Back Pain
-
టీమిండియాకు బ్యాడ్న్యూస్!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి ముందు టీమిండియాకు చేదువార్త!.. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఈ ఐసీసీ టోర్నీ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. వెన్నునొప్పి కారణంగా మరికొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్కు అతడు అందుబాటులోకి రావడం కష్టమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.అంతా తానై నడిపించిన బుమ్రాఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పితృత్వ సెలవుల కారణంగా తొలి టెస్టుకు దూరం కాగా బుమ్రా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. పెర్త్లో జరిగిన ఈ మ్యాచ్లో బౌలర్గా, కెప్టెన్గా రాణించి టీమిండియాకు 295 పరుగుల భారీ తేడాతో విజయం అందించాడు.ఇక ఈ ఐదు టెస్టుల సిరీస్లో.. ఫామ్లేమి దృష్ట్యా రోహిత్ శర్మ ఆఖరిదైన సిడ్నీ మ్యాచ్కు దూరం కాగా బుమ్రా మరోసారి జట్టు పగ్గాలు తీసుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా అతడు వెన్నునొప్పితో విలవిల్లాడాడు. ఈ క్రమంలో ఆస్పత్రికి తీసుకువెళ్లి స్కానింగ్ చేయించుకున్న తర్వాత బుమ్రా మళ్లీ మైదానంలో దిగి బౌలింగ్ చేశాడు. 32 వికెట్లతో కానీ దురదృష్టవశాత్తూ జట్టును గెలిపించలేకపోయాడు. ఈ క్రమంలో 3-1 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన టీమిండియా.. పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఏదేమైనా అద్బుత ప్రదర్శనతో ఈ సిరీస్లో అదరగొట్టిన బుమ్రా 32 వికెట్లతో లీడింగ్ వికెట్టేకర్గా నిలిచాడు.ఇదిలా ఉంటే.. టీమిండియా తదుపరి ఇంగ్లండ్తో సొంతగడ్డపై టీ20, వన్డేలు ఆడనుంది. అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనాల్సి ఉంది. అయితే, బుమ్రా వెన్నునొప్పి నుంచి ఇంకా కోలుకోలేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు ఇంగ్లండ్తో వన్డేలతో పాటు.. చాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్లకు కూడా దూరమవుతాడని తొలుత వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. అతడు నాకౌట్ దశకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది.బెడ్ రెస్ట్ అవసరం‘‘బుమ్రా వచ్చేవారం బీసీసీఐకి చెందిన, బెంగళూరులో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిపోర్టు చేయాల్సి ఉంది. అయితే, ఇప్పటి వరకు అందుకు సంబంధించిన తేదీ ఖరారు కాలేదు. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కండరాల నొప్పితో పాటు వాపు కూడా ఉంది.కాబట్టి వైద్యులు అతడిని ఇంటి వద్ద బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఇది నిజంగా జట్టుకు ఎదురుదెబ్బలాంటిదే. డిస్క్ బాహ్య పొర ఉబ్బినట్లు తేలినా, కండరాల వాపు ఎక్కువగా ఉన్నా మరింత కష్టమే. అతడొక విలువైన ఆటగాడు. కాబట్టి అతడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్పై ఉంది’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు అన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.అవే కీలకంఅదే విధంగా.. టీమిండియా మాజీ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ రాంజీ శ్రీనివాసన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఎడిమా(శరీర కణజాలాల్లో ఫ్లూయిడ్స్) ఫామ్ అయితే.. వాపు వస్తుంది. అయితే, గాయం, నొప్పి తీవ్రత ఆధారంగా ఓ వ్యక్తి ఎన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలనే అంశాన్ని నిర్ణయిస్తారు. ఆ వ్యక్తి శరీరతత్వం, వైద్యుల పర్యవేక్షణ, వాడే మందులు.. అన్నీ ఇందులో కీలకం’’ అని పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. కాగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది.చదవండి: అందుకే ఐదు సెంచరీలు కొట్టినా అతడిని పక్కన పెడుతున్నారా?: భజ్జీ -
ముక్కోణంతో మజిల్స్కు బలం
వెన్నునొప్పిని తగ్గించడానికి, కండరాలను బలోపేతం చేయడానికి త్రికోణాసనం సహాయపడుతుంది. సయాటికా సమస్యను తగ్గించడానికి ప్రభావ వంతంగా పనిచేస్తుంది. ఈ ఆసనంలో వెన్నెముక, చేతులు, ఛాతీ స్ట్రెంచింగ్ అవుతాయి. దీనివల్ల కండరాలు దృఢపడతాయి. త్రికోణాసనం వేయాలంటే...∙ముందు పాదాలను దూరంగా పెట్టి నిటారుగా నిల్చోవాలి. ∙తర్వాత చేతులను రెండువైపులకు చాచాలి. దీర్ఘశ్వాస తీసుకోవాలి. ∙నెమ్మదిగా శ్వాస వదులుతూ తుంటి నుంచి శరీరాన్ని కుడివైపునకు వంచాలి. ∙ఇలా వంచేటప్పుడు కూడా నడుము నిటారుగానే ఉంచాలి. ∙ఎడమ చేయిని పైకెత్తి, కుడి చేతిని కుడి పాదానికి తాకించాలి. ∙చేతులు రెండూ ఒకే వరుసలో ఉండేలా చూసుకోవాలి. ∙తల కుడివైపునకు తిప్పి, ఎడమ చేయిని చూడాలి. ∙తర్వాత శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. ఆ తర్వాత.. మరోవైపున కూడా ఇలాగే చేయాలి. ఈ ఆసనాన్ని రోజూ సాధన చేయడం వల్ల శరీరమంతా స్ట్రెచ్ అవడంతో పాటు, మానసిక శారీరక ఒత్తిడులు తగ్గుతాయి. – అనూషా కార్తీక్ -
నడుమునొప్పి చాలా ఎక్కువగా వస్తోంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
నాకు 5వ నెల, నడుమునొప్పి చాలా ఎక్కువగా వస్తోంది. ఉద్యోగం చేస్తున్నాను. రెస్ట్లో ఉంటే కొంచెం బాగుంటోంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సుధ, రేణిగుంటప్రెగ్నెన్సీలో 3వ నెల దాటిన తరువాత చాలామందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఇది మొదటి ప్రెగ్నెన్సీలో బాడీలో వచ్చే హార్మోనల్ చేంజెస్కి పెల్విక్ లిగమెంట్స్ స్ట్రెచ్ అవటం వల్ల వస్తుంది. ఆ స్ట్రెచ్లో లోయర్ బ్యాక్, పెల్విక్స్ నొప్పి వస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. బరువులు ఎత్తకుండా ఉండటం, పడుకున్నప్పుడు వెన్నును మరీ వంచకుండా, కాళ్లను కదిలించడం ద్వారా ఒత్తిగిల్లడం, ఫ్లాట్ షూస్ వేసుకోవడం, ఆఫీస్లో కూర్చుని ఉన్నప్పుడు బ్యాక్ని స్ట్రెయిట్గా ఉంచి కూర్చోవడం చేయాలి.మెటర్నిటీ పిల్లోస్ కూడా వాడుకోవచ్చు. మసాజ్ వల్ల కూడా కొందరికి నొప్పి తగ్గుతుంది. కిందపడిన వస్తువులను మోకాలు మీద వంగి తీసుకోవడం, బ్యాక్ బెండ్ కాకుండా చూడటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నొప్పి ఎక్కువ ఉంటే పారాసిటమాల్ మాత్రలు వేసుకోవాలి. కొన్ని ప్రీనేటల్ యోగా ఎక్సర్సైజ్ల వల్ల కూడా బ్యాక్ పెయిన్ బాగా తగ్గుతుంది. ట్రెయినర్ పర్యవేక్షణలో అవి పాటించాలి. ఒకవేళ నడుమునొప్పితో పాటు, ఫీవర్ ఉన్నా, బ్లీడింగ్, యూరిన్లో నొప్పి ఉన్నా, ఛాతీ భాగంలో నొప్పి ఉన్నా, వాటర్ బ్రేకింగ్ ఉన్నా అది చాలా ప్రమాదం. వెంటనే డాక్టర్ను కలవాలి.హెల్త్ ట్రీట్: హిస్టరెక్టమీతో ఇతర సమస్యలు..హిస్టరెక్టమీ శస్త్రచికిత్స తర్వాత మహిళలు తర్వాతి కాలంలో ఇతర సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఒక తాజా పరిశోధనలో తేలింది. ఈ శస్త్రచికిత్సలో గర్భసంచిని, అండాశయాలను తొలగించడం వల్ల మహిళల ఆరోగ్యంపై అనేక దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయని అమెరికన్ వైద్య నిపుణురాలు డాక్టర్ బ్రునిల్డా నజారియో చెబుతున్నారు.న్యూయార్క్లోని ఒబేసిటీ సొసైటీ లాటిన్ అమెరికన్ విభాగం చైర్పర్సన్గా ఉన్న డాక్టర్ బ్రునిల్డా ఇటీవల తన పరిశోధనలో తేలిన అంశాలను గ్లోబల్ వెల్నెస్ çసమిట్లో వెల్లడించారు. యూటరిన్ ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యలు ఉన్నప్పుడు మహిళలకు హిస్టరెక్టమీ చేయాల్సి వస్తుంది. ఈ చికిత్స తర్వాత మహిళల్లో గుండెజబ్బులు, రక్తపోటు, డెమెన్షియా, శరీరంలో కొవ్వు పెరిగి స్థూలకాయం రావడం వంటి సమస్యలు తలెత్తుతాయని డాక్టర్ బ్రునిల్డా నేతృత్వంలో జరిగిన పరిశోధనలో తేలింది.ఈ పరిశోధనలో భాగంగా 4,188 మంది మహిళలపై పరీక్షలు నిర్వహించి, విస్తృతంగా అధ్యయనం చేశారు. హిస్టరెక్టమీ చేయించుకోని మహిళలతో పోల్చుకుంటే, హిస్టరెక్టమీ చేయించుకున్న మహిళల్లోనే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. వీరిలో ముప్పయి ఐదేళ్లలోపు వయసులోనే హిస్టరెక్టమీ చేయించుకున్న వారిలో ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రంగా ఉంటున్నట్లు గుర్తించారు.ఇవి చదవండి: ఆడంబరాలు.. అనర్థాలు తెస్తాయి! -
Standing Desk: నిలబడి వర్క్ చేస్తే ఆరోగ్యానికి మేలు!
నిలబడి వర్క్ చేస్తే ఆరోగ్యానికి మేలంటున్న కార్పొరేట్స్ సుదీర్ఘకాలం కూర్చోవడం స్మోకింగ్తో సమానం వెన్నునొప్పికి దారితీస్తున్న సిట్టింగ్ పొజిషన్ పలు అధ్యయనాల నివేదికల్లో స్పష్టం వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు కారణంగా కార్పొరేట్ ప్రొఫెషనల్స్కి వెన్నునొప్పి సమస్య ముదిరి తన రోజువారీ కార్యకలాపాలను సైతం ప్రభావితం చేస్తోంది. నగరంలోని ఓ మొబైల్ వాలెట్ కంపెనీలో పనిచేస్తున్న అన్షుల్, స్నేహితుల సలహా మేరకు స్టాండింగ్ డెస్్కను ఎంచుకున్నాడు. ‘ఇప్పుడు, నా వెన్నునొప్పి తగ్గిపోయింది’ అని అన్షుల్ చెబుతున్నారు.. ఎక్కువ గంటలు కూర్చోవడం స్మోకింగ్తో సమానమైన వ్యసనంగా తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకు తగ్గట్టే పలు రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్న నేపథ్యంలో డెస్క్ జాబ్స్ చేసే నగరవాసులకు స్టాండింగ్ డెస్్కలు పరిష్కారంగా మారిపోయాయి. ఆధునిక పరిస్థితుల్లో మనం కంప్యూటర్లు, టెలివిజన్లు ఇతర ఎల్రక్టానిక్ పరికరాల ముందు కూర్చొని ఎక్కువ సమయం గడుపుతున్న కొద్దీ, మన శారీరక మానసిక ఆరోగ్యంపై నిశ్చల జీవనశైలి తాలూకు ప్రతికూల ప్రభావాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడానికి ఒక సులభ పరిష్కారం స్టాండింగ్ డెస్్క., దీనిని సిట్–స్టాండ్ డెస్క్ అని కూడా పిలుస్తారు. కూర్చున్నా.. నిలబడి ఉన్న భంగిమలకు అనుగుణంగా సర్దుబాటు చేయగల డెస్్క. రోజంతా రెండు రకాల భంగిమలకు మధ్య మారడానికి వీలుగా ఇవి రూపొందాయి.చలనం.. ఆలోచనల ఫలం..ఆరోగ్య లాభాలను గుర్తించిన మీదట నగరానికి చెందిన ప్రోగ్రామర్ అభిõÙక్ మాండ్లోయ్ 3 నెలల క్రితం స్టాండింగ్ డెస్్కకి మారారు, కంపెనీ అతనికి ఫరి్నచర్ అలవెన్స్ ఇచి్చంది. ‘ఈ మార్పుకు గాను నాకు రూ.27,000 ఖర్చయ్యింది. అయితే దీని వల్ల లాభాలు అంతకు మించి వస్తున్నాయి. నిలబడి ఉన్నప్పుడు నేను నలువైపులా కదలగలను. అది నేను మరింత వేగంగా ఆలోచించగలిగేలా చేస్తుంది’ అని మాండ్లోయ్ అన్నారు. ఆధునిక సంస్థలు ఉద్యోగుల పని పరిసరాలు, వారి ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యతనిస్తున్నాయి. ఉద్యోగులు ఉత్తమమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండేలా వివిధ మార్గాల్లో ప్రయతి్నస్తున్నారు. ఫిట్నెస్ అగ్రిగేటర్ జింపిక్ వ్యవస్థాపకుడు అమరేష్ ఓజా మాట్లాడుతూ, ‘స్టాండింగ్ డెస్క్ మరింత చురుకుగా పని చేసేలా చేస్తుందని తన స్టార్టప్లోని సగం మంది సిబ్బంది ఇప్పటికే స్టాండింగ్ డెస్్కలను కొనుగోలు చేశారని చెప్పారు. అదే క్రమంలో యాపిల్ సంస్థ సైతం తన కొత్త ప్రధాన కార్యాలయం యాపిల్ పార్క్లో పనిచేసే ఉద్యోగులందరికీ స్టాండింగ్ డెస్క్లను ఏర్పాటు చేసిందని సమాచారం. డెస్్కకు డిమాండ్... ఈ స్టాండింగ్ డెస్్కకు సంబంధించిన బ్రాండెడ్ ఉత్పత్తుల ధరలు రూ. 20,000 నుంచి ప్రారంభమై రూ. 50,000 వరకూ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ బలపడడంతో అది స్టాండింగ్ డెస్్కల డిమాండ్ పెరగడానికి దారితీసింది. ‘కోవిడ్కు ముందుతో పోలిస్తే ఈ డెస్్కల సేల్స్ ఇప్పుడు రెట్టింపైంది’ అని ఎర్గో డెస్క్ రిటైల్ స్టోర్ నిర్వాహకులు రాహుల్ మాథుర్ అన్నారు. గత త్రైమాసికం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ సొల్యూషన్ల డిమాండ్ 45% కంటే పెరిగి, ఇప్పటికీ స్థిరంగా పెరుగుతోందని ఫరి్నచర్ రెంటల్ పోర్టల్ సిటీఫరి్నష్ వ్యవస్థాపకుడు నీరవ్ జైన్ వెల్లడించారు. స్టాండింగ్ డెస్్కల కోసం కార్యాలయాల నుంచి బల్క్ ఆర్డర్లు తగ్గాయి, అదే సమయంలో రిటైల్ అమ్మకాలు పెరిగాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రారంభమైనప్పటి నుంచి రిటైల్ అమ్మకాలు 100% పెరిగాయని ఎర్గోనామిక్ ఫర్నిచర్ స్టార్టప్ పర్ప్లర్క్ వ్యవస్థాపకుడు గుణశేఖరన్ జయరామన్ అంటున్నారు. నిరి్వరామం ప్రమాదం... నగరంలోని ఓ ఆస్పత్రిలో వెన్నెముక సర్జరీ చీఫ్ డాక్టర్ అరుణ్ భానోట్ మాట్లాడుతూ ‘సరైన భంగిమలో ఉపయోగించినప్పుడు స్టాండింగ్ డెస్క్లు మంచి ఫలితాలను అందిస్తాయి’ అని స్పష్టం చేశారు. అయితే ఎక్కువగా వంగిన భంగిమలో గానీ, లేదా నిలుచుని పనిచేస్తుంటే అది కొత్త సమస్యలకు దారి తీస్తుంది’ అని భానోట్ హెచ్చరిస్తున్నారు. మణికట్టు డెస్్కపై ఫ్లాట్గా ఉన్నప్పుడు మోచేతులు 90 డిగ్రీల కోణంలో ఉండాలని సూచిస్తున్నారు. అయితే 30 నిమిషాల కంటే ఎక్కువసేపు నిరి్వరామంగా నిలబడడం అంత మంచిది కాదని స్పష్టం చేశారు.కూర్చోవడం వర్సెస్ నిల్చోవడం..⇒ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ తరహా నిశ్చల జీవనశైలికి దూరం అయ్యేలా స్టాండింగ్ డెస్్కని ఉపయోగించవచ్చు. తద్వారా పలు వ్యాధుల ప్రమాదాన్ని నివారించవచ్చు. ⇒ ఎక్కువసేపు కూర్చున్నప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ పరిమితంగా మారుతుంది. ఇది చిత్తవైకల్యం వంటి మెదడు జబ్బుల ప్రమాదానికి దారితీస్తుంది. నిలబడి ఉన్నప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. దానికి అవసరమైన ఆక్సిజన్ ఇతర పోషకాలను అందిస్తుంది. ⇒ చాలాసేపు కూర్చోవడం వల్ల అలసట బద్ధకం వస్తాయి. దీనికి విరుద్ధంగా, స్టాండింగ్ శక్తి స్థాయిలను పెంచి చురుకుదనాన్ని ఇస్తాయి. ⇒ సృజన, సమస్యల పరిష్కార సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. ఉత్పాదకతను పెంచడంలో స్టాండింగ్ డెస్్కలు సహాయపడతాయని, తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడం వీలవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ⇒ గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల మన వెన్నెముక కుదించబడే అవకాశం ఉంది. ఇది వెన్నునొప్పికి దారితీస్తుంది. అదే నిలబడి ఉన్న డెస్్కలు నిటారుగా నిలబడటానికి మన కోర్ కండరాలకు మద్దతు అందించడం ద్వారా వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడతాయి. ⇒ గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల మన మనస్సు పలు చోట్లకు సంచరించేలా చేస్తుంది. దీని వల్ల ఏకాగ్రత కష్టమవుతుంది. దీనికి భిన్నంగా స్టాండింగ్ డెస్్కని ఉపయోగించడం ద్వారా మన దృష్టి ఏకాగ్రతలను మెరుగుపరచవచ్చు. -
ఎయిమ్స్లో రాజ్నాథ్సింగ్
సాక్షి,ఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్(73) ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఎయిమ్స్ ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం(జులై11) ఉదయం రాజ్నాథ్ వెన్నునొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి ప్రైవేట్ వార్డులో ఆయనకు వెన్నునొప్పి సంబంధిత పరీక్షలు చేశారు. -
విపరీతమైన నడుము నొప్పా? సరైన ట్రీట్మెంట్ కోసం..
-
నడుము నొప్పా? సింపుల్గా ఇలా తగ్గించుకోండి!
నడుంనొప్పి ఉన్నవారు ఆ బాధ బయటకు చెప్పుకోలేరు. చాలా ఇబ్బంది పడుతుంటారు. తరచు పడకకే పరిమితం అయిపోవలసి వస్తుంటుంది. నొప్పి వచ్చినప్పుడల్లా సింపుల్గా ఒక పెయిన్ కిల్లర్ను వేసేసుకుంటూ ఉంటారు. అయితే ఆ మాత్ర నొప్పితోపాటు క్రమంగా మనల్నీ కిల్ చేస్తుంటుందన్న విషయాన్ని మరచిపోవద్దు. నడుంనొప్పి తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు... సింపుల్గా తగ్గిపోతుంది. ఆ చిట్కాలేమిటో చూద్దాం... బాగా నడుము నొప్పిగా ఉన్నవారు తగ్గించుకోవాలంటే ముందు ఒత్తిడిని తగ్గించుకోవాల్సి ఉంటుంది. వెన్నెముక కండరాలు బలోపేతం చేయడంతోపాటు, కొన్ని రోజువారీ అలవాట్లను మార్చుకోవడం వల్ల నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందే వీలుంటుంది. చిన్న చిన్న టిప్స్తో నడుం నొప్పిని తగ్గించుకోవచ్చు. పడుకునే సమయంలో వెనుక భాగంపై ఒత్తిడి పడుతుంది. నడుంనొప్పి ఎక్కువగా ఉన్నవారు మోకాళ్ళ కింద దిండు పెట్టుకొని నిద్రించడం వల్ల, కాళ్ళు ఎత్తుగా పెట్టడం వల్ల నడుంపై ఒత్తిడి తగ్గి కాస్త రిలీఫ్ గా ఉంటుంది. సరైన శిక్షణతో వ్యాయామం.. నడుం నొప్పి నుంచి ఉపశమనం నడుంనొప్పిని తగ్గించుకోవడంలో వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక వ్యాయామం చేసే సమయంలో నడుముకు సంబంధించిన ముఖ్యమైన కండరాలపై దృష్టిసారించి సరైన శిక్షణతో వ్యాయామం చేయడం వల్ల, ముఖ్యంగా కండరాలను సాగదీసే స్ట్రెచ్ ఎక్సర్సైజులు చేయడంవల్ల ఫలితం ఉంటుంది. వెన్ను సంబంధిత గాయాల ప్రమాదాన్ని తగ్గించడంలో వ్యాయామం సహాయపడుతుంది. నడుం నొప్పి తగ్గడం కోసం వారానికి కనీసం రెండుసార్లు నడుమును బలపరిచే వ్యాయామాలను చేయండి. కాల్షియం, విటమిన్ డి.. ఎముకలు బలంగా ఉన్నప్పుడు నడుము నొప్పి వంటి సమస్యలు ఎక్కువ బాధించవు. బలహీనమైన ఎముకలు ఉన్నప్పుడు కచ్చితంగా నడుంనొప్పి ఇబ్బంది పెడుతుంది. కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా తీసుకోవడం ద్వారా వెన్నెముకలోని ఎముకలకు బలం చేకూరుతుంది. అందుకే తప్పనిసరిగా కాల్షియం, విటమిన్ డి తీసుకోవడం మర్చిపోకండి. పాలు, పెరుగు, ఆకుకూరలు, విటమిన్ సప్లిమెంట్లు వంటి వాటిలో విటమిన్ డి ఉంటుంది. చెప్పుల విషయంలో జాగ్రత్త నడుంనొప్పిని నివారించడం కోసం చెప్పుల విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ఎత్తు మడమల చెప్పులు ఎక్కువగా వేసుకునే వారికి నడుంనొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తక్కువ మడమ ఉన్న చెప్పులను ధరించండి. ఇవి మన నడుంపై ఒత్తిడిని తగ్గిస్తాయి. ఒక్క అంగుళం కంటే తక్కువ మడమ ఉంటేనే ఫలితం బాగుంటుంది. సరైన పొజిషన్.. ఆఫీసులో కూర్చున్నప్పుడు, నిలబడి ఉన్నప్పుడు సరైన భంగిమ పద్ధతులను పాటించండి. మనం కూర్చునే విధానం బట్టి కూడా నడుము నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే కూర్చున్నా, నిల్చున్నా కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి ప్రతిరోజూ గంటల తరబడి కంప్యూటర్ ముందు పని చేసేవారు మంచి కుర్చీని ఎంపిక చేసుకొని కూర్చోవాలి. లేదంటే నడుం నొప్పి ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. బరువు తగ్గించుకోవడం.. నడుం నొప్పికి మరొక కారణం విపరీతమైన బరువు. ఎక్కువ బరువు ఉన్న వారిలోనూ నడుమునొప్పి విపరీతంగా వస్తుంది. బరువు తగ్గితే సహజంగానే నడుం నొప్పి నుండి కూడా కాస్త ఉపశమనం లభిస్తుంది. కాబట్టి బరువు తగ్గటం పై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం అవసరం. ప్రతిరోజు వ్యాయామం చేయడంతో పాటు, చిన్న చిన్న మార్పులతో నడుం నొప్పి ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మందులతోనే నడుము నొప్పి తగ్గాలని చూడకుండా, పై చిట్కాలు పాటించి చూడండి. కచ్చితంగా విపరీతమైన బాధ నుండి కాస్తయినా ఉపశమనం పొందుతారు. ఇవి చదవండి: బిడ్డ పుట్టినట్టు, ఏడుస్తున్నట్టు కల వస్తే.. అపశకునమా! -
ఆ ఒక్క ఇంజెక్షన్ చాలు,రీసెర్చ్లో ఏం తేలిందంటే..
రకరకాల కారణాలతో చాలామందిని వెన్నునొప్పి బాధిస్తుంటుంది. ఎప్పటికప్పుడు మాత్రలు మింగడం.. ఆ రోజు గడిపేయడం అంతే. అయితే అమెరికాలో జరిగిన ఓ పరిశోధన పుణ్యమా అని ఇకపై ఈ ఇబ్బంది తీరిపోనుంది. శరీరంలోని ఏ కణంలానైనా మారిపోగల సామర్థ్యమున్న మూలకణాలు కొన్నింటిని ఇంజెక్షన్ రూపంలో ఎక్కించుకుంటే మూడేళ్ల పాటు వెన్నునొప్పి దరి చేరదని రీసెర్చ్లో వెల్లడైంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో మెసోబ్లాస్ట్ అనే ఓ ఫార్మా కంపెనీ ఉంది.ఇటీవల వెన్నెముకలోని భాగాలు అరిగిపోయిన దాదాపు 100 మందికి మూలకణాలు అందించింది. వెన్నెముకలోని ఎముకల మధ్య ఉన్న ఖాళీల్లో ద్రవం పూర్తిగా ఇంకిపోయినప్పుడు చిన్నపాటి కదలికలకూ విపరీతమైన నొప్పి కలుగుతుంది. వారికి ఇతరుల ఎముక మజ్జలోంచి సేకరించిన మూలకణాలను ఎక్కించినప్పుడు వారిలో నొప్పి గణనీయంగా తగ్గిపోయినట్లు తెలిసింది. కొంతమందిలో దాదాపు రెండేళ్ల పాటు నొప్పి లేకపోగా.. కొంతమందికి సమస్య మూడేళ్ల తర్వాత గానీ తిరిగిరాలేదు. తాము పరిశోధనలు చేసిన వందమందిని ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు వెన్నెముకలోని సమస్యలు చాలా వరకూ తగ్గిపోయినట్లు తెలిసిందని మెసోబ్లాస్ట్ పరిశోధకులు తెలిపారు. -
పర్సుని ఫ్యాంటు వెనుక జేబులో పెడుతున్నారా?
మనం నిత్యం సాధారణంగా భావించి చేసే పనులు ఒక్కోసారి చేటు తెస్తాయి. ఎంతలా అంటే అందువల్లే మనకు ఈ సమస్య వచ్చిందని వైద్యులు లేదా మరేవరైన ఆరోగ్య నిపుణుడు చెప్పేంతవరకు గమనించం. మనం ఊహించను కూడా ఊహించం అలా చేయడం అంత ప్రమాదమా! అని ఆ తర్వాతగానీ తెలిసి రాదు. ఎందుకంటే చాలామంది ఇలాంటి పనులు రోజువారి జీవితంలో సాధారణంగా చేసేవే కావడం. ఇంతకీ ఎందుకిదంతా అంటే..చాలామంది పర్సు లేదా వాలెట్ని మగవారు లేదా స్త్రీలు బాక్ పాకెట్లోనే పెట్టుకుంటుంటారు. చాలా సర్వసాధారణమైన విషయం కూడా. ఐతే అలా అస్సలు పెట్టకూడదని వైద్యలు హెచ్చరిస్తున్నారు. అలా చేయడం వల్లే తలెత్తే ఆరోగ్య సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఓ ఏజ్ వచ్చేటప్పటికి సరిగా నడవలేక వంగిపోవడానికి కారణం కూడా ఇదే అని అంటున్నారు ఆరోగ్య నిపుణలు. పర్సు వల్ల ఆరోగ్య సమస్యలా అని ఆశ్చర్యపోకండి!. ఔను! దీని వల్ల ఎలాంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయంటే..చాలా మంది మెడ, భుజాలు, వెన్ను సమస్యలను తరుచుగా ఎదుర్కొంటుంటారు. దీనికి కారణం పర్సుని వెనుక జేబులో పెట్టడమేనని అంటున్నారు. మనం బ్యాక్ పాకెట్లో పెట్టే వాలెట్ని బట్టి సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. బరువైన వాలెట్ని తీసుకొచ్చి బ్యాక్ పాకెట్లో పెట్టడం వల్ల తెలియకుండా ఆ బరువు కారణంగా కొంత ఒత్తిడి కండరాలు, స్నాయువులపై పడి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఫలితంగా అది కాస్త దీర్ఘకాలిక కీళ్ల నొప్పికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. వెన్నుపై ఎలా ప్రభావం పడుతుందంటే.. పర్సు ఓ మోస్తారు బరువు ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ మనం క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, వోచ్చర్స్, ఆధార్ కార్డులని ఇలా ఎన్నో కార్డులతో బరువుగా నింపేస్తాం. పోనీ అక్కడితో ఊరుకోకుండా దాన్ని తీసుకెళ్లి బ్యాక్ జేబులో ఏదోరకంగా కుక్కి ఎత్తుగా కనపడకుండా ఉండేలా పైన ఉన్న షర్ట్ లేదా టీషర్టుని సరిచేసుకుంటాం. ఔనా! దీంతో తుంటి ఎముకలోని కండరాలు, కీళ్లు ఒత్తడికి గరయ్యి ఒకవైపు ఒంగిపోతాయి. అంతేందుకు మనం ఎక్కువ బరువుని మోస్తే ఆటోమోటిక్గా ఒకవైపుకి వంగి నడుస్తాం. మనకు తెలియకుండాని మన నడక వంకర అవుతుంది. దీంతో వెన్ను, తుంటి, కాలు, భుజాలలో నొప్పి మొదలై అసౌకర్యంగా ఉంటుంది. మన బ్యాక్ సైడ్పెట్టే బరువు వెన్నుపూసపై గట్టి ప్రభావం చూపిస్తుంది. చెప్పాలంటే పూసలు కదలడం లేదా వెన్ను ఒకవైపు వంకర అయ్యే ప్రమాదం లేకపోలేదు. అంతేగా ఆ నొప్పి అక్కడ నుంచి మెడకు, భుజాలకు పాకి కీళ్ల నొప్పుల్లోకి పెట్టేస్తుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు వాలెట్ని బరువుగా ఉండనివ్వొద్దని వార్నింగ్ ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కార్డులతో పనిలేకుండా.. నిజానికి, అనేక దుకాణాలు పంచ్ కార్డ్ని ఉపయోగించకుండా యాప్ ద్వారా లాయల్టీ పాయింట్లను ఉపయోగించేలా అనుమతిస్తాయి కూడా. మీరు చాలా బిల్లులు కట్టేందుకు ఆయా కార్డులు పట్టికెళ్లాల్సి ఉంటే కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుని కార్డులు తగ్గించే యత్నం చేయండి. పంచ్ కార్డ్లు, బిజినెస్ కార్డులు, రివార్డు కార్డ్లు తదితర ఎలాంటి కార్డులైన తీసుకుని వెళ్లడం తగ్గించేలా యత్నం చేయాలి. అన్నింటిని రోజు మోసుకుంటూ వెళ్లాల్సి అవసరం లేదు. సాధ్యమైనంత వరకు వాలెట్ లేదా పర్సులో కార్డుల సంఖ్య పరిమితిగా ఉండి బరువు లేకుండా ఉండేలా చూసుకోండి. తద్వారా చిన్నగా ప్రారంభమయ్యే ఈ వీపు, మెడ, భుజాలు, కాళ్లు సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చని వైద్యలు నొక్కి చెబుతున్నారు. (చదవండి: డీజే మ్యూజిక్ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా?) -
వెన్నునొప్పి..క్యాన్సర్కి సంకేతమా?..!
వెన్ను నొప్పి అనేది అందరికి తెలుస్తుంది. ఇటీవల కాలంలో తరుచుగా వింటున్నాం కూడా. వెన్నునొప్పిగా అనిపిస్తే మూవ్ లేదా ఇతరత్రా రిలీఫ్ బామ్లు రాసుకుని రిలాక్స్ అవుతుంటాం. చాలా మంది దీన్ని సాధారణ సమస్యగానే భావిస్తారు. తట్టుకోలేనంత స్థితి ఎదురైతే గానీ వైద్యులు దగ్గరకు వెళ్లరు. ఔనా! కానీ ఆరోగ్య నిపుణులు అలా చేయొద్దు అంటున్నారు. కొన్ని రకాల క్యాన్సర్లు.. వెన్నునొప్పి సంకేతం చూపిస్తాయట. శరీరంలో ఏదైనా భాగం నుంచి క్యాన్సర్ కణాలు ఎముకల ద్వారా వెన్నుకి స్ప్రెడ్ అయితే వెన్ను నొప్పి ద్వారా ఇండికేట్ చేసే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అలా అని వెన్ను నొప్పి అనేది క్యాన్సర్కి సంబంధించిన లక్షణం కూడా కాదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం రోమ్ము, ఊపిరితిత్తులు, వృషణాలు, పెద్దప్రేగు, అనే నాలుగు సాధారణ క్యాన్సర్లు వెన్నునొప్పి ద్వారా సంకేతం చూపిస్తాయట. ఆయా భాగాలు అన్నీ శరీరీ నిర్మాణ పరంగా వెనుముకకు దగ్గరగా ఉన్నందున వెన్ను వరకు వ్యాపించే అవకాశం ఉంటుదని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఊపిరితిత్తు క్యాన్సర్ని ఫేస్ చేస్తున్న 25 శాతం మంది రోగులు తమకు మొదట వెన్ను నొప్పి వచ్చిందని చెప్పినట్లు వెల్లడించారు. యూకే అధ్యయనంలో కూడా ఇది వెల్లడైంది. ఇలాంటి వెన్నునొప్పి..బరువు తగ్గిపోవడం, రాత్రిపూట చెమటలు, చలి జ్వరం వంటి లక్షణాలను ఫేస్చేస్తున్న క్యాన్సర్ పేషెంట్లలో ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు. ఇలాంటి క్యాన్సర్తో బాధపడుతున్న పేషెంట్లు వాళ్లు ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా బరువు తగ్గిపోతారట. వాళ్లలోని శక్తి తొందరగా బర్న్ అయిపోతుందట. పైగా ఇలా క్యాన్సర్ సంకేతంగా వచ్చే వెన్నునొప్పి అత్యంత అసౌకర్యంగా ఉంటుందని, చాలా పెయిన్తో కూడినదని చెబుతున్నారు. అందువల్ల దయచేసి వెన్నునొప్పి వస్తే సరైన భంగిమ వల్లన లేక మరేదైన కారణంతోనే గమనించండి. అవసరం అనుకుంటే వైద్యులని సంప్రదించండి. నిర్లక్షంతో జీవితాన్ని కోల్పోకండి. (చదవండి: సెలూన్కి వెళ్లే పనిలేకుండా..మీ హెయిర్ని స్ట్రయిట్ చేసుకోండిలా..) -
ఇలా చేస్తే మీ నడుం నొప్పి క్షణాల్లో మాయం
-
స్కూల్ పిల్లలు, జిమ్ చేసేవారికి నడుము నొప్పి రావడానికి అసలు కారణం..
-
వెన్నెముక సర్జరీ కోసం లేటెస్ట్ టెక్నాలజీ
-
సర్జరీ లేకుండా నడుము నొప్పి మాయం
-
చేతిలో స్మార్ట్ఫోన్..వెన్నెముక డౌన్!
ఒకప్పుడు రైల్లోనో, బస్సులోనో కూర్చునే చోటు దొరక్క నిలబడాల్సి వచ్చిందని మాత్రమే చింతించేవారు.. మరి ఇప్పుడు మనం మొబైల్ను మిస్ అవుతున్నామని అంతకు మించి చింతిస్తున్న పరిస్థితి. (నిలబడీ మొబైల్ వాడేవాళ్లూ ఎక్కువే ఉన్నారనుకోండి). కూర్చునేందుకు కాస్త చోటు దొరికితే చాలు.. టక్కున ఫోన్లో తలదూర్చేస్తున్నారు. ఇదొక్కటే కాదు.. కూర్చున్నా, బెడ్పై ఉన్నా, బయట ఎక్కడైనా తిరుగుతున్నా, నడుస్తూ వెళుతున్నా మొబైల్ ఫోన్ చేతిలోనే ఉంటోంది. కానీ ఇదే అతిపెద్ద సమస్యను తెచ్చిపెడుతోంది. ఫోన్ చూడటం కోసం మెడ వంచడం, చేతులను ఎక్కువ సేపు పైకెత్తి ఉంచడం, కూర్చున్నా, పడుకున్నా ఫోన్ చూడటం కోసం ఏదో ఓవైపు వంగిపోతుండటం, స్క్రోలింగ్, టైపింగ్ కోసం వేళ్లను విపరీతంగా వినియోగిస్తుండటం వంటి వాటితో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ టెక్ నెక్.. సమస్యతో.. స్మార్ట్ఫోన్తో గంటల కొద్దీ గడిపేవారు, ఇందులో ముఖ్యంగా టీనేజర్లు ‘టెక్ నెక్’, లేదా ‘న్యూ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్’తో బాధపడుతున్నారని తాజా పరిశోధనలు గుర్తించాయి. దీనిద్వారా మెడ, వెన్నునొప్పితోపాటు తలనొప్పి, భుజాల నొప్పులు, చేతుల్లో జలదరింపు, కండరాలు పటుత్వం కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. చాలాసేపు మెడ వంచి చూడటం వల్ల.. మెడలోని స్నాయువులు, కండరాలు, కీళ్లపై ఒత్తిడి పడుతోందని ఇండియన్ స్పైనల్ ఇంజూరీస్ సెంటర్ (ఐఎస్ఐఈ) మెడికల్ డైరెక్టర్ డాక్టర్ హెచ్ఎస్ ఛబ్రా హెచ్చరించారు. దీర్ఘకాలికంగా, మెడ కండరాలు అపసవ్యంగా సంకోచించడం వల్ల పుర్రెతో అనుసంధానమైన ఉన్నచోట మంట, నొప్పిని కలిగిస్తుందని.. ఈ నొప్పి ఫాసియా ద్వారా మెడ నుంచి తలకు వ్యాపిస్తుందని వివరించారు. భంగిమ సరిగా లేక.. భారంగా.. మొబైల్ను చేతిలో పట్టుకున్నప్పుడు కేవలం వేళ్లు మాత్రమే ఉపయోగిస్తున్నామని అనుకుంటాం. కానీ మన చేతులు, మోచేయి, కండరం, మెడ ఇవన్నీ వినియోగిస్తాం. మొబైల్ను చూస్తున్నప్పుడు మెడను కిందకు వంచుతాం. దీనివల్ల మెడ, వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ పబ్లిక్ హెల్త్’కథనం ప్రకారం.. ఇలా మెడ వంచి చూసే భంగిమ వల్ల వెన్నెముకపై తల బరువు పెరుగుతుంది. ‘‘వాస్తవానికి తల నిటారుగా ఉన్న స్థితిలో దాదాపు 5–8 కిలోల బరువుపడుతుంది. తల వంగుతున్నప్పుడు 15 డిగ్రీల దగ్గర.. మెడపై భారం సుమారు 12 కిలోలు, 30 డిగ్రీల దగ్గర 18.14 కిలోలకు 45 డిగ్రీల దగ్గర 22.23 కిలోలకు 60డిగ్రీల దగ్గర 27.22 కిలోలకు పెరుగుతుంది. ఇలా మెడ అతిగా వంగడంతో వెన్నెముక, సపోర్టింగ్ లిగమెంట్లు, కండరాలపై ప్రభావం పడుతుంది..’’అని ఆ కథనం స్పష్టం చేసింది. కీళ్లు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఫోన్ మాట్లాడే సమయంలో నిలబడే, కూర్చునే భంగిమలో లోపాలు మసు్క్యలోస్కెలెటల్ సమస్యలకు కారణం అవుతున్నాయని.. గర్భాశయ, థొరాసిక్, నడుము ప్రాంతాలలో వెన్నెముక దెబ్బతినడంతో అనేక మంది ఇబ్బందిపడుతున్నారని వైద్యులు చెప్తున్నారు. సాధారణంగా కీళ్ల పనితీరు బాగున్నప్పుడు ఒత్తిడికి గురైనా, విశ్రాంతి సమయంలో మరమ్మతు అవుతాయని వివరిస్తున్నారు. కానీ కీళ్లను అసాధారణ భంగిమలో ఎక్కువసేపు ఉంచడం, ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉంచడం వల్ల తీవ్రమైన ఒత్తిడి పడి.. అరిగిపోయి, తిరిగి బాగయ్యేందుకు అవకాశం లేనంతగా దెబ్బతింటున్నాయని స్పష్టం చేస్తున్నారు. నిపుణులు ఏమంటున్నారంటే? ♦ మెడ భుజం ముందుకు సాగినప్పుడు.. ముందువైపు కండరాలు బిగుతుగా మారుతూ, వెనుక వైపు బలహీనపడతాయి. కండరాల అసమతుల్యత ఏర్పడుతుంది. కాబట్టి మొబైల్ ఉపయోగిస్తున్నప్పుడు భంగిమపై శ్రద్ధ చూపడం తప్పనిసరి. ♦ శరీర భంగిమ అనేది ఫిట్నెస్కు కీలకం. ట్రెడ్మిల్, క్రాస్ ట్రైనర్ వంటివాటి మీద ఉండగా.. మొబైల్ ఫోన్ వినియోగించడం వంటివి చేయవద్దు. ♦ నిలబడి ఉన్నప్పుడు, ఎవరికైనా మెసేజీలు పంపుతున్నప్పుడు తల పైకి, భుజాలు కిందకు ఉంచాలి. వీలైనంత వరకు మొబైల్ను కళ్లకు సమాంతరంగా ఉంచడం సరైన భంగిమ. ♦ కురీ్చలో లేదా సోఫాలో కూర్చున్నప్పుడు ఫోన్ చూస్తూ వంగిపోవడం ఏ విధంగానూ ఆరోగ్యకరం కాదు. వెన్ను నిటారుగా ఉంచి కూర్చోవాలి. ఫోన్ చూడటానికి లేదా టెక్ట్స్ చేయడానికిగానీ మెడ ఎక్కువగా వంచకూడదు. ♦ పడుకున్నప్పుడు ఫోన్ పట్టుకోవడానికి.. మోచేతికి దిండు లేదా మరేదైనా మెత్తని దాన్ని ఆసరాగా తీసుకోవాలి. ♦ భోజనం చేసేప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, కంప్యూటర్ వినియోగిస్తూ, డ్రైవ్ చేస్తూ.. ఇలా పలు సందర్భాల్లో ఫోన్ను కూడా ఉపయోగించడమనే మల్టీ టాస్కింగ్ అటు శారీరకంగా, ఇటు మానసికంగా కూడా ఆరోగ్యానికి చేటు తెస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. బఫెలో హంప్ కనిపిస్తోంది టెక్ట్స్ నెక్ సిండ్రోమ్, స్పైన్ పెయిన్ వంటివన్నీ మనం నిలబడే, కూర్చునే, శరీరాన్ని ఉంచే తీరులో సమస్య వల్లే తలెత్తుతున్నాయి. దీర్ఘకాలంపాటు తప్పుడు భంగిమ వల్ల మెడ అలైన్మెంట్ సాగిపోతుంది. దాదాపు 60, 70ఏళ్ల వయసులో సంభవించే మెడలు సాగిపోవడం, ఫ్రోజెన్ షోల్డర్, రౌండెడ్ షోల్డర్ వంటివి 40 ఏళ్ల వయసులోనే వచ్చేస్తున్నాయి. మొత్తంగా సహజమైన శరీర నిర్మాణాన్ని ఈ భంగిమ లోపాలు దెబ్బతీస్తున్నాయి. ఒకప్పుడు బాగా తలవంచుకుని పనిచేసే కొందరు బ్యాంకు ఉద్యోగులు వంటివారిలో ఎక్కువగా కనిపించే మెడ వెనకాల సెమీ సర్కిల్ ఇప్పుడు చాలామందిలో కనిపిస్తోంది. బఫెలో హంప్గా పేర్కొనే దీన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర సమస్యలు తప్పవు. ఏదేమైనా భంగిమ లోపాలు సరిచేసుకుంటూనే ఫోన్ వాడకాన్ని వీలైనంత తగ్గించుకోవడమే ఉత్తమం. – డాక్టర్ విజయ్ బత్తిన, ఉఛ్వాస్ ట్రాన్సిషనల్ కేర్ ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయాలి ఇటీవల భుజాల నొప్పులు, మణికట్టు బాధలు చాలా మందిలో గమనిస్తున్నాం. మొబైల్స్ని ప్రొఫెషనల్గా వాడేవారిలో బొటనవేలు మొద్దు బారడం సహా మరిన్ని సమస్యలు కనపడుతున్నాయి. పడుకునే భంగిమలో పుస్తకం చదివినట్టు ఫోన్ చూడడం సరికాదు. అలాగే వాష్రూమ్స్, టాయిలెట్స్లో కూడా వాడొద్దు. ఎలాపడితే అలా వాడటం వల్ల భుజాల కండరాలు, చేతులు, మణికట్టు ఒత్తిడికి గురవుతాయి. అయితే ఏది సరైన భంగిమ అనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. కాబట్టి వీలైనంత వరకూ ఫోన్ వాడేటప్పుడు మధ్యలో విరామాలు తీసుకోవడం, ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయడం తప్పనిసరి. – డాక్టర్ శివరాజు, జనరల్ ఫిజీషియన్, కిమ్స్ ఆస్పత్రి -
సర్జరీ విజయవంతం.. బుమ్రా రీఎంట్రీ అప్పుడే!
టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి కారణంగా ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ఇటీవలే బీసీసీఐ వెన్నునొప్పికి సంబంధించిన శస్త్ర చికిత్స కోసం బుమ్రాను న్యూజిలాండ్కు పంపిచింది. జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లండ్), షేన్ బాండ్ల(న్యూజిలాండ్)కు సర్జరీ చేసిన డాక్టర్ రోవన్ షౌటెన్.. బుమ్రాకు చికిత్స అందించాడు. ఈ నేపథ్యంలోనే బుమ్రాకు సర్జరీ విజయంవంతం అయినట్లు సమాచారం అందింది. సర్జరీ సక్సెస్ అయినప్పటికి బుమ్రా పూర్తిగా కోలుకొని గ్రౌండ్ లోకి అడుగుపెట్టడానికి దాదాపు ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. దీంతో బుమ్రా డబ్ల్యూటీసీ ఫైనల్, ఆసియా కప్ లకు దూరం కానున్నాడు. పూర్తి ఫిట్ నెస్ సాధిస్తే అక్టోబర్, నవంబర్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడే అవకాశం దక్కొచ్చు. ఇక గత ఆగస్టులో గాయపడ్డ బుమ్రా అప్పటి నుంచి ఆటకు దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా సెప్టెంబర్లో జరిగిన ఆసియా కప్-2022, టి20 వరల్డ్ కప్.. తాజాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వంటి కీలక టోర్నీలకు కూడా బుమ్రా దూరమయ్యాడు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నీకి కూడా అందుబాటులో ఉండటం లేదు. బుమ్రా దూరమవడం ముంబై ఇండియన్స్కు ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. సర్జరీ పూర్తైన బుమ్రా కనీసం 24 వారాలపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే స్వదేశంలో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ వరకు అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ పేర్కొంది. చదవండి: మాస్టర్మైండ్.. తెలివిగా తప్పించుకున్న ధోని -
పంత్కు గాయం.. బంగ్లా టూర్కు దూరం!
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నాడా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. న్యూజిలాండ్తో మూడో వన్డే సందర్భంగా తాను ఔటైన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో వెన్నునొప్పితో ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. స్ట్రెచర్పై పడుకున్న పంత్ ఫోటోలు లీక్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే పంత్ గాయం తీవ్రత తెలుసుకునేందుకు స్కానింగ్ పంపించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో డిసెంబర్ 4 నుంచి మొదలుకానున్న బంగ్లాదేశ్ టూర్కు రిషబ్ పంత్ వెళ్లేది అనుమానంగానే ఉంది. మరి అతని స్థానంలో ఎవరినైనా ఎంపిక చేస్తారా లేక పంత్ను ఆడిస్తారా అనేది చూడాలి. ఇక పంత్ బ్యాటింగ్ వైఫల్యంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ని అవకాశాలిచ్చినా పంత్ తన బ్యాటింగ్ తీరును మాత్రం మార్చుకోవడం లేదు. పైగా ఇప్పుడు జట్టకు వైస్ కెప్టెన్ హోదాలో ఉన్నాడు. కనీసం ఆ బాధ్యతతోనైనా జాగ్రత్తగా ఆడతాడనుకుంటే పేలవ షాట్లతో వికెట్ను సమర్పించుకుంటున్నాడు. తాజాగా కివీస్తో మూడో వన్డేలో 10 పరుగులు మాత్రమే చేసిన పంత్ మరోసారి నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకున్నాడు. పంత్ స్థానంలో సంజూ శాంసన్కు అవకాశమివ్వాలని అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఎలా చూసుకున్నా పంత్ కంటే శాంసన్ స్రైక్రేట్ చాలా బాగుంది. ఇక చివరి ఐదు వన్డేల్లో పంత్ చేసిన స్కోర్లు.. 10, 15, 125,0, 56, 18.. ఇక 2022 ఏడాదిలో 12 వన్డేలు ఆడిన పంత్ 223 పరుగులు మాత్రమే చేశాడు. వన్డేలతో పోలిస్తే టి20ల్లో అతని బ్యాటింగ్ కాస్త బెటర్గా కనిపిస్తుంది. రానున్న వన్డే వరల్డ్కప్ 2023ని దృష్టిలో పెట్టుకొని చూస్తే సంజూ శాంసన్కు అవకాశాలు ఎక్కువగా ఇవ్వాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇక బంగ్లాదేశ్తో సిరీస్లో టీమిండియా మూడు వన్డేలు ఆడనుంది. వరల్డ్కప్కు ముందు టీమిండియా 21 మ్యాచ్లు మాత్రమే మిగిలిఉన్నాయి. దీంతో శాంసన్కు కాస్త ఎక్కువ అవకాశాలు ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. Again!!!!!!!💔💔😭😭#SanjuSamson #RishabhPant #INDvsNZ#NZvsINDpic.twitter.com/SJKFXlRyGr — Cric18👑 (@Criclav_18) November 30, 2022 చదవండి: పంత్ సెంచరీ చేసి ఎన్నాళ్లైందని! అతడికి కచ్చితంగా అండగా ఉంటాం: కోచ్ -
బిగ్బాష్ లీగ్ నుంచి వైదొలిగిన హర్మన్ప్రీత్
భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఆ్రస్టేలియాలో జరుగుతున్న మహిళల బిగ్బాష్ లీగ్ టి20 టోర్నీ నుంచి వైదొలిగింది. వెన్ను నొప్పితో ఈ సీజన్లో తాను పాల్గొనడంలేదని హర్మన్ తెలిపింది. గత ఏడాది మెల్బోర్న్ రెనెగెడ్స్ తరఫున ఆడిన హర్మన్ 406 పరుగులు చేసి, 15 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు గెల్చుకుంది. ఇటీవల ఆసియా కప్ టి20 టోర్నీలో హర్మన్ సారథ్యంలో భారత జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. -
టి20 ప్రపంచకప్కు దూరం కావడంపై బుమ్రా స్పందన..
టి20 ప్రపంచకప్కు బుమ్రా అధికారికంగా దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించిన తర్వాత టీమిండియా స్పీడస్టర్ మంగళవారం ఉదయం తన ట్విటర్ వేదికగా స్పందించాడు. ''నేను ఈసారి టి20 ప్రపంచకప్లో భాగం కాలేనని తెలిసినప్పటికి ధైర్యంగానే ఉన్నాను. నేను తొందరగా కోలుకోవాలని నాపై ప్రేమ చూపిస్తూ కోరుకున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ఇక ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచకప్ ఆడనున్న టీమిండియాను బయటి నుంచి ఉత్సాహపరుస్తా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక వెన్నునొప్పితో బాధపడిన బుమ్రా చాలాకాలం పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. అయితే పూర్తిగా కోలుకోకముందే అతన్ని ఆస్ట్రేలియాతో సిరీస్కు ఎంపిక చేసి బీసీసీఐ మూల్యం చెల్లించుకుంది. ఆసీస్తో రెండు టి20 మ్యాచ్లు ఆడిన అనంతరం బుమ్రాకు వెన్నునొప్పి మళ్లీ తిరగబెట్టింది. దీంతో సౌతాఫ్రికాతో టి20 సిరీస్కు బుమ్రా దూరమయ్యాడు. ఆ తర్వాత బుమ్రా ప్రపంచకప్కు పూర్తిగా దూరం కాలేదని బీసీసీఐ బాస్ గంగూలీ పేర్కొనడం.. కోచ్ ద్రవిడ్ కూడా బుమ్రా టి20 ప్రపంచకప్ ఆడే అవకాశాలున్నాయని చెప్పడంతో అభిమానులు బుమ్రా తిరిగి మళ్లీ జట్టులోకి వస్తాడని భావించారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఈ మెగా ఈవెంట్కు బుమ్రా దూరమయ్యాడని బీసీసీఐ స్వయంగా ప్రకటించడంతో అభిమానులు తీవ్ర నిరాశచెందుతున్నారు. పూర్తిగా కోలుకోలేదంటూ వైద్యబృందం నివేదిక ఇచ్చిన అనంతరం బీసీసీఐ సోమవారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. బుమ్రా గాయాన్ని పూర్తిగా సమీక్షించడంతో పాటు నిపుణులతో సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. బుమ్రా స్థానంలో ఎంపిక చేసే ఆటగాడి పేరును త్వరలోనే ప్రకటిస్తామని బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. ఇక 2016లో తొలి టి20 మ్యాచ్ ఆడిన బుమ్రా ఇప్పటివరకు 57 టి20 మ్యాచ్లాడి 67 వికెట్లు పడగొట్టాడు. I am gutted that I won’t be a part of the T20 World Cup this time, but thankful for the wishes, care and support I’ve received from my loved ones. As I recover, I’ll be cheering on the team through their campaign in Australia 🇮🇳 pic.twitter.com/XjHJrilW0d — Jasprit Bumrah (@Jaspritbumrah93) October 4, 2022 చదవండి: బుమ్రా దూరం.. హార్దిక్ పాండ్యా ఎమోషనల్ ట్వీట్ -
T20 World Cup: అయ్యో బుమ్రా..!
టి20 ప్రపంచకప్కు బయల్దేరక ముందే భారత క్రికెట్ జట్టుకు పెద్ద షాక్! ఆసీస్ గడ్డపై జట్టుకు ఒంటి చేత్తో విజయాలు అందించగలడని భావించిన స్టార్ పేసర్ ఇప్పుడు టోర్నీకే దూరం కానున్నాడు. వెన్ను నొప్పి గాయం (బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్)తో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రా నొప్పి తిరగబెట్టడంతో తప్పనిసరిగా ఆటకు విరామం పలకాల్సి వచ్చింది. దాంతో అతను టి20 ప్రపంచకప్ వెళ్లే అవకాశం లేదని తేలిపోయింది. ఇప్పటికే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయంతో మెగా టోర్నీనుంచి తప్పుకోగా, ఇప్పుడు బుమ్రా కూడా లేకపోవడం టీమిండియాను బలహీనంగా మార్చింది. న్యూఢిల్లీ: గాయంనుంచి కోలుకొని విరామం తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టిన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆట రెండు మ్యాచ్లకే పరిమితమైంది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో, మూడో టి20లో ఆడిన అతను బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టి20నుంచి చివరి నిమిషంలో తప్పుకున్నాడు. మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సెషన్లో బుమ్రాకు వెన్ను నొప్పి వచ్చిందని, అందుకే మ్యాచ్ ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఆ వెన్ను బాధ అంతటితో ఆగిపోలేదని బుధవారం సాయంత్రం తేలింది. తిరువనంతపురంనుంచి బుమ్రా నేరుగా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి చేరుకున్నాడు. పరీక్షల అనంతరం గాయం తీవ్రమైందని తేలగా, కొన్ని నెలల పాటు ఆటకు దూరం కావాల్సి ఉందని అర్థమైంది. బీసీసీఐ అధికారికంగా బుమ్రా గాయంపై ప్రస్తుతానికి ఎలాంటి ప్రకటన చేయకపోయినా...బోర్డు ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని నిర్ధారించారు. ‘బుమ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ టి20 ప్రపంచకప్ ఆడే అవకాశం లేదు. అతని వెన్ను గాయం చాలా తీవ్రమైంది. స్ట్రెస్ ఫ్రాక్చర్ కాబట్టి కోలుకునేందుకు కనీసం ఆరు నెలలు పడుతుంది’ అని ఆయన వెల్లడించారు. వరల్డ్ కప్కు ప్రకటించిన జట్టులో స్టాండ్బైలుగా ఇద్దరు పేసర్లు అందుబాటులో ఉన్నారు. మొహమ్మద్ షమీ లేదా దీపక్ చహర్లలో ఒకరిని ప్రధాన జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బుమ్రా గాయాన్ని బీసీసీఐ వైద్యులు పర్యవేక్షిస్తారని, టీమ్లో మార్పులు చేసుకునే అవకాశం ఉన్న అక్టోబర్ 15 వరకు వేచి చూడవచ్చని చెబుతున్నా... పూర్తి ఫిట్గా లేని ఆటగాడిని ఆస్ట్రేలియాకు తీసుకెళ్లే సాహసం టీమ్ మేనేజ్మెంట్ చేయకపోవచ్చు. బలమే బలహీనతై... ‘బుమ్రా పూర్తి స్థాయిలో మళ్లీ బౌలింగ్ చేయడం సంతోషంగా అనిపిస్తోంది. నిజాయితీగా చెప్పాలంటే వెన్ను నొప్పితో రెండు నెలలు విశ్రాంతి తీసుకొని మళ్లీ బౌలింగ్ చేయడం అంత సులువు కాదు. అతని ప్రదర్శన ఎలా ఉందన్నది అనవసరం. మెల్లగా లయ అందుకుంటున్నాడు. అతను తిరిగి రావడమే విశేషం. ’...ఆసీస్తో రెండో టి20 తర్వాత బుమ్రా గురించి రోహిత్ వ్యాఖ్య ఇది. అయితే మరో మ్యాచ్కే గాయం తిరగబెట్టి బుమ్రా మళ్లీ అందుబాటులో లేకుండా పోతాడని బహుశా రోహిత్ కూడా ఊహించి ఉండడు. విజయావకాశాలు ప్రభావితం చేయగల తన స్టార్ బౌలర్ లేకపోవడం ఏ కెప్టెన్కైనా లోటే. అయితే బుమ్రా గాయాన్ని బోర్డు వైద్యులు, ఎన్సీఏ పర్యవేక్షించిన తీరే సరిగా కనిపించడం లేదు. బుమ్రా విశ్రాంతి లేకుండా నిరంతరాయంగా ఏమీ ఆడటం లేదు. బోర్డు రొటేషన్ పాలసీ, వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతను చాలా తక్కువ మ్యాచ్లే ఆడాడు. 2022లో అతను ఐపీఎల్తో పాటు 5 టెస్టులు, 5 వన్డేలు, 5 అంతర్జాతీయ టి20లు మాత్రమే ఆడాడు. నిజానికి బుమ్రాకు స్ట్రెస్ ఫ్రాక్చర్ కొత్త కాదు. 2019లోనే అతను ఇదే బాధతో మూడు నెలలు ఆటకు దూరమయ్యాడు. నిపుణులు చెప్పినదాని ప్రకారం అతని భిన్నమైన శైలే అందుకు ప్రధాన కారణం. వెన్నునొప్పితోనే అతను ఇటీవలే ఆసియా కప్లోనూ ఆడలేదు. అయితే సరిగ్గా ఇక్కడే టీమ్ మేనేజ్మెంట్ తొందరపాటు కనిపిస్తోంది. అతను పూర్తి స్థాయిలో కోలుకోకుండానే ఆస్ట్రేలియాతో సిరీస్కు ఎంపిక చేసినట్లుగా అనిపిస్తోంది. లేదంటే ఎన్సీఏ బుమ్రా గాయాన్ని సరిగ్గా అంచనా వేయలేక తగినంత రీహాబిలిటేషన్ లేకుండానే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా ఉంది. ఎందుకంటే పూర్తి ఫిట్గా ఉంటే రెండు మ్యాచ్లకే గాయం తిరగబెట్టడం ఊహించలేనిది. ‘తక్కువ రనప్తో ఫాస్ట్ బౌలింగ్ చేసేందుకు బుమ్రా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఎంత కాలం ఇలా అతని శరీరం సహకరిస్తుందనేదే నా సందేహం. అది మానవశరీరం. మెషీన్ కాదు’ అని రెండేళ్ల క్రితం దిగ్గజ పేసర్ మైకేల్ హోల్డింగ్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు వాస్తవంగా మారినట్లు అనిపిస్తోంది. -
బుమ్రాకు తిరగబెట్టిన గాయం.. టి20 ప్రపంచకప్కు దూరం!
టి20 ప్రపంచకప్కు ముందు టీమిండియాకు బిగ్షాక్ తగిలేలా ఉంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి గాయంతో టి20 ప్రపంచకప్కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే గనుక నిజమైతే టీమిండియాకు నిజంగా పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. అసలే బౌలింగ్ అంతంతమాత్రంగా ఉన్న దశలో ఇలా బుమ్రా గాయంతో దూరమవడం అభిమానులను ఆందోళన కలిగిస్తుంది. ఇక సౌతాఫ్రికాతో తొలి టి20కి బుమ్రాను రెస్ట్ పేరుతో పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి బుమ్రా జట్టుతో పాటు తిరువనంతపురంకు రాలేదని సమాచారం. ఆస్ట్రేలియాతో మూడో టి20 మ్యాచ్ అనంతరం బుమ్రాకు వెన్నునొప్పి తిరగబెట్టినట్లు తెలుస్తోంది. దీంతో బుమ్రాను బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీకి పంపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై బీసీసీఐ ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో బుమ్రా జట్టుతో పాటే వచ్చి ఉంటాడని అనుకున్నారు. కానీ బుమ్రాకు వెన్నునొప్పి గాయం తిరగబెట్టిందని.. అయితే సర్జరీ అవసరం లేకపోవచ్చు గానీ.. కనీసం నాలుగు నుంచి ఆరు నెలల పాటు విశ్రాంతి అవసరం అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నట్లు తెలిసింది. కాగా బీసీసీఐ అధికారిక సమాచారం ఇచ్చిన తర్వాతే బుమ్రా గాయంపై మరింత క్లారిటీ వస్తుంది. చదవండి: Ind VS SA: ప్రపంచకప్ టోర్నీకి ముందు ఎందుకిలా? అతడికి రెస్ట్ అవసరమైతే! పికిల్బాల్ ఎప్పుడైనా విన్నారా.. అమెరికాలో ఎందుకంత క్రేజ్! -
ఎంపవర్మెంట్: డైనమిక్ సిస్టర్స్
అవసరం నుంచే కాదు... ఆపద నుంచి కూడా ఆవిష్కరణలు పుడతాయి. ‘ఇండియా–హెంప్ అండ్ కంపెనీ’ ఉత్పత్తులు ఈ కోవకే చెందుతాయి. భరించలేని వెన్నునొప్పితో బాధ పడిన షాలిని తన పరిశోధనలో భాగంగా తెలుసుకున్న విషయం... హెంప్ మొక్కకు వెన్నునొప్పిని తగ్గించే శక్తి ఉంది అని. అది ప్రయోగాత్మకంగా నిరూపణ కావడంతో హెంప్ ఉత్పత్తుల విలువను ప్రపంచానికి పరిచయం చేయడానికి సోదరి జయంతి భట్టాచార్యతో కలిసి ‘ఇండియా హెంప్ అండ్ కంపెనీ’కి శ్రీకారం చుట్టి విజయపథంలో దూసుకుపోతోంది. షాలిని భట్టాచార్య నిలకడగా ఒకచోట ఉండే రకం కాదు. స్పెయిన్లో ఉంటున్న శాలినికి ఇంట్లో ఉండడం కంటే బయట ఉండడం అంటేనే ఎక్కువ ఇష్టం. అలాంటి షాలినికి కష్టం వచ్చిపడింది. భరించలేని వెన్నునొప్పి! బయట అడుగు వేయలేని పరిస్థితి. చిన్న బ్యాగ్ను ఇటు నుంచి అటు పెట్టాలన్నా వీలయ్యేది కాదు. హాస్పిటల్స్ చుట్టూ తిరగడం మొదలైంది. ఏదో కాస్త తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత పరిష్కారం దొరకలేదు. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉంటున్న సోదరి జయంతితో కలిసి తన సమస్యకు పరిష్కారాన్ని వెదకడానికి పరిశోధన మొదలుపెట్టింది. ఈ పరిశోధన క్రమంలో వారికి ఎప్పుడో విన్న హెంప్ (ఒక రకమైన కనబిస్ మొక్క) గుర్తుకు వచ్చింది. వేసవి సెలవులు వస్తే చాలు...కొండకోనల్లో తిరగడం తమ అలవాటు. అలా వెళ్లినప్పుడు అక్కడి మొక్కల గురించి స్థానికుల నుంచి ఆసక్తికరమైన వివరాలు తెలుసుకునేవారు. ఒకసారి హిమాలయాలో విస్తారంగా పెరిగే, విస్తృత ఔషధగుణాలు ఉన్న హెంప్ గురించి విని ఉన్నారు. ఆ జ్ఞాపకంతో హెంప్ గురించి లోతైన పరిశోధన ప్రారంభించారు. వెన్నునొప్పిని తగ్గించే సామర్థ్యం ఈ మొక్కకు ఉన్నట్లు ప్రయోగాత్మకంగా తెలుసుకున్నారు. ఆ సమయంలోనే వారికి ఒక ఆలోచన వచ్చింది... అజ్ఞాతంగా ఉన్న హెంప్ను ప్రజల్లోకి తీసుకువెళ్లి దాని ఔషధశక్తి ఏమిటో తెలియజేయాలని. ఇందుకు వారు ఎంచుకున్న మార్గం ఇండియా హెంప్ అండ్ కంపెనీ. బెంగళూరు కేంద్రంగా మొదలైన ఈ కంపెనీ హెంప్ ట్రేల్ మిక్స్, హెంప్ హార్ట్, ప్రొటీన్ పౌడర్, హెంప్ ఆయిల్... మొదలైన న్యూట్రీషన్–ప్యాక్డ్ హెంప్ ప్రాడక్స్ను తీసుకువచ్చింది. ‘షార్క్ ఇండియా రియల్టీ షో’ నుంచి ఆహ్వానం అందడాన్ని ఔత్సాహిక వ్యాపారవేత్తలు గొప్పగా భావిస్తారు. తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి ఒక విశాలవేదికగా షార్క్ ఇండియా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఫండింగ్ విషయంలో మేలు జరుగుతుంది. ‘ఇండియా హెంప్ అండ్ కంపెనీ’ కో–ఫౌండర్గా జయంతి భట్టాచార్యకు షార్క్ ఇండియా నుంచి ఆహ్వానం లభించింది. అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్లో మాస్టర్స్ డిగ్రీ ఉన్న జయంతికి తమ ఉత్పత్తుల గురించి ఎలా ప్రచారం చేసుకోవాలో అనేది తెలియని విషయమేమీ కాదు. ఆమె ప్రసంగం ఎందరినో ఆకట్టుకుంది. రకరకాల దేశాల నుంచి ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. అయితే సరిౖయెన డీల్ కుదరకపోవడంతో వాటిని ఆమోదించలేదు. ఫండింగ్ మాట ఎలా ఉన్నా ‘షో’కు వచ్చిన ప్రముఖుల సూచనలతో బ్రాండింగ్ స్ట్రాటజీని మార్చుకున్నారు. ఆ తరువాత సరిౖయెన ఇన్వెస్టర్లు వచ్చారు. కంపెనీ విజయపథంలో దూసుకెళుతుంది. నిజానికి హెంప్ ఉత్పత్తులను మార్కెట్ లో సక్సెస్ చేయడం అంత ఆషామాషీ విషయమేమీ కాదు. మన దేశంలో తొలిసారిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం హెంప్ సాగు చేయడానికి అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట అనుమానం మిగిలే ఉంది. దీన్ని తీసివేయడానికి ప్రచార రూపంలో గట్టి ప్రయత్నాలు ప్రారంభించి విజయం సాధించారు ఈ డైనమిక్ సిస్టర్స్. ‘ప్లానెట్ ఫ్రెండ్లీ ప్లాంట్ అయిన హెంప్పై మాకు ఉన్న నమ్మకం వృథాపోలేదు. మా వ్యాపారం విజయవంతమైంది అనేదానికంటే, ఇండియా హెంప్ అండ్ కంపెనీ ద్వారా హెంప్లోని ఔషధ గుణాల గురించి చాలామంది తెలుసుకోగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది’ అంటుంది షాలిని. -
పాక్కు మరో ఎదురుదెబ్బ.. వెన్నునొప్పితో కీలక బౌలర్ దూరం!
ఆసియాకప్లో భాగంగా భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే మోకాలి గాయంతో స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది దూరం కాగా.. తాజాగా ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ వసీమ్ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రాక్టీస్ సమయంలో బౌలింగ్ సెషన్లో పాల్గొన్న మహ్మద్ వసీమ్ బౌలింగ్ చేస్తున్న సమయంలోనే వెన్నునొప్పి వచ్చింది. దీంతో జట్టు సిబ్బంది వెంటనే అతన్ని ఐసీసీ అకాడమీకి తరలించి ఎంఆర్ఐ స్కాన్ చేయించారు. రిపోర్ట్స్లో వసీమ్కు వెన్నునొప్పి తీవ్రంగానే ఉన్నట్లు తేలింది. దీన్నిబట్టి అతను ఆసియాకప్కు పూర్తిగా దూరమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆసియా కప్ ముగిసిన తర్వాత పాకిస్తాన్కు బిజీ షెడ్యూల్ ఉంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో వరుస సిరీస్లు ఆడనుంది. ఆ తర్వాత టి20 ప్రపంచకప్లో ఆడనుంది. ఈ నేపథ్యంలో మహ్మద్ వసీమ్కు విశ్రాంతినివ్వడమే కరెక్టని పీసీబీ అభఙప్రాయపడుతోంది. ఇప్పటికే మోకాలి గాయంతో నాలుగు వారాల పాటు ఆటకు దూరమైన షాహిన్ అఫ్రిది అక్టోబర్లో జరగనున్న టి20 ప్రపంచకప్లో ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక మహ్మద్ వసీమ్ పాక్ తరపున 11 టి20 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీశాడు. చదవండి: ఆఫ్రిది లేకున్నా మాకు ఆ ముగ్గురు ఉన్నారు.. భారత బ్యాటర్లకు సవాల్! Asia Cup 2022: భారత్- పాకిస్తాన్ ఏ జట్టు ఆటగాడైనా ఒకటే! మేము అన్నదమ్ముల్లా ఉంటాం! -
ఎముకల నొప్పులా? అవిశ, సబ్జా, గుమ్మడి గింజల పొడి రోజూ స్పూన్ తీసుకుంటే!
బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్, భుజాలు, కీళ్ల నొప్పులు... ఇలా అనేక రకాలుగా ఎముకల బలహీనత వల్ల శరీరంలో నొప్పులు బాధిస్తుంటాయి. కాల్షియం లోపం ఇందుకు ప్రధాన కారణం. ఎముకల నొప్పులు తగ్గాలంటే మంచి ఉపాయం ఒకటుంది. మూడురకాల గింజల పొడుల మిశ్రమం ఎముకల పటిష్టతకు తోడ్పడి నొప్పులు శాశ్వతంగా దూరం అవుతాయి. ఈ మూడురకాల గింజలు తేలిగ్గా మార్కెట్లో దొరికేవే. ఒకసారి ప్రయత్నించి చూడండి. అవిశె గింజలు, సబ్జాగింజలు, గుమ్మడి గింజలు.. ఈ మూడు రకాల గింజల వినియోగం వల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది. అవిశ గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) ఫ్లాక్స్ సీడ్స్ ఒమెగా 3 పోషకాల గని. కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఒమెగా 3 శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. అలాగే వీటిల్లో ఉంటే కాల్షియం ఎముకలను పటిష్టం చేస్తుంది. దీనిలో పుష్కలంగా ఉండే డైటరీ ఫైబర్ అధిక ఆకలిని తగ్గించి శరీర బరువును అదుపులో ఉంచుతుంది. సబ్జా గింజలు (చియా సీడ్స్) సబ్జా గింజలు లేదా చియా సీడ్స్లో ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం ఎముకలు పటిష్టంగా ఉండేలా తోడ్పాటు అందిస్తాయి. ఇందులో కూడా ఒమెగా 3 ఉంటుంది. అలాగే చియా సీడ్స్ యాంటీ ఆక్సిడంట్స్గా పనిచేస్తాయి. గుమ్మడి గింజలు (పంప్కిన్ సీడ్స్) ఇందులో ప్రొటీన్, ఫైబర్, ఒమెగా 3, మెగ్నీషియం, జింక్ పోషకాలు ఉంటాయి. బాగా శక్తినివ్వడంతో పాటు మీ శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఎలా తయారు చేయాలి? అవిశ గింజలు, చియా సీడ్స్, గుమ్మడి గింజలను సమపాళ్లలో తీసుకుని వేర్వేరుగా వేయించుకోవాలి ఉదాహరణకు ఒకరకం గింజలను 100 గ్రాములు తీసుకుంటే మిగిలిన వాటిని కూడా వంద వంద గ్రాములే తీసుకోవాలి. దోరగా వేగిన తరువాత చల్లార్చి మిక్సీలో వేర్వేరుగా పొడి చేసుకోవాలి. మిక్సీ వేయడం పూర్తయ్యాక మూడు పొడులను కలిపేసుకుని ఒక డబ్బాలో పెట్టుకోవాలి. రోజూ ఈ మిశ్రమం నుంచి టీ స్పూన్ పొడిని మజ్జిగలో కలుపుకొని తాగాలి లేదా అన్నంలోనైనా కలుపుకొని తినొచ్చు. ఇలా కొద్దిరోజులు రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే మీ ఎముకల నొప్పులు, నడుము నొప్పి మాయం అవడమే కాకుండా.. మళ్లీ నొప్పులు రావు. చదవండి: Amarnath Vasireddy: కూర్చోవడం అంటే మరణాన్ని ఆహ్వానించడమే! అన్నం ఎక్కువ తిన్నారో! -
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్కు మొమోటా దూరం
Kento Momota Ruled Out From World Badminton Championship.. వెన్ను నొప్పి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో... డిఫెండింగ్ చాంపియన్ కెంటో మొమోటా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ నుంచి వైదొలిగాడు. ఈనెల 12 నుంచి 19 వరకు స్పెయిన్లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. మొమోటా 2018, 2019లలో ప్రపంచ చాంపియన్షిప్లో, ఆసియా చాంపియన్షిప్లో టైటిల్స్ను సాధించాడు. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఇండోనేసియా ఆటగాళ్లందరూ ప్రపంచ చాంపియన్షిప్లో ఆడటంలేదని ప్రకటించారు. -
వర్క్ ఫ్రమ్ హోం: ఇదీ పరిస్థితి!
Work From Home Back Pain Health Tips: కరోనా వల్ల ఉద్యోగుల్లో మెజార్టీ వాటా వర్క్ ఫ్రమ్ హోంకే పరిమితం అయ్యిందని తెలిసిందే. ముఖ్యంగా కార్పొరేట్, టెక్ కంపెనీల ఉద్యోగులంతా ఎక్కువ పని గంటలకు ఫిక్స్ కావాల్సి వస్తోంది. ఈ తరుణంలో ఉద్యోగుల గురించి ఆందోళన కలిగించే అంశం ఒకటి వెలుగు చూసింది. ప్రభుత్వం ఈమధ్య నిర్వహించిన ‘ఇండియా హెల్త్ ఆఫ్ ది నేషన్స్ స్టేట్స్: లెవెల్ డిసీజ్ బర్డెన్ ఇన్షియేటివ్’.. అధ్యయనం వర్క్ ఫ్రమ్ హోంలో ఉద్యోగుల్లో ‘డయాబెటిస్, హైపర్ టెన్షన్, ఒబెసిటి’లాంటి జబ్బులు పెరిగిపోవడం గుర్తించింది. ఒత్తిడి, టైంకి తినకపోవడం ఇందుకు కారణాలని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే టైంలో అంటువ్యాధుల బారిన సైతం పడుతున్నారని పేర్కొంది. అయితే వీటన్నింటికంటే ప్రధానంగా.. వెన్ను నొప్పి సమస్యగా తయారవుతోందని గుర్తించింది ఈ స్టడీ. ‘వెన్నునొప్పి ఎక్కువ సమస్యగా మారుతోంది యువతలోనే’ అని ఈ స్టడీ గుర్తించింది. ముఖ్యంగా యంగ్ వర్కింగ్ పాపులేషన్(18-25ఏళ్ల లోపువాళ్లు) 25 నుంచి 31 శాతానికి పెరగడం, వాళ్లలోనే ఇది అధికంగా ఉండడం ఆందోళన కలిగించే అంశమని ఈ అధ్యయన నివేదిక అభిప్రాయపడింది. ‘‘నడుం నొప్పి, కీళ్ల సమస్యలు ఒకప్పుడు వయసు మళ్లిన వాళ్ల సమస్యల కిందే ఉండేవి. కానీ, ఇప్పుడా సినారియో మారింది. యువతకు వస్తున్నాయి. జనరేషన్లుగా మారుతున్న లైఫ్ స్టయిల్, ముఖ్యంగా సరైన పొజిషన్లో (సిట్టింగ్ పోశ్చర్స్) కూర్చోకపోవడం, వర్క్ ఫ్రమ్ హోమ్ చాలాకాలంగా సాగుతున్నా ఎలాంటి అరేంజ్మెంట్స్ చేసుకోకపోవడం వల్లే ఈ సమస్య పెరిగిపోతోంద’ని జిందాల్ నేచుర్క్యూర్ ఇనిస్టిట్యూట్ చీఫ్ యోగా ఆఫీసర్ డాక్టర్ రాజీవ్ రాజేశ్ చెబుతున్నారు. ‘ఇప్పుడున్న జనరేషన్ హెల్త్ ఇష్యూస్ను.. లైఫ్ స్టైల్లో భాగంగానే భావిస్తున్నాయి. పైగా సమస్యల్ని తగ్గించుకునే ప్రయత్నాలేవీ చేయడం లేద’ని చెబుతున్నారు రాజీవ్. కొన్ని కంపెనీలు ఆఫీస్ చెయిర్లను సమకూర్చగా, మరికొందరు వాళ్లంత వాళ్లే కొనుక్కుంటున్నారు. అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ చెయిర్లు, నేల మీద కూర్చుని పీటల మీద ల్యాప్ట్యాప్లు పెట్టుకుని పని చేస్తున్నారు. ఇక మధ్య, చిన్న జీతగాళ్లు తమకు అందుబాటులో ఉన్న సౌకర్యాలతోనే పని కానిచ్చేస్తున్నారు. అడ్డదిడ్డంగా కూర్చుని-పడుకుని.. ఇలా రకరకాల పోశ్చర్స్లో వర్క్ చేయడం.. అదీ ఎక్కువ గంటలు ఒక క్రమపద్దతిని పాటించకుండా చేయడం వెన్ను నొప్పికి దారి తీస్తోంద’ని రాజీవ్ అంటున్నారు. ఇలా చేయొచ్చు కరోనాకు ముందు చాలామంది వ్యాయామాలకు దూరంగా ఉండడానికి చెప్పిన కారణం.. ‘టైం లేకపోవడం’. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోంలోనూ అదే సాకును చూపిస్తున్నారు. అందుకే వ్యాయామాలకు కొంత టైం అయినా కేటాయించాలని డాక్టర్లు చెప్తున్నారు. ఎక్కువసేపు కూర్చుని వర్క్ చేయడం వల్ల ఒత్తిడి పెరిగి తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. కాబట్టి, వ్యాయామాలు, నడకలో ఏదో ఒకటి పాటించాలని చెప్తున్నారు. అదే పనిగా సిస్టమ్ ముందు కూర్చోవాల్సి వస్తే సిట్టింగ్లోనే కాళ్లు చేతులూ ఆడించడం, వెన్నెముకకు రిలీఫ్ ఇవ్వడంలాంటివి చిన్నచిన్న ఎక్సర్సైజులు చేయాలి. మెడ మీద ఒత్తిడి పడని విధంగా హెడ్రెస్ట్ ఇస్తుండాలి. చిన్న చిన్న మెడ ఎక్సర్సైజులు చేయాలి. వీలైతే నిపుణుల పర్యవేక్షణలో, సలహాలతో యోగా, ఎక్స్ర్సైజులు చేయొచ్చు. ► సీట్లో చాలాసేపు ఒకే భంగిమలో కూర్చొని ఉండకూడదు. అప్పుడప్పుడూ మీ పొజిషన్ కాస్త మారుస్తూ ఉండాలి. ► చెయిర్ను నిటారుగా ఉంచేలా చూసుకోవడం మంచిది. అయితే అలా నిటారుగా ఉండటం మీకు మరీ ఇబ్బందిగా ఉంటే కేవలం కొద్దిగా మాత్రమే వెనక్కు వాలేలా, కాస్తంత ఏటవాలుగా సీట్ ఒంచాలి. ► ఆ చెయిర్ ఒంపు ఎంత ఉండాలంటే... ఆ ఒంపు మీ నడుము మీదగానీ మీ మోకాళ్ల మీద గానీ ఒత్తిడి పడనివ్వని విధంగా ఉండాలి. ► మనిషి ఎత్తుకు అనుగుణంగా చెయిర్ ను అడ్జెస్ట్ చేసుకోవడం అవసరం. ► అన్నింటికి మించి ఇబ్బందిగా అనిపించినా ఈ పోశ్చర్స్ పాటించాల్సిందే. చిన్న చిన్న ఎక్సర్సైజులతో ఉపశమనం పొందాల్సిందే. లేకుంటే నడుం నొప్పి తీవ్ర సమస్యగా మారి.. ట్రీట్మెంట్, సర్జరీలకు దారితీయొచ్చు. చదవండి: బైక్ రైడింగ్తో నడుమునొప్పా? ఇది మీకోసమే.. -
బైక్ రైడింగ్తో నడుమునొప్పా.. అయితే ఇది మీకోసమే!
