bank fraud
-
పీఎన్బీలో రూ.271 కోట్ల ఫ్రాడ్
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకులో (PNB) మరో మోసం వెలుగు చూసింది. ఒరిస్సాకు చెందిన గుప్తా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ.271 కోట్ల మేర రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడింది. ఈ ఖాతాను మొండిపద్దుగా (ఎన్పీఏ) వర్గీకరించి రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లినట్లు బ్యాంకు వివరించింది. ఇప్పటికే ఈ మొత్తానికి ప్రొవిజనింగ్ చేసినట్లు పేర్కొంది.భువనేశ్వర్లోని పీఎన్బీ స్టేషన్ స్క్వేర్ బ్రాంచ్ ఈ రుణాన్ని జారీ చేసింది. పీఎన్బీ ఫ్రాడ్ జరిగినా డిసెంబర్ త్రైమాసికంలో నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ.4,508 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.2,223 కోట్లతో పోలిస్తే అధికంగా నమోదైంది. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.29,962 కోట్ల నుంచి రూ.34,752 కోట్లకు, వడ్డీ ఆదాయం రూ.27,288 కోట్ల నుంచి రూ.31,340 కోట్లకు పెరిగింది. అంతేకాకుండా పీఎన్బీ స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 6.24 శాతం నుంచి 4.09 శాతానికి తగ్గింది.పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కొన్నేళ్లుగా హైప్రొఫైల్ కేసులతో ఇబ్బంది పడుతోంది. అందులో కొన్ని కింద తెలియజేశాం.నీరవ్ మోదీ స్కామ్ (2018): భారతదేశ చరిత్రలో అతిపెద్ద బ్యాంకింగ్ మోసాల్లో ఒకటిగా నిలిచింది. దీని విలువ సుమారు రూ.12,700 కోట్లు. నగల వ్యాపారి నీరవ్ మోదీ తన బంధువు మెహుల్ చోక్సీతో కలిసి పీఎన్బీ ఉద్యోగులతో కుమ్మక్కై అనధికార లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్ (ఎల్ఓయూ)లను ఉపయోగించి మోసపూరిత రుణాలు పొందారు. బ్యాంకింగ్ వ్యవస్థలో లొసుగుల కారణంగా ఈ కుంభకోణం ఏళ్ల తరబడి బయటపడలేదు.నీరవ్ మోదీ కుంభకోణంలో గీతాంజలి జెమ్స్ యజమాని మెహుల్ చోక్సీ కూడా ఇరుక్కున్నాడు. 2018 ప్రారంభంలో దేశం విడిచి పారిపోయిన అతను అప్పటి నుంచి అధికారులు, విచారణ వ్యవస్థల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు.ఇదీ చదవండి: రేట్ల కోత కాదు.. ఏం చేయాలో సూచించిన మిశ్రాపీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ మోసం (2020): సరైన నిబంధనలు పాటించకుండా షెల్ కంపెనీలకు రుణాలు ఇచ్చిన కేసులో పీఎన్బీఐ హౌసింగ్ ఫైనాన్స్ ప్రమేయం ఉందని తేలింది. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. -
బ్యాంకులో రూ.558 కోట్ల దొంగతనం!
ఖాతాదారులకు చెందిన సేఫ్ డిపాజిట్ బాక్స్ల నుంచి ఒక బిలియన్ యెన్ (సుమారు 6.6 మిలియన్ డాలర్లు-రూ.558 కోట్లు) సొమ్మును బ్యాంకు ఉద్యోగి దొంగలించినట్లు జపాన్లోని ప్రముఖ బ్యాంకు మిత్సుబిషి యుఎఫ్జే ఫైనాన్షియల్ గ్రూప్ తెలిపింది. అందుకుగాను అధికారికంగా కస్టమర్లకు క్షమాపణలు చెప్పింది. 60 మంది క్లయింట్ల్లో సుమారు 20 మంది ఖాతాల్లో నుంచే 300 మిలియన్ యెన్ (దాదాపు 2 మిలియన్ డాలర్లు-రూ.169 కోట్లు) వరకు దొంగతనాలు జరిగినట్లు ధృవీకరించింది. కస్టమర్లు కోల్పోయిన నగదు పరిహారం కోసం కసరత్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: కొత్త సార్ ముందున్న సవాళ్లు!ఎంయూఎఫ్జీ ప్రెసిడెంట్, సీఈఓ జునిచి హంజావా విలేకరులతో మాట్లాడుతూ..‘టోక్యోలోని మిత్సుబిషి యుఎఫ్జే ఫైనాన్షియల్ గ్రూప్ బ్యాంకు శాఖల్లో ఈ దొంగతనాలు జరిగాయి. ఏప్రిల్ 2020 నుంచి ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు ఈమేరకు ఫ్రాడ్ జరిగినట్లు గుర్తించాం. సేఫ్ డిపాజిట్ బాక్స్లను ఓ మహిళా ఉద్యోగి నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన కీ తనవద్దే ఉంటుంది. ఆ ఉద్యోగి డబ్బు తీసుకున్నట్లు, ఇతర పెట్టుబడులు, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించినట్లు అంగీకరించింది. వెంటనే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించి విచారణ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశాం. జరిగిన దొంగతనానికి క్షమాపణలు కోరుతున్నాం. నగదు నష్టపోయిన కస్టమర్లకు పరిహారం చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు. -
బ్యాంకు మోసాల దర్యాప్తునకు చర్యలు
బ్యాంకు మోసాలకు సంబంధించిన కేసులను మరింత సమర్థంగా, వేగంగా దర్యాప్తు చేసేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మధ్య పరస్పరం సహకారాన్ని పెంపొందించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేసులకు సంబంధించి ప్రత్యేకంగా ఈ సంస్థల మధ్య సాధారణ చర్చల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయడానికి మంత్రిత్వశాఖ అంగీకరించింది.ప్రత్యేక వేదిక ఏర్పాటు..?బ్యాంకు మోసాలపై సీబీఐలో చాలా కేసులు నమోదవుతున్నాయి. వాటి దర్యాప్తులో అవసరమయ్యే కీలక సమాచారాన్ని బ్యాంకర్లు అందించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పూర్తి సమాచారం అందించేందుకు నిబంధనలు అడ్డుగా ఉంటాయి. అయితే ఎలాంటి కేసుల్లో ఎలాంటి సమాచారం అందించాలనే విషయంపై స్పష్టత వచ్చేందుకు సీబీఐ, బ్యాంకర్లు పరస్పరం చర్చించాల్సి ఉంది. అందుకు ఒక వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా..కేసులకు సంబంధించి సీబీఐ చేసిన అభ్యర్థనలను బ్యాంకర్లు పరిశీలించనున్నారు. బ్యాంకర్లు ఇచ్చిన సమాచారంపై భవిష్యత్తులో కస్టమర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సీబీఐ నుంచి బ్యాంకర్లకు రక్షణ ఉంటుందని కొందరు అధికారులు తెలిపారు. సీబీఐ, బ్యాంకర్ల మధ్య పరస్పరం సహకారం వల్ల ఫిర్యాదుల దాఖలుకు సంబంధించిన కార్యాచరణ అంశాలు, దర్యాప్తును క్రమం తప్పకుండా సమీక్షించడం, ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ సులువవడం వల్ల త్వరగా కేసులు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: 1,319 కిలోల బంగారం, 8,223 కిలోల డ్రగ్స్ స్వాధీనం!అనుమతుల్లేక కేసులు పెండింగ్2018లో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17Aలో చేసిన సవరణ ప్రకారం.. బ్యాంక్ మేనేజ్మెంట్ ఆమోదించిన తర్వాతే బ్యాంకు మోసాలపై దర్యాప్తు ఏజెన్సీ ఉద్యోగులను విచారించే అధికారం ఉంటుంది. పీఎస్యూ బ్యాంకులకు, ప్రైవేట్ బ్యాంకులకు ఈ నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లోనూ దర్యాప్తు సంస్థలు నేరుగా ఇన్వెస్ట్గేషన్ చేయాలంటే చట్టం ప్రకారం వారి యాజమాన్యం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. తాజా సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు కొందరు అధికారులు తెలిపారు. గత ఏడాది కాలంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), విజిలెన్స్ కమిషన్ వంటి ఏజెన్సీలకు బ్యాంకు యాజమాన్యాలు తమ ఉద్యోగులపై విచారణకు అనుమతి ఇవ్వనందున వందలాది కేసులు పెండింగ్లో ఉన్నాయని ఫిర్యాదు చేశాయి. -
సైబర్ మోసాలు.. రూ.177 కోట్ల నష్టం
టెక్నాలజీ పెరుగుతోంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడకం ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో సైబర్ మోసాలు అధిమవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో డెబిట్/ క్రెడిట్కార్డు - ఇంటర్నెట్ బ్యాంకింగ్లో జరిగిన సైబర్ మోసాల వల్ల ప్రజలు రూ.177 కోట్లు నష్టపోయినట్లు ప్రభుత్వం తెలిపింది.2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం రూ.69.68 కోట్లుగా ఉందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 2021-22లో ఇది రూ.80.33 కోట్లు, 2020-21లో రూ.50.10 కోట్లు, 2019-20లో రూ.44.22 కోట్లుగా ఉందని చెప్పారు. అనధికార లావాదేవీలు జరిగినపుడు బ్యాంకులు స్పందించి చర్యలు తీసుకునేంత వరకు కస్లమర్లే దీనికి బాధ్యత వహించాలి. ఈ లావాదేవీల వల్ల కలిగే నష్టాన్ని పరిమితం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాలు జారీ చేసింది. ఏదైనా అనధికార లావాదేవీలు జరిగిన మూడు పనిదినాల్లోగా సంఘటనను రిపోర్ట్ చేయాలి. అలాంటి ట్రాన్సాక్షన్స్కు సాంకేతికలోపం కారణమని రుజువైతే దానికి బ్యాంకులే బాధ్యత వహిస్తాయి. ఏదేమైనా అనధికార లావాదేవీలు జరిగినట్లు గుర్తిస్తే వెంటనే బ్యాంకు దృష్టికి తేవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: మూడు నెలల్లో రూ.60 లక్షల కోట్లు లావాదేవీలు -
26 ట్రంక్ పెట్టెల్లో 3.3 లక్షల పత్రాలు..736 మంది సాక్షులు!
బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద కుంభకోణంగా పరిగణించే దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్ఎఫ్ఎల్) కేసు పరిష్కారానికి ఢిల్లీ హైకోర్టు స్పెషల్ సీబీఐ కోర్టును నియమించింది. రూ.34,614 కోట్లు కుంభకోణానికి సంబంధించి సీబీఐ చేసిన దర్యాప్తులో 3,30,000 పేజీల రిపోర్ట్ను తయారు చేశారు. ఈ కేసులో 108 మంది నిందితులు, 736 మంది సాక్షులున్నారని తెలిపారు. దాంతో కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఢిల్లీ హైకోర్టు స్పెషల్ సీబీఐ కోర్టుకు సిఫారసు చేసింది. ఈమేరకు ఆగస్టు 1న ప్రత్యేకంగా ఈ కేసు కోసమే సీబీఐ కోర్టును ఏర్పాటు చేసి, న్యాయమూర్తిని నియమించింది. దీనివల్ల కేసు త్వరగా పరిష్కారమవుతుందని పేర్కొంది.ఢిల్లీ హైకోర్టు తెలిపిన వివరాల ప్రకారం..‘డీహెచ్ఎఫ్ఎల్ కుంభకోణం కేసుకు సంబంధించి సీబీఐ కోర్టు జడ్జి అశ్వనీ కుమార్ సర్పాల్ ఏప్రిల్ 27న న్యాయపరమైన ఉత్తర్వులను జారీ చేశారు. అందులో ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సీబీఐ 26 ట్రంక్పెట్టెల్లో 3,30,000 పేజీల పత్రాలను దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రధాన ఛార్జిషీట్, అనుబంధ ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం మొత్తం 108 మంది నిందితులు ఉన్నారని తెలిపారు. ఈ కేసులో నిజాలు నిరూపించడానికి 736 మంది సాక్షులున్నట్లు పేర్కొన్నారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని త్వరగా పరిష్కారం అయ్యేలా స్పెషల్ కోర్టును ఏర్పాటు చేస్తున్నాం’ అని తెలిపింది.అసలేంటీ కేసు..2010-18 మధ్య యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో 17 బ్యాంకుల కన్సార్షియం డీహెచ్ఎఫ్ఎల్కు రూ.42,871 కోట్ల విలువైన రుణాలను ఇచ్చింది. వీటిని తిరిగి చెల్లించడంలో విఫలమైనందుకు యూనియన్ బ్యాంక్ సీబీఐను ఆశ్రయించింది. సంస్థ ప్రమోటర్లుగా ఉన్న కపిల్, ధీరజ్లు నిజాల్ని కప్పిపుచ్చుతూ.. విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని, 2019 మే నుంచి రుణ చెల్లింపులను ఎగవేస్తూ రూ.34,614 కోట్ల మేర ప్రజా ధనాన్ని మోసం చేశారని బ్యాంకు ఆరోపించింది. డీహెచ్ఎఫ్ఎల్ ఖాతా పుస్తకాల ఆడిట్లోనూ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, నిధులు మళ్లించారని చెప్పింది. ఫలితంగా కపిల్, ధీరజ్లు సొంత ఆస్తులు పెంచుకున్నారని.. ఇదంతా ప్రజా ధనంతో చేశారని పేర్కొంది.ఇదీ చదవండి: రూ.652 కోట్లతో మొండి బాకీల కొనుగోలు!డీహెచ్ఎఫ్ఎల్ మోసాలు 2019 జనవరి నుంచి వెలుగులోకి రావడం మొదలైంది. ఈ సంస్థ నిధులు మళ్లిస్తోందంటూ ప్రసార మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. డీహెచ్ఎఫ్ఎల్పై ‘ప్రత్యేక ఆడిట్’ నిర్వహించాలంటూ బ్యాంకులు కేపీఎమ్జీ ఆడిట్ సంస్థను నియమించాయి. కపిల్, ధీరజ్ వాధ్వాన్లు దేశం విడిచిపెట్టకుండా ఉండేందుకు 2019 అక్టోబరు 18న ‘లుక్అవుట్ సర్క్యులర్’లను జారీ చేశాయి. -
బ్యాంకును మోసగించిన కేసులో కాంగ్రెస్ నేత అరెస్టు
సాక్షి, హైదరాబాద్: బ్యాంక్ ఖాతాదారునికి తెలియకుండా రూ.40 కోట్లు కాజేసిన కేసులో ఇద్దరు బ్యాంక్ మేనేజర్లతో సహా కాంగ్రెస్ నాయకుడు షేక్ బషీద్ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బషీద్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తరుఫున రాజంపేట ఎంపీ అభ్యరి్థగా పోటీ చేశాడని సైబరాబాద్ ఆరి్థక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ) డీసీపీ కె.ప్రసాద్ తెలిపారు. కేసు పూర్తి వివరాలివీ..ముంబైలోని నారిమన్ పాయింట్లోని ఇండస్ఇండ్ బ్యాంక్లో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థకు ఖాతా ఉంది. బ్యాంక్ అంతర్గత ఆడిట్లో భాగంగా జులై 12న ఈ ఖాతా నుంచి శంషాబాద్లోని ఇండస్ఇండ్ బ్యాంకుకు రూ.15 కోట్లు, రూ.25 కోట్లు చొప్పున రెండు విడతల్లో రూ.40 కోట్ల నగదు బదిలీ అయినట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు. ముంబైలోని ప్రధాన కార్యాలయం అనుమతి లేకుండా అనధికారికంగా ఈ నగదు బదిలీ జరిగినట్లు తేలడంతో జోనల్ హెడ్ను అప్రమత్తం చేశారు. దీంతో ఇండస్ఇండ్ బ్యాంక్ జోనల్ హెడ్ (ఆపరేషన్స్) మణికందన్ రామనాథన్ జులై 19న సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బహుమతిగా ఫార్చ్యూనర్ కార్లు.. కొట్టేసిన సొమ్ముతో బషీద్ రెండు టయోటా ఫార చ్యనర్ కార్లను కొనుగోలు చేశాడు. వీటిలో ఒకటి బ్యాంక్ మేనేజర్ రామస్వామికి బహుమతిగా అందించాడు. ఆ తర్వాత మిగిలిన సొమ్ముతో బషీద్ ఢిల్లీకి పరారయ్యాడు. సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితులు రామస్వామి, రాజే‹Ùలను హైదరాబాద్లో, బషీద్ను ఢిల్లీలో అరెస్టు చేశారు. వీరిని జ్యూడీషియల్ రిమాండ్కు తరలించారు. ఈ కేసులో అరెస్టయిన ఏ–3 బషీద్పై గతంలో హైదరాబాద్ కమిషనరేట్లోని సీసీఎస్లో, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, బోయిన్పల్లి పీఎస్లతో పాటు సైబరాబాద్లోని నార్సింగి, వికారాబాద్ జిల్లాలోని మోమిన్పేట్ ఠాణాలలో పదికి పైగా చీటింగ్ కేసులున్నాయి. బషీద్ పలు సినిమాలను నిరి్మంచడంతో పాటు నటించాడు కూడా.బ్యాంక్ మేనేజర్ల పనే.. శంషాబాద్లోని ఇండస్ ఇండ్ బ్యాంక్ మేనేజర్ కనుగుల రామస్వామి, సర్వీస్ డెలివరీ మేనేజర్ సపాయి రాజేశ్ ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులు. ఆదిత్యా బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ ఖాతాలో రూ.కోట్లలో జరుగుతున్న లావాదేవీలను గుర్తించిన ఇరువురు నిందితులు పక్కా పథకం వేశారు. జులై నెలలో జూబ్లీహిల్స్కు చెందిన వ్యాపారి షేక్ బషీద్ పేరుతో బ్యాంక్ అకౌంట్ను తెరిచారు. ఈ ఖాతాకు ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ చెక్, ఆరీ్టజీఎస్ లేకుండా అనధికారికంగా రూ.40 కోట్ల నగదును బదిలీ చేశారు. క్షణాల్లోనే ఈ అకౌంట్ నుంచి జాతీయ, ప్రైవేట్ బ్యాంక్ల్లోని 20 వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారు. ఈ సొమ్ములో కొంత మొత్తాన్ని వేర్వేరు ఏటీఎంల నుంచి విత్ డ్రా చేశారు. -
బ్యాంక్ ఖాతాదారులకు ఎస్బీఐ అలెర్ట్
ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్. రీడమ్ పాయింట్ల పేరుతో ఖాతాదారుల్ని మోసం చేసేందుకు సైబర్ నేరస్తులు ప్రయత్నిస్తున్నారని, వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సదరు బ్యాంకులు ఖాతాదారుల్ని హెచ్చరిస్తున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ వినియోగం పెరిగే కొద్ది సైబర్ నేరుస్తులు తమ పంథాను మారుస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా బ్యాంక్ ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్లలో ఉన్న సొమ్మును కాజేస్తున్నారు. ఈ తరుణంలో ఎస్బీఐతో పాటు పలు ప్రైవేట్ బ్యాంక్లు కస్టమర్లను అలెర్ట్ చేస్తున్నాయి. పెరిగిపోతున్న స్కామ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ తరుణంలో ఎస్బీఐ ఖాతాదారుల్ని సైబర్ నేరస్తులు మోసం చేసేందుకు రివార్డ్ పాయింట్లను అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారని ట్వీట్ చేసింది. Your safety is our top priority.Here is an important message for all our esteemed customers!#SBI #TheBankerToEveryIndian #StaySafe #StayVigilant #FraudAlert #ThinkBeforeYouClick pic.twitter.com/CXiMC5uAO8— State Bank of India (@TheOfficialSBI) May 18, 2024 ఎస్బీఐ రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేసే నెపంతో వినియోగదారులకు ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఫైల్ను( APK ) పంపిస్తున్నారు. అలాంటి వాటి పట్ల ఖాతాదారులు అప్రత్తంగా ఉండాలని కోరింది.రీడీమ్ చేసుకోవాలంటూ మోసగాళ్లు ఎస్ఎంఎస్, వాట్సప్ ద్వారా ఏపీఏకే ఫైల్స్, మెసేజెస్ పంపిస్తారు. వాటిని క్లిక్ చేయొద్దని కోరింది. ఇలాంటి ఏపీకే ఫైల్స్ పట్ల ఎస్బీఐతో పాటు ఏఐ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఖాతాదారులు మోసపోతున్నారని, వాటి జోలికి పోవద్దని తెలిపాయి. Don't get caught in the web of fake links! Stay sharp, stay safe!@CyberdostTo report Cyber Crime, visit https://t.co/qb66kKVmLw or Dial 1930 for assistance#FoolTheFraudster #Fraud #Awareness #PNB #Digital pic.twitter.com/LOYUBy0nYf— Punjab National Bank (@pnbindia) May 1, 2024Stay vigilant against investment or task-based fraud! Protect your financial and personal information by verifying sources, researching thoroughly, and never sharing sensitive details online. #StaySafe #FraudPrevention pic.twitter.com/87xrfSd2Sy— Axis Bank (@AxisBank) May 13, 2024Is that scan hiding a potential scam? Watch the video to uncover the hidden risks of QUISHING and learn how to stay one step ahead of the fraudsters.To report a fraud,📞National Cyber Crime Helpline on 1930 or🌐Visit https://t.co/5QHgCWZl7n#BeatTheCheats #SafeBanking pic.twitter.com/MSMs2jti1l— ICICI Bank (@ICICIBank) May 19, 2024 -
