల్సి ఉందన్నారు. -
వీటితో ఆస్త్మాకు చెక్
లండన్ : పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకునేవారిలో ఆస్త్మా వ్యాధి దరిచేరదని, ఇప్పటికే ఆ వ్యాధి ఉన్నవారికి నియంత్రణలో ఉంటుందని తాజా అథ్యయనం పేర్కొంది. ఆరోగ్యకర ఆహారం తీసుకునే వారిలో ఊపిరితిత్తుల సమస్యలు అరుదుగా కనిపిస్తాయని వెల్లడించారు. పండ్లు, కూరగాయల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, వాపును తగ్గించే పదార్ధాలు ఉండటంతో సాధారణ శ్వాస సమస్యల నుంచి మనల్ని కాపాడతాయని అథ్యయనం తెలిపింది. మాంసాహారం, తీపిపదార్ధాలు, సాల్ట్ అధికంగా ఉండే పదార్ధాలను ఎక్కువగా తీసుకుంటే ఆస్త్మాను అదుపులో ఉంచడం కష్టమని పరిశోధకులు పేర్కొన్నారు. ఊపిరితిత్తుల లోపల వాపు ద్వారా వచ్చే ఆస్త్మాను పండ్లు, కూరగాయాలు, తృణధాన్యాల్లో ఉండే వాపును తగ్గించే పదార్ధాలు అడ్డుకుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆరోగ్యకర ఆహారం తీసుకునే పురుషుల్లో ఆస్త్మా లక్షణాలు 30 శాతం తక్కువగా ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. అథ్యయన వివరాలు యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. -
జంక్ఫుడ్ తింటున్నారా.. జర జాగ్రత్త
వాషింగ్టన్ : జంక్ఫుడ్ తినటం వల్ల బరువు పెరిగి.. తద్వారా గుండె సంబందిత జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువని అందరికి తెలిసే ఉంటుంది. జంక్ఫుడ్ తినటం వల్ల గుండె సంబంధ జబ్బులే కాకుండా ఆస్థమా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువని తాజా పరిశోధనలలో తేలింది. అమెరికాకు చెందిన గాంగ్ వాంగ్ అనే పరిశోధకుడు హ్యమ్బర్గర్, ఫాస్ట్ఫుడ్ వంటి పదార్థాల వల్ల పోలెన్ ఫీవర్, ఎక్సేమా, రైనో కంజెక్టివిటీస్ వంటి అలర్జీ సంబంధ రోగాలు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఫాస్ట్ఫుడ్ తినటం వల్ల ఊపిరితిత్తుల మీద ఒత్తిడి పెరిగి ఇతర రోగాలకు దారి తీస్తుందని ఆయన తేల్చి చెప్పారు. పిల్లలపై ప్రభావం.. పెద్దవారిలో కంటే పిల్లలపై జంక్ఫుడ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారంలో మూడు కంటే ఎక్కువసార్లు ఫాస్ట్ఫుడ్ తినే పిల్లలకు ఆస్థమా, ఎక్సేమా వచ్చే అవకాశాలు ఎక్కువ. జంక్ఫుడ్ కారణంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గి శరీరం తరచూ రోగాల బారిన పడుతుంది. చిన్న పిల్లలను పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. పెద్దలపై ప్రభావం.. జంక్ఫుడ్ తీసుకోవటం అన్నది పెద్దల విషయంలో ఓ ప్రాణాంతక అలవాటుగా పరిగణించవచ్చు. డయాబెటిస్, గుండె జబ్బులు వంటివే కాకుండా ఆస్థమా, ఇతర అలర్జీలకు తావిస్తుంది. ఆహార పదార్థాలు తీసుకునే విషయంలో సమతుల్యత పాటించకపోవటం వల్ల ఆస్థమా పెరిగే అవకాశాలు ఉంటాయని పరిశోధనలు తేటతెల్లం చేశాయి. -
ఉబ్బసం వ్యాధి నిర్ధారణకు తేలికైన పరీక్ష
ముక్కులో ఉండే ద్రవాలను పరీక్షించడం ద్వారా ఉబ్బసం వ్యాధిని నిర్ధారించేందుకు మౌంట్ సినాయి (అమెరికా) శాస్త్రవేత్తలు ఓ సులువైన పద్ధతిని ఆవిష్కరించారు. రైబో న్యూక్లియిక్ ఆసిడ్ నమూనాలను సేకరించడం ద్వారా ఈ పద్ధతి పనిచేస్తుంది. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో నిర్వహించే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్తో మాత్రమే ఈ వ్యాధిని నిర్ధారించే అవకాశముండగా.. కొత్త పద్ధతి ద్వారా ఎవరైనా ఈ పరీక్షలు పూర్తి చేయడమే కాకుండా... కచ్చితమైన ఫలితాలూ పొందవచ్చు. అంతేకాకుండా ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ద్వారా తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశాలూ ఉన్నాయి. మౌంట్ సినాయి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన పరీక్షను దాదాపు 190 మంది కార్యకర్తలపై ప్రయోగించి చూసినప్పుడు వారిలో 66 మందికి తక్కువస్థాయి నుంచి ఒక మోస్తరు స్థాయి ఉబ్బసం లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ముక్కులోని ద్రవాల ద్వారా సేకరించిన ఆర్ఎన్ఏలో ఉబ్బసం వ్యాధిగ్రస్తుల్లో మాత్రమే కనిపించే కొన్ని జన్యుపరమైన అంశాలను గుర్తించడం ద్వారా తాము వ్యాధి నిర్ధారణ చేశామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ సుపింద బున్యావానిచ్ తెలిపారు. వివరాలు సైంటిఫిక్ రిపోర్ట్స్’ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
ముగిసిన చేప ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు అందజేసే చేప ప్రసాదానికి ఈ సారి అనూహ్యమైన స్పందన కనిపించింది. కిందటే డాది కంటే భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. శుక్రవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రారంభించిన చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం శనివారంతో ముగిసింది. శనివారం ఉదయం 10 గంటల వరకు 75, 631 మందికి చేపప్రసాదం పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. మధ్యహ్నానికి ఈ సంఖ్య 80 వేలు దాటింది. 75 వేల మందికి పైగా చేప పిల్లల మందు పంపిణీ చేయగా, మరో 5 వేల మందికి బెల్లంలో కలిపి మందు ఇచ్చారు. చేప ప్రసాదం కోసం 1.32 లక్షల చేప పిల్లలను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. 34 కౌంటర్ల ద్వారా కూపన్లు అందజేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారని, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. చేప ప్రసాదం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సేవలందించిన స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను ఆయన అభినందించారు. ఉత్తరాది నుంచి భారీగా జనం చేప ప్రసాదంకోసం ఉత్తరాది రాష్ట్రాల నుంచి జనం భారీగా తరలి వచ్చారు. రాజస్తాన్, పంజాబ్, హరియాణా, జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిలీ తదితర రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో వచ్చారు. చేప ప్రసాదంపై హిందీ దిన పత్రికలు, చానళ్లలో వెలువడిన ప్రకటనలతో జనంలో బాగా స్పందన కనిపించింది. ఈ రెండు రోజుల్లో చేప ప్రసాదం తీసుకోలేకపోయినవారు దూద్బౌలీలోని బత్తిన హరినాథ్ గౌడ్ నివాసంలో కూడా పొందవచ్చు. -
ముగిసిన చేపమందు ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్ : నగరంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ ముగిసింది. శనివారం ఉదయం 9 గంటల వరకు దాదాపు 75,567 మందికి చేపమందు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. క్యూ లైన్లలో మరో ఐదు వందల మంది వరకు ఇంకా ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ క్యూ లైన్లో వేచి ఉన్న వారికి ప్రసాదం పంపిణీ చేయనున్నారు. మిగిలిన వారికి దూద్ బౌలిలోని తమ ఇంటి వద్ద పంపిణీ చేస్తామని బత్తిన కుటుంబ సభ్యులు చెప్పారు. పలు రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు తరలివచ్చారు. దాదాపుగా 1,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీ బిక్షం రెడ్డి మాట్లాడుతూ.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ ముగిసిందని తెలిపారు. ‘గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ మంది హజరయ్యారు. గత ఏడాది 59వేల మంది వస్తే.. ఈ ఏడాది దాదాపు 75వేల మంది వచ్చారు. అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పంపిణీ చేశాం. పోలీస్ సిబ్బందికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు దొరకని వారు బత్తిన కుటుంబ సభ్యుల ఇండ్ల వద్ద తీసుకోవచ్చు’ అని చెప్పారు. -
ప్రసాదం కోసం జన ప్రవాహం
సాక్షి, హైదరాబాద్: చేప ప్రసాదం కోసం ఆస్తమా బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బత్తిన కుటుంబసభ్యులు, బత్తిన హరినాథ్గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ చేశారు. ఉదయం 8.50 గంటలకు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్కు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చేప ప్రసాదం అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత నిర్వాహకులు 34 కౌంటర్ల ద్వారా కూపన్ల పంపిణీ చేపట్టారు. డిమాండ్కు తగినట్లుగా లక్షకుపైగా చేపపిల్లలను అందుబాటులో ఉంచారు. చేప ప్రసాదం కోసం వచ్చిన ఆస్తమా బాధితుల సంఖ్య 75 వేలు దాటిపోయింది. శనివారం మధ్యాహ్నం వరకు ఈ సంఖ్య లక్ష దాటే అవకాశమున్నట్లు నిర్వాహకులు అంచనా వేశారు. జనవిజ్ఞాన వేదిక, హేతువాదులు, వైద్యనిపుణులు కొంతకాలంగా చేపట్టిన ప్రచారం వల్ల మందు కోసం వచ్చే బాధితుల సంఖ్య గత రెండు మూడేళ్లుగా 50 వేల నుంచి లక్ష లోపే ఉన్నట్లు అంచనా. కానీ, ఈసారి అనూహ్యం గా ఆదరణ పెరిగింది. ఈ సారి తెలుగు రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాల నుంచే జనం భారీఎత్తున తరలివచ్చారు. శుక్రవారం రాత్రి వరకు ప్రసాదం తీసుకున్న 75 వేల మందిలో కనీసం 45 వేల మంది ఉత్తరాది వారేనని అధికారుల అంచనా. గతేడాది వయోధికులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో కనిపించగా, ఈసారి పిల్లల సంఖ్య ఎక్కువగా కనిపించింది. రాజస్తాన్కు చెందిన అస్తమా బాధితులు ఎక్కువ సంఖ్యలో కనిపించారు. దివ్యాంగులకు, వృద్ధులకు అదనపు కౌంటర్లు లేకపోవడంతోఇబ్బందులకు గురయ్యారు. బాధితులకు జీహెచ్ఎంసీ ఐదు రూపాయల భోజన కౌంటర్లను ఏర్పాటు చేసింది. స్వచ్ఛంద సంçస్థలు భోజనాన్ని అందజేశాయి. జలమండలి సుమారు 3 లక్షల నీటి ప్యాకెట్లను అందజేశారు. భారీగా స్తంభించిన ట్రాఫిక్.... చేపమందు కోసం జనం పెద్ద ఎత్తున తరలి రావడంతో వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్లో స్తంభించాయి. మొజంజాహీ మార్కెట్ నుంచి గాం«ధీభవన్ వరకు వాహనాల రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలిగింది, సరైన పార్కింగ్ సదుపాయం కల్పించకపోవడం వల్ల ఎగ్జిబిషన్గ్రౌండ్స్కు వచ్చిన వాహనాలన్నీ రోడ్లపైనే నిలిచిపోయాయి. -
చేప ప్రసాదంపై నమ్మకం పెరిగింది!
-
చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : ఆస్తమా బాధితులకు అందించే మూలిక ఔషధం చేప మందు పంపిణీ ప్రారంభమైంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో శుక్రవారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేపమందు పంపిణీని మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు మందు కోసం తరలివస్తున్నారు. ఇందుకు అనుగుణంగా టోకెన్లు, చేపల పంపిణీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మందు పంపిణీ కోసం 1.60 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచారు. ఆస్తమా బాధితుల కోసం బత్తిన సోదరులు 175 ఏళ్లుగా చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. చేప ప్రసాదం పంపిణీ శనివారం ఉదయం 9 గంటల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. 40 కేంద్రాల ద్వారా చేప మందు పంపిణీ కూపన్లు అందజేస్తున్నారు. కాగా, రెండు మొబైల్ కౌంటర్లు, మరో రెండు వీఐపీ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు, నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సహా నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు ఆర్టీసీ అదనంగా 133 బస్సులు నడుపుతుండటం గమనార్హం. చేప మందు కోసం వచ్చే వారి కోసం రూ.5 భోజన కేంద్రాలతోపాటు మంచి నీరు, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అన్ని రాష్ట్రాల నుంచి తరలివస్తున్నారు బత్తిన కుటుంబం 173 ఏండ్ల నుంచి చేప ప్రసాదాన్ని పంచుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో చేప ప్రసాదాన్ని తీసుకుంటున్నారు. ప్రజలకు చేప ప్రసాదంపై నమ్మకం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వర్షం ఇబ్బంది లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. అన్ని శాఖల అనుసంధానాన్ని చేసి పూర్తి జాగ్రత్తలను తీసుకున్నాం. ఎన్ని వేల మంది వచ్చినా ఇబ్బందులు ఉండవు. చేప ప్రసాదం పంపిణీ విషయంలో సీఎం కేసీఆర్ సైతం జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని మంత్రి తలసాని సూచించారు. -
నేడే చేప మందు పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఆస్తమా బాధితులకు అందించే మూలిక ఔషధం చేప మందు పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో శుక్రవారం ఉదయం నుంచి శనివారం వరకు జరగనున్న మందు పంపిణీకి 50వేల మందికి పైగా ఆస్తమా బాధితులు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా టోకెన్లు, చేపల పంపిణీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మందు పంపిణీ కోసం 1.32 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచారు. ఆస్తమా బాధితుల కోసం బత్తిన సోదరులు 175 ఏళ్లుగా చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు మందు కోసం తరలివస్తారు. 133 అదనపు బస్సులు 40 కేంద్రాల ద్వారా చేప మందు పంపిణీ కూపన్లు అందజేయనున్నారు. రెండు మొబైల్ కౌంటర్లు, మరో రెండు వీఐపీ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు, నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లు, శంషాబాద్ అంతర్జాతీయ విమా నాశ్రయం సహా నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు ఆర్టీసీ అదనంగా 133 బస్సులు నడపనుంది. అన్ని ప్రధాన కూడళ్లలో ఆర్టీసీ సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. బస్సులపై ‘ఫిష్ మెడిసిన్ స్పెషల్’అని తాత్కాలిక డెస్టినేషన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. భారీగా జనం తరలిరానున్న దృష్ట్యా 3 ప్రత్యేక వైద్య శిబిరాలు, 3 మొబైల్ వైద్య బృందాలను రంగంలోకి దించనున్నారు. 108, 104 వాహ నాలు సిద్ధంగా ఉంచారు. రూ.5 భోజన కేంద్రాలతోపాటు మంచి నీరు, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. 1,500 పోలీసులతో బందోబస్తు సుమారు 1,500 మంది పోలీసులు, ఇద్దరు అదనపు డీసీపీ స్థాయి అధికారులు, 8 మంది ఏసీపీలు, 22 మంది సీఐలతో భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన కేంద్రాల్లో 70 సీసీ కెమెరాలతో నిఘా ఉంచా రు. 4 ఫైర్ ఇంజన్లు, మరో 4 మొబైల్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లనూ అందుబాటులో ఉంచారు. 1,230 మంది పారిశుధ్య సిబ్బంది 2 రోజులు విధులు నిర్వహించనున్నారు. 100 టాయిలెట్లు, 100 మొబైల్ టాయిలెట్లు ఏర్పా టు చేశారు. 800 మంది వలంటీర్లు సేవలందించనున్నారు. హిందీ, ఉర్దూ, తెలుగు భాషల్లో సూచనలు చేసేందుకు యాంకర్లను నియమించారు. 3 లక్షల మంచినీటి ప్యాకెట్ల పంపిణీకి జలమండలి ఏర్పాట్లు చేసింది. ఉబ్బస వ్యాధిగ్రస్తులకు నియమాలు చేప ప్రసాదం తీసుకునే ఉబ్బస వ్యాధి గ్రస్తులు కొన్ని నియమాలు పాటించాలని బత్తిన సోదరులు సూచించారు. ప్రసాదం తీసుకునే ముందు 3 గంటలు, తీసుకున్న తరువాత గంటన్నర వరకు ఆహారం తీసుకోరాదు. ఇచ్చిన మందును 6 మాత్రలుగా చేసి నీడలో 7 రోజులు ఆరబెట్టాలి. వీటిని 3 పర్యాయాలుగా జూన్ 23, జూలై 8, 23 తేదీల్లో ఉదయం పరగడుపున ఒకటి, నిద్రబోయే మందు ఒకటి చొప్పున గోరు వెచ్చటి నీటితో వేసుకోవాలి. అలాగే వ్యాధిగ్రస్తులు 45 రోజులు పత్యము ఉండాలి. పత్యము ఉండే రోగులు పాత బియ్యం, గోధుమలు, చక్కెర, మేక మాంసం, చామ కూర, పాలకూర, పులిచింత కూర, పొట్లకాయ, చామగడ్డ, మామిడి వరుగు, కోయికూర, అల్లము, ఎల్లిగడ్డ, పసుపు, కందిపప్పు, కరడి ఆయిల్, మిరియాలు, మినప్పప్పు, మిరపపొడి, ఉప్పు, నెయ్యి (ఆవు), మోసంబీలు, అంజీర్ పండ్లు, ఆవు పాలతో చేసిన టీ, తెల్ల జొన్నలు, ఇడ్లీ (చట్నీ లేకుండా), బ్రెడ్ మాత్రమే తీసుకోవాలి. -
ఆస్తమా కౌన్సెలింగ్
తీవ్రమైన ఒత్తిడి వల్ల ఆస్తమా వస్తుందా? నేను ఒక మల్టీ నేషనల్ సంస్థలో పనిచేస్తున్నాను. నా మీద ఎప్పుడూ చాలా ఒత్తిళ్లు పనిచేస్తుంటాయి. ఈ ఒత్తిడి తీవ్రత ఎక్కువైనప్పుడల్లా ఆస్తమా రావడం గమనిస్తున్నాను. ఒత్తిడికీ, ఆస్తమాకూ సంబంధం ఉందా? దీన్ని తగ్గించుకోవడం ఎలా? – వి. సురేశ్, గచ్చిబౌలి మన వాయునాళాలు వాపునకు (ఇన్ఫ్లమేషన్కు) గురైనప్పుడు సన్నబారిపోవడంతో శ్వాసతీసుకోవడం కష్టమయ్యే లక్షణాంతో ఆస్తమా కనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపించకుండా ఉండాలంటే ఆస్తమా వచ్చినప్పుడైతే తక్షణం వాయునాళాలను విస్తరింపజేసే మందులువాడాలి. అదే రాకముందైతే... ఆస్తమాను రాకుండా నివారించే ప్రివెంటివ్ మందులు వాడాలి. ఒత్తిడికీ, ఆస్తమాకూ ఏదైనా సంబంధం ఉందా... అనే అంశం ఎప్పుడూ చర్చనీయాంశమే. ఆస్తమా లేనివారిలో ఒత్తిడి అనేది కొత్తగా ఆస్తమానేమీ కలిగించదు. కానీ ఆస్తమా ఉన్నవారిలో మాత్రం.. వారి పరిస్థితిని ఒత్తిడి మరింత దిగజారుస్తుంది. తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొనేవారిలో ఆస్తమా అటాక్స్ చాలా తరచూ వస్తుంటాయి. మిగతావారితో పోలిస్తే మరింత ఎక్కువగానూ వస్తాయి. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఆస్తమా లక్షణాలు కనిపించడాన్ని పరిశోధకులు చాలా సందర్భాల్లో నమోదు చేశారు. ఉదాహరణకు పిల్లల్లోనైతే స్కూలు పరీక్షలు, ఎక్కడైనా నలుగురిలో మాట్లాడాల్సి రావడం, పెద్దల్లో కుటుంబంలో విభేదాలు, విపత్తులు, హింసకు గురికావడం వంటి సంఘటనల్లో ఒత్తిడి పెరిగితే అది ఆస్తమా ఉన్నవారి జీవితాన్ని మరింత దుర్భరం చేస్తుంది. మొదట ఒత్తిడి అనేది యాంగై్జటీని పెంచి అటాక్ వచ్చేందుకు అనువైన పరిస్థితులను కల్పిస్తుంది. అంటే ఆస్తమా అటాక్ను ప్రేరేపించే హిస్టమైన్, ల్యూకోట్రైన్ వంటి రసాయనాలను విడుదలయ్యేలా పరిస్థితులు నెలకొంటాయి. దాంతో వాయునాళాలు సన్నబారిపోతాయి. మిగతావారితో పోలిస్తే ఒత్తిడితో బాధపడేవారిలో ఆస్తమా ఉన్నప్పుడు పరిస్థితిని నియంత్రించడం ఒకింత కష్టమవుతుంది. మరి ఒత్తిడినీ, ఆస్తమానూ అరికట్టడం ఎలాగంటే... ♦ మీకు ఒత్తిడి కలిగిస్తున్న అంశాలేవో మొదట తెలుసుకోండి. ఉదాహరణకు ఆర్థిక సమస్యలా, కుటుంబ సభ్యులతో విభేదాలా, జీవితంలో ఎవరూ సహాయసహకారాలు అందించకపోవడం, ఎప్పుడూ పనిలోనే ఉండాల్సి రావడం లేదా నిత్యం డెడ్లైన్స్తో సతమతమవుతుండటమా అని గుర్తించండి. ఒకసారి సమస్యను గుర్తించాక... దాన్ని ఎదుర్కోవడం మీతోనే సాధ్యమవుతుందా, లేదా ఎవరైనా వృత్తినిపుణుల సహాయం అవసరమా అని తెలుసుకొని, ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించండి. ♦ అన్ని పనులూ మీరే పూర్తి చేయాలని అనుకోకండి. పనుల జాబితా రూపొందించి, ఎవరు చేయదగ్గపనుల్ని వారికి అప్పగించండి. ఉదాహరణకు డెడ్లైన్ అనేది మీ ఒక్కరికే కాదు.. మీ బృందంలో పనిచేస్తున్నవారందరికీ వర్తిస్తుందనీ, అందరికోసం అందరమూ పనిచేయాలంటూ స్పష్టంగా చెప్పి, పనులను పంచండి. ఇలా వర్క్ప్లేస్ స్ట్రాటజీలను అమలు చేసుకోండి. ♦ మీకు అలసట కలిగించని వ్యాయామాన్ని నిత్యం చేయండి. ♦ కంటినిండా హాయిగా నిద్రపోండి. ♦ శ్వాసవ్యాయామాలు (బ్రీతింగ్ ఎక్సర్సైజెస్), ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ విధానాల వంటివి పాటించండి. యోగా, ధ్యానం వంటివీ ప్రాక్టీస్ చేయండి. ♦ అటాక్ వచ్చినప్పుడు వాడే మందులు, అటాక్ రాకుండా నివారించే మందులు ఎప్పుడూ దగ్గర ఉంచుకోండి. ♦ ఒత్తిడితో కూడిన అటాక్ వచ్చినప్పుడు 5 – 10 నిమిషాల్లో మీరు నార్మల్ స్థితికి రాకపోతే 15వ నిమిషం తర్వాత తప్పక వైద్యుల సహాయం తీసుకోండి. గర్భవతికి ఆస్తమా ఉంటే..? మా అమ్మాయి ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. ఆమెకు ఆస్తమా ఉంది. ఆమె తన ఆస్తమాను నియంత్రణలో ఉంచుకోవడం ఎలా? ఈ గర్భధారణ సమయంలో ఆమె తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – కె. రామలక్ష్మి, ఒంగోలు గర్భవతిగా ఉన్న సమయంలో ఆస్తమాను నియంత్రణలో ఉంచుకోవడం అన్నది కాబోయే తల్లికీ, కడుపులోని బిడ్డకూ చాలా అవసరం. ఇప్పుడు గర్భవతిగా ఉన్న సమయంలోనూ ఆస్తమాను నియంత్రణలో ఉంచే మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. గర్భంతో ఉన్న సమయంలో అటాక్ రాకుండా ఉండేలా మందులు వాడటం / వచ్చినప్పుడూ వాడటంతో పాటు... ఆ మందుల దుష్ప్రభావాలు గర్భంలోని పిండం మీద పడకుండా చూసుకోవడం... అన్న సమన్వయాన్ని పాటించడం చాలా ముఖ్యం. ఆస్తమా ఉన్న మహిళలు గర్భవతులుగా ఉన్నప్పుడు దాదాపు 20 శాతం మందిలో ఆయాసం వచ్చి, దాన్ని తగ్గించే మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మరో 6 శాతం మందిలో హాస్పిటల్లో చేర్చి, చికిత్స అందించాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందుకే గర్భవతిగా ఉన్న సమయంలో ఆస్తమా సమస్య ఉన్నవారు, దాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఒకవేళ ఆస్తమా అదుపులో లేకపోతే అకస్మాత్తుగా రక్తపోటు చాలా ఎక్కువగా పెరగడం (ప్రీ–అక్లాంప్సియా), నెలల పూర్తిగా నిండకముందే ప్రసవం కావడం (ప్రీ–టర్మ్ బేబీ), పుట్టిన బిడ్డ చాలా తక్కువ బరువుతో ఉండటం లేదా మృతశిశువు జన్మించడం వంటి అనర్థాలు సంభవించవచ్చు. అందువల్ల గర్భిణుల్లో ఆస్తమాను అదుపులో ఉంచుకోవడం చాలా ప్రధానం. ఎందుకంటే పుట్టబోయే బిడ్డకు ఎంత ఎక్కువగా ఆక్సిజన్ సరఫరా ఉంటే, పుట్టాక ఆ బిడ్డ మానసిక, శారీరక వికాసాలు అంత బాగుంటాయి. బిడ్డ జీవన నాణ్యతకూడా బాగా ఉంటుంది. సాధారణంగా ఆస్తమా అటాక్ వచ్చినప్పుడు ఇచ్చే మందులు... గర్భవతులకైనా, సాధారణ మహిళలకైనా దాదాపుగా ఒకేలా ఉంటాయి. గర్భవతులైన ఆస్తమా సమస్య ఉన్న మహిళలకు కొన్ని సూచనలు... ♦ గర్భవతులైన మహిళల్లో ప్రతి 4 లేదా 6 వారాలకు ఒకసారి వారి శ్వాస తీసుకునే తీరు ఎలా ఉందో పరీక్షించేందుకు పీక్ ఎక్స్పిరేటరీ ఫ్లో పరీక్ష చేయిస్తూ ఉండటం మంచిది. ఆస్తమా అటాక్ రాకుండా ఉండేందుకు వాడే ప్రివెంటార్ ఇన్హేలర్స్ తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. అవి పిండంపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపవనే అంశాన్ని గుర్తెరిగి, వాటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ♦ గర్భతుల్లో అటాక్ వచ్చి ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యం తగ్గితే... పిండానికీ ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. అది ఎంతమాత్రమూ సరికాదు. అందుకే ఏ చిన్న అటాక్ లక్షణాలు కనిపించినా వెంటనే ఆ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవాలి. అప్పుడు వెంటనే హాస్పిటల్కు రావడం మంచిది. ♦ ఆస్తమాను ప్రేరేపించే అంశాలు (ట్రిగర్ ఫ్యాక్టర్స్)కు దూరంగా ఉండాలి. తమకు సరిపడని వాటిని గుర్తించి, గర్భవతిగా ఉన్న సమయంలో వాటి దరిదాపుల్లోకి కూడా వెళ్లకుండా ఉండాలి. ఇక ప్రసవం విషయానికి వస్తే... చాలా తీవ్రమైన ఆస్తమా ఉన్నవారిని మినహాయించి మిగతా వారందరిలోనూ దాదాపుగా ప్రసవం సాధారణంగానే అవుతుంది. ప్రసవ సమయంలో ఆస్తమా రావడం చాలా చాలా అసాధారణం కాబట్టి దాని గురించి దిగులు పడాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. - డాక్టర్ రమణ ప్రసాద్, కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
బాబుకు ఆస్తమా తగ్గుతుందా?
