baba
-
Mahakumbh Mela 2025: పర్యావరణం బాబా..ఏకంగా తల పైనే పంటలు పండిస్తున్నాడు..!
ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న ఈ మహా కుంభమేళ(Mahakumbh Mela 2025)లో రకరకాల బాబాలు దర్శనమిచ్చి ఆశ్చర్యపరుస్తున్నారు. పావురం బాబా నుంచి, ఇంజనీర్ బాబాల వరకు అందరిది ఒక్కో నేపథ్యం కానీ వాందర్నీ ఒకచోట చేర్చింది ఈ ఆధ్యాత్మికతే. ఈ కుంభమేళాలో కొందరి బాబాల బ్యాగ్రౌండ్ ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. ఇంకొందరూ అందరి హితం కోరేలా జీవనం సాగిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన మరో బాబా ఈ మహాకుంభమేళలో హైలెట్గా నిలిచాడు. పర్యావరణ స్ప్రుహ కలిగించేలా అతడి ఆహార్యం ఎలా ఉందే చూస్తే కంగుతింటారు.ఈ పర్యావరణ బాబా పేరు అనాజ్ వాలే బాబా(Anaaj Wale Baba). ఈయన ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రకు చెందిన బాబా. పర్యావరణం కోసం ఎంతమంది పాటుపడ్డారు. కానీ ఈ బాబా అత్యంత విభిన్నమైన శైలిలో పాటుపడుతూ..అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను పంటలనే(crops) ఏకంగా తన తల(Head)పై పండిస్తున్నాడు. మిల్లెట్లు, గోధుమలు, పప్పుధాన్యాలు, బఠానీల(wheat, millet, gram, and peas)తో సహా చాలా రకాల పంటలను తలపై పండించాడట. ఈ అసాధారణ ప్రయత్నాన్ని గత ఐదేళ్లు నుంచి చేస్తున్నట్లు తెలిపాడు ఆ బాబా. కేవలం అటవీ నిర్మూలనపై అవగాహన పెంచడం, పచ్చదనాన్ని ప్రోత్సహించడమే తన అసాధారణ ప్రయత్నం వెనుకున్న లక్ష్యమని అన్నారు అనాజ్ వాలే బాబా. చెట్లు నరకడం వల్ల యావత్తు ప్రపంచంపై ఎలాంటి ప్రభావితం చూపుతుందో తెలియడంతో ఇలా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. తన అసాధారణ విధానమైన పనితో ప్రజలు ప్రభావితమై మరిన్ని మొక్కలు నాటి పచ్చదనంతో కళకళలాడేలా చేస్తారనేది తన ఆశ అని అన్నారు. ఈ కారణాల రీత్యా మహా కుంభమేళా కోసం కిలా ఘాట్ సమీపంలో ఉంటున్న ఈ అనాబ్ వాలే బాబా అందరి దృష్టిని ఆకర్షించేలా హైలెట్గా నిలిచారు. ఈ కుంభమేళాకి వచ్చే సందర్శకులు అతడి అసాధారణమైన ప్రయత్నానికి ఫిదా అవ్వడమే గాక ఆశ్చర్యపోతున్నారు. అంకితభావంతో తలపై మొక్కలను పెంచుతున్నారు. క్రమతప్పకుండా వాటికి నీళ్లు పోసి వాటి బాగోగులు చూస్తుంటారా బాబా. ఆయన దీన్ని హఠ యోగతో మిళితమైన పర్యావరణ కార్యకర్తగా చెబుతుంటాడు. ఒకరకంగా ఇది ఆధ్యాత్మిక, పర్యావరణ బాధ్యతల మధ్య సామరస్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ మేళా ముగినిస తర్వాత కూడా ఈ అనాజ్ వాలే బాబా సోన్భద్రకు తిరిగి వచ్చి అటవీకరణ, పర్యావరణంతో ఈ పుడమి కళకళలాడేలా ప్రోత్సహించే లక్ష్యాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిపారు.కాగా, ఈ మహా కుంభమేళాలో సామాజిక పర్యావరణ విలువలను ప్రోత్సహించేలా ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. జనవరి 13న మొదలైన ఈ కుంభమేళా, ఫిబ్రబరి 26,2025తో పూర్తవనుంది. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ స్థలమైన ఈ పవిత్ర ప్రదేశంలో సాన్నాలు చేస్తే పాపాలు పోతాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకం.(చదవండి: 'ఇంజనీర్ బాబా': ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫోటోగ్రఫీ వదిలి మరీ..) -
Maha Kumbh Mela 2025: ‘కండల బాబా’ స్పెషల్ ఎట్రాక్షన్, ఎవరీ బాహుబలి
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న 2025 మహా కుంభమేళా(Maha Kumbh Mela2025) కు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్న ఈ ఆధ్యాత్మిక వేడుకకు కేవలం భారతీయులేకాదు, సాధువులు కూ విదేశీ ప్రముఖులు, సందర్శకులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. అయితే ఈ మహా కుంభమేళాలో రష్యాకు చెందిన "కండరాల బాబా" విశేషంగా నిలుస్తున్నాడు. ఈయన ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.కాషాయ దుస్తులు ధరించి, కండలుతిరిగిన దేహంతో కనిపిస్తున్న ఈయన స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచాడు. భుజాన పెద్ద బ్యాగ్, మెడలో రుద్రాక్ష మాల, ముఖంలో కాంతివంతమైన తేజస్సు, ఏడు అడుగుల అందమైన రూపంతో ఈ సాధువు ఆకర్షిస్తున్నాడు. కెవిన్బుబ్రిస్కీగా ఇన్స్టాగ్రామ్లో షేర్ అయిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయ్యాయి.కండల బాబా అసలు పేరు ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్(Atma Prem Giri Maharaj) ఈ "కండల బాబా" రష్యాకుచెందిన వాడు. ఇపుడు నేపాల్లో నివసిస్తున్నాడు. అతను దాదాపు 30 సంవత్సరాల క్రితం హిందూ మతాన్ని స్వీకరించాడు. బలమైన శరీరంతో ఉండటంతో చాలా మంది అతనిని పరశురాముడి అవతారంగా పిలుస్తారట. ఆత్మ ప్రేమగిరి మహారాజ్ ఒకప్పుడు రెజ్లర్. తన బోధనా వృత్తిని విడిచి పెట్టి మరీ నేపాల్లో హిందూ మతాన్ని ప్రోత్సాహం కోసం కృషి చేస్తున్నారు.ఒకప్పుడు పైలట్ బాబా శిష్యుడిగా ఉన్న ప్రేమ్గిరి మహారాజ్ప్రస్తుతం జునా అఖారా సభ్యుడు. ఆత్మ ప్రేమ్ గిరి గంటల తరబడి వ్యాయామం చేయడానికి ఇష్టపడతాడట.కాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ప్రయాగ్రాజ్ పుణ్యక్షేత్రంలో మహాకుంభమేళాఅంగరంగ వైభవంగా జరుగుతోంది. పవిత్ర గంగా, యమున, సరస్వతి సంగమంలో స్నానాలు, "హర హర మహాదేవ" అనే భక్త కోటి నినాదాలతో మహాకుంభమేళా మార్మోగుతోంది.ఇదీ చదవండి: అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు -
నాగ సాధువుగా తొలి విదేశీయుడు..!
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా(Maha Kumbh 2025) జరుగుతోంది. దేశం నుంచే నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కుంభమేళాకు తరలివస్తున్నారు. ఈ కుంభమేళలో ఎందరో విచిత్రమైన బాబాలు, వారి నేపథ్యం విస్తుగొలిపే విధంగా ఉండటం చూశాం. యావత్తు భారతావనిలో ఆద్యాత్మికత శోభ ఎంతగా తనలోకి మేధావులు, మహా మహులను ఆకళింపు చేసుకుని కాంతిలీనుతోందనేది ఈ మహోత్సవం ఎలుగెత్తి చాటుతోంది. తాజాగా అలాంటి మరో ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. తొలిసారిగా ఓ విదేశీయుడు నాగసాధువుగా మారి ఈ కుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అతడు ఏ దేశస్తుడంటే..భారతదేశపు ప్రాచీన జునా అఖారాకు(Juna Akhara) చెందిన నాగసాధుగా దీక్ష పొందిన తొలి విదేశీయుడు. ఆ వ్యక్తి పేరు బాబా రాంపురి(Baba Rampuri,). అమెరికాకు చెందిన వ్యక్తి. చికాగోలోని పిల్లల వైద్యుడు డాక్టర్ స్టీఫెన్ ఎల్. గాన్స్కు జన్మించిన విలియం ఎ. గాన్స్ ఈ బాబా రాంపురి. అతడు భారతీయ తత్వశాస్త్రం పట్ల అమితంగా ఆకర్షితుడయ్యాడు. భారతీయ తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో ప్రసిద్ధిగాంచిన అలాన్ వాట్స్ వంటి మహోన్నత వ్యక్తుల నుంచి ప్రేరణ పొంది 1969లో భారతదేశానికి వచ్చాడు.ఇక్కడ బాబా రాంపరి యోగా హరిపురి మహారాజ్ శిష్యుడయ్యాడు. అలా ఆయన భారత్లోని నిగూఢమైన నాగ సాధువులకు చెందిన జునా అఖారాలో నాగబాబాగా దీక్ష తీసుకున్నాడు. ఆ విధంగా ఆయన ఆది శంకరుల కాలంలోని యోగుల గురువు అయిన భవాన్ దత్తాత్రేయుడికి సంబంధించిన గౌరవనీయ వంశంలో దీక్ష పొందిన తొలి విదేశీయడుగా నిలిచాడు బాబా రాంపురి.అంతేగాదు ఆయన రాసిన "ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ సాధు: యాన్ ఆంగ్రేజ్ అమాంగ్ నాగ బాబాస్" పుస్తకంలో 1971లో అలహాబాద్ మహా కుంభమేళా సమయంలో తాను నాగసాధువుగా మారిన క్రమం గురించి చెప్పుకొచ్చారు. తన ఆత్మకథలో భారతదేశాన్ని ఉనికిలోని తీసుకరావాలని కలలు కంటున్నానని, ఈ ప్రదేశం మనసుకు శాంతినిచ్చే యోగా వంటి ఆధ్యాత్మికతకు నిలయం అని రాశారు. ఈ భూమి మీద వినిపించే శబ్దాలు, కనిపించే ముఖాలు అన్ని తనకు పరిచయమున్నట్లుగా అనిపిస్తుందని, ఈ దేశంతో ఏదో తెలియని రక్తసంబంధం ఉంది అంటూ ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. ఇక బాబా రాంపురికి 2010 హరిద్వార్లో జరిగిన కుంభమేళాలో, బాబాకు జూనా అఖారా కౌన్సిల్లో శాశ్వత స్థానంతో సత్కారం లభించింది. అలాగే ఆయనకు 'అంతరాష్ట్రీయ మండల్ కా శ్రీ మహంత్' అనే బిరుదుని కూడా పొందారు. (చదవండి: 'ఇంజనీర్ బాబా': ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫోటోగ్రఫీ వదిలి మరీ..) -
మహాకుంభ్కు వింత బాబాలు.. షాకవుతున్న జనం
భారతదేశంలో 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ కార్యక్రమం ఆధ్యాత్మికతకు కేంద్రంగా ఉండటమే కాకుండా, హిందూతత్వానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. కుంభమేళా సమయంలో విచిత్ర వేషధారణ కలిగిన, స్వామీజీలు బాబాలు కనిపిస్తుంటారు. కంప్యూటర్ బాబా మొదలుకొని హిట్లర్ బాబా వరకు వింతవింత వేషధారణలు కలిగిన బాబాలు ప్రయాగ్రాజ్లో కనిపిస్తారు. వీరిని చూసిన జనం తెగ ఆశ్చర్యపోతుంటారు.కంప్యూటర్ బాబా: అసలు పేరు నామ్దేవ్ దాస్ త్యాగి. ఆధునిక సాంకేతికత-మత విశ్వాసలకు ప్రతీకగా కనిపిస్తారు. ఈ బాబా సాంకేతిక జ్ఞానంతో పాటు మతపరమైన జ్ఞానాన్ని కూడా బోధిస్తారు. అందుకే ఈయనకు కంప్యూటర్ బాబా అనే పేరు వచ్చింది. ఈ బాబా ల్యాప్టాప్, మొబైల్ఫోన్ లాంటి ఆధునిక గాడ్జెట్లను ఉపయోగిస్తారు. పర్యావరణ పరిరక్షణ, గంగా నది శుద్ధి తదితర అంశాలపై అందరికీ అవగాహన కల్పిస్తుంటారు.హిట్లర్ బాబా: ఈయన కుంభమేళాలో తన కఠినమైన క్రమశిక్షణ, ప్రత్యేకమైన దుస్తుల పరంగా పేరొందారు. ఆయన పేరు వినగానే జర్మన్ నియంత హిట్లర్ గుర్తుకు వస్తాడు. హిట్లర్ బాబా తాను క్రమశిక్షణ, స్వావలంబనను అనుసరిస్తుంటానని చెబుతుంటారు.జఠాశంకర్ బాబా: ఈయన పొడవైన కురులతో అందరినీ ఆకర్షిస్తుంటారు. కఠినమైన తపస్సుకు ప్రసిద్ధి చెందారు. హిమాలయాల గుహలలో ఏకాంతంగా ధ్యానం చేస్తుంటారు. త్యాగం, తపస్సుల ప్రాముఖ్యతను అందరికీ చెబుతుంటారు.గోల్డెన్ బాబా: తన అసాధారణ జీవనశైలి కారణంగా గోల్డెన్ బాబా వార్తల్లో నిలుస్తున్నారు. బంగారు ఆభరణాలను ధరిస్తారు. కుంభమేళాలో కనిపించే ఈయన తన బంగారు ఆభరణాలతో భక్తులను ఆకర్షిస్తుంటారు.అఘోరి సాధువులు: అఘోరి సాధువుల ఉనికి కుంభమేళాలో కనిపిస్తుంది. ఈ తరహా సాధువులు శ్మశాన వాటికలలో నివసిస్తుంటారు. మరణాన్ని ఒక ఆధ్యాత్మిక అనుభవంగా భావిస్తారు. అఘోరి సాధువులు అసాధారణమైన సాధనా మార్గాలను అవలంబిస్తారు.నాగ సాధువులు: కుంభమేళాలో నాగ సాధువులు కనిపిస్తారు. ఈ దిగంబర (నగ్న) సాధువులు కఠినమైన జీవనశైలి కలిగివుంటారు. కుంభమేళాలో నాగ సాధువుల రాజ స్నానం ప్రముఖమైనదిగా భావిస్తారు.మహిళా సాధువులు: కుంభమేళాలో పురుష సాధువులే కాకుండా, మహిళా సాధువులు కూడా తమ ఉనికిని చాటుకుంటారు. త్రికాల భవన్త, సాధ్వి మమత తదితర సాధువులు ఆధ్యాత్మిక సందేశాలను అందిస్తారు. మహిళా సాధికారతకు ప్రతీకగా కనిపిస్తారు.ఇది కూడా చదవండి: Maha Kumbh 2025: ప్రయాగ్రాజ్కు స్టీవ్ జాబ్స్ సతీమణి -
Mahakumbh-2025: అంబాసిడర్ బాబా.. 35 ఏళ్లుగా కారులోనే సాధన
జనవరి 13 నుండి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేళాకు దేశ విదేశాల నుండి స్వామీజీలు, బాబాల రాక మొదలయ్యింది. వీరిలో కొందరు బాబాలు అక్కడి జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఇదేకోవలో ప్రయాగ్రాజ్కు వచ్చారు అంబాసిడర్బాబా.మధ్యప్రదేశ్ నుంచి అత్యంత పురాతన అంబాసిడర్ కారులో వచ్చిన ఒక బాబా.. అంబాసిడర్ బాబా(Ambassador Baba)గా పేరొందారు. ఆయనను ఇక్కడివారు ఆశ్చర్యంగా గమనిస్తున్నారు. ఈ బాబా 52 ఏళ్ల క్రితం నాటి అంబాసిడర్ కారులో నిత్యం ప్రయాణిస్తుంటారు. ఈ నేపధ్యంలోనే ఆయన తనకు తాను అంబాసిడర్ బాబా అని పేరు పెట్టుకున్నారు. ఇంతకీ ఈ అంబాసిడర్ బాబా ఎవరనే మూలాల్లోకి వెళితే.. ఈయన అసలు పేరు మహంత్ రాజగిరి. ఈయన మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుండి ప్రయాగ్రాజ్కు తరలి వచ్చారు. కుంభమేళా తరహాలో జరిగే కార్యక్రమాలలో పాల్గొంటూ ఆయన తన ఉనికిని చాటుకుంటారు. మహంత్ రాజగిరి తన ఉద్యోగాన్ని, కుటుంబాన్ని విడిచిపెట్టారు. ఒక్క అంబాసిడర్ కారును మాత్రమే తన వద్ద ఉంచుకున్నారు.అంబాసిడర్ బాబా కొన్ని దశాబ్ధాలుగా ఈ కారులోనే నివసిస్తున్నారు. ఈ కారును ఆయన 35 ఏళ్ల క్రితం విరాళం(Donation)గా అందుకున్నారు. అప్పటి నుంచి మహంత్ రాజగిరి ఈ కారునే తన నివాసంగా చేసుకున్నారు. ఆయన ఈ అంబాసిడర్ కారుకు కాషాయ రంగు పెయింట్ వేయించారు. ఈ అంబాసిడర్ కారు 1972 మోడల్. అంబాసిడర్ బాబా గతంలో నాలుగు కుంభమేళాలకు ఈ కారులోనే హాజరయ్యారు. ఆయన ఈ కారులోనే తినడం, పడుకోవడం చేస్తుంటారు. ఈ కారు తనకు అమ్మలాంటిదని అంబాసిడర్ బాబా తెలిపారు. ప్రయాగ్రాజ్ వచ్చిన ఆయన సంగమనగరి(Sangamnagari)లో ఒక గుడిసెలో బసచేస్తున్నారు. ఆ గుడిసె ముందర తన అంబాసిడర్ కారును నిలిపివుంచారు. ఈ కారులోనే కూర్చుని ఆయన ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘డిజిటల్ మహాకుంభ్’.. సంస్కృతి, సాంకేతికతల కలబోత -
Mahakumbh Mela: ‘ధాన్యం బాబా’ తలపై పంటలు.. చూసేందుకు జనం క్యూ
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా సందడి నెలకొంది. ఈ నెల 13 నుంచి ఇక్కడ కుంభమేళా జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇంతలో పలువురు బాబాలు, స్వామీజీలు కుంభమేళా ప్రాంతానికి చేరుకుంటున్నారు. వీరిలో కొందరి వేషధారణ అందరినీ ఆకట్టుకుంటోంది. అలాంటివారిలో ఒకరే అనాజ్వాలీ బాబా.బాబా అమర్జీత్ ‘అనాజ్వాలీ బాబా’('Anajwali Baba')గా పేరొందారు. ఈయనను చూసేందుకు జనం ఉత్సాహం చూపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాకు చెందిన బాబా అమర్జీత్ బాబా తన తన తలపై ధాన్యం, గోధుమలు, మినుములు లాంటి పంటలను పండిస్తూ, అందరినీ విశేషంగా ఆకర్షిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఆయన పర్యావరణ పరిరక్షణ గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు ఈ తరహా విధానాన్ని అవలంబిస్తున్నారు.హఠ యోగి అమర్జీత్ బాబా మీడియాతో మాట్లాడుతూ తాను చేస్తున్న ఈ ప్రయత్నం ప్రపంచంలో శాంతిని పెంపొందించడానికి, పచ్చదనం(Greenery) ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడానికి ఒక మార్గమన్నారు. అటవీ నిర్మూలన అనేది పర్యావరణానికి హాని కలిగిస్తున్నదన్నారు. చెట్లను నరికివేయడం కారణంగా మన పర్యావరణానికి జరుగుతున్న చేటును గుర్తించి, తాను తన తలపై పంటలను పండిస్తూ, అందరికీ పర్యావరణ ప్రాముఖ్యతను తెలియజేయాలని అనుకున్నానని అమర్జీత్ బాబా తెలిపారు.తాను ఎక్కడికి వెళ్లినా అక్కడి జనం పచ్చదనాన్ని పెంచిపోషించేలా ప్రోత్సహిస్తానని, తన తలపై ఉన్న పంటలకు క్రమం తప్పకుండా నీటిని చిలకరిస్తూ వాటిని పోషిస్తానని తెలిపారు. బాబా మాటలు విన్నవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం కిలా ఘాట్ సమీపంలో ఈ ధాన్యం బాబా ఉంటున్నారు. ఇతనిని చూసేందుకు జనం క్యూ(Queue) కడుతున్నారు. బాబా తన తలపై పంటలను ఎలా పండిస్తున్నాడో చూసి తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇది కూడా చదవండి: బీహార్ భూకంపం: 90 ఏళ్ల క్రితం ఇదేవిధంగా.. చెరగని ఆనవాళ్లు -
Mahakumbh 2025: లక్షలాది రుద్రాక్షలు ధరించి ప్రయాగ్రాజ్కు..