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
రూ. 34,000 కోట్ల బ్యాంకు మోసం కేసులో దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) మాజీ డైరెక్టర్ ధీరజ్ వాధవాన్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వాధవాన్ను సోమవారం సాయంత్రం ముంబైలో అదుపులోకి తీసుకున్నామని, మంగళవారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు సీబీఐ అధికారులు ధృవీకరించారు. బ్యాంకులను రూ.34,615 కోట్ల మేర మోసం చేసిన కేసులో డీహెచ్ఎఫ్ఎల్ మాజీ ప్రమోటర్లపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 17 బ్యాంకుల కన్సార్టియంలను మోసం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీబీఐ అధికారులు డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు ధీరజ్ వాధవాన్, కపిల్ వాధవాన్లపై కేసులు నమోదు చేశారు. ఎస్ బ్యాంక్ అవినీతి కేసులో అరెస్ట్ ఈ కేసుకు సంబంధించి 2022లో ధీరజ్ను సీబీఐ చార్జిషీట్లో చేర్చింది. ఎస్ బ్యాంక్ అవినీతి కేసులో వాధావాన్ను గతంలో సీబీఐ అరెస్ట్ చేస్తే బెయిల్పై విడుదలైనట్లు అధికారులు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ లోన్ కుంభకోణంగా వాధావాన్ అరెస్ట్పై 17 బ్యాంకుల కన్సార్టియంను రూ.34,000 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై సీబీఐ డీహెచ్ఎఫ్ఎల్ కేసు నమోదు చేసిందని, ఇది దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ లోన్ కుంభకోణంగా నిలిచిందని సీబీఐ అధికారులు పేర్కొన్నారునేరపూరిత కుట్రకుయూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను మోసం చేయడానికి డీహెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్లు కపిల్ వాధావన్, ధీరజ్ వాధవన్ ఇతర నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. ఈ కుట్రలో భాగంగా వాధవాన్లు రూ. 42,871.42 కోట్ల భారీ రుణాలను మంజూరు చేసేందుకు కన్సార్టియం బ్యాంకులను ప్రేరేపించారని ఏజెన్సీ తెలిపింది.నిందితులు డీహెచ్ఎఫ్ఎల్ లెక్కల్ని తారుమారు చేసింది. ఆ నిధుల్ని వినియోగించడం, దుర్వినియోగం చేశారు. కన్సార్టియం బ్యాంకుల చట్టబద్ధంగా బకాయిలను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారని సీబీఐ అధికారులు వెల్లడించారు. -
డీహెచ్ఎఫ్ఎల్ స్కామ్.. నిందితులకు బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(డీహెచ్ఎఫ్ఎల్), దాని మాజీ ప్రమోటర్లు కపిల్ వాధ్వాన్, దీరజ్ వాధ్వాన్పై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. యూనియన్ బ్యాంక్ నేతృత్వంలోని కన్షార్షియాన్ని రూ.34,615 కోట్ల మేర డీహెచ్ఎఫ్ఎల్ మోసగించిందన్న అభియోగాలపై సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి కపిల్, ధీరజ్లకు దిల్లీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను సుప్రీంకోర్టు బుధవారం రద్దు చేసింది. జస్టిస్ బేల ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. నిందితులకు బెయిల్ మంజూరు చేయడంలో హైకోర్టు, ట్రయల్ కోర్టు ఇంకాస్త మెరుగ్గా స్పందించాల్సిందని సుప్రీంకోర్టు తెలిపింది. డీహెచ్ఎఫ్ఎల్ లోన్ స్కామ్కు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరిపిన సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సీఆర్పీసీ ప్రకారం 90 రోజుల దర్యాప్తు గడువులోపు క్రిమినల్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయడంలో విఫలమైతే నిందితులకు బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 88వ రోజు సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేయగా, ట్రయల్ కోర్టు నిందితులకు కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. దాన్ని సవాలుచేస్తూ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈతీర్పు వెలువడినట్లు తెలిసింది. అసలేం జరిగిందంటే.. డీహెచ్ఎఫ్ఎల్ మోసాలు 2019 జనవరి నుంచి వెలుగులోకి రావడం మొదలైంది. ఈ సంస్థ నిధులు మళ్లిస్తోందంటూ ప్రసార మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. డీహెచ్ఎఫ్ఎల్పై ‘ప్రత్యేక ఆడిట్’ నిర్వహించాలంటూ కేపీఎమ్జీ సంస్థను 2019 ఫిబ్రవరి 1న బ్యాంకులు నియమించాయి. 2015 ఏప్రిల్ 1-2018 డిసెంబరు మధ్యకాలానికి, ఆ సంస్థ ఖాతా పుస్తకాలపై సమీక్ష నిర్వహించాలని కేపీఎమ్జీని అప్పట్లో కోరాయి. కపిల్, ధీరజ్ వాధ్వాన్లు దేశం విడిచిపెట్టకుండా ఉండేందుకు 2019 అక్టోబరు 18న ‘లుక్అవుట్ సర్క్యులర్’లను బ్యాంకులు జారీ చేశాయి. కేపీఎమ్జీ నిర్వహించిన ఆడిట్లో.. రుణాలు, అడ్వాన్సులు పొందిన తర్వాత డీహెచ్ఎఫ్ఎల్కు చెందిన సంస్థలు, వ్యక్తులు, డైరెక్టర్ల ఖాతాలకు నిధుల మళ్లింపు జరిగిందని తేలినట్లు యూనియన్ బ్యాంకు పేర్కొంది. డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లకు రూ.29,100 కోట్ల మేర పంపిణీ జరిగినట్లు తెలుస్తుంది. ఇందులో చాలా వరకు లావాదేవీలు భూములు, ఆస్తుల రూపంలో పెట్టుబడులు పెట్టినట్లు బ్యాంకు ఖాతా పుస్తకాల పరిశీలనలో తేలినట్లు వివరించింది. రుణాలిచ్చిన నెలరోజుల్లోనే ఆ నిధులు సుధాకర్ షెట్టికి చెందిన కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో మళ్లినట్లు తేలింది. రూ.వందల కోట్ల చెల్లింపులకు సంబంధించిన వివరాలు బ్యాంకు స్టేట్మెంట్లలో కనిపించలేదు. రుణాల అసలు, వడ్డీలపై సహేతుకం కాని రీతిలో మారటోరియం కనిపించింది. పలు సందర్భాల్లో డీహెచ్ఎఫ్ఎల్, తన ప్రమోటర్లకు భారీ ఎత్తున నిధులను పంపిణీ చేసింది. వాటిని తమ ఖాతా పుస్తకాల్లో రిటైల్ రుణాలుగా పేర్కొన్నారు. రూ.14,000 కోట్ల గల్లంతు ప్రాజెక్ట్ ఫైనాన్స్ కింద రూ.14,000 కోట్లు ఇచ్చినట్లు చూపారు. ఇందు కోసం 1,81,664 మందికి రిటైల్ రుణాలు ఇచ్చినట్లు తప్పుగా సృష్టించారు. ఇవ్వని రుణాల విలువ రూ.14,095 కోట్లుగా తేలింది. తరుచుగా.. ‘బాంద్రా బుక్స్’ పేరిట రుణాలను పేర్కొంటూ, వాటికి విడిగా డేటాబేస్ నిర్వహించారు. ఆ తర్వాత వాటన్నింటినీ ‘అదర్ లార్జ్ ప్రాజెక్ట్ లోన్స్’(ఓఎల్పీఎల్)లో విలీనం చేశారు. కాగా, కంపెనీకి చెందిన గృహ రుణాలు, ప్రాజెక్టు రుణాల హామీలు, ప్రమోటర్ల వాటా అమ్మకం తదితరాల ద్వారా కంపెనీపై ఒత్తిడి తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎప్పటికప్పుడు డీహెచ్ఎఫ్ఎల్, ఆ కంపెనీ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్లు చెబుతూ వచ్చారు. ఇదీ చదవండి: సేవింగ్స్ ఖాతాలపై 7.75 శాతం వడ్డీ కావాలా..! 2019 మే నుంచి రుణాల చెల్లింపులు, వడ్డీలను డీహెచ్ఎఫ్ఎల్ ఆలస్యం చేస్తూ వచ్చింది. ఆ తర్వాత నిరర్థక ఆస్తులుగా కంపెనీ ఖాతాలను ప్రకటించారు. దాంతో బ్యాంకులపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా రూ.34,615 కోట్ల మోసానికి పాల్పడినట్లు తేలింది. ఎఫ్ఐఆర్లో మాజీ ప్రమోటర్లతోపాటు అమిలిస్ రియల్టర్స్కు చెందిన సుధాకర్ షెట్టి, మరో ఎనిమిది మంది బిల్డర్లు కూడా ఉన్నారు. -
Naresh Goyal: జైల్లోనే చావాలనుంది!
ముంబై: ‘‘నాలో బతకాలన్న ఆశలన్నీ పూర్తిగా అడుగంటాయి. క్యాన్సర్ ముదిరి నా భార్య అనిత మంచాన పడింది. ఆమెను ఎంతగానో మిస్సవుతున్నా. నా ఒక్కగానొక్క కూతురుకూ ఒంట్లో బాగుండటం లేదు. నా ఆరోగ్యం కూడా పూర్తిగా దిగజారింది. మోకాళ్లు మొదలుకుని మూత్ర సంబంధిత వ్యాధుల దాకా తీవ్రంగా వేధిస్తున్నాయి. ఒళ్లంతా స్వాధీనం తప్పి వణుకుతోంది. నొప్పుల బాధను తట్టుకోలేకపోతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో దైన్యంగా బతుకీడ్చడం కంటే జైల్లోనే చనిపోతే బాగుండనిపిస్తోంది’’ అంటూ జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ (74) భావోద్వేగానికి లోనయ్యారు. రూ.538 కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో నిందితుడైన ఆయనను ఈడీ గత సెపె్టంబర్ 1న అరెస్టు చేసింది. నాటి నుంచీ జైల్లో ఉన్న ఆయన శనివారం ముంబై ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరయ్యారు. కాసేపు వ్యక్తిగతంగా విచారించాలని కోరగా జడ్జి అనుమతించారు. ఈ సందర్భంగా చేతులు జోడించి తన దైన్యం గురించి చెప్పుకుంటూ కంటతడి పెట్టారు. మాట్లాడుతున్నంత సేపూ గోయల్ వణకుతూనే ఉన్నారని జడ్జి తెలిపారు. ఆయన గత డిసెంబర్లో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. -
మరో భారీ బ్యాంకు స్కాం: ఏకంగా రూ.3847 కోట్లకు ముంచేశారు
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను వేల కోట్లకు ముంచేసిన స్కాం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ముంబైకి చెందిన డెవలపర్ యూనిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కేసు నమోదు చేసింది. కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) కిషోర్ కృష్ణ అవర్సేకర్, ప్రమోటర్లు అభిజీత్ కిషోర్ అవర్సేకర్, ఆశిష్ అవర్సేకర్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) అభియోగాలు మోపింది. ముగ్గురు డైరెక్టర్లు, కొంతమంది గుర్తుతెలియని ప్రభుత్వోద్యోగులతోపాటు పలువురు అధికారులపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఎస్బీఐతోపాటు ఇతర, 15 బ్యాంకుల కన్సార్టియంనురూ. 3,847.58 కోట్ల మేరకు మోసం చేశారన్న ఆరోపణలపై సీబీఐఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ముంబైలోని స్ట్రెస్డ్ అసెట్స్ మేనేజ్మెంట్ బ్రాంచ్, ఎస్బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా గురువారం ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదైంది. ముంబైలోని తమవాణిజ్య శాఖలో మోసం జరిగిందని, నిందితులు కల్పిత లావాదేవీలు చేయడం, బ్యాంకును మోసం చేయడం, చట్టవిరుద్ధంగా, మోస పూరితంగా ఖాతాల పుస్తకాలను తారుమారు చేసి బ్యాంకు నిధులను స్వాహా చేశారని ఈ కేసులో, ఆగస్ట్ 17, 2023న, ఎస్బీఐ డీజీఎం (ముంబయి) రజనీకాంత్ ఠాకూర్, యూనిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, దాని డైరెక్టర్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. (మోదీజీ వచ్చే ఏడాదికి గొప్ప బర్త్డే గిఫ్ట్: ఫాక్స్కాన్ పోస్ట్ వైరల్) మొత్తం 23 బ్యాంకులు.. కానీ మొత్తం 23 బ్యాంకులున్నప్పటికీ, కేవలం 16 బ్యాంకులు మాత్రమే తమ అంచనా నష్టాలను నివేదించాయి. ఇందులో బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ , యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానంగా ఉన్నాయి. కాగా 2012లో జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత మంత్రాలయ భవనం పునరుద్ధరణ, కళానగర్లో థాకరే కుటుంబ బంగ్లా మాతోశ్రీ నిర్మాణం, దాదర్ టీటీ ఫ్లై ఓవర్, CSM సబ్వే లాంటి నిర్మాణాలకు యూనిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ పాపులర్. (పండగ వేళ పసిడి పరుగు, వెండి ఎంత తగ్గిందంటే!) -
పదేళ్లలో 757 బ్యాంక్ మోసం కేసులు!
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత 10 సంవత్సరాలలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులలో బ్యాంకు మోసాలకు సంబంధించిన 757 కేసులు నమోదుచేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ ఈడీ వద్ద నమోదయిన కేసులు 36 అని కూడా ఆయన వెల్లడించారు. అక్రమ ధనార్జనా నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారం ఈ కేసులు దాఖలయినట్లు పార్లమెంటుకు ఇచి్చన ఒక లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై 25వ తేదీ నాటికి రూ. 15,805.91 కోట్ల ఆస్తులు జప్తు జరిగిందని, రుణ బకాయిలకు సంబంధించి రూ. 15,113 కోట్లు బ్యాంకులకు సమకూర్చినట్లు పేర్కొన్నారు. రుణ మోసాలకు సంబంధించి అందుబాటులో ఉన్న వివిధ రికవరీ మార్గాలను అనుసరించినట్లు వెల్లడించారు. సివిల్ కోర్టులలో లేదా డెట్ రికవరీ ట్రిబ్యునల్స్లో దావా దాఖలు చేయడం, ఫైనాన్షియల్ ఆస్తుల సెక్యూరిటీ– రీకన్స్ట్రక్షన్ కింద చర్యలు, సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం అమలు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో దివాలా చర్యలు, చర్చల పరిష్కారం, రాజీ వంటి పలు మార్గాలు ఇందులో ఉన్నాయన్నారు. పది కేసుల్లో 14 మంది దేశం విడిచి పారిపోయినట్లు గుర్తించామన్నారు. వీరిలో ఆరుగురిని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లుగా, ఏడుగురిని ప్రకటిత నేరస్థులుగా ప్రకటించామని మంత్రి తెలిపారు. -
రూ.28 వేల కోట్లకు పైగా బ్యాంకులకు బురిడీ
ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తప్పుడు మార్గాల్లో రూ.28వేల కోట్లకు పైగా రుణాలు పొంది బురిడీ కొట్టించారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు పైబడిన 79 మోసాల కేసుల్లో మొత్తం రూ.28,797.03 కోట్ల మేర మోసాలకు గురైనట్లు తెలిపింది. ఇందులో అత్యధికంగా పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.7,111.52 కోట్ల మోసం జరిగింది. నిధుల మళ్లింపు, ఖాతా పుస్తకాల్లో వివరాలు తప్పుగా సూచించడం, తారుమారు చేయడం, రుణగ్రహీతలు తప్పుడు ఆర్థిక నివేదికలు సమర్పించడం, నిర్దేశించిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని పాటించకపోవడమే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలకు ప్రధాన కారణంగా తేలిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. రుణగ్రహీతలు మూడో పార్టీ ఏజెన్సీలు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు కుమ్మక్కు కావడం కూడా ప్రధాన కారణమని తెలిపింది. ఈ నేపథ్యంలో.. బ్యాంకు మోసాలను నివారించేందుకు ఆన్లైన్లో శోధించదగిన డేటాబేస్, సెంట్రల్ ఫ్రాడ్ రిజిస్ట్రీ రూపంలో గుర్తించనున్నట్లు పేర్కొంది. మోసాలను నియంత్రించడం క్రెడిట్ మంజూరు ప్రక్రియలో తగిన శ్రద్ధ వహించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసినట్లు వివరించింది. అలాగే, బ్యాంకుల్లో జరిగిన మోసాల కేసులను లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, పోలీసుస్టేషన్లు, సీబీఐ తదితరాల ద్వారా విచారణకు ఆదేశిస్తున్నట్లు ఆ శాఖ తెలిపింది. అంతేకాక.. ప్రత్యేక కమిటీ ద్వారా కేసులను పర్యవేక్షించడంతో పాటు బ్యాంకు బోర్డుల ఆడిట్ కమిటీల ముందు త్రైమాసిక సమాచారాన్ని ఉంచడం ద్వారా ఈ మోసాలపై వార్షిక సమీక్ష చేస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. 2021–22లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ జరిగిన మోసాలు.. (రూ.కోట్లలో) –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– బ్యాంకు మోసాలు విలువ –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– బ్యాంక్ ఆఫ్ బరోడా 9 2,860.85 బ్యాంక్ ఆఫ్ ఇండియా 15 4,668.00 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2 896.30 కెనరా బ్యాంక్ 6 2,774.26 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 388.24 ఇండియన్ బ్యాంక్ 7 1,628.36 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 3 874.76 పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ 2 364.03 పంజాబ్ నేషనల్ బ్యాంక్ 13 7,111.52 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 12 4,856.71 యూకో బ్యాంక్ 1 374.96 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6 1,999.31 –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– -
సహకారం.. స్వాహాపర్వం