ఆస్తమా కౌన్సెలింగ్ మా బాబుకు ఐదేళ్లు. వాడికి తరచూ ఆస్తమా వస్తూ ఉంటుంది. డాక్టర్ను సంప్రదిస్తే కొన్ని మందులు ఇచ్చారు. మాది చాలా రూరల్ ఏరియా. మా బాబుకు ఆస్తమా తగ్గుతుందా? దయచేసి వివరించండి. – నిహారిక, తల్లాడ చిన్నపిల్లల్లో ఆస్తమా వస్తే వారు పెరిగే కొద్దీ... అంటే టీన్స్లోకి ప్రవేశిస్తున్నప్పుడు లేదా యుక్తవయస్కులుగా మారుతున్నప్పుడు ఆ ఆస్తమా లక్షణాలు క్రమంగా తగ్గిపోవచ్చు. అయితే కొంతమందిలో కొన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆ లక్షణాలు కొంతకాలం తర్వాత మళ్లీ కనిపించవచ్చు. చిన్నప్పుడు మరీ తీవ్రమైన ఆస్తమా వస్తే అది పెద్దయ్యాక కూడా తగ్గకపోవచ్చు. అయితే మీవాడి తీవ్రత తక్కువే అని మీ లేఖను బట్టి తెలుస్తోంది కాబట్టి అది తగ్గే అవకాశమే ఉంది. బాధపడకండి. మీ బాబు ఆస్తమాకు రెండు రకాల చికిత్స అవసరమవుతుంది. అది... ∙దీర్ఘకాలంలో మళ్లీ రాకుండా నివారించేందుకు అవసరమైన ప్రివెంటివ్ చికిత్స. ఇందులో భాగంగా ఇచ్చే ఇన్హేలర్ను ప్రతిరోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ∙తక్షణ ఉపశమనం కోసం తీసుకోవాల్సిన చికిత్స. ఆస్తమా వచ్చినప్పుడు వాయునాళాల వాపు తగ్గించి, హాయిగా శ్వాస తీసుకోవడాని దోహదపడేందుకు ఉపయోగించే మందులు దీనికోసం వాడాల్సి ఉంటుంది. వీటినే రెస్క్యూ మెడికేషన్ అనీ, క్విక్ రిలీఫ్ మెడికేషన్ అని కూడా అంటారు. ఇది ఆస్తమా అటాక్ ఉన్నప్పుడు చేసే స్వల్పకాలిక చికిత్స. కొందరు పిల్లల్లో ఆటలు లేదా వ్యాయామానికి ముందు కూడా ఈ చికిత్సను డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. మీ బాబు వయసు ఐదేళ్లు కాబట్టి ఇలాంటి పిల్లల్లో స్పేసర్తో ఇన్హేలర్ ఉపయోగించాలి. మీరు మీకు దగ్గర్లోని పెద్దసెంటర్లో ఉన్న నిపుణులను సంప్రదించండి. పిల్లల్లోని ఆస్తమాకు డాక్టర్లు సూచించినట్లు మందులు వాడితే ఇప్పుడు చాలామందిలో అది పెద్దయ్యేనాటికి తప్పక తగ్గుతుంది. చలవ పదార్థాలతో ఆస్తమా వస్తుందా? నా వయసు 37 ఏళ్లు. నాకు చాలాకాలంగా ఆస్తమా ఉంది. అయితే కొందరు చల్లటి పదార్థాలు తినకూడదు, చలవ పదార్థాల వల్ల ఆస్తమా వస్తుందని అంటున్నారు. నిజమేనా? – ఆర్. రామచంద్రరావు, కాకినాడ సాధారణంగా ఆస్తమాను చాలా అంశాలు ప్రేరేపిస్తుంటాయి. నిర్దిష్టంగా ఏ పదార్థం ఆస్తమాను ప్రేరేపిస్తుందో దాన్ని అలర్జెన్ అంటారు. అదే పదార్థం అందరిలోనూ అదేవిధంగా ఆస్తమాను కలిగించదు. అలెర్జన్లు వ్యక్తి నుంచి వ్యక్తికి మారతాయి. కొందరిలో పుప్పొడి, మరికొందరిలో దుమ్ము, ధూళి, ఇంకొందరిలో పొగ... ఇలా రకరకాల పదార్థాలు ఆస్తమాకు కారణం కావచ్చు. అయితే చాలామందిలో ఏదో ఒక తినే పదార్థం సరిపడక ఆస్తమా రావచ్చు. ఉదాహరణకు... కొందరిలో సముద్రపు ఆహారం (సీఫుడ్స్), కొన్ని రకాల నట్స్, పల్లీలు, పులుపు ఎక్కువగా ఉండే పండ్లు, పులుసుకూరలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు, ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి వాడే ప్రిజర్వేటివ్స్ కలిపిన ఆహారాలు, నెయ్యికి బదులుగా మార్జరిన్ వంటి నూనెలు ఉపయోగించిన నిల్వసరుకులతో ఆస్తమా రావచ్చు. ఇలా సరిపడని ఆహారం వల్ల ఆస్తమా వచ్చే సందర్భాల్లో అసలు రోగికి సరిపడని ఆహారం ఏదో గుర్తించి దాన్ని మాత్రమే నివారించాలి. అది మినహా వ్యాధి తగ్గడానికి, రోగనిరోధక శక్తి పెంపొందడానికి విటమిన్లు, ఖనిజలవణాలు, పోషకాలు పుష్కలంగా ఉన్న మిగతా ఆహారాలన్నింటినీ యథావిధిగా తీసుకోవచ్చు. ఆకకూరలు, ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే మంచినీటి చేపలు అలర్జీలను కలిగించవు. ఇలా సరిపడని ఆహారం మినహా ఆరోగ్యకరమైన అన్ని రకాల ఆహారాలూ తీసుకోవచ్చు. అంతేగానీ... ఫలానా చలవచేసే ఆహారాలే ఆస్తమాను తీసుకొస్తాయన్నది సరికాదు. ఎందుకంటే చలవగా భావించే చాలా పదార్థాలు ఆస్తమా ఉన్నవారికీ ఒకవేళ సరిపడితే... అవి రోగికి ఆస్తమాను ఎంతమాత్రమూ ప్రేరేపించలేవు. స్వీయ ప్రయత్నం మీద తమకు ఏ పదార్థం సరిపడటం లేదో రోగి గుర్తించి, దానికి మాత్రమే దూరంగా ఉంటే చాలు. ఈసీజన్లో నా ఆయాసానికి కారణం ఆస్తమాయేనా? నా వయసు 69 ఏళ్లు. గతంలో ఆస్తమా ఉంది. కానీ వేసవిలో ఎప్పుడూ వచ్చేది కాదు. అయితే ఇటీవల ఇంత వేసవి తీవ్రతలోనూ బాగా ఆయాసపడ్డాను. ఇది నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. నేను కాస్త లావుగానే ఉంటాను. నా స్థూలకాయం వల్లనే ఇలా జరిగిందా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – ఎమ్. సుదర్శన్రావు, భీమవరం స్థూలకాయం నేరుగా ఆçస్తమాను కలగజేయదు. కానీ ఒక్కోసారి స్థూలకాయం వల్ల వచ్చిన ఒళ్లు కారణంగా మనిషి ఆయాసపడుతున్నట్లు కనిపించడం సాధారణం. ఇందువల్ల స్థూలకాయం ఆస్తమాను ప్రేరేపిస్తుందనే అపోహ కొందరిలో ఉంటుంది. అయితే పూర్తిగా ఇది వాస్తవం కాకపోయినా... స్థూలకాయం ఉండటం వల్ల శరీరంలోని జీవప్రక్రియల్లో జరిగే ఆక్సిడేషన్ స్ట్రెస్, ప్రాంతంలోని గాలిగొట్టాలు సన్నబారడం, స్థూలకాయం కారణంగా స్లీప్ఆప్నియా (గురక) వచ్చి ఊపిరి అందకపోవడం వంటి పరోక్ష కారణాల వల్ల కూడా ఒక్కోసారి ఆయాసం రావచ్చు. మీ వయసు వారిలో ఇటీవల ఆస్తమా కేసులు పెరుగుతున్నాయి. దాంతో పాటు ఆ వయసులో ఆస్తమా రావడం వల్ల శారీరకంగా తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడి అవి ఒక్కోసారి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. వృద్ధాప్యంలో వచ్చిన శారీరక మార్పుల వల్ల మన రోగనిరోధకశక్తి స్పందించే తీరు మారుతుంది. ఈ మార్పు కారణంగా ఏవైనా యాంటిజెన్స్కు (సరిపడని పదార్థాల కారణంగా శరీరంలో ఉత్పత్తి అయ్యే ద్రవాలు లేదా పదార్థాలు), ఇరిటెంట్స్ (శరీరాన్ని చికాకు పరిచే జీవపదార్థాల)కూ శరీరం అతిగా స్పందించడం వల్ల కూడా ఆస్తమా రావచ్చు. మీరు ఒకసారి వైద్యనిపుణులను కలిసి ఏ కారణం వల్ల ఆయాసం వచ్చిందో పరీక్షించుకోండి. వైద్యపరీక్షల్లో వచ్చిన ఫలితాలను బట్టి డాక్టర్లు మీకు చికిత్స సూచిస్తారు. డాక్టర్ ఎ. జయచంద్ర సీనియర్ ఇంటర్వెన్షనల్, పల్మునాలజిస్ట్, సెంచరీ హాస్పిటల్స్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
వాహనాలు ఉన్న చోట పిల్లల్లో ఉబ్బసం
వాహనాల పొగకు పిల్లలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మోటారు వాహనాల కారణంగా తలెత్తే వాయు కాలుష్యం కారణంగా చిన్నారులు ఉబ్బసం బారిన పడుతున్నారు. వాహనాల నుంచి వెలువడే నానా వాయువుల్లో ముఖ్యంగా నైట్రోజన్ ఆక్సైడ్ ప్రభావం వల్ల చిన్నారులు ఉబ్బసం బారిన పడుతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్పోర్ట్ స్టడీస్ శాస్త్రవేత్తలు ఇంగ్ల్లండ్లోని బ్రాడ్ఫోర్డ్ ప్రాంతాన్ని నమూనాగా తీసుకుని చేపట్టిన తాజా అధ్యయనంలో తేలింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే ఎక్కువ మంది చిన్నారులు ఉబ్బసంతో బాధపడుతున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని లీడ్స్ వర్సిటీ నిపుణుడు డాక్టర్ హనీన్ ఖ్రీస్ తెలిపారు. వాహనాల కాలుష్యాన్ని అదుపు చేయగలిగితే, ఉబ్బసంతో బాధపడే చిన్నారుల సంఖ్యను చాలావరకు తగ్గించవచ్చని వెల్లడించారు. తమ అధ్యయనానికి బ్రాడ్ఫోర్డ్ను నమూనాగా తీసుకున్నా, ప్రపంచవ్యాప్తంగా వాహన కాలుష్యం ప్రభావం దాదాపు ఒకేవిధంగా ఉంటుందని డాక్టర్ ఖ్రీస్ వివరించారు. -
పరి పరిశోధన
ఉబ్బసం ఇబ్బందికి కారణం తెలిసింది... ఉబ్బసం సమస్య మొదలైనప్పుడు ఊపిరితిత్తుల్లోని గాలితిత్తులు ఎందుకు మూసుకుపోతాయో శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. దీంతో ఉబ్బస వ్యాధి చికిత్సకు మరింత మెరుగైన మందులు తయారు చేయడం వీలవుతుందని అంచనా. హ్యూస్టన్ మెథాడిస్ట్కు చెందిన శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇలా గాలితిత్తులు మూసుకుపోయేందుకు కేవలం రెండే రెండు పరమాణువులు కారణం. ఈ రెండింటినీ నియంత్రించగలిగితే ఉబ్బసం తీవ్రమైనప్పుడు ఊపిరి తీసుకునేందుకు విపరీతమైన ఇబ్బంది పడటం ఉండదు. గాలితిత్తుల ద్వారా ఒక రకమైన ప్రొటీన్ ఉత్పత్తి ఎక్కువగా జరగడం.. ఈ ప్రొటీన్ జిగురుగా ఉంటుందన్నది తెలిసిందే. ఊపిరితిత్తుల లోపలిగోడల్లో ఉండే కొన్ని ప్రత్యేక కణాలు గాలితిత్తులు ఆరోగ్యంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలోనే అవి జిగురులాంటి మ్యూసిన్ను ఉత్పత్తి చేస్తాయి. అయితే రోగ నిరోధక వ్యవస్థకు చెందిన కొన్ని కణాలు ఊపిరితిత్తులు విడుదల చేసే ఓఎక్స్40 అనే రసాయనం కారణంగా మ్యూసిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. మాయన్ల మహా నగరం బయటపడింది... సింధు నాగరికత గుర్తుంది కదా.. దక్షిణ అమెరికాలోనూ అచ్చం ఇలాంటిదే ఒక నాగరికత వేల ఏళ్ల క్రితం అకస్మాత్తుగా మాయమైపోయింది. అడపాదడపా ఒకట్రెండు నిర్మాణాలు, అవశేషాలు దొరికినప్పటికీ ఈ మాయన్ నాగరికత మర్మమేమిటో మాత్రం పూర్తిగా తెలియరాలేదు. ఇక ఈ సమస్యకు ఓ పరిష్కారం చిక్కినట్లే. ఎందుకంటారా? ఈ మధ్యే.. మాయన్లకు సంబంధించి గ్వాటమాలా వద్ద అత్యంత కీలకమైన ఆవిష్కరణ ఒకటి జరిగింది. అత్యాధునిక లిడార్ టెక్నాలజీ సాయంతో అమెజాన్ అటవీ ప్రాంతంలో భూగర్భంలో దాక్కున్న భారీ కట్టడాలను, మానవ ఆవాసాలను పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. తాము మొత్తం 2,100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వైమానిక సర్వే లాంటిది చేశామని, క్రీస్తుపూర్వం వెయ్యి నుంచి 900 ఏళ్ల కాలం నాటి మాయన్ల నాగరకతకు చెందిన మహా నగరం లభించింది. ఇది ఎంత పెద్దది అంటే.. సుమారు కోటిమంది నివసరించిన నగరం అని అంచనా వేస్తున్నారు. మునుపటి అంచనాల కంటే చాలా ఎక్కువగా మాయన్లు అటవీభూమిని వ్యవసాయం కోసం చదును చేశారని, సాగునీరు కోసం కాలువల వంటి ఏర్పాట్లు విస్తృతంగా వాడారని టులాన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు. జాబిల్లిపై రెండు లక్షల టన్నుల చెత్త! భూమ్మీద ఇప్పటికే చెత్త సమస్యను సృష్టించుకున్న మనిషి జాబిల్లిని కూడా వదల్లేదు. ఎప్పుడో భవిష్యత్తులో చంద్రుడిపై ఆవాసం ఏర్పాటు చేసుకుంటామని నాసా చెబుతోంది కానీ.. ఇప్పటికే అక్కడ కూడా బోలెడంత చెత్త పేరుకుపోయిందట. నాసా అంచనాల ప్రకారం.. ఇప్పటివరకూ జాబిల్లిపైకి వెళ్లిన ఉపగ్రహాలు, మానవ ప్రయాణాలను కలిపి చూస్తే మొత్తం రెండు లక్షల టన్నుల చెత్త అక్కడ ఉంది. జాబిల్లిపైకి వెళ్లేందుకు వాడిన రాకెట్లు, ఉపగ్రహాల్లో అత్యధిక భాగాన్ని అక్కడే వదిలి వేయడం వల్ల ఈ సమస్య వస్తోన్నట్లు అంచనా. వ్యోమగాములను భూమ్మీదకు తిరిగి తీసుకొచ్చేందుకు ఇది చౌకైన మార్గమని ఇప్పటివరకూ శాస్త్రవేత్తలు అనుకునేవారు. జాబిల్లిపై తిరిగేందుకు ఉపయోగించిన మూన్ల్యాండర్లు, ఇతర ఉపగ్రహ విడిభాగాలు, మానవ వ్యర్థాలతోపాటు అపోలో 15 వ్యోమగాములు వదిలిన అల్యూమినియంతో చేసిన జ్ఞాపికల వంటివన్నీ ఇక్కడే ఉండిపోయాయి. అప్పట్లో జాబిల్లిపై చేరిన వ్యోమగాములు అక్కడ గోల్ఫ్ ఆడారు. ఆ తరువాత గోల్ఫ్ బంతులతోపాటు ఇతర సామగ్రిని కూడా అక్కడే వదిలేశారు. భూమి చుట్టూ అంతరిక్షంలో పేరుకుపోయిన ఎలక్ట్రానిక్ చెత్తకు జాబిల్లి ఉపరితలంపై ఉన్న చెత్త అదనం అన్నమాట! -
ఊపిరితో వ్యాయామం...ఉబ్బసానికి ఉపశమనం
ఉబ్బస వ్యాధితో సతమతమయ్యేవారికి ఊపిరితో చేసే వ్యాయామం ఎంతో మేలు చేస్తుందని ఓ అధ్యయనం ద్వారా తేల్చారు శాస్త్రవేత్తలు. లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నా.. సమస్యలు ఎదుర్కొనే వారికి బ్రీతింగ్ ఎక్సర్సైజులు మేలు చేస్తాయి. కొన్ని వందల మంది కార్యకర్తలను మూడు గ్రూపులుగా విభజించి కొందరికి డీవీడీ ద్వారా ఇంకొందరికి ఫిజియోథెపరిస్టు ద్వారా బ్రీతింగ్ ఎక్సర్సైజుల్లో శిక్షణ ఇచ్చారు. మూడో గ్రూపుకు సాధారణ చికిత్స కొనసాగించారు. దాదాపు పన్నెండు నెలల తరువాత వీరందరి దైనందిన జీవితంలో ఉబ్బసం వల్ల కలిగిన ఇబ్బందులు ఎలా ఉన్నాయి? అని ఒక పద్ధతి ప్రకారం లెక్కకట్టారు. మందులు మాత్రమే తీసుకుంటున్న వారితో పోలిస్తే వ్యాయామం చేసే వారి ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడిందని, గాలిగొట్టాల్లో ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిందని తెలిసింది. ఉబ్బసం అటాక్లు కూడా వ్యాయామం చేసే వారిలో తగ్గినట్లు తాము గుర్తించామని కాకపోతే ఇవి లెక్క కట్టే స్థాయిలో లేవని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైవెల్ విలియమ్స్ తెలిపారు. యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వ ఆరోగ్యసేవల సంస్థ చేపట్టిన ఈ స్టడీ వల్ల ఉబ్బస వ్యాధిగ్రస్థుల జీవితంలో ఒకంత మెరుగుదల కనిపించడం మాత్రమే కాకుండా, ప్రభుత్వాలు చికిత్సకు పెట్టాల్సిన ఖర్చులూ తగ్గుతాయని అంచనా. -
చేపలతో పుట్టబోయే బిడ్డకు ఆస్తమా దూరం!
మీరిప్పుడు గర్భవతా, త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారా? అయితే మీరు తీసుకునే ఆహారంలో పుష్కలంగా చేపలకూర ఉండేలా చూసుకోండి. గర్భవతులుగా ఉన్నప్పుడు చేపలు ఎక్కువగా తినేవారికి కలిగే సంతానానికి ఆస్తమా వచ్చే అవకాశాలు తక్కువ అంటున్నారు పరిశోధకులు. వారి సిఫార్సుల మేరకు గర్భవతులు వారంలో కనీసం 250 గ్రాముల నుంచి 340 గ్రామల వరకు చేపలు తినాలి. వారంలో మూడు లేదా నాలుగు సార్లు చేపలు తినడం కూడా మంచిదే. అనేక కీలక సంస్థల్లోని డాక్టర్లు, అధ్యయనవేత్తల పరిశోధనల ఫలితాలను పొందుపరిచిన ‘ద జర్నల్ ఆఫ్ అలర్జీ అండ్ క్లినికల్ ఇమ్యునాలజీ’ మ్యాగజైన్లో నమోదు చేసిన వివరాల ప్రకారం గర్భవతులుగా ఉన్నప్పుడు ఆహారంలో విరివిగా చేపలు తినేవారి పిల్లల్లో ఆస్తమా వచ్చే అవకాశాలు తక్కువని తేలింది. అమెరికన్ అత్తున్నత ఔషధాల అనుమతి సంస్థ ‘ద ఫుడ్ అండ్ గ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ కూడా గర్భవతులు చేపలు తినడం మంచిదని సిఫార్సు చేస్తోంది. -
ఇంతింత కాదయా...ఇంటి కాలుష్యం
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో, పనిచేసే చోట ఘాటైన వాసనలను పీల్చడం.. పెంపుడు జంతువుల వెంట్రుకలు.. దుప్పట్లు, దిండ్లపై ఉండే దుమ్ము.. మస్కిటో కాయిల్స్, సువాసన కోసం వాడే పెర్ఫ్యూమ్లు, పుప్పొడి రేణువులు, ధూమపానం.. అంతర్గత కాలుష్యానికి ఇవే ప్రధాన కారణాలట. ఆస్ప్రిన్, బీటాబ్లాకర్స్ వంటి మందులు వాడటం.. బొద్దింకలు, ఎలుకల మలమూత్రాల నుంచి వెలువడే రసాయనాలు కూడా అంతర్గత కాలుష్యానికి కారణమవుతున్నాయట. పారిశ్రామిక, వాహన కాలుష్యంతో పోలిస్తే.. ఇంట్లో వెలువడే కాలుష్యమే శ్వాసనాళాలపై ఎక్కువ ప్రభావం చూపుతోందని ఆసియా పసిఫిక్ ఆస్తమా ఇన్సైట్ అండ్ మేనేజ్మెంట్ (ఇండియా) సంస్థ నిర్వహించిన తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఈ సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా అహ్మదాబాద్, నాగపూర్, ముంబై, చండీఘర్, సిమ్లా, గువాహటి, కోల్కతా, మైసూర్, తిరువనంతపురం, చెన్నై, సికింద్రాబాద్ తదితర నగరాల్లో శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న రోగులపై సర్వే నిర్వహించింది. 85 వేల మంది పురుషులు, 85 వేల మంది మహిళలపై ఈ సర్వే చేసింది. ఇతర నగరాలతో పోలిస్తే గ్రేటర్లోనే శ్వాస సంబంధ బాధితులు ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వే పేర్కొంది. నగరంలో ఇప్పటికే పెద్దల్లో 5–8 శాతం మంది శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతుంటే.. చిన్నారుల్లో 10–12 శాతం మంది ఇబ్బందులు పడుతున్నారని వెల్లడైంది. అంతర్గత కాలుష్యానికి ప్రస్తుతం వీస్తున్న చలిగాలులు తోడవడంతో ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తెలిపింది. వీటితోనూ ముక్కుకు ముప్పే.. గ్రేటర్లో 15 ఏళ్ల క్రితం 11 లక్షల వాహనాలు ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 50 లక్షలకు చేరింది. ఇందులో పదిహేనేళ్ల సర్వీసు దాటిన వాహనాలు ఐదు నుంచి పది లక్షలు ఉన్నాయి. వీటికి తోడు మరో 40 వేల పరిశ్రమలు కూడా ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల ఓజోన్ లెవల్స్ ఫర్ క్యూబిక్ మీటర్ గాలిలో 130–150 మైక్రో గ్రాములకుపైగా నమోదవుతోంది. సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియం, కార్బోమోనాక్సైడ్ వంటి రసాయనాలు సైతం శ్వాసనాళాల పనితీరును దెబ్బతీస్తున్నాయి. ఒక కాయిల్.. 90 సిగరెట్లతో సమానం.. దోమల నుంచి రక్షణ కోసం చాలామంది మస్కిటో కాయిల్స్ వాడుతున్నారు. ఒక మస్కిటో కాయిల్ 90 సిగరెట్లు వెదజల్లే పొల్యూషన్తో సమానం. ఈ గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరడంతో శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో పాటు కంటిచూపు మందగిస్తుంది. ఊపిరితిత్తుల జీవితకాలం కూడా తగ్గుతుంది. మస్కిటో కాయిల్స్కు బదులు ఫ్యాన్ వాడటం ఉత్తమం. – డాక్టర్ పి.సుదర్శన్రెడ్డి, చిన్నపిల్లల వైద్యనిపుణుడు ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి.. సువాసన కోసం వాడే కొన్ని రకాల పెర్ఫ్యూమ్లు, మస్కిటో కాయిల్స్ ఘాటైన వాసన వెదజల్లుతాయి. ఇవి శ్వాస నాళాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. సాధ్యమైనంత వరకు తక్కువ ఘాటు ఉన్న పెర్ఫ్యూమ్లనే వాడాలి. కుక్కలు, పిల్లులు, ఇతర పెంపుడు జంతువులను ఇంటి బయటే ఉండేలా చూసుకోవాలి. కార్పెట్లు, పరుపులు, దిండ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఐస్క్రీమ్లు, శీతల పానీయాలు, కూలర్, ఏసీ, సిగరెట్, సిమెంట్, ఫ్లెక్సీ ప్రింటర్ల నుంచి వెలువడే వాసనలకు దూరంగా ఉండటం వల్ల శ్వాస సంబంధ సమస్యల నుంచి బయటపడొచ్చు. – డాక్టర్ విజయ్కుమార్, శ్వాసకోశ వైద్యనిపుణుడు -
మీ అబ్బాయిది ఒక రకం ఆస్తమా కావచ్చు!