సాధారణంగా బైక్ల తయారీదారులు హ్యాండిల్బార్స్, ఫుట్రెస్ట్ వంటి అంశాల్లో కొన్ని నిర్ణీత ప్రమాణాలను పాటిస్తుంటారు. బైక్ నడుపుతున్నప్పుడు ఆయా అవయవాలపై ఒత్తిడి పడకుండా ఉండేలాంటి (ఎర్గానమిక్స్) జాగ్రత్తలతో వాటిని తయారు చేస్తుంటారు. దాంతో దాదాపుగా అవయవ సమస్యలు రావు. ఒకవేళ బైక్లోని హ్యాండిల్బార్, సీట్, ఫుట్రెస్ట్స్ వంటి వివిధ అంశాలు సరైన ప్రమాణాలతో లేకపోతే నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇలా బైక్ ఎర్గానమిక్స్ సరిగా లేక నడుమునొప్పి వస్తుందని అనుమానిస్తుంటే ఈ కింది జాగ్రత్తలు పాటించడం మంచిది. ►బైక్ల హ్యాండిల్స్ సాధారణంగా తగినంత విశాలంగా, రెండు చేతులు బాగా పట్టుకోవడానికి వీలైనంత నిడివితో ఉండాలి. పొట్టిగా ఉండే షార్ట్హ్యాండిల్స్ వల్ల ఒంటిపై భారం పడి శరీరభాగాల్లో నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. ►మనం కాళ్లు పెట్టుకునే ఫుట్రెస్ట్ మన శరీరానికి మరీ దూరంగా ఉండకూడదు. అలాగని మరీ దగ్గరగా కూడా ఉండకూడదు. ఈ రెండు అంశాల్లో ఎక్కడ తేడా వచ్చినా నడుమునొప్పి రావచ్చు. ►బైక్పై కూర్చొనే సమయంలో వీపు భాగమంతా నిటారుగా ఉండి, మన వెన్ను ఒంగకుండా ఉండాలి. సాధారణ బైక్ల నిర్మాణం ఇలాగే ఉంటుంది. కానీ కొన్ని స్పోర్ట్స్ బైక్లలో సీట్లు ఏటవాలుగా ఉండి, మనం కూర్చొనే భంగిమ వాలుగా ఉండేలా నిర్మితమై ఉంటాయి. దాంతో ముందుకు వాలినట్లుగా కూర్చోవాల్సి వస్తుంది. ఇలా వాలిపోయినట్లుగా కూర్చొనేలా రూపొందించిన ఫ్యాషన్ బైక్స్ వల్ల మన వెన్ను నిటారుగా నిలపలేకపోవడంతో వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. ►బైక్లపై వెళ్లేవారు వీపుపై ఉండే బ్యాగ్స్ (బ్యాక్ప్యాక్స్) పెట్టుకొని వెళ్తుండటం సాధారణం. ఈ భారం నడుంపైనా భారం పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. ఇలాంటివారు ఆ బ్యాగ్ భారం వీపుపై కాకుండా సీట్పై పడేలా చూసుకోవాలి. నడుమునొప్పితో బాధపడేవారు తమ బైక్లో పైన పేర్కొన్న భాగాల అమరిక, అలాగే వారు కూర్చొనే భంగిమ ఎలా ఉందో పరీక్షించుకొని, లోపాలు ఉన్నట్లయితే సరిచేసుకోవాలి. దాంతో నొప్పి తగ్గవచ్చు. ఈ జాగ్రత్తల తర్వాత కూడా నడుం నొప్పి వస్తుంటే డాక్టర్ను సంప్రదించడమే మంచిది. -
నడుము నొప్పి రాకుండా ఉండాలంటే
కొంతమందికి కార్ డ్రైవింగ్ నిత్యకృత్యం. వాళ్ల బిజినెస్ పనులూ, వాళ్ల రోజువారీ వ్యవహారాలూ అన్నీ కార్తోనే ముడిపడి ఉంటాయి. అయితే అలా కారు డ్రైవ్ చేసేవారిలో నడుమునొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. నడుముపై ప్రభావం పడకుండానూ... నొప్పి రాకుండానూ ఉండాలంటే... కారు డ్రైవింగ్ చేసే సమయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. అవి... ►మీ కాళ్ల పొడవుకు అనుగుణంగా సీట్ను మీకు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. కాళ్లు పొడవుగా ఉన్నవారు సీట్ను మరీ ముందుకు ఉంచకుండా తగినంత దూరంలో ఫిక్స్ చేసుకోవాలి. ►అలాగే మీ ఎత్తుకు అనుగుణంగా సీట్ ఎత్తును అడ్జెస్ట్ చేసుకోవడం అవసరం. ►మీ సీట్ను నిటారుగా ఉంచేలా చూసుకోవడం మంచిది. అయితే అలా నిటారుగా ఉండటం మీకు మరీ ఇబ్బందిగా ఉంటే కేవలం కొద్దిగా మాత్రమే వెనక్కు వాలేలా, కాస్తంత ఏటవాలుగా సీట్ ఒంచాలి. ఆ సీట్ ఒంపు ఎంత ఉండాలంటే... ఆ ఒంపు మీ నడుము మీదగానీ మీ మోకాళ్ల మీద గానీ ఒత్తిడి పడనివ్వని విధంగా ఉండాలి. ►మీ నడుము దగ్గర ఉండే ఒంపు (లంబార్) భాగంలో ఒక కుషన్ ఉంచుకోవాలి. ఆ లంబార్ సపోర్ట్ వల్ల నడుమునొప్పి చాలావరకు తగ్గుతుంది. ►మెడ మీద ఒత్తిడి పడని విధంగా మీ హెడ్రెస్ట్ ఉండాలి. ►సీట్లో చాలాసేపు ఒకే భంగిమలో కూర్చొని ఉండకూడదు. అప్పుడప్పుడూ మీ పొజిషన్ కాస్త మారుస్తూ ఉండాలి. ►అదేపనిగా డ్రైవ్ చేయకుండా మధ్య మధ్య కాస్త బ్రేక్ తీసుకుంటూ ఉండండి. ►అన్నిటికంటే ముఖ్యంగా మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మీకు అన్ని విధాలా రక్షణ కల్పించడమే కాదు... మరెన్నో విధాలుగా మేలు చేస్తుందని గుర్తుంచుకోండి. -
అలా చేస్తే వెన్నునొప్పి పెరుగుతుంది.. జాగ్రత్త!
మనమంతా నిటారుగా ఉండటానికి ఉపయోగపడే అత్యంత ప్రభావపూర్వకమైన భాగం వెన్ను. మనిషి పూర్వికులు తమ నాలుగు కాళ్ల నడక నుంచి రెండు కాళ్ల మీదికి మారిన కాలం నుంచి... శరీరం బరువును చాలావరకు తాను తీసుకుంటూ... నేటి ఆధునిక మానవుడి ఆవిర్భావం వరకు వెన్ను తాలూకు భూమిక అత్యంత కీలకం. తాను నిటారుగా మారినందున ఓ కర్రలాగా నిటారుగా మాత్రమే కాకుండా... మనిషికి అనువైన విధంగా అటు ఇటు వంగగలిగేలా, అవసరమైనప్పుడు పక్కలకు తిరగగలిగేలా, మెడను, నడుమును అటు ఇటు తిప్పగలిగేలా కూడా అత్యంత ఫ్లెక్సిబుల్గానూ రూపొందిన వెన్ను నిర్మాణం ఓ అత్యద్భుతమని చెప్పవచ్చు. అలాంటి అద్భుత అవయవమైన వెన్ను గురించి తెలుసుకుందాం. ఈ నెల 16న ‘వరల్డ్ స్పైన్ డే’. ఈ సందర్భంగా... వెన్ను గురించి అవగాహన కోసం ఈ కథనం. ఈ ఏడాది ప్రపంచమంతటా విస్తరించిన ‘కరోనా’ ప్యాండమిక్ సందర్భంగా వెన్నుపైనా తీవ్రమైన ఒత్తిడి పడిందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. అందుకే వెన్నెముక ఆరోగ్యం, దాని సంరక్షణకు అవసరమైన వ్యాయామాలు, ఆరోగ్యకరమైన పోష్చర్లు వంటి అనేక అంశాలపై అవగాహన కలిగిచేందుకు ఈ ఏడాది స్పైన్ డే థీమ్తో ఇచ్చిన నినాదమే ‘బ్యాక్ టు ట్రాక్’! ఈ సందర్భంగా వెన్ను గురించి, దాని ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యల గురించి తెలుసుకుందాం. వెన్ను నిర్మాణమే ఓ అద్భుతం వెన్నెముకలో మొత్తం 33 చిన్న చిన్న ఎముకలు ఒకదానికొకటి పూసల దండలా అమరి ఉంటాయి. అందుకే ఆ చిన్న చిన్న ఎముకలను వెన్నుపూసలంటారు. వాటి నిర్మాణం... ‘ఎస్’ ఆకృతిలో కాస్తంత ఒంపు... ఇదంతా ఓ నిర్మాణ అద్భుతం. వీటిల్లో... తల కింద... మెడ వెనక భాగంలో ఏడు ఎముకలు ఉంటాయి. వీటిని సెర్వికల్ వెర్టిబ్రే అంటారు. ఇవి తలను అటూ ఇటూ తిప్పడానికి, తల పైకెత్తడానికి, కిందికి దించడానికి కూడా సహాయపడతాయి. వీటి దిగువనే ఛాతీ వెనుక 12 ఎముకలు ఉంటాయి. వీటినే థొరాసిక్ వెర్టిబ్రే అంటారు. మన పక్కటెముకలు వీటిని అతుక్కుని ఉంటాయి. ఈ ఎముకల్లో సమస్యలు తలెత్తడం చాలా అరుదు. వీటికి దిగువ ఉండే ఐదు బరువైన ఎముకలను లంబార్ వెర్టిబ్రే అంటారు. మన శరీరం బరువులో చాలా వరకు భారాన్ని ఇవే మోస్తాయి. వీటికి దిగువ ఉండే ఐదు ఎముకలు ఒకదానికొకటి దగ్గరగా అతుక్కుని ఉంటాయి. ఈ భాగాన్నే ‘కాక్సీ’ అంటారు. ఇది ఒకానొక కాలంలో ఆధునిక మానవుల పూర్వీకులకు ఉండే తోక అవశేషంగానూ చెబుతుంటారు. ఓ చిన్నారి పుట్టీ పుట్టగానే వెన్నుభాగం దాదాపు నిటారుగానే ఉంటుంది. కానీ చిన్నారి తన తల పైకెత్తడం మొదలుపెట్టినప్పుడు మెడ వద్ద ఉండే భాగం కాస్త వంపు తిరుగుతుంది. అలాగే... పాపాయి పాకడం నేర్చుకునేటప్పుడు తన నడుము వద్ద ఉండే భాగం కొద్దిగా వంపు తిరుగుతుంది.దాంతో వెన్నుకు ‘ఎస్’ అక్షరం లాంటి ఒంపు సమకూరుతుంది. నిజానికి సరళరేఖలా ఉండటం కంటే ఇలా ఒంపు తిరగడం వల్లనే మనిషి అనేక రకాలుగా ఒంగేలా, పనులు చేసుకోగలిగేలా వెన్నుకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఈ ఒంపులే వెన్నుకు షాక్ అబ్జార్బర్స్లా పనిచేస్తాయి. కేవలం ఈ ఒంపులు మాత్రమే కాకుండా వెన్నులో మరికొన్ని షాక్ అబ్జార్బర్స్ కూడా ఉన్నాయి. అవే గనక లేకుంటే, వెన్నుపూసలు ఒకదానికొకటి తాకినప్పుడు రాపిడికి గురై, అరిగిపోయేవి. అవి... వెన్నుపూసల మధ్య కుషన్లాంటిది ఉంటుంది. దానినే ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ అంటారు. ఆ డిస్క్ మధ్యలో జెల్లీలాంటి పదార్థం ఉంటుంది. ఈ డిస్కే మనిషికి ఎదురయ్యే అనేక కుదుపుల బారి నుంచి వెన్నుపూసలను జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. ఈ డిస్క్ కారణంగానే మనం వెన్నెముకను అటు ఇటు వంచగలం. మన శరీరాన్ని అటు ఇటు తిప్పగలం. పూసల్లోని పాము నుంచి31 జతల నరాలు మనిషిలోని వెన్నుపూసలన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయినట్టుగా ఉండి... వాటి మధ్యన ఖాళీలతో ఓ సందును ఏర్పరుస్తాయి. ఆ ఖాళీలో తల నుంచి వెన్నుపూసల చివరి వరకు దాదాపు 45 సెంటీమీటర్ల వెన్నుపాము ఉంటుంది. ఈ వెన్నుపాముకూ వెన్నెముక పూసలు రక్షణ కూడా కల్పిస్తుంటాయి. పూసల దండలోని దారంలా... మనిషిలో ఓ తెల్లని వెన్నుపాము ఒక సెంటీమీటరు మందంలో ఉంటుంది. దీనికేమైనా జరగరానిది జరిగితే, మనిషి తన జీవితాంతం అవిటివాడిలా ఉండాల్సిందే. అటు ఇటు వెళ్లాలంటే వీల్చైర్ ఉపయోగించక తప్పదు. సున్నితమైన వెన్నుపాముకు వెన్నుపూసలు మూడు పొరల రక్షణ కల్పిస్తుంటాయి. ఈ వెన్ను పూసల మధ్యనుండే ఖాళీల ద్వారా వెన్నుపాము నుంచి 31 జతల నరాలు దేహమంతా పాకి ఉంటాయి. వీటిలో సగం నరాలు దేహం నుంచి మెదడుకు సమాచారం చేరవేస్తూ ఉంటాయి. మిగిలినవి మెదడు నుంచి వచ్చే వివిధ ఆదేశాలను శరీరంలోని వివిధ కండరాలకు చేరవేస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మెదడుతో ప్రమేయం లేకుండా వెన్నుపామే స్వయంగా ఆలోచించి, నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఉదాహరణకు ఓ వ్యక్తి తాలూకు చేతికి వేడి తగిలిందనుకోండి... ఆ సమాచారాన్ని మెదడుకు చేరవేసి, అక్కణ్నుంచి ఆదేశాలు వచ్చేంత సమయాన్ని వెన్నుపాము వృథా చెయ్యదు. వెంటనే వేడి తగిలిన చెయ్యి వెన్నుకు తీసుకునేలా అసంకల్పిత చర్యలకు ఆదేశాలిస్తుంది. అలా చాలారకాల ప్రమాదాలనుంచి వెన్నుపాము మనల్ని రక్షిస్తుంది. ఇలా రక్షించే వెన్నుపాముకు మన వెన్నుపూసల ద్వారా వెన్నెముక రక్షణ కల్పిస్తుంది. వెన్నుకు నొప్పులూ... కారణాలూ ఎన్నెన్నో ►ఈ ప్రపంచంలోని ప్రతి మనిషికీ ఏదో ఒక దశలోనైనా, కనీసం ఒక్కసారైనా ఏదో ఓ కారణంతో వెన్నునొప్పి వచ్చి తీరుతుంది. దాంతో కాపడం పెట్టించుకోవడమో, మర్దన చేయించుకోవడమో, మందులు వాడటమో చేయనివారంటూ ఎవరూ ఉండరు. అయితే చాలా సందర్భాల్లో వెన్నెముకకు నొప్పి వచ్చిందటే దానికి నేరుగా వెన్నుపూసలే కారణం కాకపోవచ్చు. ఇతరత్రా చాలా కారణాలు ఉండొచ్చు. ఉదాహరణకు... మూత్రపిండాల్లో సమస్యలు ఉన్నా, కాలేయం లేదా ప్రొస్టేట్ సరిగా పనిచేయకపోయినా, ఆర్థరైటిస్, ఇన్ఫెక్షన్లు వంటివి ఉన్నా వెన్నుకు నొప్పులు వస్తాయి. ►ఒక్కోసారి తీవ్రమైన భావోద్వేగాలకు గురైనా వెన్నునొప్పి రావచ్చు. ఓ వ్యక్తి తీవ్రమైన భావోద్వేగాలకు గురైనప్పుడు వెన్నుకు అంటిపెట్టుకుని ఉండే కండరాలు తీవ్రంగా బిగుసుకుంటాయి. అలా రోజుల తరబడి తీవ్ర భావోద్వేగాలు కొనసాగితే బిగుసుకున్న కండరాల వల్ల వెన్నుకు నొప్పులు తప్పవు. అయితే త్వరగా భావోద్వేగాల నుంచి తేరుకుంటే నొప్పులూ తగ్గుతాయి. ►వెన్నెముక ప్రధాన ఉద్దేశం వెన్నుపామును కాపాడటం కాగా... రెండో ప్రధాన ఉద్దేశం మన శరీరాన్ని కుదుపుల నుంచి రక్షించడం, దేహానికి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం. ఈ రెండు పనులనూ డిస్క్లు సమర్థంగా చేస్తాయి. ఈ కారణంగా డిస్క్ల మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా సహజంగానే వయసు పెరగడంతో పాటు, వాడుతున్న కొద్దీ డిస్క్లు కొద్దికొద్దిగా దెబ్బతింటూ వస్తాయి. ఇలా దెబ్బతినడం వల్లనే మనకు నడుమునొప్పి వస్తుంటుంది. అప్పుడప్పుడు బరువులెత్తడం వంటి ఏదైనా కారణం వల్ల డిస్క్ పగలడం (రప్చర్కావడం) జరగవచ్చు. డిస్క్ మధ్యలో ఉన్న జెల్లీ బయటకు వచ్చి నరాన్ని కానీ, నాడిని కానీ నొక్కేయవచ్చు. దీన్నే సయాటికా అంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు అరుదుగా సర్జరీ కూడా అవసరం పడవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే... వెన్నునొప్పి చాలావరకు డిస్క్లు అరగడం వల్ల వస్తుంది. ఈ ప్రమాదాని నివారించాలంటే మన శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం, ముందుకు ఒంగి ఎక్కువ బరువు లేపకపోవడం, ముందుకు ఒంగి ఎక్కువ పని చేయకపోవడం అవసరం. అంతేకాదు... వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ పెరిగే విధంగా ఫెక్సిబిలిటీ వ్యాయామాలు, యోగా వంటివి చేయాలి. వెన్నెముకకు సపోర్ట్నిచే కండరాల బలాన్ని పెంచే ‘స్పైనల్ స్ట్రెంతెనింగ్ ఎక్సర్సైజెస్’ అనే వ్యాయామాలు చేయాలి. ►రోడ్డు ప్రమాదం వంటి యాక్సిడెంట్స్లో తీవ్రంగా గాయపడినప్పుడు వెన్నుపూసల మధ్య డిస్కులు తింటాయి. అలాంటి సందర్భాల్లో వెన్నుపూసలకు పెద్ద దెబ్బ తగిలితే ప్రధానంగా వాటి మధ్య కుషన్లా ఉన్న కార్టిలేజ్ దెబ్బతింటుంది. దాంతో అందులోని జెల్లీలాంటి పదార్థం బయటకు కారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో వెన్నును అంటిపెట్టుకుని ఉండే కండరాల్లో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ►కొందరిలో వెన్నుపూసలు అరిగి రాపిడికి గురై, వెన్నుపూస నుంచి బయటికి వచ్చే సయాటికా నరంపై ఒత్తిడి కలిగిస్తాయి. దేహంలో అత్యంత పొడవైన ఈ సయాటికా నరం అరిపాదాల వరకు వ్యాపిస్తుంది. దాంతో నొప్పి కూడా నడుము నుంచి అరికాళ్ల వరకు పాకుతుంది. ఒకరకంగా చూస్తే... ఈ నొప్పి జాగ్రత్త వహించాలని చెబుతూ దేహం పంపే సంకేతం అన్నమాట. ►కొందరు సోఫాల్లోనూ, కుర్చీల్లో అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా కూర్చుని తాము హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నామని అనుకుంటారు. కానీ అది వెన్నుపై భారాన్ని మరింత పెంచుతుంది. మరికొందరు నేల మీద ఉన్న బరువులను ఎత్తేటప్పుడు వెన్నును ముందుకు వంచుతారు. దానికి బదులుగా మోకాళ్లు ఒంచి, గొంతుకూర్చొని బరువులు ఎత్తితే వెన్నుపై పెద్ద భారం ఉండదు. ►అరుగుదలతో వెన్నుకు నొప్పులు వస్తాయి. కొందరికి మెడ వద్ద ఉండే వెన్నుపూసల డిస్కులు అరిగి, రాపిడికి గురైనప్పుడు నొప్పి వస్తూ, అది భుజాల్లోకి పాకుతూ చాలా ఇబ్బందిగా పరిణమిస్తుంది. అలాగే మరికొందరిలో నడుము దగ్గరి డిస్కులు అరిగి నడుమునొప్పి వస్తుంటుంది. దీనికి ప్రధాన కారణం వయసు పెరగడం అనే ముప్పు. మన వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలోని ఎముకలూ బలహీనపడుతుంటాయి. అరుగుతుంటాయి. వెన్నులోని ఎముకలూ ఇందుకు మినహాయింపు కాదు. వెన్ను డిస్కులు మెత్తబడిపోతూ, వెన్నుపూసలు సాంద్రత (బోన్ డెన్సిటీ) కోల్పోతుంటాయి. వయసు మరింత పెరిగి వృద్ధాప్యంలో వెన్ను మరింతగా ఒంగిపోయి, మనిషి కిందికి కుంగిపోయినట్లుగా అనిపించడమూ సహజం. అలాంటప్పుడు భారంగా ముందుకు వంగి నడవాల్సి వస్తుంది. ఒళ్లు పెరిగితే...నొప్పులూ పెరుగుతాయి... నడివయసు వారిలో చాలామందిలో వెన్నునొప్పులు కనిపిస్తుంటాయి. అలాంటి నొప్పుల్లో చాలావరకు వెన్నును ఆనుకుని ఉండే కండరాలు బలహీనంగా మారడం వల్ల వచ్చేవే. కొందరు చిన్న చిన్న కదలికలతోనే సంతృప్తి చెంది తమ శరీర కదలికల కారణంగా దేహానికి వ్యాయామం సమకూరిందనుకుంటారు. దాంతో తమ వెన్ను పదిలం అని భావిస్తుంటారు. వెన్నును అంటిపెట్టుకుని దాదాపు నాలుగువందలకు పైగా కండరాలు, వెయ్యి లిగమెంట్ల వరకు ఉంటాయి. దాంతో ఎవరైనా ఓ వ్యక్తి బరువు పెరిగినా... లేదా అతడికి పొట్ట పెరిగినా... ఆ భారాన్నంతా వెన్ను మోయాల్సి వస్తుంది. అందుకే ఎత్తుకు తగినంతగానే బరువు ఉండేలా జాగ్రత్త పడుతూ, తమ దేహపు బరువు, పొట్ట పెరగకుండా చూసుకుంటే అది కేవలం శరీర ఆరోగ్యనికే కాదు వెన్ను కూడా ఆరోగ్యానికీ ఉపకరిస్తుంది. చిన్న జాగ్రత్తలతో వెన్ను పదిలం... కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వయసు పెరుగుతన్న క్రమంలోనూ, వెన్నును జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ∙ఎప్పుడూ మీ దేహ భంగిమను (బాడీ పోష్చర్)ను నిటారుగా ఉంచుకోవాలి. నిటారుగా నిలబడటం, వెన్ను నిటారుగా ఉంచి కూర్చోవడం అలవాటు చేసుకోవాలి ∙వెన్నును అంటిపెట్టుకుని ఉండే కండరాలు బలహీనం కాకుండా ఉండేందుకు ప్రతిరోజూ కొద్దిసేపైనా వ్యాయామం చేయాలి ∙వెన్నుకు వచ్చే చాలా సమస్యలు ప్రధానంగా కండరాల బలహీనత వల్లే ఎక్కువగా వస్తుంటాయి. అందుకే, కండరాలను బలోపేతం చేసేందుకు తగిన వ్యాయామాలు చేయాలి ∙కూర్చునే సమయంలోనూ కూలబడినట్లుగా కాకుండా సౌకర్యంగా ఉండేలా, వెన్ను నిటారుగా ఉండేలా కూర్చోవాలి ∙కింది నుంచి బరువులు ఎత్తేటప్పుడు ఒంగి కాకుండా... కూర్చుని ఎత్తాలి. హడావుడిగా కాకుండా నింపాదిగా ఎత్తాలి. -
ఇక టెస్టులు ఆడటం నాకు సవాలే
న్యూఢిల్లీ: వెన్ను నొప్పికి శస్త్రచికిత్స తర్వాత టెస్టు క్రికెట్ ఆడటం తనకు సవాలేనని భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో జట్టుకు తన అవసరమున్నందున సుదీర్ఘ ఫార్మాట్ కోసం తాపత్రయపడి ప్రమాదం కొనితెచ్చుకోనని పేర్కొన్నాడు. ‘టెస్టుల్లో నన్ను బ్యాకప్ సీమర్గా భావిస్తారని తెలుసు. కానీ వెన్నునొప్పి చికిత్స తర్వాత టెస్టులాడటం నాకు పెద్ద సవాలే. కేవలం నేను టెస్టు స్పెషలిస్టునే అయితే రిస్క్ చేసి అయినా సుదీర్ఘ ఫార్మాట్లో ఆడేవాడిని. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్లో జట్టుకు నా అవసరం ఉంది’ అని పాండ్యా వెల్లడించాడు. 2018 ఆసియాకప్లో భాగంగా పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ తీవ్రమైన వెన్నునొప్పితో మైదానాన్ని వీడాడు. ఆ సమయంలో ఇక తన కెరీర్ ముగిసిపోయినట్లు భావించానని అతను తెలిపాడు. ఇ ప్పటివరకు 11 టెస్టుల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన 26 ఏళ్ల పాండ్యా 2018 సెప్టెంబర్ తర్వాత మరో టెస్టు ఆడలేదు. ‘కాఫీ విత్ కరణ్’ టీవీ షో తర్వాత ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నానన్న పాండ్యా... తన కారణంగా కుటుంబానికి చెడ్డ పేరు రావడం బాధించిందని అన్నాడు. కఠిన సమయాల్లో ముంబై ఇండియన్స్ కోచ్ రికీ పాంటింగ్ తనను తండ్రిలా ఆదరించాడని తెలిపాడు. అతని నుంచి ఎంతో నేర్చుకున్నానని అన్నాడు. ఇతరుల అభిప్రాయాలు వినడంతోనే 2016 ఐపీఎల్ సీజన్లో రాణించలేకపోయానని పేర్కొన్నాడు. జాతీయ జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి, ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ తనకు ఎంతో మద్దతుగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపాడు. -
తీవ్రమైన వెన్ను నొప్పి... తగ్గేదెలా?
నా వయసు 39 ఏళ్లు. విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. నా సమస్యకు హోమియోలో చికిత్స ఉందా? ఇటీవల వెన్నునొప్పి చాలా ఎక్కువ మందిలో కనిపిస్తున్న సాధారణమైన సమస్య. ఎక్కువగా బరువు ఎత్తడం, దించడం, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు, క్యాల్షియమ్ లోపం, విటమిన్ బి12, డీ3 లోపాలు, ఎముకల సాంద్రత తగ్గడం వంటివి వెన్నునొప్పికి కొన్ని కారణాలు. డిస్క్ బల్జ్, డిస్క్ కంప్రెషన్, నరాలమీద ఒత్తిడి పెరగడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. హోమియోలో ఇలాంటి వెన్ను సంబంధమైన నొప్పులు వచ్చినప్పుడు... ఉదాహరణకు డిస్క్ బల్జ్ వల్ల నరాలమీద ఒత్తిడి పెరిగినప్పుడు తగ్గించడానికి కోబాల్ట్ లాంటి ప్రభావపూర్వకమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఇక మెడభాగంలో ఉండే వెన్నుపూసలు అరిగినప్పుడు వచ్చే నొప్పిని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. మెడ భాగంలో సి1 నుంచి సి7 వరకు ఉండే వెన్ను పూసలను సర్వైకల్ పూసలు అంటారు. ఇవి అరిగినప్పుడు వెన్నుపూసల కీళ్ల మధ్య భాగం తగ్గిపోవడం వల్ల డిస్క్బల్జ్ ఏర్పడటం, వెన్నుపూసల మధ్య రాపిడి పెరగడం వంటి కారణాల వల్ల మెడ భాగం నుంచి నొప్పి మొదలై చేతి వేళ్ల వరకు నొప్పి పాకుతూ ఉంటుంది. దాంతో పాటు తిమిర్లు, చేయి మొద్దుబారడం, మెడ ఫ్రీగా తిరగలేకపోవడం, మెడ పట్టివేసినట్లుగా ఉండటం వంటివి చూస్తుంటాం. చికిత్స: మెడ ఫ్రీగా తిరగకుండా పట్టేసినట్లుగా ఉన్నవారికి యాసిడ్ఫాస్ అనే మందు బాగా పనిచేస్తుంది. ఇక మెడ, నడుము, వెన్నెముక నొప్పులకు ఆస్క్యులస్ హిప్, రస్టాక్స్, బ్రయోనియా ఆల్బ్, కాల్కేరియా ఫ్లోర్, హైపరికం, మహిళల్లో వచ్చే ఇలాంటి సమస్యలకే సిమిసిఫ్యూగా వంటివి అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
నడుమంత్రపు నొప్పి!
తమ జీవితకాలంలో నడుమునొప్పి రానివారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఇది మధ్యవయస్కుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా 35 ఏళ్లు పైబడితే ఏదో ఒక సమయంలో నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే సాధారణంగా నడుమునొప్పి అరుదుగా తప్ప అది పెద్దగా ప్రమాదకరం కాదు. దాదాపు అందరూ ఎదుర్కొనే ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం. నడుమునొప్పికి కారణాలు నడుమునొప్పికి చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణకు... కండరాలు, లిగమెంట్లు, టెండన్లు, డిస్క్లు, ఎముకలు... ఇలా ఎక్కడ సమస్య ఉన్నా నడుము నొప్పి రూపంలో బయటపడుతుంది. సాధారణంగా నడుమునొప్పికి ఎక్కువగా కారణమయ్యే అంశాలివి... ►నడుము కండరాలు తీవ్రమైన ఒత్తిడికి గురై, స్ప్రెయిన్ కావడం ►లిగమెంట్లు దెబ్బతినడం ►నడుము పరిసరాల్లో ఉండే కండరాలు పట్టేయడం. ►పై కండిషన్లకు కారణమయ్యే అంశాలు... ►ఏదైనా బరువును సక్రమంగా ఎత్తకపోవడం ►ఎక్కువ బరువును అకస్మాత్తుగా ఎత్తడం ►సరైన పోష్చర్లో కాకుండా అడ్డదిడ్డంగా కదలడం లేదా నడవడం ►అకస్మాత్తుగా జరిగే ఒంటి కదలికలు... ఇలాంటి సంఘటనలతో ఈ కింద పేర్కొన్న పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవి నడుమునొప్పి కారణమవుతాయి. ►ప్రతి రెండు వెన్నుపూసల మధ్య కుషన్లాంటి ఒక డిస్క్ ఉంటుంది. ఏవైనా కారణాల వల్ల డిస్క్ దెబ్బతినడంతో అక్కడి నరం మీద ఒత్తిడి పెరిగి నడుము నొప్పి రావచ్చు ►వెన్నుపూసకు ఇరుపక్కలా ఉండే డిస్క్లో వాపు రావడం వల్ల నడుము నొప్పి వస్తుంది. ►సయాటికా: మనదేహంలో అన్నిటి కంటే పెద్ద నరం నడుము దగ్గర మొదలై అది కాలివరకు వెళ్తుంది. ఆ నరాన్ని ‘సయాటిక్’ నరం అంటారు. ఏవైనా కారణాల వల్ల ఆ నరం నొక్కుకుపోతే... నడుము దగ్గర నొప్పి మొదలై అది కాళ్ల వరకు పాకుతుంది. దీన్నే ‘సయాటికా నొప్పి’ అంటారు. ►కొందరిలో వయసు పెరుగుతున్న కొద్దీ స్పాండిలోసిస్లో రెండు వెన్నుపూసల మధ్య ఉండాల్సిన గ్యాప్ తగ్గి, ఆ రెంటిమధ్యన నరం ఇరుక్కుపోవడంతో నడుమునొప్పి వస్తుంది. ►కొందరిలో వెన్ను అసహజంగా ఉంటుంది. ఈ కండిషన్ను ‘ఫ్లాట్ బ్యాక్ సిండ్రోమ్’ అంటారు. ఈ అసహజ భంగిమ వల్ల కొందరిలో నొప్పి రావచ్చు. ఇది ఎక్కువగా తప్పుడు భంగిమల్లో కూర్చున్నవారిలో వస్తుంటుంది. ►మరి పొట్ట ఎక్కువగా ఉన్నా నడుమునొప్పి రావచ్చు. ►కొందరిలో ఎముకలు పెళుసుబారిపోయి తేలిగ్గా విరిగిపోయే ‘ఆస్టియోపోరోసిస్’ కండిషన్ ఏర్పడి వెన్ను కూడా విరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా నడుము లేదా వెన్ను నొప్పికి ఒక కారణం. నడుం నొప్పి ముప్పును పెంచే అంశాలు (రిస్క్ ఫ్యాక్టర్స్) : ►వృత్తులో తీవ్రమైన ఒత్తిడి ఉండటం ►మహిళల్లో గర్భధారణ ∙అదేపనిగా కూర్చొని పనిచేయడం ► పెరిగే వయసు ►ఊబకాయం ►పొగతాగడం ►చాలా ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం లేదా సరిగా చేయకపోవడం ►చాలా ఎక్కువగా చేసే శారీరక శ్రమ ►నిర్ధారణ: నడుమునొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఏ కారణం వల్ల ఆ నడుమునొప్పి వస్తుందో తెలుసుకోవడం కోసం కొన్ని పరీక్షలు అవసరం. ఇందుకోసం ఎక్స్రే, అవసరాన్ని బట్టి సీటీస్కాన్ లేదా ఎమ్మారై, బోన్స్కాన్, ఎలక్ట్రోమయోగ్రఫీ వంటి పరీక్షలు చేయించడం అవసరమవుతుంది. ►చికిత్స: ముందుగా కారణం తెలుసుకోవాలి. దాన్నిబట్టి నొప్పిని దూరం చేయడానికి ఫిజియోథెరపిస్ట్ సహాయంతో అవసరమైన వ్యాయామాలు లేదా (ఇంటర్ ఫెరెన్షియల్ థెరపీ) ఐఎఫ్టీ వంటి ప్రక్రియలతో చేసే చికిత్సలు కూడా నడుమునొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ట్రాన్స్క్యుటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్ అనే మాటలకు సంక్షిప్త రూపమైన ‘టెన్స్’ చికిత్స కూడా నడుమునొప్పికి పనిచేస్తుంది. ఇందులో ఎలక్ట్రోడ్ల సహాయంతో చిన్న చిన్న విద్యుత్ ప్రకంపనలను చర్మం కిందికి పంపుతారు. ఫలితంగా ఉపశమనం కలుగుతుంది. అయితే గర్భవతులు, మూర్ఛ రోగులు, గుండెజబ్బులు ఉన్నవారు లేదా గుండెలో పేస్మేకర్ అమర్చిన వాళ్లకు టెన్స్ చికిత్స సరికాదు. ఇలాంటి చికిత్సలు వైద్యనిపుణుల పర్యవేక్షణలోనే సాగాలి. ►ఇక పై మార్గాలన్నీ విఫలం అయినప్పుడు ఎముకల వైద్య నిపుణులు లేదా న్యూరోసర్జన్లు లేదా స్పైన్ సర్జన్లు అవసరమైన శస్త్రచికిత్సను నిర్వహించి పరిస్థితిని పూర్తిగా చక్కబరుస్తారు. ►తక్షణ నొప్పి నివారణ కోసం: నొప్పిని తాత్కాలికంగా తగ్గించడం కోసం పెయిన్ కిల్లర్స్ అందుబాటులో ఉన్నా... ఇవి కేవలం తక్షణ నొప్పి నివారణ కోసమే పనికి వస్తాయి. వీటిని రెండు వారాలకు మించి తీసుకోవడం సరికాదు. దీనికి బదులు ఉపశమనం కోసం పైపూత మందులు (టాపికల్ మెడిసిన్స్) వాడటం మరింత మంచిది. ►ఒకవేళ నడుమునొప్పి దీర్ఘకాలం పాటు కొనసాగితే మాత్రం వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. మరికొన్ని అసాధారణ కారణాలు కాడా ఈక్వినా సిండ్రోమ్: ప్రతి రెండు వెన్నుపూసల మధ్య నుంచి కొన్ని నరాలు బయటకు వచ్చినట్లుగానే... నడుము కింది వెన్నుపూస నుంచి నరాలన్నీ బయటికి వచ్చి నడుము కింది ప్రాంతమంతా విస్తరిస్తాయి. కొన్నిసార్లు వెన్నుపూస చివరి భాగం నుంచి వచ్చిన నరాలనుంచి ఒక సన్నటి నొప్పి (డల్ పెయిన్) బయల్దేరి... పిరుదులు, జననాంగాలు, తొడల భాగమంతా ఆ నొప్పి విస్తరిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో పిరుదుల కింది భాగమంతా అసలు లేనేలేదేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. దాంతో కొందరిలో అది మల, మూత్ర విసర్జన కలగబోయేముందు వచ్చే ఫీలింగ్ కూడా లేనట్లుగా ఉంటుంది. ఈ కండిషన్ను కాడా ‘ఈక్వినా సిండ్రోమ్’ అంటారు. ►వెన్నెముక క్యాన్సర్ : ఇది అరుదైన కండిషన్. ఇలాంటి సమయాల్లో వెన్ను కింది భాగంలో ఎక్కడైనా క్యాన్సర్ గడ్డ ఏర్పడి అది అక్కడి నరాలను నొక్కేయడం వల్ల నడుము నొప్పి రావచ్చు. ►వెన్నెముక ఇన్ఫెక్షన్ : ఏదైనా వెన్నుపూసలో వాపు రావడం వల్ల అక్కడి మృదువైన భాగాల మీద ప్రభావం పడి నడుమునొప్పి రావచ్చు. ఇలాంటి సమయాల్లో జ్వరం కూడా ఉంటుంది. ►ఇన్ఫెక్షన్లు: మహిళల్లో వచ్చే ‘పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్’ వంటి ఇన్ఫెక్షన్లు లేదా యూరినరీ బ్లాడర్ సమస్యలు, కిడ్నీ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నడుము నొప్పి రావచ్చు. ►నరాలకు వచ్చే ‘షింగిల్స్’ అనే సమస్య ఉన్నప్పుడు కూడా అది ఒకవేళ నడుము భాగంలోని నరాలు దెబ్బతింటే నడుమునొప్పి రావచ్చు. ►పక్క సరిగా లేకపోయినా : కొన్ని సందర్భాల్లో పక్క సరిగా కుదరక... అది ఉండాల్సిన తీరులో లేనందువల్ల కూడా నడుము నొప్పి రావచ్చు. ►కూర్చోవడంలో తప్పుడు భంగిమలు: కూర్చొని పనిచేసేవారిలో దాదాపు 80 శాతానికి పైగా సరైన భంగిమలో ఎలా కూర్చోవాలో తెలియదు. దాంతో నడుమునొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. దాంతోపాటు నడుమునొప్పికి కారణమయ్యే కొన్ని అంశాలివి... ►అసహజ భంగిమల్లో అకస్మాత్తుగా వంగడం లేదా పక్కకు తిరగడం ►నొక్కడం ►లాగడం ►ఎత్తడం ►చాలాసేపు నిలబడటం ►ముందుకు ఒంగడం ►ఒక్కపెట్టున తుమ్మడం ►దగ్గడం ►అతిగా ఒంగడం ►కంప్యూటర్ను చూస్తూ మెడను అసహజ భంగిమలో చాలాసేపు వంచి ఉంచడం ►చాలా సేపు డ్రైవ్ చేయడం డా. సుధీంద్ర ఊటూరి లైఫ్స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
వెన్నునొప్పి తగ్గడం లేదు... పరిష్కారం చెప్పండి