సాక్షి ప్రతినిధి,ఏలూరు: సహకార చట్టంలోని బ్యాంకుల నిబంధనలను పాటించలేదు.. రుణపరిమితిని అడ్డగోలుగా ఇష్టానుసారంగా పెంచేశారు.. సరైన షూరిటీలు లేకుండా కోట్లాది రూపాయల రుణాలు మంజూరు చేశారు. అర్హులైన రైతులకు ఇవ్వాల్సిన రుణాలను పక్కదారి పట్టించి మద్యం వ్యాపారులతో సహా పలువురికి కట్టబెట్టారు. ఇదంతా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పరిధిలోని బ్రాంచీల్లో జరిగిన అవినీతి పర్వం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని డీసీసీబీ పరిధిలోని ఆరు శాఖల్లో జరిగిన భారీ అవకతవకలపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. సమగ్ర విచారణ నివేదిక ఆధారంగా గతంలో పనిచేసిన ఉన్నతాధికారులందరిపై శాఖాపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గతంలో పనిచేసిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో పాటు మేనేజర్ కేడర్లోని 17 మందిపై చర్యలు తీసుకోనున్నారు. రుణాల మంజూరు విషయంలో.. జిల్లాలోని DCCB పరిధిలోని పలు బ్రాంచీల్లో ఏళ్ల తరబడి రుణాల మంజూరు విషయంలో భారీగా అవకతవకలు జరిగాయి. వివాదాల్లో ఉన్న భూము లను బ్యాంకుల్లో షూరిటీగా చూపించి కోట్ల రూపాయల రుణాలు పొంది తిరిగి రూపాయి కూడా చెల్లించని ఘటనలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలోని యలమంచిలి, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, ఏలూరుతో పాటు మరికొన్ని బ్రాంచీల్లో జరిగిన అవకతవకలపై విచారణకు ప్రభుత్వం గుంటూరు కో–ఆపరేటివ్ రిజిస్ట్రార్ను ప్రత్యేకాధికారిగా నియమించింది. సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనిపై కో–ఆపరేటివ్ శాఖ క మిషనర్ ఎ.బాబు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అక్రమాల్లో కొన్ని.. ● యలమంచిలి బ్రాంచీలో వివాదాలతో ఉన్న ఆ స్తులను షూరిటీలుగా చూపించి రూ.33.22 కోట్ల రుణం మంజూరు చేశారు. దీనిలో రూ.13.86 కోట్లు ఇప్పటికీ రికవరీ కాలేదు. అలాగే 2015–16, 2017–18 నాబార్డు వార్షిక తనిఖీల్లో నిర్దేశించిన నిబంధనలను అతిక్రమించి రుణాలు మంజూరు చేసినట్లుగా నిర్ధారించారు. ఎలాంటి షూరిటీలు లేకుండా రుణాలు మంజూరు చేసి బ్యాంకుకు ఆర్థిక నష్టం చేకూర్చారు. ● తాడేపల్లిగూడెం బ్రాంచీలో 104 మంది సభ్యుల పేరుతో రూ.2.80 కోట్లను ఓ రియల్టర్కు రుణంగా ఇచ్చారు. తాడేపల్లిగూడెంలోని డీసీసీబీ బ్రాంచీలో మొత్తం బకాయిల విలువ రూ.11.69 కోట్లు కాగా 559 రుణాలు విలువ రూ.4.30 కోట్లు. వీటి గడువు దాటినా కొన్నింటి వసూళ్లకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ● 2012–13 నుంచి 2018–19 వరకు డీసీసీబీ పలు శాఖల ద్వారా రూ.867.19 కోట్ల విలువైన 2,445 బ్యాంకు గ్యారంటీలు జారీ చేసింది. దీనిలో రూ.295.35 కోట్ల విలువైన 23 బ్యాంకు గ్యారంటీలను మద్యం వ్యాపారులు, రైస్మిల్లులు, ఇతరులకు ఇచ్చినట్టు గుర్తించారు. ● వ్యవసాయ భూమి విలువ భారీగా పెంచి షూరిటీగా చూపి రుణాలు కూడా మంజూరు చేశారు. క్రిమినల్ కేసులు అక్రమాలు జరిగిన క్రమంలో ఆయా కాలంలో పనిచేసిన బ్యాంకు అధికారులపై క్రిమినల్ కేసులకు సిఫార్సు చేశారు. మేనేజర్లు మన్నె మోహనరావు, ఐవీ నాగేశ్వరరావు, డి.ఆంజనేయులు, టీవీ సుబ్బారావు, కేఏ అజయ్కుమార్, జి.పిచ్చయ్యచౌదరి, కె.సురేంద్రప్రసాద్, ఎం.శ్రీనివాసరావు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్.రాధాకృష్ణ, జేఎస్వీ సత్యనారాయణరావు, సీహెచ్ రత్నకుమారి, కె.కిరణ్మయి, వి.శ్రీదేవి, డి.రమణ, జనరల్ మేనేజర్లు ఎ.మాధవీమూర్తి, వైవీ రాఘవేంద్రరెడ్డి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీవీఎం ఫణి తదితరులపై క్రిమినల్ చర్యలతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ సిఫార్సు చేశారు. -
స్పీడ్గా స్పందించారా.. అయితే అలర్ట్ అవాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రంగంతో పాటు బ్యాంకింగ్ సెక్టార్లోనూ కొన్ని అంశాల్లో తీవ్ర జాప్యం ఉంటుంది. ప్రధానంగా ఉత్తర ప్రత్యుత్తరాలకు రోజులు, వారాలే కాదు అవసరమైతే నెలలు కూడా వేచి చూడాలి. అయితే, ఓ బ్యాంక్ గ్యారెంటీ అంశానికి సంబంధించి బ్యాంక్కు ఈ–మెయిల్ పంపిన ఐదు నిమిషాల్లోనే జవాబు వచ్చేస్తే..? అలాంటి సత్వర స్పందనపై రాష్ట్ర ప్రభుత్వ అధికారికి వచి్చన సందేశంతోనే నకిలీ బ్యాంక్ గ్యారెంటీల స్కామ్ వెలుగులోకి వచి్చంది. ఈ కేసులో సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ఇటీవల నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.45 కోట్ల విలువైన బోగస్ బ్యాంక్ గ్యారెంటీ లేఖలు స్వాధీనం చేసుకున్నారు. కోల్కతాలో ‘కుటీర పరిశ్రమగా’ఈ దందా... కోల్కతాలోని అనేక ప్రాంతాలు నకిలీ బ్యాంక్ గ్యారెంటీ పత్రాలు తయారు చేయడానికి అడ్డాలుగా ఉన్నాయి. చిన్న చిన్న కార్యాలయాలతో పాటు గదుల్లోనూ కుటీర పరిశ్రమగా, వ్యవస్థీకృతంగా ఈ దందా నడుస్తుంటుంది. వీరికి దేశ వ్యాప్తంగా ఏజెంట్లు ఉంటారు. వరంగల్కు చెందిన ఏజెంట్ నాగరాజు వారిలో ఒకడు. చెన్నైకి చెందిన హర్షిత ఇంజనీరింగ్ కంపెనీ రాష్ట్రంలో కొన్ని కాంట్రాక్టులు దక్కించుకుంది. వీటి కోసం హర్షిత సంస్థ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖకు బ్యాంకు గ్యారెంటీలు సమర్పించాల్సి వచ్చింది. వాటిని ఏర్పాటు చేస్తానంటూ ఈ కంపెనీ ఎండీని కలిసిన నాగరాజు కమీషన్ చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. కంపెనీ నుంచి దాదాపు రూ.47 లక్షలు కమీషన్గా తీసుకున్న ఇతగాడు నకిలీ బ్యాంక్ గ్యారెంటీ లెటర్లు అందించాడు. పక్కాగా తయారు చేసిన కోల్కతా గ్యాంగ్.. ఏజెంట్గా వ్యవహరించిన నాగరాజుకు కొన్నేళ్ళ క్రితం రాజస్థాన్కు చెందిన నరేష్ వర్మ ద్వారా కోల్కతా వాసులు నీలోట్పాల్ దాస్, సుబ్రజిత్ గోశాల్లతో పరిచయమైంది. ఈ నలుగురూ కలసి గతంలో అనేక బ్యాంకులకు సంబంధించిన బ్యాంక్ గ్యారెంటీ పత్రాలు వివిధ కంపెనీలకు అందించారు. కాగా, ఇండస్ఇండ్ బ్యాంక్ పేరుతో తమకు అందినవి నకిలీవని తెలియని హర్షిత సంస్థ వాటిని అర్బన్ డెవలప్మెంట్ శాఖకు దాఖలు చేసి పనులు కూడా పొందింది. నకిలీ బ్యాంకు గ్యారెంటీ పత్రాలు తయారు చేయడంలో నీలోట్, సుబ్రజిత్లు దిట్టలు కావడంతో వీటిపై ఎవరికీ అనుమానం రాలేదు. కాంట్రాక్టర్లు, కాంట్రాక్టులు పొందిన సంస్థల నుంచి ఈ బ్యాంకు గ్యారెంటీ పత్రాలు పొందే ప్రభుత్వ విభాగాలు సాధారణంగా క్రాస్ చెక్ చేయవు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఆ బ్యాంక్ను సంప్రదించి సందేహం నివృత్తి చేసుకుంటాయి. ఐదు నిమిషాల్లోనే సమాధానం రావడంతో.. ఈ ఉత్తరప్రత్యుత్తరాలు ఈ–మెయిల్ ద్వారా జరుగుతాయి. సదరు బ్యాంక్ గ్యారెంటీ లేఖలోనే ఈ మెయిల్ ఐడీ కూడా ఉంటుంది. ఈ విషయం తెలిసిన కోల్కతా ద్వయం దీనికోసం ప్రత్యేకంగా కొన్ని ఈ–మెయిల్ ఐడీలు కూడా రూపొందించింది. వీటిలో ఆయా బ్యాంకుల పేర్లు ఉండేలా, వాటిని చూసిన అధికారులు నిజమైనవిగానే భావించేలా జాగ్రత్తపడింది. హర్షిత సంస్థ ద్వారా అందుకున్న బ్యాంక్ గ్యారెంటీలను సరిచూడాలని భావించిన అర్బన్ డెవలప్మెంట్ విభాగాధినేత అందులో ఉన్న ఈ–మెయిల్కి మెసేజ్ పంపించారు. దీన్ని అందుకున్న సుబ్రజిత్ గోశాల్ బ్యాంకు అధికారి మాదిరిగానే కేవలం ఐదు నిమిషాల్లోనే సమాధానంగా మెయిల్ పంపిస్తూ... అవి నిజమైనవేనని స్పష్టం చేశాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఇంత త్వరగా సమాధానం రావడంతో షాక్కు గురైన అర్బన్ డెవలప్మెంట్ అధికారులు అనుమానించారు. రీజినల్ కార్యాలయాన్ని సంప్రదించడంతో.. కోల్కతాలోని బ్రాంచ్ నుంచి వచి్చన జవాబుతో పాటు బ్యాంకు గ్యారెంటీ పత్రాలను మరోసారి సరిచూడాలని భావించారు. దీంతో వీటిని ముంబైలోని ఇండస్ఇండ్ బ్యాంక్ రీజనల్ కార్యాలయానికి ఈ–మెయిల్ ద్వారా పంపించారు. వీటిని చూసిన అక్కడి అధికారుల షాక్కు గురయ్యారు. ఈ బ్యాంకు గ్యారెంటీ పత్రాల్లో పేర్కొన్న ప్రాంతంలో తమకు అసలు శాఖే లేదని స్పష్టం చేశారు. తమకు ఈ–మెయిల్ ఐడీలు కూడా ఉండవని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మాసబ్ట్యాంక్లోని ఇండస్ఇండ్ బ్యాంక్ శాఖకు రీజనల్ కార్యాలయం తెలిపింది. వీరి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదై సీసీఎస్కు చేరింది. మరోపక్క హర్షిత సంస్థ కూడా నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నమోదైన కేసూ అక్కడికే వచి్చంది. వీటిని దర్యాప్తు చేసిన అధికారులు మొత్తం నలుగురు నిందితులనూ అరెస్టు చేశారు. -
‘చక్కిలం’ కేసులో నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష
హైదరాబాద్: చక్కిలం ట్రేడ్ హౌస్ లిమిటెడ్ కేసులో నిందితులకు జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. పదేళ్ల క్రితం నాటి కేసులో నిందితులకు తాజాగా ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. ఎస్బీఐలో రెండు కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకుని దారి మళ్లించిన కేసులో ఎట్టకేలకు నిందితులకకు జైలు శిక్ష పడినట్లు ఈడీ తెలిపింది. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం నిందితులకు శిక్ష ఖరారు చేసింది నాంపల్లి కోర్టు. అప్పట్లో కంపెనీకి చెందిన ముగ్గురు డైరెక్టర్లతో పాటు బ్యాంకుకు చెందిన ముగ్గురిపై ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
గౌతమ్ థాపర్పై ఛార్జ్షీట్
న్యూఢిల్లీ: సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్, ఆ సంస్థ మాజీ ప్రమోటర్ గౌతమ్ థాపర్పై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. రూ. 2435 కోట్ల బ్యాంకు మోసం కేసులో ఈ ఛార్జ్షీట్ దాఖలైంది. 12 బ్యాంకులపై ఈ బ్యాంకింగ్ మోసం ప్రభావం చూపిందని అధికారులు తెలిపారు. కంపెనీ, థాపర్ ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై బ్యాంక్ నిధుల మళ్లింపు, ఖాతా పుస్తకాలను తారుమారు తదితర ఆరోపణలపై ఏజెన్సీ దాదాపు 19 నెలల పాటు విచారణ జరిపిన తర్వాత ఈ చార్జ్షీట్ను దాఖలు చేయడం జరిగింది. అవినీతి, మోసం ఆరోపణల కింద సీబీఐ కేసు నమోదు చేసిన యస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్తో సంబంధాలపై థాపర్ ఇప్పటికే పలు విచారణలను ఎదుర్కొంటున్నారు. చదవండి: గుడ్న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. జనరల్ టికెట్ కోసం క్యూలో నిలబడక్కర్లేదు! -
ఆర్బీఐ, సీబీఐకి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), దర్యాప్తు సంస్థ సీబీఐకు సోమవారం నోటీసులు జారీ చేసింది. బ్యాంకు రుణాల మోసం కేసుల్లో ఆర్బీఐ నామినీ డైరెక్టర్, ఇతర సిబ్బంది పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం తాజా నోటీసు లిచ్చింది. వివిధ బ్యాంకింగ్ స్కామ్లలో ఆర్బీఐ అధికారుల పాత్రపై విచారణ జరపాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పీటీషన్ను సుప్రీం విచారణకు స్వీకరించింది. జస్టిస్ బీఆర్ గవాయి, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం బీజేపీ నేత పిటిషన్పై సమాధానం ఇవ్వాలని ఆర్బీఐ, సీబీఐను కోరింది. కాగా కింగ్ఫిషర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యెస్ బ్యాంక్ లాంటి వివిధ కుంభకోణాల్లో ఆర్బీఐ అధికారుల ప్రమేయంపై విచారణ జరగలేదని స్వామి ఆరోపించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంతో సహా, పలు చట్టాలను ప్రత్యక్షంగా ఉల్లంఘిస్తూ ఆర్బీఐ అధికారులు నిర్లక్క్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. Supreme Court issues notice to Reserve Bank of India (RBI) and Central Bureau of Investigation (CBI) on a plea filed by BJP member Subramanian Swamy seeking a CBI probe into the alleged role of RBI's nominee director in bank loan fraud cases. — ANI (@ANI) October 17, 2022 -
డీహెచ్ఎఫ్ఎల్ కేసులో... 75 మందిపై చార్జిషీట్
న్యూఢిల్లీ: రూ.34 వేల కోట్ల బ్యాంకులను మోసగించిన కేసులో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(డీహెచ్ఎఫ్ఎల్) మాజీ సీఎండీ కపిల్ వాధవన్, మరో 74 మందిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని సీబీఐ కోర్టులో వేసిన చార్జిషీట్లో ఆ సంస్థ మాజీ డైరెక్టర్ ధీరజ్ వాధవన్, మాజీ సీఈవో హర్షిల్ మెహతా పేర్లు కూడా ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. 17 బ్యాంకుల కన్సార్టియంను రూ.34 వేల కోట్ల మేర మోసగించినట్లు డీహెచ్ఎఫ్ఎల్పై ఆరోపణలున్నాయి. 2010 నుంచి 2018 వరకు 17 బ్యాంకులతో కూడిన కన్సార్టియం నుంచి ఏకంగా రూ.42,871 కోట్లు రుణాలు సేకరించింది హెచ్డీఎఫ్ఐ. అయితే 2019 నుంచి రుణాలకు సంబంధించిన చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో కన్సార్టియంకు నేతృత్వం వహిస్తున్న యూనియన్ బ్యాంకు 2021లో సీబీఐకి లేఖ రాసింది. తాము తాజాగా నిర్వహించిన ఆడిట్లో ఈ మోసం వెలుగు చూసినట్టు పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఈ ఏడాది ఫిబ్రవరిలో యూనియన్ బ్యాంకు కోరింది. దీనిపై విచారణ చేపట్టిన అనంతరం సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇదీ చదవండి: డీహెచ్ఎఫ్ఎల్ కుంభకోణం.. రూ.34,615 కోట్ల మోసం.. సీబీఐ కేసు నమోదు -
జల్సాలు, విలాసాల కోసం బ్యాంక్కు బురిడీ.. ఎంతో తెలుసా?
సాక్షి, సిటీబ్యూరో: డమ్మీ కంపెనీలు.. నకిలీ ఉద్యోగులు... వారి పేర్లతో బ్యాంకు ఖాతాలు... ఇలా రంగంలోకి దిగిన ఓ ముఠా అందినకాడికి రుణాలు, క్రెడిట్ కార్డులు తీసుకుంది. ఆ డబ్బుతో జల్సాలు చేస్తూ వాయిదాలు చెల్లించకుండా బ్యాంకును నిండా ముంచింది. దీనిపై నాచారం ఠాణాలో కేసు నమోదు కాగా.. రంగంలోకి దిగిన మల్కాజ్గిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి దాదాపు 60 క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అధికారులు రికవరీలపై దృష్టి పెట్టడంతో ఒకటి రెండు రోజుల్లో ముఠా అరెస్టు ప్రకటించనున్నారు. ఈ గ్యాంగ్ బ్యాంకును రూ.2.5 కోట్ల మేర బురిడీ కొట్టించినట్లు తెలుస్తోంది. బ్యాంకుల పని తీరు తెలియడంతో... వివిధ ప్రాంతాలకు చెందిన ఐదుగురు ఓ ముఠాగా ఏర్పడ్డారు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు జారీలో బ్యాంకుల వద్ద ఉన్న లోటుపాట్లు తెలుసుకున్నారు. భారీ స్థాయిలో క్రెడిట్కార్డులు, రుణాలు తీసుకుని మోసం చేస్తే ‘లాభం’ ఉంటుందని భావించారు. నాచారం ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే ఓ డమ్మీ కంపెనీ ఏర్పాటు చేశారు. వరంగల్కు చెందిన పలువురికి మాయమాటలు చెప్పి ఫొటోలు, ఇతర పత్రాలు సేకరించారు. వారందరూ తన సంస్థలో ఉద్యోగులంటూ ప్రొఫైల్స్ క్రియేట్ చేశారు. ఈ ‘ఉద్యోగుల్లో’ కొందరు రైతులు, చిన్న చిన్న దుకాణాల యజమానులు కూడా ఉన్నారు. వీరంతా ఉన్నత విద్య అభ్యసించినట్లు నకిలీ వివరాలు సృష్టించిన ముఠా సభ్యులు వాళ్లను సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇంజినీర్లుగా, హెచ్ఆర్ నిర్వాహకులుగా మార్చారు. వారి పేర్లతో రుణాలు, కార్డులు... వారి వివరాలతో గుర్తింపు కార్డులనూ తయారు చేశారు. ఆపై ఆయా పేర్లతో ఓ బ్యాంకులో శాలరీ అకౌంట్స్ తెరిచారు. ఇలా తెరిచిన శాలరీ అకౌంట్స్ ఖాతాలకు సంబంధించిన ఏటీఎం కార్డులు, చెక్ పుస్తకాలను తమ వద్దే ఉంచుకున్నారు. దాదాపు మూడు నెలల పాటు జీతాలు వేయడంతో పాటు ఆ మొత్తాలను వీరే డ్రా చేసుకుంటూ గడిపారు. ఇలా రూపొందించిన స్టేట్మెంట్స్, బోగస్ ధ్రువీకరణలను ఆధారంగా చేసుకుని బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు పొందారు. కొందరిని మేనేజ్ చేయడం ద్వారా ఈ క్రెడిట్కార్డ్స్, రుణాలు మంజూరయ్యేలా చేశారు. ఇలా మొత్తం దాదాపు రూ.2.5 కోట్ల మేర స్వాహా చేశారు. జల్సాలు, విలాసాలు... క్రెడిట్ కార్డుల్లో వాడిన మొత్తాలు, వ్యక్తిగత రుణానికి సంబం«ధించిన ఈఎంఐలు చెల్లింపులు జరగకపోవడంతో బ్యాంకు అధికారులు ఆరా తీశారు. దీంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి మల్కాజ్గిరి ఎస్ఓటీ బృందం రంగంలోకి దిగింది. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో విచారించింది. ఇలా బ్యాంకు నుంచి కాజేసిన సొమ్ముతో ముఠా సభ్యులు జల్సాలు, విలాసాలు చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇది కూడా చదవండి: అప్పు కావాలి.. జూనియర్ ఆర్టిస్ట్ను నమ్మించి రూమ్లో ఫ్రెండ్స్తో కలిసి.. -
దేశంలో భారీగా తగ్గిన బ్యాంక్ మోసాలు.. కారణాలివేనా?
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22) బ్యాంకింగ్ రంగంలో భారీ మోసాలు తగ్గుముఖం పట్టాయి. రూ. 100 కోట్లకుపైబడిన మోసాల విలువ రూ. 41,000 కోట్లకు పరిమితమమైంది. అంతక్రితం ఏడాది(2020–21)లో ఇవి ఏకంగా రూ. 1.05 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అధికారిక గణాంకాల ప్రకారం అటు ప్రయివేట్, ఇటు పబ్లిక్ బ్యాంకులలో కుంభకోణాల కేసులు 118కు తగ్గాయి. 2020–21లో ఇవి 265గా నమోదయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)లను తీసుకుంటే రూ.100 కోట్లకుపైబడిన మోసాలకు సంబంధించిన కేసుల సంఖ్య 167 నుంచి 80కు క్షీణించింది. ప్రయివేట్ రంగంలోనూ ఇవి 98 నుంచి 38కు దిగివచ్చాయి. విలువరీత్యా చూస్తే గతేడాది పీఎస్బీలలో వంచన కేసుల విలువ రూ. 65,900 కోట్ల నుంచి రూ. 28,000 కోట్లకు తగ్గింది. ఇక ప్రయివేట్ బ్యాంకుల్లోనూ ఈ విలువ రూ. 39,900 కోట్ల నుంచి రూ. 13,000 కోట్లకు వెనకడుగు వేసింది. బ్యాంకింగ్ రంగ మోసాలకు చెక్ పెట్టే బాటలో రిజర్వ్ బ్యాంక్ పలు చర్యలు తీసుకుంటూ వస్తోంది. తొలినాళ్లలోనే హెచ్చరించే వ్యవస్థ(ఈడబ్ల్యూఎస్) మార్గదర్శకాలను మెరుగుపరచడం, ఫ్రాడ్ గవర్నెన్స్, స్పందన వ్యవస్థను పటిష్టపరచడం,లావాదేవీల పర్యవేక్షణ, గణాంకాల విశ్లేషణ, మోసాలను పసిగట్టేందుకు ప్రత్యేకించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏర్పాటు తదితరాలకు ఆర్బీఐ తెరతీసింది. మోసాల తీరిలా ఈ ఏడాది మొదట్లో స్టేట్బ్యాంక్(ఎస్బీఐ) దేశంలోనే అతిపెద్ద మోసానికి నెలవైంది. ఏబీజీ షిప్యార్డ్, కంపెనీ ప్రమోటర్లకు సంబంధించి రూ. 22,842 కోట్ల కుంభకోణం నమోదైంది. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)ను రూ. 14,000 కోట్ల మోసం చేసిన నీరవ్ మోడీ, మేహుల్ చోక్సీ కేసుకంటే పెద్దదికావడం గమనార్హం! ఇక గత నెలలో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్ఎఫ్ఎల్), కంపెనీ మాజీ సీఎండీ కపిల్ వాధ్వాన్, డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్ తదితరులపై రూ. 34,615 కోట్ల ఫ్రాడ్ కేసును సీబీఐ బుక్ చేసిన విషయం విదితమే. -
ఆర్బీఐ కొత్త టెక్నాలజీ, వేల కోట్ల బ్యాంక్ స్కాంలు జరగవట!