పల్మునాలజీ కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు 13 ఏళ్లు. అతడు ఎప్పుడూ పొడి దగ్గుతో బాధపడుతున్నాడు. గత రెండు నెలలుగా కొద్దిపాటి జ్వరంతో ఉంటోంది. వాడికి శ్వాస సరిగా ఆడటం లేదు. మాకు దగ్గర్లోని డాక్టర్ను సంప్రదించి మందులు వాడినా సమస్య తగ్గడం లేదు. మావాడి సమస్యకు పరిష్కారం చెప్పండి. – సీతారామయ్య, కొత్తగూడెం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ అబ్బాయి కాఫ్ వేరియంట్ ఆస్తమాతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది ఆస్తమాలోనే ఒక రకం. ఇది వచ్చిన వారిలో తెమడ వంటివి పడకుండా పొడిదగ్గు వస్తూ ఉంటుంది. పిల్లికూతలు లాంటి లక్షణాలు కూడా మొదట్లో ఉండవు. దీన్నే ‘క్రానిక్ కాఫ్’ (దీర్ఘకాలిక దగ్గు) అని కూడా అంటారు. రాత్రీ పగలూ తేడా లేకుండా దాదాపు రెండు నెలలపాటు దగ్గుతుంటారు. దాంతో రాత్రివేళ నిద్ర కూడా పట్టదు. ఈ రోగులు తమకు సరిపడని ఘాటైన వాసనలు, దుమ్ము, ధూళి వంటి వాటికి ఎక్స్పోజ్ అయితే ఆ అలర్జెన్స్ ఆస్తమాను మరింతగా ప్రేరేపిస్తాయి. కాఫ్ వేరియెంట్ ఆస్తమా సమస్య ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇది ఎక్కువ. ఇది ఆ తర్వాత సాధారణ ఆస్తమాకు దారితీస్తుంది. అంటే శ్వాస అందకపోవడం, పిల్లికూతలు వంటి లక్షణాలు తర్వాతి దశలో కనిపిస్తాయి. సాధారణ ఆస్తమా లాగే కాఫ్ వేరియెంట్ ఆస్తమాకు కూడా కారణాలు అంతగా తెలియవు. కాకపోతే సరిపడని పదార్థాలు, చల్లగాలి దీనికి కారణాలుగా భావిస్తుంటారు. కొందరిలో అధిక రక్తపోటు, గుండెజబ్బులు, హార్ట్ఫెయిల్యూర్, మైగ్రేన్, గుండెదడ (పాల్పిటేషన్స్) వంటి జబ్బులకు వాడే మందులైన బీటా–బ్లాకర్స్ తీసుకున్న తర్వాత ‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ మొదలు కావచ్చు. కొందరిలో గ్లకోమా వంటి కంటిజబ్బులకు వాడే చుక్కల మందులోనూ బీటా బ్లాకర్స్ ఉండి, అవి కూడా ఆస్తమాను ప్రేరేపిస్తాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరిలో ఆస్పిరిన్ సరిపడకపోవడం వల్ల కూడా దగ్గుతో కూడిన ఆస్తమా రావచ్చు. కాఫ్ వేరియెంట్ ఆస్తమాలో కేవలం దగ్గు తప్ప ఇతర లక్షణాలేమీ కనిపించకపోవడం వల్ల దీని నిర్ధారణ ఒకింత కష్టమే. ఎందుకంటే కాఫ్ వేరియెంట్ ఆస్తమా విషయంలో సాధారణ పరీక్షలైన ఛాతీఎక్స్రే, స్పైరోమెట్రీ వంటి పరీక్షలూ నార్మల్గానే ఉంటాయి. మీరు వెంటనే మీకు దగ్గర్లో ఉన్న ఛాతీ నిపుణుడిని కలవండి. వారు కొన్ని వైద్య పరీక్షలు చేయించి, వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత తగిన చికిత్స సూచిస్తారు. వ్యాయామంలో ఆస్తమా అటాక్ రాకుండా ఉండాలంటే...! నా వయసు 38. డస్ట్ అలర్జీ ఉంది. గతంలో నా ఫ్రెండ్స్ కొందరు వింటర్లో వ్యాయామాలు చేస్తుంటే నేను వారితో పాటు ఎక్సర్సైజ్ మొదలుపెట్టాను. కానీ వ్యాయామం చేయదలచినప్పుడల్లా ఆయాసం వస్తోంది. ఈసారి మళ్లీ వింటర్ రాబోతోంది. ఎక్సర్సైజ్ మొదలుపెట్టాలని ఉంది. ఆస్తమా అటాక్ కాకుండా నాకు తగిన సలహా ఇవ్వండి. – ఎస్. ప్రసాద్, విశాఖపట్నం వ్యాయామం కొన్నిసార్లు ఆస్తమాను ప్రేరేపించి, ఆయాసం వచ్చేలా చేస్తుంటుంది. అందుకే దీర్ఘకాలిక ఆస్తమాతో బాధపడే చాలామందిలో వ్యాయామం చేసినప్పుడల్లా ఆస్తమా కనిపిస్తుంటుంది. సాధారణంగా మనం శ్వాస తీసుకునే సమయంలోనే బయటిగాలి కాసేపు ముక్కురంధ్రాలలో ఉండి వెచ్చబడి, ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి అనుకూలమైన ఉష్ణోగ్రతను సమకూర్చుకుంటుంది. కానీ వ్యాయామం చేసే సమయంలో గాలి ఎక్కువగా తీసుకోవడం కోసం నోటితోనూ గాలిపీలుస్తుంటారు. అంటే వారు తేమలేని పొడిగాలినీ, చల్లగాలినీ పీలుస్తుంటారన్నమాట. దాంతో గాలిని తీసుకెళ్లే మార్గాలు ఒక్కసారిగా ఈ చల్లగాలితో ముడుచుకుపోతాయి. ఫలితంగా గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకేళ్లే దారులు సన్నబడతాయి. దాంతో కొన్ని లక్షణాలు కనబడతాయి. అవి... ∙పొడి దగ్గు వస్తుండటం ∙ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ∙పిల్లికూతలు వినిపించడం ∙వ్యాయామం తర్వాత తీవ్రమైన అలసట (మామూలుగా వ్యాయామం చేసేవారిలో ఇంత అలసట ఉండదు) ∙వ్యాయామ సమయంలో గాలి తీసుకోవడంలో ఇబ్బంది / ఆయాసం. సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఈ లక్షణాలు కనిపించడం లేదా కొద్దిగా వ్యాయామం చేసి ఆపేశాక 5 – 10 నిమిషాల తర్వాత ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. ఇలాంటి సమయాల్లో డాక్టర్ను తప్పక సంప్రదించాలి. అయితే వ్యాయామంతో వచ్చే ఆయాసం (ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా) కారణంగా వ్యాయామ ప్రక్రియను ఆపాల్సిన అవసరం లేదు. దీన్ని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందుగా పీల్చే మందులైన బ్రాంకోడయలేటర్స్ వాడి, వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇక తక్షణం పనిచేసే లెవోసాల్బ్యుటమాల్ వంటి బీటా–2 ఔషధాలను వ్యాయామానికి 10 నిమిషాల ముందుగా వాడి, వ్యాయామ సమయంలో గాలిగొట్టాలు మూసుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. దీనితో పాటు వ్యాయామానికి ముందర వార్మింగ్ అప్, వ్యాయామం తర్వాత కూలింగ్ డౌన్ ప్రక్రియలను చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. తొలుత పరిమితం సమయంలో వ్యాయామం చేస్తూ, ఆ వ్యవధిని పెంచుకుంటూ పోవడం వల్ల మీరు ఈ సమస్యను అధిగమించవచ్చు. పల్మునరీ ఫైబ్రోసిస్ అంటే..? నాకు గత ఆర్నెల్లుగా దగ్గు, ఆయాసం వస్తోంది. చాలామంది డాక్టర్లకు చూపించుకున్నాను. చివరకు ఒక పెద్ద డాక్టర్గారు దాన్ని పల్మునరీ ఫైబ్రోసిస్ అని నిర్ధారణ చేశారు. ఆ తర్వాత ‘జబ్బుకు కారణమేమిటో తెలుసుకోవా’లన్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. – ఎమ్. సాగర్, నల్గొండ పల్మునరీ ఫైబ్రోసిస్ అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక జబ్బు. ఇందులో ఊపిరితిత్తుల మీద చారల్లాగా వస్తాయి. ఇలా చార (స్కార్) రావడం పెరిగిపోతే కనెక్టివ్ టిష్యూ అనే కణజాలమంతా ఒకేచోట పోగుబడుతుంది. దాంతో మృదువుగా ఉండాల్సిన ఊపిరితిత్తుల గోడలు మందంగా మారతాయి. రక్తానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీని వల్ల రోగులు ఆయాసపడుతూ ఉంటారు. అయితే కొందరికి ఇలా జరగడానికి కారణం ఏమిటో తెలియదు. ఇలాంటి జబ్బును ఇడియోపథిక్ పల్మునరీ ఫైబ్రోసిస్ అంటారు. సాధారణంగా ఆయాసం, ఏదైనా పనిచేస్తున్నప్పుడు అది ఎక్కువ కావడం, ఎప్పుడూ పొడిదగ్గు, అలసట, ఛాతీలో ఇబ్బంది, కొంతమందిలో ఛాతీనొప్పి, ఆకలి తగ్గడం, నీరసించిపోవడం, బరువు తగ్గడం కనిపిస్తుంటాయి. సాధారణంగా ఇది ప్రధాన జబ్బు కాదు. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య తర్వాత రెండో (సెడండరీ) సమస్యగా ఇది వస్తుంది. కొన్నిసార్లు మన వ్యాధి నిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం (ఆటోఇమ్యూన్), వైరల్ ఇన్ఫెక్షన్స్, టీబీ లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వంటి కారణాలతో ఇది వస్తుంది. ఇక ఎప్పుడూ ఆస్బెస్టాస్, సన్నటి ఇసుక రేణువులనూ, సిమెంటు నిండి గాలి పీలుస్తుండటం, నిమోనియాను కల్పించే బ్యాక్టీరియా, ఫంగస్లతో ఉన్న గాలిని పీల్చడం, కోడిదాణా వంటి వ్యవసాయ పరిశ్రమలకు సంబంధించిన వాసనలు ముక్కుకు తగులుతూ ఉండటం వల్ల కూడా ఈ జబ్బు రావచ్చు. సిగరెట్ పొగ ఈ కండిషన్ను మరింత తీవ్రతరం చేస్తుంది. సాధారణంగా దీనికి చాలా పరిమితమైన చికిత్స మాత్రమే లభ్యమవుతోంది. మంచి మందులు ఇంకా ప్రయోగదశలోనే ఉండి, అందుబాటులోకి రావల్సి ఉంది. ప్రస్తుతం కార్టికోస్టెరాయిడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటర్ మందులు వాడుతూ ఊపిరితిత్తుల్లో వచ్చే వాపు, నొప్పి, ఎర్రబారే పరిస్థితిని (ఇన్ఫ్లమేషన్ను) అదుపు చేసే స్థితిలోనే వైద్యశాస్త్రం ఉంది. దీనికి తోడు అవసరమైనప్పుడు ఆక్సిజన్ పెట్టాల్సి ఉంటుంది. మీరు పెద్ద సెంటర్లలో నిపుణులైన పల్మునాలజిస్ట్లను సంప్రదించండి. డా. రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ , కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ -
ఆస్తమాకు పేదరికం తోడైతే... అగ్నికి ఆజ్యమే!
పరిపరిశోధన సాధారణ రోగుల్లో కంటే... పట్టణ ప్రాంతాల్లోని పేద పిల్లల్లో వచ్చే ఆస్తమా మరింత తీవ్రంగా ఉంటుందని ఇటీవలి తాజా అధ్యయనాల్లో తేలింది. పట్టణాలలో అల్పాదాయ వర్గాల వాళ్లు ఫ్యాక్టరీలకు సమీపంలోనే ఎక్కువగా నివసిస్తుంటారు. వాటి నుంచి వెలువడే కాలుష్యం పిల్లలను తీవ్రంగా బాధిస్తుంటుంది. పైగా పేదరికం కారణంగా పిల్లలకు సరైన చికిత్స అందకపోవడం వల్ల ఆస్తమా పేట్రేగిపోతోందని ప్రతిష్ఠాత్మకమైన జాన్ హాప్కిన్స్ సంస్థ అధ్యయనాల్లో తేలింది. పట్టణాలలో స్థోమత కలిగిన ప్రాంతాల రోగులతో పోలిస్తే... పేదరికం అధికంగా ఉన్న చోట్ల ఆస్తమా రోగులు ఎక్కువ, మరణాలూ ఎక్కువే. ఈ అధ్యయన ఫలితాలు ‘ద జర్నల్ ఆఫ్ అలర్జీ అండ్ క్లినికల్ ఇమ్యూనాలజీ’ అనే మెడికల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. -
అలర్జీ సమస్య తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ నాకు అలర్జీ సమస్య ఉంది. హోమియోలో దీనికి మందులు ఉన్నాయా. నాకు ఈ సమస్య పూర్తిగా తగ్గే అవకాశం ఉందా? – రవికుమార్, నిడదవోలు అలర్జీలు, ఆస్తమా అనేవి సాధారణంగా కొందరిలో పుట్టుకతోనే వస్తాయి. మరికొందరికి పెరిగాక వాతావరణంలోని దుమ్మూధూళి సరిపడక రావచ్చు. ఈ తరహా రుగ్మతలను హోమియో వైద్యచికిత్స విధానం ద్వారా తేలిగ్గా తగ్గించవచ్చు. లక్షణాలను బట్టి వాటికి కాన్స్టిట్యూషన్ పద్ధతిలో వాడే మందులివి... యాంట్ టార్ట్: జలుబు, దగ్గు, కొన్నిసార్లు దగ్గుతో కఫం ఉండటం, ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఆర్స్ ఆల్బ్: దుమ్ములోకి వెళ్లినప్పుడు తుమ్ములు రావడం, ముక్కులు మూసుకుపోవడం, తుమ్ములతో పాటు ముక్కుల నుంచి నీళ్లు కారవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వెన్నుపై పడుకుంటే ఉబ్బసం ఎక్కువవుతుంది. ఈ లక్షణాలు మధ్యరాత్రి ఎక్కువ. హెపార్సల్ఫ్: చాలా చలిగా అనిపిస్తుంది. చలిని ఏమాత్రం తట్టుకోలేరు. చల్లని–పొడి వాతావరణంలో ఆస్తమా వస్తుంది. కూర్చుని తలవాల్చి పడుకుంటే ఉపశమనంగా ఉంటుంది. సోరియమ్: ఎండాకాలంలో కూడా దుప్పటి కప్పుకుని కూర్చుంటారు. ప్రతి చలికాలంలోనూ ఆయాసం తిరగబెడుతుంటుంది. నేట్రమ్ సల్ఫ్: నేలమాళిగలు, సెలార్స్లోకి ఉండేవాళ్లకు జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కఫం పచ్చరంగులో ఉంటుంది. దగ్గు ఎక్కువగా ఉండి, ఛాతీని పట్టుకుని దగ్గుతుంటారు. రోడో: వర్షం ముందుగా లక్షణాలు కనిపిస్తూ రోగిలో మార్పులు వస్తుంటే ఈ మందును సూచించవచ్చు. వీళ్లకు మెరుపులంటే భయం ఎక్కువగా ఉంటుంది. మెర్క్సాల్: వీళ్లు చాలా నిదానంగా ఉంటారు. ఎవరినీ నమ్మరు. సమాధానాలు సైతం చాలా నింపాదిగా చెబుతారు. గట్టిగా పట్టుదలగా ఉండలేరు. కుడివైపు తిరిగి నిద్రపోలేరు. కఫం పచ్చగా పడుతుంది. పైన పేర్కొన్న మందులు హోమియోలో అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి వ్యక్తిగత, శారీరక, మానసిక లక్షణాలను బట్టి వైద్యుల పర్యవేక్షణలో తగిన మందులను వాడాలి. వాటిని తగిన పొటెన్సీలో ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే మీరు నిపుణులైన హోమియో వైద్యులను సంప్రదించి, మీ సమస్యను విపులంగా చర్చించి, మీకు తగిన మందును తీసుకోండి. ఛాతీలో మంట... తగ్గేదెలా? గ్యాస్ట్రో ఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. నేను చాలా రోజుల నుంచి ఛాతీలో మంటతో బాధపడుతున్నాను. యాంటాసిడ్ సిరప్ తాగినప్పుడు మంట తగ్గుతోంది. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లీ పరిస్థితి మామూలే. దీన్ని శాశ్వతంగా తగ్గించుకోవడానికి ఏం చేయాలి? నాకు తగిన సలహా ఇవ్వగలరు. – జనార్దన్రావు, నల్లగొండ మీరు తెలిపిన వివరాలు, లక్షణాలను బట్టి చూస్తే మీరు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల వచ్చే అనారోగ్యమిది. మీ రోజువారీ జీవనశైలినీ, ఆహారపు అలవాట్లనూ సరిచేసుకుంటే ఈ వ్యాధి చాలావరకు తగ్గుముఖం పడుతుంది. ఈ సమస్య తగ్గడానికి కొన్ని సూచనలివి... n మీరు తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించడం n కాఫీ, టీలను పూర్తిగా మానేయడం n పొగతాగే అలవాటు ఉంటే పూర్తిగా మానేయడం, మద్యం అలవాటుకు దూరంగా ఉండటం n బరువు ఎక్కువగా ఉంటే దాన్ని సరైన స్థాయికి తగ్గించడం n భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కాస్త సమయం తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి n తలవైపున పడక కొంచెం ఎత్తుగా ఉండేలా అమర్చుకోవాలి. పై సూచనలతో పాటు మీ డాక్టర్ సలహా మీద పీపీఐ డ్రగ్స్ అనే మందులు వాడాలి. అప్పటికే తగ్గకపోతే ఎండోస్కోపీ చేయించుకొని తగిన చికిత్స తీసుకోండి. నాకు ఈమధ్య కొంతకాలంగా కడుపులో నీరు వస్తోంది. కాళ్లవాపులు వస్తున్నాయి. దగ్గర్లోని డాక్టర్ను సంప్రదిస్తే మందులు ఇచ్చారు. రెండు సమస్యలూ తగ్గిపోయాయి. కానీ కొన్ని రోజుల తర్వాత సమస్య మళ్లీ మొదలైంది. మందులు వాడితే తగ్గుతోంది. నేను దాదాపు ప్రతిరోజూ ఆల్కహాల్ తీసుకుంటాను. దానివల్ల ఈ సమస్య వస్తోందా? నా సమస్య పరిష్కారానికి ఏం చేయాలో తగిన సలహా ఇవ్వగలరు. – చలమయ్య, విజయవాడ సాధారణంగా కిడ్నీలో సమస్య వల్ల కాళ్లలో వాపు కనిపిస్తుంది. కడుపులో నీరు చేరడం కూడా ఉంటుంది. కాలేయం, గుండెజబ్బులు ఉన్నవారిలో కూడా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. మీరు దాదాపు ప్రతిరోజూ ఆల్కహాల్ తీసుకుంటున్నానని చెబుతున్నారు కాబట్టి ఇది ముమ్మాటికీ కాలేయం వల్ల వచ్చిన సమస్యే అయి ఉంటుంది. మీరు ఈ విషయమై ఏవైనా వైద్యపరీక్షలు చేయించుకున్నారా లేదా అన్న సంగతి తెలపలేదు. మీరు ఒకసారి కడుపు స్కానింగ్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, కడుపులోని నీటి పరీక్షలు చేయించుకొని, ఆ రిపోర్టులు తీసుకొని మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ను సంప్రదించండి. వారు ఆ రిపోర్టుల ఆధారంగా మీ సమస్యను గుర్తించి, మీకు తగిన చికిత్స చేస్తారు. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఆధునిక వైద్యంతో అదుపులో ఆస్తమా!
ఆస్తమా కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు ఎనిమిదేళ్లు. డాక్టర్లు వాడికి ఆస్తమా ఉన్నట్లు నిర్ధారణ చేసి మందులు ఇస్తున్నారు. ఆస్తమా అటాక్ అంటే ఏమిటి? ఎలాంటి చికిత్స అవసరం? – సుభాష్, రామగుండం చలికాలం తీవ్రమైన చలి, ఎండాకాలంలో విపరీతమైన వేడిమి, అత్యధికంగా రేగే దుమ్ము వంటివి ఎక్కువగా ఉండే మీలాంటి ప్రదేశాలలో ఆస్తమా కేసులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాతావరణంలోని మార్పులు ఎక్కువగా ఉండే ఆస్తమా లక్షణాలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. దాంతో ఆస్తమాతో బాధపడేవారి పరిస్థితి తీవ్రంగా తయారవడాన్ని ఆస్తమా అటాక్ లేదా ఆస్తమా ఎపిసోడ్ అంటున్నారు. ఈ పరిస్థితి హఠాత్తుగా ఏర్పడవచ్చు. కొన్నిసార్లు ఇది విషమించి తక్షణ వైద్యసాయం అవసరమవుతుంది. ఆస్తమా అటాక్ జరిగినప్పుడు శ్వాసవ్యవస్థలో వేగంగా కొన్ని మార్పులు జరుగుతాయి. ఇవి ప్రాణాంతకం కూడా కావచ్చు. ►వాయునాళాల చుట్టూతా కండరాలు బిగుసుకుంటాయి. దాంతో గాలి ప్రయాణించే మార్గం మరింతగా కుంచిస్తుంది n శ్వాసకోశాలకు చేరే గాలి పరిమాణం బాగా తగ్గిపోతుంది n వాయునాళాల వాపు ఎక్కువై, వాయువులు ప్రయాణం చేసే దారి మరింత సన్నబారిపోతుంది ►వాయునాళాలలో వాపు వల్ల ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు రోగనిరోధక వ్యవస్థ ఎక్కువ మ్యూకస్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీంతో వాయునాళాలు మరింతగా మూసుకుపోతాయి. ఈ మార్పులతో సాధారణ స్థాయి నుంచి ప్రమాదకర స్థాయి వరకు ఆస్తమా అటాక్ జరుగుతుంది. ఈ అటాక్ ప్రారంభంలో ఊపిరితిత్తులకు కొంచెం తక్కువగానైనా ఆక్సిజన్ అందుతుంది. కానీ శ్వాసకోశాల నుంచి కార్బన్ డై ఆక్సైడ్ బయటకు రావడం కష్టంగా ఉంటుంది. ఇది మరికొంత సమయం కొనసాగే సరికి శ్వాసకోశాలలో కార్బన్ డై ఆక్సైడ్ నిలిచిపోయి శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. క్రమంగా ఊపిరితిత్తులకు అందే ఆక్సిజన్ పరిమాణం చాలా తక్కువ స్థాయికి పడిపోతుంది. దీంతో శరీరంలోని వివిధ భాగాలకు రక్తం ద్వారా అందే ఆక్సిజన్ తగ్గుతుంది. ఈ రకమైన ఆస్తమా అటాక్ చాలా ప్రమాదకరమైనది. రోగిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి. అత్యవసర ఆధునిక వైద్యసేవలే ప్రాణాలు కాపాడతాయి ఆస్తమా చికిత్సను నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యక్తి జీవితంలోని అన్ని రంగాలలో నష్టపోవాల్సి వస్తుంది. పిల్లలు తరచూ స్కూలుకు వెళ్లలేరు. తగినంతగా పనిచేయలేక, శ్రద్ధ చూపలేక, పెద్దవాళ్లు వృత్తి ఉద్యోగాలలో వెనకబడిపోవాల్సి వస్తుంది. శరీరం బలహీనంగా ఉండటం వల్ల వ్యక్తిగత అభిరుచులు, ఆనందాలకు దూరం కావాల్సి వస్తోంది. ఆస్తమా అటాక్ వచ్చి పరిస్థితి విషమించిన సమయంలో అత్యవసర వైద్యసేవలు, నిపుణులైన డాక్టర్ సహాయం అత్యవసరం. మొదట కృత్రిమంగా శ్వాస అందించే ఏర్పాటు చేసి, మందుల ద్వారా వాయునాళాలు తెరిచి సహజంగా ఊపిరి తీసుకునేట్లు చేస్తారు. ఆపైన ఆస్తమా మరీ తీవ్రంగా రావడానికి కారణమైన అంశాలను గుర్తించి వాటి నుంచి కాపాడుకునేందుకు, మరోసారి ఆస్టమా అటాక్ రాకుండా ఉండేందుకు మందులు ఇస్తారు. అలవాట్లలో మార్పులు సూచిస్తారు. ఇలా ఆస్తమాను అదుపులో ఉంచుకొని సాధారణ జీవితం గడపడం సాధ్యమవుతుంది. డాక్టర్ పి.నవనీత్ సాగర్ రెడ్డి సీనియర్ పల్మునాలజిస్ట్ యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ అర్టికేరియాతో చర్మంపై దద్దుర్లు...! హోమియో కౌన్సెలింగ్ నా వయసు 24 ఏళ్లు. నాకు అప్పుడప్పుడు చర్మం మీద ఎర్రని దద్దుర్లు కనిపిస్తున్నాయి. మర్నాటికి అవి తగ్గుతున్నాయి. డాక్టర్ను సంప్రదిస్తే ‘అర్టికేరియా’ అన్నారు. మందులు వాడుతున్నా ఏమాత్రం ఫలితం కనిపించడం లేదు. హోమియో చికిత్స ద్వారా సమస్య పూర్తిగా నయమవుతుందా? – చంద్రశేఖర్, కర్నూల్ అర్టికేరియా చాలా సాధారణంగా కనిపించే చర్మ సమస్య. ప్రతి ఐదుగురిలో ఒకరు తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఇది ఏ వయసు వారికైనా కనిపించవచ్చు. కొందరిలో ఈ సమస్య 24 గంటల్లో దానంతట అదే తగ్గుతుంది. కానీ మరికొందరిలో ఇది దీర్ఘకాలం కొనసాగుతూ తీవ్ర సమస్యగా పరిణమిస్తుంది. దీన్ని రెండురకాలుగా విభజించవచ్చు. అవి... అక్యూట్ అర్టికేరియా: సమస్య ఆరు వారాల కంటే తక్కువ రోజులు ఉన్నట్లయితే దాన్ని అక్యూట్ అర్టికేరియా అంటారు. సమస్యను ప్రేరేపించే అంశాలు ఎదురైనప్పుడు ఇది కలుగుతుంది. క్రానిక్ అర్టికేరియా: ఆరువారాలకు పైబడి కొనసాగితే దాన్ని క్రానిక్ అర్టికేరియా అంటారు. ఇలా దీర్ఘకాలిక సమస్యగా మారడానికి కారణాలు ఇంకా స్పష్టంగా లభించలేదు. అయితే మన ఒంట్లో అంతర్లీనంగా ఉండే ఆరోగ్య సమస్యలైన థైరాయిడ్, లూపస్ వంటి వాటి వల్ల అర్టికేరియా కనిపించవచ్చు. కారణాలు: మన శరీరానికి సరిపడని పదార్థాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటికి ప్రతిస్పందనగా మన ఒంట్లో హిస్టమైన్స్ అనే పదార్థంలో పాటు కొన్ని రకాల రసాయనాలు రక్తప్రవాహంలోకి విడుదల అవుతాయి. వాటి ప్రభావం చర్మంపై కనిపిస్తుంది. ఇదే సమస్య మన రోగ నిరోధక శక్తి మనపైనే దుష్ప్రభావం చూపినప్పుడు కూడా కనిపిస్తుంది. అర్టికేరియాను ప్రేరేపించే అంశాలు: n నొప్పి నివారణకు ఉపయోగించే మందులు n కీటకాలు, పరాన్నజీవులు n ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా, వైరస్లు, n అధిక ఒత్తిడి, సూర్యకాంతి n మద్యం, కొన్ని సరిపడని ఆహార పదార్థాలు n అధిక లేదా అల్ప ఉష్ణోగ్రతలు n జంతుకేశాలు, పుప్పొడి రేణువులు వంటి చాలా అంశాలు అర్టికేరియాను ప్రేరేపిస్తాయి. లక్షణాలు: n చర్మంపై ఎరుపు లేదా డార్క్ కలర్లో దద్దుర్లు ఏర్పడటం n విపరీతమైన దురదగా అనిపించడం n దద్దుర్లలో మంట, నొప్పి కూడా అనిపించడం n కళ్లచుట్టూ, చెంపలు, చేతులు, పెదవులపై కూడా అవి ఏర్పడవచ్చు n గొంతులో వాపు ఏర్పడి అది వాయునాళాలకు అడ్డుగా పరిణమించి ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు n దద్దుర్ల పరిమాణం పెరుగుతూ, తగ్గుతూ వాటిని ప్రేరేపించే అంశాలకు గురైనప్పుడు కనిపిస్తూ... ఆ తర్వాత అదృశ్యమవుతూ ఉండవచ్చు. చికిత్స: హోమియో ప్రక్రియ ద్వారా కాన్స్టిట్యూషన్ పద్ధతుల్లో అత్యంత సునిశితమైన పరిశీలతో తగిన మందులు ఇవ్వవచ్చు. వాటి వల్ల రోగనిరోధక కణాల్లో పునరుజ్జీవనం కలిగి అవి అర్టికేరియాను సమర్థంగా ఎదుర్కొంటాయి. రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని, నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
ఆస్తమా... ఉంటే ఏంటి?
ప్రతిభకు... ఆస్తమా అడ్డంకి కాదు.పాటవానికి...అది ప్రతిబంధకం కాదు.సామర్థ్యానికి మోకాలడ్డదు.చిన్నప్పుడు వస్తేతగ్గే అవకాశాలు ఎక్కువ.పెద్దయ్యాక వచ్చినానియంత్రణలో ఉంచుకుంటేప్రాబ్లం ఉండదు.కాబట్టి... ఉంటే ఏంటి?అని ధీమాగా అనుకుంటే...నిశ్చింతగా ఎదుర్కోవచ్చు.నిర్భయంగా ఉండిపోవచ్చు.ఒకవేళ ‘ఉంటే ఏంటి?’అని సమాచారంతెలుసుకోవాలనుకుంటేఈ కథనం చదవండి. అవగాహన పెంచుకోండి. ఆస్తమా ఊపిరితిత్తులకు ఇన్ఫ్లమేషన్ (వాపు, మంట) కలిగించే వ్యాధి. ఇది దీర్ఘకాలికంగా బాధిస్తుంది. ఆస్తమాను అర్థం చేసుకోవాలంటే మన ఊపిరితిత్తుల్లోని వాయునాళాల పనితీరును అవగతం చేసుకోవాలి. మన ఊపిరితిత్తుల్లోకి గాలిని తీసుకెళ్లి, మళ్లీ బయటకు వదలడానికి అనేక నాళాలు ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ కారణంగా అవి ఉబ్బుతాయి. సెన్సిటివ్గా మారిపోతాయి. అంటే ఉదాహరణకు చర్మంపై మనం ముట్టుకుందామంటే ముట్టనివ్వని విధంగా మారడం అన్నమాట. దాంతో ఊపిరితిత్తులకు దారితీసే నాళాల కండరాలు బిగుసుకుపోతాయి. ఫలితంగా శ్వాస మార్గం మూసుకుపోయినట్లుగా అవుతుంది. ఫలితంగా గాలి గొట్టాల మార్గం మరింత సన్నబడుతుంది. దీని వల్ల కూడా ఊపిరి అందదు. మనకు సరిపడని వాటిని పీల్చుకున్నప్పుడు మన వాయునాళాలు తీవ్రంగా ప్రతిస్పందించడం వల్ల ఇలా జరుగుతుంది. దాంతో వాయునాళాలు ఉబ్బడంతో పాటు దాని లోపల కాస్త జిగురుగా ఉండే మ్యూకస్ అనే పదార్థం స్రవిస్తుంది. అది గాలి మార్గాన్ని మరింతగా మూసేస్తుంది. దాంతో గాలి పీల్చడమూ, వదలడమూ కష్టమవుతుంది. వేర్వేరు దేశాల్లో... వేర్వేరు విస్తృతితో... వేర్వేరు దేశాల్లో ఆస్తమా విస్తృతి భిన్నంగా ఉంది. దిగువ స్థాయి ఆదాయ వర్గాలు, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆస్తమా విస్తృతితో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. అయితే ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది కాస్త నిలకడగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 33.4 కోట్ల మంది ఆస్తమా బాధితులు ఉండగా దాదాపు ఏటా 2,50,000 మంది ఈ వ్యాధి కారణంగా చనిపోతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తమా బాధితుల్లో పదోవంతు మంది మనదేశంలోనే ఉన్నారు. ఇది ఏ వయసు వారిలోనైనా వస్తుంది. అయితే సాధారణంగా ఇది బాల్యంలోనే మొదలవుతుంది. దీని తీవ్రతను పరిశీలించిన దాదాపు 15 అధ్యయనాలలోని విశ్లేషణల ఆధారంగా ప్రపంచంలోని పిల్లల్లో 14 శాతం మందికి ఆస్తమా లక్షణాలు కనిపిస్తున్నాయి. మన దేశంలోని 5 – 11 ఏళ్ల పిల్లల్లో 10% నుంచి 15% మంది చిన్నారులు ఆస్తమా కనిపిస్తోంది. పిల్లల్లో ఆస్తమా చిన్న పిల్లల్లో సాధారణంగా ఐదేళ్ల తర్వాత ఆస్తమా లక్షణాలు బయట పడతాయి. అయితే చాలా చిన్నపిల్లల్లో అటు తల్లితండ్రులకు, ఇటు డాక్టర్లకు కూడా ఆస్తమా వస్తే దాన్ని గుర్తించడం ఒకింత కష్టం అవుతుంది. ఎందుకంటే ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే బ్రాంకియల్ ట్యూబులు చిన్నపిల్లల్లో అసలే చాలా సన్నగా, చిన్నగా ఉంటాయి. ఇక పడిశం, జలుబు లాంటి వాటితో ఆ మార్గాలు మామూలుగానే ఇన్ఫ్లమేషన్కు గురవుతాయి. దాంతో అవి మరింత సన్నగా మారతాయి. అందువల్ల అది ఆస్తమా వల్ల కలిగిన పరిణామమా, లేక పడిశం, జలుబు తాలూకు లక్షణాలా అన్నది గుర్తించడం కష్టమవుతుంది. కారణాలు / నివారణ ఆస్తమాకు మూలకారణం ఇంకా పూర్తిగా తెలియదు. జన్యుపరమైన కారణాలతో పాటు వాతావరణం ఇది వచ్చేందుకు దోహదం చేస్తుందని స్పష్టమైంది. మనం శ్వాసించే సమయంలో ఏదైనా సరిపడనిది (దీన్ని అలర్జెన్ అని పిలుస్తారు) మన ఊపిరితిత్తుల మార్గంలోకి ప్రవేశిస్తే అది అలర్జిక్ ప్రతిచర్యకు కారణమవుతుంది. ఇలా అలర్జిక్ ప్రతిచర్యకు దోహదపడే అంశాల్లో కొన్ని... ► గదుల్లో ఉండే ఇండోర్ అలర్జెన్స్ (ఉదాహరణకు పక్కబట్టల్లో, కార్పెట్స్లో, ఇరుగ్గా ఉండే ఫర్నిచర్లో ఉండే డస్ట్మైట్స్, కాలుష్యంలో పుష్కలంగా ఉండే దుమ్ముధూళి కణాలు, పెంపుడు జంతువుల వెంట్రుకలు. ► ఆరుబయట ఉండే అలర్జెన్స్: (ఉదాహరణకు పుప్పొడి, గాలితో పాటు విస్తరించే బూజు వంటి పదార్థాలు). ►పొగాకు పొగ ► రసాయనాలు, వాటి వాసన, ఘాటైన స్ప్రేలు కొందరిలో కారణం కావచ్చు. వాయు కాలుష్యం... ఇవేగాక ఇంకా చాలా అంశాలు ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అవి... చలిగాలి, చాలా ఎక్కువగా చేసే వ్యాయామాలు. కొన్నిసార్లు కొన్ని మందులు కూడా ఆస్తమాను ప్రేరేపించవచ్చు. ఉదాహరణకు ఆస్పిరిన్, నొప్పి నివారణకు వాడే నాన్–స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఇటీవల నగరీకరణకు దోహదపడే అనేక అంశాలు ఆస్తమాను కలిగిస్తున్నట్లు తేలింది. కారణాలకు దూరంగా ఉంటే నివారణ కూడా సాధ్యమవుతుంది. అలర్జెన్స్కూ, ట్రిగర్స్కూ దూరంగా ఉండటమే నివారణ. నివారించడం అంటే జబ్బుకు దూరంగా ఉండటమే. అంటే ఇంచుమించు జబ్బు లేకుండా ఉండటమే. లక్షణాలు ► దగ్గు ... ప్రధానంగా రాత్రివేళల్లో ఎక్కువగా ఉంటుంది. శరీరానికి శ్రమకలిగే వ్యాయామం లేదా నవ్వడం, ఏడ్వటం, పరుగెత్తడం వంటివి చేస్తే ఈ దగ్గు మరింతగా పెరుగుతుంది. ► శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ► ఛాతీ పట్టేసినట్లుగా బిగుతుగా మారడం ► ఊపిరి హాయిగా అందకపోవడం ► పిల్లికూతలు (శ్వాస తీసుకునే సమయంలో... అందునా మరీ ముఖ్యంగా గాలి వదిలే సమయంలో సన్నటి పిల్లికూతలు వినిపిస్తుంటాయి). ► కొందరిలో ఆస్తమా వచ్చినప్పుడు ఒళ్లు (చర్మం) కూడా ఎర్రబారి పొడిగా మారుతుంది. మరికొందరిలో ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, గురక వంటి లక్షణాలు కనిపించవచ్చు. ► పిల్లల్లో పైన పేర్కొన్న లక్షణాల్లో ఏదో ఒకటి గాని లేదా కొన్ని లక్షణాలు కలగలిసి గాని కనిపించవచ్చు. ఇలా లక్షణాలు కనిపించినప్పుడు దాన్ని జలుబు లేదా బ్రాంకైటిస్ కావచ్చని అనుకుంటాం. అయితే అవే లక్షణాలు పదే పదే కనిపిస్తుంటే అప్పుడు అది ఆస్తమా కావచ్చని అనుమానించాలి. ఆ పిల్లలకు ఆస్తమాను ప్రేరేపించే అంశం (ట్రిVýæ్గరింగ్ ఫ్యాక్టర్) ఏదైనా ఎదురైతే వెంటనే వారి పరిస్థితి మరింత దుర్భరమవుతుంది. వెంటనే ఆస్తమా లక్షణాలు మొదలైపోతాయి. పొగ, ఘాటైన వాసనలు, పుప్పొడి, పెంపుడు జంతువుల వెంట్రుకలు, డస్ట్మైట్స్... ఇవి సోకీ సోకగానే ఆస్తమాను ప్రేరేపిస్తాయి. చికిత్స చిన్నపిల్లల్లో ఆస్తమా వస్తే వారు పెరిగే కొద్దీ... అంటే టీన్స్లోకి ప్రవేశిస్తున్నప్పుడుగానీ లేదా యుక్తవయస్కులుగా మారుతున్నప్పుడుగానీ ఆ ఆస్తమా లక్షణాలు క్రమంగా తగ్గిపోవచ్చు. అయితే కొంతమందిలో కొన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆ లక్షణాలు కొంతకాలం తర్వాత మళ్లీ వ్యక్తం కావచ్చు. ఇక చిన్నప్పుడు మరీ తీవ్రమైన ఆస్తమా ఉన్న పిల్లల్లో అది పెద్దయ్యాక కూడా తగ్గకపోవచ్చు. ఆస్తమాకు రెండు రకాల చికిత్స అవసరమవుతుంది. అది... ► దీర్ఘకాలంలో మళ్లీ రాకుండా నివారించేందుకు అవసరమైన ప్రివెంటివ్ చికిత్స. వాయునాళాల ఇన్ఫ్లమేషన్ నివారణకు ఈ మందులను వాడాలి. దాదాపు వీటిని ప్రతిరోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ► తక్షణ ఉపశమనం కోసం తీసుకోవాల్సిన చికిత్స: ఆస్తమా వచ్చినప్పుడు వాయునాళాల వాపు తగ్గించి, హాయిగా శ్వాస తీసుకోవడాని దోహదపడేందుకు ఉపయోగించే మందులు వాడాల్సి ఉంటుంది. వీటినే రెస్క్యూ మెడికేషన్ అనీ, క్విక్ రిలీఫ్ మెడికేషన్ అని కూడా అంటారు. ఇది ఆస్తమా అటాక్ ఉన్నప్పుడు చేసే స్వల్పకాలిక చికిత్స. కొందరు పిల్లల్లో ఆటలు లేదా వ్యాయామానికి ముందు కూడా ఈ చికిత్సను డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. ► మూడేళ్ల లోపు పిల్లలకు ఇన్హేలర్స్తో చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు మందు వృథా కాకుండా ఉండటంతో పాటు... ఆ మందు పిల్లల ఊపిరితిత్తుల్లోకి సమర్థంగా వెళ్లడానికి స్పేసర్ డివైజ్ విత్ మాస్క్ విధిగా ఉపయోగించాలి. ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల్లో స్పేసర్తో ఇన్హేలర్ ఉపయోగించాలి. ► కేవలం మందులు ఇవ్వడం లేదా చికిత్స మాత్రమే ఆస్తమాను నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడదు. దాంతోపాటు ఆస్తమాను ప్రేరేపించే అంశాలకు రోగిని దూరంగా ఉంచడం, తమకు ఆస్తమాను ప్రేరేపించే అంశాలేమిటో క్రమంగా గుర్తుపట్టి, వాటినుంచి దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా డాక్టర్ను సంప్రతిస్తూ ఉండటం వంటి అంశాలెన్నో కలగలిస్తేనే ఆస్తమా నియంత్రణలో ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఆస్తమా – సెలబ్రిటీ బాధితుల్లో... కొందరు ప్రముఖులు అమెరికా మాజీ అధ్యక్షులు జాన్ ఎఫ్ కెనడీ, ప్రముఖ హాలీవుడ్ నటి ఎలిజబెత్ టేలర్, షరాన్స్టోన్, ప్రముఖ రచయిత చార్లెస్ డికెన్స్, దక్షిణ అమెరికా విప్లవయోధుడు చేగువేరా వంటి ప్రముఖులు ఆస్తమాతో బాధపడ్డవారిలో ఉన్నారు. బాలివుడ్ దిగ్గజం రాజ్కపూర్నూ ఆస్తమా బాధించింది. జెరోమ్ బెట్టిస్ అనే ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆటగాడు ఆస్తమాతో బాధపడ్డవాడే. అలాగే నాన్సీ హాగ్షెడ్ ఆస్తమా ఉన్నప్పటికీ స్విమ్మింగ్లో ఒలింపిక్లో 3 బంగారు పతకాలు సాధించింది. అయితే వారి ప్రఖ్యాతికీ, ప్రతిభకూ అది ఎప్పుడూ ప్రతిబంధకం కాలేదు. ఆస్తమా – ఆహారం ఆస్తమా ఉందా? ఇలా తినండి! ► కిస్మిస్, వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్, బొప్పాయి, ఆపిల్ వంటి తాజా పండ్లు, పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, అరటి కాయ, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఈ, బీటా కెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల పనితీరును నియంత్రించడం, మెరుగుపరడచంలో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ► బ్రేక్ఫాస్ట్లో... పండ్లు, తేనె, కిస్మిస్, బెర్రీ వంటి పండ్లు, భోజనంలో... క్యారట్, బీట్రూట్, తాజా కాయగూరలు తీసుకోవాలి. ► వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్, బాదం– సోయా గింజలు, కొవ్వు తీసిన పాలు. ►ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పసుపు వంటి సహజమైన మసాలాలు ఆస్తమా తీవ్రతను తగ్గిస్తాయి. ఇలా కూడా తీసుకోవచ్చు... ► పాలలో పసుపు కలుపుకొని తాగడం, ఒక స్పూన్ పసుపులో అంతే మోతాదులో తేనె కలిపి పరగడుపున తీసుకుంటే సమస్య ఉపశమనంతో పాటు నివారణకు కూడా దోహదం చేస్తుంది. ► పెరుగు, అరటిపండు, కమలాలు, నిమ్మ, బత్తాయి వంటి పుల్లటి పండ్లు, కూల్డ్రింకులు, ఊరగాయలు, స్వీట్లు, గుడ్లు... ఇవి ఆస్తమా సమస్యను తీవ్రతరం చేస్తాయని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇందులో కొన్ని పాక్షికంగా మాత్రమే నిజం. వీటిలో ఫలానా ఆహారం నిర్దిష్టంగా అలర్జీని కలిగించి ఆస్తమాను ప్రేరేపిస్తుందనీ, అదే ట్రిగర్ అనీ తెలిస్తేనే దాన్ని మానేయాలి. కమలాలు, నిమ్మ, బత్తాయి లాంటివి ‘సి’ విటమిన్ను అందించి, వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తాయి. నిర్దిష్టంగా ఆ ఆహారం అలర్జీని కలిగిస్తుందని అనుకున్నప్పుడు మాత్రమే డాక్టర్ను సంప్రతించి, అది కచ్చితంగా అలర్జీని కలిగిస్తుందనే నిర్ధారణ పరీక్షను చేయించాకే... ఆ ఆహారం నుంచి దూరంగా ఉండాలి. అపోహతోనే దూరంగా ఉంటే కొన్ని పోషకాలనుంచి దూరమైనట్లే. ► ఇక బిడ్డకు తల్లి పాలు పట్టిస్తే, అది భవిష్యత్తులో ఆస్తమా నుంచి రక్షణ ఇస్తుంది. ఇవి ఆస్తమాను పెంచుతాయి... ఉప్పు తగ్గించాలి. ► రంగులు వేసిన ఆహారం, ప్రిజర్వేటివ్స్తో కూడిన ఆహారం, బ్రెడ్ వంటివి మానేయాలి. ఆస్తమా – నిర్ధారణ నిర్ధారించడం అంత ఈజీ కాదు ఆస్తమా నిర్ధారణ చాలా కష్టమైన ప్రక్రియ. లక్షణాలతో పాటు... అవి ఎంత వ్యవధిలో మళ్లీ మళ్లీ వస్తున్నాయనే అంశం ఆధారంగా ఆస్తమాను అనుమానిస్తారు. దాంతో నిర్ధారణ కోసం కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా బాల్యంలోని వచ్చే మరికొన్ని సమస్యల లక్షణాలూ ఆస్తమా లక్షణాలతో కలగలసి పోతాయి. దాంతో సదరు లక్షణాలు నిర్దిష్టంగా ఆస్తమా వల్లనే కనిపిస్తున్నాయా, లేక ఇతర మరికొన్ని ఆరోగ్య సమస్యల వల్లనా అని నిర్ధారణ చేయడం కష్టమవుతుంది. ఉదాహరణకు ఆస్తమా లాంటి లక్షణాలే కనబరిచే మరికొన్ని కండిషన్లు.... ∙ రైనైటిస్ ∙ సైనసైటిస్ ∙ఆసిడ్ రిఫ్లక్స్ లేదా గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) ► వాయునాళాలలో ఏమైనా తేడాలు (ఎయిర్ వే అబ్నార్మాలిటీస్) ► స్వరపేటిక సరిగా పనిచేయకపోవడం (వోకల్ కార్డ్ డిస్ఫంక్షన్) ► బ్రాంకైటిస్ వంటి శ్వాసమార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్లు ► రెస్పిరేటరీ సింటాక్టికల్ వైరస్ (ఆర్ఎస్వి) ఆస్తమా నిర్ధారణ ఇంత సంక్లిష్టం కాబట్టే డాక్టర్లు చిన్నారి లక్షణాలను నిశితంగా పరిశీలించడంతో పాటు కొన్ని వైద్య పరీక్షలూ చేయిస్తారు. అవి... ► ఐదేళ్లు లేదా అంతకంటే పైబడిన వయసు పిల్లల విషయానికి వస్తే పెద్దవాళ్లలోనూ నిర్ధారణ చేసేందుకు నిర్వహించే లంగ్ ఫంక్షన్ పరీక్షలు (స్రైరోమెట్రీ) వంటివి చేస్తారు. ఇందులో పిల్లలు ఎంత సమర్థంగా గాలిని బయటకు వదలగలరో చూస్తారు. సాధారణ స్థితితో ఈ పరీక్ష చేయడంతో పాటు, కాస్త వ్యాయామం తర్వాత, అటుపైన కొంత ఆస్తమా మందు ఇచ్చాక ఆ పరీక్షల్లో కనిపించే తేడాలను సునిశితంగా గమనించాకే ఆస్తమా నిర్ధారణ చేస్తారు. ►ఇక ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో లంగ్ ఫంక్షన్ పరీక్షతో ఆస్తమా నిర్ధారణ ఒకింత కష్టం. దాంతోపాటు రోగి చెప్పేవి, తల్లితండ్రులు గమనించే అనేక లక్షణాల ఆధారంగా ఆస్తమాను నిర్ధారణ చేస్తారు. ఇంత చిన్న పిల్లల్లో ఆస్తమాను నిర్ధారణ చేయాలంటే కొన్ని సందర్భాల్లో కొన్ని నెలలు కూడా పట్టవచ్చు. అలర్జిక్ ఆస్తమా కోసం చేసే కొన్ని అలర్జీ పరీక్షలు : కొన్ని ట్రిVýæ్గరింగ్ అంశాలతో పిల్లల్లో ఆస్తమా వెంటనే కనిపిస్తుంటే.. అలాంటి పిల్లల్లో డాక్టర్లు అలర్జీ స్కిన్ టెస్ట్ చేయిస్తారు. అలర్జీ వల్ల కలిగే ఆస్తమా విషయంలో ఇది మొదటి ప్రాధాన్య పరీక్ష (గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్). ఇందులో ఏదైనా అలర్జీ కలిగించే పదార్థాన్ని (అంటే జంతువుల వెంట్రుకలో లేదా బూజునో) ఉపయోగించి చర్మంలోని కొంత భాగాన్ని సేకరిస్తారు. ఇలా చేయడం ద్వారా చర్మంపై ఏదైనా అలర్జిక్ ప్రతిక్రియ (రియాక్షన్) జరుగుతుందేమోనని గమనిస్తారు. ఇది చాలా సంక్షిప్తంగా, వేగంగా జరిగిపోయే నిర్దిష్టమైన పరీక్ష. కొన్నిసార్లు చర్మంపై లక్షణాలు కనిపిస్తూ ఉండేవారికి, యాంటీ హిస్టమైన్ మందులు తీసుకునే వారికి అలర్జీ బ్లడ్ టెస్ట్ల వల్ల ఉపయోగం ఉంటుంది. అయితే కొంతమందికి ఆహారం కారణంగా అలర్జీ వచ్చి ఆస్తమా కనిపించవచ్చు. అలాంటప్పుడు ఏయే రోగులకు ఏయే ఆహారం వల్ల అలర్జీ కలుగుతుందని తెలుసుకోవడం చాలా కష్టమైన పని. అది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది.కొన్ని సందర్భాల్లో డాక్టర్లు మరింత సూక్ష్మస్థాయి పరీక్షలనూ ఆశ్రయించాల్సి రావచ్చు. డా. అపర్ణా రెడ్డి పీడియాట్రిక్ పల్మనాలజిస్ట్, రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ హైదరాబాద్ -
చిన్నప్పట్నుంచీ అలర్జీ.. తగ్గేదెలా?
నాకు అలర్జీ సమస్య ఉంది. హోమియోలో దీనికి మందులు ఉన్నాయా. నాకు ఈ సమస్య పూర్తిగా తగ్గే అవకాశం ఉందా? - అనిల్కుమార్, నిజామాబాద్ అలర్జీలు, ఆస్తమా అనేవి సాధారణంగా కొందరిలో పుట్టుకతోనే వస్తాయి. మరికొందరికి పెరిగాక వాతావరణంలోని దుమ్మూధూళి సరిపడక రావచ్చు. ఈ తరహా రుగ్మతలను హోమియో వైద్యచికిత్సా విధానం ద్వారా తేలిగ్గా తగ్గించవచ్చు. లక్షణాలను బట్టి వాటికి కన్స్టిట్యూషన్ పద్ధతిలో వాడే మందులివి... యాంట్ టార్ట్: జలుబు, దగ్గు, కొన్నిసార్లు దగ్గుతో కఫం ఉండటం, ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఆర్స్ ఆల్బ్: దుమ్ములోకి వెళ్లినప్పుడు తుమ్ములు రావడం, ముక్కులు మూసుకుపోవడం, తుమ్ములతో పాటు ముక్కుల నుంచి నీళ్లు కారవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వెన్నుపై పడుకుంటే ఉబ్బసం ఎక్కువవుతుంది. ఈ లక్షణాలు మధ్యరాత్రి ఎక్కువ. హెపార్సల్ఫ్: చాలా చలిగా అనిపిస్తుంది. చలిని ఏమాత్రం తట్టుకోలేరు. చల్లని-పొడి వాతావరణంలో ఆస్తమా వస్తుంది. కూర్చుని తలవాల్చి పడుకుంటే ఉపశమనంగా ఉంటుంది. సోరియమ్: ఎండాకాలంలో కూడా దుప్పటి కప్పుకుని కూర్చుంటారు. ప్రతి చలికాలంలోనూ ఆయాసం తిరగబెడుతుంటుంది. నేట్రమ్ సల్ఫ్: నేలమాళిగలు, సెలార్స్లోకి ఉండేవాళ్లకు జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కఫం పచ్చరంగులో ఉంటుంది. దగ్గు ఎక్కువగా ఉండి, ఛాతీని పట్టుకుని దగ్గుతుంటారు. ఫాస్: మెత్తటి స్వభావం. ఎవరు ఏ సాయం అడిగినా చేస్తారు. భయంగా ఉంటారు. క్షయ వ్యాధి ఉన్నా ఈ మందు వాడవచ్చు. రోడో: వర్షం ముందుగా లక్షణాలు కనిపిస్తూ రోగిలో మార్పులు వస్తుంటే ఈ మందును సూచించవచ్చు. వీళ్లకు మెరుపులంటే భయం ఎక్కువగా ఉంటుంది. కాలీ ఎస్: ఆయాసం ఎక్కువగా ఉంటుంది. మెర్క్సాల్: వీళ్లు చాలా నిదానంగా ఉంటారు. ఎవరినీ నమ్మరు. సమాధానాలు సైతం చాలా నింపాదిగా చెబుతారు. గట్టిగా పట్టుదలగా ఉండలేరు. కుడివైపు తిరిగి నిద్రపోలేరు. కఫం పచ్చగా పడుతుంది. ⇒ పైన పేర్కొన్న మందులన్నీ హోమియోలో అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి వ్యక్తిగత, శారీరక, మానసిక లక్షణాలను బట్టి వైద్యుల పర్యవేక్షణలో తగిన మందులను వాడాలి. వాటిని తగిన పొటెన్సీలో ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే మీరు నిపుణులైన హోమియో వైద్యులను సంప్రదించి, మీ సమస్యను విపులంగా చర్చించి, మీకు తగిన మందును తీసుకోండి. -
చిన్నపిల్లల్లో వచ్చే ఆస్తమాకి కాంబినేషన్ మెడిసిన్!
చైల్డ్హుడ్ ఆస్తమా అని పిలిచే చిన్నపిల్లల ఆస్తమాకు మరింత మేలైన మందును రూపొందించారు. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోలోని మెడిసిన్ విభాగంలో జరిగిన పరిశోధనల్లో ఈ మందును రూపొందించారు. ఆస్తమా వచ్చినప్పుడు మూసుకుపోయే గాలి మార్గాలు ఈ మందు వల్ల తెరచుకుంటాయి. ‘‘దీని వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఒనగూరతాయి. మొదటిది ఆస్తమా వచ్చినప్పుడు కలిగే ఇన్ఫ్లమేషన్ను ఇది తగ్గిస్తుంది. రెండోది... ఆస్తమాలో సన్నబారిన గాలి మార్గాలను విశాలంగా చేస్తుంది. ఈ రెండు ప్రయోజనాల వల్ల ఇది మరింత ప్రయోజనకారి’’ అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన పిల్లల వైద్య పరిశోధనల్లో పాలుపంచుకున్న పీడియాట్రిక్ నిపుణులు డాక్టర్ స్టాన్లీ జెఫ్లర్. ప్రస్తుతం ఇది ఎంత సురక్షితం అన్న అంశంపై పరిశీలనలు జరుగుతున్నాయి. -
ఆస్తమాకూ ఆధునిక చికిత్స...
హోమియో కౌన్సెలింగ్ నా వయస్సు 65. నేను చాలా సంవత్సరాలుగా ఆస్తమాతో బాధపడుతున్నాను. డాక్టరు గారి సూచనల మేరకు మందులు వాడుతున్నాను. వారు ఈ సమస్య పూర్తిగా తగ్గడానికి చికిత్స అందుబాటులో లేదని చెప్పారు. చల్లటి వాతావరణం ఏర్పడితే ఈ సమస్య తీవ్రతరం అయి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. హోమియో చికిత్స ద్వారా ఈ సమస్య పూర్తిగా నయం అయే అవకాశం ఉందా? సలహా ఇవ్వగలరు. - పాలడుగు పుల్లయ్య, ఆదోని మీరు ఆందోళన చెందకండి. ఆస్తమా వ్యాధి హోమియో చికిత్స ద్వారా సంపూర్ణంగా నయం అవుతుంది. ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. సాధారణంగా మనం ఊపిరి పీల్చుకున్న గాలి వాయుద్వారాల ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. అదేవిధంగా బయటకు వెళ్లిపోతుంది. ఈ వాయుద్వారాలు శోధకు గురి అయి వాపు చెందడం ద్వారా అవి సన్నగా, ఇరుకుగా మారి ఎక్కువగా శ్లేష్మాన్ని ఉత్పత్తి చేయటాన్ని ఆస్తమా అని అంటారు. మన శరీరానికి సరిపడని పదార్థాలు గాలి ద్వారా పీల్చుకున్నప్పుడు వాయుద్వారాలు వాటికి బలంగా స్పందిస్తాయి. ఇలా స్పందించిన వాయుద్వారాల కండరాలు బిగుసుకుపోతాయి. దీని వల్ల వాయుద్వారాలు కాస్త సన్నగా మారతాయి. అవి శోధకు గురయి వాపు చెందడం ద్వారా సాధారణ స్థాయికి మించి శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తాయి. దాంతో అవి మరింత ఇరుకుగా మారి గాలి ప్రసరణకు ఆటంకాలు ఏర్పరచడం వల్ల ఆస్తమా లక్షణాలు ఏర్పడతాయి. కారణాలు: ఆస్తమా కలగడానికి గల కారణాలలో ఇంతవరకు స్పష్టత లభించడం లేదు. కానీ జన్యుపరమైన అంశాలు, వంశపారంపర్యత, వాతావరణం వంటి అంశాల సమ్మేళనంతో ఈ వ్యాధి కలుగుతుందని భావిస్తున్నారు. ఆస్తమాని ప్రేరేపించే అంశాలు: ఇవి అందరిలోనూ ఒకేరకంగా ఉండవు. పూలమొక్కల నుండి వెలువడే పుప్పొడి రేణువులు, జంతుకేశాలు, దుమ్ము, బొద్దింకలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జలుబు, శారీరక శ్రమ, వ్యాయామాల వల్ల చల్లగాలి లేదా చల్లటి వాతావరణం, వాతావరణ కాలుష్యం, పొగతాగటం, కెమికల్స్, వృత్తిరీత్యా దుమ్ములో గడపవలసి రావటం, ఆస్పిరిన్, బీటా బ్లాకర్స్ వంటి మందులు, ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే ప్రిజర్వేటివ్స్, అధిక మానసిక ఒత్తిడి వంటివన్నీ ఆస్తమాను ప్రేరేపిస్తాయి. లక్షణాలు: ఇవి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వేర్వేరుగా ఉంటాయి. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, ఛాతీ బిగువుగా లేదా నొప్పిగా అనిపించటం, శ్వాస బయటకు వదిలినప్పుడు పిల్లికూతల వంటి శబ్దాలు వినిపించడం, దగ్గు. (ఆస్తమా వల్ల కలిగే దగ్గు రాత్రివేళలో, తెల్లవారు ఝామున అధికంగా ఉంటుంది). శ్వాస ఆడకపోవడం, దగ్గు వల్ల నిద్రకు ఇబ్బందికరంగా మారడం వంటివి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్ అందించే అధునాతనమైన జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ చికిత్సా విధానం ద్వారా ఎలాంటి శ్వాస సంబంధిత వ్యాధులనైనా సమర్థంగా నయం చేయడం జరుగుతుంది. రోగి మానసిక, శారీరక తత్వాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స అందించడం ద్వారా వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చు. అంతేకాకుండా హోమియో మందుల ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం ద్వారా ఆస్తమా ప్రేరేపకాలు ఎదురైనప్పటికీ సమస్య మళ్లీ పునరావృతం కాకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ కిడ్నీ మార్పిడే ఉత్తమం నా వయసు 26 సంవత్సరాలు. ఈ మధ్య ఆకలి లేకపోవడం, నీరసంగా ఉంటే పరీక్షలు చేయించుకున్నాను. క్రియాటినిన్ 14 ఎంజీ, యూరియా 320 మి.గ్రా. ఉంది. స్కానింగ్లో సీకేడీవీ అని చెప్పారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలని చెప్పారు. కిడ్నీ మార్పిడి కాకుండా ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ట్రాన్స్ప్లాంటేషన్కు దాతలు ఎవరు ఉండవచ్చు? - రత్నకిశోర్, పామిడి మీ సమస్యకు కిడ్నీ మార్పిడి చేయించుకోవడమే ఉత్తమ పరిష్కారం. దాతలుగా తోబుట్టువులు లేదా తలిదండ్రులను తీసుకోవాల్సి ఉంటుంది. డోనర్స్కి అన్ని పరీక్షలూ చేయించి, ఒక కిడ్నీ డొనేట్ చేయడం వల్ల వారికి ఏ సమస్యా ఉండదని నిర్థారణ అయ్యాకే వారిని దాతలుగా అంగీకరిస్తారు. ఆ తర్వాత వారికి ఏ విధమైన సమస్యలూ ఉండవు. కిడ్నీ దాతలు, స్వీకర్తకు రక్తసంబంధీకులు లేదా దగ్గరి బంధువులు అయితేనే కిడ్నీ ఎక్కువ రోజులపాటు పని చేసే అవకాశం ఉంటుంది. కిడ్నీమార్పిడి చికిత్స తర్వాత కూడా రెగ్యులర్గా మందులు వాడాల్సి ఉంటుంది. ఒకవేళ దాతలు లభ్యం కాకపోతే రెగ్యులర్గా డయాలసిస్ చేయించాల్సి ఉంటుంది. హోమ్ డయాలసిస్ లేదా హాస్పిటల్ డయాలసిస్ చేయించుకుంటూ అవయవ మార్పిడికోసం నమోదు చేయించుకోవాలి. నా వయసు 32సంవత్సరాలు. మూత్రంలో మంట, జ్వరం తరచు వస్తోంది. మందులు వాడినప్పుడు తగ్గుతోంది. మానేయగానే నెలలోపే తిరిగివస్తోంది. ఇలా జరక్కుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? -డి.కృష్ణబాబు, జనగామ మీరు రిక రెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఇలా మళ్లీ మళ్లీ రావడానికి కారణాలేమిటో పరివీలించాలి. సుగర్ ఉన్నట్లయితే కూడా ఇన్ఫెక్షన్ తరచు రావడానికి అవకాశాలున్నాయి. ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోండి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి, స్టోన్స్ కానీ, మూత్రనాళాల్లో వాపు గానీ ఉన్నాయేమో చూడాలి. యాంటీబయాటిక్స్ పూర్తి కోర్సు వాడకున్నా కూడా ఇన్ఫెక్షన్ మళ్లీ తిరగబెడుతుంది. ఏ కారణం లేకుండా మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్ వస్తుంటే మూడు నెలల వరకు తక్కువ డోసులో యాంటీబయాటిక్స్ వాడాలి. ఇన్ఫెక్షన్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, నీరు ఎక్కువగా తీసుకోవాలి (రోజుకు రెండు నుంచి మూడులీటర్లకు తగ్గకూడదు). మూత్రం వచ్చినప్పుడు ఆపుకోకుండా వెంటనే విసర్జించాలి. నా వయసు 58. నాకు షుగర్ వల్ల కిడ్నీలు పని చేయడం లేదు. రెండు సంవత్సరాలుగా డయాలిసిస్ చేయించుకుంటున్నాను. ఇప్పటివరకు మూడుసార్లు ఫిస్టులా ఆపరేషన్ చేయించుకున్నాను. ఏదీ పని చేయడం లేదు. నాకు డయాలిసిస్ చేయించుకుంటున్నప్పుడు చలి వణుకు వస్తోంది. ప్రత్యామ్నాయ పద్ధతులేమైనా ఉన్నాయా? - నరసింహమూర్తి, పామూరు మీకు ఇప్పుడు ఉన్న కాథెటర్కు ఇన్ఫెక్షన్ ఉంది. మొదట ఈ ఇన్ఫెక్షన్ తగ్గడానికి మందులు వాడాల్సి వుంటుంది. ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత పీమ్ కాథ్ ద్వారా డయాలిసిస్ చేయించుకోవడం మంచిది. ఇలా ఫిస్టులా ఉన్నప్పుడు హోమ్ డయాలిసిస్ (సిఏపీడీ) చే యించుకోవడం మంచిది. సిఏపీడీ వల్ల ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ఇంట్లోనే చేసుకోవచ్చు. రెగ్యులర్గా చేసుకునే జాబ్ కూడా చేసుకోవచ్చు. క్వాలిటీ ఆఫ్ లైప్ బాగుంటుంది. హోమ్ డయాలిసిస్ ఖర్చు కూడా హాస్పిటల్ డయాలిసిస్ కంటే తక్కువగానే ఉంటుంది. డాక్టర్ విక్రాంత్రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ముగిసిన చేప ప్రసాదం పంపిణీ
63,500 మందికి చేప ప్రసాదం సాక్షి, హైదరాబాద్: బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 8, 9 తేదీల్లో(బుధ, గురువారాల్లో) మొత్తం 63,500 మందికి చేప ప్రసాదం పంపిణీ చేశారు. ఒక్కో చేపను రూ.15 చొప్పున విక్రయించటం ద్వారా మత్స్య శాఖకు రూ.9,52,500 ఆదాయం సమకూరింది. బుధవారం మొదలైన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం 9.00 గంటల వరకు కొనసాగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు చెందిన ప్రజలు చేప ప్రసాదం కోసం నగరానికి తరలివచ్చారు. రెండు రోజుల చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా, ప్రశాంతంగా నిర్వహించినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ‘సాక్షి’కి తెలిపారు. చేప పంపిణీ కోసం పక్కా ఏర్పాట్లు చేసిన పోలీసు, రెవెన్యూ, ఆర్అండ్బీ, జలమండలి, జీహెచ్ఎంసీ, మత్స్య, సమాచార, విద్యుత్తు తదితర శాఖల అధికారులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. చేప ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన వారికి, వారి సహాయకులకు మంచినీరు, అల్పాహారం, మజ్జిగ, భోజనం వంటి సదుపాయాలు అందించిన వివిధ స్వచ్ఛంధ సేవా సంస్థల సేవలను కలెక్టర్ కొనియాడారు. మరోవైపు బత్తిని సోదరులు గురువారం ఉదయం నుంచి చేప ప్రసాదాన్ని పాతబస్తీ దూద్బౌలిలోని స్వగృహంలో ఉచితంగా పంపిణీ చేశారు. దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది చేప ప్రసాదం కోసం తరలిరావడంతో ఇక్కడి వీధులన్నీ కిటకిటలాడాయి. మత్స్య శాఖ తరపున చేప పిల్లలను అందుబాటులో ఉంచకపోవడంతో స్థానికులు కొంతమంది సిండికేట్గా ఏర్పడి అనధికారికంగా ఐదారు కౌంటర్లను ఏర్పాటు చేసి ఒక్కో చేప పిల్లను రూ.200 నుంచి 500 వరకు విక్రయించారు. చేపతో పాటు ప్రసాదాన్ని కూడా అందజేస్తే మరో రూ.100 లు అధికంగా వసూలు చేశారు. -
ఒకే మోతాదుతో ఉబ్బసం తగ్గదు
ఆయుర్వేద కౌన్సెలింగ్ కొన్ని వనమూలికలతో చేసిన మందును ఒక మోతాదులో తీసుకుంటే ఆస్తమా (ఉబ్బసవ్యాధి) పూర్తిగా తగ్గుతుందని కొంతమంది చెబుతున్నారు. అది సాధ్యమేనా? - ఎ. పార్వతీశం, హైదరాబాద్ వాడుక భాషలో ఉబ్బసం అని పిలిచే ఈ వ్యాధిని ఆయుర్వేద శాస్త్రం ‘తమక శ్వాస’ అనే పేరుతో వివరించింది. ఆధునికంగా ‘బ్రాంకియల్ ఆస్తమా’ అని వ్యవహరిస్తారు. ఇది శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధి. వాయునాళాలు మూసుకుపోవడం వల్ల శ్వాస విడవడం క్లిష్టంగా మారుతుంది. వాయునాళాల్లో కఫం కూడా పేరుకుపోతే దాన్ని తొలగించడం కోసం దగ్గు కూడా తోడై పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. దీని తీవ్రతను బట్టి జ్వరం, మూర్ఛ కూడా సంభవించవచ్చు. కారణాలు: 1. అసాత్మ్యాకర పదార్థాలు (అలర్జీ కలిగించేవి) : వాతావరణంలోని దుమ్ము, ధూళి, చల్లని మేఘావృత వాతావరణం, అధిక తేమ, పువ్వులలోంచి వచ్చే పుప్పొడి రేణువులు; బొగ్గు, సిమెంటు వంటి కొన్ని రసాయన ద్రవ్యాలు, కొన్ని తినుబండారాలు :ఉదాహరణకు కొన్ని నూనెలు, రంగులు, వాసనలు, నూనె మరుగుతున్నప్పుడు వెలువడే పొగ 2. వారసత్వం కూడా సంక్రమించవచ్చు 3. మానసిక ఒత్తిడి: భయం, ఆందోళన, అభద్రతాభావం, చింత, శోకం వంటి వ్యతిరేక ఉద్వేగాలు. చికిత్స: ఈ వ్యాధి ప్రధానంగా కఫం, వాతం ప్రకోపించి కలుగుతుంది. కాబట్టి ఛాతీకి, చెవులకు, శిరస్సుకు వెచ్చదనం సమకూర్చుకోవాలి. శీతల వాతావరణానికి దూరంగా ఉండాలి. పైన వివరించిన అసాత్మ్యకర భావాలు స్పష్టంగా తెలిస్తే, వాటిని దూరం చేయాలి. మానసిక ఒత్తిడి లేకుండా జాగ్రత్త వహించాలి. అసలిపోయేంత శారీరక శ్రమ చేయకూడదు. అన్ని జాగ్రత్తలు వహిస్తూ వేడివేడి టీ వంటి పానీయాలు, తేలికగా జీర్ణమయ్యే జావులు సేవిస్తే ఆయాసపు తీవ్రత మూడు, నాలుగు రోజుల్లో తగ్గిపోయి, ఆరోగ్య స్థితి సమకూరుతుంది. ఔషధాలు: ఆయాసంగా ఉన్న సమయంలో 1. కనకాసవ, పిప్పలాసవ ద్రావకాలను రెండేసి చెంచాలు ఒక గ్లాసులో కలిపి, నాల్గుచెంచాలు గోరువెచ్చని నీళ్లు కూడా కలిపి మూడు పూటలా తాగాలి. 2. శ్వాసకుఠారరస మాత్రలు : ఉదయం ఒకటి, రాత్రి ఒకటి తీసుకోవాలి. ఆయాసం తగ్గిపోయిన తర్వాత శ్వాసకోశానికి బలం కలిగించేవి, తత్సంబంధిత ‘రోగ నిరోధక శక్తి’ని పెంపొందించే మందులను ఆరు నెలల పాటు వాడాలి. ఉదాహరణకు అగస్త్య హరీతకీ రసాయనం (లేహ్యం): ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా చప్పరించి పాలు తాగాలి. ఆమలకీ (ఉసిరికాయ) రసాన్ని ఒక చెంచా తేనెతో రోజూ తీసుకుంటే (ఎంతకాలమైనా తీసుకోవచ్చు) ఉబ్బసంతో పాటు ఎన్నో రకాల వ్యాధులు దరిచేరవు. రోజుకు రెండుపూటలా ఖాళీకడుపున ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులకు అమోఘమైన శక్తి పెరిగి ఎన్నో రకాల అలర్జీలనుంచి నివారణ కలుగుతుంది. వ్యాధి స్వభావం: చిన్నప్పుడు ఒకసారిగానీ, పలుమార్లు గానీ వచ్చి ఇంకెప్పుడూ జీవితంలో తిరగబెట్టదు. దీన్ని ‘పాల ఉబ్బసం’ అంటారు. చిన్నప్పుడు రాకపోవచ్చు. ఏ వయసు వారికైనా రావచ్చు. ఈ ఆయాసం ఎన్ని రోజులకొకసారి తిరగబెడుతుందన్నది ఇదమిత్థంగా చెప్పలేం. కొంతమందిలో దగ్గరదగ్గర విరామాల్లో రావచ్చు. కొంతమందిలో నెలలు లేక సంవత్సరాల విరామంలో రావచ్చు. ఇది వ్యాధికారణం, పరసరాల ప్రభావం, వ్యక్తి ప్రకృతి, తన పాటించే పథ్యాపథ్యాలు, వృత్తి మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొంతమందిలో కేవలం వార్థక్యలో సంభవించివచ్చు. సాధ్యాసాధ్యత: ఈ వ్యాధి సుసాధ్యమూ కాదు, అసాధ్యమూ కాదు. ఇది కష్టసాధ్యం (యాప్యం) అని ఆయుర్వేదం వర్ణించింది. వైద్యుడు రోగికి సరియైన అవగాహన కల్పించి, సరైన ఆహార విహార ఔషధాలు సేవిస్తే, ఈ వ్యాధిని తప్పకుండా నియంత్రణలోకి తేవచ్చు. కొత్తగా వచ్చినప్పుడు సరియైన చికిత్స చేస్తే శాశ్వతంగా నిర్మూలనమవుతుంది. (భావప్రకాశ : సయాప్య్యః తమకశ్వాసః సాధ్యోవాస్యాత్ నవ ఉత్థితః ) గమనిక: వైద్యార్హతలు లేని కువైద్యుల ప్రచారాలను నమ్మి ఆరోగ్య సమస్యలను మరింత జటిలం చేసుకోవద్దు. కేవలం ఒక్క మోతాదులో ఉబ్బసం శాశ్వతంగా పోతుందన్నది వాస్తవం కాదు. పైన వివరించినట్లుగా వ్యాధి స్వభావాన్నిబట్టి ఒక్కోసారి దానంతట అదే తగ్గిపోవచ్చు. అంతేకాని ‘ఒక్క మోతాదు’ ప్రభావం కాదు. ఒక్క మోతాదులో తగ్గుతుందన్నప్పుడు తర్కబద్ధమైన ప్రశ్న ఉద్భవిస్తుంది. ఆ ఒక్కమోతాదు దేనిని నిర్మూలిస్తుంది? వ్యాధి కారణాలా? ఆత్యయికంగా ఉన్న ఆయాసాన్నా లేదా రోగనిరోధకశక్తిని జీవితాంతం ఉండేలా ఒకేసారి పెంచుతుందా? ఊపిరిత్తుల బలాన్ని పెంచుతుందా?... కాబట్టి ఒక్క మోతాదులో తగ్గుతుందనే ప్రచారాలకు లోనై, అసలైన శాస్త్రీయ వైద్య చికిత్సలను దూరం చేసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి అలాంటి ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్నగర్, హైదరాబాద్ -
ప్రశాంతంగా చేప ప్రసాదం పంపిణీ
-
ప్రశాంతంగా చేప ప్రసాదం పంపిణీ
- బుధవారం సాయంత్రం వరకు 50 వేల మందికి చేప ప్రసాదం - కంట్రోల్ రూమ్తోపాటు చేపలకు, టోకెన్లకు వేర్వేరుగా కౌంటర్లు - వికలాంగులు, వీఐపీలకు ప్రత్యేక క్యూలైన్లు - 1,500 మంది పోలీసులు, 1,100 మంది వలంటీర్లతో బందోబస్తు సాక్షి, హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీ ప్రశాం తంగా ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో సంప్రదాయబద్ధంగా నిష్ట పూజల అనంతరం బుధవారం ఉదయం 8.30 గంట లకు వరంగల్ జిల్లాకు చెందిన రాంబాయికి బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేయటంతో ఈ కార్యక్రమం మొదలైంది. బుధవారం సాయంత్రం వరకు 50 వేల మందికి చేప ప్రసాదం పంపిణీ చేశారు. చేప ప్రసాదం పంపిణీ గురువారం ఉదయం 8.30 గంటల వరకు కొనసాగనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రజలు చేప ప్రసాదం కోసం తరలి వచ్చారు. చేప ప్రసాదం తీసుకునే వారు, వారి సహాయకులు కలిపి మొత్తం 60 వేల మంది వచ్చినట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. చేప ప్రసాదం పంపిణీకి 32 టోకెన్ కౌంటర్లు, 40 చేప పిల్లల కౌంటర్లు ఏర్పాటు చేశారు. వికలాంగులు, వీఐపీలకు ప్రత్యేక క్యూ లైన్లతోపాటు సాధారణ క్యూలైన్ల కోసం ఏడంచెలుగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 1,500 మంది పోలీసులు, 1,100 మంది వలంటీర్లతో బందోబస్తు నిర్వహించారు. 35 సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లను పోలీసు శాఖ పర్యవేక్షించింది. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు పరిశీలించారు. ఆరు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు.. చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని రెవెన్యూ, మత్స్య, విద్యుత్తు, జలమండలి, జీహెచ్ఎంసీ, పోలీసు శాఖలు పర్యవేక్షిం చాయి. రైల్వే స్టేషన్లు, వివిధ కూడళ్ల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. చేప ప్రసాదం పంపిణీకి లక్ష చేప పిల్లలను అందుబాటులో ఉంచిన మత్స్య శాఖ టోకెన్కు రూ.15 చెల్లించటం ద్వారా చేప పిల్లలను విక్రయించింది. జలమండలి మంచినీటి సరఫరాతోపాటు 2.50 లక్షల వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేసింది. హైదరాబాద్ ఆర్డీవో నిఖిల, సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్రెడ్డి, తొమ్మిది మంది తహసీల్దార్లు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పారిశుద్ధ్య పనులను మూడు షిప్టుల్లో జీహెచ్ఎంసీ కార్మికులు నిర్వర్తించారు. తాత్కాలిక మూత్రశాలలు, మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం కోసం వచ్చిన ప్రజలు, వారి సహాయకుల కోసం పలు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా భోజనం, అల్పాహారం, మజ్జిగ అందజేశాయి. విద్యుత్తు శాఖ లైట్లు, మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు అందుబాటులో ఉంచింది. వైద్య శాఖ మెడికల్ టీమ్స్, మొబైల్ యూనిట్లు, అంబులెన్స్లు, 108 వాహనాలు ఏర్పాటు చేసింది. -
చేప ప్రసాదం పంపిణీకి సర్వం సన్నద్ధం
ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు, టోకెన్లకు కౌంటర్లు వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు ఆరు శాఖల ఆధ్వర్యంలో పక్కాగా ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. మృగశిర కార్తె సందర్భంగా ఈ నెల 8, 9 తేదీల్లో(బుధ, గురు వారాల్లో) నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీకి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం ఉదయం 8.30 గంటలకు చేప ప్రసాదం పంపిణీకి చర్యలు తీసుకుంది. రెవెన్యూ, మత్స్య, విద్యుత్తు, జలమండలి, జీహెచ్ఎంసీ, పోలీసు శాఖల ఆధ్యర్యంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున తరలివచ్చే ప్రజల కోసం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం రైల్వే స్టేషన్, వివిధ కూడళ్ల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. వృద్ధులు, వికలాంగులు, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీకి 10 వేల చేప పిల్లలతో ప్రత్యేక డ్రమ్ములను మత్స్య శాఖ అందుబాటులో ఉంచింది. చేప ప్రసాదం పంపిణీకి టోకెన్లను అందజేయనున్నారు. టోకెన్కు రూ.15 చెల్లించి చేప పిల్లను పొందాలి. మహిళలు, పురుషులు, వికలాంగులు, వృద్ధులు, వీఐపీలకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్రెడ్డి ఆధ్వర్యంలో వందలాది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. తొక్కిసలాట, అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ కార్మికులు మూడు షిఫ్టుల్లో పారిశుద్ధ్య కార్యకలాపాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. జలమండలి మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకుంటోంది. 50 వేల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రత్యేక ఏర్పాట్లు.. చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా తొక్కిసలాట లాంటి ఘటనలు జరగ కుండా ఏడు వరుసల్లో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగుల కోసం రెండు ప్రత్యేక క్యూలైన్లు ఉన్నాయి. విద్యుత్తు శాఖ లైట్లు, మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లను అందుబాటులో ఉంచింది. వైద్య శాఖ మెడికల్ టీమ్స్, మొబైల్ యూనిట్లు, అంబులెన్స్ మొదలైన ఏర్పాట్లు చేయగా, జీహెచ్ఎంసీ తాత్కాలిక మూత్రశాలలు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పిం చింది. ప్రజల సౌకర్యార్థం 80 మంది వాలంటీర్లను నియమించారు. -
యోగాతో ఆస్తమాకు కు చెక్
యోగాతో తీరైన శరీరాకృతి లభిస్తుందని, ఒంట్లో కొవ్వు కరిగి గుండెజబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి ఇబ్బందులు దరిచేరవని తెలిసిందే. యోగా వల్ల మరో లాభం కూడా ఉంది. యోగా చేస్తే ఆస్త్మా కూడా తగ్గుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. హాంకాంగ్లోని చైనీస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దాదాపు వెయ్యిమందిపై పదిహేను విడతలుగా జరిపిన విస్తృత పరిశోధనలో ఈ విషయాన్ని నిగ్గు తేల్చారు. వారానికి కనీసం రెండుసార్లు యోగా చేసిన వారిలో ఆస్త్మా లక్షణాలు గణనీయంగా తగ్గినట్లు తేలిందని హాంకాంగ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. -
చేపలు తింటే గర్భిణులకు మేలు
లండన్: గర్భిణులు చేపలను తింటే పుట్టే బిడ్డలకు ఉబ్బసం దరిచేరకుండా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. లండన్లోని సౌతాంప్టన్ యూనివర్సిటీకి చెందిన ఫిలిప్ కాడర్ నేతృత్వంలో పరిశోధనలు జరిగాయి. కొంతమంది స్త్రీలకు వారానికి రెండు సార్లు చేపలను ఆహారంగా 19 వారాలపాటు ఇచ్చారు. మిగతా వారి పిల్లలతో పోలిస్తే చేపలను ఆహారంగా తీసుకున్న తల్లుల పిల్లలకు రెండేళ్ల వయస్సు తరువాత అలర్జీ తక్కువగా ఉందని పరిశోధకులు చెప్పారు. ప్రతికూల వాతావరణం లోనూ వ్యాధులు తక్కువగా వచ్చాయన్నారు. -
నెలసరి నొప్పికి గృహవైద్యం ఉంది...