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 2025, జనవరి 13 నుంచి జరగబోయే మహాకుంభమేళాకు ఘనంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లక్షలాది రుద్రాక్షలు ధరించి ఇక్కడికి వచ్చిన ‘రుద్రాక్ష్ వాలే బాబా’ గీతానంద్ గిరి అందరినీ ఆకర్షిస్తున్నారు.గీతానంద్ గిరి మీడియాతో మాట్లాడుతూ ‘నేను 12 ఏళ్లుగా రుద్రాక్ష ధారణ తపస్సు చేస్తూ వస్తున్నాను. 'రుద్రాక్ష' శివునికి ప్రీతికరమైనది. అలహాబాద్ అర్ధ కుంభమేళా నుంచి నేను రుద్రాక్షలు ధరించడం మొదలుపెట్టాను. నా తపస్సు రాబోయే అర్ధ కుంభమేళాతో ముగుస్తుంది. దీనికి ఇంకా ఆరేళ్లు మిగిలివుంది. నేను 11 కిలోల బరువు కలిగిన రుద్రాక్షలను తొలుత ధరించాను. ఇప్పుడు రుద్రాక్షల బరువు 45 కిలోలకు చేరింది. నేను మొత్తం 1.25 లక్షల 'రుద్రాక్షలను ధరించాల్సి ఉంది. ఇది 925 దండలుగా వస్తుంది. తాను చేస్తున్న ఈ తపస్సు దేశంలో సనాతన ఉద్ధరణకేనని గీతానంద్ గిరి తెలిపారు. #WATCH | Prayagraj, Uttar Pradesh: 'Rudraksh Wale Baba' Gitanand Giri who is in the city for Maha Kumbh Mela 2025, says, "...This is my 'tapasya' of 12 years. 'Rudraksh' is dear to Lord Shiv...I started from Allahabad Ardha Kumbh Mela and it will culminate in the upcoming Ardha… pic.twitter.com/9z9z4lah41— ANI (@ANI) December 16, 2024ప్రయాగ్రాజ్లో నిర్వహించబోయే మహాకుంభమేళా కేవలం మతపరమైన పండుగ మాత్రమే కాదని, లక్షలాది మంది భక్తుల ఆధ్యాత్మిక, పవిత్ర మనోభావాలకు ఆధారమని పండితులు చెబుతున్నారు. కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానాలు చేయడం ద్వారా ముక్తి లభిస్తుందని భక్తులు భావిస్తుంటారు. కుంభమేళా ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుండగా, మహాకుంభమేళా ప్రతి 144 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది.ఇప్పుడు జరుగుతున్నది మహాకుంభమేళా. హిందువులు మహాకుంభమేళాను అత్యున్నతమైన ఉత్సవంగా భావిస్తారు. కుంభమేళా ప్రయాగ్రాజ్తో పాటు హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ప్రత్యేక ఖగోళ స్థితిలో ఉన్న సమయంలో కుంభమేళా నిర్వహిస్తారు. ఈ సమయంలో గంగా, క్షిప్రా, గోదావరి నదుల నీరు చాలా పవిత్రంగా మారుతుందని చెబుతుంటారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎప్పటికీ గుర్తుండే 10 రాజకీయ ఘటనలు -
ధీరేంద్రశాస్త్రిని ఆస్ట్రేలియా నుంచి రప్పించిన అంబానీ
ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని అత్యంత ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా జరిగిన వివిధ వేడుకలకు హాజరైన అతిథుల సంఖ్య కూడా భారీగానే ఉంది.బాలీవుడ్ సెలబ్రిటీలు మొదలుకొని ప్రపంచంలోని ప్రముఖ గాయకులు, నేతలు ఈ పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం అనంత్ అంబానీ, రాధికలను ఆశీర్వదించేందుకు ప్రముఖ సాధువులు కూడా తరలివచ్చారు. ఈ వివాహానికి తాను ఎలా హాజరైనదీ మధ్యప్రదేశ్లోని బాగేశ్వర్ ధామ్కు చెందిన స్వామీజీ ధీరేంద్ర శాస్త్రి ఒక ప్రసంగంలో తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన బాబా బాగేశ్వర్ ధామ్ ఫేస్బుక్ హ్యాండిల్లో షేర్ చేశారు.అనంత్ అంబానీ వివాహానికి సంబంధించి తనకు ఆహ్వానం అందిందని, అయితే తాను అప్పుడు ఆస్ట్రేలియాలో ఉండటంతో తొలుత నిరాకరించానని ధీరేంద్ర శాస్త్రి తెలిపారు. అయితే అంబానీ తన కోసం ఆస్ట్రేలియాకు విమానాన్ని పంపారని, సకల సదుపాయాలు ఏర్పాటు చేశారని, దీంతో తాను అనంత్ అంబానీ వివాహానికి హాజరయ్యానన్నారు. తనతో పాటు కొందరు శిష్యులు కూడా విమానంలో ముంబై చేరుకున్నామని తెలిపారు. అనంతరం అనంత్, రాధికలను ఆశీర్వదించి, తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయామన్నారు. -
హత్రాస్ తొక్కిసలాట: ‘బోలేబాబా’ లాయర్ సంచలన కామెంట్స్
న్యూఢిల్లీ: హత్రాస్ తొక్కిసలాటకు సంబంధించి బోలేబాబా న్యాయవాది సింగ్ తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. జులై 2న హత్రాస్ సత్సంగ్లో కొందరు వ్యక్తులు విషపూరిత డబ్బాలను తెరిచారని, దీనివల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. ఈ విషయాన్ని కొందరు ప్రత్యక్ష సాక్షులు తనతో చెప్పినట్లు సింగ్ తెలిపారు. ఆదివారం(జులై 7) ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగ్ మాట్లాడారు. పెరిగిపోతున్న బోలేబాబా పాపులారిటీని ఓర్వలేకే ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. ‘తొక్కిసలాటకు ముందు 15 మంది దాకా దుండగులు అక్కడ విషపూరిత డబ్బాలను తెరిచారు. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు నన్ను కలిసి చెప్పారు. తొక్కిసలాటలో చనిపోయిన వారి పోస్టుమార్టం రిపోర్టులను పరిశీలిస్తే వారు ఊపిరాడకపోవడం వల్లే చనిపోయారని స్పష్టంగా తెలుస్తుంది. అంతేగాక సత్సంగ్ సమీపంలోనే దుండగులు పారిపోయేందుకు వాహనాలు కూడా సిద్ధం చేసి ఉంచుకున్నారు. ఇందుకు మా వద్ద ఆధారాలున్నాయి. సాక్షులకు సెక్యూరిటీ ఇవ్వాలి’అని సింగ్ కోరారు.జులై 2న ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో బోలేబాబా సత్సంగ్లో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఘటనపై విచారణకుగాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ను కూడా నియమించింది. -
అమర్నాథ్ యాత్ర: కరిగిన మంచు శివలింగం.. భక్తుల నిరాశ
జమ్ముకశ్మీర్లో అమర్నాథ్ యాత్ర కొనసాగుతోంది. అయితే తాజాగా భక్తులను నిరాశపరిచే ఒక వార్త వినిపిస్తోంది. అమర్నాథ్ గుహలో అంతకంతకూ పెరుగుతున్న వేడి కారణంగా మంచు శివలింగం అకాలంగా కరిగిపోయింది. దీంతో భక్తులు మహా శివలింగాన్ని దర్శించుకోలేని పరిస్థితి ఏర్పడింది. గుహలో నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా ఈరోజు(శనివారం) అమర్నాథ్ యాత్ర బల్తాల్, పహల్గాం రెండు మార్గాలలోనూ వాయిదా పడింది. వాతావరణం అనుకూలించిన వెంటనే యాత్ర ప్రారంభం కానున్నదని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1.5 లక్షల మందికి పైగా భక్తులు అమర్నాథ్ గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. అయితే తాజాగా పవిత్ర గుహలోని మంచు శివలింగం పూర్తిగా కరిగిపోవడంతో యాత్రికులు నిరాశకు గురయ్యారు.గత వారం రోజులుగా ఈ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో మంచు కరిగే ప్రక్రియ వేగవంతమైందని అధికారులు చెబుతున్నారు. యాత్ర ప్రారంభమైన 10 రోజుల్లోనే మంచు శివలింగం పూర్తిగా కరిగిపోవడం 2008 తర్వాత ఇప్పుడే చోటుచేసుకుంది. ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్ర 52 రోజుల పాటు కొనసాగనుంది. జూన్ 29న ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 19న ముగియనుంది. -
లగ్జరీ కార్లు, ఆశ్రమాలు.. భోలే బాబా ఆస్తులు రూ. 100 కోట్లకు పైనే!
ఉత్తర్ప్రదేశ్లోని హథ్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు కారణమైన సూరజ్ పాల్ అలియాస్ నారాయణ్ హరి సాకర్ అలియాస్ భోలే బాబాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. హథ్రాస్ తొక్కిసలాటలో 121 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఆచూకి తెలియరాలేదు.అయితే ఈ విషాదంపై దర్యాప్తులో భాగంగా ఆయన ఆదాయం, సంపద వెలుగు చూసింది. గత ఇరవై ఏళ్ల కాలంలో భేలే బాబా దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారు. నిత్యం తెల్లటి సూటు, బూట్లు, టై, నల్ల కండ్లద్దాలతో కనిపించే భోలే బాబా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. కాస్గంజ్, ఆగ్రా, కాన్పూర్, గ్వాలియర్ సహా దేశవ్యాప్తంగా మొత్తం 24 విలాసవంతమైన ఆశ్రమాలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా యూపీలోనే ఉన్నాయి. శ్రీ నారాయణ్ హరి సాకార్ ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట వీటిని నిర్వహిస్తుంటారు. అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్లే వీటి నిర్వహణ బాధ్యతలను చూస్తుంటారు.ఇక భోలే బాబా సూరజ్పాల్ మెయిన్పురిలోని విలాసవంతమైన హరి నగర్ ఆశ్రమంలో నివాసముంటారు. ఈ ఆశ్రమం మొత్తం 13 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. రాజభవనాన్ని పోలి ఉన్న ఈ ఆశ్రమాన్ని రూ. 4 కోట్లతో నిర్మించారు.ఆయన భక్తులలో ఒకరు ఈ స్థలాన్ని బాబాకు విరాళంగా ఇచ్చినట్లు సమాచారం.ఇందులో భోలే బాబా, ఆయన భార్య కోసం అందులో దాదాపు ఆరు విలాసవంతమైన గదులు ఉంటాయని సమాచారం. ఆశ్రమంలోకి ప్రవేశిస్తుండగానే దానికి విరాళాలిచ్చిన 200 మంది పేర్లు కనిపిస్తాయని తెలుస్తోంది. వాటిపై రూ.10 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఇచ్చిన దాతల వివరాలు ఉంటాయని సమాచారం. ఇటావాలో మరో కొత్త ఆశ్రమం నిర్మాణంలో ఉంది.ఆయనకు దాదాపు 16 మంది వ్యక్తిగత కమాండోలు ఉంటారు. అనుచరులకు దర్శనమిచ్చే సమయంలో భోలే బాబా తెల్లటి టయోటా ఫార్చునర్ కారులో వస్తాడు. అందులో బాబా ప్రయాణిస్తుండగా.. ముందు ఆయన కమాండోలు బైక్లపై దారిని క్లియర్ చేస్తారు. అదే విధంగా వెనుక దాదాపు 30 లగ్జరీ కార్లతో ఆయన కాన్వాయ్ ఉంటుంది. ఇక భోలే బాబా ఉపయోగించే కారు ఇంటీరియర్ మొత్తం తెలుపు రంగులోనే ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంది.యూపీలోని ఎటా జిల్లా బహదూర్ గ్రామానికి చెందిన సూరజ్ పాల్ మొదట తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు. తర్వాత పోలీసు శాఖలో ఉద్యోగంలో చేరి 18 ఏళ్ల పాటు పని చేశాడు. ఈ సమయంలోనే తాను ఇంటలిజెన్స్ బ్యూరోలో పని చేస్తున్నట్టు చెప్పుకొని జనాన్ని బురిడీ కొట్టించేవాడు. తనకు తాను భగవంతుడి ప్రతిరూపంగా ప్రచారం చేసుకుంటున్న భోలే బాబా 1999లో కానిస్టేబుల్ ఉద్యోగం వదిలి బోధించడం ప్రారంభించాడు. ఖరీదైన వస్తువులు, కార్లపై ప్రీతి కలిగిన ఆయనకు విలాసవంతమైన కార్లు ఉన్నాయి. వీటిని తన భక్తుల పేర్లతో కొనుగోలు చేసేవాడు.హథ్రాస్లోని భోలే బాబా సత్సంగ్లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కు చేరుకుంది. వందలాది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ ఘటనలో ఆరుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. సత్సంగ్ను వీరే నిర్వహించారని, కార్యక్రమానికి వీరే అనుమతి పొందారని పోలీసులు చెప్పారు.ఈ కార్యక్రమానికి నిర్వాహకులు కేవలం 80,000 మందికి మాత్రమే అనుమతినివ్వగా.. దాదాపు 2.5 లక్షల మంది అనుచరులు తరలివచ్చారని పోలీసులు తెలిపారు. భోలే బాబా వేదిక నుంచి వెళుతున్న సమయంలో అతని కాన్వాయ్ ద్వారా తన్నిన ధూళిని సేకరించడానికి భక్తుల గుంపు పరుగెత్తుకొచ్చింది, ఇది ఒక ఆశీర్వాదంగా భావిస్తారు. అయితే గుంపును నియంత్రించే ప్రయత్నంలో వాలంటీర్లు, అతని భద్రత సిబ్బంది ప్రజలను వెనక్కి నెట్టడం ప్రారంభించారు. దీంతో అనేక మంది భక్తులు గుంపుగా పడి నలిగిపోయారు. అక్కడి నుంచి పరుగెత్తడంతో తొక్కిసలాట జరిగింది.అయితే ఇప్పటి వరకు సూరజ్ పాల్ అలియాస్ భోలే బాబా ఆచూకీ మాత్రం తెలియ రాలేదు. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు భోలే బాబా ఆశ్రమానికి వెళ్లగా ఆయన అక్కడ లేరు. ఎఫ్ఐఆర్లో భోలే బాబా పేరు లేనందున ఆయనను అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిని విచారించిన తర్వాత అవసరమైతే భోలే బాబాను విచారిస్తామని తెలిపారు. -
హత్రాస్ తొక్కిసలాట: ఆరుగురి అరెస్ట్, అవసరమైతే బాబాను విచారణ
హత్రాస్ తొక్కిసలాట కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో సత్సంగ్ ఆర్గనైజింగ్ నిర్వాహకులతో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని, వీరు సత్సంగ్ కార్యక్రమ నిర్వాహకులు, సేవాదార్లుగా పనిచేస్తున్నారని అలీగఢ్ ఐజీ శలభ్ పేర్కొన్నారు.ప్రధాన నిర్వాహకుడిని పట్టుకునేందుకు రూ.లక్ష రివార్డును ప్రకటించినట్లు తెలిపారు. త్వరలోనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయబోతున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. జనాలు ఒకేసారి గుంపుగా రాగా.. నిర్వాహకులు అడ్డుకున్నారని.. ఆ తర్వాత ఒకేసారి బయటకు రావడంతో ప్రమాదం జరిగిందన్నారు. మహిళలు, పిల్లలు ఒకరిపై పడిపోయారన్నారు. భోలే బాబా నేర చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని ఐజీ వెల్లడించారు. అయితే, సత్సంగ్కు ఆయన పేరుతో కార్యక్రమానికి అనుమతి తీసుకోలేదని తెలిపారు. అవసరమైతే బాబాను ప్రశ్నిస్తామన్నారు. అప్పటి వరకు 121 మంది మృతి చెందారని.. మృతుల ఆచూకీ గుర్తించినట్లు తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియ సైతం పూర్తయ్యిందన్నారు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
హత్రాస్ తొక్కిసలాట: భయంతో మరో బాబా వినతి
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన భక్తుల సంఖ్య 121 దాటింది. ఈ ప్రమాదం నేపధ్యంలో అప్రమత్తమైన మధ్యప్రదేశ్కు చెందిన మరో బాబా తన అనుచరులను ఉద్దేశిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.బాగేశ్వర్ ధామ్కు చెందిన పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రికి భక్తులు, అనుచరులు అధిక సంఖ్యలో ఉన్నారు. జూలై నాలుగున జరిగే అతని పుట్టిన రోజుల వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే హత్రాస్ ఘటన నేపధ్యంలో మరోమారు అలాంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశ్యంతో పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియో షేర్ చేశారు.ఆ వీడియోలో పండిట్ ధీరేంద్ర శాస్త్రి ‘జూలై 4న నా పుట్టిన రోజు. ఆ రోజు నా జీవితంలో ఒక సంవత్సరం తగ్గుతుంది. అయితే ఆరోజు వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వీడియో ద్వారా ఒక అభ్యర్థన చేస్తున్నాను. జూలై నాలుగున జరిగే వేడుకలకు దూరప్రాంతాల నుంచి రావాలనుకుంటున్నవారు తమ ఇళ్లలోనే పూజలు చేసుకోవాలి. ఇప్పటికే ఇక్కడ భక్తుల రద్దీ పెరిగింది. భద్రత దృష్ట్యా ఎక్కడివారు అక్కడే వేడుకలు చేసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. अतिआवश्यक सूचना…पूज्य सरकार द्वारा सभी भक्तों को आवश्यक संदेश….इसे जन जन तक पहुँचाए… pic.twitter.com/GgLledRw4H— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) July 2, 2024 -
మందు బాబుల భరతం పడుతున్న బాబా
-
‘బుల్డోజర్ బాబా’ పతంగులకు డిమాండ్!
పతంగులు ఎగురవేసే అభిరుచి కలిగినవారికి మకర సంక్రాంతి ఎంతో ప్రత్యేకం. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో కైట్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలోని వారణాసి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. వారణాసి గగనతలంలో ప్రత్యేక గాలిపటాలు సందడి చేస్తున్నాయి. ఈసారి వారణాసి మార్కెట్లో ‘బుల్డోజర్ బాబా’ గాలిపటాలకు అత్యధిక డిమాండ్ ఏర్పడింది. ఈ బుల్డోజర్ బాబా గాలిపటంపై సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలు ఉన్నాయి. దీంతోపాటు బుల్డోజర్ బాబా బొమ్మకు కూడా చోటు దక్కింది. అంతే కాదు ఈ గాలిపటంపై భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తు కమలాన్ని కూడా ముద్రించారు. దుకాణదారుడు అరవింద్ మాట్లాడుతూ బుల్డోజర్ బాబా గాలిపటాలను యువత అమితంగా ఇష్టపడుతున్నారని, అందుకే వాటిని కొనుగోలు చేస్తున్నారని అన్నారు. వారణాసిలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లోనూ ‘బుల్డోజర్ బాబా’ పతంగికి డిమాండ్ ఉంది. ఈ గాలిపటం ధర 5 నుంచి 15 రూపాయల వరకు ఉంది. గాలిపటాలంటే అమితమైన ఇష్టం ఉన్న వారణాసి కుర్రాడు ఆదిత్య ఈసారి మకర సంక్రాంతికి బుల్డోజర్ బాబా గాలిపటం ఎగురవేస్తానని చెప్పాడు. యోగి ఆదిత్యనాథ్ యూపీలో తన ‘బుల్డోజర్’ చర్యలతో మాఫియా వెన్ను విరిచి, చట్టబద్ధ పాలనను తీసుకొచ్చారని ఆదిత్య పేర్కొన్నాడు. సీఎంకు మద్దతుగా తాను ఈ గాలిపటాన్ని ఎగురవేస్తానన్నారు. ఇది కూడా చదవండి: 25 అడుగుల జాయింట్ కైట్ ఎగురుతుందిలా.. -
బాబాల మాయలో మధ్యప్రదేశ్ సర్కార్? ‘ఓట్ల ఆశీర్వాదం’ కోసం పడిగాపులు?
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మత గురువుల ప్రాధాన్యత అంతకంతకూ పెరిగిపోతోంది. రాజకీయ పార్టీలు బాబాల దయ కోసం వెంపర్లాడుతున్నాయి. కొందరు బాబాలు అధికార పక్షం వారిని ఆశీర్వదిస్తుండగా, మరికొందరు బాబాలు ప్రతిపక్షాలపై ఆశీస్సులు కురిపిస్తున్నారు. సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్ నుంచి శివరాజ్ సింగ్ వరకు బాబాల వైభవాన్ని కొనియాడుతున్నారు. బాబాలకు భక్తులుగా మారేందుకు పోటీ పడుతున్నారు. కొన్నిసార్లు కమల్నాథ్.. బాగేశ్వర్ ధామ్లోని ధీరేంద్ర కృష్ణ శాస్త్రితో కనిపిస్తుండగా, మరికొన్నిసార్లు శివరాజ్ సింగ్ చౌహాన్.. ప్రదీప్ మిశ్రా ఆశ్రమంలో సేదతీరుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బాబాల ఆధిపత్యం అధికంగా కనిపించింది. ఇప్పటి (2023) విషయానికొస్తే కొత్త బాబాలు చాలామంది పుట్టుకు వచ్చారు. ఈ జాబితాలో కంప్యూటర్ బాబా, బాగేశ్వర్ ధామ్ సర్కార్, ప్రదీప్ మిశ్రా, పండోఖర్ సర్కార్, జయ కిషోరి, రావత్పురా సర్కార్, సంత్ రవిశంకర్, కమల్ కిషోర్ నాగర్ తదితరులు ఉన్నారు. వీరిని కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీకి హిందుత్వ అనే ట్యాగ్లైన్ ఉంది. కాంగ్రెస్ లౌకిక పార్టీ.. అయినా కమల్ నాథ్ మతతత్వవాది. చింద్వారాలో బాబా బాగేశ్వర్ను తరచూ కలుస్తుంటారు. ఈ బాబాతో కలిసి హెలికాప్టర్లో తిరుగుతూ చాలాసార్తు కనిపించారు. ఈ బాబా కాంగ్రెస్కు మద్దతి ఇచ్చినా, బీజేపీకి కూడా వత్తాసు పలుకుతుంటారు. ఛతర్పూర్ ఎమ్మెల్యే అలోక్ చతుర్వేది నిత్యం బాబాల సేవలో ఉంటారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతి కార్యక్రమంలో బాబాలను సన్మానిస్తుంటారు. బాబా బాగేశ్వర్ నుండి రుద్రాక్ష్ బాబా (ప్రదీప్ మిశ్రా) వరకు అందరూ బీజేపీని ఆశీర్వదించారు. అయితే ఈ బాబాల ఆశీస్సులను కాంగ్రెస్ కూడా కోరుకుంటుంది. ఆధ్యాత్మిక ప్రవచనకర్త జయ కిషోరిని కూడా తమ వైపునకు తెచ్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. కాగా మత ప్రచారకుల మొగ్గు బీజేపీ వైపు కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్.. మత పెద్దల ఆశీర్వాదాలను కోరుకుంటోంది. ఈ విధంగా ఓటు బ్యాంకు పెంచుకోవాలని ఆ పార్టీ తాపత్రయ పడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఖలీద్ మషాల్ ఎవరు? హమాస్తో సంబంధం ఏమిటి? -
బైక్కి గుడి గట్టి పూజలు - భారతదేశంలో మరెక్కడా లేదు (ఫోటోలు)
-
కీచక బాబా బాగోతం.. ఆయన టార్గెట్ భర్తతో విడిపోయిన మహిళలే..
వరంగల్: వరంగల్నగరంలో కీచక బాబా బాగో తం బట్టబయలైంది. అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తూ.. మహిళలను లైంగికంగా లోబర్చుకుంటున్న దొంగబాబాను వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఏసీపీ జితేందర్రెడ్డి కథనం ప్రకారం.. నగరంలోని ఏనుమామూల ప్రాంతానికి చెందిన షైక్నాలా లబ్బే (58) బాబా అవతారమెత్తాడు. తన మంత్రశక్తులతో కుటుంబంలో ఏమైనా కలహాలు, భార్యాభర్తల తగాదాలు, ఆరోగ్య సమస్యలు ఉంటే నయం చేస్తానని నమ్మించి పలువురు మహిళలు, యువతులను లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో ఓ వివాహితపై కన్నేసిన ఆయన.. ఆమెకు తన భర్తతో ఉన్న విభేదాలను దృష్టిలో పెట్టుకొని పూజలు చేస్తున్నట్టు న టించి లైంగికదాడికి పాల్పడ్డాడు. భయపడిన ఆమె విషయం ఇంట్లో చెప్పింది. బాధితురాలితో కలిసి కుటుంబ సభ్యులు టాస్క్ఫోర్స్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన వారు కీచకబాబాను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా తన నేరం అంగీకరించినట్లు ఏసీపీ తెలిపారు. తమి ళనాడుకు చెందిన షైక్నాలా లబ్బే దాదాపు 40ఏళ్ల క్రితం ఏనుమాముల ప్రాంతంలో స్థిరపడ్డాడని, తాయత్తులతో ప్రజలకు నమ్మకం కలిగించి బాబా గా మారి కీచక పనులు చేస్తున్నట్లు తెలిపారు. అత ని నివాసం నుంచి ధారాలు, తాయత్తులు, నిమ్మకాయలు, దిష్టి గురుగులు, వనమూలికలు, నూనె డబ్బాలతోపాటు రూ.25వేలు స్వాధీ నం చేసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. దొంగ బాబాను పట్టుకోవడంలో ప్ర తిభ కనబరిచిన టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్లు కె.శ్రీనివా స్రావు, జనార్దన్రెడ్డి, ఎస్ఐలు శరత్ కుమార్, లవన్కుమార్, హెడ్కానిస్టేబుల్ స్వర్ణలత, కానిస్టేబుళ్లు రాజేందర్, కరుణాకర్, శ్రావణ్కుమార్, నాగరాజును సీసీ అభినందించినట్లు ఏసీపీ తెలిపారు. -
గుర్రం బాబా
-
దొంగబాబా...
-
బాబా వల్ల అవకాశాలు తగ్గాయి: మనీషా కొయిరాల
‘‘బాబా’ సినిమా పరాజయంతో సౌత్లో నాకు అవకాశాలు తగ్గాయి’’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు మనీషా కొయిరాల. రజనీకాంత్, మనీషా జంటగా సురేష్కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘బాబా’ (2002). ఈ చిత్రం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మనీషా మాట్లాడుతూ – ‘‘తమిళంలో నేను చేసిన చివరి పెద్ద సినిమా ‘బాబా’నే. ఈ సినిమా విజయంపై భారీ అంచనాలు ఉండేవి. అయితే ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ సినిమా ఫ్లాప్తో సౌత్లో నా కెరీర్ అయిపోతుందనుకున్నాను. అదే జరిగింది. ‘బాబా’కన్నా ముందు సౌత్లో చాలా సినిమాలు చేశాను. అయితే ఈ సినిమా పరాజయం వల్ల అవకాశాలు తగ్గాయి. అయితే ‘బాబా’ని మళ్లీ విడుదల (రజనీ పుట్టినరోజు డిసెంబర్ 12 సందర్భంగా గత ఏడాది డిసెంబర్ 10న రీ రిలీజ్) చేస్తే, హిట్ కావడం ఆశ్చర్యం అనిపించింది. ఏది ఏమైనా రజనీ సార్తో సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు. -
రజనీకాంత్తో సినిమా చేశాక నాకు ఆఫర్లు రాలేదు: హీరోయిన్
రజనీకాంత్ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో బాబా ఒకటి. ఈ సినిమా ఫలితం ఎలాగున్నా చాలామంది ఇప్పటికీ దీన్ని ఎంతగానో ఇష్టపడతారు. రజనీ కూడా బాబా చిత్రం తనకెంతో ప్రత్యేకమని అనేకసార్లు నొక్కిచెప్పాడు. ఈ సినిమాలో మనీషా కొయిరాలా హీరోయిన్గా నటించింది. దీనికంటే ముందు ఆమె ఇండియన్, బాంబే, ఆలవందన్ వంటి పలు దక్షిణాది హిట్ చిత్రాల్లో నటించింది. అయితే బాబా తర్వాత తనకు సౌత్లో స్థానం లేకుండా పోయిందట. ఈ విషయం గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'బాబా నా చివరి తమిళ చిత్రం. ఆ రోజుల్లో ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఘోరంగా చతికిలబడింది. సౌత్లో నా కెరీర్ ముగిసినట్లే అనుకున్నా.. చివరికి నేను ఊహించిందే జరిగింది. బాబా తర్వాత నాకు అవకాశాలు రాలేదు. అదేంటో కానీ విచిత్రంగా రీరిలీజ్ చేసినప్పుడు మాత్రం మంచి హిట్ కొట్టింది' అని చెప్పుకొచ్చింది. మణిరత్నం బాంబే సినిమా గురించి చెప్తూ.. 'మొదట బాంబే సినిమా చేయకూడదనుకున్నాను. తల్లి పాత్రలో నటిస్తే కెరీర్ దెబ్బతింటుందని అందరూ హెచ్చరించారు. కానీ సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతా మాత్రం మణిరత్నం గురించి, ఆయన సినిమాల గురించి నీకేమైనా తెలుసా అసలు? ఆయన సినిమా వద్దుంటున్నావంటే నీ అంత పిచ్చివాళ్లు ఇంకొకరు ఉండరు అని తిట్టాడు. అప్పుడు వెంటనే నా నిర్ణయాన్ని మార్చుకున్న అమ్మ, నేను చెన్నై వెళ్లిపోయాం. బాంబే సినిమా చేసినందుకు నాకెంతో సంతోషంగా ఉంది' అని తెలిపింది. 1995లో వచ్చిన బాంబే మూవీ కల్ట్ క్లాసిక్ మూవీలో ఒకటిగా నిలిచింది. బాబా సినిమా విషయానికి వస్తే ఈ చిత్రానికి రజనీకాంతే స్వయంగా కథ అందించి, నిర్మించాడు. గతేడాది రజనీకాంత్ బర్త్డే సందర్భంగా బాబా రీరిలీజ్ చేయగా మంచి కలెక్షన్లు రాబట్టింది. -
భగభగమండే మంటపై బాబా విన్యాసం.. వేడి ఎంతున్నా చల్లని దీవెనలు!
-
Axar Patel Latest Photos: ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అక్షర్ పటేల్ (ఫొటోలు)
-
Hyderabad: ‘దెబ్బకు దెయ్యం వదిలిపోతుంది.. నన్ను పెళ్లి చేసుకో’
సాక్షి, హైదరాబాద్: నేను ఖయామత్ బంధిష్ను (దుష్టశక్తులు ధరికి రాకుండా కాపాడే గొప్ప శక్తిమంతుడిని) అంటూ మాయమాటలు చెప్పి యువతులను వశపరుచుకుంటున్న బాబా ముసుగులో ఉన్న నిత్య పెళ్లికొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారు. లంగర్హౌస్ పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. లంగర్హౌస్ ఎండీలైన్స్లో నివాసముండే 18 సంవత్సరాల యువతి గత 3 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. పలు ప్రాంతాల్లో వైద్యం కోసం తిరిగినా ఫలితం లేకపోవడంతో కొందరి సలహా మేరకు నెల్లూరులోని ఓ దర్గాకు చేరారు. నెల్లూరు ఏసుపాలెం గ్రామంలోని రెహమతుల్లా దర్గా ప్రధాన నిర్వాహకుడు హాతీష్పాషా బాబాను(52) రెండేళ్ల క్రితం కలిసి సమస్యను తెలిపారు. మంత్రశక్తులతో నయం చేస్తానంటూ నిమ్మకాయలు, కాగితాలు ఇచ్చి పంపేవాడు. నిత్యం వైద్యం, మంత్రం కోసం నెల్లూరు వెళ్లిన బాధితులకు హతీష్ బాబా రెండు నెలలుగా ఈ అమ్మాయిని తనకు ఇచ్చి వివాహం చేయాలని కోరాడు. తాను ఖయామత్ బంధిస్తానని తనను పెళ్లి చేసుకుంటే సమస్యలు పోవడమే కాకుండా మళ్లీ ఎలాంటి సమస్యలు దరిదాపులోకి రావని తెలిపాడు. నమ్మిన తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకొని ఈ నెల 11న రాత్రి టోలీచౌకీలోని ఫంక్షన్హాల్లో బంధుమిత్రుల ఆధ్వర్యంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. పాషా బాబా వివాహసమయానికి ముందు అనారోగ్యం అంటూ ఆస్పత్రిలో చేరి బాధితురాలి కుటుంబీకుల ఫోన్లకు స్పందిచట్లేదు. దీంతో భాదితులు లంగర్హౌస్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా నెల్లూరుకు చెందిన బాబా మంత్రాలు, భూతవైద్యం పేరుతో ఇప్పటికే ఏడుగురు యువతులను పెళ్లిచేసుకొని పలువురిని మోసం చేసి.. మరి కొందరి వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు తెలిసింది. ఇతనిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు. చదవండి: పంజగుట్టలో అర్ధరాత్రి గ్యాంగ్ హల్చల్.. యువకుడిపై 15 మంది దాడి -
జిలేబీ బాబాకు 14 ఏళ్ల జైలు
చండీగఢ్: తనను తాను దేవుడిగా ప్రచారం చేసుకుంటూ అరాచకాలు సాగించిన జిలేబీ బాబా అలియాస్ అమర్వీర్ అలియాస్ బిల్లూ అలియాస్ అమర్పురి (63) పాపం పండింది. 100 మందికిపైగా మహిళలపై అత్యాచారం చేసి, వీడియోలు తీసినట్లు అతడిపై ఆరోపణలున్నాయి. ఓ బాలికపై రెండు సార్లు అత్యాచారం చేసిన కేసులో పోక్సో చట్టం సెక్షన్ 6 కింద అతనికి 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు హరియాణాలోని ఫతేహాబాద్ ఫాస్ట్ట్రాక్ కోర్టు అదనపు జిల్లా జడ్జి బల్వంత్సింగ్ బుధవారం ప్రకటించారు. జిలేబీ బాబాను హరియాణా పోలీసులు 2018లో అరెస్టు చేశారు. అతడి ఫోన్లో 120కి పైగా అశ్లీల వీడియో క్లిప్పింగ్లను గుర్తించారు. జిలేబీ బాబా హరియాణాలోని తోహన్ పట్టణంలో బాబా బాలక్నాథ్ మందిరం అధినేతగా ప్రాచుర్యం పొందాడు. మహిళలకు మాదకద్రవ్యాలిచ్చి అత్యాచారం చేయడం, ఆ దురాగతాన్ని వీడియోలో చిత్రీకరించడం, వాటిని చూపి బ్లాక్మెయిల్ చేసి బాధితుల నుంచి డబ్బులు గుంజడం అతని స్టైల్. -
బాబా కోసం తలైవా డబ్బింగ్.. రీరిలీజ్కు అడ్వాన్స్ టెక్నాలజీతో రీషూట్
తమిళ సినిమా: గతంలో విడుదలైన చిత్రాలను రీమేక్ చేయడం, రిలీజ్ చేయడం కొత్తేమీ కాదు. అయితే రీ షూట్ చేయడం, ఆధునిక టెక్నాలజీతో కొత్త హంగులను అద్దడం అరుదైన విషయమే. తాజాగా రజనీకాంత్ చిత్రానికి అదే జరుగుతోంది. ఆయన నటించిన చిత్రాలకు ఎప్పటికీ క్రేజ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా రెండు దశాబ్దాల క్రితం రజినీకాంత్ కథ కథనాన్ని అందించి కథానాయకుడిగా నటించిన చిత్రం బాబా. దైవానుగ్రహాన్ని జోడించి కమర్షియల్ ఫార్మేట్లో రూపొందింన బాబా చిత్రంలో నటి మనీషా కోయిరాలా నాయకిగా నటించారు. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎందుకనో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. అయితే ఇది రజనీకాంత్కు బాగా నచ్చిన కథ. అందుకే దీన్ని ఆయన వదలలేకపోయారు. చిత్రంలోని లోపాలను పునః పరిశీలన చేసుకుని వాటిని భర్తీ చేసే విధంగా తాజాగా కొన్ని సన్నివేశాలను రీషూట్ చేసి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మళ్లీ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆయన రీషట్ చేసిన సన్నివేశాలకు డబ్బింగ్ పూర్తి చేశారు. కాగా చిత్ర ట్రైలర్ చసిన తర్వాత ఏమైనా కొత్తగా సంగీత బాణీలను సమకూర్చాలా అన్న ఆలోచనలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఉన్నట్లు సమాచారం. కాగా బాబా చిత్రాన్ని సరికొత్త హంగులతో రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని చిత్ర వర్గాలు ముందు భావించారట. అయితే ఎప్పుడైతే బాబా చిత్రాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త హంగులు దిద్దుతున్నట్లు ప్రకటించారో అప్పటి నుంచి అభిమానుల్లో వస్తున్న స్పందనను చూసి ఈ చిత్రాన్ని తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది రజనీకాంత్ అభిమానులకు నిజంగా ఆనందాన్ని కలిగించే విషయమే అవుతుంది. కాగా రజనీకాంత్ ప్రస్తుతం సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న జైలర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్గా తెరపైకి రానుంది. తర్వాత విను చక్రవర్తి దర్శకత్వంలో ఒక చిత్రం, ఆయన పెద్ద కూతురు దర్శకత్వం వహిస్తున్న లాల్ సలాం చిత్రంలో (అతిథి పాత్రలో) నటించనున్నారు. ఈ రెండు చిత్రాలను లైక సంస్థ నిర్మించడం విశేషం. -
Superstar Rajinikanth: మరోసారి తెరపైకి బాబా
సూపర్స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం బాబా. ఆయనే కథ కథనాలను సమకూర్చారు. ఈ చిత్రానికి అన్నామలై వీరా, బాష వంటి సూపర్హిట్ చిత్రాల దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. నటి మనిషా కొయిరాలా కథానాయకిగా నటించిన ఇందులో గణేష్ సుజాత ఎంఎన్ నంబియార్, ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, సంగవి, కరుణాస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. చోటా.కే.నాయుడు చాయాగ్రహణను, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. రజనీకాంత్తో దర్శకుడు సురేష్ కృష్ణ 2002 భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు. అప్పట్లో ఈ చిత్రంపై రాజకీయ వ్యతిరేకత కూడా ఒక కారణం కావచ్చు. అయితే ఇందులోని మాయా మాయా, శక్తి కొడూ.. కిచ్చూ కిచ్చూ పాటలు ప్రజాధరణ పొందాయి. ఈ పాటలకు నృత్య దర్శకత్వం వహించిన బృందా, ప్రభు దేవా, లారెన్స్కు మంచి గుర్తింపు వచ్చింది. చిత్రంలో రజనీకాంత్ తరచూ చేతి వేళ్లతో చూపించే బాబా ముద్ర చిన్న పిల్లలకు రీచ్ అయింది. అలాంటి చిత్రాన్ని నేటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికీకరించి మళ్లీ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చిత్ర కథలో కూడా మార్పులు చేస్తున్నట్లు, పాటలను కూడా రీమిక్స్ చేసి డాల్ఫీ సౌండ్ సిస్టంలో రూపొందిస్తున్నట్లు చిత్రవర్గాలు సోమవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశాయి. -
ప్లీజ్.. ఆ హంతకుడెవరో చెప్పండి బాబా!
భోపాల్: మర్డర్ మిస్టరీని ఛేదించాలంటే.. డాగ్స్క్వాడ్ తనిఖీలు, ఫోరెన్సిక్ రిపోర్టులు, విచారణలు ఇలా పోలీసులు మల్లగుల్లాలు పడతారు. కానీ.. చిత్రంలోని పోలీసేమో.. తనకు బాగా నమ్మకమున్న బాబా దగ్గరికి వెళ్లాడు.. ఓ హత్య కేసులోని అనుమానితుల జాబితాను ఆయన చేతిలో పెట్టి... మర్డర్ చేసిందెవరో చెప్పమని కోరాడు. ఈ బాబా కూడా జేమ్స్బాండ్ టైపులో లిస్టును ఒకటికి పదిసార్లు పరిశీలనగా చూసేసి.. ఇందులో ఉన్నవారెవరూ కాదు భక్తా.. మరొకడు ఉన్నాడు అంటూ కొంచెం బేస్ వాయిస్తో బదులిచ్చాడు. ఈ వీడియో కాస్త.. యూట్యూబ్లో వైరలయ్యింది. ఇంకేముంది ఉన్నతాధికారులు.. ఆ ఆఫీసర్ ఎవరా అని ఆరా తీశారు. చివరికి మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా బమితా స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఏఎస్ఐ అనిల్ శర్మగా నిర్ధారణ అయ్యింది. వెంటనే.. సదరు ఏఎస్ఐని సస్పెండ్ చేశారు. ఇంతకీ ఈ కేసు ఏమిటంటే.. జూలై 28న వొతపూర్వ గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువతి హత్యకు గురైంది. గ్రామంలోని ముగ్గురిని అనుమానిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు కేసు పెట్టారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో వారిని వదిలిపెట్టారు. చివరికి యువతి మామను అరెస్టు చేశారు. అయితే అతడిని పరిశోధన, సాక్ష్యాల అధారంగానే అరెస్టు చేశామని, బాబా సూచన మేరకు కాదని జిల్లా ఎస్పీ పేర్కొనడం గమనార్హం. Ever imagined cop seeking help of religious guru to crack a case. No, this isn't reel life, but real life. See how ASI of MP's Chhatarpur district police gets help from religious guru Baba Pandokhar Sarkar for cracking murder case. @NewIndianXpress @TheMornStandard @santwana99 pic.twitter.com/RtyKBWSLZD — Anuraag Singh (@anuraag_niebpl) August 19, 2022 -
బాబా మంచివాడంటూ టీచర్ల పోస్టులు.. పోలీసులు రంగంలోకి దిగగానే..
సాక్షి, చెన్నై: చదువు, సంస్కారం నేర్పడం వారి వృత్తి. విద్యార్థులను లైంగిక వేధింపులకు ప్రోత్సహించడం వారి ప్రవృత్తి. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న ఐదుగురు ఉపాధ్యాయినులు సీబీసీఐడీ పోలీసుల కళ్లుకప్పి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చెన్నై సమీపం కేళంబాక్కంలోని సుశీల్హరి పాఠశాల కరస్పాండెంట్ శివశంకర్బాబా అక్రమాలు అన్నీ ఇన్నీ కావనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చదువుకునే రోజుల్లో తమను లైంగికవేధింపులకు గురిచేసినట్లు పూర్వ విద్యార్థిని, విద్యార్థులు వాట్సాప్ ద్వారా బహిర్గతం చేశారు. పలువురు విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇటీవల శివశంకర్ బాబాను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. తరువాత ఈ కేసు సీబీసీఐడీ పోలీసుల చేతుల్లోకి వెళ్లింది. బాబాకు బెయిల్ మంజూరు చేయాలని చెంగల్పట్టులోని పోక్సో ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను న్యాయమూర్తి తమిళరసి విచారించారు. ఈనెల 13వ తేదీన మరలా విచారణకు రాగా శివశంకర్బాబాను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినా బెయిల్ మంజూరు కాకపోగా ఈనెల 27వ తేదీ వరకు రిమాండ్ను పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. గట్టి పోలీసు బందోబస్తు మధ్య మరలా జైలుకు తరలించారు. అదే పాఠశాలలో పనిచేసే ఐదుగురు ఉపాధ్యాయినులు బాబాను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. బాబా మంచివాడని పేర్కొంటూ వెనకేసుకొస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. బాబా మద్దతుగా వ్యవహరించిన ఐదుగురు ఉపాధ్యాయినులను విచారించాలని సీబీసీఐడీ పోలీసులు నిర్ణయించారు. నేరుగా విచారణకు వివరణ ఇవ్వాల్సిందిగా బాబా ఆశ్రమానికి పక్కనే ఉన్న పళనిగార్డెన్ అపార్టుమెంటులో నివసిస్తున్న ఐదుగురు ఉపాధ్యాయినులకు సమన్లు పంపారు. అయితే ఈ ఐదుగురు హాజరుకాలేదు. ఈనెల 19వ తేదీ తప్పక హాజరుకావాలని ఆదేశిస్తూ సమన్లను స్వయంగా అందజేసేందుకు పోలీసులు శనివారం ఉదయం సదరు అపార్టుమెంటుకు వెళ్లగా ఐదుగురి ఇళ్లు తాళాలు వేసి ఉన్నాయి. పోలీసులు ఐదుగురి ఇళ్ల తలుపులుపై సమన్లను అతికించి వెళ్లిపోయారు. ఐదుగురు ఉపాధ్యాయినులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
వైరల్ వీడియో: వేప, తులసి ఆకులతో ప్రకృతి మాస్క్
-
వైరల్: బాబా మాస్క్ భలే భలే!