దేశంలో ఆర్ధిక నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టేందుకు కేంద్రం తీసుకోని నిర్ణయం లేదు. అయినా సరే ఎక్కడో ఓ చోటా రుణాల పేరిట జరుగుతున్న స్కాంలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఫిర్యాదుతో రూ.42,871 కోట్ల కుంభ కోణం బ్యాంకింగ్ రంగ వ్యవస్థని అతలా కుతులం చేసింది. చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆర్ధిక నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ చేస్తున్న ప్రయత్నాల్ని మరింత ముమ్మరం చేసింది. వ్యాపారాల నిర్వహణ పేరుతో బ్యాంకుల వద్ద వేలకోట్లు రుణాలు తీసుకొని.. వాటిని చెల్లించకుండా ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోతున్న ఆర్ధిక నేరగాళ్లపై ఆర్బీఐ ఉక్కుపాదం మోపనుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ను వేలకోట్ల రూపాయలు (ఆర్టీఐలో తేలింది రూ.15,423.39 కోట్లు) మోసం చేసి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అతని మామ (బంధువు)మెహుల్ చోక్సీల తరహా మోసాలు మరోసారి జరగకుండా ఉండేందుకు ఆర్బీఐ బ్లాక్ చైన్ టెక్నాలజీపై పనిచేస్తుంది. ఇందులో పలు బ్యాంకుల్ని సైతం ఆర్బీఐ జత చేసింది. 12 బ్యాంక్లు హెచ్డీఎఫ్సీ,ఐసీఐసీఐ ,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు 12కు పైగా బ్యాంకులు సమిష్టిగా బ్లాక్ చైన్ టెక్నాలజీ కేంద్రికృతమై జాతీయ, అంతర్జాతీయ ట్రాన్సాక్షన్స్ (ట్రేడ్ ఫైనాన్సింగ్) నిర్వహిస్తున్నాయి. ఆ ట్రాన్సాక్షన్ల నిర్వహణలో సత్ఫలితాలు రాబడితే నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీల్లాంటి ఆర్ధిక నేరగాళ్లకు బ్యాంకుల్ని మోసం చేయాలన్న ఆలోచనే రాదని ఆర్బీఐ భావిస్తున్నట్లు పలు వెలుగులోకి నివేదికలు చెబుతున్నాయి. బెంగళూరు కేంద్రంగా బెంగళూరు కేంద్రంగా ఈ పైలెట్ ప్రాజెక్ట్లో యూరప్ దేశమైన బెల్జియంకు చెందిన బ్లాక్ చైన్ డెవలప్మెంట్ ఫ్లాట్ ఫామ్ సెటిల్ మింట్, అమెరికాకు చెందిన క్రోడా టెక్నాలజీస్, ఐబీఎంలు టెక్నాలజీ సపోర్ట్ను అందిస్తుండగా..యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. ఫ్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే? ఫ్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పేరుతో ఆర్బీఐ నేతృత్వంలో డెవలప్ చేస్తున్న ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ..దాని పరిభాషలో చెప్పాలంటే.. ఉదాహారణకు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు బ్యాంకుల వద్ద రుణం తీసుకొని వాటిని అక్రమ మార్గంలో మళ్లించేందుకు జరిపే ట్రాన్సాక్షన్లపై ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ కన్నేస్తుంది. అనుమానం వచ్చిందా వెంటనే ఈ టెక్నాలజీ అనుసందానమైన సెంట్రల్ డేటాతో సంబంధం లేకుండా బ్లాక్ చేస్తుంది. ఇన్ పుట్ డివైజ్, ఔట్పుట్ డివైజ్, స్టోరేజ్ డివైజ్ ఇలా మూడు పద్దతుల్లో ట్రాన్సాక్షన్లను బ్లాక్ చేసి సంబంధిత బ్యాంకుల సంబంధించిన కంప్యూటర్లకు లేదా, సంబంధిత శాఖలకు అలెర్ట్ ఇస్తుంది. తద్వారా లోన్ ఫ్రాడ్లను గుర్తించవచ్చు. ప్రస్తుతం ఆర్బీఐ ఈ టెక్నాలజీ విధి విధానాల్ని పరిశీలిస్తుండగా.. ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల్ని సరి చేయాలని చూస్తోంది. నిపుణులు ఏం అంటున్నారంటే! రుణాలు పొందే విషయంలో ఈ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఎటువంటి అడ్డకట్ట వేయలేదు. అయితే రుణాలు తీసుకున్న వ్యక్తులు ఆ నిధులను పక్క దారి పట్టిస్తుంటే మాత్రం ఇట్టే పసిగడుతుంది. వాళ్ల కుతంత్రాలకు చెక్ పెడుతుంది. తద్వారా భారీ స్థాయిలో జరిగే మోసాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయడానికి అవకాశం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. కాగా, ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ టెక్నాలజీ సాయంతో లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ) పేరుతో జరిగే మోసాల్ని సైతం అరికట్టవచ్చు. చదవండి👉బ్యాంకులంటే విజయ్ మాల్యా గుండెల్లో దడే! కావాలంటే మీరే చూడండి! -
రూ.34,615 కోట్ల బ్యాంక్ స్కాం,ఎవరీ సుధాకర్ శెట్టి!
న్యూఢిల్లీ: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్) రూ.34,615 కోట్ల బడా బ్యాంకింగ్ మోసం కేసుపై జరుగుతున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణలో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. అత్యున్నత స్థాయి వర్గాల కథనం ప్రకారం, రూ. 14,683 కోట్ల డీహెచ్ఎఫ్ఎల్ నిధుల ’మళ్లింపు’లో తొమ్మిది రియల్టీ సంస్థల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కీలక విచారణ జరుగుతోంది. అప్పటి చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ కపిల్ వాధ్వాన్, డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్, వ్యాపారవేత్త సుధాకర్ శెట్టిల నియంత్రణలో ఉన్న ఈ తొమ్మిది రియల్ ఎస్టేట్ సంస్థలు తమ బాస్ల ఆర్థిక ప్రయోజనాల కోసం అక్రమ మార్గాలను అనుసరించాయని సీబీఐ పేర్కొంది. తొమ్మిదిలో ఐదు సుధాకర్ శెట్టివే... తొమ్మిది రియల్టీ సంస్థల్లో ఐదు వ్యాపారవేత్త సుధాకర్ శెట్టి నియంత్రణలోనివి కావడం గమనార్హం. కంపెనీలు తీసుకున్న రుణాలు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ల ఆదేశాల మేరకు దారిమళ్లినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. 2010–2018 మధ్య కాలంలో రూ. 42,871 కోట్ల మేర రుణాలను మంజూరు చేసిన 17 బ్యాంకుల కన్సార్టియంకు నేతృత్వం వహిస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నుండి వచ్చిన ఫిర్యాదుపై జూన్ 20వ తేదీన కేసు నమోదయ్యింది. కేసు నమోదయిన తర్వాత సీబీఐకి చెందిన దాదాపు 50 మందికిపైగా అధికారుల బృందం బుధవారం ముంబైలోని 12 ప్రాంగణాల్లో విస్తృత సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. డీహెచ్ఎఫ్ఎల్ మొత్తం కుంభకోణం రూ.34,615 కోట్లుగా సీబీఐ అధికారులు తెలిపారు. దీనిప్రకారం, ఇంత స్థాయిలో బ్యాంకింగ్ మోసం కేసుపై సీబీఐ విచారణ జరగడం ఇదే తొలిసారి. వాధ్వాన్ ద్వయం ఇతరులతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడి, వాస్తవాలను తప్పుగా చూపించి దాచిపెట్టారని, నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు పాల్పడ్డారని బ్యాంక్ తన ఫిర్యాదులో పేర్కొంది. మే 2019 నుండి రుణం తిరిగి చెల్లించడంలో డిఫాల్ట్ కావడం ద్వారా కన్సార్టియంను రూ. 34,614 కోట్ల మేర మోసగించడానికి కుట్ర జరిగిందని వివరించింది. -
డీహెచ్ఎఫ్ఎల్ కుంభకోణం.. రూ.34,615 కోట్ల మోసం.. సీబీఐ కేసు నమోదు
యూనియన్ బ్యాంక్ నేతృత్వంల్యోని 17 బ్యాంకుల కన్సార్టియాన్ని రూ. 34,615 కోట్ల రూపాయలకు మోసం చేశారంటూ దివాస్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పోరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్) ప్రమోటర్లు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు నమోదు చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లతో పాటు అమరిల్లీస్ రియల్టర్స్కు చెందిన సుధాకర్ శెట్టి, మరో ఆరుగురు బిల్డర్లపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. 2010 నుంచి 2018 వరకు 17 బ్యాంకులతో కూడిన కన్సార్టియం నుంచి ఏకంగా రూ.42,871 కోట్లు రుణాలు సేకరించింది హెచ్డీఎఫ్ఐ. అయితే 2019 నుంచి రుణాలకు సంబంధించిన చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో కన్సార్టియంకు నేతృత్వం వహిస్తున్న యూనియన్ బ్యాంకు 2021లో సీబీఐకి లేఖ రాసింది. తాము తాజాగా నిర్వహించిన ఆడిట్లో ఈ మోసం వెలుగు చూసినట్టు పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఈ ఏడాది ఫిబ్రవరిలో యూనియన్ బ్యాంకు కోరింది. దీనిపై విచారణ చేపట్టిన అనంతరం సీబీఐ కేసులు నమోదు చేసింది. బ్యాంకుల మోసానికి సంబంధించి డీహెచ్ఎఫ్ఎల్ అతి పెద్దదిగా నిలిచింది. ఈ కుంభకోణంలో రూ. 34,615 కోట్ల వరకు మోసం జరిగింది. ఇంతకు ముందు ఏజీబీ షిప్యార్డ్ కంపెనీ బ్యాంకులను రూ.22,842 కోట్ల వరకు ముంచడమే అతి పెద్ద మోసంగా రికార్డయ్యింది. కాగా యెస్ బ్యాంకును చీట్ చేసిన కేసులో కూడా డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లకు ప్రమేయం ఉంది. చదవండి: దటీజ్ టాటా.. ఆ కంపెనీకంటూ కొన్ని విలువలు ఉన్నాయ్! -
బ్యాంకుల్లో కుంభకోణాలు,ఏ బ్యాంకులో ఎన్నివేల కోట్ల మోసం జరిగిందంటే!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) మోసాల పరిమాణం 51 శాతం తగ్గిందని, రూ.40,295 కోట్లకు దిగి వచ్చిందని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. 2020–21లో 12 పీఎస్బీలు రూ. 81,922 కోట్ల మేర మోసాలను రిపోర్ట్ చేసినట్లు తెలిపింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద మధ్యప్రదేశ్కు చెందిన చంద్రశేఖర్ గౌర్ చేసిన దరఖాస్తు విషయంలో ఆర్బీఐ ఈ మేరకు సమాధానమిచ్చింది. మరోవైపు, పరిమాణం తగ్గినప్పటికీ, సంఖ్యాపరంగా మాత్రం మోసాల ఉదంతాలు ఆ స్థాయిలో తగ్గలేదని పేర్కొంది. 2021 ఆర్థిక సంవత్సరంలో 9,933 ఉదంతాలు చోటు చేసుకోగా 2021–22లో ఈ సంఖ్య కేవలం 7,940కి మాత్రమే తగ్గింది. 2022 ఆర్థిక సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో అత్యధికంగా రూ.9,528 కోట్ల మేర మోసాలకు సంబంధించి 431 ఉదంతాలు నమోదయ్యాయి. ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.6,932 కోట్లు (4,192 కేసులు), బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.3,989 కోట్లు (280 కేసులు), యూనియన్ బ్యాంక్లో రూ.3,939 కోట్ల (627 కేసులు) మేర మోసాలు నమోదయ్యాయి. బ్యాంకులు పంపే నివేదికలను బట్టి డేటాలో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరగవచ్చని ఆర్బీఐ తెలిపింది. చదవండి👉బ్యాంకులంటే విజయ్ మాల్యాకు గుండెల్లో దడే! కావాలంటే మీరే చూడండి! -
వన్టైం సెటిల్మెంట్ పేరుతో రూ. 25 లక్షలు టోకరా
పంజగుట్ట: వన్టైం సెటిల్మెంట్లో బ్యాంకు రుణాన్ని తక్కువ చేయిస్తానని నమ్మించి రూ. 25 లక్షలు తీసుకుని పరారైన వ్యక్తిపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేపీహెచ్బీకి చెందిన వి.రవికుమార్, తన సోదరుడు రాఘవేందర్ డైరెక్టర్లుగా మరికొందరితో కలిసి పంజగుట్టలో రామకృష్ణా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నిర్వహిస్తున్నారు. సంస్థ విస్తరణ నిమిత్తం అప్పటి ఆంధ్రాబ్యాంకు, ప్రస్తుత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2019లో రూ.81 కోట్లు రుణంగా తీసుకున్నారు. ఆ తర్వాత కరోనా, లాక్డౌన్ కారణంగా వ్యాపారం జరక్క కిస్తీలు కట్టలేకపోయారు. దీంతో బ్యాంకు వన్టైం సెటిల్మెంట్ చేసుకోవాలని సూచించడంతో రూ. 7 కోట్లు చెల్లించారు. 2021 సెప్టెంబర్లో నగరానికి చెందిన పి.విక్రమ్ అనే వ్యక్తి రవికుమార్ సోదరులను కలిశాడు. బ్యాంకు లైజనింగ్ ఆఫీసర్గా పరిచయం చేసుకున్న అతను మీరు తీసుకున్న రుణానికి వన్టైం సెటిల్మెంట్ కింద సగం తగ్గిస్తానని చెప్పాడు. వన్టైం సెటిల్మెంట్ రూ.47 కోట్లకు ఒప్పందం కుదిరిందని బ్యాంకు జనరల్ మేనేజర్ పేరుతో నకిలీ లెటర్ సృష్టించి వారికి ఇచ్చాడు. మొదట రూ.25 లక్షలు బ్యాంకుకు ముందస్తుగా చెల్లించాలని తీసుకున్నాడు. ఆ తర్వాత రవికుమార్ బ్యాంకు జీఎం పేరుతో ఉన్న లేఖను తీసుకుని బ్యాంకుకు వెళ్లగా అది నకిలీదిగా తేలింది. విక్రమ్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా అతను తప్పించుకు తిరుగుతుండటంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు బుధవారం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విక్రమ్పై చీటింగ్ కేసు నమోదు చేసి అతనికోసం గాలింపు చేపట్టారు. -
ఆర్థిక నేరగాళ్ల దెబ్బ.. బ్యాంకులకు భారీ కన్నం!
న్యూఢిల్లీ: ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బ్యాంకుల్లో మోసాలు, అక్రమాలు ఆగడం లేదు. కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త మోసాలతో బ్యాంకులకు భారీ కన్నం పెడుతున్నారు. దీంతో దేశీయ బ్యాంకులు రోజుకు ఎంత లేదన్నా సగటున రూ.100 కోట్ల వరకు నష్టపోతున్నాయి. సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఈ విషయాలు వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో మొత్తం 27 షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో ఈ 96 గోల్మాల్ కేసులు బయటపడ్డాయి. ఈ సమయంలో కేటుగాళ్లు మొత్తం రూ.34,097 కోట్లు కొల్లగొట్టారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటా ప్రకారం.. పంజాబ్ నేషనల్ బ్యాంకులో అత్యధికంగా రూ.4,820 కోట్ల విలువైన మోసాలు జరిగితే, ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అత్యధికంగా 13 మోసాలు జరిగాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ సమాధానమిస్తూ బ్యాంకుల వారీగా రూ.100 కోట్లకు పైగా మోసాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ఎంపిక చేసిన ఆర్థిక సంస్థలలో ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఈ మోసాలు జరిగాయి. ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలతో పాటు మోసగాళ్లు, ఎగవేతదారులను నిరోధించడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు మంత్రి తన సమాధానంలో తెలిపారు. 2015 ఏప్రిల్ 1 నుంచి గత ఏడాది డిసెంబరు నెలాఖరు వరకు దేశంలోని బ్యాంకుల్లో రూ.2.5 లక్షల కోట్ల విలువైన గోల్మాల్ కేసులు వెలుగులోకి వచ్చాయి. (చదవండి: మంటల్లో కాలిపోతున్న మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈవీ రంగంపై నీలి నీడలు!) -
మీ పాలనలో రూ.5.35 లక్షల కోట్ల మోసాలు!
న్యూఢిల్లీ: దేశంలో బీజేపీ ప్రభుత్వ పాలనలో రూ.5.35 లక్షల కోట్ల మేర బ్యాంకు మోసాలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. గతంలో ఇలాంటి మోసాలు జరగలేదని తెలిపారు. బీజేపీ పాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిత్రులకే అచ్చెదిన్ వచ్చాయని ధ్వజమెత్తారు. దేశ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని మండిపడ్డారు. వారికోసం ‘దోచుకో, పారిపో’ స్కీమ్ బ్యాంకుల కన్సార్టియంను రూ.22,842 కోట్ల మేర మోసగించిన ఏబీజీ షిప్యార్డ్ లిమిటెడ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఐదేళ్లు ఎందుకు పట్టిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఆదివారం ప్రశ్నించారు. బ్యాంకు మోసగాళ్ల కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘దోచుకో, పారిపో’ అనే పథకాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా, జతిన్ మెహతా, చేతన్, నితిన్ సందేశర తదితరులు ఇండియాలో బ్యాంకులను దోచుకొని, విదేశాలకు పారిపోయారని గుర్తుచేశారు. ఈ జాబితాలో తాజాగా ఏబీజీ షిప్యార్డ్ లిమిటెడ్ మాజీ చైర్మన్, ఎండీ రిషి కమలేష్ అగర్వాల్తోపాటు ఇతరులు కూడా చేరుతున్నారని చెప్పారు. వారంతా ‘కొత్త రత్నాలు’ అన్నారు. రాహుల్ కోసం నా జీవితాన్ని ఇస్తా.. తనకు, తన సోదరుడు రాహుల్ గాంధీకి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయంటూ బీజేపీ చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆదివారం ఖండించారు. ‘‘నా జీవితాన్ని అన్న కోసం ఇస్తా.. ఆయన జీవితాన్ని నా కోసం ఇస్తారు’’ అని వ్యాఖ్యానించారు. తమ మధ్య విభేదాలు ఎక్కడున్నాయో చెప్పాలని అన్నారు. విభేదాలు అనేవి యోగి ఆదిత్యనాథ్ మనసులో ఉన్నాయని చెప్పారు. -
లేని ఆస్తులు చూపించి బ్యాంక్ లోన్ కొట్టేశారు
సాక్షి, హైదరాబాద్: వేస్ట్ పేపర్ రీ సైక్లింగ్ పేరుతో ఓ కంపెనీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆంధ్రాబ్యాంక్)కు రూ.19.16 కోట్లు స్వాహా చేసింది. పేపర్ కట్టింగ్ యంత్రాలు, ఫ్యాక్టరీ గోడౌన్, స్టాక్, లే అవుట్ ప్లాట్లు.. ఇలాంటివి లేనివి ఉన్నట్లు డాక్యుమెంట్లలో చూపించి ఆంధ్రాబ్యాంక్ అమీర్పేట్ బ్రాంచ్కు ఈ మొత్తం ఎగనామం పెట్టింది. బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డి.అపర్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అమెజాన్ ఎంటర్ప్రైజెస్ కంపెనీపై సీబీఐ గురువారం కేసు నమోదు చేసింది. ఆ వివరాల మేరకు.. అమీర్పేటకు చెందిన మన్నెపల్లి కమల్నాథ్ ఎండీగా, కొండపల్లి రాధాకృష్ణ డైరెక్టర్గా అమెజాన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో కంపెనీ ఏర్పాటుచేశారు. వేస్ట్ పేపర్ రీ సైక్లింగ్ వ్యాపారానికి లోన్ కోసమంటూ అమీర్పేట్లోని అప్పటి ఆంధ్రాబ్యాంక్(ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) చీఫ్ మేనేజర్ కట్రోత్ గోవింద్ను కలిశారు. తమకు పెద్ద పేపర్ కట్టింగ్ మిషన్, వేస్టేజ్ రీ సైక్లింగ్ ఉందని చెప్పి రుణం కోసం దరఖాస్తు చేశారు. అమెజాన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన యంత్రాల వివరాలు, గోడౌన్ వివరాలు, కొలట్రాల్ కింద ఇచ్చిన ఏడు ఖాళీ స్థలాల డాక్యుమెంట్లు చూసి రూ.19.16 కోట్ల రుణాన్ని గోవింద్ మంజూరుచేశారు. అయితే ఈ రుణ మంజూరులో సంస్థ చెప్పినట్లు యంత్రాలు, గోడౌన్, ఫ్లాట్లు, ఇతర ఆస్తులు గుర్తించి వాటిని లెక్కగట్టాల్సిన వ్యాలువర్ కటకం నర్సింహం, లీగల్ ఓపినియన్ ఇవ్వాల్సిన బ్యాంక్ అడ్వొకేట్ శ్రీనివాస్ప్రసాద్ తప్పుడు నివేదిక ఇచ్చారు. గోవింద్ చెప్పినట్లు నర్సింహం, శ్రీనివాసప్రసాద్ ఎలాంటి క్షేత్రస్థాయి పరీశీలన చేయకుండానే సంస్థకు అనుకూలంగా నివేదికలిచ్చారు. దీంతో అమీర్పేట్ బ్రాంచ్ నుంచి రూ.19.16 కోట్ల మేర అమెజాన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ రుణం పొందింది. రుణం పొంది ఏడాది గడిచినా చిల్లి గవ్వ కూడా తిరిగి కట్టకపోవడంతో విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. సంబంధిత కంపెనీ ప్రతినిధులతో మేనేజర్ కుమ్మక్కై బ్యాంకును మోసం చేశారన్న గుట్టురట్టయింది. దీనితో గోవింద్ను ఉద్యోగం నుంచి తొలగించారు. లేని ఆస్తులు ఉన్నట్లు చూపించి రుణం పొందినందుకు సంబంధిత సంస్థ, దాని ప్రతినిధులపై సీబీఐకి అపర్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ప్రాథమిక విచారణ జరిపిన హైదరాబాద్ సీబీఐ అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
మోసాల్లో బ్యాం‘కింగ్స్’!