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 40 సంవత్సరాలు. ఈ మధ్య ఆయాసం వస్తుంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆస్తమా అన్నారు. ఆస్తమా అంటే ఏమిటి? దీనికి హోమియోపతిలో ఎటువంటి చికిత్సా విధానం ఉంది తెలుపగలరు? - దేవరాయలు, అనంతపురం 1. ఆస్తమా అంటే ఏమిటి? దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందిని ఆస్తమా అంటారు ఊపిరితిత్తులలో గాలి మార్గానికి అడ్డంకులు ఏర్పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది శ్వాసకోశ మార్గంలో వాపు, శ్వాసకోశ మార్గం కుంచించుకుపోవడం వల్ల ఆస్తమా వస్తుంది. 2. ఆస్తమాకు కారణాలు ఏంటి? చల్లటి వాతావరణం దుమ్ము, ధూళి, పొగ ఫంగస్, వాతావరణ కాలుష్యం వైరల్ ఇన్ఫెక్షన్స్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ పెంపుడు జంతువులు రసాయనాలు, ఘాటు వాసనలు 3. ఆస్తమా ఎలా వస్తుంది? ఆస్తమా వ్యాధి అలర్జీకి సంబంధించినది. కొంతమందిలో ఇది వంశపారంపర్యంగా కూడా సంక్రమించవచ్చు. దీనినే ఎటోపీ అంటారు కొంత మందిలో వ్యాధి నిరోధక శక్తి కలిగించే యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి. శరీరానికి సరిపడని యాంటీజెన్లు శరీరంలోకి ప్రవేశించినపుడు ఈ యాంటీబాడీ వెలువడి శరీరాన్ని రక్షించే ప్రయత్నం చేస్తాయి. ఈ క్రమంలో కణాల నుండి వెలువడే రసాయనాల వల్ల శ్వాసనాళాల్లో శ్లేష్మం జమ అవుతుంది. తద్వారా శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. 4. ఆస్తమాలో కనిపించే లక్షణాలు ఏమిటి? ఎడతెరిపి లేని దగ్గు పిల్లి కూతలు ఆయాసం జ్వరం జలుబు శ్వాస తీసుకోలేకపోవడం మానసిక ఆందోళన 5. ఆస్తమా నిర్ధారణ పరీక్షలు వంశానుగత చరిత్ర అలర్జీకి సంబంధించిన పరీక్షలు ముక్కు, గొంతు, ఛాతీ పరీక్షలు కఫం పరీక్ష చర్మానికి సంబంధించిన అలర్జీ పరీక్షలు స్పైరోమెట్రీ ఛాతీ ఎక్స్రే 6. ఆస్తమాకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? ప్రతిరోజూ వ్యాయామం చేయడం పోషకాహారం తీసుకోవడం ఎక్కువ శారీరక శ్రమ లేకుండా చూసుకోవడం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం దుమ్ము, ధూళి, పొగ, కాలుష్యానికి దూరంగా ఉండటంచల్లని వాతావరణానికి తిరగకుండా ఉండటం పడని పదార్థాలకు దూరంగా ఉండటం డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 35. ఇద్దరు పిల్లలు. ఇటీవల పొట్టలో నొప్పిగానూ, కొంచెం గట్టిగానూ ఉంటే, స్త్రీవైద్య నిపుణులను సంప్రదించాను. పరీక్షలన్నీ చేసి గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని, హిస్టెరెక్టమీ ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇవి తగ్గడానికి, ఆపరేషన్ లేకుండా, ఆయుర్వేదంలో మందులుంటే సూచించండి. - కె. శ్యామల, వనస్థలిపురం మీరు ప్రస్తావించిన ‘ఫైబ్రాయిడ్స్’ను ఆయుర్వేద పరిభాషలో ‘గ్రంథి లేక అర్బుదము’ అంటారు. ఇలాంటివి గర్భాశయంలో కూడా సంభవించవచ్చు. వాటి పరిమాణాన్ని బట్టి, లక్షణాలు మారుతుంటాయి. కంతి సైజు పెద్దదిగా లేకపోతే, ఇతర సమస్యలు లేకపోతే ఆపరేషన్ అక్కర్లేకుండా దీన్ని తగ్గించడానికి చక్కటి ఆయుర్వేద మందులు ఉన్నాయి. వాటిని మీ ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో ఒక ఆరునెలల పాటు వాడితే ఈ వ్యాధి గణనీయంగా తగ్గిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ మందుల వివరాలు... 1. కైశోర గుగ్గులు (మాత్రలు): ఉ॥2, రాత్రి 2 2. కాంచనార గుగ్గులు (మాత్రలు): ఉ॥2, రాత్రి 2 3. శతావరీ లేహ్యం: ఉ॥1 చెంచా, రాత్రి 1 చెంచా 4. అశోకారిష్ట (ద్రావకం): నాలుగు చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి (ఒక మోతాదు) రెండు పూటలా తాగాలి. అధిక రక్తస్రావం తగ్గడానికి... ‘బోలబద్ధరస’ మాత్రలు రెండేసి చొప్పున, రోజుకి మూడు సార్ల వరకు వాడవచ్చు. ఇవి ఒక వారం రోజుల వరకు వాడవచ్చు. మా అమ్మాయి వయసు 15 ఏళ్లు. నాలుగేళ్ల క్రితమే రజస్వల అయ్యింది. నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పి వస్తోంది. ఆయుర్వేదంలో పరిష్కారం తెలపండి. - ఎస్. మేరీ, హనమకొండ ఇది చాలామందిలో కనిపించే సాధారణ సమస్య. ఈ వికారాన్ని ఆయుర్వేదంలో ‘కష్టార్తవ లేక ఉదావర్తం’గా వివరించారు. వివాహం తర్వాత, కాన్పు తర్వాత చాలావరకు ఈ సమస్య దానంతట అదే తగ్గిపోవచ్చు. కానీ చాలామంది కన్యలు ఈ లక్షణంతో విలవిలలాడుతుంటారు. ఈ కింద సూచించిన మందులు, రుతుస్రావం అయ్యే తేదీకి రెండు రోజుల ముందు నుంచి మొదలుపెట్టి రక్తస్రావం తగ్గేవరకు వాడండి. తప్పక ఉపశమనం కలుగుతుంది. 1. హింగు త్రిగుణతైలం: దీన్ని ఒక చెంచా గోరువెచ్చని నీటితో కలిపి ఉదయం పరగడుపున ఒకసారి, రాత్రి పడుకునే ముందు ఒకసారి తాగాలి; 2. అశోకారిష్ట (ద్రావకం): 3 చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి, రోజూ మూడు పూటలా తాగాలి. గృహవైద్యం: నాలుగు వెల్లుల్లి రేకల్ని దంచి, దానికి మూడు చిటికెలు ఇంగువ కల్పి, రెండు చెంచాల స్వచ్ఛమైన నువ్వులనూనెలో మరిగించి, వడగట్టాలి. ఇది ఒక మోతాదుగా - 3 చెంచాల పాలు కలిపి, ఉదయం, రాత్రి రెండుపూటలా తాగాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్ హుమాయూన్నగర్ హైదరాబాద్ బ్లడ్ప్రషర్ కౌన్సెలింగ్ ఒకసారి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన నాకు మామూలు బీపీ చూడడంతో పాటు ‘సెంట్రల్ బ్లడ్ ప్రెషర్’ కూడా చూశారు. ఈమాట వినడమే కొత్త! సెంట్రల్ బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి? దీనికీ, మామూలుగా కొలిచే బ్లడ్ ప్రెషర్కూ తేడా ఏమిటి? - సుహాసిని, చెన్నై సాధారణంగా మనం బ్లడ్ ప్రెషర్ను బీపీ ఆపరేటస్తో కొలుస్తుంటాం. ఇందులో ఒక పట్టాలాంటి దాన్ని చేతికి కట్టులా కట్టి, దాన్ని గాలితో నింపి, బిగిసేలా చేసి, రక్తనాళాల్లో ప్రవహించే రక్తపు వేగాన్ని కొలుస్తాం. దీన్నే బీపీ అంటారు. కాని రక్తపోటును గుండె దగ్గరే కొలిస్తే ఆ విలువ సరైనది అని వైద్య నిపుణులు అభిప్రాయం. నేరుగా గుండె స్పందించినప్పుడు అక్కడి రక్తనాళాల్లో రక్తపీడనాన్ని కొలవడాన్ని ‘సెంట్రల్ బ్లడ్ ప్రెషర్’ అంటారు. ఇటీవల ఈ విధమైన సెంట్రల్ బ్లడ్ప్రెషర్ను కొలవడానికి ఒక పెన్ వంటి సాధనాన్ని రూపొందించారు. దీని కొనను మణికట్టు (రిస్ట్) వద్ద ఉండే నాడి దగ్గర మృదువుగా ఆనించి, ఆ వచ్చిన కొలతలను కంప్యూటర్కు అనుసంధానిస్తారు. ఆ ‘పల్స్ వేవ్’ విలువలను కంప్యూటర్ గణించి, నేరుగా గుండెదగ్గరి రక ్తనాళాల్లో రక్తపోటు ఎంత ఉందో లెక్కలు వేస్తుంది. దీని ఆధారంగా మనం గుండెదగ్గరి రక్తపోటును తెలుసుకుంటామన్నమాట. ఇలా నేరుగా గుండెదగ్గర అది స్పందించినప్పుడు రక్తం తొలుత గురైన పీడనాన్నీ అంటే సెంట్రల్ బ్లడ్ ప్రెషర్నూ, సాధారణంగా చేతి దగ్గర పట్టా చుట్టి, అందులో గాలి నింపి తీసుకునే సాధారణ బ్లడ్ ప్రషర్నూ తెలుసుకుంటూ ఇంకా ఈ విలువలను సరిపోల్చి చూస్తున్నారు. మామూలుగా చేతి దగ్గర తీసే బ్లడ్ప్రెషర్ను కొన్ని కోట్లమందిలో అనేకసార్లు గణించి సాధారణ రక్తపోటు ప్రమాణాన్ని ‘120/80’గా నిర్ణయించాం. కానీ సెంట్రల్ బ్లడ్ప్రెషర్తో తీసే విలువలకు ఇంకా నిర్ణీత ప్రమాణాలను రూపొందించలేదు. ఎందుకంటే మన రక్తపోటు క్షణక్షణానికీ మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఒక స్థిరమైన నార్మల్ విలువ వచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇంకా దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. త్వరలోనే సెంట్రల్ బ్లడ్ ప్రెషర్కూ ‘ప్రమాణాలను’ రూపొందిస్తే అప్పుడు మామూలు బ్లడ్ప్రెషర్ స్థానాన్ని ఆధునికంగా తీసే సెంట్రల్ బ్లడ్ ప్రెషర్ విలువలు ఆక్రమించడం జరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ల అంచనా. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్ కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ -
బేరియాట్రిక్ సర్జరీతో...
మందులు వాడకుండానే బీపీ, షుగర్ అదుపులోకి వస్తాయా? హోమియో కౌన్సెలింగ్ మా అమ్మగారి వయసు 65 సంవత్సరాలు. ఆమె గత కొద్దికాలంగా విపరీతంగా తుమ్ములు, జలుబు, ఆయాసంతో సరిగా ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. డాక్టర్కు చూపిస్తే ఆస్తమా అయి ఉండవచ్చన్నారు. ఈ వయసు వారిలో కూడా ఆస్తమా వస్తుందా? ఒకవేళ ఆమెకు ఆస్తమానే అయితే దానికి హోమియోలో మందులున్నాయా? దయచేసి సలహా చెప్పగలరు. - డి.ఎల్.అనూరాధ, కొత్తగూడెం దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యకే ఆస్తమా అని పేరు. ఊపిరితిత్తులలో గాలి పోయే మార్గానికి అడ్డంకులు ఏర్పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. శ్వాసకోశ మార్గంలో వాపు, శ్వాసకోశ మార్గం కుచించుకుపోవడం వల్ల ఆస్తమా వస్తుంది. కారణాలు: చల్లటి వాతావరణం, దుమ్ము, ధూళి, పొగ, ఫంగస్, వాతావరణ కాలుష్యం, వైరల్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, పెంపుడు జంతువులు, రసాయనాలు, ఘాటు వాసనలు. ఎలా వస్తుందంటే..? ఆస్తమా వ్యాధి ప్రధానంగా అలర్జీకి సంబంధించింది. కొంతమందిలో ఇది వంశపారంపర్యంగా కూడా సంక్రమించవచ్చు. కొంతమందిలో వ్యాధినిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీలు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి సరిపడని యాంటీజెన్లు శరీరంలోనికి ప్రవేశించినప్పుడు ఈ యాంటీబాడీలు వాటితో పోరాటం చేసి శరీరాన్ని రక్షించే ప్రయత్నం చేస్తాయి. ఈ క్రమంలో కణాల నుండి వెలువడే రసాయనాల వల్ల శ్వాసనాళాల్లోకి శ్లేష్మం చేరుతుంది. దాంతో శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. లక్షణాలు: ఎడతెరపిలేని దగ్గు, పిల్లికూతలు, ఆయాసం, జ్వరం. జలుబు, శ్వాస తీసుకోలేకపోవడం, మానసిక ఆందోళన. నిర్ధారణ: వంశానుగత చరిత్ర, అలర్జీకి సంబంధించిన పరీక్షలు, ముక్కు, గొంతు, ఛాతీ పరీక్షలు, స్పైరోమెట్రీ, ఛాతీ ఎక్స్రే. జాగ్రత్తలు: రోజూ వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, ఎక్కువ శారీరక శ్రమ లేకుండా చూసుకోవడం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, దుమ్ము, ధూళి, పొగ, కాలుష్యానికి, ఒంటికి సరిపడని ఆహారానికి దూరంగా ఉండటం, చల్లని వాతావరణ ంలో తిరగకుండా ఉండటం. పాజిటివ్ హోమియో చికిత్స: ఆస్తమాకు హోమియోపతిలో చాలా మంచి మందులున్నాయి. రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి, శరీర తత్వాన్ని బట్టి నిపుణులైన వైద్యుని ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా మందులు వాడటం ద్వారా ఆస్తమాను అదుపులో ఉంచుకోవచ్చు. మీరు వెంటనే మీ అమ్మగారిని మంచి హోమియోవైద్యుని దగ్గరకు తీసుకెళ్లండి. గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 44 ఏళ్లు. 110 కిలోల బరువు ఉంటాను. నాకు బీపీ, షుగర్ అదుపులోకి రావడం లేదు. దాంతో ఏ పనీ చేయలేకపోతున్నాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం లేదు. బేరియాట్రిక్ సర్జరీ ద్వారా బరువు తగ్గవచ్చని నా స్నేహితులు సలహా ఇస్తున్నారు. ఒకవేళ నేను బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుంటే, ఆ శస్త్రచికిత్స తర్వాత మందులు వాడకుండానే బీపీ, షుగర్లు అదుపులోకి వస్తాయా? దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపించగలరు. - కె.ఎల్.ఎన్. రాజు, వరంగల్ మీరు మీ వయసు, బరువు తెలిపారు గానీ... మీ ఎత్తు తెలపలేదు. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) అనే ప్రమాణాలను బట్టి చూసినప్పుడు, మీ బరువు వల్ల మీకు హాని జరిగే అవకాశాలు ఎక్కువని తేలితే బేరియాట్రిక్ సర్జరీ నిర్వహిస్తాం. బేరియాట్రిక్ సర్జరీ అంటే కడుపుపై పెద్ద పెద్ద కోతలు పెట్టి ఆపరేషన్ చేస్తారని మీరు భయపడుతున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం అత్యాధునిక కీహోల్ విధానంలో తక్కువ కోతతో బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించవచ్చు. ఈ విధానం చాలా సురక్షితం. కీహోల్ సర్జరీ ద్వారా ఆపరేషన్ చేస్తే, రెండు రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారు. సర్జరీ తర్వాత మీరు బరువు తగ్గడంతో పాటు, మీ బీపీ, షుగర్ కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మధుమేహం పూర్తిగా అదుపులోకి రాకపోయినా మందులు వాడటం చాలా వరకు తగ్గుతుంది. మీ బీఎంఐతో పాటు ఇతర ఆరోగ్యపరిస్థితులను బట్టి మీకు బేరియాట్రిక్ సర్జరీ అవసరమా, కాదా అని వైద్యులు నిర్ధారణ చేస్తారు. ఒకవేళ మీకు బేరియాట్రిక్ సర్జరీ తప్పనిసరి అయితే అత్యాధునిక సదుపాయాలు, నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో ఉన్న ఆసుపత్రిలో మాత్రమే శస్త్రచికిత్స చేయించుకోండి. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 68 ఏళ్లు. నాకు గత రెండేళ్లుగా మోకాళ్లలో నొప్పి ఉంది. ఇటీవల ఇది చాలా ఎక్కువైంది. ఇప్పుడు నడవడం కూడా కష్టమవుతోంది. ఒకవేళ మోకాలి మార్పిడి చికిత్స చేయించుకోవాలంటే ఎంత ఖర్చవుతుంది? తగిన సలహా ఇవ్వండి. - మంజరి, వనపర్తి మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ఆస్టియోఆర్థరైటిస్ సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. వయసు పెరుగుతున్న కొద్దీ సమస్య తీవ్రమవుతూ పోతుంది. ముందుగా మీరు మీ దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్ను సంప్రదించి ఎక్స్-రే తీయించుకోండి. ఈ సమస్యకు తొలిదశలో నొప్పి నివారణ మందులు, కాండ్రోప్రొటెక్టివ్ డ్రగ్స్ అనే మందులు వాడతారు. ఫిజియోథెరపీ వ్యాయామాలూ సూచిస్తారు. అప్పటికీ నొప్పి తగ్గకపోతే మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స (టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ) అవసరమవుతుంది. మోకాలి మార్పిడి సర్జరీకి సుమారు 1.5 లక్షల రూపాయల నుంచి 1.8 లక్షల వరకు ఖర్చవుతుంది. మోకాలి కీలు మార్పిడి కోసం ఉపయోగించే మెటీరియల్ మీద ఖర్చు ఆధారపడి ఉంటుంది. నా వయసు 29 ఏళ్లు. బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, నా కుడి మణికట్టులో కొద్ది నెలలుగా తీవ్రమైన నొప్పి వస్తోంది. దాంతో ఏ పనీ చేయలేకపోతున్నాను. దాన్ని కొద్దిపాటి ఒత్తిడితో వంచినప్పుడు క్లిక్మనే శబ్దం వచ్చి నొప్పి వస్తోంది. దయచేసి నాకు తగిన పరిష్కారం చెప్పండి. - సోమరాజు, రాజోలు మణికట్టులో 15 ఎముకలు ఉంటాయి. రిస్ట్ అనేది ఎన్నో లిగమెంట్లతో కూడిన సంక్లిష్టమైన నిర్మాణం. కొన్ని చిన్న ఎముకలు విరిగినప్పుడు ఆ విషయమే మనకు తెలియదు. ఉదాహరణకు స్కాఫాయిడ్ అనే ఎముక మనం మణికట్టును గుండ్రగా తిప్పడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు కొన్ని రకాల ఎముకలు విరిగిన విషయం సాధారణ ఎక్స్రేలో తెలియపోవచ్చు కూడా. అయితే కొన్నిసార్లు రెండు, మూడు వారాల తర్వాత చేసే రిపీటెడ్ ఎక్స్రేలో తెలుస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలు స్కాఫాయిడ్ ఎముక విరిగినట్లు సూచిస్తున్నాయి. మీ సమస్య టీనోసైనోవైటిస్ లేదా రిపిటీటివ్ స్ట్రెయిన్ ఇంజ్యురీ కూడా కావచ్చు. కాబట్టి ఒకసారి ‘ఆర్థోపెడిక్ సర్జన్’ను కలిసి తగిన ఎక్స్-రే పరీక్షలు చేయించుకోండి. -
వింగ్తో ఉబ్బసానికి చెక్!
వాషింగ్టన్: చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిపై ఉబ్బసం వ్యాధి(ఆస్థమా) ప్రభావాన్ని చూపిస్తుంది. శీతాకాలంలో మరింత ఎక్కువగా ఈ వ్యాధి ప్రభావానికి లోనవడం జరుగుతోంది. ఉబ్బసం వ్యాధి బారిన పడకుండా ముందుగానే వ్యాధి సంకేతాలను గుర్తించి హెచ్చరించడానికి అమెరికా శాస్త్రవేత్తలు 'వింగ్' అనే కొత్త పరికరాన్ని రూపొందించారు. జేబులో ఇమిడేంత చిన్నదిగా ఉండే ఈ పరికరాన్ని స్మార్ట్ ఫోన్తో అనుసంధానించి ఉపమోగించవచ్చు. అమెరికాకు చెందిన స్పారో లాబ్స్ దీనిని రూపొందించింది. వాతావరణంలో ఉబ్బసం వ్యాధి కారకాలను ముందుగానే పసిగట్టి ఫోన్కు సమాచారాన్ని అందించేలా వింగ్ను రూపొందిచారు. హెడ్ఫోన్ను అనుసంధానించే జాక్ ద్వారా ఫోన్కు కనెక్ట్ చేసేలా దీనిని తయారు చేయడంతో వింగ్కు ప్రత్యేకంగా చార్జింగ్, బ్యాటరీల అవసంరం లేదు. వింగ్ ఉబ్బసంతో పాటు శ్వాసవ్యవస్థకు సంబంధించిన అనేక రుగ్మతలను ముందుగానే పసిగడుతుంది. క్రానిక్ పల్మొనరీ డిసీజ్, సిస్టిక్ ఫైబ్రోసిస్ లాంటి ప్రాణాంతక వ్యాధులను సైతం గుర్తించి ఫిజీషియన్కు సమాచారాన్ని చేరవేసేలా దీనిని తయారు చేశారు. ప్రస్తుతం వింగ్ 'అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్' పరిశీలనలో ఉందనీ, త్వరలోనే దీనిని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పారో లాబ్స్ తెలిపింది. -
ఊపిరితిత్తుల కౌన్సెలింగ్
రుతు సమయంలో ఆస్తమా? నా వయసు 40 ఏళ్లు. గృహిణిని. నాకు రుతుసమయంలో శ్వాస అందదు. ఆ సమయంలో దగ్గు, పిల్లికూతలు కూడా వస్తుంటాయి. ఇలా రావడానికి కారణాలు ఏమిటి? - సువర్ణ, నందిగామ రుతుసమయం కూడా ఒక కీలకమైన దశ. ఇందులో మీ భౌతిక, మానసిక, ప్రవర్తనాపూర్వకమైన అంశాల్లో ఎన్నో మార్పులు కనిపిస్తుంటాయి. రుతుక్రమం మహిళల ఆరోగ్యం విషయంలో కీలక భూమిక పోషిస్తుంటుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే... ఏదైనా వ్యాధి వల్ల రుతుక్రమానికి విఘాతం కలగవచ్చు. తద్వారా అటు శారీరక, ఇటు మానసిక సమస్యలకు అది దారితీయవచ్చు. కెటామెనియల్ ఆస్తమా అనేదాన్ని రుతుక్రమం ముందు వచ్చే (ప్రీమెనుస్ట్రువల్) ఆస్తమాగా కూడా చెప్పవచ్చు. ఈ సమయంలో మహిళల్లో ఆస్తమా లక్షణాలు తీవ్రమవుతాయి. రుతుక్రమానికి ముందుగా చాలామంది మహిళల్లో ఆస్తమా ఎక్కువ కావడం కొంతమంది మహిళల్లో కనిపించిన దాఖలాలు ఉన్నాయి. పీరియడ్స్కు ముందు శ్వాస అస్సలు అందకపోవడం వల్ల ఈ పరిణామాలు సంభవిస్తాయి. దీనికి నిర్దిష్టమైన కారణాలు తెలియకపోయినా సాధారణంగా ప్రోజెస్టెరాన్ లేదా ప్రోస్టాగ్లాండిన్స్ వంటి హార్మోన్లలోని మార్పులు ఇందుకు దారితీస్తాయని కొంతవరకు ఊహించవచ్చు. అయితే అండం రూపుదిద్దుకునే దశలో ప్రోజెస్టెరాజ్ పాళ్లు క్రమంగా పెరుగుతాయి. ఆ తర్వాత పీరియడ్స్కు ముందు ఇవేపాళ్లు గణనీయంగా పడిపోతాయి. మహిళల్లో కండరాలు రిలాక్స్ కావడానికి తోడ్పడే స్రావాలు సైతం ఊపిరితిత్తుల్లోని గాలి ప్రయాణించే పైప్లనూ ప్రభావితం చేస్తాయి. ప్రోజెస్టెరాన్ పెరగడం వల్ల కలిగే మార్పులు శ్వాస అందనివ్వకుండా చేసి, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. దాంతో ఆస్తమా పెచ్చరిల్లుతుంది. రుతుక్రమానికి ముందుగా వ్యాధినిరోధకత విషయంలో వచ్చే మార్పులు కూడా ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అందుకే... రుతుక్రమానికి ముందుగా వచ్చే ఆస్తమా విషయంలో దానికి నిర్దిష్టమైన కారణమేమిటన్నది నిశితంగా నిర్ధారణ చేయడం చాలా అవసరం. చాలామంది రోగులు ల్యూటియల్ దశగా పేర్కొనే అండం ఆవిర్భవించే దశ నుంచి అది ఫలదీకరణ చెందనందువల్ల రుతుసమయంలో పడిపోయే సమయంలో వచ్చే ఆస్తమాకు గాను, మామూలుగా ఆస్తమాకు వాడే మందులనే అత్యధిక మోతాదుల్లో ఇస్తే ఉపశమనం పొందుతారు. ఇక మిగతావారిలో కండలోకి ప్రోజెస్టెరాన్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల నిమ్మళపడతారు. కాబట్టి మీకు ఏ అంశం ఆస్తమాను ప్రేరేపిస్తుందో నిశితంగా తెలుసుకొని, దానికే చికిత్స అందించాల్సి ఉంటుంది. అందుకని మీరు ఒకసారి మీకు దగ్గర్లోని పల్మునాలజిస్ట్ను కలవండి. -
జూన్ 8 నుంచి చేపమందు పంపిణీ
హైదరాబాద్: మృగశిరకార్తె సందర్భంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ప్రతియేడు అందచేసే చేప మందు ప్రసాదం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జూన్ 8వ తేదీన రాత్రి 11:45 గంటలకు ప్రారంభించి 9వ తేదీ రాత్రి వరకు కొనసాగించనున్నట్లు బత్తిన హరినాథ్ గౌడ్ తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగు తరాలుగా ఈ ప్రసాదాన్ని తాము ఉచితంగా ప్రజలకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది సుమారు 4.5 లక్షల మంది ప్రసాదం తీసుకున్నట్లు వెల్లడించారు. చేప మందు తీసుకునేవారు 3 గంటల ముందు, వేసుకున్న తర్వాత గంటన్నర వరకు ఏలాంటి ఆహారం తీసుకోరాదన్నారు.ప్రసాదం తీసుకున్నవారు 45 రోజుల వరకు పత్యం పాటించాలన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రసాదం తీసుకోలేక పోయినవారు దూద్బౌలిలోని తమ నివాసంలో తీసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో బత్తిని శివానంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్థమా..? అదుపు చేద్దామా!