నా వయసు 32 ఏళ్లు. ఒక మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తున్నాను. రోజూ 60 కి.మీ. బైక్ మీద వెళ్తుంటాను. అలాగే కొన్ని అకౌంట్స్ కోసం కంప్యూటర్ మీద కూడా చాలా ఎక్కువగా పనిచేస్తుంటాను. నాకు మూడు నెలల క్రితం తీవ్రమైన వెన్నునొప్పి వచ్చింది. ఇప్పుడు డాక్టర్కు చూపించుకున్నాను. మందులు రాసిచ్చారు. ఒక వారం పాటు వాడాను. నొప్పి తగ్గింది. ఈమధ్య ఒక వారం రోజుల నుంచి వెన్నుతో పాటు మెడ భాగంలో కూడా తీవ్రమైన నొప్పి వస్తోంది. నాకున్న సమస్య ఏమిటి? పరిష్కారం సూచించండి. ఈమధ్య వయసుతో నిమిత్తం లేకుండా చాలామందిలో వెన్నునొప్పులు వస్తున్నాయి. మీ సమస్య విషయానికి వస్తే రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి మీరు టూ–వీలర్ మీద చాలా లాంగ్ డ్రైవింగ్ చేయడం. పైగా డ్రైవింగ్లో చాలా ఎక్కువగా ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటూ ఉండవచ్చు. మన రోడ్ల మీద గతుకులు చాలా సాధారణం. ఇలాంటి నేపథ్యంలో ఇంతింత దూరాలు టూ–వీలర్పై ప్రయాణం చేయడం ఎంతమాత్రమూ మంచిది కాదు. ఏకధాటిగా అంతసేపు మీరు బైక్ మీద ప్రయాణం చేయడం వల్ల మీ వెన్ను (స్పైన్) తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. అంతేకాకుండా కంప్యూటర్ మీద అన్ని గంటలు పనిచేయడం వల్ల కూడా మీకు వెన్నుతో పాటు మెడ నొప్పి కూడా వస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది చాలా ప్రమాదకరం. మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న సీనియర్ స్పైన్ సర్జన్ను కలవండి. వారు కొన్ని పరీక్షలు చేయించి, వాటిని బట్టి మీ సమస్యకు తగిన పరిష్కారం వారు సూచిస్తారు. అయితే ఈలోగా మీరు ఈ కింద పేర్కొన్న కొన్ని సూచనలు పాటించండి. ►మీ సీటుకు ముందు భాగాన ఉండే కంప్యూటర్ డెస్క్ను మీ తలకు సమానంగా ఉండేలా అమర్చుకోండి. దానికి అనుగుణంగా ఉండేలా మీరు ఆఫీసులో కూర్చునే భంగిమ మార్చుకోండి. ►కొన్ని సాధారణ వార్మ్అప్ వ్యాయామాలు చేయండి ►వెన్ను, మెడ తీవ్రమైన ఒత్తిడికి, వేగవంతమైన కదలికలకు గురికాకుండా చూసుకోండి. ఇలా చేయడం వల్ల కాస్త రిలీఫ్గా ఉంటుంది. -
ఆ నొప్పి వెన్ను నుంచి వేళ్ల వరకు
ఓ వయసు దాటాక వెన్నెముకలోని మెడ దగ్గర ఉండే ఎముకలుఅరిగిపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతుంటుంది. మెడ దగ్గరనొప్పి భుజం నుంచి మోచేతి మీదుగా వేళ్లకూ పాకుతూ చికాకు పెడుతుంటుంది. నొప్పి, తిమ్మిరులతో ఇబ్బంది పెడుతుంది. ఒక్కోసారి చేయి బలహీనంగా అయినట్లుగానూ అనిపిస్తుంది. ఈ సమస్య పేరే సర్వైకల్ స్పాండిలోసిస్. జీవనశైలి, పని ప్రదేశం (వర్క్ప్లేస్)లో కూర్చునే భంగిమల వల్ల ఇప్పుడు చాలా త్వరగా వచ్చేస్తోంది. ఈ కారణంగా వెన్నుకు వచ్చే కొన్ని సమస్యలపై అవగాహన పెంచుకుందాం. అదే పనిగా సరైన తీరులో కాకుండా... ఇష్టం వచ్చినట్లు కూర్చోవడంతోపాటు వెన్నుమీద తీవ్రమైన ఒత్తిడి పడటం వల్ల డిస్కులు పక్కకు తప్పుకోవచ్చు. ఇలా వచ్చే సమస్యను సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ అంటారు. అంతేకాకుండా ఈ సమస్య చాలాకాలం పాటు కొనసాగినా లేదా వయసు మీరాక మెడలోని వెన్నెముకలు అరగడం వల్ల ఆ ఎముకల మధ్య ఉన్న నాడులపై ఒత్తిడి పడి వచ్చే సమస్యను సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. ఇటీవల దాదాపు అన్ని వర్గాల్లోనూ మెడమీద ఒత్తిడి తీవ్రమయ్యేలా చేసే ఉద్యోగాలు, వృత్తులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్య సర్వసాధారణమయ్యింది. అందుకే ఓ వయసు దాటాక వచ్చే సర్వైకల్ స్పాండిలోసిస్కు ముందర వచ్చే డిస్క్ప్రొలాప్స్లు పెరుగుతున్నాయి. అందుకే ఈ సమస్యల గురించి తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మెడ దగ్గరి ఎముకలనుతెలుసుకుందాం... మన మెడ భాగంలోని వెన్నెముకలో ఏడు ఎముకలు ఉంటాయి. వాటినే వరసగా సీ1, సీ2, సీ3, సీ4, సీ5, సీ6, సీ7గా చెబుతారు. ఈ ఎముకలు తలను నిటారుగా నిలబెట్టి ఉంచేందుకు ఉపయోగపడతాయి. మెడను అటు ఇటు తిప్పడానికి (ఫ్లెక్సిబుల్గా ఉంచేందుకు) ఉపయోగపడతాయి. లోపల ఉన్న వెన్నుపాము (స్పైనల్కార్డ్)ను కాపాడతాయి. ఆ ఎముకల మధ్య ఘర్షణ (ఫ్రిక్షన్) నివారించేందుకు ఎముకకూ, ఎముకకూ మధ్యన డిస్క్ ఉంటుంది. ఈ ఎముకల మధ్యనుంచి నరాలు బయటకు వచ్చి వేర్వేరు అవయవాలను చేరి వాటిని నియంత్రిస్తుంటాయి. మెడలోని ఈ వెన్నెముకలు ఎముకలు, లేదా వాటిమధ్యన ఉండే మెత్తలాంటి డిస్క్ అరుగుదల వల్ల, లేదా ఒక్కోసారి డిస్క్లు పక్కకు జరగడం వల్ల నరాలపై ఒత్తిడి పడి ఈ తిమ్మిరి, నొప్పి వస్తుంది. ఇలా డిస్క్లు పక్కకు తొలగడాన్ని సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ అంటారు. మెడలో ఉండే వెన్నెముకలు సీ1–సీ7 అరిగి, వాటి మధ్య ఉండే ఫేసెటల్ జాయింట్స్ కూడా అరిగి, రియాక్షన్గా ఆ అరిగిన మేరకు ఎముక పెరగడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. సాధారణంగా సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ కొద్దిగా యంగ్ ఏజ్లో వస్తుంది. ఇలాంటి డిస్క్ ప్రొలాప్స్ వల్ల దీర్ఘకాలికంగా అరుగుదల (డ్యామేజీ) జరిగితే అది సర్వైకల్ స్పాండిలోసిస్కు దారితీయవచ్చు. చికిత్స ప్రక్రియలివి... సర్వైకల్స్పాండిలోసిస్ కండిషన్ కనిపించిన రోగుల్లో జీవనశైలిలో మార్పులు తప్పనిసరిగా ప్రభావం చూపుతాయి. దాంతోపాటు ఫిజియోథెరపీ ప్రక్రియ వల్ల గణనీయమైన మెరుగుదల కనిపించేందుకు అవకాశం ఉంది. ఇక కొన్ని నాన్స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎన్ఏఐడీ) అని చెప్పే నొప్పి నివారణ మందులు వాడటం ఈ చికిత్సల్లో ఒక భాగం. వీటితోపాటు శస్త్రచికిత్స ద్వారా ఎముకలు అరిగిన, తొలగిన ప్రాంతంలో సరిచేయడం చివరగా చేసే చికిత్స ప్రక్రియ. జీవనశైలి మార్పులతో... మనం పనిచేసే చోట మెడపై తీవ్రమైన ఒత్తిడి పడకుండా చూసుకోవడం ప్రధానం. నిద్రపోయేప్పుడు, కూర్చుని ఉన్నప్పుడు తలను సరైన భంగిమలో ఉంచడం, మెడ కండరాలపై అసమతౌల్యంగా బరువు పడుతుంటే నివారించడం వంటివి జీవనశైలిలో మార్పులు. గంటలకొద్దీ కూర్చుని పనిచేసే సాఫ్ట్వేర్ వంటి వృత్తుల్లో ఉన్నవాళ్లు తమ తల బరువు మెడపై అసహజమైన రీతిలో పడుతుంటే దాన్ని నివారించడం కూడా ముఖ్యం. ఫిజియోథెరపీ... మెడ కండరాలకు వ్యాయామాన్ని ఇవ్వడం ద్వారా వాటిని ఆరోగ్యకరంగా ఉంచుకోవడం మంచిది. దీనివల్ల వయసు పెరగడం వల్ల వెన్నెముక అరుగుదల ప్రక్రియ వేగంగా జరగకుండా చూడవచ్చు. ఫలితంగా ఈ అరుగుదలతో వచ్చే స్పాండిలోసిస్ అంత త్వరగా రాదు. కాబట్టి మెడ కండరాలకు వ్యాయామం అవసరం. ఇక ఈత వల్ల వెన్నెముకతోపాటు అన్ని కండరాలకూ తగినంత వ్యాయామం లభిస్తుంది. ఇలా వెన్నెముకతో పాటు మెడ కండరాలకు వ్యాయామం అందించేందుకు ఫిజియో థెరపీ ఉపయోగిస్తుంది. ఇందులోనూ రెండు దశల్లో ఫిజియోథెరపీ చికిత్స జరుగుతుంది. మొదటిది నొప్పి నివారణకు ఐఎఫ్టీ, అల్ట్రాసోనిక్ థెరపీ లేదా షార్ట్వేవ్ డయాథెర్మీ, రెండో దశలో మెడ, చేతులు, కాళ్లకు (లింబ్) ఎక్సర్సైజ్లు. ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ (ఐఎఫ్టీ): ఈ ప్రక్రియలో ఒక రకం విద్యుత్తరంగాలను (వీటిని) ఉపయోగించి నొప్పి నివారణ చేస్తారు. శరీరంపై ఏదైనా గాటు లేదా గాయం ఉన్నవారికి లేదా పుండు వంటివి ఉన్నవాళ్లకు, గర్భిణులకు వీటిని ఉపయోగించరు. అల్ట్రాసోనిక్ థెరపీలో శబ్దతరంగాలను ఉపయోగించి చికిత్స చేస్తారు. ఇక షార్ట్వేవ్ తరంగాలను ఉపయోగించి కూడా నొప్పి నివారణ చేస్తారు. ఇది స్వల్పకాలికంగా జరిగే చికిత్స. ఇక రెండోదశలో మెడ, చేతులు, కాళ్లకు నిత్యం వ్యాయామం చేయించడం, దీర్ఘకాలం పాటు చేయించడం ద్వారా వాటిని మరింత దృఢతరం అయ్యేలా చూసి నొప్పి నివారణ జరిగేలా చూస్తారు. సాధారణంగా సర్వైకల్ స్పాండిలోసిస్కు ఫిజియోథెరపీ ప్రధానమైన చికిత్స ప్రక్రియలా పరిగణిస్తారు. సర్వైకల్ కాలర్: తల బరువు అరిగిన మెడ వెన్నెముకలు (సీ1 టు సీ7) వరకు పడుతుంటే ఆ బరువును వాటిపై పడకుండా చేసే ఒక ఉపకరణం ‘సర్వైకల్ కాలర్’. అయితే ఇది అంతగా ఉపయోగపడదు కూడా. పైగా ఈ ఉపశమనం చాలా తాత్కాలికం మాత్రమే కావడంతో కొందరు డాక్టర్లు దీన్ని సూచించరు కూడా. దానికి కారణాలూ ఉన్నాయి. ఉదాహరణకు సర్వైకల్ కాలర్ను కొన్ని సందర్భాల్లో నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు కొంతకాలం పాటు ఉపయోగిస్తారు. నొప్పి నుంచి ఉపశమనం కలగడం వల్ల అలా అదేపనిగా దాన్నే ఉపయోగిస్తూ ఉండటం వల్ల మెడ కండరాలు బలహీనపడి దానిపైనే పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి రావచ్చు. అందుకే అది చాలాకాలం ఉపయోగించడం అంతగా సరికాదు. సర్వైకల్ ట్రాక్షన్: నరం దెబ్బతిన్నదని తెలిసినప్పుడు సర్వైకల్ ట్రాక్షన్ను అమర్చకూడదు. కేవలం ఎలాంటి నర్వ్ డ్యామేజీ లేదనుకున్నప్పుడే నొప్పి ఉన్న కొందరిలో దీన్ని ఉపయోగించి, ఉపశమనం పొందవచ్చు. శస్త్రచికిత్స... సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్లో... ఇతరత్రా ప్రత్యామ్నాయ మార్గాలు, సాంత్వన ప్రక్రియలు అవలంబించి కనీసం ఆరు నుంచి పన్నెండు వారాలు గడిచాక కూడా తగినంత ఉపశమనం లేకపోతే అప్పుడు శస్త్రచికిత్సకు వెళ్లాల్సి ఉంటుంది. శస్త్రచికిత్సలు కంఠం ముందు భాగం నుంచీ కొన్ని, మెడ వెనక భాగం నుంచి చేసేవి... ఇలా రకరకాలుగా ఉంటాయి. డిస్క్ లేదా ఎముకల అరుగుదలతో నరాలమీద కలిగే ఒత్తిడి స్థానాన్ని బట్టి ఎటువైపు నుంచి శస్త్రచికిత్స చేయాలన్న విషయాన్ని నిర్ధారణ చేస్తారు. అయితే శస్త్రచికిత్స ఎటువైపునుంచి జరిగినా చివరిలక్ష్యం మాత్రం రోగికి నొప్పి నివారణ కలిగేలా చూడటమే. శస్త్రచికిత్స ముందువైపు నుంచి జరిగితే (అది చాలా చిన్న గాటుతో) డిస్కెసెక్టమీ రూపంలో చేస్తారు. ఐదు నుంచి ఎనిమిది మిల్లీమీటర్ల గాటు పెట్టి డిస్క్ను తొలగిస్తారు. రోగి తుంటిఎముక నుంచి తొలగించిన భాగాన్ని (మనం చేత్తో తడిమినప్పుడు తుంటి వద్ద పొడుచుకు వచ్చినట్లు కనిపించే ఎముక) ఆ డిస్క్ను తొలగించిన చోట అమరుస్తారు. లేదా దీనికి బదులు డిస్క్ తొలగించిన ఆ గ్యాప్లో టైటానియం లోహంతో చేసిన ఒక డిస్క్ను అమర్చుతారు. దీన్ని ఎలా అమర్చాలన్న దాన్ని రోగికి అవసరమేమిటన్న అంశంపై డాక్టర్లు నిర్ధారణ చేస్తారు. అంటే.. ఇక్కడ జరిగే ప్రక్రియ ఒక్కటే. గతంలో ఎముకల భారం పడే డిస్క్ భాగాన్ని తొలగించి శస్త్రచికిత్స తర్వాత మెడ కదలికలతో పడే ఒత్తిడి అక్కడి చాలా కండరాలు ఆ భారాన్ని తీసుకునేలా చూస్తారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలివి... సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలతో పాటు స్పర్శజ్ఞానం కోల్పోయినట్లు అనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించడం తప్పనిసరి. సాధారణ ఎక్స్–రే వల్ల సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి తెలిసిపోతుంది. అదే సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ అయితే ఎమ్మారై పరీక్షల వల్ల నిర్దిష్టంగా డిస్క్లు, వెన్నుపాము, నరాల పొజిషన్ వెన్నుపాము వ్యవస్థపై ఎముకల అరుగుదల, డిస్క్ల అరుగుదల వల్ల పడుతున్న ప్రభావం... ఇవన్నీ ఎమ్మారైలో స్పష్టంగా తెలుస్తుంది. సీటీ స్కాన్ అయితే కాస్తంత పరిమితమైన వివరాలే తెలుస్తాయి. అవి కూడా కొందరు పేషెంట్లలోనే కొంతమేరకే తెలుస్తుంది. డాక్టర్నుకలవాల్సిందెప్పుడు...? మెడ నొప్పి వచ్చినప్పుడు సాధారణంగా కొందరు పెయిన్కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం తప్పే అయినా... అలా పెయిన్కిల్లర్ వేసుకున్నా ఆగకుండా అదేపనిగా నొప్పి వస్తున్నప్పుడు, ఆ నొప్పి వారం రోజుల తర్వాత కూడా తగ్గకపోతే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ కారణంగా వచ్చే అని అనుమానించాల్సి ఉంటుంది ∙నొప్పి ఒకే చోట లేకుండా చురుక్కుమంటూ భుజానికిగాని, ఇతర అవయవాలకు గాని పాకుతూ ఉన్నట్లుగా అనిపించడం కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణమే ∙పై లక్షణాలతో పాటు నీరసంగా ఉండి చేతులు గాని, కాళ్లు గాని తిమ్మిరి పట్టినట్లుగా ఉండవచ్చు ∙కాళ్లు లేదా చేతులు బిగదీసినట్లుగా (స్టిఫ్నెస్తో) ఉండవచ్చు ∙మెడలో ఇబ్బందిగా (టెండర్నెస్) కూడా ఉండవచ్చు ∙శరీరంలో ఎక్కడైనా స్పర్శజ్ఞానం కోల్పోయినట్లుగా అనిపిస్తే... ఈ లక్షణాలన్నీ సర్వైకల్ స్పాండిలోసిస్ను సూచిస్తాయి. సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలివి... మెడ నొప్పిగా ఉంటుంది. మెడను మునుపటిలా ఫ్రీగా తిప్పడం సాధ్యం కాకపోవచ్చు ∙మన దేహంలోని వివిధ అవయవాలను నియంత్రించి నరాలపై ఒత్తిడి పడటం వల్ల ఆ అవయవాలు సైతం నొప్పికి గురి కావడం, ఉదాహరణకు భుజం, మోచేయి, చేతి వేళ్లు లాంటివి ∙చేయి, వేళ్లు, కొన్ని సందర్భాల్లో కాళ్లు తిమ్మిరి పట్టినట్లు అనిపిస్తుంటుంది ∙పరిస్థితి తీవ్రమైన కొందరిలో కాళ్లు బిగదీసుకుపోయినట్లు (స్టిఫ్నెస్) కూడా అనిపించవచ్చు ∙నడవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది ∙కొందరిలో ఈ లక్షణాలు నెమ్మది నెమ్మదిగా క్రమంగా వస్తే మరికొందరిలో ఒక్కసారిగా కనిపించవచ్చు. డాక్టర్ టి.దశరథ రామారెడ్డిసీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్,యశోద హాస్పిటల్స్,సోమాజిగూడ, హైదరాబాద్ -
అభాగ్యుడిని ఆదుకోరూ !
సాక్షి, తుర్కపల్లి (ఆలేరు) : తుర్కపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన హన్మంత్ తొలుత వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. దిగుబడులు ఆశాజనకంగా లేకపోవడంతో కుటుంబ పోషణ నిమిత్తం 2004లో ఆటో కొని మండల కేంద్రం నుంచి స్వగ్రామానికి కిరాయికి నడుపుకునేవాడు. కాలక్రమంలో వ్యవసాయం పూర్తిగా కుంటు పడడంతో ఆటోనే జీవనధారంగా చే సుకుని బతుకుబండిని ముందుకు సాగించాడు. జీవనం సంతోషంగా సాగుతున్న తరుణంలో.. హన్మంత్ ఆటో నడుపుకుంటూ కుటుంబంతో సంతోషంగా సాగిపోతున్న తరుణంలో అనుకోని ఉపద్రవం వచ్చిపడింది. అప్పటి వరకు ఎటువంటి శారీరక ఇబ్బందులు లేని హన్మంత్కు 2017లో హఠాత్తుగా తీవ్రమైన వెన్నునొప్పి వచ్చి కుప్పకూలిపోవడంతో జీవితం అంధకారమయమైంది. ఆరునెలల పాటు వైద్యం హన్మంత్ రెండు కాళ్లు కదపలేని స్థితి, నడుము కింది భాగం పూర్తిగా స్పర్శ కోల్పోయాడు. దీంతో పాటు వెన్నుకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తడంతో హైదరాబాద్లోని ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రిల్లో వైద్యం అందించాల్సిన పరిస్థితి. చేతిలో ఉన్న డబ్బుతో వైద్యం అందించినా ఫలితం లేదు. పనిచేయని రెండు కాళ్లు నడుం పై భాగం నుంచి కాళ్లు పూర్తిగా స్పర్శ కోల్పోవడంతో మల, మూత్ర విసర్జన కూడా మంచంవద్దే చేయాల్సిన పరిస్థితి. చేతిలో డబ్బులు లేకపోవడంతో ఎక్కడ ఈ వ్యాధికి ఉచితంగా వైద్యం చేస్తారంటే అక్కడికి తన భర్త హన్మంత్ను తీసుకువెళ్లి వైద్యం చేయిస్తుంది. పిల్లల చదువులకు తీవ్ర ఇబ్బందులు హన్మంత్ కుమారుడు మేడ్చల్ జిల్లా కీసరలో చదువుతున్నాడు ,ప్రస్తుతం కూతురు మనోజ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబ ఇంటి పెద్ద మంచానికే పరిమితమవడంతో ఆర్థిక పరిస్థితులు ఛిన్నాభిన్నమై పిల్లల చదువులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అనిత భర్తకు సపర్యలు చేసుకుంటు గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ బతుకుపోరాటం సాగిస్తోంది. ఎకరం పొలం విక్రయించి.. భర్త ఉన్నట్టుండి మంచానికే పరిమితంకావడంతో హన్మంత్ భార్య అనిత తట్టుకోలేకపోయింది. ఉన్న ఎకరం భూమిని విక్రయించి సుమారు రూ. 10లక్షలకు పైగా భర్తకు వైద్యానికి ఖర్చుచేసింది. అయినా భర్త కోలుకోకపోవడంతో కుమిలిపోతోంది. ఇంకా ఖరీదైన వైద్యం చేయాలని డాక్టర్లు సూచించడంతో బంధువుల వద్ద అప్పు చేసింది. అయినా పరిస్థితిలో మార్పు లేదు. ఖరీదైన వైద్యం చేస్తే తప్ప ఏమీ చేయలేయని డాక్టర్లు సూచిస్తుండడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. -
సయాటికాకు చికిత్స ఉందా?
నా వయసు 45 ఏళ్లు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటాను. నడుము నొప్పి ఎక్కువై ఎమ్మారై తీయిస్తే డిస్క్బల్జ్తో పాటు సయాటికా ఉందని అన్నారు. హోమియో వైద్యం ఉంటుందా? – వెంకటరామ్, నాగాయలంక ఈ రోజుల్లో సయాటికా అనే పదాన్ని వినని వారుండరు. ఈ వ్యాధి బాధితులు తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు. సయాటికాను త్వరగా గుర్తించి సరైన సమయంలో ఎలాంటి దుష్ప్రభావాలు లేని హోమియో చికిత్స చేయించుకోవడం ముఖ్యం. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, ఫిజియోథెరపీ, హోమియో సంపూర్ణ చికిత్సతో సయాటికా సమస్యను శాశ్వతంగా దూరం చేయవచ్చు. శరీరంలో అన్నిటికంటే పెద్దది, పొడవాటి నయం వీపు కిందిభాగం నుంచి పిరుదుల మీదుగా కాలు వెనక భాగంలో ప్రయాణిస్తుంది. దీన్ని సయాటికా నరం అంటారు. ఏదైనా కారణాల వల్ల ఈ నరం మీద ఒత్తిడి పడ్డప్పుడు ఈ నరం ప్రయాణించే మార్గంలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే... వీపు కిందిభాగం నుంచి మొదలై, తొడ, కాలివెనక భాగం, మడిమల వరకు ఆ నొప్పి పాకుతూ ఉన్నట్లుగా వస్తుంటుందన్నమాట. నొప్పితోబాటు తిమ్మిర్లు, స్పర్శ తగ్గడం, మంటలు, నడకలో మార్పు రావడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఈ సమస్యనే సయాటికా అని వ్యవహరిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా 62% మంది ఈ సమస్యతో విధులకు గైర్హాజరవుతుంటారు. కారణాలు నర్వ్ కంప్రెషన్ : నర్వ్ రూట్ ప్రెస్ అవడం వల్ల నొప్పి వస్తుంది. స్పైనల్ డిస్క్ హర్నియేషన్: ఎల్4, ఎల్5 నరాల మూలాలు ఒత్తిడికి గురై సరైన పొజిషన్స్లో వంగక పక్కకు జరగడం వల్ల సయాటికా నొప్పి వస్తుంది. పెరిఫార్మిస్ సిండ్రోమ్: దెబ్బలు, గాయాలు తగిలినప్పుడు పెరిఫార్మిస్ కండరం నర్వ్రూట్ను ప్రెస్ చేస్తుంది. దీనివల్ల సయాటికా నొప్పి వస్తుంది. సాక్రోఇలియక్ జాయింట్ డిస్క్ ఫంక్షన్: శారీరక శ్రమ, వ్యాయామం లేక కీలు పనిచేయనప్పుడు సయాటికా రావచ్చు, ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీ చివరినెలలో పిండం బరువు పెరిగి నర్వ్రూట్ ప్రెస్ అవ్వడం వల్ల సయాటికా నొప్పి వస్తుంది. పరీక్షలు: ఎక్స్–రేతో పాటు ఎమ్మారై స్కాన్తో డిస్క్హెర్నియేషన్, డిస్క్ప్రొలాప్స్ నిర్ధారణ, ఏ నర్వ్రూట్ ఎక్కడ కంప్రెస్ అయ్యిందో నిర్ధారణ చేయవచ్చు. నొప్పి వస్తే ఏదో ఒక మాత్ర వేసుకుంటే తగ్గిపోతుందని నిర్లక్ష్యం చేసేవారు చాలామంది ఉంటారు. నొప్పి నివారణ మాత్రలు తరచూ వేసుకోవడం వల్ల సైడ్ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జీర్ణకోశవ్యవస్థకు సంబంధించిన వ్యాధులు అసిడిటీ, అల్సర్స్ రావచ్చు. చికిత్స: సయాటికా నొప్పికి, వెన్నుపూస సమస్యలకు హోమియోపతిలో మంచి చికిత్స ఉంది. వైద్యపరీక్షల ఆధారంగా సయాటికా నొప్పికి కారణాలను తెలుసుకుంటారు. దాన్నిబట్టి రోగి శారీరక, మానసిక లక్షణాలను విశ్లేషించి, రోగలక్షణాలూ, మూలకారణాలను బట్టి హోమియో మందులను సూచిస్తారు. సాధారణంగా రస్టాక్స్, కిలోసింథ్, రోడోడెండ్రాన్, కాస్టికమ్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన వైద్యనిపుణుల పర్యవేక్షణలో హోమియో మందులు వాడితే సయాటికా సమస్య శాశ్వతంగా నయమవుతుంది.డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా,ఎండీ (హోమియో),స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
ఈ సమయంలో ఎందుకు వస్తుంది?
నేను ప్రెగ్నెంట్. ఎప్పుడూ లేనిది నాకు వెన్నునొప్పి వస్తోంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఇది సాధారణమేనని నా ఫ్రెండ్ చెప్పింది. ఈ సమయంలో వెన్నునొప్పి ఎందుకు వస్తుంది? నివారణ చర్యలు ఏమిటో వివరించగలరు? – జె.రంజని, తుని గర్భం దాల్చిన తర్వాత శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మొదటి మూడు నెలల్లో హార్మోన్ల మార్పుల వల్ల, ప్రొజెస్టెరాన్ హార్మోన్ ప్రభావం వల్ల నడుము కండరాలు లిగమెంట్ కొద్దిగా వదులయ్యి నడుం నొప్పి ఉంటుంది. నెలలు గడిచేకొద్ది, గర్భాశయంలో శిశువు పెరిగేకొద్ది గర్భాశయం సాగి, దాని బరువుతో పాటు తల్లి బరువు వెన్నుపూస మీద పడి, లాగినట్లు ఉండి, నడుము నొప్పి వస్తుంది. నెలలు నిండే కొద్ది శరీరం కాన్పుకోసం సంసిద్ధమవుతుంది. ఈ సమయంలో పొత్తికడుపు కండరాలు, వెన్నుపూస జాయింట్లు వదులు అవుతూ ఉండటం వల్ల నడుము నొప్పి ఇంకా పెరుగుతుంది. నడుము నొప్పి ఉన్నప్పుడు చిన్నగా వాకింగ్, చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యడం వల్ల, కండరాలు గట్టిపడతాయి. అలాగే నొప్పిని తట్టుకొనేశక్తి లభిస్తుంది. ఉద్యోగం చేసే మహిళలు, సుదీర్ఘంగా కూర్చొని ఉండకుండ మధ్య మధ్యలో లేచి తిరగడం, బాగా వంగి కూర్చోకుండా, వెన్నుపూసకి సపోర్ట్ తీసుకుని కూర్చుని పని చెయ్యడం మంచిది. కొద్దిగా వేడినీళ్లలో మసాజ్ చేసుకోవచ్చు. మరీ నొప్పి ఎక్కువగా ఉంటే ఎప్పుడైనా ఒకసారి నొప్పి నివారణ ఆయింట్మెంట్స్, స్ప్రేలు వాడవచ్చు. మరీ ఎక్కువగా ఉంటే ఎప్పుడైనా పారాసెటిమాల్ మాత్ర వాడి చూడవచ్చు. అలాగే విశ్రాంతి తీసుకుంటే కూడా నొప్పి కొద్దిగా తగ్గుతుంది. నొప్పి బాగా తీవ్రంగా ఉంటే, డాక్టర్ని సంప్రదించడం తప్పనిసరి. నా వయసు 22 సంవత్సరాలు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. మాకు హోటల్ ఉంది. దీనిలో గ్యాస్స్టవ్తో పాటు కట్టెల పొయ్యి కూడా ఉపయోగిస్తుంటాం. కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగను పీల్చడం వల్ల గర్భిణులకు మంచిది కాదని ఒక్కరిద్దరన్నారు. ఇది నిజమేనా? – ఆర్.సంధ్య, మంగపేట కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగలో కార్బన్మోనాక్సైడ్ వంటి హాని కలిగించే కెమికల్స్ ఉంటాయి. వీటిని గర్భిణి రోజూ పీల్చడం వల్ల తల్లికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. దాంతో కడుపులోని బిడ్డకు ఆక్సిజన్ సరఫరా కొద్దికొద్దిగా తగ్గుతుంది. దీనివల్ల శిశువు బరువు సరిగా పెరగకపోవడం, నెలలు నిండకుండా కాన్సులు జరగటం, బిడ్డ పుట్టిన తర్వాత, కడుపులో ఉన్నప్పుడు బ్రెయిన్కి సరిగా ఆక్సిజన్ అందకపోవటం వల్ల, మానసిక ఎదుగుదలలో లోపాలు వంటి ఎన్నో సమస్యలు ఎదురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కట్టెలపొయ్యి ఉన్నప్పుడు, దాని నుంచి వచ్చే పొగ సరిగా బయటకు వెళ్లేటట్లు చూసుకోవాలి. (వెంటిలేషన్, చిమ్నీలు సరిగా ఉండాలి) లేకపోతే పొగ ఎక్కువ పీల్చుకునే అవకాశాలు, అలాగే సమస్యలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానం కోసం తీసుకునే ప్రొజెస్టెరాన్ హార్మోన్ చికిత్స వల్ల జన్మించే పిల్లలకు ఆటిజం వస్తుందని చదివాను. ఇది ఎంతవరకు నిజం. ప్రొజెస్టెరాన్ హార్మోన్ చికిత్స గురించి వివరంగా తెలియజేయగలరు. – పి.సునీత, నెల్లూరు ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ మహిళలలో అండాశయాల నుంచి విడుదల అవుతుంది. ఇది సరైన పాళ్లలో విడుదల కాకపోతే పీరియడ్స్ క్రమం తప్పడం జరుగుతుంది. అలాగే గర్భం నిలబడటంలో ఇబ్బంది కలుగుతుంది. ప్రొజెస్టెరాన్ హార్మోన్ నెలలో రెండవ సగం రోజుల నుంచి ఎక్కువగా విడుదల అయ్యి గర్భాశయంలోని పొరను పెరిగే విధంగా చేస్తుంది. గర్భాశయ పొర సరిగా ఆరోగ్యంగా పెరగడం వల్ల, పిండం గర్భాశయంలోపల అతుక్కుని, అందులో పెరగడానికి ఉపయోగపడుతుంది. ఆ నెలలో ప్రెగ్నెన్సీ రానప్పుడు ప్రొజెస్టెరాన్ తగ్గిపోయి, గర్భాశయం పొర విడిపోయి, పీరియడ్ వచ్చేస్తుంది. కొన్ని కారణాల వల్ల కొందరిలో ప్రొజెస్టెరాన్ హార్మోన్ సరైన మోతాదులో విడుదల కాదు, అలా కానప్పుడు గర్భం రాకపోవడం, గర్భం పెరగకపోవడం, అబార్షన్లు అవ్వడం, నెలలు నిండకుండా కాన్పు రావడం వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. పీరియడ్స్ సరిగా రాకుండా గర్భం దాల్చిన వారికి, సంతానలేమి చికిత్స తీసుకుని గర్భం దాల్చిన వారికి, ముందు అబార్షన్లు అయినవారికి, ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉపయోగపడవచ్చు అనే అంచనాతో మొదటి రెండుమూడు నెలలు ప్రొజెస్టెరాన్ హార్మోన్స్తో చికిత్సను ఇవ్వడం జరుగుతుంది. ఇది కొందరికి ఉపయోగపడవచ్చు. మరికొందరికి ఉపయోగపడకపోవచ్చు. ఇవి టాబ్లెట్, క్రీమ్, ఇంజెక్షన్స్ వంటి రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ప్రొజెస్టెరాన్ హార్మోన్, ప్రెగ్నెన్సీలో వాడటం వల్ల, పుట్టబోయే పిల్లల్లో ఆటిజం వస్తుంది అనేదానికి పరిశోధనల్లో నిర్ధారణ అవ్వలేదు. ఆటిజం రావటానికి కొన్ని హార్మొన్ల లోపం, జన్యుపరమైన కారణాలు, తల్లి మానసిక స్థితి వంటివి ఎన్నో కారణాలు కావచ్చు. మా ఫ్రెండ్ ప్రెగ్నెంట్. చిన్నచిన్న విషయాలకే స్ట్రెస్కు గురయ్యే స్వభావం ఆమెది. ఇప్పటి వరకు ఈ విషయాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదుగానీ.... మొన్నో వార్త చదివినప్పటి నుంచి భయం పట్టుకుంది. స్ట్రెస్కు గురయ్యే గర్భిణులకు ఎయిర్ పొల్యూషన్, స్మోకింగ్ కంటే ఎక్కువ ప్రమాదం ఉంటుందనేది ఆ వార్తలో ఉంది. ఇది ఎంత వరకు నిజం? – శ్వేత, కొలనుకొండ గర్భం దాల్చిన తర్వాత, తొమ్మిది నెలలు, తల్లి మానసికంగా, శారీరకంగా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటూ, మానసిక ఒత్తిడి లేకుండా ఉంటే గర్భంలో శిశువుతో పాటు తల్లిలో కూడా బీపీ, షుగర్, ఇంకా ఇతర కాంప్లికేషన్స్ చాలావరకు లేకుండా ఉండి, పండంటి బిడ్డ పుట్టే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడో ఒకసారి మానసిక ఒత్తిడి ఫర్వాలేదు కానీ, క్రానిక్ స్ట్రెస్.. ఎక్కువ కాలంపాటు ఉండే ఒత్తిడి వల్ల, బిడ్డ బరువు ఎక్కువ పెరగకపోవటం, నెలలు నిండకుండా కాన్పు జరగటం, కాన్పు తర్వాత బిడ్డ మానసిక ఎదుగుదలలో కొద్దిగా లోపాలు, తల్లిలో పోస్ట్పార్టమ్ డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు గర్భిణీ సమయంలో టెన్షన్ లేకుండా, మనసుని ఆహ్లాద కరంగా ఉంచుకోవటం మంచిది. దీనికోసం మెడిటేషన్, ప్రాణాయామం, చిన్న చిన్న యోగాసనాలు, నడక, మ్యూజిక్ వినడం వంటివి చెయ్యడం మంచిది. అలానే కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. - డా‘‘ వేనాటి శోభ ,బర్త్రైట్ బై రెయిన్బో ,హైదర్నగర్ హైదరాబాద్ -
నెట్స్లో శ్రమించిన కోహ్లి
నాటింగ్హామ్: మూడో టెస్టుకు ముందు భారత క్రికెట్ అభిమానులకు ఉపశమనం కలిగించే పరిణామం. రెండో టెస్టు సందర్భంగా వెన్నునొప్పితో ఇబ్బంది పడిన కెప్టెన్ విరాట్ కోహ్లి... పూర్తిగా కోలుకున్నట్లే కనిపిస్తున్నాడు. మధ్యమధ్యలో ఫిజియోల పర్యవేక్షణలో గురువారం నెట్స్లో అతడు తీవ్రంగా బ్యాటింగ్ సాధన చేశాడు. స్లిప్ ఫీల్డింగ్కు వెళ్లి క్యాచ్లు పట్టాడు. ‘కోహ్లి ఫిట్నెస్ మెరుగైంది. నెట్స్లో సౌకర్యంగా కదిలాడు. మ్యాచ్ సమయానికి మరింతగా సంసిద్ధమవుతాడు’ అని కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇంగ్లండ్ పిచ్లు బ్యాట్స్మెన్కు క్లిష్టంగా ఉన్నాయని, అలాంటప్పుడే అసలైన ఆట బయటకు వస్తుందని రవిశాస్త్రి అన్నాడు. ఆఫ్స్టంప్ను చూసుకుంటూ, ఆడలేని బంతులను వదిలేస్తూ, చెత్త బంతుల కోసం వేచి చూడాలని సూచించాడు. రహానే ఫామ్ గురించి ప్రస్తావించగా... రెండు జట్ల బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మానసిక స్థైర్యమే కీలక పాత్ర పోషిస్తుందని, ఏ ఒక్కరినో వేలెత్తి చూపలేమని స్పష్టం చేశాడు. లార్డ్స్ టెస్టులో రెండో స్పిన్నర్గా కుల్దీప్ను ఆడించడం పొరపాటేనని... మరో పేసర్ అయితే ఉపయోగకరంగా ఉండేదని శాస్త్రి అంగీకరించాడు. వర్షం కారణంగా మ్యాచ్ ఐదో రోజుకు వెళ్లి స్పిన్ తిరుగుతుందని భావించి కుల్దీప్ను తీసుకున్నట్లు వివరించాడు. ఓటమి అనంతరం... ‘గతంలోనూ ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడి గెలిచినందున మీపై మీరు నమ్మకం కోల్పోవద్దు’ అని మాత్రమే ఆటగాళ్లకు సూచించినట్లు రవిశాస్త్రి పేర్కొన్నాడు. మరోవైపు... కోహ్లి గాయం నుంచి కోలుకుంటే మరింత విజృంభించి ఆడతాడని ఇంగ్లండ్ కోచ్ ట్రెవర్ బేలిస్ తమ జట్టు సభ్యులకు హెచ్చరికతో కూడిన సూచన చేశాడు. -
మహిళకు టెస్టులు చేసి డాక్టర్లు షాక్
బీజింగ్ : వెన్నునొప్పి వచ్చిందని హాస్పిటల్కు వెళ్లిన ఓ 56 ఏళ్ల మహిళకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం డాక్టర్లు షాకయ్యారు. ఆమె కిడ్నీలో వేల సంఖ్యలో రాళ్లు ఉన్నాయని చెప్పడంతో మహిళా పేషెంట్ సైతం కంగుతిన్నారు. ఈ ఘటన చైనాలోని జియాంగ్జు హాస్పిటల్లో జరిగింది. షాంగైకి చెందిన మహిళ ఝాంగ్(56)కు గత కొంతకాలం నుంచి వెన్నునొప్పి బాధిస్తోంది. జ్వరంతో పాటు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ కోసం చంగ్జౌలోని వుజిన్ హాస్పిటల్కు వెళ్లిన మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు షాకయ్యారు. కుడి మూత్రపిండంలో(రైట్ కిడ్నీ) వేల సంఖ్యలో రాళ్లున్నాయని గుర్తించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు దాదాపు 3000 రాళ్లను తొలగించేశారు. అయితే ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదిస్తే ఎలాంటి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తవని వైద్యులు సూచించారు. అయితే కిడ్నీలో రాళ్లు వచ్చిన పేషెంట్లలో భారతీయుడిదే ఆల్ టైమ్ రికార్డ్ అన్న విషయం తెలిసిందే. గిన్నిస్ రికార్డుల ప్రకారం మహారాష్ట్రకు చెందిన ధన్రాజ్ వాడిలే కిడ్నీ నుంచి రికార్డు స్థాయిలో 1,72,155 రాళ్లను శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు. -
గౌట్తో ఎంతో బాధ..
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 45 ఏళ్లు. కొన్నాళ్లుగా కాలి బొటనవేలు వాచింది. విపరీతమైన నొప్పి ఉంది. డాక్టర్గారు గౌట్ అని చెప్పారు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – ఎమ్. అహ్మద్బాషా, కందుకూరు గౌట్ అనేది ఒక రకం కీళ్లవ్యాధి. మన శరీరంలో ‘యూరిక్ యాసిడ్’ జీవక్రియలు సరిగా లేనందున ఇది వస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్ అనే పదార్థాల విచ్ఛిన్నంలో యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టమౌతాయి. ఆ కండిషన్నే ‘గౌట్’ అంటారు. కారణాలు: ∙ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం ∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు. లక్షణాలు:తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి.చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది.మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది.ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి సరైన చికిత్స తీసుకోకపోతే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. నివారణ / జాగ్రత్తలు: మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగా, పేగుల వంటి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. చికిత్స: హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ మూత్రంలో మంట... తగ్గేదెలా? నా వయసు 37 ఏళ్లు. మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు మంటగా ఉంటోంది. డాక్టరుకు ఈ సమస్య చెప్పుకోడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. దయచేసి నా సమస్యకు హోమియోలో పరిష్కారం చెప్పండి. – సోదరి, కరీంనగర్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. మహిళల్లో ఇవి చాలా సాధారణంగా వస్తుంటాయి. జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతివారూ యూరినరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడతారు. కారణాలు: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో దాదాపు 90 శాతం కేసుల్లో ఈ–కొలై అనే బ్యాక్టీరియా ప్రధానంగా కారణమవుతుంది. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అందుకే హెచ్ఐవీ/ఎయిడ్స్, డయాబెటిస్, క్యాన్సర్తో బాధపడేవారికి తరచూ ఈ ఇన్ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే మహిళల్లో, ప్రోస్టటైటిస్తో బాధపడే పురుషుల్లో సులభంగా ఈ ఇన్ఫెక్షన్లు వస్తాయి. లక్షణాలు: మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంటు ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం. హోమియోపతి చికిత్స: రోగిలో మళ్లీ మళ్లీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయడానికి హోమియో మందులు తోడ్పడతాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యా«ధిలక్షణాలు, వ్యక్తి తత్వాన్ని బట్టి – బెల్లడోనా, ఎపిస్, క్యాంథరిస్, సరసాపరిల్లా వంటి మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ వెన్ను నొప్పి తగ్గుతుందా? నాకు విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. దీనికి హోమియోలో చికిత్స ఉందా? వివరించగలరు. – డి. బాలసుందరం, పెనుగంచిప్రోలు ఇటీవల వెన్నునొప్పి చాలా ఎక్కువ మందిలో కనిపిస్తున్న చాలా సాధారణమైన సమస్య. వెన్నుభాగంలో లిగమెంట్లు, కండరాలు, ఫేసెట్ జాయింట్లు ఒకదానితో ఒకటి అనుసంధానితమై శరీరానికి స్థిరతావన్ని ఇస్తాయి. మన రోజువారీ జీవితంలో శారీరకంగా ఎదురయ్యే ఎన్నో సమస్యలను తట్టుకొని నరాల మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా కాపాడుకోవడం వెన్నెముక ప్రధాన లక్షణం. అధికంగా బరువు ఎత్తడం, దించడం, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు, క్యాల్షియమ్ లోపం, విటమిన్ బి12, డీ3 లోపాలు, ఎముకల సాంద్రత తగ్గడం వంటివి వెన్నునొప్పికి కొన్ని కారణాలు. మనం ఏ పని చేయాలన్నా ప్రతిక్షణం మెడ, నడుములోని వెన్నుపూసలు పనిచేయాలి. అందుకే ప్రతి పదిమందిలో ఆరు నుంచి ఎనిమిది మంది వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. వెన్నుపూసలు అరిగినందువల్ల వెన్నునొప్పి వస్తుంది కాబట్టి మందులతో దాన్ని పరిష్కరించలేమనీ, ఆపరేషన్ అవసరమని చాలామందిలో ఒక అపోహ ఉంది. వెన్నునొప్పికి కారణమైన డిస్క్ బల్జ్, డిస్క్ కంప్రెషన్, నరాలమీద ఒత్తిడి పెరగడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. ఇలాంటి వెన్ను సంబంధమైన నొప్పులు వచ్చినప్పుడు... ఉదాహరణకు డిస్క్ బల్జ్ వల్ల నరాలమీద ఒత్తిడి పెరిగినప్పుడు తగ్గించడానికి హోమియోలో కోబాల్ట్ లాంటి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఇక మెడభాగంలో ఉండే వెన్నుపూసలు అరిగినప్పుడు వచ్చే నొప్పిని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. మెడ భాగంలో సి1 నుంచి సి7 వరకు ఉండే వెన్ను పూసలను సర్వైకల్ పూసలు అంటారు. ఇవి అరిగినప్పుడు వెన్నుపూసల కీళ్ల మధ్య భాగం తగ్గిపోవడం వల్ల డిస్క్బల్జ్ ఏర్పడటం, వెన్నుపూసల మధ్య రాపిడి పెరగడం వంటి కారణాల వల్ల మెడ భాగం నుంచి నొప్పి మొదలై చేతి వేళ్ల వరకు నొప్పి పాకుతూ ఉంటుంది. దాంతో పాటు తిమిర్లు, చేయి మొద్దుబారడం, మెడ ఫ్రీగా తిరగలేకపోవడం, మెడ పట్టివేసినట్లుగా ఉండటం వంటివి చూస్తుంటాం. ఇలాంటి వారికి కూడా యాసిడ్ఫాస్ అనే మందు బాగా పనిచేస్తుంది. ఇక మెడ, నడుము, వెన్నెముక నొప్పిలకు ఆస్కు్కలస్ హిప్, రస్టాక్స్, బ్రయోనియా ఆల్బ్, కాల్కేరియా ఫ్లోర్, హైపరికం, మహిళల్లో వచ్చే ఇలాంటి సమస్యలకే సిమిసిఫ్యూగా వంటివి అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
అమితాబ్కు మళ్లీ అస్వస్థత
సాక్షి, ముంబై : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (75) మళ్లీ ఆస్పత్రి పాలయ్యారు. శుక్రవారం సాయంత్రం ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. గత కొంతకాలంగా ఆయన జీర్ణాశయ సమస్యలతోపాటు మెడ, వెన్నెముక నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వెన్నెముక కింది భాగంలో నొప్పిగా ఎక్కువ కావటంతో ఆయన ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. ‘‘లుంబార్ (నడుము కింది భాగం) ప్రాంతంలో నొప్పిగా ఉన్నట్టు అమితాబ్ చెప్పారు. కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చి ఆపై డిశ్చార్జ్ చేశాం’’ అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇక సినిమాలపరంగా అమితాబ్ ప్రస్తుతం ‘102 నాటౌట్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత మరో సీనియర్ నటుడు రిషి కపూర్ తో ఆయన స్క్రీన్ పంచుకున్నారు. ఇందులో రిషి అమితాబ్కు కొడుకు పాత్రలో కనిపించబోతున్నారు. ఉమేష్ శుక్లా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఓ గుజరాతీ నాటిక ఆధారంగా రూపొందుతోంది. మే నెలలో ‘102 నాటౌట్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆ ఒక్క ఇంజెక్షన్ చాలు
రకరకాల కారణాలతో చాలామందిని వెన్నునొప్పి బాధిస్తుంటుంది. ఎప్పటికప్పుడు మాత్రలు మింగడం.. ఆ రోజు గడిపేయడం అంతే. అయితే అమెరికాలో జరిగిన తాజా పరిశోధన పుణ్యమా అని ఇకపై ఈ ఇబ్బంది తీరిపోనుంది. శరీరంలోని ఏ కణంలానైనా మారిపోగల సామర్థ్యమున్న మూలకణాలు కొన్నింటిని ఇంజెక్షన్ రూపంలో ఎక్కించుకుంటే మూడేళ్ల పాటు వెన్నునొప్పి దరి చేరదని ఈ కొత్త పరిశోధన. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో మెసోబ్లాస్ట్ అనే ఓ ఫార్మా కంపెనీ ఉంది. ఇటీవల వెన్నెముకలోని భాగాలు అరిగిపోయిన దాదాపు 100 మందికి మూలకణాలు అందించింది. వెన్నెముకలోని ఎముకల మధ్య ఉన్న ఖాళీల్లో ద్రవం పూర్తిగా ఇంకిపోయినప్పుడు చిన్నపాటి కదలికలకూ విపరీతమైన నొప్పి కలుగుతుంది. వారికి ఇతరుల ఎముక మజ్జలోంచి సేకరించిన మూలకణాలను ఎక్కించినప్పుడు వారిలో నొప్పి గణనీయంగా తగ్గిపోయినట్లు తెలిసింది. కొంతమందిలో దాదాపు రెండేళ్ల పాటు నొప్పి లేకపోగా.. కొంతమందికి సమస్య మూడేళ్ల తర్వాత గానీ తిరిగిరాలేదు. తాము పరిశోధనలు చేసిన వందమందిని ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు వెన్నెముకలోని సమస్యలు చాలా వరకూ తగ్గిపోయినట్లు తెలిసిందని మెసోబ్లాస్ట్ సీఈవో సిలివూ ఇటెస్కూ తెలిపారు. -
స్ట్రాంగ్ బ్యాక్
బ్యాక్ పెయిన్... ఒకప్పుడు ఉండేది అంటూ నడుము ఇప్పుడు హాయిగా చెప్పగలగాలి. వెన్ను నొప్పిని ‘గతం’లోని సమస్యగా మాత్రమే గుర్తు చేసుకోవాలనుకుంటే యోగాను మించిన మార్గం లేదు. ప్రస్తుత జీవనశైలి పుణ్యమాని ఆధునికులలో అత్యధికులను వేధిస్తున్న బ్యాక్ పెయిన్ని స్ట్రాంగ్బ్యాక్కి చేయడానికి... ఉపకరించే కొన్ని యోగాసనాలివి. ధనురాసనం నేలపై బోర్లాపడుకుని మోకాళ్ళని వంచి చేతుల్ని వెనక్కి తీసుకెళ్ళి కాలి చీలమండలాన్ని పట్టుకోవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకొని వదిలేస్తూ మోకాళ్ళని పైకెత్తుతూ రెండు కాళ్ళని, ఛాతీని పైకెత్తాలి. పొట్ట మాత్రమే నేలను తాకుతూ ఉంటుంది. శరీరం బరువు మొత్తం పొట్ట మీద ఉంటుంది. శరీరం ధనుస్సు మాదిరిగా ఉంటుంది. ముందు కాళ్ళను పైకెత్తుతూ, ఛాతీని పైకెత్తితే నడుము మీద ఒత్తిడి పడదు. కాళ్ళను పైకెత్తే క్రమంలో మోకాళ్ళను ఎడంగా ఉంచాలి. అప్పుడు ఆసనంలోకి వెళ్ళటం తేలిక అవుతుంది. సాధ్యమైనంత సేపు ఆసనంలో ఉండి నెమ్మదిగా ఛాతీ నేలకు ఆనించి తర్వాత కాళ్ళను నేలకు ఆనించి నిదానంగా బయటకు రావాలి. అర్ధ అధోముఖ శ్వాసాసన మార్జాలాసనములోలాగానే మోకాళ్ళ మీద ఉండి మోకాలు నుండి సీటు వరకూ (నడుము వరకూ) 90 డిగ్రీల కోణంలో ఉంచి వీపును ముందుకు బాగా స్ట్రెచ్ చేస్తూ, నుదురు లేదా గడ్డమును నేల మీద ఉంచి చేతులు రెండూ ముందుకు బాగా స్ట్రెచ్ చేస్తూ శ్వాసను సాధారణ స్థితిలో ఉంచి కనీసం 5 లేదా 10 శ్వాసల వరకూ అదే ఆసనంలో ఉండేటట్లయితే, డోర్సల్ స్పైన్కి, డెల్టాయిడ్ ట్రెపీజియస్ కండరాలకు తగినంత టోనింగ్ జరిగి అప్పర్ బ్యాక్కి పూర్తిగా రిలీఫ్ దొరుకుతుంది. వీపు నుంచి నడుం వరకూ ఉన్న భాగం మొత్తం రిలాక్స్ అవుతుంది. ప్రసారిత మార్జాలాసన వజ్రాసనంలో కూర్చున్న తరువాత (రెండు కాళ్ళు మడిచి కాలి మడమల మీద కూర్చోవాలి) అర చేతులు రెండూ ముందు వైపు నేల మీద ఉంచి మోకాళ్లు కింద ఉంచి నడుమును పూర్తిగా రిలాక్స్ చేయాలి. దీనిని మార్జాలాసనమని అంటారు. మార్జాలం అంటే పిల్లి. జంతుజాలములన్నింటిలో పిల్లికి చాలా ఫ్లెక్సిబుల్గా ఉండే వెన్నెముక ఉంది. ఈ ఆసనం చేయడం వల్ల వెన్నెముకకు మంచి రిలాక్సేషన్ వస్తుంది కనుక దీనిని మార్జాలాసనమని అన్నారు. ఈ స్థితిలో ఉండి శ్వాస తీసుకుంటూ ఎడమచేతిని ముందుకు, కుడికాలును వెనుకకు ఒకే సరళ రేఖలో ఉండేటట్లుగా సాగదీస్తూ ఉండి 3 లేదా 5 శ్వాసల తరువాత శ్వాస వదులుతూ కుడిమోకాలు క్రిందకు, ఎడమచేయి క్రిందకు తీసుకురావాలి. మళ్ళీ సీటు నడుము భాగాలను రిలాక్స్ చేస్తూ కొంచెం విశ్రాంతి తీసుకున్న తరువాత ఇదే ఆసనం రెండవవైపు కూడా చేయాలి. ఆపోజిట్ చేతిని, కాలుని స్ట్రెచ్ చేయడం వల్ల బ్యాలన్స్ చేయడంతో ఎక్కువ ఇబ్బంది ఉండదు. గమనిక: ఎవరికైనా మోకాలు సమస్య ఉన్నట్లయితే టర్కీ టవల్ని కానీ పలచ్చడి దిండును కాని మోకాళ్ల కింద పెట్టుకోవచ్చు. నడుము, సీటు, వెన్నెముక భాగాలు ముఖ్యంగా లోయర్ బ్యాక్ ఔ1 నుంచి ఔ5 వరకు ఎటువంటి సమస్య ఉన్నా చక్కటి ఉపశమనం కలుగుతుంది. వెన్నెముక ఫ్లెక్సిబుల్గా అవుతుంది. వీపు భాగంలో కండరాలలో చోటుచేసుకున్న బిగుత్వంపోతుంది. కండరాలను సడలించినప్పుడు ఆక్సీజన్ కంజప్షన్ కెపాసిటీ పెరుగుతుంది. భుజంగాసన (కోబ్రా పోజ్) బోర్లా పడుకుని మకరాసనంలో చేతులు రెండు మడచి కుడిచేయిని ఎడమ చేతిమీద ఉంచాలి. చేతుల మీద గడ్డం ఆనించి తలకొంచెం లిఫ్ట్ చేసేటట్లుగా ఉంచాలి. పాదాల మధ్య రెండు లేదా మూడు అడుగుల దూరం, కాలి బొటన వేళ్ళు భూమికి దగ్గరగా ఉంచినట్లయితే పొత్తి కడుపు భాగం, తొడలు పూర్తిగా భూమికి ఆని విశ్రాంతి కలుగుతుంది. పొట్ట ఆధారంగా చేసే ఆసనాలకు మధ్య మధ్యలో ఇలా మకరాసనంలో విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు పాదాలు రెండు కలిపి (వెన్నెముక లేదా సయాటికా సమస్య ఉన్నట్లయితే కాళ్ళు కొంచెం ఎడంగా ఉంచవచ్చు) అరచేతులు ఛాతీకిరువైపులా ఉంచి శ్వాసతీసుకుంటూ గడ్డాన్ని తలను పైకి లేపాలి. తరువాత చేతులు బలంగా నేలకు నొక్కుతూ మోచేతులు ఓపెన్ చేస్తూ ఛాతీని వీలైనంత పైకి లేపాలి. బొడ్డు నుంచి కిందకు నేలమీద పూర్తిగా ఆనేటట్లుగాను బొడ్డు నుంచి పై భాగాన్ని వీలైనంత పైకి లేపే ప్రయత్నం చేయాలి. (ఇది పూర్తి భుజంగాసన స్థితి). ఇలా కష్టం అన్పిస్తే మోచేతుల నుండి ముందు భాగం వరకూ పూర్తిగా రెండు చేతులను నేల మీద శరీరం ఇరువైపులా ముందుకు ఉంచి తలను ఛాతీని పైకి లిఫ్ట్ చేసే అర్థ భుజంగాసన ను ఎంచుకోవాలి. 1ఎ) భుజంగాసన: పూర్తి భుజంగాసన స్థితిలో ఉన్నప్పుడు తలను కుడివైపుకు తిప్పి కుడి భుజం మీదుగా వెనుక పాదాలను మళ్ళీ తలను ఎడమవైపుకు తిప్పి ఎడమ భుజం మీదుగా వెనుక పాదాలను చూసే ప్రయత్నం చేయాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా పొట్ట ఛాతీభాగాలను తరువాత గడ్డంను నేలమీదకు తీసుకు రావాలి. శ్వాస తీసుకుంటూ తల ఛాతీ పైకి లేపడం, శ్వాస వదులుతూ తిరిగి నేల మీదకు మకరాసనంలో విశ్రాంత స్థితికి రావాలి. నడుము కింది భాగంలో నొప్పి (లోయర్ బ్యాక్యేక్)కి ఇదొక ఉత్తమమైన ఆసనం. అంతే కాకుండా కిడ్నీ, ఎడ్రినల్ గ్రంథులు సమర్థవంతంగా పనిచేయడానికి, కార్టిసోన్ హార్మోను ఉత్పత్తిని నియంత్రణకి వీలు కలగిస్తుంది. కీళ్లనొప్పులు, రెనిమాటిజమ్కు పరిష్కారం.అయితే గర్భిణీస్త్రీలు, పెప్టిక్ అల్సర్స్, హెర్నియా, ఇంటెస్టియల్ ట్యూబరోక్లోసిస్ ఉన్నవారు సాధన చేయరాదు. శశాంకాసన :ఈ స్థితిలో శ్వాస చాలా వేగంగా ఉంటుంది. శ్వాసలు చిన్నవిగా ఉంటాయి. అందువలనే దీనికి శశాంకాసన అనే పేరు వచ్చింది. చేసే విధానం: అర్థ అధోముఖశ్వాసాసనంలో నుండి నెమ్మదిగా సీటు భాగాన్ని క్రిందకు క్రమక్రమంగా దించి మడమల మీద కూర్చొనే విధంగా ప్రయత్నించాలి. పొట్ట ఛాతీ భాగాలు తొడలపైన ఉంచి శ్వాస వదులుతూ నుదురుని నేలకు వీలైనంత దగ్గరలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. నుదురు నేలకు దగ్గరగా తీసుకువెళ్ళకపోయినా ఫరవాలేదు. కానీ వెనుక మడమల మీద సీటును ఉంచే ప్రయత్నం చేస్తూ మోకాళ్లు రెండూ కలిసి ఉంచే ప్రయత్నం చేయవలెను. చేతులను ముందుకు బాగా స్ట్రెచ్ చేస్తూ ఉంచాలి. ఈ ఆసనాలు అన్నీ వెన్నెముకతో పాటు నడుము భాగాలకు పూర్తిగా ఉపశమనం అందించేందుకు, మనసుకు ఆందోళన తగ్గించి ప్రశాంతతను చేకూర్చడానికి ఉపకరించేవే! తరచుగా వీటితో పాటు మరికొన్ని యోగాసనాలు సాధన చేస్తుండడం ద్వారా ఇప్పుడున్న బ్యాక్ పెయిన్ నుంచి కోలుకోవడంతో పాటు భవిష్యత్తులోనూ ఆ సమస్య రాకుండా చేసుకోవడం సాధ్యపడుతుంది. - ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ - సమన్వయం ఎస్. సత్యబాబు సాక్షి ప్రతినిధి -
యోగాతో నడుమునొప్పి మాయం
వాషింగ్టన్: యోగాతో నడుము నొప్పికి చక్కని పరిష్కారం లభిస్తుందని ఇండియా, యూకే, యూఎస్లలో నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. నడుము నొప్పి అందరూ ఎదుర్కొనే సాధారణ సమస్యే అయినప్పటికీ దీని నుంచి ఉపశమనం పొందడానికి రకరకాల మందులు వాడతారు. ఫలితంగా అనేక దుష్ఫలితాలు కలుగుతాయి. మందుల అవసరం లేకుండానే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నడుము నొప్పితో బాధపడుతున్న కొందరితో యోగాసనాలు వేయించడంతో కేవలం మూడు నెలల్లోనే వారు ఈ సమస్య నుంచి బయటపడ్డారని అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుసాన్ వీల్యాండ్ తెలిపారు. యోగా.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆధునిక జీవన విధానంలోనూ భాగమవుతోందని, అందుకే అనారోగ్య సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక ఆసనాలను అనుసరించాలని సుసాన్ సూచించారు. 1,080 మందిపై పరిశోధన చేయగా.. వెన్నునొప్పిపై దృష్టి కేంద్రీకరించి యోగా సాధన చేసినవారిలో మిగతా వారితో పోలిస్తే మెరుగైన ఫలితాలు కనిపించాయని చెప్పారు. -
వెన్నునొప్పి నివారణ కోసం...
చిన్న పిల్లలుగా ఉన్న సమయంలోనే వెన్నుకు ఏదైనా సమస్య వస్తే అది జీవితాంతం ఉంటుంది కాబట్టి ఆ టైమ్లో వారికి ఎలాంటి సమస్యా లేకుండా చూడాలి. పిల్లలు స్కూల్ బ్యాగ్ను వీపుపై మోస్తున్నప్పుడు అది మరీ కిందికి జారిపోకుండా వీపు పై భాగంలో (అప్పర్ బ్యాక్) ఉంచేలా చూడాలి. స్కూల్ బ్యాగ్ వీపుపై మోసుకెళ్లకుండా చక్రాలపై రోల్ చేసేది ఉంటే మంచిది. పిల్లలు స్కూల్లోనూ, పెద్దలు పనులు చేసే ప్రదేశంలో ఒంగిపోయినట్లుగా గాక వెన్నును నిటారుగా ఉంచేలా కూర్చోవడం (ఎర్గానమికల్లీ రైట్ పొజిషన్) అలవాటు చేసుకుంటే మంచిది. సూర్యుడికి ఎక్స్పోజ్ అయ్యేలా ఆరుబయట తిరగడంతో పాటు మంచి వ్యాయామాలు చేయడం వల్ల ఎముకలకు సరైన పాళ్లలో క్యాల్షియమ్ అంది అటు పిల్లల్లోనూ, ఇటు పెద్దల్లోనూ ఎముకలు గట్టిపడతాయి. బరువు తగ్గించుకోవడంతో వెన్నుపై పడే భారం తగ్గుతుంది. పెద్దవాళ్లు పొగాకు నమలడం, ఆల్కహాల్ తాగడం వంటి దురలవాట్ల నుంచి దూరంగా ఉండాలి. కొన్ని మందులు వాడుతున్నప్పుడు ఎముకలపై వాటి ప్రభావాన్ని గురించి డాక్టర్ను అడిగి తెలుసుకోండి. మందుల బయోకెమికల్ స్వభావం, వాటి హానికరమైన ప్రభావం, రిస్క్ వంటి అంశాలు తెలిసి ఉండే క్వాలిఫైడ్ నిపుణులను సంప్రదించడం మంచిది. -
ఒత్తిడితో ఒళ్లునొప్పులు...
అదేపనిగా పన్నెండు గంటల కంటే ఎక్కువసేపు (ఒకే స్ట్రెచ్లో) పనిచేసేవారు తీవ్రమైన అలసట మొదలుకొని ఇంకా అనేక సమస్యలు వస్తాయి. ఇక కండరాల నొప్పులు, నడుమునొప్పితో పాటు చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, ఇతర వృత్తిసంబంధ సమస్యలు సైతం రావచ్చు. వాటిని నివారించేందుకు ఈ సూచనలు పాటించడం మేలు... ⇔ పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. సిగరెట్ పొగలో కార్బన్మోనాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. అది రక్తకణాల్లోని ఆక్సిజన్ను తీసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గించి, వెంటనే అలసిపోయేలా చేస్తుంది. ⇔ చాలాసేపు కూర్చొని పనిచేసేవారైతే, శరీరానికి కదలికలు ఉండేలా తప్పనిసరిగా వ్యాయామం చేయండి. అదేపనిగా కూర్చోవడం వల్ల కూడా అలసిపోతారు. ⇔ మీ వృత్తి ఉద్యోగాల్లో ఏదైనా సమస్యలు, మీరు లక్ష్యాలను అధిగమించాల్సిన (టార్గెట్స్ రీచ్ కావాల్సిన) వృత్తిలో ఉంటే తీవ్రమైన అలసటకు లోను కావడం చాలా సాధారణం. ⇔ కంటి నిండా నిద్ర అవసరం. కనీసం రోజూ ఎనిమిదిగంటల పాటు నిద్రపోవాలి. ⇔ కాఫీలు ఎక్కువగా తాగకండి. కెఫిన్ ఉండే ద్రవపదార్థాలను తీసుకునే అలవాటు ఉంటే, రోజూ రెండు కప్పులకు మించి వద్దు. రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికివెళ్లే సమయంలో కాఫీ అస్సలు తాగవద్దు. ⇔ రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించండి. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఒత్తిడిని అధిగమించండి. ⇔ భోజనవేళలను కచ్చితంగా పాటించండి. భోజనం ఎగొట్టి పనిచేయకండి. ఇలా చేస్తే రక్తంలో చక్కెరపాళ్లు తగ్గిపోయి త్వరగా, తేలిగ్గా అలసిపోతారు. ⇔ ఎక్కువగా నీళ్లు తాగండి. దీనివల్ల మీరు డీ-హైడ్రేషన్కు లోనుకారు. ఫలితంగా అలసిపోకుండా పనిచేయగలుగుతారు. ⇔ ఈ సూచనలు పాటించాక కూడా మీరు ఇంకా ఒళ్లునొప్పులు, అలసటతోనూ, నడుంనొప్పి వంటి వాటితో బాధపడుతుంటే డాక్టర్ను సంప్రదించండి. -
నగరానికే నడుం నొప్పి వచ్చేలా..
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో సుమారు 45 లక్షల వాహనాలు ఉండగా, వీటిలో 30 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలే. ఏడు లక్షల కార్లు, లక్షకుపైగా ఆటోలు, మరో లక్ష ఇతర వాహనాలు ఉన్నట్టు రవాణా శాఖ అంచనా. రోడ్లపై గుంతల కారణంగా బైక్ నడిపేవారు వెన్ను, మెడ, భుజాలు, ఇతర కండరాల నొప్పులతో బాధ పడుతుంటే, కారును నడిపేవారు నడుము, కాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. వీరి వాహనం గుంతలో పడిన ప్రతిసారీ డిస్క్ల మధ్య కదలికలు ఎక్కువై జాయింట్స్ అరిగి పోతున్నట్టు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం తమ ఓపీకి వచ్చే బాధితుల్లో 60 శాతం మంది వెన్ను నొప్పితో బాధపడుతుండగా, బ్యాక్ పెయిన్తో 20 శాతం మంది, మెడ, భుజాల నొప్పులతో 15 శాతం, కండరాల నొప్పులతో 5 శాతం మంది బాధపడుతున్నారని ప్రముఖ స్పైన్ సర్జన్ డాక్టర్ జీవీ సుబ్బయ్య స్పష్టం చేశారు. పాడవుతున్న వాహనాలు శిథిలమైన రోడ్లు, వాటి మధ్య గుంతలతో ద్విచక్ర వాహనాలు, కార్ల నిర్వహణ ఖర్చు పెరుగుతోంది. ద్విచక్ర వాహనాలకు క్లచ్, బ్రేక్ సిస్టమ్ దెబ్బ తింటుంది. టైర్లు కూడా చీలిపోతున్నాయి. తరచూ ఇలాంటి గుంతల్లో కార్లు, బైకులు ప్రయాణిస్తే సస్పెన్షన్ వ్యవస్థ నాశనమవుతోంది. ప్రతి గుంత వద్దా బ్రేకులు వేస్తూ.. గేర్లు మార్చడం వల్ల మైలేజీ సైతం పడిపోతోంది. ఈ సమస్యలతో రోజుకు తన గ్యారేజీకి నాలుగైదు కార్లు వస్తున్నట్లు బాగ్లింపల్లిలోని కేడీఎన్ హైదరాబాద్ మోటార్ గ్యారేజీ నిర్వాహకుడు మహ్మద్ ఖదీర్ఖాన్ తెలిపారు. వాహనం నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సన్షైన్ ఆస్పత్రి స్పైన్ సర్జన్ డాక్టర్ జీవీ సుబ్బయ్య సూచిస్తున్నారు. అవి.. ► బైక్ నడిపేటప్పుడు తల, నడుము, షోల్డర్ వంచకుండా నిటారుగా నిలబడడం అలవాటు చేసుకోవాలి ► మెడపై భారం పడకుండా తేలికైన హెల్మెట్లను వాడాలి ► ర్యాష్ డ్రైవింగ్ పనికిరాదు. సీటు దిగజారినట్టుగా ఉండకూడదు ► కారులో సిట్టింగ్ 110 డిగ్రీలు తప్పని సరిగా ఉండాలి ► క్లచ్లు, గేర్లు చేతికి చేరువలో ఉండేలా చూడాలి. ► వీపు భాగాన్ని పూర్తిగా సీటుకు ఆనించి కూర్చోవాలి ► గుంతలు, ఎగుడు దిగుడు రోడ్లు, స్పీడ్ బ్రేకర్ల వద్ద వాహన వేగం తగ్గించాలి ► దూర ప్రయాణంలో ప్రతి గంట, రెండు గంటలకోసారి కొంత విరామం తప్పనిసరి -
వెన్నునొప్పి తగ్గేదెలా?
హోమియో కౌన్సెలింగ్ నాకు విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. దీనికి హోమియో ప్రక్రియలో చికిత్స ఉందా? దయచేసి వివరించగలరు. - సుమన్, బాలాపూర్ ఇటీవల వెన్నునొప్పి చాలా ఎక్కువ మందిలో కనిపిస్తున్న చాలా సాధారణమైన సమస్య. వెన్నుపూసలు అరగడం అన్నది ఒకప్పుడు ఒక వయసు పైబడిన వారిలోనే కనిపించేంది. కానీ మారుతున్న జీవనశైలితో పాటు తాము నిర్వహించే వృత్తుల్లో భాగంగా వెన్నుపై భారం పడేలా పనిచేయడం, ఇతర కారణాల వల్ల ఇది చాలా విస్తృతంగా కనిపిస్తోంది. వెన్నుభాగంలో లిగమెంట్లు, కండరాలు, ఫేసెట్ జాయింట్లు ఒకదానితో ఒకటి అనుసంధానితమై శరీరానికి స్థిరత్వాన్ని ఇస్తాయి. మన రోజువారీ జీవితంలో శారీరకంగా ఎదురయ్యే ఎన్నో సమస్యలను తట్టుకొని నరాల మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా కాపాడుకోవడం మన వెన్నెముక ప్రధాన లక్షణం. అధికంగా బరువు ఎత్తడం, దించడం, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు, క్యాల్షియమ్ లోపం, విటమిన్ బి12, డీ3 లోపాలు, ఎముకల సాంద్రత తగ్గడం వంటివి వెన్నునొప్పికి కొన్ని కారణాలు. మనం ఏ పని చేయాలన్నా ప్రతిక్షణం మెడ, నడుములోని వెన్నుపూసలు పనిచేయాలి. అందుకే ప్రతి పదిమందిలో ఆరు నుంచి ఎనిమిది మంది వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. వెన్నుపూసలు అరిగినందువల్ల వెన్నునొప్పి వస్తుంది కాబట్టి మందులతో దాన్ని పరిష్కరించలేమనీ, ఆపరేషన్ అవసరమని చాలామందిలో ఒక అపోహ ఉంది. పైగా ఇది జీవితాంతం వేధిస్తూ ఉంటుందని నిస్పృహ కూడా కొందరు పేషెంట్లలో ఉంటుంది. వెన్నునొప్పికి కారణమైన డిస్క్ బల్జ్, డిస్క్ కంప్రెషన్, నరాలమీద ఒత్తిడి పెరగడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. అయితే హోమియోలో ఇలాంటి వెన్ను సంబంధమైన నొప్పులు వచ్చినప్పుడు... ఉదాహరణకు డిస్క్ బల్జ్ వల్ల నరాలమీద ఒత్తిడి పెరిగినప్పుడు తగ్గించడానికి కోబాల్ట్ లాంటి ప్రభావపూర్వకమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఇక మెడభాగంలో ఉండే వెన్నుపూసలు అరిగినప్పుడు వచ్చే నొప్పిని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. మెడ భాగంలో సి1 నుంచి సి7 వరకు ఉండే వెన్ను పూసలను సర్వైకల్ పూసలు అంటారు. ఇవి అరిగినప్పుడు వెన్నుపూసల కీళ్ల మధ్య భాగం తగ్గిపోవడం వల్ల డిస్క్బల్జ్ ఏర్పడటం, వెన్నుపూసల మధ్య రాపిడి పెరగడం వంటి కారణాల వల్ల మెడ భాగం నుంచి నొప్పి మొదలై చేతి వేళ్ల వరకు నొప్పి పాకుతూ ఉంటుంది. దాంతో పాటు తిమిర్లు, చేయి మొద్దుబారడం, మెడ ఫ్రీగా తిరగలేకపోవడం, మెడ పట్టివేసినట్లుగా ఉండటం వంటివి చూస్తుంటాం. ఇలాంటి వారికి కూడా యాసిడ్ఫాస్ అనే మందు బాగా పనిచేస్తుంది. ఇక మెడ, నడుము, వెన్నెముక నొప్పులకు ఆస్కులస్ హిప్, రస్టాక్స్, బ్రయోనియా ఆల్బ్, కాల్కేరియా ఫ్లోర్, హైపరికం, మహిళల్లో వచ్చే ఇలాంటి సమస్యలకే సిమిసిఫ్యూగా వంటివి చాలా బాగా పనిచేస్తాయి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ అది లూకోడెర్మాకు దారితీయదు పిడియాట్రిక్ కౌన్సెలింగ్ మాకు కొద్దిరోజుల క్రితం పాప పుట్టింది. పాపకు తలలో కొంత మేర వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి. ఇదేమైనా భవిష్యత్తులో ల్యూకోడెర్మా వంటి జబ్బుకు దారితీసే ప్రమాదం ఉందా? - రవికుమార్, నందిగామ మీ పాపకు ఉన్న కండిషన్ (లోకలైజ్డ్ ప్యాచ్ ఆఫ్ వైట్ హెయిర్)ను పోలియోసిస్ అంటారు. సాధారణంగా ఇది తల ముందు భాగంలో అంటే నుదుటిపై భాగంలో కనిపిస్తుంటుంది. అయితే మరెక్కడైనా కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. ఇలా ఉందంటే అది ప్రతీసారీ తప్పనిసరిగా ఏదో రుగ్మతకు సూచిక కానక్కర్లేదు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని జన్యుపరమైన సమస్యలకు సూచన కావచ్చు. చర్మంలోని పిగ్మెంట్లలో మార్పుల వల్ల కూడా రావచ్చు. కంట్లో పిగ్మెంట్కు సంబంధించిన ఏవైనా మార్పులు ఉన్నాయేమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పిల్లల్లో ఏదైనా హార్మోనల్ సమస్యలు (అంటే థైరాయిడ్, జననేంద్రియాలకు సంబంధించినవి) ఉండటానికి సూచన కావచ్చు. ఇలాంటి అసోసియేటెడ్ సమస్యలేవీ లేకపోతే మీ పాపకు ఉన్న ఈ లక్షణం... ల్యూకోడెర్మా లాంటి సమస్యకు దారితీసే అవకాశం లేదు. పాపను ఒక్కసారి పీడియాట్రీషియన్కు చూపించండి. మీరు రాసినదాన్ని బట్టి పాపకు తక్షణ చికిత్స ఏదీ అవసరం లేదు. మీరూ ఈ విషయంలో ఆందోళన పడకుండా ఒకసారి డాక్టర్ను కలిసి ఇతరత్రా ఏ సమస్యలూ లేవని నిర్ధరించుకొని నిశ్చింతగానే ఉండండి. డా. రమేశ్బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ డెంగ్యూ ఫివర్ కౌన్సెలింగ్ ప్లేట్లెట్స్ తగ్గితే..? ఈ మధ్య మా బాబుకు తీవ్రమైన జ్వరం వచ్చింది. రక్తపరీక్షలో ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం చూసి, మా డాక్టర్ డెంగ్యూ కావచ్చని అనుమానించారు. అసలు డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఏమిటి, దాని వివరాలు చెప్పండి. - సుగుణకుమారి, విశాఖపట్నం మీ డాక్టర్ చెప్పినట్లుగా ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం డెంగ్యూ వ్యాధిలోని ఒక లక్షణం. వైరల్ జ్వరాల్లో డెంగ్యూ కూడా ఒక రకం జ్వరం. ఈ వ్యాధికి ఆర్బోవైరస్ అనే జాతికి చెందిన సూక్ష్మజీవి ఒక కారణం. ఈ వైరస్ అతి సూక్ష్మమైనది. కంటికి కనిపించదు. ఈ వైరస్ ఏడిస్ ఈజిప్టై జాతి దోమ ద్వారా రోగగ్రస్తుల నుంచి ఆరోగ్యవంతులకు సంక్రమిస్తుంది. దీన్ని వ్యాప్తి చేసే దోమను టైగర్ దోమ అని కూడా అంటారు. ఈ దోమలు సాధారణంగా పగటిపూటే కుడుతుంది. దోమ కుట్టిన తర్వాత ఐదు రోజుల నుంచి ఎనిమిది రోజుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి. వాటిలో సాధారణ డెంగ్యూ మామూలుగానే తగ్గిపోతుంది. కానీ డెంగ్యూ హేమరేజిక్ ఫీవర్లో అవయవాల్లో అంతర్గత రక్తస్రావం జరిగే ప్రమాదం ఉన్నందున ఇది ప్రమాదకరమైనది. డెంగ్యూవ్యాధి లక్షణాలు : ఉన్నట్లుండి జ్వరం రావడం తీవ్రమైన తలనొప్పి, ఇది కూడా ఎక్కువగా నొసటిపై వస్తుంది. కంటిలో నొప్పి వచ్చి కన్ను కదిలించినప్పుడు నొప్పి ఎక్కువవుతుంది. కండరాలు, కీళ్లనొప్పి వికారం నోరు ఎండిపోయినట్లుగా అవుతుంది. చాలా ఎక్కువగా దాహం వేస్తుంది. ఇక మీ డాక్టర్ చెప్పినట్లుగా ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల డెంగ్యూ వ్యాధిగా అనుమానిస్తుండవచ్చు. డెంగ్యూ ప్రమాదకరమైనది కాబట్టి సాధారణంగా దాన్ని వ్యాప్తి చేసే దోమలు గుడ్లు పెట్టడానికి అనువైన స్థలాలలో... అంటే ఎయిర్కూలర్స్, పూలకుండీల కింద పెట్టే సాసర్లు, ఆరుబయట పారేసి ఉన్న టైర్లు, మూతలు పెట్టని నీరు నిల్వ చేసే తొట్టి వంటివి, నీరు కదలకుండా ఉండే ఫౌంటేన్లు, ఖాళీ డ్రమ్ములు, సన్షేడ్పై వాన నీరు నిలిచిపోయే బిల్డింగులలో నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీ డాక్టర్ చెప్పిన విధంగా మీ బాబుకు చికిత్స చేయించండి. డాక్టర్ శైలేశ్ ఆర్ సింగీ సీనియర్ హిమటో ఆంకాలజిస్ట్, బీఎమ్టీ స్పెషలిస్ట్, సెంచరీ హాస్సిటల్స్, హైదరాబాద్ -
ఫేస్బుక్తో వెన్నునొప్పి మాయం!
లండన్: ఫేస్బుక్లో అదే పనిగా చాటింగ్ చేస్తుంటే మెడనొప్పి, ఆపై వెన్నునొప్పి రావడం ఖాయమనే విషయం తెలిసిందే. అయితే ఫేస్బుక్ వెన్నునొప్పిని తగ్గిస్తుందనే విషయం మీకు తెలుసా? బ్రిటన్లోని లీసెస్టర్ ఆస్పత్రికి చెందిన భారతీయ వైద్యుడు అరుముగాన్ మూర్తి చెప్పిన ఆసక్తికరమైన విషయాలు చదివితే ఫేస్బుక్ వెన్నునొప్పిని తగ్గిస్తుందని మీకే తెలుస్తుంది. ఇంతకీ ఆయన ఏం చెప్పాడంటే... వెన్నునొప్పితో బాధపడేవారు ముందుగా వైద్యుల వద్దకు వెళ్లకుండా ఉపశమనం కోసం చిన్నపాటి చిట్కాలను పాటిస్తారు. అయితే ఈ చిట్కాలు ఇప్పుడు ఫేస్బుక్లో పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని, వాటినే ఎక్కువమంది పాటిస్తున్నారని మూర్తి తెలిపారు. తన వద్దకు వచ్చిన రోగులకు వెన్ను నొప్పికి సంబంధించి కొన్ని రకాల ఎక్సర్సైజుల గురించి చెప్పినప్పుడు.. తమకు ఫేస్బుక్ వల్ల ముందే తెలుసని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. -
ధోనికి బ్యాకప్గా పార్థీవ్ పటేల్
భారత కెప్టెన్ ధోని వెన్నునొప్పితో బాధపడుతున్నందున... పార్థీవ్ పటేల్ను బ్యాకప్ వికెట్ కీపర్గా బంగ్లాదేశ్ పంపుతున్నారు. సోమవారం ప్రాక్టీస్ సందర్భంగా ధోని అసౌకర్యంగా కనిపించాడు. దీంతో ముందు జాగ్రత్తగా పార్థీవ్ను ఆసియాకప్ జట్టులోకి బ్యాకప్గా తీసుకున్నారు. అయితే ధోనికి తీవ్ర గాయమేమీ లేదని, అతను తొలి మ్యాచ్కు అందుబాటులో ఉండే అవకాశం ఉందని జట్టు వర్గాలు తెలిపాయి. -
వెన్నునొప్పి వెంటాడుతోంది
• హోమియో కౌన్సెలింగ్ మా అమ్మగారి వయసు 65. ఈమధ్య కొంతకాలంగా విపరీతమైన దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. డాక్టర్కు చూపిస్తే బ్రాంకైటిస్ అని చెప్పి, యాంటీబయాటిక్స్ కోర్సు రాశారు. వాటివల్ల సైడ్ఎఫెక్టులు వస్తున్నాయి. హోమియోలో దీనికి పరిష్కారం ఉంటే చెప్పగలరు. - డి.ఎల్.అనూరాధ, కొత్తగూడెం శ్వాసకోశవ్యాధులలో బ్రాంకైటిస్ ఒకటి. వాయునాళాల లోపలి జిగురుపొరలు (మ్యూకస్ మెంబ్రేన్స్)తో కప్పి ఉంటుంది. ఇవి ఇన్ఫెక్షన్కు గురయినట్లయితే దానిని బ్రాంకైటిస్ అంటారు. ముక్కునుంచి గొంతువరకు ఉండే భాగం కూడా ఇన్ఫెక్షన్కు గురయినట్లయితే బ్రాంకైటిస్ వస్తుంది. ఇది సాధారణంగా ఎవరికైనా వస్తుంది. కారణాలు: దుమ్ము, ధూళి, పొగ, కెమికల్స్, బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్, చల్లటి వాతావరణం, ఫ్లూ జ్వరం, చల్లని పదార్థాలు, చల్లని పానీయాలు సేవించడం లక్షణాలు: జ్వరం, చలి, జలుబు, ముక్కుదిబ్బడ, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు, దగ్గు, ఛాతీనొప్పి, పిల్లికూతలు, ఆయాసం, ఎక్కువగా నడవలేకపోవడం. రకాలు: బ్రాంకైటిస్లో అక్యూట్ బ్రాంకైటిస్; క్రానిక్ బ్రాంకైటిస్ అని రెండు రకాలు ఉన్నాయి. అక్యూట్ బ్రాంకైటిస్లో జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు, నీరసం, జ్వరం, తలనొప్పి ఉంటాయి. క్రానిక్ బ్రాంకైటిస్లో ఏడాదికి మూడు నెలలపాటు దగ్గు, తెమడ ఉంటాయి. పొగతాగడం, వాతావరణంలో మార్పులు, కాలుష్యం, ఇన్ఫెక్షన్స్ వల్ల శ్వాసనాళాలు దెబ్బతింటాయి. ఇన్ఫెక్షన్ మూలంగా వాయునాళాలు కుచించుకుపోవడం వల్ల ఛాతీలో పిల్లికూతలు వినిపిస్తాయి. టాన్సిల్స్, సైనస్ వ్యాధులతో బాధపడే పిల్లలకు తరచుగా బ్రాంకైటిస్ వస్తూ, దీర్ఘకాలిక బ్రాంకైటిస్గా మారినట్లయితే ఇమ్యూనిటీ తగ్గి, ఆస్తమాకు దారితీస్తుంది. నిర్ధారణ: ఛాతీ ఎక్స్రే, ఈఎస్ఆర్, కఫం పరీక్ష, సీబీపీ మొదలైనవి. నివారణ: ధూమపానం మానేయడం, దుమ్మూధూళికి దూరంగా ఉండటం, చల్లని వాతావరణంలో తిరగకుండా, చల్లని ఆహారపదార్థాలు తీసుకోకుండా ఉండటం, మంచి నిద్ర, ఆహారం, విశ్రాంతి తీసుకోవడం, ఆహారంలో ఆకుకూరలు, పళ్లు ఎక్కువగా తీసుకోవడం, క్రమం తప్పకుండా యోగ, ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్సైజులు. హోమియో చికిత్స: హోమియోలో ఎటువంటి శ్వాసకోశవ్యాధులకైనా అధునాతన జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించి, వ్యాధి తీవ్రతను తగ్గించి, క్రమక్రమంగా పూర్తిగా వ్యాధినిర్ధారణ జరుగుతుంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ • స్పైన్ కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. నేను ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. మా ఇంటి నుంచి ఆఫీసు చేరడానికి నేను కనీసం రోజూ 35 కి.మీ. బైక్ మీద వెళ్తుంటాను. ఆఫీసులో అంతా డెస్క్ పనే. కాబట్టి కూర్చొనే పనిచేస్తుంటాను. నాకు మూడు నెలల క్రితం తీవ్రమైన వెన్నునొప్పి వచ్చింది. ఇప్పుడు డాక్టర్కు చూపించుకున్నాను. మందులు రాసిన్చారు. ఒక వారం పాటు వాడాను. నొప్పి తగ్గింది. ఈమధ్య వారం రోజుల నుంచి వెన్నుతో పాటు మెడ భాగంలో కూడా తీవ్రమైన నొప్పి వస్తోంది. దయచేసి నా సమస్యకు తగిన సలహా చెప్పగలరు. - రేవంత్, హైదరాబాద్ ఈమధ్య వయసుతో నిమిత్తం లేకుండా ఎక్కువ మందిలో ఈ వెన్నునొప్పులు సాధారణమైపోయాయి. చిన్నవయసులోనే ఈ నొప్పి బారిన పడుతున్నవారు చాలా ఉన్నారు. ఇక మీ సమస్య విషయానికి వస్తే రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి మీరు టూ-వీలర్ మీద చాలా లాంగ్ డ్రైవింగ్ చేయడం. మీ ఇంటి నుంచి మీరు పనిచేసే ప్రదేశానికి 35 కి.మీ. అన్నారు. అంటే రానూపోనూ సుమారు 70 కి.మీ. దూరం మీరు ప్రయాణం చేస్తున్నారు. అందునా తీవ్రమైన ట్రాఫిక్ సమస్య, రోడ్డు మీద ఉండే గతుకుల మధ్య ఇంత దూరం టూ-వీలర్పై ప్రయాణం చేయడం ఎంతమాత్రమూ మంచిది కాదు. ఏకధాటిగా అంతసేపు మీరు బైక్ మీద ప్రయాణం చేయడం వల్ల మీ వెన్ను (స్పైన్) తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. ఇక రెండో విషయానికి వస్తే ఒకే భంగిమలో అదేపనిగా కొన్ని గంటపాటు కూర్చొని పనిచేయడం వల్ల కూడా మీ వెన్ను తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. అంతేకాకుండా కంప్యూటర్ మీద అన్ని గంటలు పనిచేయడం వల్ల కూడా మీకు వెన్నుతో పాటు మెడ నొప్పి కూడా వస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది చాలా ప్రమాదకరం. మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న సీనియర్ స్పైన్ సర్జన్ను కలవండి. వారు కొన్ని పరీక్షలు చేయించి, వాటిని బట్టి మీ సమస్యకు తగిన పరిష్కారం వారు సూచిస్తారు. అయితే ఈలోగా మీ వెన్నునొప్పి తగ్గడానికి ఈ కింద పేర్కొన్న కొన్ని సూచనలు పాటించండి. మీ సీటుకు ముందు భాగాన ఉండే కంప్యూటర్ డెస్క్ను మీ తలకు సమానంగా ఉండేలా అమర్చుకోండి. దానికి అనుగుణంగా ఉండేలా మీరు ఆఫీసులో కూర్చునే భంగిమ మార్చుకోండి కొన్ని సాధారణ వార్మ్అప్ వ్యాయామాలు చేయండి వెన్ను, మెడ తీవ్రమైన ఒత్తిడికి, వేగవంతమైన కదలికలకు గురికాకుండా చూసుకోండి. ఇలా చేయడం వల్ల కాస్త రిలీఫ్గా ఉంటుంది. డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సీనియర్ స్పైన్ సర్జన్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ • యాండ్రాలజీ/యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 24 ఏళ్లు. పెళ్లయి ఏడాదిన్నర అవుతోంది. పెళ్లయిన నాలుగు నెలలకు టీబీ వచ్చింది. ఆర్నెలలు మందులు వాడాక నెగెటివ్ రిపోర్టు వచ్చింది. అయితే పెళ్లయిన తర్వాత అంటే... మందులు వాడుతున్న సమయంలో నా భార్యకు ముద్దులు పెట్టడం, సెక్స్లో పాల్గొనడం వంటివి చేశాను. ఇప్పుడు నా భార్యకు దగ్గు వస్తోంది. తగ్గినప్పుడు తెమడ (కళ్లె) కూడా పడుతోంది. నా భార్యకు టీబీ వచ్చి ఉంటుందా? అప్పుడు నేను సెక్స్లో పాల్గొనవచ్చా? దయచేసి తగిన సలహా ఇవ్వండి. - కె.జి.డి., సిద్ధిపేట టీబీ అంటువ్యాధి. ఇది దగ్గడం, తుమ్మడం వల్ల ఒకరినుంచి మరొకరికి సోకుతుంది. మందులు వాడటం మొదలుపెట్టిన ఒక వారం తర్వాత వ్యాధిగ్రస్తుల నుంచి వేరేవాళ్లకు సోకడం అరుదు. ఒకవేళ మీ భార్యకు టీబీ సోకి ఉంటే, అది మందులు వాడకముందు సోకి ఉండాలి. మందులు వాడటం మొదలు పెట్టిన తర్వాత ఇద్దరూ సెక్స్లో పాల్గొనడం ఏమాత్రం అభ్యంతరకరం కాదు. అయితే మీ భార్యకు దగ్గు వస్తోందంటున్నారు కాబట్టి ఆమెకు టీబీ పరీక్ష చేయించుకుని నిర్ధారణ చేసుకోవడం మంచిది. మా అబ్బాయి వయసు ఏడు నెలలు. అతడికి మూత్రం అంగం చివరిభాగం నుంచి కాకుండా కింది భాగంలోంచి వస్తోంది. అతడి పురుషాంగం కూడా చిన్నదిగా ఉండి లోపలికి ముడుచుకుపోయినట్లు అనిపిస్తోంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే శస్త్రచికిత్స అవసరమని చెప్పారు. ఇంత చిన్నవాడికి సర్జరీ చేయచ్చా? - ఆర్.వి.ఎమ్., కందుకూరు మీ బాబుకు ఉన్న కండిషన్ను హైపోస్పైడియాస్ అంటారు. ఈ పరిస్థితి ఉన్నవారిలో అంగం వంకరగా ఉండటం మూత్ర ద్వారం పురుషాంగం చివరనగాక, దానికి కింది వైపున ఉండటాన్ని గమనించవచ్చు. ఈ సమస్య ఉన్నవాళ్లలో పురుషాంగం చక్కగా ఉండేట్లు చేయడంతో పాటు, మూత్ర ద్వారం పురుషాంగం చివరికి వచ్చేలా చేయడం అనే రెండు సర్జరీలు చేయాల్సి ఉంటుంది. ఆర్నెల్ల వయసు నుంచి మూడేళ్ల వరకు ఒక దశగా గాని, రెండు సార్లు గాని సర్జరీ చేస్తే, బాబు స్కూలుకు వెళ్లేనాటికి అతడిపై ఈ అంశం వల్ల కలిగే మానసిక ఒత్తిడి లేకుండా చేయడం వీలవుతుంది. ఇప్పుడు వైద్యవిజ్ఞానంలో వచ్చిన పురోగతి వల్ల చిన్నపిల్లలకూ సురక్షితంగా మత్తుమందు ఇచ్చే పరిజ్ఞానం అందుబాటులో ఉంది. కాబట్టి మీరు నిర్భయంగా యూరాలజిస్ట్ను సంప్రదించి నిశ్చింతగా మీ బాబుకు ఆపరేషన్ చేయించండి. డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్ ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి హైదరాబాద్ -
ఫాస్ట్ ట్రాక్ విధానంలో మూడుగంటల్లోనే నడవగలరు!
హోమియో కౌన్సెలింగ్ నాకు విపరీతమైన వెన్ను నొప్పి వస్తోంది. దీనికి హోమియోలో తగిన చికిత్స సూచించండి. - సుందర్, మెదక్ ఇటీవల వెన్ను సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ తరహా నొప్పి వస్తోంది. మీరు వెన్నునొప్పి అని రాశారు. కానీ అది ఏ భాగంలోనో రాయలేదు. మన వెన్నెముకలో 33 ఎముకలు ఉంటాయి. అందులో 7 మెడ భాగంలో, 12 వీపు భాగంలో, 5 నడుము భాగంలో మిగతావి అంతకంటే కిందన ఉంటాయి. ఎముకకూ, ఎముకకూ మధ్యన డిస్క్ అనే మెత్తటి పదార్థం ఉంటుంది. ఇది మన కదలికల సమయంలోగానీ, ఏదైనా పనిచేసేటప్పుడు ఎముకల మధ్య రాపిడిని నివారిస్తుంది. ఈ డిస్క్ మధ్యన మెదడు నుంచి వచ్చే నాడులు ఉంటాయి. ఉదాహరణకు నడుము దగ్గర ప్రారంభమై తొడల ద్వారా కాళ్ల వరకూ వెళ్లే అతి పెద్ద నరాన్ని ‘సయాటిక్ నర్వ్’ అంటారు. నడుము వద్ద ఉండే ఎల్4-ఎల్5 మధ్య సయాటిక్ నరం ఆరంభం అవుతుంది. ఈ నరం మీద ఒత్తిడి పెరిగి నొప్పికి దారితీయడాన్ని సయాటిక్ ఈ నరం ఒత్తిడికి గురవ్వడం వల్ల వచ్చే నొప్పిని సయాటికా అంటారు. ఇక మెడ భాగంలోని వెన్నుపూసల అరుగుదలతో పాటు మరికొన్ని కారణాల వల్ల వచ్చే నొప్పిని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. మెడ భాగంలోని రెండు వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ పక్కకు జరగడం, మెడకు తీవ్రమైన గాయం కావడం వంటి కారణాలతో ఈ సమస్య కావచ్చు. గంటల తరబడి కూర్చొని పనిచేసే వారిలోనూ, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యేవాళ్లలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ బాధితుల్లో మెడ భాగంలో తీవ్రమైన నొప్పి, చేయి లేదా భుజాలకు నొప్పి పాకడం, చేతి వేళ్ల తిమిర్లు లేదా ఆ భాగాలు మొద్దుబారడం లక్షణాలు ఈ సమస్య కనిపిస్తుంటుంది. ఇక కొందరిలో నడము వద్ద ఉండే వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ అరిగిపోవడం వల్ల కూడా అక్కడ ఉండే నరాల మీద ఒత్తిడి పడి లంబార్ స్పాండిలైటిస్ అనే సమస్య రావచ్చు. ముఖ్యంగా ఎల్3, ఎల్4, ఎల్4 వంటి వెన్నుపూసలలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. హోమియో చికిత్స: వెన్నుకు సంబంధించిన ఏ నొప్పులకైనా మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రయోనియా, రస్టాక్స్. కామొమిల్లా మాగ్ఫాస్ వంటి మందులను రోగి తత్వాన్ని, మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇస్తారు. నిపుణులైన హోమియో డాక్టర్లు సూచించిన కాలపరిమితి మేరకు వాటిని వాడితే, ఆపరేషన్ అవసరం లేకుండానే శాశ్వతమైన ఫలితం లభిస్తుంది. హోమియో మందులతో పాటు మంచి పౌష్టికాహారం, ఫిజియోథెరపీ వల్ల కూడా వెన్ను సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 62 ఏళ్లు. విపరీతమైన మోకాళ్లనొప్పులతో బాధపడుతున్నాను. వైద్యులను సంప్రదిస్తే మొదట మందులు ఇచ్చారు. అయినా నొప్పి తగ్గకపోయేసరికి మోకాలు చిప్ప మార్పిడి శస్త్రచికిత్స చేయించుకొమ్మని సూచిస్తున్నారు. ఈ వయసులో ఆపరేషన్ చేయించుకోవాలంటే భయంగా ఉంది. ఒకవేళ ఆపరేషన్ చేయించుకున్నా నెలల తరబడి మంచానికే పరిమితమైతే నాకు సేవలు చేసేవారు ఎవరూ లేరు. నా సమస్యకు ఆపరేషన్ ఒక్కటే మార్గమా? ఇతర ప్రత్యామ్నాయం చికిత్సలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - సత్యనారాయణ, కరీంనగర్ మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స గురించి మీరు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మీకు రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యల వంటి ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా అన్న విషయం మీరు తెలపలేదు. ప్రస్తుతం మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలో అత్యాధునిక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఒకవేళ మీకు మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు లేకుండా ఉంటే ఫాస్ట్ట్రాక్ విధానంలో మోకాలు మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించడానికి వీలవుతుంది. ఈ విధానంలో సర్జరీ చేస్తే ఆపరేషన్ జరిగిన మూడు గంటల్లోనే మీరు నడవగలుగుతారు. సాధ్యమైనంతవరకు సర్జరీ జరిగిన 24 గంటల్లోపే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారు. మీరు నెలల తరబడి మంచానికి పరిమితం కావాల్సిన అవసరం ఉండదు. దాంతో మీరు ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. సర్జరీ జరిగిన నాలుగురోజుల్లో మీరు పూర్తిగా కోలుకొని సాధారణ జీవితం గడపగలుగుతారు. సర్జరీ తర్వాత మీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఈ విధానంలో ఆపరేషన్ ముందు నుంచే నొప్పి నివారణ ప్రక్రియలు ప్రారంభిస్తారు. మీకు ఎలాంటి బాధ లేకుండా సర్జరీ చేస్తారు. ఫాస్ట్ట్రాక్ విధానంలో ఆపరేషన్ చేయడానికి వైద్యులు నిర్ధారణ చేస్తే, ఈ సర్జరీకి ముందు, తర్వాత చేయాల్సిన వ్యాయామాలు, ఫిజియోథెరపీ గురించి వైద్యులు క్షుణ్ణంగా తెలియజేస్తారు. మీ సందేహాలూ, అపోహలూ పూర్తిగా నివృత్తి అయిన తర్వాతనే సర్జరీకి సిద్ధం చేస్తారు. కాబట్టి మీరు అనవసరమైన భయాందోళనలూ, అపోహలను పక్కనబెట్టి వెంటనే శస్త్రచికిత్సకు సిద్ధమవండి. గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నాకు 8 నెలల క్రితం అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో రక్తపరీక్షల్లో హెపటైటిస్ ‘బి’ పాజిటివ్ అని చెప్పినారు. ఆర్నెల్ల తర్వాత మళ్లీ టెస్ట్ చేస్తే మళ్లీ హెపటైటిస్ ‘బి’ పాజిటివ్ అన్నారు. ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఉందా లేదా సరైన సలహా ఇవ్వగలరు. - లక్ష్మయ్య, వరంగల్ మీకు 6 నెలల తర్వాత కూడా హెపటైటిస్ ‘బి’ పాజిటివ్ అన్నారు కాబట్టి మీకు క్రానిక్ హెపటైటిస్ ‘బి’ అనే వ్యాధి ఉంది. ఈ వ్యాధి ఉన్నవారు మొదట కొన్ని రక్త పరీక్షలు చేసుకొని వ్యాధి ఏ స్టేజిలో ఉందో తెలుసుకోవాలి. వ్యాధి చాలామందిలో సుప్తావస్థలో ఇన్యాక్టివ్ దశలో ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి యాక్టివేట్ స్టేజ్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉన్నవారికి ఏ మందులు అవసరం లేదు. వీరు చేయవలసిందల్లా ప్రతి 3 నుండి 6 నెలలకు ఒకసారి గాస్ట్రో ఎంటరాలజిస్టుని సంప్రదించి ఎల్.ఎఫ్.టి. పరీక్షలు చేసుకొని మీ వ్యాధి యాక్టివ్ స్టేజ్లోకి ఏమైనా వెళ్లిందా అనేది చూసుకోవాలి. యాక్టివ్ స్టేజ్లోకి వెళ్తే దానికి వివిధ రకాలైన మందులు లభ్యమవుతాయి. అందులో మీరు ఏ డ్రగ్ వాడాలో మీ దగ్గరలోని డాక్టర్ని సంప్రదించి వాడడం అవసరం. నా వయసు 55. మలద్వారం ద్వారా రక్తం పడుతోంది. డాక్టర్ని సంప్రదిస్తే పైల్స్ అని చెప్పి ఆపరేషన్ చేశారు. కాని రక్తం పడడం ఆగలేదు. దయచేసి నా సమస్యకు సరైన సలహా ఇవ్వగలరు. - రామారావు, వైజాగ్ మలద్వారం ద్వారా రక్తం రావడానికి పైల్స్ ఒక కారణం కావచ్చు, కాని రక్తం రావడానికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు. అందులో ముఖ్యంగా పెద్ద పేగు కాన్సర్. మీరు ఒకసారి కొలనోస్కోపి / సిగ్మాయిడోస్కోపి అనే పరీక్ష చేయించుకోవడం మంచిది. ఆ పరీక్షలో మీకు రక్తం ఎక్కడ నుండి వస్తుందో తెలుస్తుంది. కారణం తెలిస్తే సరైన వైద్యం చేయించుకోవచ్చు. 50 ఏళ్లు పైబడిన వాళ్ల పెద్దప్రేగు కాన్సర్ రావడానికి చాలా అవకాశం ఉంది. ఈ కాన్సర్ని తొలి దశలో కనుగొంటే క్యూర్ అయ్యే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. మీరు అశ్రద్ధ చేయకుండా దగ్గరలోని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ను సంప్రదించండి. -
‘వెన్ను’లో వణుకు!
నగరంలో పెరుగుతున్న వెన్ను నొప్పి బాధితులు అత్యధికులు 30-40 ఏళ్లలోపు వారే నేడు వరల్డ్ స్పైన్ డే సిటీబ్యూరో: గ్రేటర్లోని యువతను వెన్ను, మెడ, నడుం నొప్పి వంటివి వేధిస్తున్నాయి. పాతికేళ్లకే నగర వాసులు ఈ నొప్పుల బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అదేపనిగా వాహనాలపై ప్రయాణించడం... గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కదలకుండా కూర్చోవడం వల్ల చిన్న వయసు (30-40 ఏళ్లు)లోనే మెడ, నడుం, వెన్నెముక నొప్పుల భారిన పడుతున్నారు. బాధితుల్లో 65-70 శాతం మంది ద్విచక్ర వాహనదారులే. ఐటీ అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారు.. మార్కెటింగ్ రంగంలోని వారే ఎక్కువ ఉన్నట్లు వెల్లడైంది. 2002-2007 మధ్య కాలంలో జంట నగరాల్లో ఐదు వేల వెన్నెముక శస్త్ర చికిత్సలు జరగ్గా... 2012-13లో ఈ సంఖ్య పది వేలు. తాజాగా ఇవి నెలకు సగటున వెయ్యికి చేరుకున్నట్లు సన్షైన్ ఆస్పత్రికి చెందిన స్పైన్ సర్జన్ డాక్టర్ జీపీవీ సుబ్బయ్య స్పష్టం చేశారు. ఓ వైపు మెట్రో పనులు.. మరో వైపు గుంతలు చిన్నపాటి వర్షానికే గ్రేటర్ రహదారులు తీవ్రంగా దెబ్బ తింటున్నాయి. రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. దీనికి తోడు మెట్రో పనుల కోసం రోడ్లను తవ్వేస్తున్నారు. వాహనదారులంతా గుంతల రోడ్లపై ప్రయాణించాల్సి వస్తోంది. ఫలితంగా ద్విచక్ర వాహనదారులు, ఆటో, బస్సు డ్రైవర్లు కూడా వెన్నునొప్పికి గురవుతున్నట్టు తేలింది. వృద్ధులకు ఎముకలు విరిగిపోతుంటే... యువతకు తుంటి డిస్కులు జారుతున్నాయి. మధ్య వయస్కులు మెడ నొప్పితో బాధ పడుతున్నారు. పదే పదే ఈ భాగాలపై ఒత్తిడి పెరగడం వల్ల అరుగుదలకు గురవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఫిజియోథెరపీతో మేలు జంట నగరాల్లో వెన్నునొప్పి బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. క్యాన్సర్, హృద్రోగాలతర్వాత అత్యంత ఎక్కువగా న మోద వుతున్న కేసులు ఇవే. ఎటూ కదలకుండా ఆరు గంటల పాటు ఒకే స్థితిలో కూర్చోవడం... గతుకుల రోడ్లపై ఎక్కువ దూరం ప్రయాణించడంతో డిస్కులు దెబ్బతింటున్నాయి. అతిగా మద్యం తాగడం, సిగరెట్ల అలవాటు కూడా ఎముకల అరుగుదలకు మరో కారణం. బాధితుల్లో 98 శాతం మందికి మందులు, ఫిజియోథెరపీతో నయమవుతుంది. కేవలం రెండు శాతం మందికే శస్త్రచికిత్స అవసరం. - డాక్టర్ జీపీవీ సుబ్బయ్య, సన్షైన్ ఆస్పత్రి. నగరంలో ఏటా కొత్తగా లక్ష మంది వరకు మెడ, నడుం, వెన్ను నొప్పుల బారిన పడుతున్నట్లు ట్విన్ సిటీస్ ఆర్థోపెడిక్, స్పైన ల్ డాక్టర్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది. చెన్నై, బెంగుళూరు, త్రివేండ్రం, కొచ్చిన్లతో పోలిస్తే హైదరాబాద్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలిపింది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఉత్తమం పని చేస్తున్న వారిలో 50 శాతం మంది ఏదో ఒక సమయంలో దీని బారినపడుతున్న వారే. బరువులు ఎత్తే సమయంలో వెన్నెముక ఎక్కువగా వంచకూడదు.సాధ్యమైనంత వరకు సాఫీగా ఉన్న రోడ్లపై వాహనాలు నడుపాలి.కూర్చొనే సమయంలో ముందుకు వంగరాదు. దీని వల్ల నడుం నొప్పితో పాటు అధిక బరువు, ఎసిడిటీ, ఊబకాయం, శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి.నిద్రపోయే సమయంలో 50 శాతం సమయం వెల్లకిలా... 20 శాతం సమయం కుడివైపు... మరో 20 శాతం ఎడమ వైపు తిరిగి... పది శాతం బోర్లా పడుకోవాలి. దీంతో పొట్ట, వెన్నుముక కండరాలు రిలాక్స్ అవుతాయి.ఈత కొట్టడం వల్ల వెన్నుముక మరింత గట్టి పడి జీవితకాలం పెరుగుతుంది. {పొటీన్లు, క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి.భుజంగాసనం, శలభాసనంతో మెడ కండరాలు బలపడతాయి. -డాక్టర్ సీహెచ్ సురేష్, కిమ్స్ ఆస్పత్రి -
టి.సుబ్బరామిరెడ్డికి అస్వస్థత
అనంతపురం: కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి (టీఎస్ఆర్) శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన్ని కదిరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టీఎస్ఆర్ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అలానే అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. అయితే వెన్నునొప్పి మరింత తీవ్రం కావడంతో ఆయన్ని ప్రత్యేక అంబులెన్స్లో కదిరి తరలించారు. -
హోమియోపతి కౌన్సెలింగ్
వెన్నునొప్పికి సర్జరీనే మార్గమా? నాకు విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. దీనికి హోమియో ప్రక్రియలో చికిత్స ఉందా? దయచేసి వివరించగలరు. - సుమన్, బాలాపూర్ ఇటీవల వెన్నునొప్పి ఎక్కువ మందిలో కనిపిస్తున్న చాలా సాధారణమైన సమస్య. వెన్నుభాగంలో లిగమెంట్లు, కండరాలు, ఫేసెట్ జాయింట్లు ఒకదానితో ఒకటి అనుసంధానితమై శరీరానికి స్థిరత్వాన్ని ఇస్తాయి. మన రోజువారీ జీవితంలో శారీరకంగా ఎదురయ్యే ఎన్నో సమస్యలను తట్టుకొని నరాల మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా కాపాడుకోవడం వెన్నెముక ప్రధాన లక్షణం. అధికంగా బరువు ఎత్తడం, దించడం, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు, క్యాల్షియమ్ లోపం, విటమిన్ బి12, డీ3 లోపాలు, ఎముకల సాంద్రత తగ్గడం వంటివి వెన్నునొప్పికి కొన్ని కారణాలు. మనం ఏ పని చేయాలన్నా ప్రతిక్షణం మెడ, నడుములోని వెన్నుపూసలు పనిచేయాలి. అందుకే ప్రతి పదిమందిలో ఆరు నుంచి ఎనిమిది మంది వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. వెన్నుపూసలు అరిగినందువల్ల వెన్నునొప్పి వస్తుంది కాబట్టి మందులతో దాన్ని పరిష్కరించలేమనీ, ఆపరేషన్ అవసరమని చాలామందిలో ఒక అపోహ ఉంది. పైగా ఇది జీవితాంతం వేధిస్తూ ఉంటుందని నిస్పృహ కూడా కొందరు పేషెంట్లలో ఉంటుంది. వెన్నునొప్పికి కారణమైన డిస్క్ బల్జ్, డిస్క్ కంప్రెషన్, నరాలమీద ఒత్తిడి పెరగడం వల్ల తీవ్రమైన నొప్పి సవ్తుంటుంది. అయితే హోమియోలో ఇలాంటి వెన్ను సంబంధమైన నొప్పులు వచ్చినప్పుడు... ఉదాహరణకు డిస్క్ బల్జ్ వల్ల నరాలమీద ఒత్తిడి పెరిగినప్పుడు తగ్గించడానికి కోబాల్ట్ లాంటి ప్రభావపూర్వకమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఇక మెడభాగంలో ఉండే వెన్నుపూసలు అరిగినప్పుడు వచ్చే నొప్పిని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. మెడ భాగంలో సి1 నుంచి సి7 వరకు ఉండే వెన్ను పూసలను సర్వైకల్ పూసలు అంటారు. ఇవి అరిగినప్పుడు వెన్నుపూసల కీళ్ల మధ్య భాగం తగ్గిపోవడం వల్ల డిస్క్బల్జ్ ఏర్పడటం, వెన్నుపూసల మధ్య రాపిడి పెరగడం వంటి కారణాల వల్ల మెడ భాగం నుంచి నొప్పి మొదలై చేతి వేళ్ల వరకు నొప్పి పాకుతూ ఉంటుంది. దాంతో పాటు తిమిర్లు, చేయి మొద్దుబారడం, మెడ ఫ్రీగా తిరగలేకపోవడం, మెడ పట్టివేసినట్లుగా ఉండటం వంటివి చూస్తుంటాం. ఇలాంటి వారికి కూడా యాసిడ్ఫాస్ అనే మందు బాగా పనిచేస్తుంది. ఇక మెడ, నడుము, వెన్నెముక నొప్పిలకు ఆస్క్కులస్ హిప్, రస్టాక్స్, బ్రయోనియా ఆల్బ్, కాల్కేరియా ఫ్లోర్, హైపరికం, మహిళల్లో వచ్చే ఇలాంటి సమస్యలకే సిమిసిఫ్యూగా వంటివి అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఆస్తమా తగ్గదంటారు.. నిజమేనా..!? నా వయసు 48. గత పాతికేళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్నాను. రకరకాల మందులు వాడాను. అయితే ఆస్తమా వచ్చినప్పుడు ఆయాసం తగ్గడానికి వాడే మందులు తప్ప... శాశ్వత పరిష్కారం ఉండదని చెబుతున్నారు. నిజమేనా? హోమియోలో ఏదైనా పరిష్కారం ఉందేమో చెప్పండి. - యాదయ్య, భువనగిరి ఆస్తమా అనేది సాధారణమైన దీర్ఘకాలిక సమస్య. మన ముక్కులోకి, ఊపిరితిత్తుల్లోకి లేదా శరీరంలోకి సరిపడని సూక్ష్మపదార్థాలు (అలర్జెన్స్) గాలి ద్వారా లేదా ఆహారం ద్వారా ప్రవేశించినప్పుడు, వాటికి ప్రతిచర్యగా మన శరీరం స్పందించి, వివిధ రకాల రసాయనాలు విడుదల చేసి, శ్వాసనాళాలలో శ్లేష్మపొర వాపునకు గురిచేస్తాయి. దీనివల్ల శ్వాసనాళాలు కుంచించుకుపోయి, ఊపిరితీసుకోవడం కష్టమవుతుంది. దగ్గు, ఆయాసం, పిల్లికూతలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే ఆస్తమా లేదా ఉబ్బసం అంటారు. ఆస్తమా లక్షణాలు : శ్వాసనాళాలు సంకోచించడం వల్ల గాలి రవాణాకు ఆటంకం కలిగి ఆయాసం, దగ్గు వస్తాయి. ఛాతీ బరువుగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది, పిల్లికూతలు ప్రధాన లక్షణాలు. పిల్లల్లో ఈ లక్షణాలతో పాటు రాత్రివేళ దగ్గు, పిల్లికూతలు, పగలు పరుగెత్తినప్పుడు, మాట్లాడినప్పుడు ఆయాసపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆస్తమాకు కారణాలు : వాతావరణంలో మార్పులు, దుమ్ము, ధూళి, ఘాటైన వాసనలు, పెంపుడు జంతువులూ వాటి వెంట్రుకలు, మస్కిటో రిపెల్లెంట్స్, రకరకాల స్ప్రేలు, విసర్జకాలు, పూలమొక్కల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు, శీతలపానీయాలు, ఐస్క్రీమ్స్, జన్యుసంబంధమైన కారణాలు... ఉబ్బసం రావడానికి గల కారణాలలో కొన్ని. నిర్ధారణ : సీబీపీ, ఈఎస్ఆర్, అబ్సల్యూట్ ఇజినోఫిల్ కౌంట్, ఎక్స్రే (చెస్ట్), సీటీ స్కాన్, స్పైరోమెట్రీ, పల్మునరీ ఫంక్షన్ టెస్ట్ మొదలైన వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రతను నిర్ధారణ చేయవచ్చు. నివారణ మార్గాలు : దుమ్ము, ధూళి నుంచి దూరంగా ఉండాలి శీతలపానియాలు, ఐస్క్రీమ్స్ తీసుకోకూడదు పెంపుడు జంతువులను దూరంగా ఉంచాలి ఇంటి పరిసర ప్రాంతాలలో ఉండే పార్థీనియం మొక్కలను తొలగించి, పుప్పొడికి దూరంగా ఉండాలి. ఆస్తమా ఎప్పటికీ తగ్గదని చాలామంది భావన. కానీ అందులో నిజంలేదు. హోమియో ప్రక్రియలో ఆస్తమాను పూర్తిగా తగ్గించే మందులు అందుబాటులో ఉన్నాయి. మీరు నిపుణులైన హోమియోవైద్యులను కలిసి, తగు జాగ్రత్తలతో మందులు వాడితే ఆస్తమా పూర్తిగా తగ్గిపోతుంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ థైరాయిడ్ సమస్యల నుంచి విముక్తి ఎలా? నా వయసు 56. పిల్లల చదువులు పూర్తయి వారు స్థిరపడ్డాక పదేళ్ల క్రితం నగరానికి వచ్చాను. అప్పట్నుంచి థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నాను. మా పిల్లలు చిన్నవారైనప్పటికీ వారిలోనూ ఇదే సమస్య ఉన్నట్లు ఇటీవలే తెలిసింది. థైరాయిడ్ సంబంధిత సమస్యలు తగ్గేందుకు మార్గాలు చెప్పండి. - అనసూయబాయి, హైదరాబాద్ మీరు చెప్పినట్లుగా ఇటీవల నగరాలలో థైరాయిడ్ సమస్యలు రావడం పెరుగుతోంది. నగరాలలో పెరుగుతున్న మానసిక ఒత్తిడులు ఒక రకంగా థైరాయిడ్ సమస్యలకు కారణం అని చెప్పవచ్చు. థైరాయిడ్ అనేది మన గొంతు దగ్గర ఉండే కీలకమైన గ్రంథి. ఇది స్రవించే హార్మోన్లు మానసిక ఆలోచనలపై ప్రభావం చూపేవిగా ఉంటాయి. ఈ గ్రంథి టీ4, టీ3, టీఎస్హెచ్ హార్మోన్లను స్రవిస్తుంది. సున్నిత మనస్తత్వం కలవారు, ప్రతి చిన్న విషయాన్నీ మనసుపైకి తీసుకునేవారిలో ఈ గ్రంథి స్రవించే హార్మోన్ సమతౌల్యత దెబ్బతింటుంది. టీహెచ్ఎస్ ఎక్కువ అవడం వల్ల అతిగా బరువు పెరగడం, అతి ఆలోచన, అతి బద్దకం, మతిమరపు, అదినిద్ర వచ్చే అవకాశం ఉంది. మా వద్ద నిర్వహించిన పరిశోధనల ప్రకారం స్త్రీలలో థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. మా పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే... స్త్రీలలో రుతుస్రావ సమస్యలు, గర్భం రాకుండా ఉండేందుకు వాడే మందులు, పీరియడ్స్ సక్రమంగా వచ్చేందుకు వాడే మందుల వల్ల థైరాయిడ్పై దుష్ర్పభావాలు పడి, దానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి మందులు వాడటం వల్ల ప్రతి 100లోనూ 50 మంది థైరాయిడ్ సమస్యల బారిన పడుతున్నారు. ఇటీవల చిన్నపిల్లల్లో కూడా థైరాయిడ్ సమస్యలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం... గర్భవతిగా ఉన్నప్పుడు వచ్చే మహిళల్లో వచ్చే అనారోగ్య సమస్యల వల్లనే అని తేలింది. దీనికి బదులు ప్రెగ్నెన్సీ సమయంలో తొమ్మిది నెలల పాటు హోమియోపతి మందులు వాడితే పిల్లల్లోనూ సమస్యలు రాకుండా నివారించవచ్చు. తల్లిదండ్రులకు థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలలోనూ ఆ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇక ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేమిటంటే థైరాయిడ్ సమస్యలన్నీ ఒకేలా ఉండవు. హార్మోన్ స్రావం పెరిగితే ఒకలా, తగ్గితే మరొకలా, నాడ్యూల్స్ వస్తే ఇంకోలా లక్షణాలు కనిపిస్తాయి. హోమియోలో ఈ లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులు ఇస్తారు. ఉదాహరణకు... ఆర్సినిక్ ఆల్బ్: హైపోథైరాయిడిజమ్లో కనిపించే నిద్రలేమి, ఎవరినీ నమ్మకపోవడం, ఆలోచనలు అస్థిమితంగా ఉండటం, అతి ఆందోళన వంటివాటికి ఈ మందు బాగా పనిచేస్తుంది. కాల్కేరియా కార్బ్: ఇది కూడా హైపోథైరాయిడిజమ్లో లక్షణాలతో పాటు చిన్నపిల్లల మనస్తత్వం, గుర్తింపుకోసం తహతహ, అసూయ వంటి లక్షణాలున్నవారికి. ఓపియమ్ : అతినిద్ర, గురకపెట్టడం, ప్రతివిషయాన్ని అశ్రద్ధ చేయడం, అతిచురుకు లక్షణాలున్నవారికి ఈ మందు. నేట్రమ్మ్యూర్ : అతిగా స్పందించడం, అసంతృప్తి, అతి ఆలోచన వంటి లక్షణాలకు ఈ మందు. ఇలా అన్నిరకాల థైరాయిడ్ సమస్యలకు హోమియోలో మంచి మందులు ఉన్నాయి. డాక్టర్ ఎ.ఎమ్.రెడ్డి, పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ -
ప్రయోజనం లేని పారాసిటమాల్!
నొప్పి నివారణకు నో యూజ్ చాలా మంది వెన్నునొప్పికీ, నడుమునొప్పికి పారాసిటమాల్ మేలు అనుకుని ముందస్తు చికిత్సగా ఆ మాత్ర మింగుతుంటారు. కానీ నిజానికి పారాసిటమాల్ వాడటం కూడా అంత మంచిది కాదంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన నిపుణులు. సగటు వయసు 45 ఉన్న 1,652 మంది రోగులపై నిర్వహించిన అధ్యయనంలో నడుము, వెన్ను నొప్పితో బాధపడే వారిలో కొందరికి పారాసిటమాల్ ఇచ్చారు. మరికొందరికి పారాసిటమాల్ మాత్ర ఇచ్చారు కానీ అందులో మందు లేదు. 17 రోజుల తర్వాత పరీక్షించి చూడగా... నిజానికి మందు తీసుకున్నవారిలోనూ, మందుతీసుకోకుండా కేవలం ‘ప్లాసెబో’ఎఫెక్ట్తో ఉపశమనం పొందినవారిలోనూ పెద్దగా ఎలాంటి తేడా లేదని అధ్యయనవేత్తలు గుర్తించారు. (ప్లాసెబో ఎఫెక్ట్ అంటే మందు వాడకపోయినా వాడామనే అనుభూతి వల్లనే సాంత్వన పొందడం). పై నొప్పులకు ఫిజియోథెరపీయే మంచి చికిత్స అంటున్నారు నిపుణులు. -
ఈ ఫ్యాషన్స్తో వెన్ను నొప్పి ఖాయం
న్యూఢిల్లీ: నేటితరంలో చాలామంది ఫ్యాషనబుల్గా ఉండడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగా ఒంటికి అతుక్కుపోయే దుస్తులను ఎక్కువగా ధరిస్తున్నారు. అయితే ఇలా ఒంటికి అతుక్కుపోయే డ్రెస్లు నరాల పనితీరుమీద ఒత్తి డి కలిగిస్తాయని, దీంతో వెన్నునొప్పి లాంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. న్యూఢిల్లీలోని క్యూఐ స్పైన్ క్లినిక్కి చెందిన వెన్నునొప్పి నిపుణులు సూరజ్ బఫ్నా ఈ సమస్యపై తన సూచనలిస్తున్నారు. ► ఒంటికి అతుక్కుపోయే జీన్స్ నడుము, తొడలు, కండరాలపై ఒత్తిడిన కలుగజేస్తాయి. ఇది మోకాలి జాయింట్ పేయిన్స్కి కారణమవుతాయి. ► బరువైన బ్యాగ్లు ధరించడం కూడా ఆరోగ్య సమస్యలకి దారి తీస్తుంది. సాధారణంగా బ్యాగ్ను ఏదైనా ఒకవైపే ఎక్కువగా ధరిస్తాం. అధిక బరువు ఉన్న బ్యాగ్లను ఒకే వైపు ఉంచడంతో వెన్ను మీద అధిక భారం పడుతుంది. ఇది వెన్ను నొప్పిని కలిగిస్తుంది. ► నగరాల్లో యువతులు ఎక్కువగా హైహీల్స్ ధరిస్తున్నారు. ఇది పాదాలు, వెన్నెముకపై ఒత్తిడి కలిగిస్తుంది. తొడ కండరాలు క్షీణించేలా చేస్తుంది. దీంతో రక్త ప్రసరణ సమస్యలు తలెత్తడంతోపాటు, మోకాలి చిప్ప అరుగుదలకు కూడా కారణమవుతుంది. ఈ పరిస్థితి తలెత్తకుండా కంఫర్టబుల్ పాదరక్షలు వాడడం ఉత్తమం. -
నా బ్యాక్ పెయిన్కీ ఆస్ట్రేలియా ట్రిప్కీ లింకేంటి?
‘‘విరాట్ బాగా ఆడితే అభినందనలు... ఆడకపోతే నిందలు. మొత్తానికి అతనికి సంబంధించిన ఏ విషయాన్నయినా నాతో ముడిపెట్టాలని చాలామంది ఫిక్స్ అయినట్లున్నారు’’ అని ఓ ఇంటర్వ్యూలో అనుష్క శర్మ పేర్కొన్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో తలపడిన వరల్డ్కప్ మ్యాచ్లో ఒకే ఒక్క పరుగు తీసి, విరాట్ కోహ్లి అవుట్ అయిన విషయం తెలిసిందే. అనుష్క శర్మ ఆ మ్యాచ్ని తిలకించడానికి సిడ్నీ వెళ్లినందువల్లే, విరాట్ సరిగ్గా ఆడలేదని చాలామంది ఈ బ్యూటీని నిందించారు. అలాగే, సిడ్నీ నుంచి వచ్చాక ‘బ్యాక్ పెయిన్’ భరించలేక ముంబయ్లోని కోకిలాబెన్ ఆస్పత్రికి వెళ్లారు అనుష్క. ఈ విషయం గురించి కొంతమంది లేనిపోని ఊహాగానాలు చేసి, సెటైర్లు వేస్తున్నారట. ఈ సెటైర్లకు అనుష్క స్పందిస్తూ -‘‘నేను ‘ఎన్హెచ్ 10’ సినిమా చేస్తున్నప్పుడు నాకు వెన్ను నొప్పి మొదలైంది. అప్పట్నుంచీ తీరిక లేక చూపించుకోలేదు. ఇప్పుడు బాధ భరించలేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లాను. అయినా నా బ్యాక్ పెయిన్కీ ఆస్ట్రేలియా ట్రిప్కీ లింకేంటి? ఊహాగానాలకు కూడా ఓ హద్దు ఉండాలి’’ అన్నారు. విరాట్, తానూ తమ అనుబంధాన్ని దాచకుండా బయటికి చెప్పేశామనీ, చివరికి పబ్లిక్లోకి వచ్చినప్పుడు తమను ఫొటోలు తీసినా ఏమీ అనడంలేదనీ, అయినా కనికరం చూపించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం బాధాకరం అనీ అనుష్క పేర్కొన్నారు. విమర్శలు, ఊహాగానాల వల్ల తమ అనుబంధంలో ఎలాంటి మార్పు రాదని కూడా ఆమె స్పష్టం చేశారు. -
వెన్నునొప్పి ముదిరితే మిగిలేది వైకల్యమే
వెన్నునొప్పి ప్రాణాలేమీ తీయక పోవచ్చు కానీ, శరీరాన్ని నిర్జీవంగా మార్చేస్తుంది. దీనికి పెయిన్ కిల్లర్స్, సర్జరీ, బెడ్రెస్ట్, ఫిజియోథెర పీ శాశ్వత పరిష్కారం కాదు. ఆయుర్వేదంలో సూచించిన కేరళ పంచకర్మ, మర్మ చికిత్సలతో వెన్ను నొప్పికున్న మూల కారణాలను శాశ్వతంగా నిర్మూలించవచ్చు. అంతే కాకుండా వెన్నెముకని ఉక్కు స్తంభంలా మారుస్తుందంటున్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ పి.కృష్ణప్రసాద్. వెన్నెముక వర్సెస్ పవర్హౌస్ వెన్నెముక పవర్ హౌస్ లాంటిది. ఇది కాళ్లు, చేతులు, తల, భుజాలు, మెడను స్థిరంగా నిలబడేలా చేస్తుంది. వివిధ కారణాలవల్ల ఒక్కోసారి ఈ పవర్ హౌస్ శక్తిహీనంగా మారుతుంది. సరైన సమయంలో వైద్య చికిత్సలేవీ అందకపోతే భుజం నొప్పులు, మెడ నొప్పులు, కళ్ల నొప్పులు మొదలౌతాయి. వెన్ను భాగంలో మొద్దుబారినట్లు, బలహీన పడి నట్లు, చురకలు, పోట్లు, మంటలు మొదలౌతాయి. జీర్ణ వ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి. అలాగే కొనసాగితే కొన్ని లైంగిక సమస్యలు సైతం తలెత్తవచ్చు. ఎవరికైనా వెన్నుపాములోని డిస్క్లు, నరాలు ఒత్తిడికి గురైతే.. కాళ్లు, చేతులు పక్షవాతానికి కూడా తలెత్తవచ్చు. సర్జరీతో ఒరిగేది శూన్యం... వెన్నునొప్పితో వెళితే వైద్యులు మొట్టమొదటగా సూచించేది పెయిన్ కిల్లర్లే. అవి వాడితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది గానీ, అందుకు గల కారణాలను మాత్రం తగ్గించలేదు. పెయిన్ కిల్లర్స్ అతిగా వాడటం వల్ల తలనొప్పి, కడుపు బ్బరం, లివర్, కిడ్నీలు దెబ్బతినడం వంటివి తలెత్తుతాయి. సర్జరీ చేయించుకొంటే.. పెద్ద మొత్తంలో ఖర్చు అవడమే తప్ప కలిగే ప్రయోజనం మాత్రం శూన్యం. కనీసం ఆ ఒక్క సర్జరీతో అంతా అయిపోతుందా అంటే.. చెప్పలేం. ఆ తరువాత మరో సర్జరీ అవసరం కూడా రావచ్చు. కేరళ పంచకర్మతో... అస్థిధాతుక్షయం, మార్గావరోధాల వల్లే శరీరంలో వాతం పెరుగుతుంది. ఆ వాతమే వెన్ను నొప్పికి, కాలంతా పాకే సయాటికా నొప్పికి మూలం అవుతుంది. అందుకే ధాతుక్షయాన్ని, మార్గావరో ధాన్ని నివారించే చికిత్సలకు ఆయుర్వేదం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. చికిత్స క్రమంలో కీళ్లు, లిగమెంట్లు, టెండాన్లు, డిస్కులు, వెన్నెముకతో అనుబంధంగా ఉండే కండరాలను సమస్థితికి తీసుకురావడం చాలా ముఖ్యం. అదే సమయంలో నరాల వ్యవస్థను కూడా బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ నొప్పిని తగ్గించడమే కాదు.. మరోసారి ఆ నొప్పి రాకుండా చేస్తాయి. ఈ విధానంలో మర్మ, పంచకర్మ చికిత్సల ద్వారా వెన్నునొప్పికి మూలకారణాన్ని కనుగొని ఆ నొప్పిని సమూలంగా తగ్గించి వేస్తుంది. కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సల ద్వారా మీ వెన్నెముకను కాపాడు కోండి. అది జీవితాంతం మిమ్మల్ని కాపాడుతుంది. అడ్రస్ శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ బిసైడ్ ఎస్.బి.హెచ్, నియర్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, రోడ్ నం.17, హైదరాబాద్, వివరాలకు: డా॥పి.కృష్ణ ప్రసాద్. 9030013688/ 9440213688/ 040- 65986352 E mail:krishnaprasad.gmail.com -
కేరళ పంచకర్మ చికిత్సతో వెన్నునొప్పి మాయం
వెన్నునొప్పి ప్రాణాలేమీ తీయకపోవచ్చు కానీ, శరీరాన్ని ఎందుకూ పనికిరానంత నిర్జీవంగా మార్చేస్తుంది. దీనికి పెయిన్ కిల్లర్స్, సర్జరీ, బెడ్రెస్ట్, ఫిజియోథెరపీ శాశ్వత పరిష్కారం కాదు. ఆయుర్వేదంలో సూచించిన కేరళ పంచకర్మ, మర్మ చికిత్సల ద్వారా వెన్ను నొప్పికున్న మూల కారణాలను శాశ్వతంగా శరీరం నుంచి బయటకు పంపవచ్చు. అంతే కాకుండా వెన్నెముకని ఉక్కు స్తంభంలా మారుస్తుందంటున్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ పి.కృష్ణప్రసాద్. భవనానికి పిల్లర్స్ ఏవిధంగా బలాన్నిస్తాయో, అదేవిధంగా మానవుని శరీరానికి వెన్నెముక మూల స్తంభం. అలాంటి వెన్నెముకలో ఏ సమస్య వచ్చినా శరీరమంతా ప్రభావం చూపుతుంది. వెన్ను సమస్యలకు శాశ్వత పరిష్కారం ఒక్క ఆయుర్వేద చికిత్సలోనే ఉంది. వెన్నెముక వర్సెస్ పవర్హౌస్ వెన్నెముక పవర్ హౌస్ లాంటిది. ఇది కాళ్లు, చేతులు, తల, భుజాలు, మెడను స్థిరంగా నిలబడేలా చేస్తుంది. వివిధ కారణాలవల్ల ఒక్కోసారి ఈ పవర్హౌస్ శక్తిహీనంగా మారుతుంది. సరైన సమయంలో వైద్య చికిత్సలేవీ అందకపోతే భుజం నొప్పులు, మెడ నొప్పులు, కళ్ల నొప్పులు మొదలౌతాయి. వెన్ను భాగంలో మొద్దుబారినట్లు, బలహీన పడినట్లు, చురకలు, పోట్లు, మంటలు మొదలౌతాయి. ఎవరికైనా వెన్నుపాములోని డిస్క్లు, నరాలు ఒత్తిడికి గురైతే.. కాళ్లు, చేతులు పక్షవాతానికి కూడా తలెత్తవచ్చు. సర్జరీతో ఒరిగేది శూన్యం... వెన్నునొప్పితో వెళితే వైద్యులు మొట్టమొదటగా సూచించేది పెయిన్ కిల్లర్లే. అవి వాడితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది గానీ, అందుకు గల కారణాలను మాత్రం తగ్గించలేదు. సర్జరీ చేయించుకొంటే.. పెద్ద మొత్తంలో ఖర్చు అవడమే తప్ప కలిగే ప్రయోజనం మాత్రం శూన్యం. కనీసం ఆ ఒక్క సర్జరీతో అంతా అయిపోతుందా అంటే.. చెప్పలేం. ఆ తరువాత మరో సర్జరీ అవసరం కూడా రావచ్చు. ఆయుర్వేదం ఏం చేస్తుంది..? ముందుగా వెన్ను నొప్పి రావడానికి గల మూల కారణాన్ని సమూలంగా ఆయుర్వేదం కనిబెడుతుంది. అస్థిధాతుక్షయం, మార్గావరోధాల వల్లే శరీరంలో వాతం పెరుగుతుంది. ఆ వాతమే వెన్ను నొప్పికి, కాలంతా పాకే సయాటికా నొప్పికి మూలం అవుతుంది. చికిత్స క్రమంలో కీళ్లు, లిగమెంట్లు, టెండాన్లు, డిస్కులు, వెన్నెముకతో అనుబంధంగా ఉండే కండరాలను సమస్థితికి తీసుకురావడం చాలా ముఖ్యం. అదే సమయంలో నరాల వ్యవస్థను కూడా బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ నొప్పిని తగ్గించడమే కాదు.. మరోసారి ఆ నొప్పి రాకుండా చేస్తాయి. ఈ విధానంలో మర్మ, పంచకర్మ చికిత్సల ద్వారా వెన్నునొప్పికి మూలకారణాన్ని కనుగొని ఆ నొప్పిని సమూలంగా తగ్గించి వేస్తుంది. కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సల ద్వారా మీ వెన్నెముకను కాపాడుకోండి. అది జీవితాంతం మిమ్మల్ని కాపాడుతుంది. అడ్రస్ శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ బిసైడ్ ఎస్.బి.హెచ్, నియర్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, రోడ్ నం.17, హైదరాబాద్, వివరాలకు: డా॥పి.కృష్ణ ప్రసాద్. 9030013688/ 9440213688/ 040- 65986352 E mail: krishnaprasad.6600@gmail.com -
వెన్ను నొప్పా..అశ్రద్ధ చేస్తే మిగిలేది వైకల్యమే
వెన్ను పూస ఒక పవర్ హౌస్ లాంటిది. భవనానికి పిల్లర్స్ ఏవిధంగా ఉంటాయో అలగే మానవ శరీరానికి వెన్ను పూస పిల్లర్ లాంటిది. కొన్ని కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కసారి ఈ పవర్ హౌస్ నిర్జీవం అవుతుంది. దీనివల్ల మెడ, భుజం, తల, కాళ్ళు, చేతులు, వెన్ను భాగంలో మొద్దుబారినట్లు, జిల్ జిల్ మని కరెంట్ షాక్ కొట్టినట్టు, బలహీన పడినట్లు చురకలు, పోట్లు, మంటలు మొదలవుతాయి. మరికొంత మందికి లైంగిక సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఇలాంటి నిర్జీవమైన పవర్ హౌస్కి తిరిగి శక్తిని ఇవ్వాలంటే అదేమి ఆషామాషి చికిత్సలతో కాకుండా కేవలం కేరళ పంచకర్మ చికిత్సలు, ఔషధాలతోనే సాధ్యం అంటున్నారు ప్రముఖ ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్ డా ॥పి.కృష్ణప్రసాద్. అసలు ఏమైంది? ఒకరోజు హాస్పిటల్లో బాగా బిజీగా ఉన్న సమయంలో ఒక పేషెంట్కి సంబంధించిన బంధువులు ఇక్కడికి వచ్చి డాక్టర్ గారిని కలిశారు. పేషెంట్కి ఏమయిందని డాక్టర్ గారు అడిగితే వారి బంధువులు ఈ విధంగా చెప్పారు. ‘నడుము, మెడ నొప్పులు బాగా తీవ్రంగా ఉంటాయి బెడ్ పై ఏ పక్కకు తిరిగిన కాళ్లల్లో, చేతుల్లో, భుజాలు, నడుము అంతా కరెంట్ షాక్లు వచ్చినట్టు ఉంటుంది, పట్టుమని ఐదు నిమిషాలు కూడా కూర్చోలేడు, నిల్చోలేడు, పడుకొని కుడి, ఎడమలకు తిరిగితే జిల్లుమని కరెంట్ షాక్లు కొట్టినట్టు ఉండేది, నడుముతో పాటు మెడ ప్రాంతంలో కూడా తీవ్రమైన నొప్పి వచ్చేది. రెండు చేతులు, కాళ్లు తిమ్మిర్లు, సూదులు గుచ్చుతున్నట్లు పోట్లు, మంటలు, నడిస్తే తల తిరిగి ఎక్కడ పడిపొతాడోనన్న భయం, చేతులతో ఏ వస్తువులు ఎత్తలేని పరిస్థితితో ఇలా ఈ సమస్యల చాలా కాలంగా ఉండటంతో జీవితం ఇలా అయిందేమిటన్న డిప్రెషన్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు’ అని చెప్పారు. ప్రత్యక్షంగా పేషెంట్ని, రిపోర్ట్స్ క్షుణ్ణంగా చూసిన తర్వాత అతనికి వెన్నుపూసలో లంబార్ వర్టిబ్రా లోని ఔ2, ఔ4, ఔ5, ఔ1 మధ్య ఉండాల్సిన జ్చఞ తగ్గి అక్కడ ఉన్న డిస్క్లు బయటకు వచ్చి నరాల మీద బాగా ఒత్తిడి పడుతుంది, అలాగే మెడ ప్రాంతానికి వస్తే ఇ3, ఇ4, ఇ5, ఇ6 మధ్య కూడా ఇదే సమస్య ఉన్నట్టు నిర్ధారించారు. పవర్ హౌస్కి చికిత్స: ఈ సమస్య గురించి పెయిన్ కిల్లర్స్, బెడ్రెస్ట్, ఫిజియోథెరపీ సర్జరీ అనేది శాశ్వత పరిష్కారం కాదు అని ఇట్లాంటి పరిస్థితుల్లో డాక్టర్ గారు పేషెంట్ యొక్క శారీరక, మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకొని చికిత్సను ప్రారంభించారు. కేరళ పంచకర్మతో: ఎన్ని చికిత్సలు చేసిన తగ్గని వెన్ను నొప్పులకు ఆయుర్వేదంతో మంచి నాణ్యత కలిగిన, అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన నానో రకేణువులతో కూడిన నూనెలు, ఔషధాలతో ప్రత్యేకంగా చికిత్సలు చేయటం జరిగింది. పంచకర్మ చికిత్సలతో అతిముఖ్యమైన అభ్యంగనం, తైలధార, కటిబస్తీ, గ్రీవబస్తీ, విరోచనం, వస్తి చికిత్సలు అందించారు. ఇలా మొదటి పది రోజులు తరువాత అరగంట సేపు కూర్చోవటం అతనిలో విపరీతమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పక్కమీద ఎటు తిరిగినా జిల్లుమన్న కరెంట్ షాక్లు ఇప్పుడు లేవు ఇప్పుడు నొప్పి ఉన్నా స్థిరంగా నడవ సాగుతున్నారు. మెడపై ఉంటే ఒత్తిడి బాగాతగ్గింది ఇంకొక 2 వారాలు తర్వాత నడుము గట్టిగా పిసికేసినట్టు ఉన్న నొప్పి అంతగా లేదు. చేతులు, కాళ్లు చాలా తేలికయ్యాయి, తిమ్మిర్లు, పోట్లు, మంటలు చాలా వరకు తగ్గుముఖం పట్టి అన్ని పనులు చేసుకోవచ్చన్న ఆత్మవిశ్వాసం పెరిగింది ఇలా 25 రోజులు అత్యంత శక్తివంతమైన కేరళ పంచకర్మ చికిత్సలు, ఔషధాలు ఇచ్చి, ఇంకొక మూడు నెలల పాటు కొన్ని ఔషధాలు ఇచ్చి సూచించిన వ్యాయామాలు చేయమని, మలబద్ధకం లేకుండా చూసుకోమని చెప్పారు. ఇప్పటికి ఆరునెలల గడిచాయి నొప్పి అన్న మాటే లేదు, ఒక ప్రముఖ సాప్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ చిన్న, చిన్న వ్యాయామాలు చేస్తూ చాలా సంతోషంగా ఉన్నాడు. -
కేరళ పంచకర్మ చికిత్సతో..
వెన్నునొప్పికి పరిష్కారం వెన్నునొప్పి ప్రాణాలేమీ తీయకపోవచ్చు కానీ, శరీరాన్ని ఎందుకూ పనికిరానంత నిర్జీవంగా మార్చేస్తుంది. దీనికి పెయిన్ కిల్లర్స్, సర్జరీ, బెడ్రెస్ట్, ఫిజియోథెరపీ శాశ్వత పరిష్కారం కాదు. ఆయుర్వేదంలో సూచించిన కేరళ పంచకర్మ, మర్మ చికిత్సల ద్వారా వెన్ను నొప్పికున్న మూల కారణాలను శాశ్వతంగా శరీరం నుంచి బయటకు పంపవచ్చు. అంతే కాకుండా వెన్నెముకని ఉక్కు స్తంభంలా మారుస్తుందంటున్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ పి.కృష్ణప్రసాద్. భవనానికి పిల్లర్స్ ఏవిధంగా బలాన్నిస్తాయో, అదేవిధంగా మానవుని శరీరానికి వెన్నెముక మూల స్తంభం. అలాంటి వెన్నెముకలో ఏ సమస్య వచ్చినా శరీరమంతా ప్రభావం చూపుతుంది. వెన్ను సమస్యలకు శాశ్వత పరిష్కారం ఒక్క ఆయుర్వేద చికిత్సలోనే ఉంది. వెన్నునొప్పి, జలుబు సామాన్యంగా అనిపిస్తాయి. కానీ ఒక దశలో భరించలేని నొప్పిని కలిగిస్తుంది. పక్షవాతంలా జీవితాన్ని కుప్పకూల్చివేస్తుంది. పైగా ఈ సమస్యలు ఏదో 5, 10 నిమిషాలు వచ్చి తగ్గిపోయేవీ కాదు. ఏళ్లకేళ్లు మంచాన పడేస్తాయి. వెన్నెముక వర్సెస్ పవర్హౌస్ వెన్నెముక పవర్ హౌస్ లాంటిది. ఇది కాళ్లు, చేతులు, తల, భుజాలు, మెడను స్థిరంగా నిలబడేలా చేస్తుంది. వివిధ కారణాలవల్ల ఒక్కోసారి ఈ పవర్హౌస్ శక్తిహీనంగా మారుతుంది. సరైన సమయంలో వైద్య చికిత్సలేవీ అందకపోతే భుజం నొప్పులు, మెడ నొప్పులు, కళ్ల నొప్పులు మొదలౌతాయి. వెన్ను భాగంలో మొద్దుబారినట్లు, బలహీన పడినట్లు, చురకలు, పోట్లు, మంటలు మొదలౌతాయి. జీర్ణ వ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి. అలాగే కొనసాగితే కొన్ని లైంగిక సమస్యలు సైతం తలెత్తవచ్చు. ఎవరికైనా వెన్నుపాములోని డిస్క్లు, నరాలు ఒత్తిడికి గురైతే.. కాళ్లు, చేతులు పక్షవాతానికి కూడా గురికావచ్చు. సర్జరీతో ఒరిగేది శూన్యం... వెన్నునొప్పితో వెళితే వైద్యులు మొట్టమొదటగా సూచించేది పెయిన్ కిల్లర్లే. అవి వాడితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది గానీ, అందుకు గల కారణాలను మాత్రం తగ్గించలేదు. పెయిన్ కిల్లర్స్ అతిగా వాడటం వల్ల తలనొప్పి, కడుపుబ్బరం, లివర్, కిడ్నీలు దెబ్బతినడం వంటివి తలెత్తుతాయి. సర్జరీ చేయించుకొంటే.. పెద్ద మొత్తంలో ఖర్చు అవడమే తప్ప కలిగే ప్రయోజనం మాత్రం శూన్యం. కనీసం ఆ ఒక్క సర్జరీతో అంతా అయిపోతుందా అంటే.. చెప్పలేం. ఆ తరువాత మరో సర్జరీ అవసరం కూడా రావచ్చు. ఆయుర్వేదం ఏం చేస్తుంది..? ముందుగా వెన్ను నొప్పి రావడానికి గల ప్రత్యేక కారణాన్ని సమూలంగా ఆయుర్వేదం కనిబెడుతుంది. అస్థిధాతుక్షయం, మార్గావరోధాల వల్లే శరీరంలో వాతం పెరుగుతుంది. ఆ వాతమే వెన్ను నొప్పికి, కాలంతా వ్యాపించే సయాటికా నొప్పికి మూలం అవుతుంది. అందుకే ధాతుక్షయాన్ని, మార్గావరోధాన్ని నివారించే చికిత్సలకు ఆయుర్వేదం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. చికిత్స క్రమంలో కీళ్లు, లిగమెంట్లు, టెండాన్లు, డిస్కులు, వెన్నెముకతో అనుబంధంగా ఉండే కండరాలను సమస్థితికి తీసుకురావడం చాలా ముఖ్యం. అదే సమయంలో నరాల వ్యవస్థను కూడా బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ నొప్పిని తగ్గించడమే కాదు.. మరోసారి ఆ నొప్పి రాకుండా చేస్తాయి. ఈ విధానంలో మర్మ, పంచకర్మ చికిత్సల ద్వారా వెన్నునొప్పికి మూలకారణాన్ని కనుగొని ఆ నొప్పిని సమూలంగా తగ్గించి వేస్తుంది. కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సల ద్వారా మీ వెన్నెముకను కాపాడుకోండి. అది జీవితాంతం మిమ్మల్ని కాపాడుతుంది. అడ్రస్ శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ బిసైడ్ ఎస్.బి.హెచ్, నియర్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, రోడ్ నం.17, హైదరాబాద్. వివరాలకు: డా॥పి.కృష్ణ ప్రసాద్. 9030013688/ 9440213688/ 040- 65986352 E mail: krishnaprasad.6600@gmail.com -
కేరళ పంచకర్మ చికిత్సతో.. వెన్నునొప్పి మాయం
వెన్నునొప్పి ప్రాణాలేమీ తీయకపోవచ్చు కానీ, శరీరాన్ని ఎందుకూ పనికిరానంత నిర్జీవంగా మార్చేస్తుంది. దీనికి పెయిన్ కిల్లర్స్, సర్జరీ, బెడ్రెస్ట్, ఫిజియోథెరపీ శాశ్వత పరిష్కారం కాదు. ఆయుర్వేదంలో సూచించిన కేరళ పంచకర్మ, మర్మ చికిత్సల ద్వారా వెన్ను నొప్పికున్న మూల కారణాలను శాశ్వతంగా శరీరం నుంచి బయటకు పంపవచ్చు. అంతే కాకుండా వెన్నెముకని ఉక్కు స్తంభంలా మారుస్తుందంటున్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ పి.కృష్ణప్రసాద్. భవనానికి పిల్లర్స్ ఏవిధంగా బలాన్నిస్తాయో, అదేవిధంగా మానవుని శరీరానికి వెన్నెముక మూల స్తంభం. అలాంటి వెన్నెముకలో ఏ సమస్య వచ్చినా శరీరమంతా ప్రభావం చూపుతుంది. వెన్ను సమస్యలకు శాశ్వత పరిష్కారం ఒక్క ఆయుర్వేద చికిత్సలోనే ఉంది. వెన్నునొప్పి, జలుబు సామాన్యంగా అనిపిస్తాయి. కానీ ఒక దశలో భరించలేని నొప్పిని కలిగిస్తుంది. పక్షవాతంలా జీవితాన్ని కుప్పకూల్చివేస్తుంది. పైగా ఈ సమస్యలు ఏదో 5, 10 నిమిషాలు వచ్చి తగ్గిపోయేవీ కాదు. ఏళ్లకేళ్లు మంచాన పడేస్తాయి. వెన్నెముక వర్సెస్ పవర్హౌస్ వెన్నెముక పవర్ హౌస్ లాంటిది. ఇది కాళ్లు, చేతులు, తల, భుజాలు, మెడను స్థిరంగా నిలబడేలా చేస్తుంది. వివిధ కారణాలవల్ల ఒక్కోసారి ఈ పవర్హౌస్ శక్తిహీనంగా మారుతుంది. సరైన సమయంలో వైద్య చికిత్సలేవీ అందకపోతే భుజం నొప్పులు, మెడ నొప్పులు, కళ్ల నొప్పులు మొదలౌతాయి. వెన్ను భాగంలో మొద్దుబారినట్లు, బలహీన పడినట్లు, చురకలు, పోట్లు, మంటలు మొదలౌతాయి. జీర్ణ వ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి. అలాగే కొనసాగితే కొన్ని లైంగిక సమస్యలు సైతం తలెత్తవచ్చు. ఎవరికైనా వెన్నుపాములోని డిస్క్లు, నరాలు ఒత్తిడికి గురైతే.. కాళ్లు, చేతులు పక్షవాతానికి కూడా తలెత్తవచ్చు. సర్జరీతో ఒరిగేది శూన్యం... వెన్నునొప్పితో వెళితే వైద్యులు మొట్టమొదటగా సూచించేది పెయిన్ కిల్లర్లే. అవి వాడితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది గానీ, అందుకు గల కారణాలను మాత్రం తగ్గించలేదు. పెయిన్ కిల్లర్స్ అతిగా వాడటం వల్ల తలనొప్పి, కడుపుబ్బరం, లివర్, కిడ్నీలు దెబ్బతినడం వంటివి తలెత్తుతాయి. సర్జరీ చేయించుకొంటే.. పెద్ద మొత్తంలో ఖర్చు అవడమే తప్ప కలిగే ప్రయోజనం మాత్రం శూన్యం. కనీసం ఆ ఒక్క సర్జరీతో అంతా అయిపోతుందా అంటే.. చెప్పలేం. ఆ తరువాత మరో సర్జరీ అవసరం కూడా రావచ్చు. ఆయుర్వేదం ఏం చేస్తుంది..? ముందుగా వెన్ను నొప్పి రావడానికి గల ప్రత్యేక కారణాన్ని సమూలంగా ఆయుర్వేదం కనిపెడుతుంది. అస్థిధాతుక్షయం, మార్గావరోధాల వల్లే శరీరంలో వాతం పెరుగుతుంది. ఆ వాతమే వెన్ను నొప్పికి, కాలంతా పాకే సయాటికా నొప్పికి మూలం అవుతుంది. అందుకే ధాతుక్షయాన్ని, మార్గావరోధాన్ని నివారించే చికిత్సలకు ఆయుర్వేదం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. చికిత్స క్రమంలో కీళ్లు, లిగమెంట్లు, టెండాన్లు, డిస్కులు, వెన్నెముకతో అనుబంధంగా ఉండే కండరాలను సమస్థితికి తీసుకురావడం చాలా ముఖ్యం. అదే సమయంలో నరాల వ్యవస్థను కూడా బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ నొప్పిని తగ్గించడమే కాదు.. మరోసారి ఆ నొప్పి రాకుండా చేస్తాయి. ఈ విధానంలో మర్మ, పంచకర్మ చికిత్సల ద్వారా వెన్నునొప్పికి మూలకారణాన్ని కనుగొని ఆ నొప్పిని సమూలంగా తగ్గించి వేస్తుంది. కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సల ద్వారా మీ వెన్నెముకను కాపాడుకోండి. అది జీవితాంతం మిమ్మల్ని కాపాడుతుంది. అడ్రస్ శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ బిసైడ్ ఎస్.బి.హెచ్, నియర్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, రోడ్ నం.17, హైదరాబాద్, వివరాలకు: డా॥పి.కృష్ణ ప్రసాద్. 9030013688/ 9440213688/ 040- 65986352 E mail: krishnaprasad.6600@gmail.com -
ఆరోగ్య ‘యోగా థెరపీ’
ఇన్నాళ్లు పగలు జాబ్తో పోటీపడిన సిటీవాసులు ఇప్పుడు రాత్రి ఉద్యోగాలతోనూ క్షణం తీరిక లేకుండా లైఫ్ సక్సెస్ వైపు పరుగులు పెడుతున్నారు. సాఫ్ట్వేర్, బీపీవో, కాల్ సెంటర్, పాత్రికేయ వృత్తిలో.. ఇలా చాలా రంగాల్లో నైట్షిఫ్ట్ జాబ్లు చాలా మందే చేస్తున్నారు. రాత్రిపూట విధులు నిర్వర్తిచడం వల్ల అనేక మందికి వారికి తెలియకుండానే అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా నిద్రలేమి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కుర్చీలో తదేకంగా కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తోంది. పని టెన్షన్లో మానసిక ఒత్తడికి గురవుతున్నారు. మహిళలకైతే మరీ ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలాంటివారికి ఎలాంటి మందులు వాడకుండానే వ్యాధులు నయం చేసేందుకు యోగా థెరపీ విధానం సిటీవాసుల ముందుకు వచ్చింది. మామూలుగా డాక్టర్లు ఇచ్చే మెడిసిన్ వల్ల అప్పటికప్పుడు ఉపశమనం ఉంటుందేమో గానీ పూర్తి స్థాయిలో కంట్రోల్ కాదు. అరుుతే, యోగా థెరపీ ద్వారా వ్యాధులను జీవితాంతం దరి చేరకుండా చేయవచ్చంటున్నారు హిమాయత్నగర్లో ఉంటున్న సుమన పోతుగుంటల. నాన్న పండిట్ డాక్టర్ పీవీ సీతారామయ్య ప్రోత్సాహంతో యోగాను ఎంచుకున్నానన్న ఈమె నగరవాసుల ఆరోగ్య సమస్యలకు యోగా థెరపీతో చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. షట్క్రియాతో ఎంతో మేలు... షట్క్రియా చేయడం సిటీవాసుల ఆరోగ్యానికి ఎంతో మంచిది. జలనేతి, సూత్రానేతి క్రియల ద్వారా ఆస్థవూ, సైనసైటిస్, టీబీ, జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, కంటినొప్పి, చెవినొప్పి, గొంతునొప్పి, టాన్సిల్స్, మూర్చ, నిద్రలేమి, నిమోనియాలను నియంత్రింవచ్చు. అలాగే ముక్కు దిబ్బడ, కఫం, ముక్కు లోపల దుమ్ము ధూళిని పొగొట్టి శ్వాసక్రియ బాగా జరిగేలా షట్క్రియా విధానం మేలు చేస్తుంది. జలినేతి విధానంలో కాచి చల్చార్చిన గోరువెచ్చని నీరు, ఉప్పు వాడాలి. యోగనిద్రతో నిద్రలేమికి చెక్... ‘రాత్రిపూట విధులు నిర్వహించే ఉద్యోగులు శవాసనం, యోగ నిద్ర ద్వారా నిద్రలేమిని అధిగమించొచ్చు. కేవలం 15 నిమిషాలు పాటు ఈ యోగ చేస్తే రెండు గంటల నిద్రతో సమానం. బాడీ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. హర్మోన్స్ చక్కగా పనిచేస్తాయ’ని సుమన వివరించారు. పని ఒత్తిడిని అధిగమించేందుకు ప్రాణయామ చేస్తే సరిపోతుంది. జాబ్ చేస్తూనే ఇది ఎప్పుడైనా చేయవచ్చు. చాలా మంది సిటీవాసుల వెంటబడుతున్న ఒబేసిటీని కపాలాభాతి ద్వారా నియంత్రించొచ్చు. పొట్టను లోపలికి లాగి గాలిని త్వరత్వరగా వదలాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని మలినాలు గాలి ద్వారా బయటకు వస్తాయి. మామూలు ఫుడ్ తీసుకున్న గంట తర్వాత, భోజనం చేస్తే నాలుగు గంటల తర్వాత ఈ కపాలాభాతి చేయాలి. కనీసం ఐదు నిమిషాలు పాటు చేయాలి. అలాగే ఒకే కుర్చీలో నిరంతరాయంగా కూర్చొని ఉండటం, నిటారుగా కూర్చకపోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. కటి చక్రాసనం, అర్ధ చక్రాసనం, అర్ధకటి చక్రసనం చేయడం ద్వారా ఈ నొప్పిని నియంత్రించొచ్చు. బద్ధకోణాసనంతో నార్మల్ డెలివరీ.. అమ్మాయిలు గర్భవతిగా ఉన్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మంచి ఫుడ్తో పాటు నార్మల్ డెలివరీ అయ్యేందుకు బద్ధకోణాసనం, ఉపవిష్టకోణాసనం, పశ్చిమోత్తనా సనం వేయాలి. తాడాసనంతో మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. సిటీవాసులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను యోగా థెరపీతో నియంత్రించవచ్చు’ అని సుమన వివరించారు. వాంకె శ్రీనివాస్ -
పంచకర్మ చికిత్సతో.. వెన్నునొప్పి మటుమాయం
వెన్నునొప్పి ప్రాణాలేమీ తీయకపోవచ్చు కానీ, శరీరాన్ని ఎందుకూ పనికిరానంత నిర్జీవంగా మార్చేస్తుంది. దీనికి పెయిన్ కిల్లర్స్, సర్జరీ, బెడ్రెస్ట్, ఫిజియోథెరపీ శాశ్వత పరిష్కారం కాదు. ఆయుర్వేదంలో సూచించిన కేరళ పంచకర్మ, మర్మ చికిత్సల ద్వారా వెన్ను నొప్పికున్న మూల కారణాలను శాశ్వతంగా శరీరం నుంచి బయటకు పంపవచ్చు. అంతే కాకుండా వెన్నెముకని ఉక్కు స్తంభంలా మారుస్తుందంటున్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ పి.కృష్ణప్రసాద్. భవనానికి పిల్లర్స్ ఏవిధంగా బలాన్నిస్తాయో, అదేవిధంగా మానవుని శరీరానికి వెన్నెముక మూల స్తంభం. అలాంటి వెన్నెముకలో ఏ సమస్య వచ్చినా శరీరమంతా ప్రభావం చూపుతుంది. వెన్ను సమస్యలకు శాశ్వత పరిష్కారం ఒక్క ఆయుర్వేద చికిత్సలోనే ఉంది. వెన్నునొప్పి, జలుబు సామాన్యంగా అనిపిస్తాయి. కానీ ఒక దశలో భరించలేని నొప్పిని కలిగిస్తుంది. పక్షవాతంలా జీవితాన్ని కుప్పకూల్చివేస్తుంది. పైగా ఈ సమస్యలు ఏదో 5, 10 నిమిషాలు వచ్చి తగ్గిపోయేవీ కాదు. ఏళ్లకేళ్లు మంచాన పడేస్తాయి. వెన్నెముక వర్సెస్ పవర్హౌస్ వెన్నెముక పవర్ హౌస్ లాంటిది. ఇది కాళ్లు, చేతులు, తల, భుజాలు, మెడను స్థిరంగా నిలబడేలా చేస్తుంది. వివిధ కారణాలవల్ల ఒక్కోసారి ఈ పవర్హౌస్ శక్తిహీనంగా మారుతుంది. సరైన సమయంలో వైద్య చికిత్సలేవీ అందకపోతే భుజం నొప్పులు, మెడ నొప్పులు, కళ్ల నొప్పులు మొదలౌతాయి. వెన్ను భాగంలో మొద్దుబారినట్లు, బలహీన పడినట్లు, చురకలు, పోట్లు, మంటలు మొదలౌతాయి. జీర్ణ వ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి. అలాగే కొనసాగితే కొన్ని లైంగిక సమస్యలు సైతం తలెత్తవచ్చు. ఎవరికైనా వెన్నుపాములోని డిస్క్లు, నరాలు ఒత్తిడికి గురైతే.. కాళ్లు, చేతులు పక్షవాతానికి కూడా గురికావచ్చు. సర్జరీతో ఒరిగేది శూన్యం... వెన్నునొప్పితో వెళితే వైద్యులు మొట్టమొదటగా సూచించేది పెయిన్ కిల్లర్లే. అవి వాడితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది గానీ, అందుకు గల కారణాలను మాత్రం తగ్గించలేదు. పెయిన్ కిల్లర్స్ అతిగా వాడటం వల్ల తలనొప్పి, కడుపుబ్బరం, లివర్, కిడ్నీలు దెబ్బతినడం వంటివి తలెత్తుతాయి. సర్జరీ చేయించుకొంటే.. పెద్ద మొత్తంలో ఖర్చు అవడమే తప్ప కలిగే ప్రయోజనం మాత్రం శూన్యం. కనీసం ఆ ఒక్క సర్జరీతో అంతా అయిపోతుందా అంటే.. చెప్పలేం. ఆ తరువాత మరో సర్జరీ అవసరం కూడా రావచ్చు. ఆయుర్వేదం ఏం చేస్తుంది..? ముందుగా వెన్ను నొప్పి రావడానికి గల ప్రత్యేక కారణాన్ని సమూలంగా ఆయుర్వేదం కనిబెడుతుంది. అస్థిధాతుక్షయం, మార్గావరోధాల వల్లే శరీరంలో వాతం పెరుగుతుంది. ఆ వాతమే వెన్ను నొప్పికి, కాలంతా పాకే సయాటికా నొప్పికి మూలం అవుతుంది. అందుకే ధాతుక్షయాన్ని, మార్గావరోధాన్ని నివారించే చికిత్సలకు ఆయుర్వేదం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. చికిత్స క్రమంలో కీళ్లు, లిగమెంట్లు, టెండాన్లు, డిస్కులు, వెన్నెముకతో అనుబంధంగా ఉండే కండరాలను సమస్థితికి తీసుకురావడం చాలా ముఖ్యం. అదే సమయంలో నరాల వ్యవస్థను కూడా బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ నొప్పిని తగ్గించడమే కాదు.. మరోసారి ఆ నొప్పి రాకుండా చేస్తాయి. ఈ విధానంలో మర్మ, పంచకర్మ చికిత్సల ద్వారా వెన్నునొప్పికి మూలకారణాన్ని కనుగొని ఆ నొప్పిని సమూలంగా తగ్గించి వేస్తుంది. కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సల ద్వారా మీ వెన్నెముకను కాపాడుకోండి. అది జీవితాంతం మిమ్మల్ని కాపాడుతుంది. అడ్రస్ శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ బిసైడ్ ఎస్.బి.హెచ్, నియర్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, రోడ్ నం.17, హైదరాబాద్, వివరాలకు: డా॥పి.కృష్ణ ప్రసాద్. 9030013688/ 9440213688/ 040- 65986352 E mail: krishnaprasad.6600@gmail.com -
వెన్నునొప్పి... అశ్రద్ధ చేస్తే వైకల్యమే
వెన్నుపూస ఒక పవర్హౌస్ లాంటిది. దీని ద్వారా కాళ్లు, చేతులు, తల, భుజాలు, మెడకు పవర్ సప్లై అవుతుంది. శరీరం మొత్తాన్ని స్థిరంగా ఉండేలా చేస్తుంది. కొన్ని కారణాలవల్ల ఒక్కోసారి ఈ పవర్ హౌస్ నిర్జీవం అవుతుంది. దీని వలన భుజం, మెడ నొప్పులు, వెన్ను భాగంలో మొద్దుబారినట్లు, బలహీనపడినట్లు చురకలు, పోట్లు, మంటలు మొదలవుతాయి. వీటన్నింటికీ పరిష్కారం కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సలే అంటున్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పి.కృష్ణ ప్రసాద్. మన జీవితం ఒక్కోసారి నడి సముద్రంలో నావలా ఇరుక్కుపోతుంది. ఎటు పోవాలో దిక్కుతోచదు. క్రమేపీ అన్ని దారులూ మూసుకుపోతాయి. తీవ్రమైన మెడ, నడుము నొప్పితో పాటు క్రమేపి రెండు చేతుల్లో విపరీతమైన తిమ్మిర్లు వస్తాయి. ఒక దశలో బలం కోల్పోయి పట్టుతప్పి తెలియకుండానే వస్తువులు జారిపోతుం టాయి. ప్రతిసారీ విశ్రాంతి తీసుకోవాలంటే కుదరని పరిస్థితుల్లో పని ఒత్తిడి పెరిగితే కళ్లు తిరుగుతాయి. పడుకున్నప్పుడు తలకింద పెట్టుకున్న చేతులు కొద్ది సేపటికి మొద్దుబారినట్లుగా ఉంటాయి. దీంతోపాటు తీవ్రమైన నడుము నొప్పి రెండు కాళ్లలో తిమ్మిర్లు, పోట్లు, చెమట వంటివి వస్తాయి. నడవాలంటే తూలి పడిపోతున్న భయం, వెన్ను, నడుం, మెడతో పాటు, అధిక బరువు, మధుమేహం తదితర సమస్యలతో బాధపడుతుంటారు. ఆయుర్వేదంలో వీటిని వాతానికి సంబంధించిన వ్యాధులుగా పరిగణిస్తారు. సర్జరీతో ఒరిగేదేమిటి? వెన్నునొప్పితో వెళితే మొదటిగా అల్లోపతి పెయిన్ కిల్లర్స, బెడ్ రెస్ట్ తీసుకోమం టారు. పెయిన్ కిల్లర్స అదేపనిగా వాడటం వల్ల దుష్ఫలితాలు అనేకం. కడుపు ఉబ్బరం, లివర్, కిడ్నీలు దెబ్బతినడం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. దీంతో ఇక సర్జరీకి వెళ్లినా శాశ్వత పరిష్కారం దొరకదు. ఏం జరుగుతుంది? మొదట్లో నొప్పి వెన్ను ప్రాంతంలోనే వస్తుంది. వెన్ను భాగంలో కండరాలు బలహీనమవుతాయి. తరువాత మెడ, నడుము, వెన్నుపూసలో డిస్క్ పక్కకు జరిగి వెన్నుపూస నరాల మీద ఒత్తిడి పడుతుంది. కారణం మెడ, నడుము దగ్గరున్న కండరాలు బలహీన పడటమే. ఈ కండరాలన్నీ వెన్నుపాముతో సంబంధం కలిగి ఉంటాయి. ఆయుర్వేదం ఏం చేస్తుంది? ఆయుర్వేదంలో వెన్నునొప్పి రావడానికి కారణాలను పరీక్షలతో తెలుసుకుంటారు. తరువాత ఆయుర్వేదంలో ప్రత్యేకంగా చెప్పిన కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు, మర్మ చికిత్సలు, మేరు చికిత్సలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విధానంలో ఔషధాలతో తయారు చేసిన అత్యంత సారవంతమైన కేరళ నూనెలతో వెన్నుభాగం అంతా మర్దనచేసి కండరాలకు బలాన్నిచ్చే కటిబస్తి, గ్రీవబస్తి, కటిధార చికిత్సలు చేస్తారు. వీటితో పాటు పంచకర్మలో ముఖ్యమైన వస్తి, విరోచనం చికిత్సలు చాలా ముఖ్యం. వీటివల్ల నొప్పి రావటానికి ఉన్న దోషాలను సమూలంగా, శాశ్వతంగా శరీరం నుంచి బయటకు పోతాయి. కనుక తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నవారు కేరళ ఆయుర్వేదంలోని పంచకర్మ చికిత్సలతో పునఃశక్తి పొంది వెన్నెముక బలంగా తయారై... పవర్హౌస్ సక్రమంగా పనిచేసేట్టు చేయవచ్చు. అడ్రస్ శ్రీ చరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్, బిసైడ్ ఎస్.బి.హెచ్, నియర్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నం 17, హైదరాబాద్, వివరాలకు: పి.కృష్ణ ప్రసాద్. 9030013688/9440213688/040& 65986352 E mail: krishnaprosad.6600@gmail.com -
రక్తం అందకే పూసల అరుగుదల!
వెన్నెముక డిస్కుల్లో రక్తప్రసరణ గుట్టు రట్టు నరేశ్ బాబు బృందం వైద్యుల కీలక పరిశోధన వెన్ను ఆపరేషన్లను తగ్గించే లక్ష్యంతో ప్రయోగాలు హైదరాబాద్: నిండా నలభై ఏళ్లు కూడా లేకుండానే నడుమునొప్పి బారిన పడుతున్నవారు ఇప్పుడు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. వెన్నులో డిస్కు జారిందనో లేదా అరిగిందనో మెజారిటీ వైద్యులు చెబుతుంటారు. ద్విచక్ర వాహనానికి షాక్ అబ్జర్వర్ల మాదిరిగా వెన్నుకు దన్నుగా నిలిచే ఈ డిస్కుల అరుగుదల, జారిపోవడానికి గల కారణాలను ప్రముఖ వెన్నుపూస వైద్యులు డా.నరేష్ బాబు నేతృత్వంలోని బృందం ఆవిష్కరించింది. డిస్కులకు రక్తం అందకపోవడం కారణంగానే అవి అరిగిపోతున్నట్టు ‘డిఫ్యూజన్ స్టడీ ఆఫ్ లంబార్ డిస్క్’ పేరుతో 2008 నుంచి 2014 వరకూ వీరు జరిపిన పరిశోధనల్లో తేలింది. డిస్కుల్లో రక్తప్రసరణ ఎలా జరుగుతోందనే కోణంలో వందమంది రోగులపై వీరు పరిశోధించారు. బయాప్సీ ద్వారా పరీక్షలు రోగికి బాధ కలిగిస్తాయనే ఉద్దేశంతో ఒక్కో రోగిపై 8 నుంచి 10 సార్లు ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారానే పరీక్షలు నిర్వహించారు. ఉత్తరకొరియాలో ప్రపంచ స్పైనల్ సర్జన్స్ నేతృత్వంలో ఇటీవల జరిగిన సదస్సులో డా.నరేష్ బాబు బృందం సమర్పించిన పరిశోధన పత్రాలను ఆమోదించారు. ‘ప్రపంచ సైన్స్ జర్నల్’ జూలై సంచికలో వీరి పరిశోధన వ్యాసం ప్రచురితం కానుంది. నాలుగు దశల్లో పరిశోధన వెన్నెముకలో డిస్కు అనేది పొరలు పొరలుగా ఉన్న రబ్బరు టైరు వంటిది. స్పాంజిలాంటి దీనిలో రక్తనాళాల వ్యవస్థ ఉండదు. ఎముకల నుంచి విడుదలయ్యే రక్తాన్ని పీల్చుకోవడం ద్వారానే డిస్కుకు రక్తం అందుతుందని వీరు మొదటి దశలో గుర్తించారు. రెండో దశలో డిస్కులకు రక్త సరఫరా పెంచే వీలుందా? అనే దిశగా నిమోడిపైన్ మాత్రలు ఇచ్చి పరిశీలించారు. మాత్రలు తీసుకున్న రోగుల్లో డిస్కులకు రక్తసరఫరా 11 శాతం వృద్ధిచెందినట్టు గుర్తించారు. మూడో దశలో డిస్కు ఒత్తిడికి గురైనప్పుడు రక్తప్రసరణ వ్యవస్థను పరిశీలించారు. నాలుగో దశలో డిస్కు చుట్టూ ఉండే పొరలకు రక్త ప్రసరణను పరిశీలించారు. డిస్కు పొరలకు నాడీవ్యవస్థ నుంచే రక్త ప్రసరణ జరుగుతుందని ఇంతవరకూ భావిస్తుండగా, అది తప్పు అని, ఆ పొరలకు సైతం ఎముకల ద్వారానే రక్తం సరఫరా అవుతోందని తేలింది. శస్త్రచికిత్సలు బాగా తగ్గించొచ్చు ఎముకలు, డిస్కులు అరిగి పోయి చాలామందికి శస్త్రచికిత్సలు చేయాల్సి వస్తోంది. రక్తప్రసరణ లోపం కారణంగానే డిస్కులు అరుగుతున్నాయని మా పరిశోధనల ద్వారా తేలింది. కాబట్టి బయోలాజికల్ ట్రీట్మెంట్ (మందుల) ద్వారానే దీనిని నయం చేసుకునేందుకు వీలుంటుంది. దీనివల్ల శస్త్రచికిత్సలు బాగా తగ్గుతాయి. రోగులకు వైద్యఖర్చులూ తగ్గుతాయి. గుంటూరులోని మల్లికా స్పైనల్ సెంటర్లోనే ఇప్పటివరకూ సాధారణ ఎముకలు ఉన్నవారిపై ఈ ప్రయోగాలు చేశాం. ఇప్పుడు అరిగిపోయిన డిస్కులు, ఎముకలు ఉన్నవారిపై చేస్తున్నాం. ఈ రెండింటికీ వ్యత్యాసం తెలిస్తే అప్పుడు వైద్యం సులువవుతుంది. - డా.నరేష్బాబు, వెన్నుపూస వైద్య నిపుణులు -
వెన్ను నొప్పి, ఆస్తమాలకు పరిష్కారం...సుప్త వజ్రాసనం
వ్యాయామం ముందుగా రెండు మోకాళ్ల మీద కూర్చుని రెండు అర చేతులను తొడల మీద బోర్లించాలి(వజ్రాసనంలో). ఇప్పుడు నిదానంగా వెనక్కి వంగుతూ రెండు మోచేతులను ఒక దాని తర్వాత ఒకటి నేల మీద ఆనిస్తూ దేహాన్ని పూర్తిగా నేల మీదకు వాల్చాలి. రెండు చేతులను మడిచి అరచేతులను తలకింద ఉంచాలి. ఈ స్థితిలో రెండు మోకాళ్ల మధ్య నాలుగు వేళ్ల ఖాళీ ఉండాలి. పిరుదులు రెండు మడమల మీద ఆని ఉండాలి. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా ఉంటుంది. ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత మోచేతుల సహాయంతో యథాస్థితికి రావాలి. ఇలా ప్రతిరోజూ మూడు సార్లు చేస్తుంటే... ఆస్తమా, బ్యాక్పెయిన్ల నుంచి ఉపశమనం కలుగుతుంది. మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్లకు మంచి ఫలితాలనిస్తుంది. గొంతుసమస్యలు తొలగిపోయి స్వరంలో స్పష్టత వస్తుంది. తొడలలో చేరిన కొవ్వును కరిగిస్తుంది. జాగ్రత్తలు: మోకాళ్ల నొప్పులు అధికంగా ఉన్న వాళ్లు, అధిక బరువు ఉన్నవాళ్లు, కొత్తగా చేసేవాళ్లు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. -
పని ఒత్తిడితో ఉద్యోగినుల ఆరోగ్యం చిత్తు
న్యూఢిల్లీ: వ్యక్తిగత జీవితాన్నీ, వృత్తినీ నెగ్గుకొచ్చే ఒత్తిడిలో మహిళా ఉద్యోగులు అనారోగ్యం పాలవుతున్నారు. ప్రతి నలుగురు ఉద్యోగినుల్లో ముగ్గురు దీర్ఘకాలిక లేదా తీవ్రమైన అస్వస్థతకు గురవుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా అసోచామ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దాదాపు 42 శాతం మంది వెన్నునొప్పి, స్థూలకాయం, డిప్రెషన్, డయాబెటిస్, హైపర్టెన్షన్, హృద్రోగాల వంటి వ్యాధులబారిన పడుతున్నారు. మరో 22 శాతం మంది తాము దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు చెప్పారు. తీవ్రమైన అనారోగ్యం పాలయ్యామని 14 శాతం మంది పేర్కొన్నారు. ఆఫీసుపని, ఇంటిపనితో మహిళలు రెట్టింపు చాకిరీ చేయాల్సి వస్తోంది. ఇది వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అసోచామ్ ప్రధాన కార్యదర్శి డీఎస్ రావత్ గురువారం తెలిపారు. దేశవ్యాప్తంగా 11 రంగాలకు చెందిన 120 కంపెనీల్లోని 2,800 మంది మహిళా ఉద్యోగులను ప్రశ్నించామనీ, వీరంతా 32-58 ఏళ్ల వయస్సు వారనీ చెప్పారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ సహా పది నగరాల్లో సర్వే నిర్వహించామని పేర్కొన్నారు. -
వెన్నునొప్పి...
మనం నిటారుగా నిలబడి ఉండటానికి కారణమైన ప్రధాన అవయవం ‘వెన్ను’. అందుకే మన జాతీయాల్లోనూ, నుడికారాల్లోనూ ఒకరిపై ఆధారపడకుండా మనకై మనమే జీవించడానికి ప్రతీకగా ‘వెన్నెముక’ను పేర్కొంటుంటారు. అందుకే స్వతంత్రంగా వ్యవహరించని వాళ్లకు ‘వెన్నెముక’ లేదంటుంటారు. ప్రధానమైన వ్యవసాయ వృత్తిలో ఉన్న రైతును దేశానికి వెన్నెముకగా అభివర్ణిస్తారు. అంత ప్రధానమైన ఈ వెన్నుకు వచ్చే బాధలను తెలుసుకుందాం... మన కాళ్లపై మనం ఉండటానికి దోహదపడే ఈ వెన్నెముక పుర్రె చివర నుంచి మొదలై, నడుం కింది వరకు ఉంటుంది. మెదడు చివరి భాగం (మెడుల్లా అబ్లాంగేటా) నుంచి నడుం వరకు ఉండే వెన్నుపాముకు రక్షణకవచంలా ఒకదానినొకటి లింకుల్లా ఏర్పడి 32 నుంచి 34 వెన్నుపూసలు ఒక వెన్నెముకగా ఉంటాయి. దీన్నే స్పైన్ అంటారు. ఇందులో మెడ భాగంలో ఏడు (సర్వైకల్), ఛాతి, కడుపు భాగంలో పన్నెండు (థోరాసిక్), నడుం భాగంలో ఉండేవి ఐదు (లంబార్), మిగతావి ఒకదాంతో మరోటి కలిసిపోయి ఉండే శాక్రల్ ఎముకలు. కాక్సిక్ అనేది చివరన తోకలా ఉండే ఎముక. వీటిల్లో ఏ భాగానికి నొప్పి వచ్చినా దాన్ని వెన్నునొప్పిగానే పేర్కొంటారు. ఇక వెన్నెముకలోని 32-34 ఎముకల్లో... ప్రతి దాని మధ్య నుంచి ఒక్కోనరం చొప్పున మొత్తం 31 నరాలు బయటకు వస్తాయి. వెన్నుపూసల అరుగుదల వల్ల ఈ నరాలపై ఏమాత్రం ఒత్తిడి పడ్డా నొప్పి వస్తుంది. వెన్నెముక నొప్పుల్లో రకాలను చూద్దాం. మెడనొప్పి: మెడ భాగంలో ఉండే వెన్నెముకలను సర్వైకల్ పూసలు అంటాం కదా, అవి అరగడం వల్ల వచ్చే నొప్పిని ‘సర్వైకల్ స్పాండిలోసిస్’ అంటారు. మెడనొప్పికి ముఖ్యకారణం ఇదే. తలపై బరువులు మోసేవారికి, కంప్యూటర్ దగ్గర ఎక్కువ సమయం పనిచేసే వారికి, డ్రైవింగ్ చేసేవారికి ఎక్కువగా వస్తుంది. స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా కంప్యూటర్పై పనిచేసే వారిలో, రాతపని, కుట్లు, అల్లికలు చేసే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వెన్నెముకలోని ఎముక భాగాలు అరిగిపోవడం దీనికి ప్రధాన కారణం. వయసు పైబడటం వల్ల ఎముక భాగాలు అరిగిపోతుంటాయి. స్త్రీలలో మెనోపాజ్ దశ వచ్చేసరికి కాల్షియం గ్రహించడం తగ్గిపోతుంది. దీనికితోడు కాల్షియం లభించే ఆహార పదార్థాలను తీసుకోకపోవడం వల్ల సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య ఉన్నవారిలో నొప్పి మెడ నుంచి భుజం వరకు లేదా ఛాతి వరకు పాకుతుంది. ఈ నొప్పి కరెంట్ షాక్లా లేదా మంటపుట్టినట్టుగా ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు తలతిరగడం, మెడ నొప్పి ఉంటుంది. నడుమునొప్పి: నడుం భాగంలోని వెన్నుపూసల్లో అరుగుదల వల్ల ఈ నొప్పి వస్తుంది. నొప్పి వచ్చే భాగాన్ని బట్టి పేర్లుంటాయి. వాటిలో స్పాండిలైటిస్, టెయిల్ పెయిన్, సయాటికా నొప్పి ముఖ్యమైనవి. లాంబార్ స్పాండిలైటిస్ కూర్చుని పనిచేసే వారికి, బరువులెత్తే వారిలో, నడుముకి దెబ్బలు తగిలిన వారిలో, మహిళల్లో కాన్పు తర్వాత వస్తుంటుంది. ఈ నొప్పి సూదులతో గుచ్చినట్టుగా, మంటగా ఉంటుంది. టెయిల్ పెయిన్: వెన్నుపూసల కిందిభాగంలో ఈ నొప్పి వస్తుంది. కూర్చున్నా, నిల్చున్నా నొప్పి ఎక్కువగా వస్తుంది. ఇది స్త్రీలలో ఎక్కువ. సయాటికా: సయాటికా అనేది కాలి భాగాన్ని బాధపెట్టే నాడీ సంబంధ నొప్పి. ఈ సమస్య ఎడమ లేదా కుడివైపు ఎక్కడైనా రావచ్చు. ఇది కూడా స్త్రీలలోనే ఎక్కువ. సయాటికా అనేది కాలిలోకి వెళ్ళే అతి పెద్ద నాడి. వెన్నెముకలోని వెన్నుపూసలు అరగడం వల్ల వాటి మధ్య ఉన్న కార్టిలేజ్ మీద ఒత్తిడి పడుతుంది. కార్టిలేజ్ మధ్యలో ఉండే సయాటికా నాడి ఒత్తిడికి లోనవుతుంది. దాంతో సయాటికా నాడి ఏయే భాగాలతో అనుసంధానించి ఉంటుందో ఆయా భాగాలలో నొప్పి మొదలవుతుంది. ఆ బాధ కరెంట్ షాక్లా ఉండి నడవలేక, నిలబడలేక, కూర్చోలేక వర్ణనాతీతంగా ఉంటుంది. సయాటికా లక్షణాలు: సయాటికా సమస్యకు కొన్ని ప్రధాన లక్షణాలున్నాయి. ఇవి అన్ని సందర్భాలలోనూ అందరిలోనూ ఒకేసారి ఒకేలా కనిపించకపోవచ్చు. ముందుగా నొప్పి నడుములో ప్రారంభమై పిరుదులలోకి, అక్కడి నుంచి తొడల్లోకి, అక్కడి నుంచి పిక్కల్లోకి వ్యాపిస్తుంది, దగ్గినా, తుమ్మినా, ఎక్కువసేపు కూర్చున్నా సమస్య అధికం అవుతుంది. రెండు కాళ్ళలోనూ, ఒకే స్థాయిలో కాకుండా, ఏదో ఒక కాలిలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. తిమ్మిర్లు కూడా ఉండవచ్చు. సయాటికా నాడి ప్రయాణించే మార్గంలో అంటే కాలిలోనూ పాదంలోనూ ఉంటుంది. సూదులు గుచ్చినట్లుగా నొప్పి ఉంటుంది. కాలు, నడుము బిగుసుకుపోయినట్టు ఉంటుంది. కూర్చున్నా, నిలబడినా నొప్పిగానే ఉంటుంది. కారణాలు: అధిక బరువులు ఎత్తడం కాళ్ళకు ఎత్తుమడమల చెప్పులు వాడడం గతుకుల రోడ్లమీద తరచుగా ప్రయాణం చెయ్యాల్సిరావడం పోషకాహార లోపం, ముఖ్యంగా కాల్షియం లోపం దీర్ఘకాలిక దగ్గు, తుమ్ముల వల్ల నొప్పి తీవ్రం అవుతుంది. ఇవి గాక మరిన్ని వెన్ను సంబంధమైన నొప్పిలు కనిపిస్తాయి... హెర్నియేటెడ్ డిస్క్: ఎక్కువగా డ్రైవింగ్, కంప్యూటర్ వర్క్చేసే వారిలో ఈ సమస్య ఉంటుంది. స్టెనోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్: ప్రాథమిక దశలో గురిస్తే ఈ సమస్యను త్వరగా అరికట్టవచ్చు. మెకానికల్ ఇంజ్యురీ: సాధారణ అరుగుదలతో కాకుండా, ఏదైనా దెబ్బ తగలడం వల్ల వెన్నెముకకు భౌతికంగా గాయం అయి వచ్చే నొప్పిని మెకానికల్ ఇంజ్యూటరీ వల్ల వచ్చే నొప్పిగా పేర్కొంటారు. వెన్నునొప్పి నివారణా మార్గాలు: ఎక్కువసేపు కూర్చోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఒకసారయినా లేచి ఐదు నిమిషాల పాటు అటూ ఇటూ తిరగాలి. బరువయిన వస్తువులను వంగి ఎత్తకూడదు. ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకోవాలి. హోమియోపతి చికిత్స: వెన్నునొప్పి, నడుము నొప్పికి హోమియో మందులో అద్భుతమైన ఔషధాలున్నాయి. నొప్పి నివారణ మాత్రల మాదిరిగా తాత్కాలిక ఉపశమనాన్ని అందించకుండా మూలకారణాన్ని తొలగించి నడుము నొప్పి నుంచి శాశ్వత విముక్తిని అందిస్తాయి. శరీరంలో సమసతుల్యతను కాపాడే విధంగా హోమియోపతి వైద్యం పనిచేస్తుంది. దీనితో డిస్క్ సమస్య, కార్టిలేజ్ సమస్యను శాశ్వతంగా నివారించవచ్చు. స్పాండిలైటిస్, స్టెనోసిన్, సయాటికా సమస్యలు ఇట్టే తొలగిపోతాయి. బ్రయోనియా, రస్టాక్స్, లెడంపాల్, హైపరికం వంటి మందులు వ్యాధి తీవ్రతను తగ్గించడంలోనూ, శాశ్వత పరిష్కారాన్ని చూపించడంలో ఉపయోగపడతాయి. దీనితో పాటు కొలోసింథ్, పల్సటిలా అన్న మందులు కూడా ఈ నొప్పుల విషయంలో ఆలోచించాల్సినవే. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వైద్యం చేయించుకుంటూ పోషకాహారం, ఫిజియోథెరపి, యోగా క్రమబద్ధంగా చేయడం ద్వారా సయాటికా మొదలుకొని, అన్ని వెన్నునొప్పులనూ శాశ్వతంగా దూరం చేయవచ్చు. డాక్టర్ రవికిరణ్, ఎం.డి. (చికిత్సరత్న అవార్డు గ్రహీత) ప్రముఖ హోమియో వైద్యనిపుణులు మాస్టర్స్ హోమియోపతి, హైదరాబాద్లో దిల్సుఖ్నగర్, అమీర్పేట్, కూకట్పల్లి; విజయవాడ, కరీంనగర్, ph: 7842 106 106 / 9032 106 106 -
నాకు వెన్ను నొప్పి... సర్జరీ తప్పదా?
నేను కంప్యూటర్పై కూర్చుని ఎక్కువగా పనిచేస్తుంటాను. ఇటీవల విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. డాక్టర్ను కలిస్తే సర్జరీ అవసరం అన్నారు. నాకు సర్జరీ అంటే భయం. మరో మార్గం లేదంటారా? - సులోచన, విశాఖపట్నం సాధారణంగా యాక్సిడెంట్ లేదా ఏదైనా వ్యాధి కారణంగానో వెన్నునొప్పి వచ్చిన సందర్భాలను మినహాయించి, ప్రతి వెన్నునొప్పికీ శస్త్రచికిత్స ఒక్కటే మార్గం కాదు. సర్జరీతోనే వెన్నునొప్పికి పరిష్కారం దొరుకుతుందనీ, ఆపరేషన్ చేయకపోతే తగ్గదనేది అపోహ మాత్రమే. మనం కూర్చునే భంగిమలు ఎలా ఉన్నాయో తెలుసుకొని, ఒకవేళ ఫాల్టీ పోశ్చర్స్ల్లో కూర్చుంటుంటే వాటిని సరిచేసుకుంటే చాలావరకు సమస్య తగ్గుతుంది. కాబట్టి సాధారణ వెన్నునొప్పుల్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ, తగిన చికిత్స తీసుకుంటే చాలావరకు అవి తగ్గుతాయి. ఇక కొన్ని రకాల వెన్నునొప్పులు బరువులు ఎత్తుతుండటం వల్ల వస్తే... వాటిని ఎత్తే విధానాల్లో మార్పులతో అవి కూడా తగ్గుతాయి. ఇంకొన్ని రకాలు కొన్ని వ్యాయామాలతో నయమవుతాయి. వెన్నునొప్పులకు యోగా కూడా చక్కటి మార్గం. అయితే నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని రకాల ఆసనాలు వేయడం మంచిది కాదు. అందుకే యోగా ఎప్పుడు, ఎలా చేయాలన్నది ట్రైనర్ సహాయంతో చేస్తేనే మంచిది. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్ -
చక్రాసనం
నిర్వచనం: ఈ ఆసనం వేసినప్పుడు దేహాకృతి చక్రంలా కనిపిస్తుంది. అందుకే ఇది చక్రాసనంఅయింది. చేసే విధానం ముందుగా వెల్లకిలా పడుకొని రెండు చేతులు ఇరువైపుల ఉంచి విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత రెండుకాళ్లను మోకాళ్ల వద్ద వంచి రెండుపాదాలను పిరుదుల వద్దకు తీసుకోవాలి. మడమలు పిరుదులకు ఆనించి ఉంచాలి. ఇప్పుడు రెండు అరచేతులను తలకిరువైపుల నేల పైన ఉంచాలి. శ్వాస పూర్తిగా తీసుకొని శరీరబరువు పూర్తిగా రెండు చేతులు రెండు పాదముల పైన ఉంచి శరీరాన్ని పైకి లేపాలి. ఈ స్థితిలో ఛాతీ, నడుము పైకి లేపబడి తలక్రిందకు వ్రేలాడబడి ఉంటుంది. మోచేతులు, మోకాళ్లు వంగకుండా అరచేతులు, పాదాలు నేలను తాకి ఉంటాయి. ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉండి తర్వాత యథాస్థితికి రావాలి. ప్రతిరోజు ‘3’ సార్లు చేయాలి. ఉపయోగాలు వెన్నునొప్పి తొలగిపోతుంది. ఛాతీ విశాలమవుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. థైరాయిడ్, శ్వాస సంబంధిత రోగాలు పోతాయి. చేతులు, భుజాలు, మోకాళ్లు, తొడలు, మణికట్టు శక్తిమంతం అవుతాయి. పొత్తికడుపు కండరాలు శక్తిమంతం అవుతాయి. అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్య, మలబద్దకం పోతాయి. రుతుక్రమ సమస్యలు పోతాయి. తొడలపై కొవ్వు కరుగుతుంది. ముఖంలో కాంతి పెరుగుతుంది. వెన్ను సరళతరమవుతుంది. చేయకూడనివాళ్ళు హైబీపీ, మైగ్రేన్, బ్రెయిన్కు సంబంధించిన సమస్యలు ఉన్న వారు చేయకూడదు. అధికబరువు ఉన్నవారు, మోకాళ్ల నొప్పులు, భుజముల నొప్పులు ఉన్నవారు, కన్ను, ముక్కు, గొంతు, చెవికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు గురువు పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. మోడల్: అంజు రిషిత ఫొటోలు: శివ మల్లాల బీరెల్లి చంద్రారెడ్డి యోగా గురువు సప్తరుషి యోగవిద్యాకేంద్రం హైదరాబాద్ -
వైద్యచికిత్సల కోసం బెయిలివ్వండి: మోపిదేవి వెంకట రమణారావు
సీబీఐ ప్రత్యేక కోర్టుకు మోపిదేవి వినతి సాక్షి, హైదరాబాద్: తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్న మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావుకు వైద్య చికిత్సల కోసం మూడు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది సురేందర్రావు సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఈ మేరకు మోపిదేవి దాఖలు చేసుకున్న పిటిషన్ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్రావు శుక్రవారం విచారించారు. మోపిదేవిని పరీక్షించిన కేర్ వైద్యులు ఆయనకు మొదటగా స్టెరాయిడ్లతో కూడిన ఇంజక్షన్లు ఇవ్వాలని, ఫలితం లేకపోతే శస్త్రచికిత్స చేయాలన్నారని సురేందర్రావు వివరించారు. వైద్యం పొందడం పౌరుడి కనీస హక్కని, మోపిదేవి తీవ్రమైన అనారోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు కనీసం మూడు నెలలైనా బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ధారిస్తేనే బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవాలని ఈ కోర్టు గతంలో స్పష్టం చేసిందని, మొదట స్టెరాయిడ్ ఇంజక్షన్లు ఇస్తారని మోపిదేవి చెబుతున్న నేపథ్యంలో ఈ పిటిషన్ విచారణార్హం కాదని సీబీఐ స్పెషల్ పీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని ఈనెల 16కు వాయిదా వేశారు. -
మూడు నెలలు బెయిల్ ఇవ్వండి: మోపిదేవి వెంకటరమణ
ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మోపిదేవి సీబీఐకి నోటీసులు... విచారణ నేటికి వాయిదా సాక్షి, హైదరాబాద్: తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నానని, వైద్యచికిత్సల కోసం మూడు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. వైఎస్ జగన్ కంపెనీల్లో వాన్పిక్ పెట్టుబడుల కేసులో నిందితునిగా ఉన్న మోపిదేవి తరఫున ఆయన న్యాయవాది సురేందర్రావు గురువారం ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. గత కొంతకాలంగా తాను తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నానని, గతంలో ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తాను ఇటీవల కేర్ ఆసుపత్రి వైద్యులతో పరీక్షలు చేయించుకున్నానని మోపిదేవి తెలిపారు. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు నిర్ధారించారని చెప్పారు. ఈ మేరకు కేర్ వైద్యుల అభిప్రాయాన్ని కోర్టుకు సమర్పించారు. చికిత్సలో భాగంగా డాక్టర్ల పర్యవేక్షణలో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్లు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇంజెక్షన్లకు తగ్గకపోతే శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఈ నేపథ్యంలో తనకు మూడు నెలల బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ పిటిషన్ను పరిశీలించిన కోర్టు... సీబీఐకి నోటీసులు జారీచేస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. -
సయాటికా (గుద్రసీ వాతము)
ప్రస్తుత పరిస్థితిలో మానవుని జీవితము చాల యాంత్రికముగా మారిపోయింది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, దినచర్య, స్వప్న విపర్యయము (పగతి నిద్ర, రాత్రి సమయానికి నిద్రపోకపోవటం) లాంటి విషయాలలో అనేక మార్పులు రావటం వలన. ఆందోళన, మానసిక ఒత్తిడి లాంటి సమస్యల వలన మానవులు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అందులో అతి ముఖ్యమైనది (నడుమునొప్పి) కటిశూల. నూటికి 90 మంది తమ జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి ఈ నడుమునొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ఆయుర్వేదశాస్త్రంలో చరక, నూశ్రత, వాగ్భటులు ఈ సమస్యను గుద్రసీ వాతం (సయాటికా)గా పేర్కొంటూ ఎంతో విపులంగా వివరించారు. దీనికి సాధారణ కారణాలు పరిశీలించి చూసినట్లయితే... ఎక్కువగా ఒకే పొజిషన్లో కూర్చొనుట, స్థూలకాయం, అధికశ్రమతో కూడిన పనులు ఎక్కువసేపు చేయటం, అధిక బరువులను మోయటం, ఎక్కువదూరం ద్విచక్ర వాహనాలు, కార్లలో ప్రయాణించటం, కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వలన, కొన్ని వంశపారంపర్య వ్యాధుల వలన, మరికొన్ని రోడ్డు ప్రమాదాల వలన ఈ నడుమునొప్పి సమస్య వస్తుంటుంది. ముఖ్యంగా పైన వివరించిన కారణాల వలన శరీరంలో వాతప్రకోపం జరిగి, ముందుగా పిరుదులకు పైభాగాన స్తబ్ధతను, నొప్పిని కలిగించి తరువాత కటి ప్రదేశం (నడుము), తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదాలలో క్రమంగా నొప్పి కలుగుతుంది. దీనినే గుద్రసీ వాతము (సయాటికా) అని అంటారు. ఈ సమస్య శీతాకాలంలో ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా నడుముకు సంబంధించిన ఎల్4-ఎల్5, ఎస్1-ఎస్2 వెన్నుపూసల మధ్యగల సయాటికా అనే నరంపై ఒత్తిడి పడటం వల్ల ఈ నొప్పి వస్తుంది. ఆయుర్వేద చికిత్స ఆయుర్వేదంలో ఇలాంటి సమస్యలకు సమగ్రమైన చికిత్సా పద్ధతులు ఉన్నాయి. అందులో 1. శమన చికిత్స. 2. శోధన చికిత్స. శమన చికిత్స: ఇది దోషాలను బట్టి అభ్యంతరంగా వాడే ఔషధ చికిత్స. ఇందులో వేదన, కాయకంగా ఔషధాలు ఉంటాయి. అలాగే వాతహర చికిత్సా పద్ధతులు ఉంటాయి. శోధన చికిత్స: శమన చికిత్స వలన ఒక్కోసారి మళ్లీ వ్యాధి తిరగపెట్టవచ్చు. అందుకే ఆయుర్వేదంలో పంచకర్మ అనే ఒక ప్రత్యేక చికిత్సాపద్ధతి ఉంది. ఈ చికిత్సా పద్ధతి ద్వారా ప్రకోపించిన వాతాది దోషాలను సమూలంగా తగ్గించవచ్చు. 1. స్నేహకర్మ: ఈ ప్రక్రియ ద్వారా వెన్నెముకలోని వెన్నుపూసల మధ్య స్నిగ్ధత్వాన్ని పెంపొందించి, తద్వారా జాయింట్స్లో కదలికలను తేలికగా చేయవచ్చును. 2. స్వేదకర్మ: ఈ పద్ధతిలో గట్టిగా అతుక్కొని ఉండే జాయింట్స్ను మృదువుగా అయ్యేటట్లు చేయవచ్చును. కటివస్తి: ఈ పద్ధతి ఈ వ్యాధిలో అతి విశిష్టతను సంతరించుకున్నది. ఈ ప్రక్రియ ద్వారా అరిగిపోయిన మృదులాస్థికి రక్తప్రసరణను పెంచి తద్వారా నొప్పి తీవ్రతను తగ్గించవచ్చును. అలాగే సర్వాంగధార, వస్తికర్మ అనే విశిష్ట చికిత్సా పద్ధతుల ద్వారా నాడీ కణాలలో కలిగిన లోపాలను సరిచేయవచ్చు. అదేవిధంగా ప్రకోపించిన వాతాన్ని సమస్థితికి తీసుకురావచ్చు. జాగ్రత్తలు: సరి అయిన పోషక ఆహారాలు తీసుకోవడం, నిదాన పరివర్జనం అనగా పైన చెప్పిన ప్రత్యేక వ్యాధి కారణాలను మళ్లీమళ్లీ చేయకుండా జాగ్రత్త పాటించినట్లయితే ఈ సమస్య నుంచి శాశ్వత విముక్తి పొందవచ్చును. డిస్క్లో వచ్చే మార్పులు ఈ వ్యాధిలో వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్లో కొన్ని మార్పులు జరుగుతాయి. అవి డిస్క్ మీద ఒత్తిడి పెరగటం, వాపు రావటం లేదా డిస్క్కి రక్తప్రసరణ సరిగా లేకపోవటం, అరిగిపోవటం అనే సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది. డిస్క్లో వాపు వస్తే దానిలో ఉండే చిక్కని ద్రవం బయటకు వచ్చి మేరుదండం లేదా దాన్నుంచి వచ్చే నరాలపై ఒత్తిడి కలిగించటం వల్ల నొప్పి వస్తుంది. లక్షణాలు: నడుములో నొప్పి కలగటం, వాపు, కొంచెం శారీరక శ్రమ చేయగానే నొప్పి తీవ్రత పెరగటం, ఈ నొప్పి సూదులతో గుచ్చినట్లుగా, ఒక్కోసారి తిమ్మిర్లు, మంట తో కూడి ఉంటుంది. సమస్య తీవ్రమైనది అయితే స్పర్శహాని కూడా కలుగవచ్చు. ఒక్కోసారి మలమూత్రాల మీద నియంత్రణ కూడా పోయే ప్రమాదం ఉంది. వెన్ను నొప్పి బాధ అనగానే సాధారణంగా పెయిన్ కిల్లర్స్తో కాలయాపన చేస్తుంటారు. దీనివల్ల తాత్కాలిక ఉపశమనం కల్గుతుంది. కాని మలబద్దకం, జీర్ణాశయ సమస్యలు మొదలవుతాయి. కావున ఇలాంటి సమస్యలను ప్రారంభదశలోనే గుర్తించి, జాగ్రత్తపడటం వల్ల ఈ వ్యాధిని సమూలంగా తగ్గించవచ్చు. డాక్టర్ కరుణశ్రీ ఎం.డి (ఆయుర్వేద), స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక ph: 9908911199 / 9959911466 -
నడుము నొప్పి - ఆయుర్వేద చికిత్స
ప్రస్తుత పరిస్థితుల్లో మానవుని జీవనం ప్రకృతి సహజ విధానాలకు విరుద్ధంగా ఉంటోంది. పెరిగిపోతున్న పని ఒత్తిడి, పోషకాహారం సరిగా తీసుకోకపోవడం వలన, ఈరోజుల్లో 40 ఏళ్లకే నడుము నొప్పి వస్తోంది. ముఖ్యంగా ఆహార లోపాలు, అస్తవ్యస్తమైన దినచర్యలు, స్వప్న విపర్య అంటే రాత్రివేళ నిద్రపోకపోవటం, పగటిపూట నిద్రించడం వంటి అలవాట్లు శరీర వ్యవస్థను బాగా దెబ్బ తీస్తున్నాయి. అలాగే ఆందోళన, మానసిక ఒత్తిడి వంటి కారణాలు కూడా అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. వీటిలో అతిముఖ్యమైనది నడుము నొప్పి (కటిశూల). ఆయుర్వేద శాస్త్రం నడుము నొప్పికి గుద్రసీవాతంగా నామకరణం చేసింది. నూటికి 90 శాతం మంది తమ జీవితకాలంలో ఎపుడో ఒక్కసారి నడుము నొప్పి బారిన పడతారని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. కారణాలు: ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవటం, స్థూలకాయం, విశ్రాంతి అనేది లేకుండా ఎక్కువ గంటలు విపరీతంగా శ్రమించడం, అతిగా బరువులు మోయటం, ద్విచక్రవాహనం మీద ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, రోడ్డు ప్రమాదాలు, దీర్ఘకాలిక రుగ్మతలు, వంశపారంపర్యం వ్యాధులు ఇవి అన్ని నడుమునొప్పికి కారణమవుతుంటాయి. ఈ కారణాల వల్ల ముఖ్యంగా వాత ప్రకోపం జరుగుతుంది. ఫలితంగా ముందు పిరుదులకు పైభాగాన స్థబ్దతను, నొప్పిని కలిగించి, ఆ తరువాత నడుముభాగం, తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదాల్లోకి వ్యాపిస్తుంది. ఈ సమస్య శీతాకాలంలో ఎక్కువ అవుతుంది. నడుము భాగంలో ప్రత్యేకించి ఎల్-4, ఎల్-5 వెన్నుపూసల మధ్య ఉండే సయాటికా నరం మీద ఒత్తిడి పడటం వల్ల ఈ నొప్పి వస్తుంది. నడుము నొప్పికి ఆయుర్వేద చికిత్స నడుము నొప్పి అనే సమస్యకు ఆయుర్వేద శాస్త్రంలో సమగ్రమైన చికిత్సా పద్ధతులున్నాయి. అందులో నిదాన పరివర్జనం, శమన చికిత్స, శోధన చికిత్స అనే మూడు ప్రధానమైనవి. నిదాన పరివర్జనము: నిదాన పరివర్జనము అనగా వ్యాధికి కారణమైన విషయాలను పాటించకపోవడం. ఉదా: విరుద్ధ ఆహార - విహారసేవన. (రాత్రి మేల్కొనుట, పగలు నిద్రించుట మొదలైనవి) శమన చికిత్స: వ్యాధి దోషాలను శమింపచేయటానికి తెచ్చే ఔషధాలు, ఇందులో రోగ తీవ్రతను బట్టి, రోగి బలాన్ని బట్టి చూర్ణాలు, గుటికలు, కషాయాలు, లేహ్యాలు, తైలాలు ఇత్యాది ఔషధాలు రోగికి ఇవ్వబడతాయి. కానీ, ఈ శమనచికిత్స వలన ప్రకోపించిన దోషాలు మళ్లీ తిరగబడవచ్చు. అందుకే వ్యాధి తీత్రవను బట్టి శమన చికిత్సలతోపాటు, కొందరికి పంచకర్మ (శోధన చికిత్స) కూడా అవసరం. తద్వారా ప్రకోపించిన దోషాలను (వాత, పిత్త, కఫ) సమంగా చేసి శరీర శుద్ధిని, అగ్నిబలాన్ని పెంపొందించవచ్చును. ఆయుర్వేదాన్ని స్నేహకర్మ ద్వారా వెన్నుపూసల మధ్య, స్నిగ్ధత్వాన్ని పెంపొందించి కీళ్ల కదలికను సులభతరం చేసే అవకాశం ఏర్పడుతుంది. స్వేదకర్మ ద్వారా బిగుసుకుపోయిన కీళ్ళను వదులుగా, మృదువుగా మారేలా చేయవచ్చు. కటివస్తి: ఈ విధానం ఆయుర్వేదంలోని ఒక విశిష్ట ప్రక్రియ. అరిగిపోయిన మృదులాస్థికి (కార్టిలేజ్) రక్తప్రసరణను పెంచి నొప్పి తీవ్రతను తగ్గించడంలో ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదే క్రమంలో సర్వాంగధార చికిత్స కూడా వీరికి బాగా ఉపయోగపడుతుంది. వస్తికర్మ: ఆయుర్వేద శాస్త్రంలో వస్తికర్మ అనే చికిత్స అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వస్తికర్మ ముఖ్యంగా చిన్నప్రేవులు, పెద్దప్రేవులలోని ఎంటరిక్ వర్వస్ సిస్టమ్పై ప్రభావం చూపుతుంది. తద్వారా నాడీకణాలలో ఏర్పడిన లోపాలను సరిచేసి బలం చేకూర్చవచ్చు. అలాగే పక్వాశయలో వాతస్థానం కాబట్టి ప్రకోపించిన వాతాన్ని కూడా సహజస్థితికి తీసుకునిరావచ్చును. జాగ్రత్తలు: అవసరమైన పోషకాహారం తీసుకుంటూ, వ్యాధి తిరిగి రాకుండా వైద్యులు సూచించిన విధానాలను అనుసరించడం చాలా అవసరం. ఔషధ చికిత్సల తరువాత క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తే నడుము నొప్పి సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి కలుగుతుంది. డిస్క్లో వచ్చే మార్పులు వెన్నుపూసల మధ్య ఉండే డిస్కుల్లో కొన్ని మార్పులు జరిగినప్పుడు, డిస్క్ల మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో వాపు రావటం, డిస్క్కి రక్త ప్రసరణ సరిగా లేకపోవటం, డిస్కు అరిగిపోవడం వంటి అనేక సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది. డిస్కులో వాపు వస్తే అందులోంచి చిక్కని ద్రవం బయటికి వచ్చి మేరుదండం నుంచి వచ్చే నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల వెన్ను నొప్పి వస్తుంది. లక్షణాలు నడుములో నొప్పి, వాపు, ఏ కాస్త శ్రమించినా నొప్పి తీవ్రం కావటం, సూదులతో గుచ్చినట్లుగా నొప్పి, కాళ్లల్లో తిమ్మిర్లు, మంటలు ఉంటాయి. సకాలంలో చికిత్స అందకపోతే స్పర్శజ్ఞానం కోల్పోతారు. సమస్య తీవ్రమైతే కొందరు మలమూత్రాల మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పెయిన్ కిల్లర్స్ వాడటం మంచిది కాదు. పెయిన్ కిల్లర్స్లో మలబద్దకం, జీర్ణాశయ సమస్యలు వస్తాయి. వెన్ను సంబంధిత సమస్యలను వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి రాకుండా పోతుంది. డాక్టర్ మనోహర్ ఎం.డి (ఆయుర్వేద), స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక ph: 7416 101 101 / 7416 102 102 www.starayurveda.com