సాక్షి, హైదరాబాద్: బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న సొమ్మును రుణాల రూపంలో ఆర్థిక నేరగాళ్లకు దోచిపెట్టడంలో కొందరు బ్యాంకు అధికారుల వ్యవహారం సంచలనం రేపుతోంది. బ్యాంకుల్లో మేనేజర్లుగా, ఆపై స్థాయిలో పనిచేసే కొందరు అధికారుల అవినీతి ఎంతటి స్థాయిలో ఉందంటే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), రాష్ట్ర నేర పరిశోధన శాఖ (సీఐడీ) నమోదు చేసిన బ్యాంకు మోసాల కేసుల్లో 75 శాతం వారి ప్రమేయం ఉన్నవే ఉండటం గమనార్హం. లేనివి ఉన్నట్టు.. ఉన్నవి లేనట్టు.. చేప పిల్లల పెంపకం, అమ్మకాల వ్యాపారం పేరుతో ఓ సంస్థ రూ. 6 కోట్లకుపైగా కొల్లగొట్టిన అభియోగాలపై కంపెనీ యజమాని, డైరెక్టర్లు సహా యూనియన్ బ్యాంక్ మేనేజర్పై సీబీఐ ఇటీవల కేసు నమోదు చేసింది. కంపెనీ సమర్పించిన నకిలీ పత్రాలపై రూ. 6 కోట్లు లోన్ మంజూరు చేసి కమిషన్ తీసుకున్నట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో స్పష్టం చేసింది. చేప పిల్లలు కాదు కదా.. కనీసం అక్కడ చేపల పెంపకానికి సంబంధించి చెరువు కూడా లేకపోవడం సంచలనం రేపింది. ఏకంగా రూ. 200 కోట్లు... హైదరాబాద్కు చెందిన లక్ష్మీ ఫైనాన్స్ లిమిటెడ్, వరుణ్ ఫైనాన్స్ బాధ్యులు ఫోర్జరీ పత్రాలతో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 200 కోట్ల రుణం పొందారు. ఈ వ్యవహారంలోనూ బ్యాంక్ అధికారుల పాత్రపై సీఐడీ విచారణ సాగిస్తోంది. కంపెనీ సమర్పించిన పత్రాలు అసలైనవా కాదా అని ధ్రువీకరించుకోకుండా లోన్లు జారీ చేసిన బ్యాంకు అధికారుల పాత్రపైనా సీఐడీ దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్బీఐ పరిశ్రమ భవన్లోనూ.. హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఉన్న ఎస్బీఐ పరిశ్రమ భవన్ బ్రాంచీ మేనేజర్ నవీన్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థకు రూ. 4 కోట్ల మేర రుణం మంజూరు చేశారు. సంస్థ సమర్పించిన బ్యాలెన్స్షీట్, కోలాటరల్ ఆస్తుల వివరాలను సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ధ్రువీకరించుకోకుండానే మేనేజర్ ఈ రుణం ఇచ్చారు. ఎస్బీఐ అంతర్గత ఆడిటింగ్లో కుట్ర బయటపడటంతో బ్యాంకు అధికా రులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. కాగా, తాజాగా తెలుగు అకాడమీకి చెందిన రూ. 64 కోట్లకుపైగా ఫిక్స్డ్ డిపాజిట్లను కొట్టేసిన నిందితులకు పలువురు బ్యాంక్ మేనేజర్లే సహకరించినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ విభాగాల్లో 75 శాతం కేసులు అవే... ఇప్పటివరకు సీఐడీ దగ్గర నమోదై దర్యాప్తు దశలో ఉన్న 107 కేసుల్లో 68 కేసులు బ్యాంకు మోసాలకు సంబంధించినవే కావడం గమనార్హం. ఈ ఏడాది సీబీ ఐ నమోదు చేసిన 17 ఎఫ్ఐఆర్లలో 9 కేసులు బ్యాంక్ చీటింగ్ కేసులే. దీనికితోడు రాష్ట్రవ్యాప్తంగా సీసీఎస్ పో లీసులు ఈ తరహా మోసాలపై నమోదు చేసిన కేసులు వందల్లోనే ఉన్నాయి. ఇలా ఏ ఒక్క ఏడాదిలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో రూ. 1,200 కోట్ల నుంచి రూ. 1,500 కోట్ల మేర సొమ్మును బ్యాంక్ అధికారుల అవినీతి వల్ల దోచేసినట్టు సీఐడీ అంచనా వ్యక్తం చేసింది. కనిపించని సైబర్ నేరాల్లో రూ. కోట్లు పోగొట్టుకోవడం ఒక ఎత్తయితే... కళ్ల ముందు జరుగుతున్న ఆర్థిక నేరాల నియంత్రణలో కొందరు బ్యాంకు అధికారులే సూత్రధారులు కావడం ఆందోళన రేకేత్తిస్తోంది. -
Bank Fraud: మూడుకోట్ల కుంభకోణంపై విచారణ
చిత్తూరు: చిత్తూరు జిల్లా కనిగిరి బరోడా బ్యాంకులో మూడు కోట్ల కుంభకోణంపై పోలీసులు విచారణ కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే మేనేజర్ వెంకట మద్దిలేటి తోపాటు మరో ఐదుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.బ్యాంకు సిబ్బందిపై బాధిత మహిళలు దాడి చేస్తారన్న అనుమానంతో బ్యాంకు వద్ద.. భద్రతను పెంచారు. కాగా, బ్యాంకు సిబ్బంది మా కొంప ముంచారంటూ బాధిత మహిళలు తీవ్రంగా రోదిస్తున్నారు. చదవండి: Madanapalle: మదనపల్లె: తెల్లారితే పెళ్లి.. వరుడికి షాక్ -
పృథ్వీ ఐటీ సొల్యూషన్స్ ఎండీ ఉప్పలపాటి సతీష్ అరెస్ట్
హైదరాబాద్: పృథ్వీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ఎండీ ఉప్పలపాటి సతీష్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ (ఈడీ) పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బ్యాంకుల దగ్గర నుంచి రూ.3,316 కోట్ల మేర రుణాలు తీసుకుని మోసం చేసినట్లు ఆయనపై అభియోగాలు వచ్చాయి. ఈ క్రమంలో... కేసు నమోదు చేసుకున్న ఈడీ అధికారులు కోర్టు ఆదేశాలమేరకు ఉప్పలపాటి సతీష్ను కస్టడీలోకి తీసుకున్నారు. -
ఆ పని చేయండంటున్న స్వర్ణ పతక వీరుడు నీరజ్ చౌప్రా
సుదీర్ఘ కాలం తరువాత ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి జావలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని తెచ్చిపెట్టిన నీరజ్ చోప్రా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. కంగారు పడకండి . నీరజ్ చోప్రో ఏంటీ? ప్రజలకు వార్నింగ్ ఇవ్వడం ఏంటని అనుకుంటున్నారా? ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోయాయి. ట్రాన్సాక్షన్ల పేరుతో సైబర్ నేరగాళ్లు బాధితులకు పెద్ద ఎత్తున కుచ్చిటోపీ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కొత్త క్యాంపెయిన్కు శ్రీకారం చుట్టింది. ఒలింపిక్ వీరుడు నీరజ్ చోప్రోతో కలిసి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పై అవగాహన పెంచేందుక ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. .@RBI Kehta Hai... Along with @Neeraj_chopra1 A little caution takes care of a lot of trouble. Never respond to requests to share PIN, OTP or bank account details. Block your card if stolen, lost or compromised.#rbikehtahai #StaySafe #BeAware #BeSecure #Tokyo2020 pic.twitter.com/v9aeOG7ZMP — RBI Says (@RBIsays) August 10, 2021 డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలంటూ నీరజ్ చోప్రో వీడియోలో మాట్లాడారు. అంతేకాదు పిన్, ఓటీపీ, బ్యాంక్ అకౌంట్లను జాగ్రత్త ఉంచుకోవాలని కోరారు. ఆన్లైన్ బ్యాంకింగ్ పాస్వర్డ్లను ఎప్పటికప్పుడు మార్చుకోవాలని ఏటీఎం,క్రెడిట్ కార్డ్ల్లను పోగొట్టుకుంటే వెంటనే బ్లాక్ చేయాలని కోరుతూ ముగించాడు. కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లతో పాటు మిగిలిన బ్యాంక్లు ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల గురించి ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. -
Hyderabad: టీఆర్ఎస్ ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు
-
టీఆర్ఎస్ ఎంపీ నామా ఇంటిపై ఈడీ దాడులు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు నివాసం, కంపెనీల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రోడ్ నం.19లో ఉన్న నామా నాగేశ్వర్రావు ఇల్లు, రోడ్ నం.36లో ఉన్న మధుకాన్ కంపెనీ, రాంచీ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ డైరెక్టర్ల ఇళ్లు కలిపి ఆరు చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా కొన్ని కీలకమైన పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. జార్ఖండ్లో మధుకాన్ కంపెనీ చేపట్టిన నేషనల్ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై ఈడీ ఈ తనిఖీలు చేపట్టింది. ఈ అంశంపై 2019లోనే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి, 2020లో చార్జిషీటు దాఖలు చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను విదేశాలకు మళ్లించారని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. తాజాగా తనిఖీలు నిర్వహించింది. ఏమిటీ కేసు? 2011లో జార్ఖండ్లో రాంచీ– రార్గావ్– జంషెడ్పూర్ మధ్య 163 కిలోమీటర్ల పొడవైన నేషనల్ హైవే–33 పనులను మధుకాన్ కంపెనీ దక్కించుకుంది. రూ.1,151 కోట్ల వ్యయంతో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ పద్ధతిలో చేజిక్కించుకుంది. ఇందుకోసం స్పెషల్ పర్పస్ వెహికల్ కింద రాంచీ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ను ఏర్పాటు చేశారు. మధుకాన్ సంస్థ ప్రభుత్వం నుంచి దక్కించుకున్న టెండర్ను చూపించి.. కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,029.39 కోట్లు పొందింది. తర్వాత మధుకాన్ సంస్థ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో.. నిజాలేమిటో తేల్చాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) న్యూఢిల్లీని జార్ఖండ్ హైకోర్టు ఆదేశించింది. ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు చేసి.. మధుకాన్ తీసుకున్న రుణంలోంచి రూ.264.01 కోట్లు పక్కదారి పట్టినట్టు నివేదిక ఇచ్చింది. ఈ అంశంలో సీబీఐ కూడా దర్యాప్తు చేపట్టింది. ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేదని, నిధులు పక్కదారి పట్టాయని పేర్కొంది. ఆ సమయంలో రాంచీ ఎక్స్ప్రెస్వే డైరెక్టర్లుగా ఉన్న కె.శ్రీనివాసరావు, ఎన్.సీతయ్య, ఎన్.పృథ్వితేజ పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది. మధుకాన్ గ్రూపుతోపాటు పలు ఇతర కంపెనీలపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో భారీగా నిధులు అక్రమంగా విదేశాలకు తరలించారన్న ఆరోపణలతో మనీల్యాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. చదవండి: నేడు ఈటల రాజీనామా.. బీజేపీలోకి రాథోడ్ -
టార్గెట్ రూ.216 కోట్లు!
ఐదు ట్రస్ట్లకు సంబంధించిన రూ.200 కోట్లకు పైగా సొమ్ము బ్యాంకుల్లో కొన్నేళ్లుగా కదలకుండా ఉండటాన్ని ఓ ముఠా గమనించింది. వాటిని స్వాహా చేయడానికి స్కెచ్చేసింది. ఇది కనిపెట్టిన పుణే సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన ముగ్గురితో పాటు మొత్తం 14 మందిని అరెస్టు చేశారు. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్తో పాటు గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లకు చెందిన వారితో కూడిన ఓ గ్యాంగ్ ఐదు ట్రస్ట్లకు సంబంధించిన సొమ్ముపై కన్నేసింది. ఆయా ట్రస్టుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.216 కోట్లకు పైగా మొత్తాన్ని కొట్టేయడానికి భారీ స్కెచ్ వేసింది. స్టాక్ బ్రోకర్ల ఖాతాల్లోకి మళ్లిస్తే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో వారి ద్వారా స్వాహా చేయడానికి రంగంలోకి దిగింది. దీనిపై సమాచారం అందుకున్న మహారాష్ట్రలోని పుణే సైబర్ క్రైమ్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. తామే స్టాక్ బ్రోకర్లుగా నటించి 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో హైదరాబాద్కు చెందిన ముగ్గురు ఉన్నారని పుణే సైబర్ క్రైమ్ విభాగం అధికారి శివాజీ పవార్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది పాత్రను అనుమానిస్తున్నామని, ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఆయన కథనం ప్రకారం.. పుణేకు చెందిన అనఘా మోడక్ ఈ వ్యవహారానికి సూత్రధారిగా ఉన్నాడు. ఎంబీఏ ఉత్తీర్ణుడైన ఇతను గతంలో కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చేశాడు. అయితే గత ఏడాది కోవిడ్ ప్రభావంతో ఉద్యోగం కోల్పోయిన ఇతగాడు పెడతోవ పట్టి తేలిగ్గా డబ్బు సంపాదించడానికి అనువైన మార్గాలు అన్వేషించాడు. ఈ క్రమంలో ముంబైకి చెందిన కొందరు వ్యక్తుల నుంచి ఉత్తరాదికి చెందిన ఐదు ట్రస్ట్ల సమాచారం అతనికి అందింది. ఆ ట్రస్టులకు రెండు ప్రైవేట్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయని, అయితే ఏళ్లుగా లావాదేవీలు జరగట్లేదని, వాటిలో పెద్దమొత్తంలో ఉన్న డబ్బులు ఎవ్వరూ డ్రా చేసుకోవట్లేదని తెలిసింది. ఈ సమాచారం లీక్ చేసింది ఆయా బ్యాంకులకు చెందిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐదింటిలో కలిపి రూ.216,29,54,240 సొమ్ము ఉందని, ఇతర వివరాలు పక్కాగా చెప్పడంతో పాటు ఆయా బ్యాంక్ ఖాతాల పిన్ నంబర్లు సైతం అందజేయడంతో వారి హస్తంపై అనుమానం కలుగుతోంది. బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు ట్రస్ట్ల సమాచారంతో కూడిన దాదాపు 20 స్క్రీన్ షాట్లను మోడక్ వాట్సాప్ ద్వారా అందుకున్నాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ ట్రస్ట్ల అధికారిక ఖాతాల్లో ఉన్న మొత్తాలను నేరుగా డ్రా చేసుకోవడం సాధ్యం కాదు కనుక ఓ పథకం వేశాడు. ఉత్తరాదిలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో ఒప్పందాలు చేసుకున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సాయంతో ఆయా బ్యాంక్ ఖాతాల్లో ఉన్న మొత్తాలను స్టాక్ బ్రోకర్లకు చెందిన కరెంట్ ఖాతాల్లోకి మళ్లించాలనేదే ఆ పథకం. ఈ వ్యవహారంలో సహకరించడానికి, స్టాక్ బ్రోకర్లను సమన్వయ పరచడానికి పరిచయస్తుల ద్వారా హైదరాబాద్లోని సికింద్రాబాద్కు చెందిన మామిడి రాజశేఖర్, వారాసిగూడలోని బౌద్ధనగర్కు చెందిన జి.లక్ష్మీనారాయణ, నాగోల్ బండ్లగూడ వాసి యువీ సుబ్రహ్మణ్యంలను భాగస్వాములుగా చేసుకున్నాడు. ఆ బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేయడం ద్వారా వాటిలోని నగదును మళ్లించడానికి పథకం వేసిన మోడక్ దానికోసం హ్యాకర్లను సిద్ధం చేసుకున్నాడు. వారికి రూ.2.5 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.25 లక్షలు సమీకరించి అడ్వాన్సుగా ఇచ్చాడు. ఇక స్టాక్ బ్రోకర్లను వెతికి పట్టుకోవడం, వారితో బేరసారాలు సాగించడం కోసం మోడక్ కొందరు అనుచరుల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తొలుత వివిధ ప్రాంతాల స్టాక్ బ్రోకర్ల ఖాతాలను వాడుకోవాలని భావించారు. అయితే ఆఖరి నిమిషంలో ప్లాన్ మార్చి పుణే ప్రాంతానికే చెందిన వారి కోసం ఆరా తీయడం మొదలెట్టారు. దీంతో ఈ విషయం గత వారం పుణే సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిసింది. దీంతో వారే స్టాక్ బ్రోకర్ల అవతారం ఎత్తారు. అనఘా మోడక్ను సంప్రదించిన పోలీసు బృందం తాము తమ ఖాతాలను అందించడానికి సిద్ధంగా ఉన్న ట్లు చెప్పింది. అతడు అంగీకరించి తన వద్ద ఉన్న డేటా బయటపెట్టడంతో పాటు తమ వలలో చిక్కడంతో అదుపులోకి తీసుకుంది. అతను వెల్లడించిన సమాచారం ఆధారంగా గుజరాత్, మహారాష్ట్రతో పాటు హైదరాబాద్, ఉత్తరప్రదేశ్ల్లోనూ దాడులు నిర్వహించి ముఠా సభ్యుల్ని అరెస్టు చేసింది. పరారైన బ్యాంకు సిబ్బంది కోసం గాలిస్తోంది. -
1400కోట్ల మోసం: వెలుగులోకి కీలక విషయాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పాల ఉత్పత్తుల తయారీ సంస్థ క్వాలిటీ లిమిటెడ్ సంస్థ 1,400 కోట్ల రూపాయల బ్యాంక్ ఫ్రాడ్కు పాల్పడినట్లు తాజాగా అవినీతి నిరోధక శాఖ(సీబీఐ) చేపట్టిన తనిఖీల్లో వెల్లడైంది. ఢిల్లీతో సహా ఎనిమిది చోట్ల సోమవారం తనిఖీలు చేసిన అనంతరం క్వాలిటీ లిమిటెడ్ బ్యాంక్ రుణాల చెల్లించకుండా మోసానికి పాల్పడినట్లు అభియోగాలు రుజువు కావడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో క్వాలిటీ డైరెక్టర్లు సంజయ్ ధింగ్రా, సిద్ధాంత్ గుప్తా, అరుణ్ శ్రీవాస్తవ ఉన్నారు. 2012లో ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 10 బ్యాంకుల కన్సార్టియం వారిపై చీటింగ్, ఫోర్జరీ, క్రిమినల్ కేసు, అవినీతి ఆరోపణలు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది.(అరుణ్ శౌరీపై క్రిమినల్ కేసు పెట్టండి) క్వాలిటీ లిమిటెడ్ 2010లో బ్యాంకు నుంచి క్రెడిట్ తీసుకుందని, అయితే 2018 ప్రారంభంలో చెల్లింపులను డిఫాల్ట్ చేయడం ప్రారంభించిందని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. దీంతో బ్యాంక్ ఫిర్యాదు మేరకు సీబీఐ తన దర్యాప్తును ప్రారంభించింది. కంపెనీ చేసిన మొత్తం, 13,147.25 కోట్ల రూపాయల అమ్మకాల్లో 7,107.23 కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకుల కన్సార్టియం ద్వారా మళ్ళీంచబడిందని బ్యాంక్ ఫోరెన్సిక్ ఆడిట్ సీబీఐకి చూపించింది. క్వాలిటి తన వ్యాపార కార్యకలాపాలను ఉధృతం చేయడం ద్వారా తన ఆర్థిక నివేదికలను మించిపోయిందని, రివర్స్ ఎంట్రీలు చేసి ఖాతాలను తారుమారు చేసినట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఫిర్యాదులో పేర్కొంది. (చదవండి: రిటైర్డ్ నేవీ అధికారి దారుణ హత్య) దీనిపై సీబీఐ ప్రతినిధి ఆర్కె గౌర్ మాట్లాడుతూ.. బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఐడీబీఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధనలక్ష్మి బ్యాంక్, సిండికేట్ బ్యాంక్లతో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని కన్సార్టియంలలో క్వాలిటి సంస్థ మొత్తం 1400.62 కోట్ల రూపాయల బ్యాంక్ రుణాలు చెల్లించకుండా మోసాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఇదంతా బ్యాంక్ ఫండ్ల మళ్లీంపు, సంబంధిత పార్టీలతో లావాదేవీలు, కల్పిత పత్రాలు, రశీదులతో పాటు తప్పుడు ఖాతాలు, ఆస్తులను సృష్టించి బ్యాంకులను మోసం చేసినట్లు తెలిపారు. ఒకప్పుడు భారతదేశపు పురాతన, అత్యంత ప్రజాదరణ పొందిన ఐస్క్రీమ్ తయారీదారులలో ఉన్న క్వాలిటీ లిమిటెడ్ డిసెంబర్ 2018 నుంచి దివాలా పరిస్థితులను ఎదుర్కొంటుందని కూడా ఆయన వెల్లడించారు. -
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీపై సీబీఐ అభియోగం
న్యూఢిల్లీ : ప్రముఖ రియల్ ఎస్టేట్ గ్రూప్ 'గౌర్సన్స్' కుటుంబసభ్యులపై నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. 80 కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు సీబీఐ అభియోగం మోపింది. బ్యాంక్ ఆఫ్ బరోడా , సిండికేట్ బ్యాంకుల నుంచి గౌర్సన్స్ చైర్మన్ బిఎల్ గౌర్ , అతని భార్య నవనీత్ ,కుమారుడు రాహుల్ గౌర్ బ్యాంకుల నుంచి 80 కోట్ల రూపాయలకు మోసం చేశారని అధికారులు వెల్లడించారు. (ఇద్దరు హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారులు అరెస్ట్) నోయిడాలో లగ్జరీ అపార్ట్మెంట్తో కూడిన హై ఎండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ను నిర్మించేందుకు సదరు కంపెనీ 250 కోట్ల రూపాయలు (బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 150 కోట్లు, సిండికేట్ బ్యాంక్ నుంచి రూ .100 కోట్లు) తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే దశల వారిగా చిల్లించాల్సిన డబ్బును చెల్లించడం లేదని, అంతేకాకుండా ప్రాజెక్టు కూడా ప్రారంభ దశలోనే ఆగిపోయిందని బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఫిర్యాదులో పేర్కొంది. తప్పుడు లెక్కలు చూపించి , ప్రాజెక్టు నిర్మిస్తిన్నట్లు అవాస్తవాలను చూపించి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపించింది. (బీఎస్4 వాహనాల రిజిస్ట్రేషన్కు బ్రేక్) -
బ్యాంకింగ్ మోసాలు రూ. 1.17 లక్షల కోట్లు!