నేడు ప్రపంచ ఆస్థమా దినం ఓ మనిషి గొంతు నుంచి పిల్లికూతలు వినిపిస్తాయి. డొక్కలెగిరిపడుతుంటాయి. ఊపిరాడదు. ఈ వ్యాధి వచ్చిన వాడికి ఈ బాధ గంటలకొద్దీ కొనసాగుతుంది. ఆ మాటకొస్తే ఒక్కోసారి మళ్లీ మళ్లీ వస్తూ ఏళ్ల తరబడి వెంటాడుతుంది. ఆ వ్యాధి పేరే ‘ఆస్థమా’. ఆకలేసినవాడికి అన్నం కంచంలో పెట్టి ఇవ్వచ్చు. దాహమేసినవాడికి నీళ్లు గ్లాసులో ఇవ్వచ్చు. చుట్టూ అంతులేని వాయుసాగరం ఆవరించి ఉన్నా ఊపిరందనివాడికి గాలిని పట్టి ఇవ్వడం ఎలాగో తెలియక రోగి బంధువులు సతమతమవుతుంటారు. ఆ అవస్థను కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స పద్ధతులు... ఓ మనిషి గొంతు నుంచి పిల్లికూతలు వినిపిస్తాయి. డొక్కలెగిరిపడుతుంటాయి. ఊపిరాడదు. ఈ వ్యాధి వచ్చిన వాడికి ఈ బాధ గంటలకొద్దీ కొనసాగుతుంది. ఆ మాటకొస్తే ఒక్కోసారి మళ్లీ మళ్లీ వస్తూ ఏళ్ల తరబడి వెంటాడుతుంది. ఆ వ్యాధి పేరే ‘ఆస్థమా’. ఆకలేసినవాడికి అన్నం కంచంలో పెట్టి ఇవ్వచ్చు. దాహమేసినవాడికి నీళ్లు గ్లాసులో ఇవ్వచ్చు. చుట్టూ అంతులేని వాయుసాగరం ఆవరించి ఉన్నా ఊపిరందనివాడికి గాలిని పట్టి ఇవ్వడం ఎలాగో తెలియక రోగి బంధువులు సతమతమవుతుంటారు. ఆ అవస్థను కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స పద్ధతులు... ఆస్తమాతో బాధితుల్లో ప్రముఖులు: అమెరికా మాజీ అధ్యక్షులు జాన్ ఎఫ్ కెనడీ, ప్రముఖ హాలీవుడ్ నటి ఎలిజబెత్ టేలర్, షరోన్స్టోన్, ప్రముఖ రచయిత చార్లెస్ డికెన్స్, దక్షిణ అమెరికా విప్లవయోధుడు చేగువేరా, హృతిక్రోషన్ పెద్దకొడుకు హ్రెహాన్తో పాటు తన చిన్నతనంలో బాలివుడ్ నటి ప్రియాంకచోప్రా ఆస్థమాతో బాధపడ్డవారిలో ఉన్నారు. డాక్టర్ ఎన్.రవీంద్ర కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, గ్లోబల్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
ప్రతి నలుగురిలో ఒకరికి ఆస్తమా!
బెంగళూరు : రాష్ట్రంలోని ప్రతి నలుగురి పిల్లల్లో ఒకరు ఆస్తమాతో బాధపడుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందని ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్ డెరైక్టర్, శ్వాసకోశ వైద్య నిపుణుడు డాక్టర్ హెచ్.పరమేష్ తెలిపారు. సరైన మందులు తీసుకోక పోవడం వల్ల ఆస్తమాకు గురైన పిల్లల్లో దాదాపు రెండు శాతం మంది మరణిస్తున్నట్లు చెప్పారు. వరల్డ్ ఆస్తమా డేని పురస్కరించుకుని బ్రీత్ఫ్రీ స్వచ్చంద సంస్థ బెంగళూరులో గురువారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామీణ పిల్లలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోని పిల్లల్లో ఆస్తమా ఎక్కువగా ఉన్నట్లు తేలిందని చెప్పారు. మారిన జీవన విధానంతో పాటు పర్యావరణ కాలుష్యం ఎక్కువ కావడమే ఇందుకు ారణమని పరిశోధనల్లో తేలిందని తెలిపారు. బాలికలతో పోలిస్తే బాలురుల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటోందన్నారు. ఇంట్లో మస్కిటో కాయిల్స్ ఉపయోగించే వ్యక్తుల్లో ఆస్తమా రావడానికి ఎక్కువ అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక పెద్దల విషయం తీసుకుంటే మొత్తం జనాభాల్లో 8 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారనితెలిపారు. ఆస్తమా వ్యాధిని నియంత్రణలో ఉంచడానికి ఎన్నో మందులు అందుబాటులో ఉన్నా కొన్ని మూఢ నమ్మకాలతో పాటు, స్నేహితులు, బంధువుల్లో చులకన అవుతామేమో అన్న భావనతో చాలా మంది వీటిని వాడకుండా ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన మొతాదులో ఇన్హెలర్స్ను తీసుకోవడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చునని పరమేశ్వర్ తెలిపారు. సదస్సులో ఫోర్టిస్ ఆసుపత్రి ప్రతినిధి, డాక్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
మునక్కాయతో రక్తశుద్ధి!
కాయ ‘ఫలాలు’ మునక్కాయలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. మునక్కాయ తింటే ఎముకలు గట్టిపడతాయి, రక్తం శుద్ధి అవుతుంది. గర్భిణి మునక్కాయ తింటే ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత ఎదురయ్యే అనేక సమస్యలు నివారణ అవుతాయి. ఛాతీ పట్టేయడం, గొంతు నొప్పి వంటి సమస్యలకు మునక్కాయ సూప్ తాగడం చక్కటి పరిష్కారం. ఆస్థమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుంటే మరుగుతున్న నీటిలో మునక్కాయ ముక్కలు వేసి, ఆ ఆవిరి పడితే ఉపశమనం కలుగుతుంది. మునక్కాయ రసం సౌందర్యపోషణకు కూడా ఉపయోగపడుతుంది. మునగ రసంలో నిమ్మరసం కలిపి ముఖానికి రాస్తే ముఖం కాంతిమంతమవుతుంది. - ఉషశ్రీ, కేర్ హాస్పిటల్ -
వెన్ను నొప్పి, ఆస్తమాలకు పరిష్కారం...సుప్త వజ్రాసనం
వ్యాయామం ముందుగా రెండు మోకాళ్ల మీద కూర్చుని రెండు అర చేతులను తొడల మీద బోర్లించాలి(వజ్రాసనంలో). ఇప్పుడు నిదానంగా వెనక్కి వంగుతూ రెండు మోచేతులను ఒక దాని తర్వాత ఒకటి నేల మీద ఆనిస్తూ దేహాన్ని పూర్తిగా నేల మీదకు వాల్చాలి. రెండు చేతులను మడిచి అరచేతులను తలకింద ఉంచాలి. ఈ స్థితిలో రెండు మోకాళ్ల మధ్య నాలుగు వేళ్ల ఖాళీ ఉండాలి. పిరుదులు రెండు మడమల మీద ఆని ఉండాలి. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా ఉంటుంది. ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత మోచేతుల సహాయంతో యథాస్థితికి రావాలి. ఇలా ప్రతిరోజూ మూడు సార్లు చేస్తుంటే... ఆస్తమా, బ్యాక్పెయిన్ల నుంచి ఉపశమనం కలుగుతుంది. మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్లకు మంచి ఫలితాలనిస్తుంది. గొంతుసమస్యలు తొలగిపోయి స్వరంలో స్పష్టత వస్తుంది. తొడలలో చేరిన కొవ్వును కరిగిస్తుంది. జాగ్రత్తలు: మోకాళ్ల నొప్పులు అధికంగా ఉన్న వాళ్లు, అధిక బరువు ఉన్నవాళ్లు, కొత్తగా చేసేవాళ్లు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. -
ఆయాసం నుంచి అనాయాస శ్వాసకు
ఆకలేస్తే అన్నం ప్లేట్లో పట్టుకురావచ్చు. దాహం వేస్తే నీళ్లు గ్లాసులో పట్టుకురావచ్చు. కానీ... ఆస్తమా వచ్చిన వారు ఊపిరాడటం లేదంటూ బాధపడుతుంటే... గాలిని ఎలా పట్టుకురావాలి? ఈ పరిస్థితిని ఎలా నెట్టుకురావాలి?... దీనికో మార్గం ఉంది. ఇన్హేలర్ అనే ఒక చిన్న ఉపకరణం సహాయంతో ఆస్తమా ఉన్నవారికి తేలిగ్గా శ్వాస ఆడేలా చేయవచ్చు. మరి... ఇలా ఇన్హేలర్స్ వాడే విషయంలోనూ ఎన్నో దురభిప్రాయాలూ, అపోహలూ రాజ్యమేలుతున్నాయి. ఇన్హేలర్స్ వాడటం రోగుల ఆరోగ్యానికి మంచిదేనా? ఆస్తమా ఉన్నవారికి ఎక్కువగా స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుందట. మరి డాక్టర్లంతా స్టెరాయిడ్స్ మంచివి కావని అంటుంటారే? అదే నిజమైతే చికిత్సలో భాగంగా ఆస్తమా కోసం స్టెరాయిడ్స్ వాడితే... అవి మరికొన్ని సమస్యలకు దారితీయవా? ఇలాంటి అపోహలూ, సందేహాలూ సమాజంలో ఎన్నో ఉన్నాయి. ఈ రోజు ప్రపంచ ఆస్తమా దినం సందర్భంగా... ఆస్తమాపై ప్రాథమిక పరిజ్ఞానం కోసం ఈ ప్రత్యేక కథనం. మనలో చాలామందికి మబ్బు పట్టినా, మంచు కురిసినా, వాన ముసిరినా ఊపిరితిత్తులు బిగదీసుకుపోయి శ్వాస సరిగా అందక, ఊపిరి తీసుకోవడం కోసం తహతహలాడిపోతుంటారు. ఇలా ఊపిరికోసం ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితిని ‘ఆస్తమా’ అంటారు. ఈ పరిస్థితి ఒక్కోసారి గంటల కొద్దీ కొనసాగుతూ తీవ్రంగా బాధిస్తుంటుంది. దీన్నే ఆస్తమా ఎటాక్గా అభివర్ణిస్తారు. ఆస్తమా లక్షణాలు ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది. శ్వాస కొద్దిగా అందేలోపే ఛాతీ గట్టిగా బిగదీసుకుపోయి పట్టేసినట్లుగా ఉండటం. పై పరిణామాల వల్ల కనిపించే తీవ్రమైన ఆయాసం దగ్గు శ్వాస తీసుకునే సమయంలో గొంతులోంచి పిల్లికూతలు వినిపించడం. ఇతర లక్షణాలు : ఆస్తమా రోగుల్లో ప్రధాన లక్షణాలతో పాటు మరికొన్ని అదనపు లక్షణాలూ కనిపించవచ్చు. అవి... ముక్కులు బిగదీసుకుపోవడం, సైనుసైటిస్ లక్షణాల్లోలా ముక్కు నుంచి స్రావాలు కనిపించడం కొందరిలో ఒంటిపై దద్దుర్లు (ర్యాషెస్), చర్మంపై పగుళ్లు (డర్మటైటిస్) వంటివీ కనిపించవచ్చు. పొరబడే అవకాశాలూ ఉంటాయి... ఆస్తమాలో కనిపించే ఆయాసం, దగ్గు, పిల్లికూతల వంటి లక్షణాలు ఊపిరితిత్తుల్లో కనిపించే ఇతర రుగ్మతల్లోనూ ఉంటాయి. కాబట్టి ఆస్తమా నిర్ధారణకు రోగచరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోవడం అవసరం. ఇది ఒక్కోసారి దీర్ఘకాలంగా బాధించే ‘క్రానిక్ ఎయిర్ వే ఇన్ఫ్లమేషన్’ అనే రూపంలోనూ కనిపిస్తూ, లక్షణాలు మాటిమాటికీ పునరావృతమవుతుంటాయి. ఒక్కోసారి మనకు సరిపడని పదార్థానికి ఎక్స్పోజ్ అయినప్పుడు గాలిపీల్చుకునేందుకు దోహదపడే ఊపిరితిత్తుల నాళాలు సన్నబడిపోయి గాలి స్వేచ్ఛగా ప్రవహించేందుకు దోహదపడకుండా అడ్డుపడతాయి. అయితే ఆస్తమా రోగుల్లో కనిపించే సాధారణ లక్షణాలన్నీ అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. అందుకే రోగుల్ని కాస్త సావకాశంగా పరిశీలించి, వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. నిర్ధారణ పరీక్షలు... రోగికి ఉన్న వ్యాధి చరిత్ర (మెడికల్ హిస్టరీ)ను జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. స్పైరోమెట్రీ అనే పరీక్ష ఆస్తమా నిర్ధారణకు ఉపయోగపడుతుంది. ఇందులో రోగి చేత గాలిని ఊదించి, ఆయనెంత బలంగా ఊదుగలుగుతున్నాడనే అంశం ఆధారంగా రోగి వాయునాళాలు ఏమేరకు ముడుచుకుపోయాయన్న విషయం అంచనా వేస్తారు. దీని ఆధారంగా రూపొందించిన గ్రాఫ్ సహాయంతో ఆస్తమా తీవ్రతను నిర్ధారణ చేస్తారు. ఇక కొన్ని రకాల ఇన్హేలర్స్ సహాయంతో ముడుచుకుపోయిన వాయునాళాలు రిలాక్స్ అయ్యేలా చేయవచ్చు. దీని ఆధారంగా ఒక మందుకు రోగి ఎలా స్పందిస్తున్నాడన్న అంశాన్నీ అంచనా వేస్తారు. కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు... ఇటీవల ఆస్తమాను నిర్ధారణ చేయడంతో పాటు, దాని తీవ్రతను తెలుసుకోడానికి ఊపిరితిత్తుల్లోని వాయునాళాలు ముడుచుకుపోయేలా చేస్తారు. ఇందుకుగాను మిథకోలైన్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. లేదా కొందరిలో వ్యాయామం చేయించి అదే ప్రభావాన్ని కల్పిస్తారు. ఇక ‘పీక్ ఎక్స్పిరేటరీ ఫ్లో టెక్నిక్’ అనే ప్రక్రియను ఉపయోగించి ఇంట్లోనే ఆస్తమా పరీక్ష చేయించవచ్చు. ఈ పరీక్ష ద్వారా ఉన్న మరో ఉపయోగం ఏమిటంటే... ఒకవేళ ఆస్తమా వచ్చే అవకాశాలు ఉంటే అది ప్రారంభం కాకముందే కనుక్కోవచ్చు. దీనివల్ల చికిత్సను చాలా త్వరగా మొదలుపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక పీక్ ఫ్లో ఎంత ఉండాలన్న అంశాన్ని రోగి వయసు, జెండర్, ఎత్తు వంటి అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. వీటిని ఇంట్లో ఉండే ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. నిశ్వాసలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ పరీక్ష మనం గాలి వదిలే సమయంలో (నిశ్వాసలో) కార్బన్ డై ఆక్సైడ్ను వదులుతామన్న సంగతి తెలిసిందే. అయితే ఆస్తమా రోగుల్లో ఇజినోఫిల్స్ అనే తెల్ల రక్తకణాల వృద్ధి కారణంగా వారి నిశ్వాసలో నైట్రిక్ ఆక్సైడ్ పాళ్లు ఎక్కువ. అందుకే ఈ పరీక్షనూ మందులకు వ్యాధి తీవ్రత ఏ మేరకు తగ్గింది, ఊపిరితిత్తుల్లో వాపు, మంట, ఎర్రబారడం (ఇన్ఫ్లమేషన్) పాళ్లు ఏమేరకు ఉన్నాయి అని తెలుసుకోడానికి చేస్తారు. రక్తపరీక్ష ఆస్తమాను కనుగొనడానికి ఉద్దేశించిన నిర్దిష్టమైన రక్తపరీక్ష ఏదీ లేకపోయినా... ఆస్తమా వచ్చిన సమయంలో రక్తంలోని ఇజినోఫిల్స్ అనే తరహా తెల్లరక్తకణాలు ఎక్కువగా వృద్ధి చెందినందున వాటికి యాంటీబాడీస్గా వెలువడ్డ ఐఈజీ లేదా ఇమ్యునోగ్లోబ్యులిన్-ఈ కణాలు కనిపిస్తాయి. (అయితే మన కడుపులో నులిపురుగులు ఉన్నప్పుడు కూడా ఇదే తరహా కణాలు కనిపిస్తాయి. కాబట్టి సందర్భాన్ని బట్టి అది ఎందువల్ల జరిగిందో క్లినికల్గానూ పరీక్షించి, డాక్టర్లు కారణాలను నిర్ధారణ చేస్తారు). ఇక ఏ ప్రత్యేకమైన పదార్థం వల్ల ఆస్తమా ప్రేరేపితమై ఉండవచ్చన్నది కూడా నిర్ణయించడానికి కొన్ని నిర్దిష్టమైన సెన్సిటివిటీ పరీక్షలు చేస్తారు. ఎక్స్-రే వ్యాధి నిర్ధారణలో ఎక్స్-రే పరీక్ష కూడా కీలకమైనదే. అయితే కొన్నిసందర్భాల్లో ఆస్తమా రోగుల ఎక్స్-రే నార్మల్గా కూడా ఉండవచ్చు. ఇలా ఉన్నప్పుడు వ్యాధి లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఇతర వ్యాధులేమైనా ఈ లక్షణాలకు కారణం కావచ్చా అన్న విషయాన్నీ చాలా నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన అంశాలు... ఆస్తమా నిర్ధారణలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అంతేగానీ... ఆయాసం, పిల్లికూతలు అనే రెండు ప్రధాన అంశాల ఆధారంగానే దాన్ని ఆస్తమాగా నిర్ధారణ చేయకూడదు. ఇలాంటి లక్షణాలు గుండెజబ్బులు, క్యాన్సర్, సీవోపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్), వోకల్ కార్డ్ లకు సంబంధించిన సమస్యలూ ఇలాంటి లక్షణాలనే కనబరుస్తాయి. ఒక్కోసారి ఆస్తమా తీవ్రత తక్కువగానే ఉన్నా రోగికి స్థూలకాయం ఉంటే అప్పుడు లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యాధి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఆస్తమాలో రకాలు... ఆస్తమాలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని... వ్యాయామంతో ప్రేరేపితమయ్యేది: కొందరు తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు శ్వాస అందకుండా పోయి, ఆస్తమా మొదలయ్యే అవకాశాలున్నాయి. దీన్నే ‘ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా’ అంటారు. (అయితే ఇలా వ్యాయామం చేసేప్పుడు ఊపిరి అందకుండా పోయే పరిస్థితి కేవలం ఆస్తమాలో మాత్రమే ఉండదు. ఊపిరితిత్తుల సమస్య, రక్తహీనత (అనీమియా), గుండెజబ్బులు, కండరాల్లో బలహీనత వంటి అనేక సమస్యల్లోనూ ఇవే లక్షణాలు కనిపించవచ్చు. అయితే కొందరిలో ఈ లక్షణాలు వ్యాయామం మొదలుపెట్టిన 5 నిమిషాల్లోనే కనిపిస్తే మరికొందరిలో 15 నిమిషాల్లో కనిపిస్తాయి. అయితే విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టిన గంట తర్వాత సర్దుకోవచ్చు. కానీ వాతావరణం చల్లగా ఉంటే పరిస్థితి విషమించవచ్చు). అలర్జిక్ ఆస్తమా: తమకు సరిపడని పదార్థాన్ని తిన్నప్పుడు లేదా దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆయాసం మొదలుకావచ్చు. ఈ సరిపడని పదార్థాలు రకరకాలుగా ఉంటాయి. ఉదాహరణకు ఆహారం, దుమ్ము/ధూళి, బొద్దింకలు, పుప్పొడి మొదలైనవి. ఇలాంటి సమయాల్లో లక్షణాల తీవ్రత అన్నది వాతావరణంపైనా ఆధారపడి ఉంటుంది. అజీర్తి / పులితేన్పులతో వచ్చే జీఈఆర్డీ సమస్యతో: కొందరిలో ఆహారం తీసుకున్నప్పుడు వారిలో దాన్ని జీర్ణం చేసే ఆసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా కడుపులో మంట/ఆహారం గొంతులోకి వస్తున్నట్లుగా అనిపించడం వంటి సమస్య కనిపిస్తుంది. దీన్నే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) అంటారు. ఈ జీఈఆర్డీ సమస్య కూడా ఒక్కోసారి ఆస్తమాను ప్రేరేపించవచ్చు. మరీ ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత నిద్రలో ఈ తరహా సమస్య ఎక్కువగా వస్తుంటుంది. ఆస్తమా వల్ల నిద్ర మెలకువ వచ్చి ఆయాసంతో బాధపడతారు. ఇతర కారణాలతో... ఇక పైన పేర్కొన్నవే కాకుండా పొగాకు పొగ వల్ల, కట్టెల పొయ్యి వద్ద వెలువడే పొగ, రంగుల వాసన సరిపడకపోవడం వంటి ఇతర అంశాల వల్ల కూడా ఆస్తమా రావచ్చు. కొందరిలో తాము పనిచేసే ప్రదేశం సరిపడకపోవడం వల్ల కూడా ఆస్తమా రావచ్చు. దీన్నే ‘వర్క్ప్లేస్ ఆస్తమా’ అంటారు. వీరికి అదే ప్రదేశంలో ఉన్నప్పటికీ వారాంతంలోగానీ, సెలవు రోజునగానీ ఆస్తమా రాదు. ఇక కొందరిలో కొన్ని మందులు సరిపడకపోవడం వల్ల కూడా ఆస్తమా రావచ్చు. ఆస్తమా ఎందుకు వస్తుంది? మనం శ్వాస పీల్చుకున్నప్పుడు గాలి మన ముక్కు చివరినుంచి ప్రారంభమయ్యే ట్రాకియా అనే గొట్టం ద్వారా మొదలై, ఊపిరితిత్తులు రెండింటిలోకీ వెళ్లడానికి వీలుగా ఈ ట్రాకియా రెండు బ్రాంకియాలుగా చీలుతుంది. అక్కడి నుంచి అనేక శాఖలుగా చీలుతూ ఊపిరితిత్తుల్లోని ఆల్వియోలై అనే గాలిగదుల్లోకి వెళ్తుంది. ఊపిరితిత్తుల్లో ఈ ఆల్వియోలైలు 30 కోట్ల వరకూ ఉంటాయి. ట్రాకియా, బ్రాంకియా, ఆల్వియోలై... వీటన్నింటికీ లోపలివైపున సన్నటి వెల్వెట్ వంటి పొర ఉంటుంది. కంట్లో నలకపడ్డప్పుడు కన్ను ఎర్రబారి, నీరుకారినట్టే... మన ఊపిరితిత్తులకు సరిపడనిదేదైనా లోపలికి ప్రవేశిస్తే ఈ వెల్వెట్ పొర కూడా ఎర్రబారిపోయి, నీరుకారిపోయినట్లుగా అవుతుంది. అక్కడ కన్ను చిన్నగా మారినట్టే... ఇక్కడ వాయునాళాలూ సన్నగా మారతాయి. దాంతో ఊపిరి అందడం కష్టంగా మారి ఆస్తమా ఎటాక్ మొదలవుతుంది. ఆస్తమా ఎవరెవరిలో ఎక్కువ...? సాధారణంగా ఆస్తమా వచ్చిన రోగులను పరిశీలిస్తే ఇందులో 75 శాతం మంది ఏడేళ్ల వయసు లోపువారే. దీని ఇండ్లలోని పెద్దవారు పాల ఉబ్బసంగా అభివర్ణిస్తుంటారు. అయితే వయసు పెరిగే కొద్దీ పిల్లల్లో ఇది తగ్గుతుందనే అభిప్రాయం ఉంది. చాలావరకు ఇది వాస్తవమే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. ఒక రేసులో ఉన్న గుర్రాల్లో ఒకటి ముందుగానే కాస్త వెనకబడి పోయిందనుకోండి. అది పూర్తిగా పుంజుకుని ముందుకు రావడానికి అవకాశాలు తక్కువ. అయితే కొందరు పాల ఉబ్బసాన్ని నిర్లక్ష్యం చేసి, వయసు పెరుగుతున్న కొద్దీ అదే తగ్గుతుందిలే అనుకుంటారు. కానీ ఆ సమయంలో చికిత్స అందించకపోతే ఎదుగుదల సమయంలో ఊపిరితిత్తుల్లో వికాసం సరిగా జరగక కొన్ని ఊపిరితిత్తుల సమస్యలు రావచ్చు. కాబట్టి పాల ఉబ్బసం అదే తగ్గుతుందనే అపోహ వద్దు. అది ఏ రకమైన ఉబ్బసమైనా చికిత్స తీసుకోవమే మేలు. ఇక వాతావరణ కాలుష్యం, ఏదైనా పడకపోవడం వంటి అంశాలతో ఇటీవల అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆస్తమా కనిపిస్తోంది. చికిత్స ఆస్తమా చికిత్సలో దాన్ని ప్రేరేపించే అంశాలకు దూరంగా ఉండటం అన్నది ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇందుకోసం... రోగికి ఆస్తమాను ప్రేరేపించే అంశాలను నిర్దిష్టంగా కనుక్కోవడం కూడా చాలా ప్రధానం. ఇందుకోసం ఆస్తమా రోగి తనకు చికిత్స అందించే పల్మునాలజిస్ట్ లేదా అలర్జీ స్పెషలిస్ట్కు ఎప్పుడూ అందుబాటులో ఉండటం ముఖ్యం. ఆధునికమైన మందులు... ఇప్పుడు ఆస్తమా తీవ్రతను తగ్గించడానికి పీల్చేమందులు (ఇన్హేలర్స్/నెబ్యులైజర్స్) కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక నోటి ద్వారా తీసుకునే మందులు సరేసరి. పీల్చే మందుల్లో ఉండే ఔషధం బిగుసుకుపోయిన వాయునాళాలను రిలాక్స్ చేసి గాలి తేలికగా లోపలికీ, బయటకూ వెళ్లేలా చేస్తుంది. ఇక ఆస్తమా సమయంలో ఊపిరితిత్తుల లైనింగ్/మ్యూకస్ మెంబ్రేన్స్లో వచ్చిన వాపు, మంట, ఎర్రబారడాన్ని (ఇన్ఫ్లమేషన్ను) తగ్గించే మందులనూ వాడతారు. ఇలా రెండు రకాల ఇన్హేలర్స్తో చికిత్స చేసి, ఆస్తమా తీవ్రతను తగ్గిస్తారు. దాంతో రోగికి చాలావరకు ఉపశమనం కలుగుతుంది. ఇటీవల ఐజీఈ అనే తరహా యాంటీబాడీస్తోనూ ఆస్తమాకు చికిత్స చేస్తున్నారు. చికిత్స ఇంట్లోనా... ఆసుపత్రిలోనా...? రోగికి చికిత్స చాలావరకు ఇంట్లోనే జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఊపిరి అందక, శ్వాస సరిగా ఆడకుండా పరిస్థితి తీవ్రమవుతుంటే ఆసుపత్రికి తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఇంట్లో చేసిన చికిత్సల వల్ల రోగికి తగినంత ఉపశమనం కనిపించకపోతే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ఒక్కోసారి కృత్రిమ శ్వాస ఇవ్వాల్సిన అవసరమూ రావచ్చు. అందుబాటులోకి రానున్న అత్యాధునిక చికిత్సా విధానాలు : ఇప్పుడు ఆస్తమా చికిత్సలో మరిన్ని అత్యాధునిక చికిత్సావిధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఉదాహరణకు బ్రాంకియల్ థెర్మోప్లాస్టీ అన్నది అలాంటి విధానాల్లో ఒకటి. ఈ విధానంలో బ్రాంకోస్కోప్ అనే పరికరంతోనూ, ప్రత్యేకమైన వైర్ల సహాయంతోనూ ఊపిరితిత్తుల్లోకి గాలి ప్రవహింపజేసే వాయునాళాల్లో ఉష్ణోగ్రతనూ, వేడిమినీ పెంచేలా చేస్తారు. దాంతో వాయునాళాలు పూర్తిగా వ్యాకోచిస్తాయి. ఇటీవల జరుగుతున్న అధ్యయనాల వల్ల ఈ ప్రక్రియ సత్వర ఉపశమనానికి దోహదం చేస్తుందని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అపోహలూ - వాస్తవాలు ఆస్తమా మందుల పట్ల, ఈ ప్రక్రియలో ఉపయోగించే ఇన్హేలర్ల పట్ల, స్టెరాయిడ్స్ విషయంలో ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. వాటిలో కొన్ని... అపోహ : ఆస్తమా నియంత్రణకు ఉపయోగించే ఇన్హేలర్లు ఆరోగ్యకరం కావు. రోగులు వీటికి తేలిగ్గా బానిసలవుతారు. (అడిక్ట్ అవుతారు). వాస్తవం : ఇన్హేలర్లు పూర్తిగా ఆరోగ్యకరం. వీటిని ఉపయోగించడం వల్ల వాటికి ఎవరూ బానిసలు కారు. అవి శ్వాసను పునరుద్ధరించే ప్రాణరక్షకులు. అపోహ : ఆస్తమా చికిత్సలో రోగికి స్టెరాయిడ్స్ ఇస్తారు. స్టెరాయిడ్స్ వాడటం మంచిది కాదని డాక్టర్లే చెబుతుంటారు. వాస్తవం : స్టెరాయిడ్స్ కూడా ఒక రకం మందులే. వీటితో వ్యాధిని తేలిగ్గా నియంత్రణలోకి తేవడంతో పాటు, రోగి ప్రాణాలను రక్షించవచ్చు. అయితే స్టెరాయిడ్స్ వల్ల కొన్ని సైడ్ఎఫెక్ట్స్ ఉన్న మాట వాస్తవమే అయినా రోగికి కలిగే ఉపశమనం, వ్యాధినుంచి అవి కలిగించే రక్షణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ సైడ్ఎఫెక్ట్స్ పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సినవి కాదు. అపోహ : ఆస్తమా అన్నది ఒక్కోసారి ఎక్సర్సైజ్ వల్ల కూడా వస్తుంది. కాబట్టి ఒకసారి ఆస్తమా వస్తే ఆ వ్యక్తి వ్యాయామానికి పూర్తిగా దూరంగా ఉండాలి. వాస్తవం: ఇది పూర్తిగా అపోహ. ఇప్పుడున్న మందులతో ఆస్తమాను పూర్తిగా నియంత్రణలో ఉంచి, మళ్లీ యథావిధిగా వ్యాయామాలు చేయవచ్చు. ఇప్పుడు ఒలింపిక్ అథ్లెట్లలోనూ చాలామంది ఆస్తమా రోగులు ఉన్నారు. అయినా వారి వ్యాధి, వారి ప్రతిభకూ, వ్యాయామానికీ ప్రతిబంధకం కావడం లేదు. అపోహ : కొన్ని రకాల ఆహారాలు వ్యాధిని ప్రేరేపించి, రోగి పరిస్థితిని పూర్తిగా దిగజారుస్తాయి కాబట్టి రోగులు కొన్ని రకాల ఆహారాలను పూర్తిగా మానేయాలి. వాస్తవం : రోగి... తక్షణం ఆస్తమాను ప్రేరేపించే ఆహారం నుంచి వీలైనంతగా దూరంగా ఉండటం అవసరమే. అయితే ఈ కారణంగా రోగి తనకు ఆరోగ్యాన్నిచ్చే ఆహారం, పండ్లు వంటి వాటిని పూర్తిగా పరిహరించాల్సిన పని లేదు. తన విచక్షణతో ఏ మేరకు తీసుకుంటే తనకు ఇబ్బంది కలగదో, ఆ మేరకు తీసుకోవచ్చు. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి ఇతర అంశాలనూ పరిగణనలోకి... ఆస్తమా రోగికి ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలూ, ఇతర కండిషన్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స చేయడం అవసరం. ఉదాహరణకు ఒక మహిళకు ఆస్తమా చికిత్స చేస్తున్నప్పుడు ఆమె గర్భవతా, ఎలాంటి మందులు తీసుకుంటూ ఉంది అనే అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. కడుపులో ఉన్న చిన్నారికీ, తల్లికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా చికిత్స ప్రణాళిక రచించుకోవాలి. చాలా ప్రాచీనం ఆస్తమా అనేది గ్రీకు మాట. ‘నోటితో శ్వాస’ అనేది దాని అర్థం. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు హిపోక్రేటస్ (క్రీ.పూ. 460 - 370) నాటికే ఉన్నట్లు అప్పటి వర్ణనలను బట్టి తెలుస్తోంది. ఇప్పుడు అనేక రకాల ఆధునిక చికిత్సా ప్రక్రియలతో పాటు, తక్కువ మోతాదులోనే ఎక్కువ ప్రభావం చూపే అత్యంత సురక్షితమైన ఔషధాలు, ఇన్హేలర్లు అందుబాటులోకి వచ్చినందున గతంలోలా ఆస్తమా పట్ల అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. -
ఆస్తమా నుంచి ఉపశమనమెలా...?
నా వయసు 46. నాకు చిన్నప్పటి నుంచి ఆస్తమా జబ్బు ఉంది. చలికాలంలో తప్పనిసరిగా బయటపడుతుంది. పిల్లికూతలతో కూడిన ఆయాసం వస్తుంది. దగ్గు కూడా వస్తుంటుంది. చాలా మందులు వాడాను. కానీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. శాశ్వత నివారణకు ఆయుర్వేద మందులు తెలియజేయ ప్రార్థన. - భ్రమరాంబ, చేవెళ్ల మీకున్న సమస్యను ఆయుర్వేదంలో ‘తమకశ్వాస’ అంటారు. దీనికి కారణాలు అనేకం. ఉదాహరణకు... అసాత్మ్యత (అలర్జీ) కావచ్చు. ఇది ఆహారపదార్థాలతో రావచ్చు. బాహ్యవాతావరణంలోని అంశాలు కావచ్చు. గాలిలో తేమ, దుమ్ము, ధూళి, మేఘావృత వాతావరణం, అతిశీతల వాతావరణం, మరికొన్ని కంటికి కనిపించని ఇతర పదార్థాలు మొదలైనవి. అదేవిధంగా కొన్ని వృత్తుల్లో ఉన్నవారికి సిమెంట్, కెమికల్స్, ఆయిల్స్ మొదలైనవి పడకపోవచ్చు. కొంతమందికి వారసత్వం ఒక కారణం. మానసిక ఒత్తిడి కూడా ఒక ప్రధాన కారణం. కొంతమందిలో జ్వరం కూడా ఉంటుంది. ఆయుర్వేదం దీన్ని ‘యాప్య’ వ్యాధిగా స్పష్టీకరించింది. అంటే పూర్తిగా నయం కాకపోయినా, సరైన ఆహార, విహార, ఔషధాల ద్వారా నియంత్రించుకోగల్గిన వ్యాధి అని అర్థం. ఆయాసం ఉన్నప్పుడు విశ్రాంతి అవసరం. పరిశ్రమచేస్తే ఇది మరింత ఎక్కువవుతుంది. చలి నుంచి కాపాడుకోవాల్సిన దుస్తులు ధరించాలి. కొంచెం బోర్లా పడుకునే భంగిమలో ఉపశమనం లభిస్తుంది. ఆయాసం తగ్గేవరకు వేడివేడిగా ఉండే తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. చల్లటి వస్తువులను దూరంగా ఉంచాలి. మందులు ఆయాసంగా ఉన్నప్పుడు కనకాసవ లేదా సోమాసవ (ద్రావకం) మూడు చెంచాల మందులో సమానంగా గోరువెచ్చని నీరు కలిపి, రోజుకి మూడు లేక నాలుగు సార్లు తాగాలి. దగ్గు, కఫం తగ్గడానికి: వాసారిష్ట, పిప్పలాసవ... ఈ రెండు ద్రావకాలను రెండేసి చెంచాలు ఒక గ్లాసులో పోసుకొని, నాలుగు చెంచాలు నీళ్లు కలిపి, రోజుకి మూడుసార్లు తాగాలి. భారంగ్యాది చూర్ణం: ఒక చెంచా చూర్ణం రోజుకి రెండుసార్లు, వేడినీటితో కర్పూరతైలాన్ని ఛాతీకి ముందు, వెనక వైపు పూతగా పూసి (మెల్లగా మసాజ్ చేసి), వేడినీటి ఆవిరితో కాపడం పెట్టాలి. ఆయాసం తగ్గిన అనంతరం ఈ కింది ఔషధాలను రెండు మూడు నెలలపాటు వాడితే ‘క్షమత్వం’ వృద్ధి చెంది తమక శ్వాస వచ్చే తీరు బలహీనపడుతుంది. శృంగారాభ్రరస మాత్రలు: ఉదయం 1, రాత్రి 1 అగస్త్యహరీతకీ రసాయన (లేహ్యం): ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా చప్పరించి తిని, పాలు తాగాలి. గృహవైద్యం ఒక చెంచా ఆవనూనె, ఒక చెంచా తేనె కలిపి సేవిస్తే ఆయాసం నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. అల్లంతో చేసిన టీ రోజుకి నాలుగైదు సార్లు తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. రెండు చిటికెలు ఇంగువను బెల్లంతో తిన్నా ప్రయోజనం ఉంటుంది ఆయాసం లేనప్పుడు, రెండుపూటలా ప్రాణాయామం చేయడం దినచర్యలో భాగం చేసుకుంటే పుప్ఫుసాలకు (ఊపిరితిత్తులకు) క్రియాపరమైన సామర్థ్యం పెరుగుతుంది. ఇది పరిశోధనాశాస్త్ర నిరూపితం. గమనిక: కొంతమంది నాటువైద్యులు, నకిలీవైద్యులు ఈ వ్యాధిని పూర్తిగా నయం చేస్తామని అనేక ప్రకటనలు, ప్రచారాలు చేస్తూ వారి వారి మందులు అమ్ముకుంటుంటారు. ఇలాంటి మోసాలకు బలికావద్దు. మరికొంతమంది కొన్ని ఆయుర్వేద మందులలో అల్లోపతికి సంబంధించిన ‘స్టెరాయిడ్స్’ కలిపి అమ్ముతుంటారు. స్టెరాయిడ్స్ వల్ల నాటకీయ ప్రయోజనం కలుగుతుంది. ఆ విధంగా వారి వలలో పడతారు. ఇది ప్రమాదమని గ్రహించాలి. మీకు దేనివల్ల ఆసాత్మ్యత కలుగుతోందన్న అంశాన్ని లేదా ఇతర కారణాలను గమనించగలిగితే దానిని దూరం చేయాలి. దీనిని ‘నిదానపరివర్జనం’ అంటారు. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్ -
చలి చంపేస్తోంది!
కర్నూలు(హాస్పిటల్), న్యూస్లైన్: బారెడు పొద్దెక్కినా నిద్ర లేచేందుకు శరీరం సహకరించని పరిస్థితి. వ్యాయామం చేసేందుకు తెల్లవారుజామున బయటకొస్తే చలి కొరికేస్తోంది. సాయంత్రం నుంచే ప్రజలు ముడుచుకుపోతున్నారు. వారం రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 8 గంటలు దాటినా తీవ్రత తగ్గడం లేదు. గరిష్టంగా 30, కనిష్టంగా 16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. గత నెల రోజులుగా వరుస తుపానులే ఇందుకు కారణంగా వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇకపై చలి తీవ్రత మరింత పెరుగుతుందనే సమాచారం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా మఫ్లర్లు, స్వెట్టర్లు, దుప్పట్లు, మంకీ క్యాప్లకు గిరాకీ పెరుగుతోంది. చిన్న పిల్లలను బయట తిప్పేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం, ఆస్తమా, అలర్జీ బాధితులు వైద్యుల వద్దకు పరుగులు తీస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త - డాక్టర్ జి.సుధాకర్, చిన్నపిల్లల వైద్యనిపుణులు చలికాలంలో బరువు తక్కువగా ఉండి జన్మించిన పిల్లలు, నెలలు నిండకముందే జన్మించిన చిన్నారులతో పాటు ఏడాదిలోపు వయస్సు చిన్నారుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వీరి శరీర ఉష్ణోగ్రత 36.5 డిగ్రీల సెల్సియస్, 98.4 ఫారెన్హీట్ డిగ్రీలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇళ్లలో ఉంటే తలుపులు, కిటికీలు మూసివేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో నులకమంచం కింద కుంపట్లు పెట్టేవారు. అలా కాకపోతే రూంహీటర్లు వినియోగించాలి. ఎట్టి పరిస్థితుల్లో చన్నీటి స్నానం చేయించకూడదు. గోరువెచ్చని నీటితో కాస్త ఎండపడ్డాక 5 నిమిషాల్లో స్నానం ముగించాలి. వ్యాధుల బారిన పడితే వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. -
ఆస్తమా - నివారణ హోమియో చికిత్సలు
మానవుడు జీవించాలంటే ప్రతిక్షణం శ్వాస ఎంతో ముఖ్యం. నీరు, ఆహారం లేకపోయినా కొన్నిరోజుల వరకు జీవించగలరు. కానీ కొన్ని క్షణాలు శ్వాస లేకపోతే శరీరం నిర్జీవమే. స్వచ్ఛమైన గాలి ద్వారా చాలావరకు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆస్తమా వలన వారి దైనందిన జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఏవైనా వాతావరణ మార్పులు, ఆహారంలో మార్పులు, కాలుష్యం, పొగ త్రాగడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఎక్కడికి వెళ్లాలన్నా అభద్రత భావానికి లోనవుతారు. 2005 లెక్కల ప్రకారం 115 మిలియన్లు అంటే ప్రపంచంలో 1/3 జనాభా ఇండియాలో ఉన్నారు. సుమారు 300 మిలియన్ల జనాభా ఆస్తమాతో బాధపడుతున్నారు. ఆస్తమా అంటే స్వేచ్ఛ లేని శ్వాస. ‘ఊపిరితిత్తులు దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందినే ఆస్తమా అంటారు. ముఖ్యంగా ఆస్తమా వ్యాధిగ్రస్తులలో అలర్జీ రియాక్షన్ ద్వారా శ్వాసకోశాలు, ఊపిరితిత్తులలో గాలిమార్గం అడ్డుకొని శ్వాస పీల్చుకోవటంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లికూతలు, దగ్గు, ఆయాసం, ఛాతిలో నొప్పి వంటి లక్షణాలు కనపడతాయి శ్వాసకోశ మార్గంలో వాపు, ఎరుపుదనం, శ్వాసనాళాలు కుంచించుకుపోవడం. బ్రాంకియల్ కండరాల స్పాసమ్ వలన శ్వాసమార్గ ప్రక్రియలో ఇబ్బందులు కూడా కనిపిస్తాయి. రోగ నిర్ధారణ వంశానుగత చరిత్ర, అలర్జీలు, ఎగ్జిమా, చర్మవ్యాధులు, చిన్నతనంలో శ్వాసకోశ జబ్బులు శారీరక పరీక్షలు, ముక్కు, గొంతు, ఛాతి పరీక్షలు ఎక్స్-రే కఫం పరీక్ష పీఎఫ్టీ అలర్జీ చర్మ పరీక్షలు: అలర్జెన్స్ను ఇంజెక్షన్ ద్వారా ఇచ్చి రియాక్షన్ చూడటం స్పైరోమెట్రి : శ్వాసమీటర్ ద్వారా పరీక్ష గుండె ఊపిరితిత్తులు, రక్తలోపం, కిడ్నీ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు ఏవైనా ఉంటే వాటి నిర్ధారణ. ఆస్తమాతో జీవించడమెలా? ఆస్తమాతో బాధపడేవారు కూడా సాధారణ వ్యక్తుల్లాగే తమ రోజువారీ పనులు చేసుకోవచ్చంటూ ప్రోత్సహించాలి. రాత్రి, పొద్దున్న వచ్చే శ్వాస ఇబ్బందులను నివారించటం, నిర్మూలించం, తగ్గించటం. ఎక్కువ శారీరక శ్రమలేని ఉపాధి చేసుకోవడం. దుమ్ము ధూళి, పొగ, చల్లటి వాతావరణాల నుండి దూరంగా ఉండటం. ఇంటి పరిసరాలు, ప్లాస్టిక్ బ్యాగ్స్, కార్పెట్స్, బెడ్షీట్స్, బెడ్స్, బ్లాంకెట్స్లో డస్ట్మైట్స్ (చిన్న పరాన్నజీవులు) ఉంటాయి కాబట్టి రోజుకొకసారి ఎండలో వేయటం, తరచూ నీటితో శుభ్రం చేయటం. పెంపుడు జంతువులను దూరంగా ఉంచాలి. ఎక్కువ తేమ శాతం ఉంటే డస్ట్మైట్స్ పెరుగుదల ఎక్కువగా ఉంటుందని గుర్తెరిగి అప్రమత్తంగా ఉండాలి. రోగ నివారణ బ్రాంకోడయలేటర్స్, కార్టికో స్టెరాయిడ్స్, ఆంటీబయాటిక్స్, స్ప్రేస్, మందులు... వీటివలన వెంటనే ఉపశమనం కలుగుతుంది. కాని వ్యాధి మళ్ళీ తిరగబెడుతుంది. దీర్ఘకాలికంగా వాడటం వలన మందుల సైడ్ఎఫెక్ట్స్, పిల్లల పెరుగుదల లోపాలు, మానసిక ఆందోళన, జ్ఞాపకశక్తి తరుగుదల, బరువు పెరగడం వంటివి కలగవచ్చు. ఆస్తమాను ఎలా నివారించవచ్చు? మెడిటేషన్, యోగా వలన చాలా వరకు నివారించవచ్చును. టొబాకో, పొగత్రాగడం, కాలుష్యపదార్థాలకు దూరంగా ఉండటం ద్వారా. స్వచ్ఛమైన గాలి, నీరు ఉన్న ప్రదేశాలలో నివసించడం ద్వారా. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే... వాళ్లకు ఆ ప్రదేశం వల్ల ఆస్తమా వస్తోందని గుర్తించి అక్కడి నుండి వేరే ప్రదేశానికి మారడం. హోమియో వైద్యం హోమియో వైద్యం ద్వారా ఆస్తమాకు చక్కటి చికిత్సను అందించవచ్చు. ముఖ్యంగా పిల్లలలో కలిగే అలర్జీలు, శ్వాసకోశ ఇబ్బందులు, శారీరక, మానసిక విశ్లేషణ ద్వారా వారి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ను గుర్తించి తగిన చికిత్స జరిపి, వ్యాధిని సమూలంగా తగ్గించవచ్చును. వాడదగిన మందులు ఆంటీమ్టార్ట్, యాంటీమోనియమ్ అర్స్, ఆర్సినిక్ ఆల్బ్, స్పాంజియా, లోబిలియా, నేట్రంసల్ఫ్, ఆరీలియా, కార్బొవెజ్ ఆస్తమాకు ముఖ్య కారణాలు చల్లగాలి (చల్లటి వాతావరణం) దుమ్ము ధూళి పొగ (సిగరెట్) అలర్జెన్స్, గడ్డిచెట్లు, ఫంగస్, పొల్యూషన్ కెమికల్ పర్ఫ్యూమ్స్ (ఘాటు వాసనలు) వైరల్ ఇన్ఫెక్షన్ పిల్లి, గుర్రం, కుక్క వంటి పెంపుడు జంతువుల విసర్జన పదార్థాలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా పిల్లలలో. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 7416107107 / 7416109109 -
దగ్గు ఆయాసం, అలర్జీ - అస్తమాకు హోమియోలో తగిన చికిత్స
మానవ శరీరం ఒక అద్భుతం! శరీరంలోని ఎలాంటి పదార్థాలు, క్రిములు వచ్చినా వాటిని ఎదుర్కొని పోరాడేలా దేవుడు దానిని నిర్మించాడు. దీనినే మనం ‘‘ఇమ్మూనిటీ’’ లేదా రోగ నిరోధక వ్యవస్థ అంటారు. దీని వలన మన శరీరంలోనికి గాలి ద్వారా, నీటిద్వారా, ఆహారం ద్వారా ఎలాంటి ప్రతికూల పదార్థములు బాక్టీరియా, వైరస్, ఫారెన్ ప్రొటీన్లు వచ్చినా తెల్లరక్తకణాలు వాటితో పోరాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే కొంత మందిలో ఈ వ్యాధినిరోధక వ్యవస్థ ఇతరులకు ఎలాంటి హాని కలిగించని పదార్థాల వలన కూడా సున్నితంగా ప్రతిస్పందిస్తుంది. దీనినే ‘‘హైపర్ సెన్సిటివీటి’’ లేదా ‘‘అలర్జీ’’ అని అంటారు. గాలిలో దుమ్ము, పుప్పొడి వంటివి ఉన్నప్పుడు అలర్జీతో బాధపడేవారికి ఇక అదే పనిగా వరుసబెట్టి తుమ్ములు వస్తాయి. ఆ తర్వాత ముక్కు ఎరుపెక్కి, జలుబు చేసి, పల్చని నీరులా స్రవిస్తుంది. దానితో పాటు కళ్ళు ఎరుపెక్కి కళ్ళ నుండి నీరు కారుతుంది. దీనిని అశ్రద్ధ చేసినట్లయితే ముక్కు దిబ్బడ, గాలి సరిగ్గా ఆడకపోవడం, గొంతులోనికి కళ్ళె వస్తూ ఉండడం, ముఖం లోపలిభాగంలో నొప్పి, తలనొప్పి మొదలైతే ‘‘అలర్జిక్ సైనసైటిస్’’ అని, గాలి గొట్టాలలోనికి, ఊపిరితిత్తులకు సోకి పొడి దగ్గు, కళ్లెతో కూడి దగ్గు మొదలైతే ‘‘అలర్జిక్ బ్రాంకైటిస్’’ అని ఆయాసం, ఎగపోయడం, పిల్లికూతలు వంటి లక్షణాలు కన్పిస్తే ‘‘అలర్జిక్ ఆస్థ్మా’’ అని అంటారు. ***************** దగ్గు అనేది సాధారణంగా అందరిలో కనిపించే ఒక లక్షణం. ఏదైనా దుమ్ము, ధూళి లేదా అలర్జీలు లోపలికి ప్రవేశించేటప్పుడు, దగ్గు అనే ప్రక్రియ ద్వారా అని బయటకు రావటం జరుగుతుంది. ఒక్కొక్కసారి పొడిదగ్గు లేదా శ్లేష్మంతో కూడిన దగ్గు కూడా వస్తూ ఉంటుంది. సాధారణంగా, దగ్గు చాలా ఎక్కువగా చిన్న పిల్లల వయసు నుంచి గమనిస్తూ ఉంటాము. శ్లేష్మంతో కూడిన దగ్గు ముక్కు నుంచి గొంతులోకి పోయి, అక్కడి నుంచి సైనస్ లేదా ఊపిరితిత్తులలోకి ప్రవేశించడం జరుగుతుంది. శ్లేష్మంతో కూడిన దగ్గుకి చాలా త్వరితంగా చికిత్స చేయలేకపోతే అది ఆస్త్మా కిందకు మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కారణాలు: వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన దీర్ఘకాలికంగా ఊపిరితిత్తులకు వ్యాధులుసోకిన గ్యాస్ట్రో ఈసోఫెజియల్ రిఫ్లక్స్ డిసీజ్తో ముక్కునుంచి వచ్చే స్రావం గొంతులోకి వెళ్ళటం పొగతాగటం దుమ్ము, ధూళిలో తిరగడం వలన ఏదైనా పదార్థం గొంతులో అడ్డుపడటం వలన ఇంచు మించు శ్లేష్మం ఉన్నా, లేకపోయినా, దగ్గు గనుక 2-3 రోజుల నుంచి మొదలై, 7 నుంచి 10 రోజులలో తగ్గిపోతుంది. దానిని ‘అక్యూట్ బ్రాంకైటిస్’ అంటారు. ఈ స్టేజ్లో ఉన్న వ్యాధికి సరిగ్గా చికిత్స లేకపోతే అది దీర్ఘకాలికంగా అంటే 2 నుంచి 3 నెలల వరకు పూర్తిగా తగ్గకుండా ఉంటే దానిని ‘క్రానిక్ బ్రాంకైటిస్’ అంటారు. కాని దగ్గు త్వరితంగా లేదా దీర్ఘకాలికంగా ఉన్నా, మొదటగా వ్యాధి నిరోధక వ్యవస్థ శక్తి క్షీణించటం వలన ఇన్ఫెక్షన్ శరీరం మీదకి ముఖ్యంగా వ్యక్తుల తత్తాన్ని బట్టి ఊపిరితిత్తుల మీదకు ప్రభావితం కావటం జరుగుతుంది. ఈ బ్రాంకైటిస్ సమస్యను మూలకారణం నుంచి ఎనాలిసిస్ చేయలేక, వ్యాధిని పూర్తిగా నివారించక పోతే ఇది ‘బ్రాంకియల్ ఆస్త్మా కింద మారుతుంది. దీనిలో ముఖ్యంగా విపరీతమైన దగ్గు, ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవటం, ఛాతీ అంతా పట్టేసినట్లు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ***************** కొంతమందికి వంకాయ, మునక్కాయ, పల్లీలు వంటి ఆహార పదార్థాలు తినగానే శరీరంపైన దద్దుర్ల మాదిరిగా ఎర్రగా, ఉబ్బెత్తుగా, తీవ్రమైన దురద వస్తాయి. ఈ ర్యాష్ 24 గంటల్లో తగ్గుతుంది. కొంతమందిలో లేటెక్స్ సంబంధిత వస్తువులు తగిలిన స్థలాలో చర్మమంతటా పొక్కులు వస్తాయి. దీనిని ‘అలర్జిక్ డెర్మటైటస్’ అని అంటారు. ఇలా అలర్జీలలో అనేక రకాలు ఉన్నప్పటికి ఎక్కువ మందిలో కనబడేవి శ్వాసకోశ సంబంధిత అలర్జీలు. అనగా రైనైటిస్, సైనసైటిస్, బ్రాంకైటిస్, బ్రాంక్రియల్ ఆస్త్మా. శ్వాసకోశ సంబంధిత అలర్జీలను కలిగించే వాటిలో ప్రధానమైనవి-పుప్పొడి, దుమ్ములో ఉండే క్రిములు, మోల్డ్, బొద్దింకలు, పశువుల పేడ మొదలైనవి. కొంతమందికి పూలవాసన, పర్ఫ్యూమ్స్, కూరపోపు లాంటివి కూడా పడవు. ************** పాజిటివ్ హోమియోపతిలో ఈ దగ్గు, ఆయాసం, అలర్జీ, ఆస్త్మాలకు పూర్తిస్థాయిలో పరిష్కారం ఉంటుంది. వ్యాధి త్వరితంగా ఉన్నా లేదా దీర్ఘకాలికంగా ఉన్నా, దాని మూలకారణం నుంచి వ్యాధిని తీసేయాలి.ముఖ్యంగా తత్వం ప్రకారం చికిత్సను మొదలు పెట్టి, ఏదైనా మానసిక ఒత్తిడి, ఆందోళనలు ఉంటే, ఆ మానసిక స్థాయి నుంచి చికిత్సను ఇవ్వడం ఉత్తమం. వాతావరణంలో ఉండే మార్పులను బట్టి మనిషి తత్వాన్ని ఎనాలసిస్ చేసి, చికిత్సను ఇస్తే పూర్తి స్థాయిలో పరిష్కారం ఉంటుంది. డా॥టి. కిరణ్కుమార్ పాజిటివ్ హోమియోపతి అపాయింట్మెంట్ కొరకు 9246199922 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై www.positivehomeopathy.com