లక్నో: కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ తరువాత సెకండ్ వేవ్ మొదలైంది. ఇది ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వీలైనంత వరకు ఇంట్లో ఉండడం, డబుల్ మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే తాజాగా ఉత్తర ప్రదేశ్కు చెందిన జుగాడు బాబా కరోనా నుంచి రక్షణ కోసం ప్రకృతి మాస్క్ ధరించాడు. ప్రస్తుతం బాబా ధరించిన వేప, తులసి ఆకులతో తయారు చేసిన మాస్క్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను రూపీన్ శర్మ అనే ఐపీఎస్ అధికారి ట్విటర్లో పోస్టు చేస్తూ ‘‘ఈ మాస్క్ కరోనా నుంచి రక్షణ కల్పిస్తుందని కచ్చితంగా చెప్పలేం.కానీ అవసరం తల్లి లాంటిది’’ అని పేర్కొన్నాడు. ఓ వ్యక్తి ఆసక్తితో బాబా వద్దకు వచ్చి ఈ మాస్క్ ఎలా తయారు చేశారని అడిగాడు. దానికి ఆయన బదులిస్తూ.. వేప, తులసి ఆకులు ఏ రకమైన వ్యాధికైనా మంచి ఔషధంగా పనిచేస్తాయనేది మనకు తెలుసు. జనాలు సాధారణంగా ఉపయోగించే మాస్క్ల కంటే ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తున్నట్టు బాబా తెలిపారు. తులసి, వేప ఆకులతో చేసిన ఈ మాస్క్ నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. కాగా జుగాడు బాబా ఉత్తర ప్రదేశ్లోని సీతాపూర్ జిల్లా బస్ స్టాండ్ వద్ద ఈ ప్రకృతి మాస్క్తో కనిపించారు. (చదవండి: బంగ్లాదేశ్ మహిళా జర్నలిస్టు విడుదల) -
ప్రేమికుడి బాబా వేషం.. గడ్డం లాగడంతో..
భువనేశ్వర్: ప్రియురాలి బాగోగులు తెలుసుకునేందుకు బాబా వేషం ధరించాడు ఓ ప్రేమికుడు. చివరి దశలో వ్యూహం బెడిసి కొట్టింది. స్థానికులకు పట్టుబడి చావు దెబ్బలు తిన్నాడు ప్రియుడు. జాజ్పూర్ రోడ్ ఫెర్రో క్రోమ్ గేటు కాలనీలో శనివారం ఈ ఉదంతం చోటుచేసుకుంది. బాబా వేషంలో వీధిలో తిరుగాడుతున్న ప్రేమికుడిని పిల్లల దొంగగా భావించిన స్థానికులు పట్టుకుని నిలదీయడంతో అసలు కథ బట్టబయలైంది. ఈ వేషగాడు అంగుల్లో 12వ తరగతి చదువుతున్న విద్యార్థినిని ప్రేమించాడు. విద్యార్థిని కుటుంబ సభ్యులు వీరి ప్రేమని నిరాకరించారు. దీంతో ప్రియురాలి ఇంట్లో తాజా పరిస్థితులను తెలుసుకునేందుకు ఆమెతో ముఖాముఖి భేటీ కావాలనుకున్నాడు. తక్షణమే వేషం మార్చి బాబాగా తయారయ్యాడు. ప్రియురాలి ఇంటి పరిసరాల్లో తిరుగాడుతున్న అతన్నిపై అనుమానంతో స్థానికులు పట్టుకుని నిలదీశారు. మొదట తాను హిమాలయాల నుంచి వచ్చినట్లు బుకాయించాడు. అతడి సమాధానాలతో ఏకీభవించని స్థానికులు సందేహంతో గడ్డం లాగడంతో బండారం బట్టబయలైంది. దొంగ బాబాను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. -
బాబా కా ధాబా : యుట్యూబర్పై ఎఫ్ఐఆర్ నమోదు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని బాబా కా ధాబా యజమాని కాంతాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫుడ్ బ్లాగర్ గౌరవ్ వాసన్పై కేసు నమోదైంది. ప్రాథమిక విచారణ అనంతరం గౌరవ్పై సెక్షన్ 420 కింద ఎఫ్ఐఆర్ నమోదైనట్లు దక్షిణ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ అతుల్ కుమార్ ఠాకూర్ తెలిపారు. కాగా తమకు సాయం చేయడం కోసం చాలా మంది పంపిన డబ్బును వాసన్ తప్పుదోవ పట్టించాడని కాంతా ప్రసాద్ అక్టోబర్ 31న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు కేవలం రూ. 2.3 లక్షలు మాత్రమే ఇచ్చాడని మిగిలిన డబ్బును అతనే తీసుకున్నాడని ఆరోపించాడు. వాసన్ విరాళాలు సేకరించడానికి తన బ్యాంక్ ఖాతాలతో పాటు వారి కుటుంబ సభ్యుల ఖాతాల వివరాలు కూడా ఇచ్చాడని కాంతా ప్రసాద్ తెలిపారు. వచ్చిన విరాళాలు మొత్తాన్ని తమకు అందించకుండానే.. ‘ఇచ్చాను అంటూ’ అబద్ధాలు చెబుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వాసన్ మాత్రం ఈ ఆరోపణల్ని ఖండించాడు. తనకు వచ్చిన ఫండ్స్ అన్నింటిని కాంతా ప్రసాద్కు ఇచ్చానని బ్యాంక్ స్టేట్మెంట్లు చూపిస్తూ మరో వీడియో విడుదల చేశాడు. (సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో) అయితే దీనికి కౌంటర్గా కాంతా ప్రసాద్ లాయర్ ప్రేమ్ జోషి మాట్లాడుతూ..వాసన్ చెబుతున్నట్లుగా మొత్తం డబ్బును ఇవ్వలేదని కేవలం 2.3 లక్షల చెక్ మాత్రమే ఇచ్చాడని పేర్కొన్నాడు. వీడియోలో వాసన్ కేవలం అక్టోబర్ 7నుంచి 10 వరకు వచ్చిన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లను మాత్రమే వెల్లడించాడని, నిజానికి ఆ తర్వాత రోజుల్లోనే ఎక్కువ మొత్తంలో విరాళాలు అందాయని ఆరోపించారు. కాగా దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్లో ఉంటున్న ఒక వృద్ధ జంట కరోనా టైంలో తమ ధాబా బిజినెస్ సరిగా జరగడం లేదంటూ కంటతడి పెట్టుకున్న వీడియో ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. సెలబ్రెటీలు సైతం‘బాబా కా ధాబా కు వెళ్లి తినండి అంటూ ట్వీట్లు చేశారు. దీంతో ఆ ధాబా పేరు దేశమంతా మారుమ్రోగి పోయింది. వృద్ధ జంట కాంతా ప్రసాద్, అతని భార్య బాదామి దేవి ఆవేదన చూసి చలించిపోయిన చాలా మంది నెటిజన్లు వారికి ఆర్ధిక సాయం కూడా చేశారు. ఈ వీడియోను ఫుడ్ బ్లాగర్ గౌరవ్ వాసన్ సోషల్మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతనే వీరి కోసం విరాళాలు సేకరించాడు. -
బాబాకా ధాబాకు క్యూ కట్టిన కస్టమర్లు
-
సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో
సాక్షి, న్యూఢిల్లీ: చిన్నపిల్లలనుంచి వృద్ధుల దాకా సోషల్ మీడియా విపరీతమైన ప్రభావాన్ని పడవేస్తోంది. ఆధునిక టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియా ప్రపంచ దిశ దశను మారుస్తోంది. రాజకీయాలు నుంచి వంటింటి దాకా సోషల్ మీడియానా మజాకా అనిపిస్తోంది. ఢిల్లీలో చోటు చేసుకున్న ఒక సంఘటన గురించి తెలుసుకుంటే.. సోషల్ మీడియా మీద ఒకింత కోపంగా ఉన్న వారు కూడా ఔరా అనక మానరు. ఢిల్లీలోని మాలవీయనగర్లో ఉన్న బాబాకా ధాబా గురించి ట్విటర్లో ఒక వీడియో పోస్ట్ అయింది. కరోనా, లాక్డౌన్ కారణంగా డిమాండ్ లేక షాపు యజమాని కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలో షేర్ చేశారు. దాదాపు 80 ఏళ్ళ వృద్ధాప్యంలో జీవనం కోసం ఆ జంట పడుతున్న ఆరాటాన్ని చూపించారు. అంతేకాదు వీరిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతే క్షణాల్లో ఈ వీడియో వైరల్ గా మారింది. పిల్లల అనాదరణకు గురైన ఈ వృద్ధ దంపతుల పోరాట కథ పలువురి హృదయాలను కదిలించింది. బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, రవీన్ టాండన్, సోనమ్ కపూర్, రవీనా టాండన్, జర్నలిస్టు, నటి స్వర భాస్కర్, క్రికెటర్ ఆర్ అశ్విన్ లాంటి సెలబ్రిటీలతో పలువురు దీన్ని లైక్ చేసి, షేర్ చేశారు. దీంతో నెటిజనుల నుంచి స్పందన భారీగా వచ్చింది. సపోర్ట్ లోకల్ అంటూ స్థానికులు బాబా కా ధాబాకు క్యూ కట్టారు. ఫుడ్ స్టాల్ లో లభ్యమయ్యే భోజనం, చపాతీలకు ఇబ్బడి ముబ్బడిగా ఆర్డర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. బాబా చేతి వంట మటర్ పనీర్ ఆసాంతం లొట్టలేసుకుంటూ ఆరగించేశారు. సెల్ఫీలతో సందడి చేశారు. దీంతో సంతోషంతో ఉక్కిరి అయిపోవడం యజమాని వంతైంది. అంతేకాదు మాలవీయ నగర్ బాబాకా ధాబా ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచింది. ఈ వీడియో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిని కూడా కదిలించింది. బాబా కా ధాబాను తాను సందర్శించానని, వారి జీవితాల్లో సంతోషం కోసం తాను చేయగలిగింది తాను చేస్తానంటూ ట్వీట్ చేశారు. కాగా ఈ వీడియోను బ్లాగర్ గౌరవ్ వాసన్ చిత్రీకరించారు. బాబా కా దాబా ఓనరు పేరు కాంత ప్రసాద్. భార్య పేరు బాదామి దేవి. .@RICHA_LAKHERA .@VasundharaTankh .@sohitmishra99 .@sakshijoshii .@RifatJawaid .@ShonakshiC .@TheDeshBhakt Visited "Baba Ka Dhaba" n hv done d needful to bring SMILE on their faces as promised. Will take care of them n I am starting a drive 2 take care of similarly placed people. pic.twitter.com/S9A94AmJxK — Adv. Somnath Bharti (@attorneybharti) October 8, 2020 -
కటకటాల్లో ‘కరోనా బాబా’
‘నా పేరు కరోనా బాబా... నాకు అతీత శక్తులున్నాయి... మాయలు మంత్రాలతో ‘కరోనా’ రాకుండా చేస్తా... మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు...’ అంటూ అమాయక ప్రజలు నమ్మేలా తన శిష్యులతో ప్రచారం చేయించాడు. మోసపూరిత మాటలను నమ్మి ఆయన వద్దకు వచ్చిన అమాయకుల నుంచి వేలాది రూపాయలు దండుకున్నాడు. సాక్షి, మియాపూర్: కరోనా పేరుతో అమాయక ప్రజలను మోసం చేసిన కరోనా బాబాను మియాపూర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మియాపూర్ ఇన్స్పెక్టర్ ఎస్.వెంకటేష్ సమాచారం మేరకు... మియాపూర్ న్యూ హఫీజ్పేట్లోని హనీఫ్కాలనీకి చెందిన మహ్మద్ ఇస్మాయిల్ ఖాన్ అలియాస్ కరోనా బాబా కొన్ని సంవత్సరాలుగా కాలనీలోని దర్గా వద్ద కూర్చొని ప్రజలకు మంత్రాలు వేస్తూ... తాయత్తులు కడుతుండేవాడు. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్న నేపథ్యంలో వారి ఆందోళనను ఆసరాగా చేసుకొని తనకు అతీత శక్తులున్నాయి.. కరోనాను మటుమాయం చేస్తాను అని అమాయక ప్రజలను నమ్మించాడు. మంత్రాలు, నిమ్మకాయలు, విభూతితో పూజలు చేసి కరోనాను నయం చేస్తానంటూ తన దగ్గరకు వచ్చే అమాయకులను నమ్మించాడు. తనకున్న అతీత శక్తులతో కరోనా బారిన పడకుండా చేస్తానని... ఎవరూ మాస్కులు పెట్టుకోనవసరం లేదని చెప్పుకొచ్చాడు. దగ్గు, జలుబు ఉన్న ప్రతి ఒక్కరికీ కరోనా వచ్చిందని తన శిష్యులతో ప్రచారం చేసి తన దగ్గరకు వచ్చేలా చేసుకున్నాడు. అతని వద్దకు వచ్చిన అమాయకులను కోవిడ్–19 బూచిగా చూసి భయభ్రాంతులకు గురిచేçస్తూ వ్యాధి నయం చేస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేసేవాడు. ఈ క్రమంలో అతని మాయమాటలు నమ్మిన జనం శుక్రవారం రాత్రి 30 మంది వరకు వచ్చారు. చుట్టు పక్కల ప్రాంతాలతోపాటు మెహిదీపట్నం, బోరబండ తదితర ప్రాంతల నుంచి కూడా వచ్చారు. బాబా ఉన్న ప్రాంతంలో జనం ఎక్కువగా గుమిగూడటంతో స్థానికులు మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ ఉన్న జనాన్ని పంపించారు. కరోనా లక్షణాలు ఉన్నట్లయితే ఆస్పత్రికి వెళ్లాలని ప్రజలకు సూచించారు. ఇలాంటి మూఢ నమ్మకాల బూచితో అమాయక ప్రజలను నమ్మించి మోసాలు చేసే బాబాలను నమ్మకూడదని కోరారు. మార్చి నుంచి కరోనా బాబాగా అవతారం ఎత్తాడని ఇప్పటి వరకు సుమారు 70 మంది వరకు బాధితులు మోసపోయారని సమాచారం. బోరబండకు చెందిన ఇద్దరితో ఒకరి నుంచి రూ. 12 వేలు, ఇంకొకరి నుంచి రూ. 28 వేలు వసులు చేశాడని బాధితులు మియాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమాయక జనాన్ని మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఇస్మాయిల్ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని ఇన్స్పెక్టర్ వెల్లడించారు. అతనిపై సుమోటో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
కరోనాకు బలైన కిస్సింగ్ బాబా
భోపాల్ : భక్తుల చేతిపై ముద్దు పెట్టి కరోనా వైరస్ను నయం చేస్తానన్న ఓ బాబా.. వైరస్ బారిన పడి మరణించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని రత్లామ్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భక్తుల చేతులపై ముద్దు పెడితే వారి రోగాలు నయమవుతాయని రత్లామ్ నగరానికి చెందిన అస్లాం బాబాకు పేరుంది. అందుకుని పెద్ద సంఖ్యలో భక్తులు ఆయనను దర్శించుకునే వారు. ఆయన వారి చేతులపై ముద్దపెడుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో కరోనా వచ్చినా భక్తులు ఆయన దగ్గరకు వెళ్లేవారు. ఆయన కూడా తాను చేతులపై ముద్దుపెట్టుకుంటే కరోనా నయం అవుతుందని ప్రచారం చేసుకున్నాడు.( కరోనా రోగికి అరుదైన ఆపరేషన్) దీంతో వైరస్ సోకిన భక్తులు కూడా ఆయన దగ్గరకు వెళ్లారు. బాబా వారి చేతుల్ని ముద్దు పెట్టుకున్నారు. దీంతో ఆయనకు కరోనా సోకింది. అనంతరం బాబా చేత ముద్దు పెట్టించుకున్న 24 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిస్సింగ్ బాబా అస్లాం జూన్ 4న మరణించటం గమనార్హం. కాగా మధ్యప్రదేశ్లో ఇప్పటివరకు 10వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా దాదాపు 400 మంది మృత్యువాత పడ్డారు. -
స్వేదం చిందించనిదే సంపద దక్కుతుందా?
కుశాల్ చంద్ బాబా భక్తుడు. తెల్లవారింది మొదలు పొద్దుపోయే వరకు షిడ్డీలోని మసీదే అతని ఆవాసం. ఏ పనీ చేయకుండా మసీదులోనే గడిపేవాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో బాబాకు హారతి ఇచ్చేటప్పుడు పంచే ప్రసాదంతో కడుపు నింపుకునేవాడు. చాలాకాలం పాటు బాబా అతని వాలకాన్ని గమనించారు. ఇలా అయితే లాభం లేదనుకుని ఒకరోజు కుశాల్చంద్ని దగ్గరకు పిలిచి, ‘‘నీకు పొలం ఉంది కదా! అందులో పంటలు పండించడం లేదా?’’ అని అడిగారు. ‘‘లేదు బాబా! అది మొత్తం బీడు పడింది. పంటలు పండవు’’ కుశాల్ చంద్ చెప్పాడు. ‘‘భలేవాడివే! నీ పొలంలో లంకెబిందెలు ఉన్నాయయ్యా! వెంటనే పొలాన్ని మొత్తం దున్ను’’ అని బాబా అతనికి చెప్పారు. కుశాల్ చంద్ పొలం మొత్తం దున్ని లంకెబిందెలు దొరకలేదని చెప్పాడు. బాబా ఆశ్చర్యం నటిస్తూ ‘‘దొరకలేదా? ఇంతకీ పొలాన్ని ఎటునుంచి దున్నావ్’’ అని అడిగారు. కుశాల్చంద్ నిలువుగా దున్నానని చెప్పగానే, ‘‘ఈసారి అడ్డంగా దున్ని చూడు. తప్పకుండా దొరుకుతాయి’’ అని బాబా చెప్పారు. కుశాల్చంద్ అలా కూడా చేసి లంకెబిందెలు దొరకలేదని చెప్పాడు. ‘‘సరే, దొరక్కపోతే ఏం చేస్తాం! ఎలాగూ పొలాన్ని మొత్తం దున్నావు కాబట్టి అందులో మిరప విత్తనాలు చల్లు’’ అని సూచించారు బాబా. కుశాల్చంద్ అలాగే చేశాడు. బాబా సలహా సూచనలతో పంటను పెంచి పోషించాడు. ఆ ఏడాది సమీపంలో ఎక్కడా మిరప పంటన్నదే లేదు. కుశాల్చంద్ ఒక్కడే పండించాడు. దీంతో అతని పంటకు విపరీతమైన గిరాకీ ఏర్పడి లాభాలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయి. కుశాల్చంద్ తనకొచ్చిన సొమ్మును రెండు మూటలుగా కట్టి బాబా ముందుంచాడు. సుఖం, కోరికలు, సంపద, కీర్తిప్రతిష్ఠలు ఏవైనా సరే ఆయాచితంగా లభించవు. దేనినైనా ప్రయత్నంతోనే సాధించుకోవాలి. స్వేదం చిందించనిదే సంపద దక్కదు. సాధన చేయనిదే ఏదీ సాధ్యం కాదు. భక్తి మంచిదే కానీ దాని పేరుతో పని మానుకోవడం మహా చెడ్డం. పనిపాటలు చేసుకుంటూనే భగవంతుని నామాన్ని నిత్యం స్మరించుకో. ఇక నువ్వు చేసే పనికి తిరుగుండదు. నీ పనికీ ఆటంకం ఉండదు’’అని బోధించారు విపులంగా. డా. కుమార్ అన్నవరపు -
ద్యా..వుడా!
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో బాబాల హడావుడి జోరందుకుంది. కొందరేమో టికెట్లు ఆశించి పార్టీల చుట్టూ తిరుగుతుండా, మరికొందరు కొన్ని పార్టీలకు అనుకూల, వ్యతిరేక ప్రచారాలు నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు. స్వామీజీల్లో కొందరు చౌహాన్పై అసహనంగా ఉన్నారు. మరికొందరేమో చౌహాన్కు జై అంటూ టిక్కెట్ల కోసం యత్నిస్తున్నారు. పార్టీల చుట్టూ బాబాల సందడి పెరగడంతో ఆయా పార్టీల కార్యాలయాల వద్ద మరిన్ని బలగాలు నియమించాల్సి వస్తోంది. ప్రభావం ఎంత ? మధ్యప్రదేశ్ జనాభాలో దాదాపుగా 90శాతం హిందువులే కావడంతో అక్కడ బాబాలకు ఆదరణ ఎక్కువే. అందుకే బాబాల మద్దతు కోసం రాజకీయ నాయకులు వారి ఆశ్రమాల వద్ద క్యూ కడతారు. ఉజ్జయిని, జబల్పూర్, భోపాల్ వంటి పట్టణాల్లో అడుగడుగునా ఆశ్రమాలు కనిపిస్తాయి. బీజేపీ ప్రభుత్వం వచ్చాక పదేళ్లలో ప్రభుత్వ పాలనపై బాబాల ప్రభావం ఎక్కువైందన్న విమర్శలూ వచ్చాయి. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. బాబాల సంఖ్య పెరిగిపోవడంతో వారి ప్రభావమూ తగ్గుతూ వస్తోంది. బై బీజేపీ.. బైబై బీజేపీ.. మతగురువులను ప్రధాన రాజకీయ స్రవంతిలోకి తీసుకురావడంలో బీజేపీ కీలకపాత్ర పోషించింది. గత ఏప్రిల్లో ఒకేసారి ఏకంగా అయిదుగురు బాబాలకు కేబినెట్ హోదా కల్పించింది. కంప్యూటర్ బాబా, యోగేంద్ర మహంత్, నర్మదానంద, హరిహరానంద, భయ్యా మహరాజ్కు కేబినెట్ హోదాలు కట్టబెట్టింది. వీరిలో గురువు భయ్యా మహరాజ్ ఆత్మహత్య చేసుకున్నారు. కంప్యూటర్ బాబా ముఖ్యమంత్రిపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. నర్మదా నదీ తీర ప్రాంతంలో అక్రమ తవ్వకాలను సీఎం ప్రోత్సహిసున్నారని, గోవులకు రక్షణ లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. బరిలోకి దిగుతాం.. దాతియా జిల్లాకు చెందిన పంధోకర్ సర్కార్ ఇటీవల కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల బరిలోకి దూకారు. సాంజీ విరాసత్ పార్టీ పేరుతో 50 నియోజకవర్గాల్లో పోటీకి దిగుతామని ప్రకటించారు. సంత్ సమాజాన్ని సీఎం తీవ్రంగా అవమానించారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరొక గురువు దేవకినందన్ ఠాకూర్ ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి, రిజర్వేషన్లకి వ్యతిరేకంగా పోరాడుతూ రాజకీయ వేడి రగిలిస్తున్నారు. చౌహాన్ సర్కార్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కొందరు స్వాములేమో బీజేపీ టికెట్ను ఆశిస్తున్నారు. బాబా బిపిన్ బిహారి సాగర్ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. కొందరు సీనియర్ నేతలతో టిక్కెట్ కోసం పైరవీలు కూడా చేయించుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో నేతలు బాబాల కాళ్లు పట్టుకునే దృశ్యాలే కనిపించేవి. ప్రభుత్వమే శంకరాచార్య యాత్ర లాంటివి స్వయంగా జరిపించింది. అలాంటిది ఇప్పుడు బాబాలు టిక్కెట్ల కోసం నేతలతో పైరవీలు చేయించుకోవడం కనిపిస్తోంది. ఇలాంటి దృశ్యం మధ్యప్రదేశ్ రాజకీయల్లో ఇదే మొదటిసారంటూ రాజకీయ పరిశీలకులు అవాక్కవుతున్నారు. కీలక బాబాలు ఆధ్యాత్మిక గురువు శంకరాచార్య స్వరూపానంద సరస్వతికి మహాకోసల ప్రాంతంలో బాగా పట్టు ఉంది. స్వరూపానంద కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గ్వాలియర్–చంబల్ ప్రాంతంలో ప్రాబల్యం కలిగిన రావత్పుర సర్కార్, ఆచార్యదేవ్ ప్రభాకర్ శాస్త్రి దాదాజీ, జాబూ ప్రాంతంలో ఎక్కువ మంది అనుచరగణం ఉన్న స్వామి ఉత్తమ్, రాష్ట్రవ్యాప్తంగా శిష్యులున్న భయ్యాజీ సర్కార్లు ఈ సారి ఎన్నికల్లో కీలకంగా మారారు. కంప్యూటర్ బాబాకు కౌంటర్గా స్వామి అఖిలేశ్వరానంద రంగంలోకి దిగారు. గోసంరక్షణ బోర్డు చైర్మనైన ఈ స్వామీజీ ఇటీవల సంత్ సమాగమం పేరుతో సదస్సును ఏర్పాటు చేసి సీఎం చౌహాన్పై ప్రశంసల జల్లు కురిపించారు. -
వైరల్గా మారిన బాబా ఆడియో టేప్
అనంతపురం,ఉరవకొండ: వజ్రకరూరు మండలం కొనకొండ్లలోని గోవిందప్ప ఆశ్రమ పీఠాధిపతి గురునాథస్వామి ఓ భక్తురాలిని లైంగిక వేధింపులకు గురి చేసినట్లున్న ఆడియో టేప్ ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్గా మారింది. వేలాదిమంది తరలివచ్చే ఈ ఆశ్రమంలో అమావాస్య రోజు పీఠాధిపతి ఆధ్వర్యంలో ప్రత్యేక భజనలు, పూజలు చేస్తుంటారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన జిల్లాకు చెందిన ఓ భక్తురాలిని పీఠాధిపతి లైంగికంగా వేధించినట్లు ఓ ఆడియో టేపు ద్వారా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఉరవకొండ సీఐ సయ్యద్ చిన్నగౌస్ సోమవారం ఆశ్రమానికి వెళ్లి విచారించారు. విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు. ఆశ్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. -
మోస్ట్ వాంటెడ్ చికెన్బాబా అరెస్ట్
అనంతపురం, హిందూపురం అర్బన్: మట్కా నిర్వాహణలో ఆరితేరి పోలీసుల రికార్డులో మోస్ట్వాంటెడ్గా ఉన్న చికెన్బాబాను బుధవారం అరెస్టుచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను హిందూపురం వన్టౌన్ సీఐ చిన్నగోవిందు మీడియాకు వెల్లడించారు. హిందూపురం, పరిసర ప్రాంతాల్లో అత్యధికగా మట్కా లావాదేవీలు కొనసాగించే చికెన్బాబాను అరెస్టు చేయడానికి హిందూపురం పోలీసులే కాకుండా కర్ణాటక పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎస్పీ ఇతన్ని జిల్లా బహిష్కరణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే చికెన్బాబా పరారీ కావడం, తర్వాత ఎస్పీ, స్థానిక పోలీసు అధికారుల బదిలీలు కావడంతో ఆ ప్రణాళిక నిలిచిపోయింది. అయితే తన అనుచరులతో మట్కాను నిరాటంకంగా సాగిస్తున్న చికెన్బాబాను పోలీసులు మేళాపురం వద్ద అరెస్టు చేసి రూ.2.25 లక్షల నగదు, సెల్ఫోన్, ప్రింటర్ మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా గత నెల 28న బాబా ముఖ్య అనుచరుడైన మంజునాథ్ అలియాస్ బొట్టు మంజును అరెస్టు చేసి రూ.లక్షకు పైగా నగదు స్వాధీనం చేసుకోవడం, వారం తర్వాత ఇప్పడు చికెన్బాబా అరెస్టు కావడంతో అంతా నాటకీయంగా సాగిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
బాబుకు.. 'దొంగ'బాబా దీవెనలు?!
ప్రత్యేక హోదా పేరిట గత మంగళవారం ఏయూ గ్రౌండ్స్లో టీడీపీ చేపట్టిన ధర్మపోరాట సభకు సీఎం చంద్రబాబు వచ్చారు. ఏకబిగిన గంటన్నరసేపు ఉపన్యాసం దంచేసి వెళ్లారు. అక్కడితో ఆ విషయం అందరూ మర్చిపోయారు. కానీ చంద్రబాబు ఆ రోజు సాయంత్రం ఎయిర్పోర్టులో ఓ స్వామి నుంచి ఆశీస్సులు పొంది.. వంగి వంగి దండాలు పెడుతూ చూపించిన భక్తిప్రపత్తులే ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి.సహజంగా సీఎం స్థాయి ప్రముఖుల వద్దకు వెళ్లాలనుకునే వారికి చాలా పలుకుబడి ఉండాలి. లేదంటే సమాజంలో మంచి గౌరవప్రతిష్టలైనా ఉండాలి.కానీ చంద్రబాబును ఆ రోజు కలవడమే కాకుండా.. ఆశీస్సులు అందించిన ఆ స్వామి స్థాయి ఏమిటో.. ఆయన ఘన చరిత్ర ఏపాటిదో తెలిస్తే ఎవరైనా బిత్తరపోతారు.ఎందుకంటే సదరు స్వామిపై ఒక దొంగగా పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదై ఉంది. కోర్టుకు వెళ్లని నిందితుడన్న ట్రాక్ రికార్డ్ ఉంది. అటువంటి వ్యక్తి బాబా అలియాస్ స్వామిగా ఎలా మారాడు?.. నేరుగా సీఎం వద్దకు ఎలా వెళ్లగలిగాడు??.. బాబు ప్రత్యేకంగా ఆయన ఆశీస్సులెందుకు తీసుకున్నారు???... – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : నగరంలోని కప్పరాడ ఎన్జీవో కాలనీలో నివాసముంటున్న శంకర సదానంద స్వామి అలియాస్ శంకరస్వామి అలియాస్ శ్రీ శంకర విద్యానంద సరస్వతి స్వామికి వివాదాస్పదుడిగా పేరుంది. 2014 మే నెలలో పోలీసు జీపు నుంచి వైర్లెస్ సెట్, మైక్రో ఫోన్, వాకీటాకీ తదితర సామాగ్రి దొంగిలించాడంటూ నగరంలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కానిస్టేబుల్ శివకుమార్ ఫిర్యాదు మేరకు అప్పటి సర్కిల్ ఇనస్పెక్టర్ లక్ష్మణరావు సదరు శంకరస్వామిని ఐపీసీ 379 సెక్షన్ కింద అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఆ కేసు ఇప్పటికీ నడుస్తోంది. ఆ తర్వాత కూడా శంకరస్వామిపై పలు ఆరోపణలు వచ్చాయి. రాత్రిపూట బీచ్రోడ్లో బ్లూలైట్ తగిలించిన కారులో తిరుగుతూ మఫ్టీలో ఉన్న పోలీస్ ఆఫీసర్నని ప్రజలను మభ్యపెట్టిన దాఖలాలూ ఉన్నాయి. ఇక ఇటీవలే సదరు స్వామి ఫోర్త్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కార్ల షోరూమ్లో డస్టర్ వాహనం కొనుగోలు చేశాడు. కేవలం రూ.5 వేలు మాత్రమే అడ్వాన్స్ ఇచ్చి.. మిగిలిన మొత్తం మూడురోజుల్లో ఇస్తామని నమ్మబలికి పోస్ట్డేటెడ్ చెక్ ఇచ్చాడు. స్వామీజీనని చెప్పడంతో నమ్మిన షోరూమ్ నిర్వాహకులు తామే డ్రైవర్ను పెట్టి ఆయనకు కొత్త వెహికల్ ఇచ్చేశారు. కానీ పది రోజులైనా నయాపైసా కూడా ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి వెహికల్ను వెనక్కి తీసేసుకున్నారు. వంగి వంగి దండాలెందుకు..?! ఇప్పుడు ఇతగాడి చరిత్రంతా ఎందుకంటే.. ఇంతటి ఘనమైన స్వామికి సీఎం చంద్రబాబు వంగి వంగి దండాలు పెట్టి మరీ ఆశీస్సులు అందుకున్నారు. సీఎం వద్దకు సదరు స్వామిని ఎవరు తీసుకువెళ్లారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత మంగళవారం ఏయూ గ్రౌండ్స్లో నిర్వహించిన ధర్మపోరాట సభకు హాజరయ్యేందుకు సీఎం సాయంత్రం 3.30గంటల సమయంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే వీఐపీ లాంజ్లో సదరు స్వామి, మరో పురోహితుడితో కలిసి వేచి ఉన్నారు. సీఎం రాగానే పురోహితుడు వేదమంత్రాలు పలకగా.. స్వామి సీఎంకు శాలువా కప్పి పండ్లు అందజేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్, ఎమ్మెల్యే గణబాబు పక్కనే ఉన్నారు. సీఎంను కలవాలంటే.. అది కూడా ఎయిర్పోర్టులోని వీఐపీ లాంజ్లో కలవాలంటే అంత సులువేమీ కాదు. రెవెన్యూ అధికారులు ముందుగానే ఖరారు చేసే ప్రొటోకాల్ జాబితాలో పేరుంటేనే అక్కడ సీఎంను కలిసే వీలుంటుంది. మరి సదరు స్వామి పేరును ఎవరు సిఫారసు చేశారు.. ఎవరు దగ్గరుండి కలిపించారు.. అన్నది ఇప్పటికీ ప్రశ్నార్ధకంగానే ఉంది. దీనిపై రెవెన్యూ, పోలీసు అధికారులను వివరణ కోరితే.. ఎవరికి వారు మాకేమీ సంబంధంలేదంటూ తప్పించుకునే ధోరణిలోనే మాట్లాడుతున్నారు. సీఎంకు ఆశీస్సులిచ్చే ఫొటోలతో హల్చల్ సరే.. సీఎంను కలిశారు.. ఆశీస్సులు అందించారు.. అక్కడితో అయిందేదో అయిందనుకుంటే ఏ గొడవా లేదు. స్వయంగా సీఎంకు ఆశీస్సులు అందించిన ఫొటోలతో సదరు బాబా అప్పుడే హల్చల్ చేస్తున్నారని అంటున్నారు. సీఎంతో ఉన్న ఫొటోలతో మూడురోజుల కిందట నగరంలోని ఓ బడా వస్త్ర దుకాణానికి వెళ్లి సీఎంకే దీవెనలిచ్చిన స్వామీజీనని బిల్డప్ ఇచ్చి.. కావాల్సిన దుస్తులు ఫ్రీగా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అంతేకాదు,.. ఇక్కడ పీఠం పెడతానని, ప్రభుత్వపరంగా ఓ స్థలం ఇప్పించాలని జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేతను కలిసి కోరినట్టు సమాచారం. మాకే సంబంధం లేదు.. ప్రొటోకాల్ బాధ్యత రెవిన్యూదే:ఏసీపీ ఆ రోజు సీఎం వచ్చినప్పుడు ఎయిర్పోర్టు వద్ద బందోబస్తు బాధ్యత మాదే.. కానీ ఆయన్ను వీఐపీ లాంజ్లో ఎవర్ని కలిశారో మాకు తెలియదు.. అదంతా రెవెన్యూ అధికారుల బాధ్యత.. ప్రొటోకాల్ లిస్టు ప్రకారమే పంపిస్తారు.. కానీ ఆ లిస్టును రెవెన్యూ వాళ్ళే ఖరారు చేస్తారు.. అని ఏసీపీ లంకా అర్జున్ చెప్పారు. అవును.. ఆశీస్సులిచ్చారు..కానీ.. అర్బన్ తహసీల్దార్ నాగభూషణరావు అవును.. ఆ రోజు శంకరస్వామి ఎయిర్పోర్టులో చంద్రబాబును కలిసి శాలువాతో సత్కరించి పండ్లు ఇచ్చి ఆశీస్సులు అందజేశారు. స్వామిని అక్కడికి ఎవరు రమ్మన్నారో మాకూ తెలియదు.. సీఎం వచ్చేటప్పటికి అక్కడున్నారు.. సీఎంను కలుస్తామంటే భద్రతా సిబ్బందితో మాట్లాడి పంపించాం. అంతకుమించి మాకేమీ తెలియదని అర్బన్ తహసీల్దార్ నాగభూషణరావు తెలిపారు. ఏమో నాకైతే ఏమీ తెలియదు ఇన్చార్జి ఆర్డీవో సత్తిబాబు ఏమో.. ఆరోజు సీఎంను కలిశారేమో.. నాకైతే గుర్తు లేదు..మా వాళ్లు ఏమైనా అరేంజ్ చేశారేమో నాకైతే ఏమీ తెలియదు.. అని విశాఖ ఇన్చార్జి ఆర్డీవో సత్తిబాబు చెప్పారు. -
హిమాలయాలకు రజనీకాంత్!
సాక్షి, చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్.. ఈయన ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. ఒక్క సినిమాల విషయంలోనే కాదు.. ఆయన వ్యకిగత జీవితానికి కూడా వర్తిస్తుంది. మనసు బాగోలేకపోతే అందరూ గుడికి వెళతారు కానీ రజనీ మాత్రం హిమాలయాలకు వెళతారు. రోజుల కొద్ది అక్కడే ధ్యానం చేస్తూ గడుపుతారు. ఇప్పుడు కూడా హిమాలయాలకు ప్రయాణమవుతున్నారు. రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఇటీవలే ఆయన ప్రకటించారు. ఇంత వరకు పార్టీ పేరు, సిద్ధాంతాలను ప్రకటించని రజనీ తన రాజకీయ ప్రయాణానికి ముందు ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలనుకుంటున్నారు. కొద్ది రోజులు హిమాలయాల్లోని బాబా గుహల్లో గడపనున్నారు. చెన్నై నుంచి సిమ్లాకు, అక్కడి నుంచి కేదారినాధ్ మీదుగా హిమాలయాల్లోని బాబా గుహలకు చేరుకుంటారు. -
సాధువు ఫోటో వైరల్
అలహాబాద్ : ట్రాక్టర్, లారీ లాంటి భారీ వాహనాలను తాడుతో పట్టుకుని ముందుకు లాగడాన్ని అప్పుడప్పు చూసే ఉంటాం. మరీ కొందరైతే జుట్టుతోనే లేక పళ్ల సాయంతోనో లాగడం కూడా చూసే ఉంటాం. అయితే ఓ సాధువు మాత్రం వీటన్నింటినీ మించి చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తర భారతదేశంలో మినీ కుంభమేళాగా ప్రసిద్ధిచెందిన మాఘ్ మేళా ప్రతి ఏటా జరుగుతుంటుంది. ఈ మేళాకు దేశ నలుమూలల నుంచి భక్తులు వచ్చి గాంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. మేళా సమయంలో పవిత్ర జలాలతో స్నానం చేస్తే పాపాల నుండి విముక్తి కలుగుతుందని భావిస్తారు. అలహాబాద్ లో గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంగా ప్రసిద్ధిచెందిన ప్రయాగ్ లో ఓ సాధువు చేసిన సాహసం హాట్ టాపిక్ గా మారింది. ట్రాక్టర్ ను ఓ తాడు సాయంతో తన మర్మాంగానికి కట్టుకుని ఓ సాధువు ముందుకు లాగారు. తెల్ల జుట్టు, గడ్డంతో బొట్టు పెట్టుకుని, మెడలో రుద్రాక్ష మాలలు ధరించి నగ్నంగా ఉన్న ఆ సాధువు అసాధారణ ప్రదర్శనను ఇచ్చారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇలాంటి ప్రర్శనలు ఇదేం మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో సాధువులు ఇలాంటి ప్రదర్శనలు ఇచ్చారు. 2014లో కూడా ఓ సాధువు డజన్ ఇటుకలను తన మర్మావయవానికి కట్టుకొని ఇచ్చిన ప్రదర్శనకు సంబంధించి ఓ వీడియో అప్పుడు వైరల్ అయింది. 2016లో కూడా కుంభమేళా సమయంలో ఓ సాధువు పెద్ద బండారాయిని తాడుసాయంతో మర్మావయవానికి కట్టుకొని ఓ ప్రదర్శన ఇచ్చారు. 2018 మాఘ్ మేళాకు సంబంధించి మరిన్ని ఫోటోలు -
రజనీ ‘బాబా ముద్ర’.. మా లోగో ఒక్కటే
న్యూఢిల్లీ: సూపర్స్టార్ రజనీకాంత్ ‘బాబా ముద్ర’ ఓ స్టార్టప్ కంపెనీకి లోగోగా ఉండటం ఆ కంపెనీకి సమస్యగా మారింది. కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని రజనీకాంత్ ఇటీవల ప్రకటించడం, పార్టీ చిహ్నంగా బాబా ముద్ర ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతుండటం తెలిసిందే. సోషల్ మీడియా యాప్ అయిన వోక్స్వెబ్ అనే స్టార్టప్ కంపెనీకి కూడా దాదాపుగా ఇలాంటి లోగోనే ఉంది. దీంతో వోక్స్వెబ్ రజనీకాంత్ పార్టీకి అనుకూలంగా ఉంటుందా అని కొందరు తమను అడుగుతున్నారనీ, రజనీతోగానీ ఆయన స్థాపించే పార్టీతోగానీ తమకు ఏ సంబంధం లేదని వోక్స్వెబ్ వ్యవస్థాపకుడు యశ్ మిశ్రా చెప్పారు. రజనీ వర్గంలోని సంబంధిత వర్గాలకు తాము ఓ లేఖ కూడా రాసినప్పటికీ ఇంకా తమకు వారి నుంచి ఎలాంటి సమాచారం అందలేదని మిశ్రా వెల్లడించారు. బాబా ముద్రను పార్టీ చిహ్నంగా వాడకుండా ఉండేలా, లేదా కొన్ని మార్పులు చేసుకుని వాడేలా రజనీని కోరతామని ఆయన చెప్పారు. -
గవ్వల బాబా అరెస్ట్
కరీంనగర్: మంత్రతంత్రాలు, మాయమాటలతో అమాయక ప్రజలను మోసగిస్తున్న గవ్వల బాబాను టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్లోని ఇందిరమ్మ కాలనీ రేకుర్తికి చెందిన నడిగొట్టు రాజేష్(32) తనకు మంత్రాలు, మాయలు వచ్చని, వాటితో సంతానం కలిగించడం, ఉద్యోగాలు రప్పించడం, అనారోగ్యాలు నయం చేయడం, వశీకరణం చేయడం, అందరి బాధలు పోగొట్టడం, కిడ్నీ సమస్యలు తగ్గించడం, ధన ప్రాప్తి కలిగించడం చేస్తానని మాయమాటలు చెప్పి అమాయకులను మోసం చేస్తూ డబ్బులు గుంజుతున్నాడు. తన దగ్గరకు వచ్చిన వారి మానసిక స్థితిని గమనించి గవ్వలు వేసి వాటితో వచ్చే నెంబరుతో మీకు మంచి జరగదని, అందుకు పూజలు చేయాలని, మంత్రాలుతంత్రాలు చేయాలని చెప్పి తాయత్తులు కట్టించి ధనార్జనే ధ్యేయంగా వారాలు వారాలు రావాలని చెబుతూ మోసం చేస్తున్నాడని టాస్క్ఫోర్స్ పోలీసుల దృష్టికి వచ్చింది. అతని కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు మంగళవారం రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇతనిపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ సిఐ శ్రీనివాసరావు, ఎస్సైలు కిరణ్, సంతోష్, నాగరాజు, కొత్తపల్లి ఎస్సై రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
బాబా జీవితమే మార్గదర్శనం!
బాబా జీవితాన్ని గమనిస్తే గీతాసారం కనిపిస్తుంది. అర్జునుడికి కృష్ణభగవానుడు భగవద్గీత బోధించడం ద్వారా కర్తవ్యోన్ముఖుణ్ణి చేసినట్లు, తను జీవించే రీతినే అత్యుత్తమ జీవనమార్గంగాఅందరికీ ఆదర్శంగా నిలిపారు బాబా. రాముడు, రహీము ఒక్కడే! ఏ మాత్రం తేడాలేదు. మరిక వారి భక్తులు ఎందుకు విడిపోయి పోట్లాడుకోవటం, అందరూ కలసి జాతీయ సమైక్యతసాధించండి అని చెప్పిన బాబా సామాజిక సమస్యలకు సమాధానం చెప్పారు. అనేకమైన లౌకిక బాధలకు పరిష్కార మార్గం చూపారు. ఒక ఫకీరుగా, పరమయోగిగా, నిరంతరఆత్మానుసంధానంలో మునిగి ఉండే బాబా భక్తుల కోసం – మానవాళికోసం వారిలో ఒకరిగా, వారితో కలసి జీవించారు. ఆడారు, పాడారు, కష్టాలు, కన్నీళ్లలో సహానుభూతిని ప్రదర్శించారు.తనవైన లీలలతో కాపాడారు. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవరూపంలో అవతరించేది మనుష్యులను ఉద్ధరించేందుకే. ఎన్ని మత సంబంధ విషయాలు విన్నా,ఎన్ని గ్రంథాలు చదివినా కలగని ఆత్మసాక్షాత్కారం సద్గురుసాయి సమక్షంలో సులభంగా లభించేది. మత గ్రంథాలు ఇవ్వలేని జ్ఞానాన్ని బాబా ఎంతో సరళంగా భక్తుల మనసులకుపట్టించేవారు. ఆయన జీవనశైలి, ఆయన పలుకులే పరోక్షంగా భక్తుల సందేహాలకు సమాధానాలిచ్చేవి. క్షమ, నెమ్మది, ఫలాపేక్ష లేకపోవటం, దానం, ధర్మం, శరీరాన్ని, మనస్సునుస్వాధీనమందుంచుకోవటం, అహంకారం లేకపోవటం, గురుశుశ్రూష, వినయం వంటి శుభలక్షణాలన్నీ బాబా అనుసరించినవే. మానవాళికి మార్గదర్శకాలుగా నిలిచేవే. అందుకే భగవద్గీతఎలా మార్గదర్శకంగా నిలుస్తోందో, సాయిగీత కూడా చాలామందికి మార్గనిర్దేశం చేస్తోంది. -
రేప్ కేసులో మరో బాబా అరెస్ట్
జైపూర్: ఓ న్యాయ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటనలో రాజస్తాన్కు చెందిన స్వామి కౌశలేంద్ర ప్రపన్నాచారీ ఫలహరి మహరాజ్(70)ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్కు చెందిన 21 ఏళ్ల యువతి సెప్టెంబర్ 11న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఫలహరి మహరాజ్ను వైద్య పరీక్షల కోసం ఇక్కడి రాజీవ్ గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మధుసూదన్ ఆశ్రమాన్ని నడుపుతూ తనను తాను దైవంగా ప్రకటించుకున్న స్వామి ఫలహరి మహారాజ్కు బాధితురాలి తల్లిదండ్రులు గత కొన్నేళ్లుగా భక్తులన్నారు. -
రేప్ కేసు: మరో బాబా అరెస్ట్
జైపూర్: యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఫలహారి బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. విరాళం ఇచ్చేందుకు వచ్చిన తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై 376, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ ప్రకాష్ తెలిపారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫలాహారీ బాబాను విచారించేందుకు వెళ్లగా.. ఆయన అనారోగ్యంతో స్థానిక ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. దీంతో పోలీసులు బాబాను అల్వార్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. బాబా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉండటంతో అతడిని అరెస్టు చేశారు. కేవలం పండ్లను మాత్రమే తినే కౌశలేంద్ర ప్రపన్నాచార్య ఫలహారి(70) మహారాజ్గా రాజస్థాన్లో బాగా ఫేమస్. ఆయనకు దేశ, విదేశాల్లో అనేక మంది భక్తులు ఉన్నారు. ఆయన ఆశీర్వాదం కోసం ప్రముఖులు సైతం బారులు తీరుతారు. అలాంటి ఫలహారీ బాబాపై ఓ యువతి తన పై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాబాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 7వ తేదిన తన గదికి పిలిపించుకున్న బాబా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆ యువతి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు తెలిపింది. గత పదిహేనేళ్లుగా తమ కుటుంబ సభ్యులు ఫలహారి బాబాకు భక్తులుగా ఉన్నామని.. బాబాకు విరాళం ఇవ్వడానికి వచ్చినప్పుడే ఈ ఘటన జరిగిందని ఆమె తెలిపింది. దీంతో ఆమెను బాబా ఆశ్రమానికి తీసుకొచ్చిన పోలీసులు ఏ గదిలో ఈ ఘటన జరిగిందనే అంశంపై విచారణ చేపట్టారు. ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో ఇటీవల డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు 20ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. -
ఈ యంగ్ హీరోని గుర్తుపట్టారా..?
రిలీజ్ రోజు స్టార్ హీరో సినిమా చూడటం అభిమానులకు ఓ అచీవ్మెంట్. అయితే అలాంటి కోరికలు సెలబ్రిటీలకు కూడా ఉంటాయి. కానీ వారికి ఆ కోరిక తీర్చుకోవడం కొంచెం కష్టమైన పనే. హీరోగా మంచి ఫాంలో ఉన్న స్టార్, మరో స్టార్ హీరో సినిమాను రిలీజ్ రోజు చూడాలంటే చాలా కష్టాలే పడాలి. అలాంటి కష్టమే ఎదురైంది యంగ్ హీరో రాజ్ తరుణ్కి. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన దువ్వాడ జగన్నాథమ్ సినిమాను రిలీజ్ రోజు చూడాలనుకున్న రాజ్ తరుణ్ ఏకంగా మారువేశం వేసేసి థియేటర్లో ప్రత్యక్షమయ్యాడు. సినిమా చూసిన తరువాత తాను ఏ గెటప్ లో వెళ్లి సినిమా చూశాడో తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు రివీల్ చేశాడు. పొడవాటి గెడ్డంతో బాబాల కనిపిస్తున్న రాజ్ తరుణ్, ఏ థియేటర్లో సినిమా చూశాడో మాత్రం రివీల్ చేయలేదు. And that's how I watched DJ This morning -
గోపాలబాబా పార్ధివ దేహానికి అంత్యక్రియలు
పిఠాపురం టౌన్ : ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అవధూతగా భక్తులు కొలిచే గోపాలబాబా పార్ధివ దేహానికి ఆయన ఆశ్రమ ప్రాంగణంలో సోమవారం అంతిమ సంస్కారం నిర్వహించారు. బాబా దేహాన్ని ఆయన పడక గదిలోనే శాస్త్రోకంగా సమాధి చేశారు. బాబా పవిత్ర దేహానికి పంచ గవ్యాలు, పుష్కర జలాలు, పంచ లోహాలు, నవరత్నాలతో అభిషేకించి తులసి, మారేడు, గన్నేరు పత్ర, పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అంత్యక్రియలు జరిపించారు. ఈ కార్యక్రమంలో పలువురు హిమాలయ యోగులు, సద్గురువులు పాల్గొన్నారు.బాబా సమాధి కార్యక్రమం మధ్యాహ్నం ప్రారంభమై సాయంత్రం వరకూ సాగింది. సమాధిలో కర్పూరం, ఉప్పు, పచ్చ కర్పూరం, విభూది వేశారు. పిఠాపురం బైపాస్ రోడ్డులో గోపాలబాబా ఆశ్రమం ఉంది. ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించేందుకు, వీక్షించేందుకు బయట వ్యక్తులను, పాత్రికేయలను నిర్వాహకులు అనుమతించలేదు. ఆశ్రమ ప్రాంగణంలోని ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి బాబా అంత్యక్రియలను ప్రదర్శించారు. భక్తులు గోపాలబాబా అంత్యక్రియలను తెరలపై వీక్షించి దుఃఖాన్ని దిగమింగుకోలేకపోయారు. గోపాలబాబాను సమాది చేసిన చోటును ఆలయంగా తీర్చిదిద్ది భక్తుల దర్శనానికి అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇకపై కూడా ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు యధావిధిగా జరుగుతాయని వారు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే బాబా పార్ధివ దేహాన్ని దర్శించుకున్నారు. -
బిచ్చగాడిగా ప్రత్యక్షమైన బాబా!
సాక్షి, చెన్నై: తమిళనాడులోని నామక్కల్ జిల్లా కుమార పాళయం ఎంజీయార్ నగర్ కు చెందిన మురుగేషన్ శిరిడీ సాయిబాబా వీరభక్తుడు. మెకానిక్ షాప్ నడుపుకొనే మురుగేషన్ కు కొద్దికాలంగా బాబా కలలోకి వచ్చి 'నేను మళ్లీ రాబోతున్నా'అని చెప్పేవాడు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం.. మాసిన గడ్డం, చిరిగిన దుస్తులు, భుజానికి జోలెతో ఓ పెద్దాయన హఠాత్తుగా మురుగేషన్ దుకాణం ముందు ప్రత్యక్షం అయ్యాడు. అతణ్ని చూసి 'బాబా ప్రత్యక్షమయ్యారు.. బాబా వచ్చేశారు' అని కేకలు పెడుతూ చుట్టుపక్కల జనాలను పిలిచాడు. మురుగేషన్ బాబా భక్తుడనే విషయం తెలుసుకాబట్టి ప్రజలు కూడా ఆయన చెప్పినట్లు ఆ పెద్దాయననే బాబా అని నమ్మారు. ఆయనను పక్కనే ఉన్న ఆలయంలోకి తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో పూజించారు. కాళ్లుకడిగి, ఆ నీళ్లను తలపై చల్లుకున్నారు. ఈ విషయంలో మీడియా సైతం ఉత్సాహాన్ని ప్రదర్శించింది. తన కలలోకి వస్తున్న బాబా ఆయనే అంటూ మురుగేషన్ మీడియాతో చెప్పాడు. అంతే, సమీపంలోని ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా బాబాను దర్శించుకునేందుకు వచ్చారు. కానుకల రూపంలో బాబాకు దాదాపు రూ.40 వేలు ముట్టజెప్పారు. కాగా, పక్క ఊళ్ల నుంచి వచ్చినవారిలో కొందరు సదరు బాబాను ఎక్కడో చూసినట్లు తమలోతాము చర్చించుకుని చివరికి ఒక అభిప్రాయానికి వచ్చారు. అసలా పెద్దాయన బాబా కానేకాదు.. బిచ్చగాడు! కుమార పాళయం బస్టాండ్ పరిసరాల్లో కొన్నేళ్లుగా భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నాడని నిర్ధారించుకున్న తర్వాత ప్రజల భక్తి కాస్తా ఆగ్రహంగా మారింది. ముసలాయనను చెడామడా తిట్టి, మెడపట్టి ఆలయం నుంచి బయటికి గెంటేశారు. కానుకగా ఇచ్చిన రూ.40 వేలను తిరిగి లాక్కున్నారు. ఈ గందరగోళాన్ని చూసి మురుగేషన్ అవాక్కయ్యాడు. జనం ఎక్కడ తన మీద విరుచుకుపడతారో అనే భయంతో పత్తా లేకుండా పోయాడు. -
పీవోకే విముక్తికి ప్రచారం చేపట్టండి..!
రోఠక్ః పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) విముక్తికోసం భారీ ఎత్తున ప్రచారం చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. యోగాగురు రామ్ దేవ్ బాబా విన్నవించారు. ఎన్నికల్లో ఐఎస్ ఐ రిగ్గింగ్ చేసిందని ఆరోపిస్తూ స్థానికుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో పీవోకే విముక్తికోసం ప్రయత్నించాలని రామ్ దేవ్ ప్రధానిని కోరారు. పాకిస్తాన్ లాంటి దేశమే కశ్మీర్ ను ఆక్రమించగల్గినప్పుడు గొప్ప దేశమైన భారత్ ఎందుకు చూస్తూ ఊరుకోవాలని బాబా ప్రశ్నించారు. జూలై లో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్ స్థానికులు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యోగా గురు రామ్ దేవ్ స్పందించారు. పీవోకే విముక్తికోసం ప్రయత్నించేందుకు వెంటనే ప్రచారం చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. కశ్మీర్ ఎలాగైనా తమ సొంతమేననడానికి నవాజ్ షరీఫ్ కు ఎన్నిగుండెలంటూ ప్రశ్నించారు. కశ్మీర్ లోని మన ప్రజలు కేవలం చెప్పుకోడానికేనన్నట్లుందని, పాకిస్తాన్ వారిని ఇప్పటికే ఆక్రమించేంసిందని అన్నారు. గొప్పదేశమైన భారత్ లోని భూభాగాన్ని పాక్ ఆక్రమిస్తుంటే చూస్తూ నెమ్మదిగా ఊరుకునేది లేదన్నారు. పీవోకే ఎలక్షన్లలో రిగ్గింగ్ జరిగిందంటూ ఆగ్రహించిన నీలం వ్యాలీ ప్రాంతంలోని స్థానికులు ఏకంగా పాకిస్తానీ జెండాను సైతం తగులబెట్టి, ఆందోళనలు చేపట్టిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో స్థానికులకు సహకరించి, ఆక్రమిత కశ్మీర్ విముక్తికి ప్రచారం చేపట్టాలని రామ్ దేవ్ బాబా ప్రధానిని కోరారు. -
ఘనంగా గురుపౌర్ణమి
-
మహావతార్ బాబా
యోగి కథ బాబా పేరుతో రజనీకాంత్ సినిమా తీసింది ఈ బాబా గురించే. ఈయన ఇంకా బతికి ఉన్నాడని హిమాలయాల్లోనే ఉన్నాడని నమ్మేవారు చాలామంది ఉన్నారు. యోగాను ప్రాచుర్యంలోకి తెచ్చిన మహావతార్ బాబా తమిళనాడులోని పారంగిపేట్టయ్లో క్రీస్తుశకం 203 నవంబర్ 30న జన్మించారు. పాశ్చాత్యదేశాలలో యోగ విద్యకు ప్రాచుర్యం కల్పించిన పరమహంస యోగానంద సహా పలువురు యోగా గురువులు మహావతార్ శిష్య పరంపరలోని వారే. మహావతార్ బాబా అసలు పేరు ఏమిటో చాలాకాలం వరకు ఎవరికీ తెలియదు. అయితే, మహావతార్బాబాకు ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు నాగరాజన్ అని మార్షల్ గోవిందన్ (యోగాచార్య ఎం.గోవిందన్ సచ్చిదానంద) తన పుస్తకంలో రాశారు. ‘బాబాజీ అండ్ ది 18 సిద్ధ క్రియా యోగ ట్రెడిషన్’ పేరిట రాసిన ఆ పుస్తకంలో మహావతార్ బాబా జీవిత విశేషాలను వెలుగులోకి తెచ్చారు. భోగర్నాథర్ శిష్యుడిగా యోగసాధన ప్రారంభించిన మహావతార్ బాబా, తర్వాతి కాలంలో సిద్ధ అగస్త్య వద్ద క్రియాయోగ శిక్షణ పొందారు. బదరీనాథ్ చేరుకుని, అక్కడ క్రియాయోగ సాధన ద్వారా మహావతార్ బాబా సిద్ధి పొందారని ప్రతీతి. అయితే, క్రీస్తుశకం మూడో శతాబ్దికి చెందిన మహావతార్ బాబాను 1861-1966 మధ్య కాలంలో కొన్నిసార్లు ప్రత్యక్షంగా చూసినట్లు యోగా గురువు శ్యామాచరణ లాహిరి, ఆయన శిష్యులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అలహాబాద్లో 1894లో జరిగిన కుంభమేళాలో మహావతార్ బాబాను ప్రత్యక్షంగా కలుసుకున్నట్లు లాహిరి శిష్యుడైన యుక్తేశ్వర గిరి తన పుస్తకం ‘కైవల్య దర్శనం’లో రాశారు. -
'నాన్న..' తొలిసారి ఆ పిలుపెంత మధురం!
'నాన్న'.. మధురమైన పిలుపు అది. పెళ్లయ్యాక ప్రతి పురుషుడు తపించేది ఆ పిలుపు కోసమే. తమ పిల్లలు నోరారా 'నాన్న' అని పిలిస్తే.. పులకించని తండ్రి హృదయం ఉండదు. అలాంటి మధురానుభూతి నూతన సంవత్సరం సందర్భంగా బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ముఖ్కు లభించింది. జనవరి 1నాడు రితేశ్, జెనీలియా దంపతుల గారాల కొడుకు రియాన్ 'బాబా' అని పిలిచాడట. ఆ మ్యాజికల్ మోమెంట్స్ను రితేశ్ ఎంతో సంబురపడుతూ ట్విట్టర్లో పంచుకున్నాడు. 'నా కొడుకు నన్ను చూస్తూ 'బాబా' (నాన్న) అన్నాడోచ్.. 2016కు ఇంతకంటే గొప్ప స్వాగతం ఏముంటుంది' అంటూ రితేశ్ ట్విట్టర్లో తెలిపాడు. 2016లో 'బ్యాంక్ చోర్', 'గ్రేట్ గ్రాండ్ మస్తీ', 'హౌస్ఫుల్ 3' సినిమాలతో రితేశ్ ప్రేక్షకులను పలుకరించనున్నాడు. What a start to 2016 - My Son looks at me n calls out 'Baba' for the first time. #magical — Riteish Deshmukh (@Riteishd) January 1, 2016 -
భం.. భం.. బాబా!
-
బాబా సినిమా.. 'MSG'కి గ్రీన్సిగ్నల్!
-
బ్రేక్ఫాస్ట్ షో : బాబా.. బ్లాక్ & వైట్!
-
వీళ్ళు మామూలు బాబాలు కాదండోయ్..!
-
దొంగ బాబాకు దేహశుద్ధి!
-
లోకల్ రైళ్లలో 'బాబా'లు ప్రకటనలు అతికిస్తే చర్యలు
సాక్షి, ముంబై: మంత్రతంత్రాల పేరిట అమాయక ప్రజలను మోసం చేస్తున్న బాబాలు లోకల్ రైళ్లలో తమ ప్రకటనలు అతికిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పశ్చిమ రైల్వే శాఖ నిర్ణయించింది. మంత్రతంత్రాలు, మాయలతో సమస్యలు పరిష్కరిస్తామని మోసగిస్తూ లోకల్ రైళ్లలో అనేకమంది బాబాలు ప్రకటనలు అతికిస్తున్న విషయం తెలిసిందే. ప్రేమవివాహం, పనులు జరుగుతాయని, వశం చేసుకోవడం, అప్పులు తొలగిపోవడం, సంతానప్రాప్తి తదితర సమస్యలకు 100 శాతం పరిష్కార సమాధానం లభిస్తుందని కొందరు బాబాల పేరిట ప్రకటనలు గుప్పిస్తారు. వారి ప్రలోభానికి లొంగి అనేకమంది మోసపోతారు. ఈ బాబాల అకృత్యాలను అరికట్టేందుకు రైల్వే శాఖ అనేక ప్రయత్నాలు చేసినా ప్రకటనలు అతికించడాన్ని అరికట్టలేకపోయింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం మంత్రతంత్రాలకు వ్యతిరేకంగా బిల్లు పాస్ చేయడంతో బాబాగిరీ చేసేవారు ఆందోళనలో పడిపోయారు. ఈ బిల్లుతో రైల్వేకు సహకారం దొరికినట్లయింది. అమాయకులను మోసం చేసే ప్రకటనలు అతికించే వారిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. పశ్చిమ రైల్వే మార్గంలో జనవరి నుంచి ఆగస్టు వరకు ప్రకటనలతో ప్రయాణికులను మోసం చేస్తున్న సుమారు 156 మందిపై చర్యలు తీసుకుంది. ఈ చర్యల్లో రూ.1.52 లక్షల జరిమానా వసూలు చేసింది. అంతేకాకుండా ఆరుగురికి జైలు శిక్ష విధించింది. ఈ చర్యలను మరింత బలపర్చడం కోసం పశ్చిమ రైల్వే మోసం చేసే ప్రకటనలు అతికించేవారిపై ఏడేళ్ల జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. -
బాబా బ్లాక్ షీప్