ఇండోర్: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్కు సంబంధించి 2019 ఏప్రిల్– డిసెంబర్ మధ్య జరిగిన మోసాల విలువ రూ.1.17 లక్షల కోట్లు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వెల్లడైన అంశమిది. బ్యాంకుల వారీగా చూస్తే... ► 9 నెలల్లో 4,769 కేసుల వల్ల రూ.30,300 కోట్ల నష్టాలు ఎస్బీఐకి ఎదురయ్యాయి. ► పీఎన్బీ విషయంలో కేసుల సంఖ్య 294 అయితే, నష్టం విలువ రూ.14,929 కోట్లు. ► 250 కేసుల్లో రూ.11,166 కోట్ల మోసపూరిత నష్టాలను బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదుర్కొంది. ► ఇక అలహాబాద్ బ్యాంక్ కేసుల సంఖ్య 860 అయితే, విలువ రూ.6,782 కోట్లు. ► బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.6,626 కోట్లకు సంబంధించి 161 కేసులను ఎదుర్కొంది. ► యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 292 కేసులను ఎదుర్కొంది. విలువ రూ.5,605 కోట్లు. ► ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 151 కేసులు (రూ.5,557 కోట్లు) ఎదుర్కొంటే, ఓబీసీ విషయంలో కేసుల సంఖ్య 282 అయితే, వీటి విలువ రూ.4,899 కోట్లు. -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్ : సొమ్ము మాయం
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులకు షాకింగ్ న్యూస్. ఎస్బీఐ ఖాతాల్లో డబ్బులు అనూహ్యంగా మాయమైపోతున్నాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. నకిలీ (క్లోన్) చెక్కుల ద్వారా కోట్లాది రూపాయలు మోసగాళ్ల చేతుల్లోకి పోతున్నాయి. దేశంలోని అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్ బ్యాంకింగ్ మోసానికి గురైంది. దీంతో ఎస్బీఐ వివిధ నగరాల్లోని తన అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. పెద్దమొత్తంలో ఉన్న నాన్ హోం (ఎస్బీఐయేతర) చెక్కుల క్లియరింగ్పై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎస్బీఐ ఫ్రాడ్ మానిటరింగ్ సెల్ వాట్సాప్ సమాచారాన్ని తన ఉద్యోగులకు అందిస్తోంది. వివరాల్లోకి వెళితే, ఎయిమ్స్ కు చెందిన ఎస్బీఐ రెండు ఖాతాల్లోని 12 కోట్ల రూపాయలకు పైగా సొమ్ము గల్లంతైనట్టు గుర్తించారు. ఎయిమ్స్ డైరెక్టర్ నిర్వహిస్తున్న ప్రధాన ఖాతా నుంచి రూ .7 కోట్లు, రీసెర్చ్ ఆఫ్ ఎయిమ్స్ డీన్స్కు చెందిన మరో ఖాతా నుంచి మరో రూ. 5 కోట్ల నగదు అక్రమంగా తరలిపోయాయి. గత రెండు నెలల్లోనే ఈ మోసం జరిగినట్టు సంస్థ ఆలస్యంగా గుర్తించింది. అధీకృత సంతకాలులేని నకిలీ చెక్కులకు చెల్లింపులు చేయడంలోని వైఫల్యానికి ఆయా శాఖలే కారణమని ఎయిమ్స్ వాదించింది. ప్రోటోకాల్ను అనుసరించడంలో ఎస్బీఐ విఫలమైందని, తాము పోగొట్టుకున్ననగదును జమ చేయాలని బ్యాంకును కోరింది. ఈ కుంభకోణంపై దర్యాప్తు కోరుతూ ఏయిమ్స్ వర్గాలు ఇప్పటికే ఢిల్లీలోని ఆర్థిక నేరాల విభాగాన్ని సంప్రదించాయి. దీనికి సంబంధించి ఒక నివేదికను కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ఈ మోసం వెలుగులోకి వచ్చిన తరువాత కూడా, గత వారం డెహ్రాడూన్ (రూ .20 కోట్లకు పైగా), ముంబైలో ఎస్బీఐ నాన్-హోమ్ శాఖల నుంచి (రూ.9 కోట్లు) క్లోన్ చెక్కుల ద్వారా రూ .29 కోట్లకు పైగా నగదును అక్రమంగా విత్డ్రా చేసుకునే ప్రయత్నాలు జరిగాయని పీటీఐ పేర్కొంది. బ్యాంకు సూచనల మేరకు ఏదైనా నాన్-హోమ్ బ్రాంచ్లో నుంచి రూ. 2 లక్షలకుపైగా విలువైన చెక్ వస్తే దాన్ని క్లియర్ చేయడానికి లేదా డబ్బు బదిలీ చేయడానికి ముందు ధృవీకరణ కోసం కస్టమర్ను సంప్రదించాలని ఎస్బీఐ అధికారి ఒకరు తెలిపారు. అయితే రూ. 25 వేలకు పైన లావాదేవీలను కూడా తాము పరిశీలిస్తున్నామన్నారు. అలాగే రూ. 3 కోట్లకు పైగా బ్యాంకు మోసం జరిగినట్లు తెలిస్తే, బ్యాంక్ సీబీఐకి ఫిర్యాదు చేస్తుంది. -
బ్యాంకింగ్ మోసాలు రూ.95,760 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) రూ.95,760 కోట్లకుపైగా మోసాలు చోటుచేసుకున్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభలో ఈ విషయాన్ని తెలియజేశారు. ‘‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అందించిన సమాచారం ప్రకారం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలకు సంబంధించి 5,743 కేసులు నమోదయ్యాయి. నిధులపరంగా చూస్తే, ఈ మోసాల విలువ 95,760.49 కోట్లు’’ అని ఆర్థికమంత్రి తెలిపారు. బ్యాంకుల్లో మోసాల నివారణకు సమగ్ర చర్యలను చేపట్టినట్లు, నిర్వహణలో లేని కంపెనీలకు సంబంధించి 3.38 లక్షల బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేసినట్లు వెల్లడించారు. పీఎంసీ డిపాజిట్లలో 78% మందికి ఊరట పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ) డిపాజిటర్ల విషయంలో ఒక్కో ఖాతా నుంచి గరిష్ట నగదు ఉపసంహరణ పరిమితిని రూ. 50,000 వరకు పెంచినట్లు ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీనితో డిపాజిటర్లలో 78% మందికి తమ అకౌంట్ల పూర్తి బ్యాలెన్స్ను విత్డ్రా చేసుకునే అవకాశం ఏర్పడినట్లు ఆయన తెలిపారు. ఆటో రంగం పుంజుకుంటుంది... వాహన రంగంలో మందగమనం సైక్లికల్ (ఎగుడు–దిగుడు) అని భారీ పరిశ్రమలు, ప్రభు త్వ రంగ సంస్థల వ్యవహారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ లోక్సభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ రంగానికి మద్దతిచ్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటోందని తెలిపారు. ఈ రంగానికి రుణ లభ్యతకుగాను ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70,000 కోట్ల నిధులు విడుదల చేసిన విషయాన్ని ప్రస్తావించారు. -
కలకలం; 190 చోట్ల సీబీఐ సోదాలు
న్యూఢిల్లీ: బ్యాంకుల వద్ద రూ.7 వేల కోట్లు తీసుకొని మోసం చేసిన పలువురు వ్యక్తులపై సీబీఐ దేశవ్యాప్తంగా 190 చోట్ల సోదాలు చేపట్టింది. కేంద్ర పాలిత ప్రాంతాలు సహా 16 రాష్ట్రాల్లో జరిగిన దాడుల్లో సుమారు 1000 మంది అధికారులు పాల్గొన్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్కతా, హైదరాబాద్ వంటి పలు నగరాల్లో ప్రారంభమైన సోదాలు సాయంత్రం వరకూ కొనసాగాయి. మహారాష్ట్రలో అత్యధికంగా సోదాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో అయిదు చోట్ల, తెలంగాణలో నాలుగు చోట్ల అధికారులు సోదాచేశారు. ఆయా కంపెనీల డైరెక్టర్లు, ప్రమోటర్లపై 42 కేసులు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. క్రెడిట్ ఫెసిలిటీలను వీరు వివిధ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎస్బీఐకు రూ.1266 కోట్ల నష్టానికి కారణమైందన్న ఆరోపణలతో భోపాల్లోని అడ్వాంటేజ్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. న్యూఢిల్లీలోని ఎనర్జో ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్పై ఇదే ఆరోపణలతో కేసు పెట్టారు. ఎస్బీఐకు ఈ కంపెనీ రూ.1100 కోట్లుపైగా నష్టం కలిగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. చెన్నైలోని సురానా ఇండస్ట్రీస్, వారణాసిలోని జేవీఎల్ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీల్లోనూ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. -
లక్షా ఇరవైవేల డాలర్లు...వుఫ్ అని ఊదేసారు..
పెన్సిల్వేనియా : మన బ్యాంకు అకౌంట్లో ఓ కోటి రూపాయలు జమ అయినట్లు మొబైల్కు మెసేజ్ వస్తే ఏం చేస్తాం. కలా ...నిజామా అనుకుంటూ.. ఒకటికి పదిసార్లు అనుకుంటాం. ఒకవేళ అకౌంట్లో ఉన్న ఆ డబ్బులను ఖర్చు చేస్తే తర్వాత ఏం సమస్య వస్తుందో అని ఆలోచిస్తూ తేల్చుకోలేకపోతాం. లేదా బ్యాంకుకు పరిగెత్తి అసలు విషయం తెలుసుకుంటాం. అయితే అమెరికాలోని ఓ జంట మాత్రం తమ అకౌంట్లో పడిన డబ్బు మొత్తాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టేసింది. తీరా బ్యాంకు అధికారులు జరిగిన పొరపాటనును గుర్తించి ఆ డబ్బులు తిరిగి ఇవ్వమంటే మాత్రం... అంతే నింపాదిగా ఏం చేసుకుంటారో చేసుకోండి అని చేతులు ఎత్తేసింది. పెన్సిల్వేనియాకు చెందిన రాబర్ట్, టిఫనీ విలియమ్స్ అనే జంటకు ఓ ఫైన్ మార్నింగ్ బ్యాంకు ఖాతాలో లక్షా ఇరవైవేల డాలర్లు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో వారు ఎంచక్కా ఖర్చు చేయడం మొదలెట్టేశారు. విలాసవంతమైన జీవితం గడుపుతూ విచ్చలవిడిగా ఖర్చుపెడుతూ అంత మొత్తాన్ని కేవలం 17 రోజుల్లోనే ఖర్చు చేసేశారు. తమ ‘సంపాదన’లో కొంత భాగాన్ని కష్టాలలో ఉన్న తమ మిత్రులకి కూడా ఇచ్చేశారు. అయితే బ్యాంకు అడిట్ సమయంలో భారీ మొత్తంలో డబ్బులు తేడా రావడంతో తీరిగ్గా మేల్కొన్న బ్యాంకు మిస్సైన అమౌంట్ కోసం విచారణ మొదలు పెట్టగా అసలు విషయం బయటపడింది. ఆ డబ్బు తిరిగివ్వమని బ్యాంకు అధికారులు ప్రశ్నిస్తే అకౌంట్లో ఎంత ఉందో అంతే తీసుకోండి అని ఎదురు సమాధానం ఇచ్చారంట. సరే అకౌంట్లో ఏమన్నా ఉందా అంటే అప్పటికే మొత్తం ఉడ్చేసి ఖాళీగా ఉంచారంట. ఏం చేయాలో పాలుపోని బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో దిగి వచ్చిన జంట ఎలాగొలా చెల్లిస్తాం అని అప్పటికప్పుడు సర్దిచెప్పినా.. అంత మొత్తం చెల్లించే స్తోమత తమకు లేదని కోర్టుకు విన్నవించుకుంది. కోర్టు వారికి ఒక్కొక్కరికి 25000 డాలర్లు జరిమానా విధిస్తూ బెయిల్ మూంజూరు చేసింది. మరి బెయిల్ కోసమైనా ఏమైనా మిగుల్చుకున్నారో? లేదో? మరి. -
సీఎం మేనల్లుడికి ఈడీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మేనల్లుడు, వ్యాపారవేత్త రతుల్ పురిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ అధికారులు అరెస్టు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) కింద సోమవారం అర్థరాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నామని అధికారులు మంగళవారం తెలిపారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన 354 కోట్ల రూపాయల బ్యాంకు మోసం కేసులో రతుల్ పురి, అతని తండ్రి దీపక్ పురి, తల్లి నీతా (నాథ్ సోదరి), ఇతరులపై గతవారం (ఆగస్టు 17న) సీబీఐ కేసు నమోదు చేసింది. రతుల్ పురిపై రూ.354కోట్ల బ్యాంకు కుంభకోణం ఆరోపణలున్నాయి. మోసర్ బేర్ కంపెనీకి రతుల్ పురి సీనియర్ ఎగ్జిక్యూటివ్గా ఉన్న సమయంలో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని దుర్వినియోగం చేశారని అభియోగం. ఈ కేసులో ఆయనతో పాటు మోసర్ బేర్ సంస్థకు చెందిన మరో నలుగురు డైరెక్టర్లపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇందులో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ పురి, డైరెక్టర్స్ నీతా పురి, సంజయ్ జైన్, వినీత్ శర్మ ఉన్నారు.ఇదే కేసుకు సంబంధించి సీబీఐ ఆదివారం,సోమవారం ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రతుల్ పూరి 2012 లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయగా, అతని తల్లిదండ్రులు బోర్డులో కొనసాగుతున్నారని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు రతుల్ పురి ఆరెస్ట్ దురదృష్టకరమని మోసర్ బేర్ ప్రకటించింది. తాము చట్టపరమైన అన్ని నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం ఈ కేసు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) లో ఉండగా తాజా కేసు ఉద్దేశపూర్వంగా నమోదు చేశారని ఆరోపించింది. కాగా కాంపాక్ట్ డిస్క్లు, డివిడిలు, సాలిడ్ స్టేట్ స్టోరేజ్ పరికరాల వంటి ఆప్టికల్ స్టోరేజ్ మీడియా తయారీలో కంపెనీ మోజర్ బేర్ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది ఈ సంస్థ మూతపడింది. రతుల్ పురిపై అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణం ఆరోపణలు కూడా ఉన్నాయి. అగస్టా వెస్ట్ల్యాండ్ ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మైఖేల్ ముడుపులు మోసర్ బేర్ సంస్థ ద్వారానే చేతులు మారాయని విచారణలో తేలింది. ఇదే కేసుకు సంబంధించి ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
బ్యాంకింగ్ ‘బాండ్’!
న్యూఢిల్లీ: రుణాల విషయంలో కార్పొరేట్ సంస్థలు మోసాలకు పాల్పడుతున్న ఘటనల నేపథ్యంలో బ్యాంకులు రూటు మార్చుకుంటున్నాయి. కేవలం రుణాలు జారీ చేయడానికే పరిమితమై పోకుండా, తీసుకున్న రుణాలను కంపెనీలు ఏ విధంగా వినియోగిస్తున్నాయనేది పర్యవేక్షించేందుకు వెలుపలి ఏజెన్సీల సాయం తీసుకోవాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా ఇతర బ్యాంకులతో కలసి కన్సార్షియం కింద జారీ చేసే రూ.250 కోట్లకు మించిన రుణాల విషయంలో ఏజెన్సీ సేవలను వినియోగించుకోవాలని అనుకుంటున్నాయి. భూషణ్ పవర్ అండ్ స్టీల్ రుణం రూపంలో మోసం చేసినట్టు వెలుగు చూడడం, కంపెనీల ఆర్థిక అంశాలపై కచ్చితమైన సమాచారం విషయంలో రేటింగ్ ఏజెన్సీలు విఫలమవుతున్న నేపథ్యంలో... ఫోరెన్సిక్ ఆడిట్ తరహాలో కంపెనీల ఖాతాలపై సర్వే కోసం ఏజెన్సీలను నియమించుకోవాల్సిన అవసరం ఉందని రెండు అగ్ర స్థాయి ప్రభుత్వరంగ బ్యాంకర్లు తెలిపారు. ప్రస్తుతం అయితే కన్సార్షియం కింద రుణాలను జారీ చేసిన తర్వాత బ్యాంకులు... ప్రధానంగా రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చే రేటింగ్లు, కంపెనీలు ఇచ్చే సమాచారానికే పరిమితం అవుతున్నాయి. వీటి ఆధారంగానే ఆయా కంపెనీల ఆర్థిక ఆరోగ్యాన్ని అంచనా వేస్తున్నాయి. ఈ ప్రతిపాదనపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) స్థాయిలో చర్చ జరిగిందని, అకౌంటింగ్ సంస్థలను నియమించుకోవడం ఈ ప్రతిపాదనలో భాగమని బ్యాంకరు తెలిపారు. ఇప్పటికే ఐబీఏ 75 సంస్థలను కూడా గుర్తించి బ్యాంకుల స్థాయిలో పంపిణీ చేయడం జరిగినట్టు చెప్పారు. ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో... ‘‘ఇది నూతన యంత్రాంగం. ఇప్పటికే అకౌంటింగ్ సంస్థలను గుర్తించాం. తీసుకున్న రుణాలను కంపెనీలు వినియోగించే తీరుపై ఎప్పటికప్పుడు ఇవి పర్యవేక్షణ నిర్వహిస్తాయి. అలాగే, క్రమం తప్పకుండా బ్యాంకులకు నివేదికల రూపంలో తెలియజేస్తాయి’’ అని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో అశోక్ కుమార్ ప్రధాన్ తెలిపారు. ఇప్పటికైతే తాము అందుకున్న స్టేట్మెంట్స్పై ఎక్కువగా వివరాలు వెల్లడించలేమంటూ... సంబంధిత ఆడిటింగ్ సంస్థలు కంపెనీల పుస్తకాలను పరీక్షిస్తాయని, ఇది ఫోరెన్సిక్ ఆడిట్ తరహాలో ఉంటుందన్నారు. కంపెనీల పుస్తకాల్లోని లోపాలను గుర్తించే విషయంలో రేటింగ్ ఏజెన్సీలు సమర్థవంతంగా వ్యవహరించడం లేదని గతేడాది సెప్టెంబర్లో ఐఎల్అండ్ఎఫ్ఎస్ పరిణామంతో వెలుగు చూసింది. రుణాల చెల్లింపుల్లో ఈ సంస్థ వరుసగా విఫలం కావడం, రేటింగ్ ఏజెన్సీలు ముందుగా ఈ విషయాలను గుర్తించలేకపోయిన విషయం తెలిసిందే. ఖాతాల్లోని ఆర్థిక ఇబ్బందులు రేటింగ్ల్లో ప్రతిఫలించకుండా ఉండేందుకు ఐఎల్ఎఫ్ఎస్ సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులు, రేటింగ్ ఏజెన్సీల ఉద్యోగులను ప్రలోభపెట్టినట్టు గ్రాంట్ థార్న్టన్ ఫోరెన్సిక్ ఆడిట్లో ప్రాథమికంగా వెలుగు చూసింది. ‘‘పర్యవేక్షణ బాధ్యత అన్నది రేటింగ్ ఏజెన్సీలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటి రేటింగ్లు బ్యాంకులతోపాటు వాటాదారులకూ ఎంతో ముఖ్యమైనవి. కానీ, ఇప్పుడున్న విధానంలో ఇది ఫలితాలను ఇవ్వడం లేదు. ఎక్స్టర్నల్ ఏజెన్సీలను నియమించుకోవాలని ఐబీఏ యోచిస్తుండడం వెనుక కారణం ఇదే. భూషణ్ పవర్ మోసం వెలుగు చూడడంతో ఈ విధానాన్ని వెంటనే అమల్లో పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని సిండికేట్ బ్యాంకు ఎండీ, సీఈవో మృత్యుంజయ మహపాత్ర పేర్కొన్నారు. -
భూషణ్ పవర్ అండ్ స్టీల్ మరో భారీ కుంభకోణం
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వేలకోట్ల రూపాయల స్కాంలు కలకలం రేపుతున్నాయి. తాజాగా అలహాబాద్ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దివాలా తీసిన భూషణ్ పవర్ అండ్ స్టీల్ కంపెనీ (బిపిఎస్ఎల్) రూ .1,774.82 కోట్లకు ముంచేసిందంటూ అలహాబాదు బ్యాంకు శనివారం ప్రకటించింది. భూషణ స్టీల్ కంపెనీకి సంబంధించి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తరువాత, అలహాబాద్ బ్యాంకులో ఇంత పెద్ద భారీ కుంభకోణం వెలుగు చూడటం బ్యాంకింగ్ వర్గాలను విస్మయ పర్చింది. ఫోరెన్సిక్ ఆడిట్ దర్యాప్తు ఫలితాల ఆధారంగా ఈ స్కాంను గుర్తించామని రెగ్యులేటరీ సమాచారంలో అలహాబాదు బ్యాంకు వెల్లడించింది. దీంతో స్యూ మోటో ప్రాతిపదికన కంపెనీ, దాని డైరెక్టర్లపై కేసు నమోదు చేశామని పేర్కొంది. అక్రమంగా నిధులను మళ్లించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అలహాబాద్ బ్యాంకు నివేదించింది. ఇప్పటికే 900.20 కోట్ల రూపాయల కేటాయింపులు చేసినట్లు ప్రభుత్వ బ్యాంకు తెలిపింది. ఖాతాల పుస్తకాలను తారుమారు చేసి, అక్రమ పద్ధతుల్లో బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసి కన్సార్షియం బ్యాంకులను మోసం చేసినట్టుగా గుర్తించినట్టు తెలిపింది. కాగా దాదాపు రూ. 3,805.15 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు ఇటీవల పీఎన్బీ వెల్లడించింది. ప్రస్తుతం దివాలా తీసిన బీపీఎస్ఎల్ కేసు విచారణ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో తుది దశలో ఉందని, ఈ ఖాతా నుంచి పెద్ద మొత్తమే రాబట్టుకోగలమని ఆశిస్తున్నామని పీఎన్బీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
దేశవ్యాప్తంగా 50 చోట్ల సీబీఐ సోదాలు
న్యూఢిల్లీ: రూ.1,139 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసిన కేసులో సీబీఐ భారీ డ్రైవ్ చేపట్టింది. మంగళవారం దేశవ్యాప్తంగా ఏకకాలంలో 12 రాష్ట్రాల్లోని 18 నగరాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 61 చోట్ల సోదాలు చేపట్టింది. ఎస్బీఐ, సెంట్రల్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకులు చేసిన ఫిర్యాదుల మేరకు నమోదైన 17 కేసులకు సంబంధించిన వివిధ వాణిజ్య సంస్థల డైరెక్టర్లు, ప్రమోటర్లకు చెందిన ఇళ్లు, సంస్థలపై దాడులు జరిగాయి. పరారైన వజ్రాల వ్యాపారి జతిన్కి చెందిన ముంబైలోని విన్సమ్ గ్రూప్, తాయల్ గ్రూప్నకు చెందిన ఎస్కే నిట్, ఢిల్లీ కేంద్రంగా పనిచేసే నఫ్తోగజ్, ఎస్ఎల్ కన్జ్యూమర్, పంజాబ్లోని ఇంటర్నేషనల్ మెగా ఫుడ్పార్క్, సుప్రీం టెక్స్ మార్ట్ తదితరాలు లక్ష్యంగా సోదాలు చేపట్టినట్లు సీబీఐ తెలిపింది. గృహ రుణాల మంజూరులో అవకతవకలకు పాల్పడిన భువనేశ్వర్లోని యూనియన్ బ్యాంక్ శాఖ అధికారులపై మూడు కేసులు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. ఢిల్లీ, ముంబై, థానే, లూ«థియానా, వల్సాద్, పుణే, గయ, గుర్గావ్, చండీగఢ్, భోపాల్, సూరత్, కోలార్ తదితర నగరాల్లో చేపట్టిన ఈ సోదాల్లో 300 మంది అధికారులు పాల్గొన్నారని తెలిపింది. సీబీఐ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా నేతృత్వంలో చేపట్టిన తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని సీబీఐ పేర్కొంది. రూ.640 కోట్ల మేర మోసం జరిగి ఉంటుందని అంచనా వేసిన అధికారులు సోదాల తర్వాత ఈ మొత్తం రూ.1,139 కోట్ల వరకు ఉంటుందని తేల్చారు. ఈ మేరకు జితిన్ మెహతాపై 16వ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎగ్జిమ్ బ్యాంకును రూ.202 కోట్ల మేర మోసం చేసినట్లు ఇతనిపై ఇప్పటికే పలు కేసులున్నాయి. భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న ముంబైలోనూ అధికారులు సోదాలు కొనసాగించారు. -
నకిలీ బంగారంతో బ్యాంకుకే బురిడీ
సాక్షి, అవుకు(కర్నూలు) : మండలంలోని రామాపురం ఆంధ్రాబ్యాంక్లో పని చేస్తున్న ఓ వ్యక్తి బ్యాంక్నే బురిడీ కొట్టించాడు. నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.40 లక్షల వరకు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. బ్యాంక్కు కొత్త మేనేజర్ రావడంతో ఈ వ్యవహారం సోమవారం వెలుగులోకి వచ్చింది. రామాపురంలోని ఆంధ్రాబ్యాంక్లో కాంట్రాక్ట్ ప్రతిపదికన గోల్డ్ అౖప్రైజర్గా శ్రీనివాసులు అనే వ్యక్తి నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. రుణాల కోసం ఖాతాదారులు తెచ్చే బంగారం సరైనదా లేదా అని బ్యాంక్ అధికారులకు ఈయన నివేదిక అందిస్తారు. అనంతరం రుణాలు మంజూరు అవుతాయి. అయితే నమ్మకంగా ఉండాల్సిన గోల్డ్ అప్రైజర్..అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. చనుగొండ్ల, శింగనపల్లె, అవుకు చెందిన 12 మంది ఖాతాదారుల సంతాకాలు తీసుకొని నకలీ బంగారాన్ని తనఖా పెట్టి బ్యాంక్ డబ్బును కాజేశాడు. ఇటీవల మేనేజర్ లింగన్న బదిలీ కాగా.. నంద్యాల శివారులోని ఉడుమార్పరం ఎస్బీఐ శాఖ నుంచి రామాపురానికి నవీన్ కుమార్ రెడ్డి బ్యాంక్ మేనేజర్ బదిలీపై వచ్చారు. ఖాతాదారులకు సంబంధించి అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, అలాగే రుణాలకు సంబంధించిన వివరాలు నూతన మేనేజర్కు అప్పజేప్పే క్రమంలో నకిలీ బంగారం వ్యవహారం బట్టబయలైంది. సంబంధిత రైతులను విచారించగా తాము ఎలాంటి రుణాలు పొందలేదని చెప్పడంతో సదరు గోల్డ్ అప్రైజర్ శ్రీనువాసులు అక్రమాలు బయటపడ్డాయి. -
బ్యాంకు మోసాలు.. @ రూ.2 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ : దేశీయ బ్యాంకులు మోసగాళ్లకు లక్ష్యంగా మారుతున్నాయి. గత 11 ఏళ్లలో రూ.2.05 లక్షల కోట్ల మేర భారీ మోసాలు ఇక్కడి బ్యాంకుల్లో చోటు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. సంఖ్యా పరంగా ఎక్కువ ఘటనలు అత్యధికం ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల్లోనే జరిగినట్టు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ఇక భారీగా మోసపోయినది మాత్రం పంజాబ్ నేషనల్ బ్యాంకు!!. ఈ బ్యాంకులో మోసపు ఘటనలు 2,047 నమోదయినప్పటికీ, విలువ మాత్రం 28,700 కోట్ల మేర ఉంది. ముఖ్యంగా వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఒక్కరే రూ.13,000 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన విషయం గమనార్హం. పీఎన్బీ తర్వాత ఎస్బీఐకి మోసాల సెగ ఎక్కువగా తగిలింది. 23,734 కోట్ల మేర మోసాలు జరిగాయి. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఓ దరఖాస్తుకు బదులుగా ఈ వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. 2008–09 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం53,334 మోసపూరిత కేసులు నమోదయ్యాయి. పీఎన్బీలో భారీగా... పీఎన్బీలో రూ.28,700 కోట్ల మొత్తానికి సంబంధించి 2,047 మోసాలు జరిగాయి. ఐసీఐసీఐ బ్యాంకులో రూ.5,033.81 కోట్లకు సంబంధించి 6,811 కేసులు ఈ కాలంలో నమోదయ్యాయి. ప్రభుత్వరంగంలోని ఎస్బీఐలో 6,793 మోసపు ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటి విలువ రూ.12,358 కోట్లు. హెచ్డీఎఫ్సీ బ్యాంకులోనూ రూ.1,200.79 కోట్లకు సంబంధించి 2,497 మోసపూరిత ఘటనలు జరిగాయి. బ్యాంకు ఆఫ్ బరోడాలో 2,160 మోసపూరిత కేసులు నమోదు కాగా, వీటి మొత్తం రూ.12,962.96 కోట్లుగా ఉంది. విదేశీ బ్యాంకుల్లోనూ...: భారత్లో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ బ్యాంకులు సైతం మోసపూరిత ఘటనల బారిన పడినట్టు తెలుస్తోంది. అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్ ఇదే కాలంలో 1,862 మోసపూరిత కేసులను రిపోర్ట్ చేసింది. వీటి మొత్తం రూ.86.21 కోట్లు. అలాగే, సిటీ బ్యాంకులో రూ.578 కోట్లకు సంబంధ/æంచి 1,764 కేసులు వెలుగు చూశాయి. హెచ్ఎస్బీసీలో రూ.312 కోట్ల మేర రూ.1,173 మోసాలు, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ పీఎల్సీలో రూ.12.69 కోట్ల మేర 216 కేసులు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులో రూ.1,221.41కోట్లతో ముడిపడిన 1,263 ఘటనలు వెలుగు చూశాయి. -
ఏడాదిలో రూ.71వేల కోట్ల మాయం!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం బ్యాంకు మోసాల కేసులు గణనీయంగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో 6,801 కేసులు నమోదు కాగా.. విలువపరంగా ఇవి రూ. 71,500 కోట్లు ఉండొచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వెల్లడించింది. 2017–18లో రూ. 41,167 కోట్లకు సంబంధించి 5,916 కేసులు నమోదయ్యాయి. దీంతో పోలిస్తే 2018–19లో పరిమాణం ఏకంగా 73 శాతం పెరిగిందని సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు ఆర్బీఐ వివరణ ఇచ్చింది. గడిచిన 11 ఆర్థిక సంవత్సరాల్లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో 53,334 ఫ్రాడ్ కేసులు నమోదు కాగా, రూ.2.05 లక్షల కోట్ల మేర మోసాలు జరిగాయి. ఆర్బీఐకి నివేదించిన ఫ్రాడ్ కేసులకు సంబంధించి ఆయా బ్యాంకులు క్రిమినల్ కేసులు పెట్టాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అయితే ఈ కేసుల్లో తీసుకున్న చర్యల గురించి పూర్తి సమాచారం సిద్ధంగా లేదని పేర్కొంది. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి వ్యాపారవేత్తలు బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన నేపథ్యంలో తాజా గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కుంభకోణాలపై దృష్టి సారించిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ప్రత్యేకంగా అధ్యయనం చేసి, టాప్ 100 ఫ్రాడ్లపై నివేదిక కూడా రూపొందించింది. మోసాలకు పాల్పడిన తీరు, నగదు పరిమాణం, రుణ లావాదేవీల తీరుతెన్నులు, విధానపరమైన లొసుగులు తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంది. ప్రధానంగా 13 రంగాల్లో చోటు చేసుకున్న ఫ్రాడ్స్ను పరిశీలించింది. తయారీ, వజ్రాభరణాలు, వ్యవసాయం, మీడియా, ఏవియేషన్, ట్రేడింగ్, ఐటీ తదితర రంగాలు వీటిలో ఉన్నాయి. అటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తదితర ఏజెన్సీలు ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నాయి. -
బ్యాంకు కుంభకోణం : ఆరుగురికి జీవిత ఖైదు
సాక్షి, ముంబై: దాదాపు 20 ఏళ్ల నాటి కేసులో ముంబై స్పెషల్ కోర్టుసంచలన తీర్పును వెలువరించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ మాజీ అధికారితోపాటు మరో ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. అంతేకాదు ఈ కేసులో న్యాయవాదికి మూడేళ్ల జైలు శిక్షను విధించిందని గురువారం విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటన తెలిపింది. 2000 బీఓఐలో చోటు చేసుకున్న 2.91కోట్ల కుంభకోణానికి సంబంధించి కోర్టు ఈ తీర్పును వెలువరించింది. సీబీఐ అందించిన సమాచారం ప్రకారం, 2000లో స్విఫ్ట్ సేవల కింద బ్రాంచ్ అధికారులతో కుమ్మక్కై, నకిలీ పత్రాలతో ఆహుజా అతని భాగస్వాములు కలిసి 2.50 కోట్ల రూపాయల మేర లోన్ తీసుకున్నారు. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో 2004 ప్రారంభంలో ఎన్పీఏగా ప్రకటించబడింది. దీంతో బ్యాంకు నష్టం మొత్తం రూ. 2.91 కోట్లకు చేరింది. 2004లో కేసు నమోదు చేసిన సీబీఐ విచారణ అనంతరం నవంబరు 2005లో చార్జిషీట్ దాఖలు చేసింది. బ్యాంకుకు చెందిన అప్పటి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ భగవాన్జీ డి.జోషి, బ్యాంకులో రుణం తీసుకున్న 5గురు వ్యాపారవేత్తలు - మనోహర్లాల్ ఆహుజా, అతని కుమారుడు అమిత్ ఆహుజా, మహేష్ బోరా, సందేష్ రామచంద్ర నాగే, జి.కె.శర్మ, శాంతిలాల్ చౌహాన్ తోపాటు న్యాయవాది యూనస్పై వివిధ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసింది. దీనిపై ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టులో విచారణ అనంతరం ఈ తీర్పునిచ్చింది. ఈ తీర్పు చాలా అరుదైనది. ఒక మైలురాయిలాంటిదని అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు ఆహుజా తండ్రీకొడుకులిద్దరికి చెరి రూ. 50 లక్షలు, బొహ్రా రూ. 3లక్షలు, నాగే రూ. 60వేల, చౌహాన్ రూ .50వేలు జోషి రూ. లక్ష, న్యాయవాదికి రూ .3 వేల జరిమానా విధించడం గమనార్హం. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన శర్మ ఆగస్టు ,2008 లో చనిపోయారు. -
రూ 5000 కోట్లతో నైజీరియాకు చెక్కేసిన భారతీయుడు!
అహ్మదాబాద్ : నీరవ్ మోదీ వ్యవహారం మరువకముందే మరో భారీ బ్యాంక్ స్కాంలో ప్రధాన నిందితుడు దర్జాగా విదేశాలకు చెక్కేసిన ఉదంతం వెలుగుచూసింది. గుజరాత్ ఫార్మా దిగ్గజం నితిన్ సందేసర రూ 5000 కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడి నైజీరియాకు పారిపోయినట్టు తెలిసింది. నితిన్ను గతనెలలో దుబాయ్లో పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలు వచ్చినా ఆయన నైజీరియాకు పారిపోయినట్టు తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెల్లడించింది. నితిన్కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్ ప్రమోటర్లు నకిలీ, తప్పుడు డాక్యుమెంట్లతో పలు బ్యాంకుల నుంచి సేకరించిన రూ 5000 కోట్లు అనంతరం మొండిబాకీలుగా మారాయని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఆంధ్రా బ్యాంక్, యూకో బ్యాంక్, ఎస్బీఐ, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్యాంకుల కన్సార్షియం రుణాలను మంజూరు చేసింది. కాగా ఈ కేసుకు సంబంధించి యూఏఈ అధికారులు గతనెలలో దుబాయ్లో నితిన్ సందేసరను అదుపులోకి తీసుకున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని, అంతకుముందే నితిన్ ఆయన కుటుంబ సభ్యులు నైజీరియాలో తలదాచుకున్నారని తెలిసిందని ఆ కథనం పేర్కొంది. నితిన్ సోదరుడు చేతన్ సందేసర, మరదలు దీప్తిబెన్ సందేసర సహా కుటుంబ సభ్యులు నైజీరియలో ఉన్నట్టు సమాచారం. రూ 5000 కోట్ల బ్యాంక్ అక్రమ లావాదేవీలు, మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి గుజరాత్కు చెందిన నితిన్ సందేసర కంపెనీ స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్కు చెందిన రూ 4700 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జూన్లో అటాచ్ చేసింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం కింద సంస్థకు చెందిన 4000 ఎకరాలతో పాటు, ప్లాంట్, యంత్రాలు, సంబంధిత కంపెనీలు, ప్రమోటర్లకు చెందిన 200 బ్యాంకు ఖాతాలు, రూ6.67 కోట్ల విలువైన షేర్లు, లగ్జరీ కార్లు, వాహనాలను అటాచ్ చేస్తూ ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం కింద భారీ మొత్తంలో ఆస్తులను అటాచ్ చేసిన కేసుల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. -
రొటోమాక్కు షాక్ : ఆస్తులు జప్తు
సాక్షి, ముంబై : పీఎన్బీ స్కాం తరువాత రెండవ అతిపెద్ద బ్యాంకు కుంభకోణంగా నిలిచిన రొటోమాక్ వేల కోట్ల రూపాయల స్కాంలో రొటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్కు, దాని ప్రమోటర్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో భారీ షాక్ ఇచ్చింది. కాన్పూర్కు చెందిన రోటోమక్ గ్రూపుకు చెందిన భారీ ఆస్తులను దర్యాప్తు సంస్థ అటాచ్ చేసింది. సుమారు 177 కోట్ల రూపాయలను ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు మంగళవారం ఈడీ తెలిపింది. కన్సార్టియం ఏడు బ్యాంకుల వద్ద రొటోమాక్ ప్రమోటర్లు రూ.3,690 కోట్ల కుంభకోణం నేపథ్యంలో సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా పిఎంఎల్ఎ చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేసిన ఈడీ తాజాగా చర్యకు దిగింది. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ బరోడాను రూ.456 కోట్లు మోసం చేసిన కేసులో రొటోమాక్ సంస్థ ఛైర్మన్, ఎండీ విక్రమ్ కొఠారి, డైరెక్టర్ రాహుల్ కొఠారితోపాటు, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ అధికారులపైనా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తన తొలి చార్జిషీట్ను దాఖలు చేసింది. వేలకోట్లను బ్యాంకును ముంచేసిన కేసుపై గతమూడు నెలలుగా విచారించిన సీబీఐ..లక్నోలోని ప్రత్యేక కోర్టుకు ఇటీవల తొలి చార్జిషీట్ను దాఖలు చేసింది. అలాగే ఇది కేవలం బీవోబీని మోసం చేసిన దానిపై మాత్రమే చార్జిషీట్ దాఖలు చేసినట్లు..మిగతా సొమ్ముపై విచారణ కొనసాగుతున్నదని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. కాన్పూర్ కేంద్రగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రొటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ విక్రమ్ కొఠారి, ఆయన కుమారుడు, సంస్థ డైరెక్టర్ రాహుల్ కొఠారి, బీవోబీ ఏజీఎం ఎస్కే ఉపాధ్యాయ, సీనియర్ బ్యాంక్ మేనేజర్ ప్రకాశ్ కపూర్, బ్యాంక్ మేనేజర్ శశి బిశ్వాస్లు ఈ తొలి చార్జిషీట్లో ఉన్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. అలాగే దర్యాప్తుతో సహకరించడం లేదన్న ఆరోపణలతో ఢిల్లీలో సీబీఐ విక్రమ్ కొఠారి, ఆయన కుమారుడిని అరెస్టు చేయగా, వారు జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
అయిదేళ్లలో రూ. లక్ష కోట్ల మోసాలు
న్యూఢిల్లీ: గడిచిన అయిదేళ్లలో 23,000 పైచిలుకు బ్యాంక్ మోసాల కేసులు నమోదైనట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. వీటి పరిమాణం మొత్తం రూ. లక్ష కోట్ల పైగా ఉంటుందని పేర్కొంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఫ్రాడ్ కేసుల సంఖ్య 5,000 పైచిలుకు ఉండగా, 2017–18లో ఇవి 5,152కి పెరిగాయని సమాచార హక్కు కింద దాఖలైన దరఖాస్తుకు సమాధానంగా ఆర్బీఐ వెల్లడించింది. 2017 ఏప్రిల్ నుంచి 2018 మార్చి 1 దాకా వచ్చిన కేసుల్లో అత్యధికంగా రూ. 28,459 కోట్ల మేర మోసాలు నమోదైనట్లు పేర్కొంది. 2016–17లో 5,076 కేసుల్లో ఈ పరిమాణం రూ. 23,933 కోట్లు. ఆయా కేసులపై సత్వరం చర్యలు తీసుకోవడం జరిగిందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో రూ. 13,000 కోట్ల స్కామ్ దరిమిలా సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొదలైనవి భారీ కుంభకోణాలపై దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ వివరాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
బ్యాంక్ అక్రమాల్లో రూ లక్ష కోట్లు ఆవిరి : ఆర్బీఐ
సాక్షి, ముంబయి : బ్యాంకుల్లో అవకతవకలు, మోసాల కారణంగా కోట్లాది ప్రజాధనం పక్కదారిపడుతోంది. గత ఐదేళ్లలో బ్యాంకుల్లో చోటుచేసుకున్న 23,000కు పైగా అవకతవకల కేసుల్లో రూ లక్ష కోట్ల మేర ధనం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిందని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. బ్యాంకుల్లో ఏప్రిల్ 2017 నుంచి మార్చి 2018 వరకూ అవకతవకల కేసులు 5152 కేసులకు పెరిగాయని ఆర్టీఐ కింద కోరిన సమాచారానికి బదులిస్తూ ఆర్బీఐ వెల్లడించింది. ఈ కేసుల్లో రూ 28,459 కోట్లు చిక్కుకున్నాయని పేర్కొంది. ఇక 2016-17లో రూ 23,933 కోట్ల విలువైన 5976 అక్రమాల కేసులు బ్యాంకింగ్ రంగంలో నమోదయ్యాయని తెలిపింది. గత ఐదేళ్లలో మొత్తం లక్షా718 కోట్ల మేర ధనం 23,866 అక్రమార్కుల అవకతవకల ఫలితంగా ఆవిరైందని ఆర్బీఐ వెల్లడించింది. ఈ కేసులను సమగ్రంగా పరిశీలించి కేసుల వారీగా వాస్తవాలను క్రోడీకరిస్తూ చర్యలు చేపడుతున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. బ్యాంకుల్లో పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు భారీ రుణాల ఎగవేత కేసులు పేరుకుపోతున్న క్రమంలో ఆర్బీఐ వెల్లడించన గణాంకాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
రూ.621 కోట్ల స్కాం : మాజీ చీఫ్పై కేసు నమోదు
ముంబై : రూ.14 వేల కోట్ల భారీ కుంభకోణంతో కుదేలైన పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఉదంతంతో పాటు ఇటీవల మరికొన్ని బ్యాంకుల కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా యూకో బ్యాంకుకు చెందిన రూ.621 కోట్ల రుణ కుంభకోణం బట్టబయలైన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో భాగమైన బ్యాంకు మాజీ సీఎండీ అరుణ్ కౌల్పై సీబీఐ కేసు నమోదు చేసింది. అరుణ్ కౌల్తో పాటు ప్రైవేటీ కంపెనీపై కూడా సీబీఐ కేసు దాఖలు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వారిలో కౌల్తో పాటు, ఎరా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హేమ్ సింగ్ భరాణా, చార్టెడ్ అకౌంటెంట్స్ పంకజ్ జైన్, వందనా శార్దాలు ఉన్నారు. ఆల్టియస్ ఫిన్సర్వ్ పవన్ బన్సాల్, ఇతర పబ్లిక్ సర్వెంట్లను కూడా ఈ కుంభకోణ కేసులో సీబీఐ విచారిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరు బ్యాంకులో రూ.621 కోట్ల రుణాలను తప్పుదోవ పట్టించినట్టు తెలిసింది. ఈ రుణాలను ఆమోదించిన అవసరాలకు ఉపయోగించలేదని, చార్టెడ్ అకౌంటెంట్లు అందించిన తప్పుడు సర్టిఫికేట్లతో ఈ రుణాలను పొందినట్టు అధికారులు చెప్పారు. కంపెనీ ఇలా అక్రమంగా రుణం పొందినప్పుడు కౌల్ బ్యాంకు సీఎండీగా ఉన్నారు. ఢిల్లీతో పాటు ఎనిమిది ప్రాంతాల్లో సీబీఐ తనికీలు నిర్వహించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి అధికారిక, నివాస ప్రాంతాల్లో ఈ తనిఖీలను చేపట్టింది. -
మరో భారీ కుంభకోణం: వేలకోట్ల రూపాయలకు టోకరా
-
మరో భారీ కుంభకోణం: వేలకోట్ల రూపాయలకు టోకరా
సాక్షి,న్యూఢిల్లీ: మరో భారీ బ్యాంకింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వడోదరకు చెందిన విద్యుత్ కేబుల్స్, సామగ్రిని తయారు చేసే కంపెనీ వేలకోట్ల రూపాయల మేర బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టింది. 11 బ్యాంకుల కన్సార్టియాన్ని భారీ ఎత్తున మోసం చేసిన వ్యవహారంలో కేసు నమోదు చేశామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గురువారం ప్రకటించింది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా లోన్ డిఫాల్టర్ల లిస్ట్లోనూ, ఎక్స్పోర్ట్ క్రెడిట్ హామీ కార్పొరేషన్ హెచ్చరిక జాబితాలో ఉన్నప్పటికీ కంపెనీ, దాని డైరెక్టర్లు తప్పుడు పద్ధతుల్లో రుణాలు పొందారని ఆరోపించింది. వివిధ బ్యాంకుల నుంచి అక్రమ మార్గాల్లో డైమెండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (డిపిఐఎల్) రూ. 2,654 కోట్ల రుణాలను తీసుకుందని సీబీఐ తెలిపింది. ఈ కుంభకోణానికి సంబంధించి కంపెనీపైనా, డైరెక్టర్లపైనా కేసు నమోదు చేసినట్లు చెప్పింది. కంపెనీ ప్రమోటర్ ఎస్ఎన్ భట్నాగర్, అతని కుమారులు, కంపెనీ ఎగ్జిక్యూటివ్లు అమిత్ భట్నాగర్, సుమిత్ భట్నాగర్లపై కేసు నమోదు చేశామని సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా- రూ.670.51కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా- రూ.349 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు- 279.46 కోట్ల రూపాయలు రుణాలు పొందినట్టుగా సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. అలాగే గుజరాత్ వడోదరాలోని కంపెనీ కార్యాలయంతో పాటు డైరెక్టర్ల నిసాసాల్లో సీబీఐ సోదాలు ప్రారంభించింది. కాగా సీబీఐ అందించిన సమాచారం ప్రకారం 2008 జూన్లో యాక్సిస్ బ్యాంకు నేతృత్వంలోని 11బ్యాంకుల కన్సార్టియం (పబ్లిక్, ప్రైవేట్) ద్వారా మోసపూరితంగా డిపిఐఎల్ రుణాలను పొందింది. నగదు క్రెడిట్ పరిమితులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన బ్యాంకుగా ఉంది. ఈ మొత్తం 2016 జూన్ 29 నాటికి రూ .2,654.40 కోట్ల రూపాయలకు చేరింది. అయితే 2016-17లో ఎన్పీఏగా ప్రకటించడం గమనార్హం. -
ఐడీబీఐ బ్యాంకులోనూ మోసం
-
వెలుగులోకి మరో బ్యాంకు కుంభకోణం
ముంబై : మరో ప్రభుత్వ రంగ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ రంగానికి చెందిన ఐడీబీఐ బ్యాంకు లిమిటెడ్లో రూ.772 కోట్ల విలువైన మోసపూరిత రుణాలు జారీ అయినట్టు వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఐదు బ్రాంచుల్లో ఈ కుంభకోణం చోటు చేసుకుందని రాయిటర్స్ రిపోర్టు చేసింది. రిపోర్టు ప్రకారం ఈ మోసపూరిత రుణాలు 2009 నుంచి 2013 వరకు కాలంలో ఫిష్ ఫామింగ్ బిజినెస్దారులకు జారీ అయినట్టు తెలిసింది. చేపల చెరువుల నకిలీ అద్దె పత్రాలతో వీరు మోసపూరిత రుణాలు పొందినట్టు బ్యాంకు గుర్తించింది. ఐడీబీఐ ఈ కుంభకోణ వివరాలను బయటికి వెల్లడించగానే, బ్యాంకు షేర్లు 3.5 శాతం కిందకి పడిపోయి రూ.73.6గా నమోదవుతున్నాయి. పబ్లిక్ రంగ బ్యాంకుల నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు ఇండెక్స్ కూడా 1.8 శాతం క్షీణించింది. తమ ఉద్యోగుల్లో ఇద్దరు ఈ రుణాల జారీ ప్రక్రియలో తప్పిదాలు చేసినట్టు ఐడీబీఐ తెలిపింది. వీరిలో ఒక అధికారిపై బ్యాంకు వేటు వేయగా.. మరో అధికారి ఇప్పటికే పదవీ విరమణ అయ్యారు. -
వెయ్యికోట్లకు ముంచేసిన కనిష్క్ జ్యువెలరీ
సాక్షి, చెన్నై: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వరుస కుంభకోణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోటుచేసుకున్న మరో జ్యువెలరీ వ్యాపారం స్కాం వార్తల కెక్కింది. వేలకోట్ల కుంభకోణానికి పాల్పడిన చెన్నైకు చెందిన కనిష్క్ గోల్డ్ జ్యుయలరీ ప్రమోటర్లు విదేశాలకు చెక్కేసారు. దీంతో రాత్రికి రాత్రే దుకాణాలు మూసివేయడం, రికార్డులను మాయం చేయడం తదితర ఆరోపణలతో ఎస్బీఐ సీబీఐని ఆశ్రయించింది. ప్రస్తుతం నిందితులు మారిషస్కు పారిపోయివుంటారని బ్యాంకు భావిస్తోంది. రూ. 824 కోట్ల రూపాయల రుణాల మోసానికి సంబంధించి కనిష్క్ జ్యువెలరీ యజమాని, డైరెక్టర్లు భూపేష్ కుమార్ జైన్, అతని భార్య నీతా జైన్పై ఎస్బీఐ సీబీఐకి ఫిర్యాదు చేసింది. మొత్తం 14 బ్యాంకుల కన్సార్టియం ఆధ్వర్యంలో కనిష్క్ గోల్డ్ జ్యుయలరీ రుణాలను పొందింది. ఈ మొత్తం విలువ వెయ్యి కోట్లకు పైమాటే నని అంచనా. మరోవైపు గత ఏడాది నవంబరులో రుణఎగవేతదారుడుగా కనిష్క్ గోల్డ్ సంస్థను బ్యాంకులు ప్రకటించాయి. ఇది ఇలా ఉంటే 2017 సెప్టెంబరులో కనిష్క్ గోల్డ్ వ్యవస్థాపకుడు భూపేష్ కుమార్ జైన్ను రూ. 20 కోట్ల ఎక్సైజ్ పన్ను మోసం కేసులో అరెస్టు అయ్యాడు. బెయిల్ మీద విడుదలైన భూపేష్ అప్పటినుంచి భార్యతో సహా పరారీలో ఉన్నాడు. కాగా చెన్నైలోనే కాకుండా హైదరాబాద్, కొచ్చిన్, ముంబైలలో కూడా కనిష్క్ జువెలరీ తన షాపులను విస్తరించింది. -
250 కోట్లు కాదు..రూ.4వేలకోట్ల స్కాం
సాక్షి, ముంబై: రూ.250 కోట్ల బ్యాంకింగ్ కుంభకోణం ఆరోపణలతో ముంబైకి చెందిన పరేఖ్ అల్యూమినిక్స్ లిమిటెడ్ (పీఏఎల్) డైరెక్టర్లు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ స్కాంపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా పోలీసులు సంస్థకు చెందిన ముగ్గురు డైరెక్టర్లను ఆర్థిక నేరాల విభాగం అధికారులు అరెస్టు చేశారు. అంతేకాదు గతకొన్నేళ్ల క్రితం వెలుగు చూసిన ఈ స్కాం విలువ వేలకోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ స్కాం మొత్తంవిలువ రూ .4,000 కోట్లుగా ఉందని ప్రయివేటురంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు తన తాజా ఫిర్యాదులో పేర్కొంది. 20పైగా బ్యాంకుల గ్రూపును పీఏఎల్ మోసం చేసింది. బూటకపు కంపెనీల పేరుతో మోసపూరితమైన నకిలీ ఇన్వాయిస్లు, బిల్లులతో కుంభకోణానికి పాల్పడ్డారని బ్యాంకు ఆరోపించింది. దీంతో ఫోర్జరీ, నిబంధనల ఉల్లంఘన, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భవార్లాల్ భండారి, ప్రేమల్ గోరఖ్నాథ,కమేలష్ కనుంగోలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో బ్యాంకు అధికారుల పాత్రపై అధికారులు ఇంకా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. 2011లోనే పరేఖ్ నేతృత్వంలోని పీఏఎల్ రూ. 127.5కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 22 బ్యాంకులతో కలిపి ఇచ్చే రుణ ఒప్పందంలో భాగంగా ఈకుంభకోణం జరిగిందని ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. సంస్థ డైరెక్టర్లు అమితాబ్ పరేఖ్ (2013 లో మరణించారు), రాజేంద్ర గోథీ, దేవన్షు దేశాయ్, కిరణ్ పారిక్, విక్రమ్ మొర్దానీ పేర్లనుకూడా తన ఫిర్యాదులో చేర్చింది. కాగా పరేఖ్ అల్యూమినిక్స్ ఎస్బీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సహా ప్రభుత్వ బ్యాంకులనుంచి ఆరోపణలనెదుర్కొంటోంది. ఇప్పటికే ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. -
మోదీ 'నీరవ్' కాకూడదు
న్యూఢిల్లీ : బ్యాంకుల్లో వెలుగు చూస్తున్న కుంభకోణాలపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వంపై మండిపడింది. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో రూ.54,317 కోట్ల బ్యాంకు కుంభకోణాలు జరిగాయని, ఈ విషయంపై నరేంద్రమోదీ గొంతు విప్పాలని డిమాండ్ చేసింది. నీరవ్(సైలెంట్) మోదీ నుంచి ప్రధాని బయటికి రావాలని భారత్ డిమాండ్ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ రణ్దీప్ సుర్జేవాలా అన్నారు. అంటే ప్రధాని మోదీ నీరవ్(సైలెంట్) మోదీ కాకూడదని, సైలెంట్ మోదీ నుంచి బోల్ మోదీలాగా మారాలన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో మోసగాడి కొత్త మంత్రం పారిపోవడం, ఎగిరిపోవడమేనని చెప్పారు. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన సమాచారంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో ఒక్క ముంబైలోనే రూ.19,317 కోట్ల మోసాలు, స్కాంలు చోటు చేసుకున్నాయని తెలిపారు. 2015లో రూ.5,560.66 కోట్లు, 2016లో రూ.4,273.87 కోట్లు, 2017లో ఉరూ.9,838.66 కోట్లు కుంభకోణాలు జరిగాయని సుర్జేవాలా చెప్పారు. ఈ స్కామ్లు, మోసాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న 189 మంది తప్పించుకున్నారని ఆరోపించారు. మోదీ, ఫడ్నవీస్ ప్రభుత్వాలు దోపిడీలకు వన్-వే టిక్కెట్ లాంటివని చెప్పారు. ఈ ఆరోపణలు బీజేపీ ఖండిస్తోంది. కాంగ్రెస్ హయాంలోనే ఈ మోసాలు జరిగినట్టు ఆరోపణలను తిప్పికొడుతోంది. -
వేలకోట్ల కుంభకోణం: నిరూపిస్తే తల నరకండి!
సాక్షి లక్నో: బ్యాంకులను వేల కోట్ల రూపాయల మేర మోసం చేస్తున్న కేటుగాళ్ల జాబితా పెరుగుతోంది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, రోటోమాక్ అధినేత విక్రమ్ కొఠారీ, ఆర్పీ ఇన్ఫోసిస్టం శిబాజీ పంజా, ఇపుడిక వస్త్రాల తయారీ కంపెనీ శ్రీ లక్ష్మీ కొటిన్స్ లిమిటెడ్(ఎస్ఎల్:సీఎల్) అగర్వాల్ ఈ వరుసలో నిలిచాడు. పీఎన్బీ, కెనరా బ్యాంకుల మాదిరిగాగానే కాన్పూర్ నగరానికి చెందిన ఈ కంపెనీ బ్యాంకులకు సుమారు రూ.4వేలకోట్ల టోకరా వేసింది. శ్రీలక్ష్మీ కొటిన్స్ గ్రూప్ చైర్మన్, ఎండీ ఎంపీ అగర్వాల్ మొత్తం 16 బ్యాంకుల్లో రూ.3,972కోట్ల మేర కుంభకోణానికి పాల్పడ్డాడు. దీంతో సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి. ఉత్తరప్రదేశ్లోని కాన్పూరుకు చెందిన శ్రీ లక్ష్మీ కాట్సిన్ లిమిటెడ్ సంస్థ ..సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాతోపాటు మొత్తం 16 బ్యాంకుల నుంచి అగర్వాల్ పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని ఎగవేసింది. వస్త్రవ్యాపారంతో పాటు ఆటోమొబైల్ బ్లాస్ట్ప్రూఫ్ వ్యాపారం కూడా నిర్వహిస్తోంది.. అయితే క్రమంగా పెట్టుబడి మొత్తం కంటే నష్టాలు పెరిగిపోతుండటంతో కంపెనీ పునరుద్ధరణ అసాధ్యంగా మారింది. చివరకు నష్టాలు రూ. 1646.12 కోట్లకు చేరుకున్నాయి. దీర్ఘకాలిక రుణాలు రూ. 2406 కోట్లు కాగా, స్వల్పకాలిక రుణాలు రూ. 937 కోట్లున్నాయి. ఇలా మొత్తం16 బ్యాంకుల (సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎగ్జిమ్ బ్యాంక్, ఒరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఐడిబిఐ బ్యాంక్, విజయా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, సరస్వత్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఎడెల్వీస్ ఎస్టేట్) నుంచి రూ. 3972 కోట్ల రుణాలను చెల్లించకుండా ఎగ్గొట్టింది. దీంతో కంపెనీ అధినేత అగర్వాల్ దేశం విడచిపోయారని, అప్పులను తీర్చే అవకాశమే లేదంటూ వార్తలు వ్యాపించాయి. అయితే ఈ వ్యవహారంపై కంపెనీ ఎండీ అగర్వాల్ స్పందించారు. నీరవ్మోదీ, రొటొమాక్ కుంభకోణంతో తమను పోల్చవద్దని మండిపడ్డారు. రుణమొత్తాలను తమ ఫ్యాక్టరీలలో పెట్టుబడులు పెట్టామనీ, తాను దేశం విడిచి ఎక్కడికీ పారిపోలేదని వివరణ ఇచ్చారు. రాబోయే మూడు నాలుగు నెలల్లో సమస్యను పరిష్కరించుకుంటామని వెల్లడించారు. విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేశారని, త్వరలోనే దేశం విడిచిపోనున్నారనే వార్తలను ఆయన తోసిపుచ్చారు. బ్యాంకులోన్ల ద్వారా ఆస్తిని కొనుగోలు చేశానని ఎవరైనా నిరూపిస్తే..వాళ్లు తన తల నరకవచ్చవంటూ సవాల్ చేశారు. -
భారీ కుంభకోణం: సీఎం అల్లుడు బుక్
సాక్షి, లక్నో: ప్రభుత్వ రంగ బ్యాంకులో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ప్రభుత్వ రంగ బ్యాంకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ)కు రుణాల ఎగవేతకు సంబంధించి సీబీఐ తాజాగా మరో కేసు నమోదు చేసింది. ప్రైవేట్ చక్కెర ఉత్పాదక సంస్థ శింబోలీ షుగర్స ఓబీసీకి రూ.109 కోట్ల మేర రుణాలు ఎగవేసిన కేసులో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అల్లుడు, శింభోలీ షుగర్స్ డిప్యూటీ డైరెక్టర్ గురుపాల్ సింగ్ కీలక నిందితుడుగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన సంస్థ శింభోలీ షుగర్స్ రుణాల చెల్లింపులో విఫలంకావడంతో ఓబీసీ సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసులో పంజాబ్ సీఎం కుమార్తె జై ఇందర్ సింగ్ భర్త, కంపెనీ డిప్యూటీ డైరెక్టర్లలో ఒకరైన గురుపాల్ సింగ్, శింభోలీ సీఎండీ, సీఈవో, సీఎఫ్వో సహా,13మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మొత్తం ఎనిమిది కంపెనీల్లో గురుపాల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నట్టు తెలుస్తోంది. 20111 లో చక్కెర రైతులు 5700మందికి సహాయం చేసే ఉద్దేశంతో ఆర్బీఐ పథకంకింద 150కోట్ల మేర రుణం మంజూరైంది. అయితే ఈ మొత్తం రైతులకు పంపణీ చేయకుండా అక్రమార్గాల్లో కంపెనీ అకౌంట్లో మళ్లించారనేది సీబీఐ ప్రధాన ఆరోపణ. అలాగే శింభోలీ సిబ్బందితోపాటు బ్యాంక్ అధికారులు కొందరిపై సైతం కేసు రిజిస్టర్ అయింది. ఈ వార్తలతో శింబోలి షుగర్స్షేరు 15 శాతం కుప్పకూలి నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, హపూర్, నోయిడాలలో కంపెనీల డైరెక్టర్ల నివాసాలు, ఫ్యాక్టరీ, కార్పోరేట్ ఆఫీస్, రిజిస్ట్రేషన్ ఆఫీసు సహా ఎనిమిది ప్రాంగణాలలో సోదాలు నిర్వహించామని సిబిఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాల్ వెల్లడించారు. నిందితులపై నేరపూరిత కుట్ర, మోసంఅవినీతి నిరోధక చట్టంకింత కేసు నమోదు చేశామన్నారు. సీబీఐ ఎఫ్ఐఆర్ ప్రకారం, 97.85 కోట్ల రూపాయల నగదును బ్యాంకు ప్రకటించగా, అసలు రుణం రూ.109.08 కోట్లకు చేరింది. మరోవైపు ఈ రుణాన్ని తీర్చేందుకు జనవరి 28, 2015 లో రూ.110కోట్ల మరో కార్పొరేట్ రుణాన్ని మంజూరు చేసిన బ్యాంకు మొత్తం రుణాన్ని రూ.113 కోట్లుగా తేల్చింది. అయితే 2016 నవంబరులో ఎన్పీఏగా ప్రకటించింది. కాగా 2017 నవంబరు 17న బ్యాంకు సిబిఐకి ఫిర్యాదు చేయగా, ఫిబ్రవరి 22, 2018 న మాత్రమే నమోదు చేయడం గమనార్హం. -
రూ.1000 కోట్ల ఆస్తులను ఎటాచ్ చేసిన ఈడీ
అహ్మదాబాద్: వేల కోట్ల అప్పుకు ఎగనామం పెట్టి విదేశాల్లో దాక్కున్న జూమ్ డెవలపర్స్ ప్రమోటర్ విజయ్ చౌదరికి ఈడీ చెక్ పెట్టింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మొట్టమొదటిసారి అమెరికాలో చర్యలకు పూనుకుంది. కాలిఫోర్నియాలోని 1000కోట్ల రూపాయల విలువైన 1,280 ఎకరాల భూమిని ఈడీ అటాచ్ చేసింది. దీనికి సంబంధించి స్థానిక కోర్టు నుంచి అనుమతి తీసుకుంది. దీంతోపాటు ఈ భూమిలో ఎలాంటి క్రయవిక్రయాలు జరపడానికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈడీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ మోసమని ఈడీ పేర్కొంది. విదేశాల్లోని ఆస్తులను ఈడీ ఎటాచ్ చేయడం ఇదే మొదటిసారి. ఈ కేసులో దేశంలోని బ్యాంకుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నామని ఈడి వెల్లడించింది. చౌదరి పేరిట అమెరికాలోని కాలిఫోర్నియాలోని కోట్ల విలువైన ఆస్తులను ప్రివెన్షన్ ఆప్ మనీ లాండరింగ్ చట్టం కింద ఎటాచ్ చేసినట్టు తెలిపింది. ఇండోర్, ముంబై కేంద్రంగా వ్యాపారం చేస్తున్న జూమ్ డెవలపర్స్ ప్రమోటర్ విజయ్ చౌదరి యూరప్లో రియల్ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పేరిట దేశంలోని వివిధ బ్యాంకుల నుంచి రూ.2200కోట్లు రుణాలు తీసుకున్నారు. వాటిని తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఎలాంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టకుండా నిధులను మళ్లించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత నెలలో కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన శారద కబ్రాను అరెస్టె చేసిన ఇండోర్ ఈడీ శాఖ చౌదరిపై కూడా అరెస్టు వారంట్ జారీ చేసింది. -
భారతీయ పూజారికి 27 ఏళ్ల జైలు శిక్ష
న్యూయార్క్: అమెరికాలో ఓ భారతీయ పూజారికి 27 ఏళ్ల జైలు శిక్ష పడింది. బ్యాంకు లావాదేవీలు, పన్నుల చెల్లింపు వంటి అంశాల్లో మోసానికి పాల్పడినందుకు అతడికి ఈ శిక్ష ఖరారైంది. భారత సంతతికి చెందిన అన్నామలై అన్నామలై(49)కు స్వామిజీ శ్రీ సెల్వం సిద్ధార్ అనే పేరు కూడా ఉంది. గార్జియాలోని ఓ హిందూ ఆలయానికి అతడు పూజారిగా పనిచేస్తున్నాడు. అయితే ఆలయం ద్వారా వచ్చే ఆదాయాన్ని దైవ కార్యాలకు ఉపయోగించకుండా భారీ మొత్తంలో అక్రమంగా ఆస్తులను పోగేసుకున్నాడని, బ్యాంకు లావాదేవీలకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డాడని అతడిపై కొందరు వ్యక్తులు కేసు పెట్టారు. అతడు ట్యాక్స్లను కూడా ఎగ్గొట్టాడని తెలియడంతో న్యూయార్క్లోని ఓ కోర్టు ఆ స్వామిజీకి 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది.