banking services
-
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అలర్ట్.. 4 రోజులు అంతరాయం
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు (HDFC Bank) సంబంధించిన పలు సేవలు నాలుగు రోజులు అందుబాటులో ఉండవు. ఈ మేరకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది. నిర్వహణ పనుల నిమిత్తం జనవరి 17, 18, 24, 25 తేదీల్లో పలు బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు బ్యాంక్ తెలిపింది.కస్టమర్లకు మెరుగైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వివరించింది. ఏయే తేదీల్లో, ఏయే సమయాల్లో ఎలాంటి సేవలు అందుబాటులో ఉండవనేది కస్టమర్లకు సమాచారం అందించింది.జనవరి 17న తెల్లవారుజామున 2:00 నుండి ఉదయం 5:00 గంటల వరకు 3 గంటల పాటు ఫారెక్స్ ప్రీపెయిడ్ కార్డ్ సర్వీస్ అందుబాటులో ఉండదని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. ఈ సమయంలో ప్రీపెయిడ్ కార్డ్ నెట్బ్యాంకింగ్, ఇన్స్టంట్ రీలోడ్ పోర్టల్ ద్వారా ఫారెక్స్ కార్డ్ రీలోడ్ చేయడం సాధ్యం కాదు. అయితే, వినియోగదారులు నెట్బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించి ఫారెక్స్ కార్డ్లను రీలోడ్ చేయవచ్చు.జనవరి 18, 25 తేదీలలో అర్ధరాత్రి 12:00 నుండి ఉదయం 3:00 వరకు యూపీఐ (UPI) సర్వీస్ అందుబాటులో ఉండదు. ఈ సమయంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కరెంట్, సేవింగ్స్ ఖాతాలపై యూపీఐ లావాదేవీలు, రూపే క్రెడిట్ కార్డ్, హెచ్డీఎఫ్సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్, థర్డ్ పార్టీ యాప్లలో యూపీఐ సర్వీస్ నిలిపేస్తారు. మర్చెంట్ యూపీఐ లావాదేవీలు కూడా ప్రభావితమవుతాయి.ఇక జనవరి 24, 25 తేదీల్లో చాట్బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ (SMS) బ్యాంకింగ్, ఫోన్బ్యాంకింగ్ ఐవీఆర్ (IVR) సేవల్లో అంతరాయం ఉంటుంది. జనవరి 24 రాత్రి 10:00 గంటల నుండి జనవరి 25 మధ్యాహ్నం 2:00 గంటల వరకు (మొత్తం 16 గంటలు) చాట్బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, ఫోన్బ్యాంకింగ్ ఐవీఆర్ సేవలపై పని చేయనున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది. ఈ సమయంలో ఈ సేవలన్నీ వినియోగదారులకు అందుబాటులో ఉండవు.కస్టమర్లకు అలర్ట్హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ అప్డేట్ను రిజిస్టర్డ్ ఈ-మెయిల్ చిరునామా ద్వారా కస్టమర్లకు పంపింది. ఈ తేదీలు, సమయాల్లో ఇతర ఎంపికలను ఉపయోగించాలని సూచించించింది. తమ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఈ అవసరమైన నిర్వహణను పూర్తి చేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. ఈ తేదీలను దృష్టిలో ఉంచుకుని తమ ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలని కస్టమర్లకు సూచించింది. -
గ్రామాల్లో బ్యాంక్ సేవలు విస్తరించాలి
న్యూఢిల్లీ: ఆర్థిక సేవలను మరింత మందికి చేరువ చేయాల్సిన అవసరం ఉందని, చిన్న రుణ గ్రహీతల అవసరాలపై దృష్టి సారించాలని అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఏఐబీవోసీ) కోరింది. దేశవ్యాప్తంగా భిన్న ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యల వార్తలను ప్రస్తావిస్తూ.. ఎన్బీఎఫ్సీలు, స్థానిక రుణదాతలు పెద్ద మొత్తంలో వడ్డీలు వసూ లు చేస్తుండడం, దీనికితోడు ప్రతిఫలం ఇవ్వని పంట మద్దతు ధరలు ఈ పరిస్థితికి కారణమని పేర్కొంది. బ్యాంకుల జాతీయీకరణ దినం సందర్భంగా ఏఐబీవోసీ ప్రకటన విడుదల చేసింది. బ్యాంకుల కార్యకలాపాలు గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తరించాలంటూ.. దీనివల్ల ఎన్బీఎఫ్సీలు, స్థానిక రుణదాతల ఉచ్చులో పడకుండా రైతులను కాపాడొచ్చని అభిప్రాయపడింది. కేవలం 74 వేల గ్రామాలకే బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయన్న ఇటీవలి ఒక నివేదికను ఉటంకించింది. గ్రామీణ పేదలకు రుణ లభ్యత అన్నది ఇప్పటికీ పెద్ద సవాలుగా మిగిలినట్టు ఏఐబీవోసీ జనరల్ సెక్రటరీ రూపమ్ రాయ్ తెలిపారు. విలీనాల తర్వాత బ్యాంక్లు పెద్ద కస్టమర్లకు ప్రాధాన్యం ఇస్తుండడంతో, చిన్న వ్యాపారులకు బ్యాంకు రుణాల అందుబాటు తగ్గిందని.. దీంతో వారు ఎన్బీఎఫ్సీలను ఆశ్రయించాల్సి వస్తోందని చెప్పారు. అధిక వడ్డీ రేట్లు, ఎన్బీఎఫ్సీ రంగం దోపిడీ పద్ధతులు ఎస్ఎంఈలపై పెద్ద భారాన్ని మోపుతోందంటూ.. అది వాటి వృద్ధిని అడ్డుకుంటున్నట్టు తెలిపారు. ప్రైవేటీకరణ పరిష్కారం కాదు.. బ్యాంక్ల ప్రైవేటీకరణ, పెద్ద బ్యాంక్ల మధ్య స్థిరీకరణ అన్నవి ఆర్థిక సేవల మార్కెట్లో సమస్యలకు పరిష్కారాలు ఎంత మాత్రం కోబోవని ఏఐబీవోసీ ప్రకటన పేర్కొంది. ప్రైవేటీకరణ అన్నది సామాజిక అవసరాల కంటే సాధ్యమైనంత లాభాలు పొందడానికి దారితీస్తుందని, అది ఆర్థిక అసమానతలను మరింత పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఒకప్పుడు 26 వరకు ప్రభుత్వరంగ బ్యాంక్లు ఉండగా, విలీనాలతో 12 బ్యాంక్లు మిగలడం తెలిసిందే. దీన్ని ప్రైవేటీకరణకు దొడ్డిదారిగా ఏఐబీవోసీ అభివరి్ణంచింది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం, 2020 కరోనా విపత్తు సమయంలో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచిన ప్రభుత్వరంగ బ్యాంక్ల కృషిని ఈ చర్యలు పట్టించుకోకపోవడమేనని పేర్కొంది. ప్రభుత్వరంగ బ్యాంక్ల విలీనంతో అవి మార్కెట్ వాటా ను కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2017–18 నాటికి మొత్తం డిపాజిట్లలో 66 శాతంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంక్ల వాటా 2023 డిసెంబర్ నాటికి 59 శాతానికి క్షీణించినట్టు ప్రకటనలో వివరించింది. -
విదేశాల్లో పెరిగిన భారత బ్యాంకు శాఖలు
ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో భారతీయ బ్యాంకుల విదేశీ అనుబంధ సంస్థలు, శాఖల సంఖ్య 417కి చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇవి 399గా ఉన్నాయి. ఉద్యోగుల సంఖ్య విదేశీ శాఖల్లో 0.5 శాతం, అనుబంధ సంస్థల్లో 6.2 శాతం పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన 2022–23 ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. విదేశాల్లో శాఖలు, అనుబంధ సంస్థలున్న 14 భారతీయ బ్యాంకులు, అలాగే భారత్లో శాఖలు, అనుబంధ సంస్థలున్న 44 విదేశీ బ్యాంకులపై ఈ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం భారత్లో విదేశీ బ్యాంకుల శాఖలు, ఉద్యోగుల సంఖ్య తగ్గింది. -
ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్! ఇంటి వద్దకే ప్రభుత్వ బ్యాంక్ సేవలు
ప్రముఖ పబ్లిక్ సెక్టార్ ఇండియన్ బ్యాంక్ (Indian Bank) కస్టమర్ల కోసం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ‘ఐబీ సాథీ’ (IB SAATHI - సస్టైనబుల్ యాక్సెస్ అండ్ అలైనింగ్ టెక్నాలజీ ఫర్ హోలిస్టిక్ ఇన్క్లూజన్)ను రూపొందించింది. ‘ఐబీ సాథీ’ కస్టమర్లకు అవసరమైన ప్రాథమిక బ్యాంకింగ్ సేవలతో పాటు అదనపు సర్వీసులు అందించడాన్ని సులభతరం చేస్తుంది. ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎస్ఎల్ జైన్ చెన్నైలోని తమ కార్పొరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రాథమిక బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యం ‘ఐబీ సాథీ’ కార్యక్రమం ద్వారా ఇండియన్ బ్యాంక్ తన అన్ని శాఖలలో రోజుకు కనీసం నాలుగు గంటల పాటు కస్టమర్లకు ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతోపాటు అదనంగా బ్యాంక్ కరస్పాండెంట్లు నేరుగా కస్టమర్ల ఇంటి వద్దకే వెళ్లి సేవలు అందిస్తారు. (కస్టమర్లకు షాకిచ్చిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్! సెప్టెంబర్ 21 నుంచే..) ఇందు కోసం 2024 మార్చి నాటికి సుమారు 5,000 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోవాలని ఇండియన్ బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. దీని వల్ల కస్టమర్లకు మరింత చేరువ కావచ్చని భావిస్తోంది. 36 రకాల సేవలు ఇండియన్ బ్యాంక్కు ప్రస్తుతం 10,750 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, 10 మంది కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్లు ఉన్నారు. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా బ్యాంకింగ్ కరస్పాండెంట్ల సంఖ్యను 15,000లకు, కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్ల సంఖ్య 15కు పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్ తన బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఛానెల్ ద్వారా కస్టమర్లకు 36 రకాల సేవలు అందిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 60కి పైగా సేవలు పెరగనున్నాయి. -
వాట్సాప్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు
న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వాట్సాప్ ద్వారా బ్యాంకు సేవలను ప్రారంభించింది. ఇందుకోసం భారతీ ఎయిర్టెల్తో చేతులు కలిపింది. పలు బ్యాంకు సర్వీసులతోపాటు ఇంటి వద్ద సేవల కోసం వినతి, సమీపంలోని పోస్ట్ ఆఫీస్ శాఖ ఎక్కడ ఉంది వంటివి వాట్సాప్ ద్వారా ఖాతాదారులు తెలుసుకోవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్నకు 4.51 లక్షల పైచిలుకు కస్టమర్లు ఉన్నారు. లైవ్ ఇంటెరాక్టివ్ కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ను సైతం వాట్సాప్లో పరిచయం చేయనున్నారు. -
కస్టమర్ను దేవునిగా చూడండి
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ సేవలను మరింత మెరుగుపరచాలని ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్ కే కరాద్ బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా బ్యాంకులు తమ ఖాతాదారులను దేవుడిలా చూడాలని కోరారు. బ్యాంకులు కస్టమర్లకు వచ్చే ఇబ్బందులు తగ్గించడంపై పూర్తి దృష్టి పెట్టాలని అన్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నిర్వహించిన కస్టమర్ మీట్ కార్యక్రమంలో కరాద్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా బ్యాంకులు పటిష్టంగా ఉండడానికి కస్టమర్లూ పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇందులో భాగంగా రుణాల చెల్లింపులో వారు పూర్తి క్రమశిక్షణను పాటించాలని విజ్ఞప్తి చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) స్కీమ్ను మరింత మంది రైతులకు విస్తరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. డిజిటలైజేషన్పై తమ బ్యాంక్ అత్యధిక దృష్టి సారిస్తున్నట్లు కార్యక్రమంలో పాల్గొన్న బీఓఎం మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్ రాజీవ్ తెలిపారు. -
శక్తికాంత్కు 'గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023' అవార్డు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్కు ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు’ లభించింది. మహమ్మారి కరోనా సంక్షోభం, ఉక్రెయిన్పై రష్యా దాడి, భౌగోళిక ఉద్రిక్తతల వంటి అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో ఫైనాన్షియల్ మార్కెట్లను సమర్థవంతంగా నడిపిస్తున్నందుకుగాను ఇంటర్నేషనల్ పబ్లికేషన్ సెంట్రల్ బ్యాంకింగ్ శక్తికాంతదాస్ను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికచేసింది. భారత దేశం నుంచి 2015లో మొట్టమొదటిసారి అప్పటి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్కు ఈ అవార్డు దక్కింది. కీలక సమయాల్లో గవర్నర్ శక్తికాంతదాస్ పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని ఇంటర్నేషనల్ పబ్లికేషన్ తాజాగా పేర్కొంది. పేమెంట్ వ్యవస్థసహా పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారని తెలిపింది. కరోనా మహమ్మారిని ప్రస్తావిస్తూ, కీలక సవాలును భారత్ ఎదుర్కొనగలిగినట్లు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు అందరూ భిన్నమైన ప్రాధాన్యతలను కలిగి ఉన్న ప్రభుత్వాలతో కలిసి పనిచేయడంలో సాధారణంగా కష్టాలు ఎదుర్కొంటుంటారని పేర్కొన్న పబ్లికేషన్, ఆయా సమన్వయ చర్యల్లో దాస్ చక్కటి ప్రగతి సాధించగలిగారని వివరించింది. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో దాస్ మాట్లాడుతూ, వైరస్ను ఎదుర్కొనడానికి నిరంతర పోరాటం అవసరం అన్నారు. ఇటు సాంప్రదాయ పద్ధతుల్లో అటు అసాధరణమైన రీతిలో ఈ పోరాట చర్యలు ఉండాలన్నారు. -
మినీ బ్యాంక్లు ఆర్బీకేలు.. రైతుల చెంతకే బ్యాంకింగ్ సేవలు
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు ఇప్పటికే ఎన్నో సేవలు అందిస్తున్న ఆర్బీకేలు.. మరో సేవకు సిద్ధమయ్యాయి. ఇకపై పల్లెల్లో అత్యవసర సమయంలో ఆర్థిక అవసరాలనూ తీర్చనున్నాయి. అందులో భాగంగా బ్యాంక్లు, ఏటీఎంల పాత్రలను పోషించనున్నాయి. తక్షణ అవసరం నిమిత్తం రూ.20 వేల వరకు సమకూర్చేందుకు జగనన్న ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఏర్పాటు ప్రధానంగా రైతుల కోసం చేసినా ప్రజలు కూడా సద్వినియోగం చేసుకునే వెసులు బాటూ కల్పించడంతో అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి,నంద్యాల: అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరో అడుగు ముందుకేసి ఆర్థిక సేవలనూ వారి ముంగిట్లోకే తెచ్చింది. రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పటి వరకు అందుతున్న సేవలతో పాటు బ్యాంకు సేవలనూ ప్రవేశపెట్టింది. పల్లె రైతులు, ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లకుండా అవసరమైనప్పుడు ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. అందుకు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న 874 రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంక్ల సాయంతో 587 మంది బిజినెస్ కరస్పాండెంట్లను నియమించింది. వీరి ద్వారా రైతులకు అవసరమైన చిన్నచిన్న లావాదేవీలను బ్యాంకుల వద్దకు వెళ్లకుండా పూర్తి చేస్తోంది. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిబంధనల ప్రకారం 5 వేల జనాభా ఉన్న ప్రతి గ్రామంలో బ్యాంకు బ్రాంచ్ ఏర్పాటు చేయాలి. కానీ బ్యాంకుల విలీనంతో కొత్త బ్రాంచ్లు ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోయినా బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా రైతులు, పల్లె ప్రజల అవసరాలను తీర్చనుంది. 587 మంది బిజినెస్ కరస్పాండెంట్లు నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 874 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వాటిలో రైతులు ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునేందుకు వివిధ బ్యాంకులకు చెందిన 587 మంది బిజినెస్ కరస్పాండెంట్లను ఏర్పాటు చేశారు. వీరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 2.47 లక్షల మంది రైతులతోపాటు ప్రజలకు కూడా ఈ సేవలు అందిస్తారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు ఇప్పటికే ఎన్నో సేవలు అందిస్తున్న ఆర్బీకేలు.. మరో సేవకు సిద్ధమయ్యాయి. ఇకపై పల్లెల్లో అత్యవసర సమయంలో ఆర్థిక అవసరాలనూ తీర్చనున్నాయి. అందులో భాగంగా బ్యాంక్లు, ఏటీఎంల పాత్రలను పోషించనున్నాయి. తక్షణ అవసరం నిమిత్తం రూ.20 వేల వరకు సమకూర్చేందుకు జగనన్న ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఏర్పాటు ప్రధానంగా రైతుల కోసం చేసినా ప్రజలు కూడా సద్వినియోగం చేసుకునే వెసులు బాటూ కల్పించడంతో అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సమయం వృథా అయ్యేది ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం సంతోషకరం. మా గ్రామంలో బ్యాంకు కానీ, ఏటీఎం కానీ లేకపోవడంతో నగదు తీసుకోవాలన్నా, ఖాతాలోకి వేయాలన్నా నంద్యాలకు వెళ్లాల్సి ఉండేది. దీని వల్ల సమయం వృథా అయ్యేది. జగనన్న ప్రభుత్వం ఆర్బీకేల్లోనే బ్యాంకింగ్ సేవలు పెట్టడంతో ఆ బాధలు తప్పాయి. బ్యాంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. 4 కి.మీ వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామంలోనే డబ్బులు తీసుకుంటున్నాం. జమ చేస్తున్నాం. – బంగారురెడ్డి, రైతు, చాబోలు సేవలకు రుసుమేమీ లేదు ప్రతిరోజూ బిజినెస్ కరస్పాండెంట్లు గంట నుంచి 2 గంటల పాటు ఆర్బీకేల్లో వేచి ఉంటారు. ఆయా గ్రామాల్లో రైతుల వెసులుబాటును బట్టి సమయాన్ని సర్దుబాటు చేసుకునే విధంగా బిజినెస్ కరస్పాండెంట్లకు ఆదేశాలు జారీ చేశాం. 2 వేల జనాభా కలిగిన గ్రామాల్లో ఈ ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినప్పటికీ ఆర్బీకే ఉన్న ప్రతి గ్రామంలో రైతులు సద్వినియోగం చేసుకోవచ్చు. ఏ ఒక్కరు కూడా బిజినెస్ కరస్పాండెంట్లకు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. -వెంకటనారాయణ, లీడ్ బ్యాంక్ మేనేజర్, కర్నూలు -
గడప గడపకీ విస్తరిస్తున్న బ్యాంకింగ్ సేవలు
సాక్షి, అమరావతి: కోవిడ్ భయాలు వెంటాడుతున్నప్పటికీ గత మూడేళ్లుగా రాష్ట్రంలో గడప వద్దకే బ్యాంకింగ్ సేవలు గణనీయంగా విస్తరించాయి. డిపాజిట్లు, రుణాలు, ప్రాధాన్యతా రంగ రుణాలు, బ్యాంకు శాఖల విస్తరణ, ఏటీఎంలు ఇలా అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి నమోదైనట్లు రాష్ట్ర బ్యాంకర్ల సంఘం (ఎస్ఎల్బీసీ) తాజా నివేదికలో పేర్కొంది. ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో చేపట్టిన ‘ఆర్థిక సేవల సమ్మిళిత వృద్ధి (ఫైనాన్షియల్ ఇన్క్లూజన్)’ కార్యక్రమంలో భాగంగా రాష్రంలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ (బీసీ)ల సేవలు గణనీయంగా పెరిగాయి. 2020 మార్చి నాటికి 6,264 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఉండగా 2022 మార్చి నాటికి 38,295 మందికి చేరింది. ఇండియన్ పోస్టల్ బ్యాంక్, ఫినోపేమెంట్ బ్యాంక్ కరస్పాండెంట్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సేవలను అందుబాటులోకి తెచ్చామని, దీని ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల నగదు బదిలీ నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతున్నట్లు రాష్ట్ర ఎస్ఎల్బీసీ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. 5,000 జనాభా ఉన్న గ్రామాలన్నింటికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తేవాలన్న ఆర్బీఐ నిబంధనల ప్రకారం మన రాష్ట్రంలో 567 గ్రామాల్లో కోర్ బ్యాంకింగ్ సేవలను (సీబీఎస్) అందుబాటులోకి తెచ్చారు. ప్రతి 5 కిలోమీటర్లకు బ్యాంకింగ్ సేవలు ఉండాలన్న నిబంధనల ప్రకారం రాష్ట్రంలో 243 గ్రామాలను గుర్తించారు. ఇందులో 229 గ్రామాలకు బీసీలు, పోస్టాఫీసుల ద్వారా సేవలు అందిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో 334 గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి రైతు భరోసా కేంద్రం, సచివాలయాల వద్ద బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. లక్ష్యానికి మించి రుణాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో గత మూడేళ్లుగా రాష్ట్రంలో మొత్తం రుణాలు లక్ష్యానికి మించి మంజూరవుతున్నాయి. 2021–22 ఆర్థిక సంవత్సరానికి పారిశ్రామిక రంగం కాకుండా ఇతర రంగాలకు మొత్తం రూ.2,83,380 కోట్లు రుణాలుగా ఇవ్వాలని ఎస్ఎల్బీసీ లక్ష్యంగా నిర్దేశించుకోగా ఏకంగా 33 శాతం అధికంగా రూ.3,77,436 కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం మొత్తం రుణాల్లో 40 శాతం ప్రాధాన్యత రంగాలకు ఇవ్వాలి. ఇది మన రాష్ట్రంలో 64.97 శాతంగా ఉంది. 2021–22 సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకు రూ.3,26,871 కోట్లు మంజూరయ్యాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం వ్యవసాయ రంగానికి బ్యాంకులు కనీసం 18 శాతం రుణాలు ఇవ్వాల్సి ఉండగా 42.17% రుణాలను మంజూరు చేశాయి. వ్యవసాయ రంగానికి రూ.1,48,500 కోట్లు రుణాలు లక్ష్యంగా నిర్దేశించుకుంటే బ్యాంకులు ఏకంగా రూ.2,12,170 కోట్లు మంజూరు చేశారు. అలాగే ఎంఎస్ఎంఈ రంగానికి రూ.44,500 కోట్ల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా రూ.44,815 కోట్లు మంజూరు చేశాయి. -
గ్రామాల్లో ‘ఎనీ టైం మనీ’
సాక్షి, అమరావతి: చాలా గ్రామాలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. ఉన్నా అరకొరగానే ఉంటాయి. ఏటీఎంల సంగతి సరేసరి. డబ్బులు తీసుకోవాలంటే మైళ్లకొద్దీ దూరం వెళ్లాలి. తీరా అక్కడికి వెళ్లాక ఏటీఎంలో డబ్బులు లేకపోతే మరో ఏటీఎంకి ప్రయాణం కట్టాలి. ఇది గ్రామీణ ప్రజలు నిత్యం అనుభవిస్తున్న కష్టం. ఈ కష్టాన్ని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామీణులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు అందుబాటులో ఉండేలా ఆర్బీకేలలోనే ఏటీఎంలను ఏర్పాటు చేయిసున్నారు. వాటిలో ఎప్పుడూ నగదు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో గ్రామీణులకు వ్యవసాయ ఉత్పాదకాలు, ఉపకరణాలతోపాటు నగదు కూడా అందుబాటులోకి వచ్చింది. ఇందుకు ఉదాహరణే ఈ రైతు.. పేరు ఆచంట శ్రీనివాసరావు. తూర్పు గోదావరి జిల్లా కురుకూరు. గతంలో ఏది కావాలన్నా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రమైన దేవరాపల్లికి వెళ్లేవారు. గ్రామంలో ఆర్బీకే ఏర్పాటు చేశాక ఇప్పుడు అన్నీ అక్కడే దొరుకుతున్నాయి. గ్రామం దాటి వెళ్లకుండానే బ్యాంకింగ్ సేవలు కూడా పొందుతున్నారు. 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లంట్ల ఆర్బీకే వద్ద ఏర్పాటు చేసిన ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్బీకే, ఏటీఎంల వల్ల వ్యయప్రయాసలు తగ్గాయని శ్రీనివాసరావు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. గ్రామీణుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు గ్రామ స్థాయిలో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తేవాలని సంకల్పించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఆర్బీకేలకు అనుసంధానం చేసింది. ప్రతి ఆర్బీకే వద్ద ఏటీఎంలు ఏర్పాటు చేస్తోంది. రైతుల్లో ఆర్ధిక అక్షరాస్యతను పెంపొందించడం, మొబైల్, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించడం, పేపర్లు లేని (పేపర్లెస్) ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించడం లక్ష్యంగా గ్రామ స్థాయిలో బ్యాంకింగ్ సేవలను విస్తరిస్తోంది. ఇప్పటికే 9,160 ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అందుబాటులోకి వచ్చారు. మిగిలిన ఆర్బీకేల్లోనూ వీరి నియామకానికి బ్యాంకులు సన్నాహాలు చేస్తున్నాయి. పైలట్ ఏటీఎంలకు అనూహ్య స్పందన ప్రభుత్వ పిలుపు మేరకు ఆర్బీకేల వద్ద యూనియన్ బ్యాంక్ ఏటీఎంలు ఏర్పాటు చేస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకో ఆర్బీకే వద్ద ఏటీఎంలు ఏర్పాటు చేసింది. వీటి పనితీరుపై బ్యాంక్ అధ్యయనం చేసింది. ఈ ఏటీఎంలను ఆర్బీకేల పరిధిలోని ఏడు నుంచి పది గ్రామాలకు చెందిన పదివేల మందికి పైగా రైతులు, ప్రజలు వినియోగించుకుంటున్నట్టు గుర్తించారు. ప్రతి రోజూ 50 నుంచి 100 హిట్స్ వస్తున్నాయని, ప్రతి ఏటీఎం నుంచి రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు నగదు తీసుకుంటున్నట్లు గుర్తించారు. పల్లంట్ల ఆర్బీకే ఏటీఎం ది బెస్ట్ తూర్పు గోదావరి జిల్లా దేవరాపల్లి మండలం పల్లంట్ల ఆర్బీకేలో తొలి ఏటీఎం ఏర్పాటు చేశారు. ఇది బెస్ట్ ఏటీఎంగా నిలిచినట్టు యూనియన్ బ్యాంక్ ప్రకటించింది. పల్లంట్లతో పాటు కురుకూరు, లక్ష్మీపురం, త్యాజంపూడి, చిక్కాల, దూమంతుని గూడేనికి చెందిన 10 వేల మందికిపైగా ఈ ఏటీఎంను ఉపయోగించుకుంటున్నారు. గతంలో వీరంతా సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరాపల్లి (మండల కేంద్రం)కి వెళ్లేవారు. గత సంవత్సరం నవంబర్లో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎం రైతులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ ఏటీఎంను రోజుకు 75 నుంచి 100 మంది వరకు ఉపయోగించుకుంటున్నట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు. రోజుకు సుమారు రూ.4 లక్షలు విత్డ్రా అవుతున్నట్లు వెల్లడైంది. ఏ సమయానికి వెళ్లినా నగదు అందుబాటులో ఉండటంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నో క్యాష్ బోర్డు చూడలేదు నేను 16 ఎకరాల్లో మిరప, మొక్కజొన్న, కర్రపెండలం సాగు చేస్తున్నా. గతంలో ఏది కావాలన్నా దేవరాపల్లి వెళ్లే వాళ్లం. ఇప్పుడు పల్లంట్లలో ఏర్పాటు చేసిన ఆర్బీకే మా అవసరాలన్నీ తీరుస్తోంది. ఇక్కడి ఏటీఎంలో ఎప్పుడు వెళ్లినా డబ్బు ఉంటుంది. నో క్యాష్ బోర్డు ఎప్పుడూ చూడలేదు. –వి.కిషోర్, లక్ష్మీపురం, తూర్పు గోదావరి చాలా సౌకర్యంగా ఉంది నేను 18 ఎకరాల్లో ఆయిల్ పామ్, వరి, మినుము, జీడిమామిడి సాగుచేస్తా. ఇంతకు ముందు డబ్బుల కోసం చాలా అవస్థలు పడే వాడిని. ఏటీఎం, బ్యాంకు శాఖలకు వెళ్లాలంటే చాలా సమయం, ఖర్చు ఎక్కువగా ఉండేది. ఇప్పుడా అవస్థలు లేవు. మా గ్రామం ఆర్బీకేలోనే ఏటీఎం ఏర్పాటు చేయడంతో చాలా సౌకర్యంగా ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లి డబ్బులు తెచ్చుకోగలుగుతున్నాం. – గాంధీప్రసాద్, పల్లంట్ల, తూర్పు గోదావరి ఆర్బీకే ఏటీఎంలకు స్పందన బాగుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం మేరకు ఆర్బీకేల వద్ద పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన ఏటీఎంలకు మంచి స్పందన లభిస్తోంది. మండల కేంద్రాలు, నగరాల్లో చాలా ఏటీఎంలకు లభించని ఆదరణ ఇక్కడ లభిస్తోంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మరిన్ని ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నాం. ఆర్బీకేల వద్ద ఏటీఎంల ఏర్పాటుకు మిగిలిన బ్యాంకులు కూడా ముందుకొస్తున్నాయి. మలి దశలో కనీసం 100 ఏటీఎంలు ఏర్పాటు చేయాలని సంకల్పించాం. – వి.బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్ఎల్బీసీ -
అలా చేస్తే వినియోగదారుల పరిధిలోకి రారు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బ్యాంకు సర్వీసులను ’వ్యాపార అవసరాల’కు ఉపయోగించుకునే వ్యక్తులను ‘వినియోగదారు’గా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ వినియోగదారు పరిధిలోకి రావాలంటే.. తాను స్వయం ఉపాధి ద్వారా జీవిక పొందేందుకు మాత్రమే బ్యాంకు సేవలను ఉపయోగించుకున్నట్లు రుజువు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. వ్యాపార లావాదేవీలను వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం పరిధిలోకి రానివ్వకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఓ సవరణ చేసిందని సుప్రీంకోర్టు తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు–శ్రీకాంత్ జి మంత్రి ఘర్ మధ్య ఓవర్డ్రాఫ్ట్ వివాదానికి సంబంధించిన కేసులో అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ శ్రీకాంత్.. సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో తాజా ఆదేశాలు వెలువడ్డాయి. -
బ్యాంకింగ్ కరస్పాండెంట్లు వచ్చేశారు
సాక్షి, అమరావతి : వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) పూర్తిస్థాయి బ్యాంకింగ్ సేవలు అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆశయం కార్యరూపం దాలుస్తోంది. ప్రభుత్వ కృషి ఫలితంగా ప్రతీ ఆర్బీకే పరిధిలో ఓ బ్యాంకింగ్ కరస్పాండెంట్ను ఆయా బ్యాంకులు కేటాయించాయి. నగదు జమ, ఉపసంహరణలతో పాటు సాగు ఉత్పాదకాల కొనుగోళ్లు.. కూలీలు, యాంత్రీకరణకు నగదు బదిలీతో సహా కొత్త రుణాల మంజూరు, పాత రుణాల నవీకరణ వంటి సేవలను కూడా ఈ కరస్పాండెంట్ల ద్వారా అందిస్తున్నారు. రైతుల విలువైన సమయం ఆదాకు.. రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేలున్నాయి. వీటిలో 234 అర్బన్ ప్రాంతంలోనూ, 10,544 గ్రామీణ ప్రాంతంలో రైతులకు సేవలందిస్తున్నాయి. సీజన్లో రుణాల మంజూరు, రీషెడ్యూళ్లతో పాటు వివిధ రకాల బ్యాంకింగ్ సేవల కోసం రైతులు పడరాని పాట్లు పడేవారు. పంటకాలంలో విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణాలు చేసేవారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ఆర్బీకేల ద్వారా బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం వైఎస్ జగన్ ఆలోచన మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ దిశగా బ్యాంకులు కూడా అడుగులు వేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో 24 ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు సేవలందిస్తున్నాయి. నిజానికి శాఖలులేని ప్రాంతాల్లో వాటి కార్యకలాపాల కోసం ఆయా బ్యాంకులు గతంలోనే 10,916 మంది కరస్పాండెంట్లను నియమించుకున్నాయి. వీరిలో 503 మంది చురుగ్గాలేరు. ప్రస్తుతం 10,413 మంది సేవలందిస్తున్నారు. ప్రధానంగా.. ఎస్బీఐ పరిధిలో 3,289 మంది, యూనియన్ బ్యాంక్ పరిధిలో 1,320 మంది, ఏపీజీవీబీ పరిధిలో 1,091, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్కు 990, కెనరా బ్యాంకుకు 831, ఇండియా ఫస్ట్ బ్యాంకుకు 686 మంది ఉన్నారు. మరికొన్నింటిలో మిగిలిన వారు కొనసాగుతున్నారు. వీరిలో 9,160 మంది గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్నట్లుగా గుర్తించారు. వీరందరినీ సమీప ఆర్బీకేలతో మ్యాపింగ్ చేశారు. అలాగే, వైఎస్సార్ కడప, విశాఖపట్నం జిల్లాల్లోని ఆర్బీకేలకు నూరు శాతం కరస్పాండెంట్లు అందుబాటులో ఉన్నట్లు గుర్తించగా.. 1,618 ఆర్బీకేలకు కరస్పాండెంట్లు లేరు. ఈ ప్రాంతాల్లోని ఆర్బీకేలను సమీప కరస్పాండెంట్లతో మ్యాపింగ్ చేశారు. ఇలా ఒకటి కంటే ఎక్కువ ఆర్బీకేల బాధ్యతలు చూసేవారు రోజు విడిచి రోజు ఆయా ఆర్బీకేల్లో విధులు నిర్వర్తించేలా ఆదేశాలిచ్చారు. ఇక పూర్తిస్థాయిలో కరస్పాండెంట్లు అందుబాటులో ఉన్న ఆర్బీకేల్లో వారు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్బీకేల్లో సేవలందిస్తున్నారు. ఆర్బీకేల్లో అందుతున్న బ్యాంకింగ్ సేవలివే.. ► మొబైల్ స్వైపింగ్ మిషన్ ద్వారా విత్డ్రా చేసుకునేందుకు వీలుగా ప్రతీ బ్యాంకింగ్ కరస్పాండెంట్ పరిధిలో గరిష్టంగా రూ.25వేల వరకు ఉంచుతున్నారు. ► ఖాతాల్లేని రైతులతో బ్యాంకు ఖాతాలు తెరిపించడం, నగదు జమ చేయించడం, పంట రుణాల మంజూరు కోసం దగ్గరుండి డాక్యుమెంటేషన్ చేయించడం చేస్తున్నారు. ► బ్యాంకింగ్ లావాదేవీలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ► ఆన్లైన్, నెట్ బ్యాంకింగ్ (డిజిటల్ పేమెంట్లు) కార్యకలాపాలపై శిక్షణనిస్తున్నారు. ► ప్లాస్టిక్ మనీ వినియోగాన్ని పెంచే దిశగా రైతుల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతీ ఆర్బీకేకు ఓ కరస్పాండెంట్ ఆర్బీకేల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల మేరకు బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోవాలని బ్యాంకులన్నింటికీ ఆదేశాలిచ్చాం. ఆర్బీకేలున్న ప్రతీచోట సమీప బ్యాంకులకు చెందిన కరస్పాండెంట్లు సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో పూర్తిస్థాయిలో బ్యాంకింగ్ కార్యకలాపాలను ఆర్బీకేల ద్వారానే అందించేందుకు కార్యాచరణ సిద్ధంచేస్తున్నాం. – వి. బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్ఎల్బీసీ -
రైతుభరోసా కేంద్రాల్లో ఇక బ్యాంకింగ్ సేవలు..
సాక్షి,కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన రైతుభరోసా కేంద్రాలు మినీ బ్యాంకులుగా మారబోతున్నాయి. ఇప్పటికే ఆర్బీకేల ద్వారా రైతులకు వ్యవసాయ, అనుబంధశాఖలకు చెందిన అన్ని రకాల సేవలు అందుతున్నాయి. ఇక నుంచి బ్యాంకింగ్ సేవలు రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజల ముంగిటకు చేరనున్నాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం 5000 జనాభా ఉన్న గ్రామాల్లో బ్యాంకులు నెలకొల్పాల్సిన అవసరం ఉంది. బ్యాంకుల విలీనంతో కొత్త బ్యాంకులు ఏర్పాటు చేసే అవకాశాలు లేవు. బ్యాంక్ బ్రాంచ్ స్థానంలో వివిధ బ్యాంకులు బిజినెస్ కరస్పాండెంట్లను ఏర్పాటు చేసుకొని కొన్ని గ్రామాల్లో సేవలు అందిస్తున్నాయి. అయితే గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఆర్బీకేల్లోని ఈ సేవలు అందేలా ఏర్పాటు చేశారు. జిల్లాలో 877 రైతుభరోసా కేంద్రాలు ఉన్నాయి. వివిధ బ్యాంకులకు సంబంధించి 804 మంది బిజినెస్ కరస్పాండెంట్లు ఉన్నారు. వీరి ద్వారా ఆర్బీకేల్లోనే బ్యాంకింగ్ సేవలు అందించడానికి లీడ్ డి్రస్టిక్ట్ మేనేజర్ (ఎల్డీఎం) ఏర్పాట్లు పూర్తి చేశారు. బిజినెస్ కరస్పాండెంట్లను ఆర్బీకేలతో మ్యాపింగ్ చేయడాన్ని పూర్తి చేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఆర్బీకేల్లో బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఎల్డీఎం దగ్గరి నుంచి మార్గదర్శకాలుపంపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎంలు ఏర్పాటు చేయకపోవడంతో నగదు తీసుకోవాలన్నా.. నగదు జమ చేయాలన్నా.. నగదు బదిలీ చేయాలన్నా దూరప్రాంతంలోని బ్యాంకులకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో తీవ్ర వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. ఇక నుంచి ఆర్బీకేల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తుండటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. రూ.20 వేల వరకు అవకాశం ఆర్బీకేల ద్వారా నగదు ఉపసంహరణ (విత్డ్రా), నగదు జమ (డిపాజిట్)తో పాటు నగదు బదిలీ కూడా చేసుకునే అవకాశం సోమవారం నుంచే అందుబాటులోకి రానుంది. బ్యాంకు ఖాతాల్లో నగదు ఉంటే ఆర్బీకేల నుంచి బిజినెస్ కరస్పాండెంటు ద్వారా రూ.20 వేల వరకు నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. రూ.20 వేల వరకు నగదు జమ చేయవచ్చు. నగదు ట్రాన్స్ఫర్ మాత్రం రూ.10 వేల వరకు చేసుకోవచ్చు. బిజినెస్ కరస్పాండెంట్ల పని వేళలు త్వరలో నిర్ణయించనున్నారు. వారికి బ్యాంకులు ఇచ్చిన స్వైపింగ్ మిషన్లు, ట్యాబ్ల ద్వారా వారు ఆన్లైన్లోనే బ్యాంకింగ్ సేవలు అందించనున్నారు. -
ఆంధ్రప్రదేశ్లో మోడరన్ బ్యాం‘కింగ్
సాక్షి, అమరావతి: ఒకప్పుడు నగదు విత్ డ్రా చేయాలన్నా.. నగదు జమ చేయాలన్నా గంటల కొద్దీ బ్యాంకుల్లో పడిగాపులు కాయాల్సి వచ్చేది. పనులన్నీ మానుకొని.. టోకెన్ నంబర్ ఎప్పుడు పిలుస్తారో అని కాచుకొని కూర్చోవాల్సి వచ్చేది. అదే ఏ అర్ధరాత్రో, అపరాత్రో డబ్బులకు అత్యవసర పరిస్థితి ఎదురైతే.. పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సంప్రదాయ బ్యాంకింగ్ సేవల స్థానాన్ని వెనక్కి నెడుతూ.. పనులు వేగంగా, సులువుగా, సజావుగా జరిగేలా మోడరన్ బ్యాంకింగ్ దూసుకువచ్చింది. వీధివీధికి ఏటీఎంలు వెలిశాయి. యాప్ల రూపంలో చేతుల్లోకే బ్యాంకు సేవలు వచ్చేశాయి. చిటికెలో పనులు పూర్తయిపోతున్నాయి. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలు ఈ సేవలను అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉన్నారు. ఏటీఎం, క్యూఆర్ కోడ్ తదితరాల ద్వారా పొందే ఆధునిక బ్యాంకింగ్ సేవలను రాష్ట్ర గ్రామీణ ప్రజలు అధికంగా వినియోగిస్తున్నారు. ఈ విషయం నాబార్డ్ ఆలిండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ సర్వే(ఎన్ఏఎఫ్ఐఎస్)లో వెల్లడైంది. మోడరన్ బ్యాంకింగ్, సంప్రదాయ బ్యాంకింగ్ సేవల వినియోగంతో పాటు ఎన్ఏఎఫ్ ఇండెక్స్లో దేశీయ సగటు కంటే మెరుగైన పనితీరును ఆంధ్రప్రదేశ్ కనబరిచింది. రూపే కార్డులు, నెట్ బ్యాంకింగ్తో ముందుకు.. ఎన్ఏఎఫ్ ఇండెక్స్లో దేశవ్యాప్త సగటు 0.337 పాయింట్లుగా ఉంటే ఏపీ మాత్రం 0.473 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది. మోడరన్ బ్యాంకింగ్ సేవల వినియోగంలో 0.703 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది. ఈ విభాగాల్లో 1, 2, 3 స్థానాల్లో ఉన్నది గోవా, మణిపూర్, నాగాలాండ్ వంటి చిన్న రాష్ట్రాలే. పెద్ద రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నట్టేనని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంక్ లేదా, పోస్టాఫీసుల్లో ఖాతాలు ప్రారంభించడంతో పాటు రూపే కార్డులు, ఆధార్తో అనుసంధానం, నెట్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలు కల్పించారు. వారంతా ఇంటి వద్ద నుంచే బ్యాంకింగ్ సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56,92,293 జన్ధన్ ఖాతాలుండగా.. అందులో 79 శాతం ఖాతాలకు రూపే కార్డులిచ్చారు. 89.15 శాతం ఖాతాలను ఆధార్తో అనుసంధానం చేశారు. ఇక సంప్రదాయ బ్యాంకింగ్ సేవల వినియోగంలో ఏపీ 0.424 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో పంజాబ్ మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో కేరళ, కర్నాటక, తెలంగాణ, గోవా, హిమాచల్ప్రదేశ్లున్నాయి. పూర్తి డిజిటల్ జిల్లాగా వైఎస్సార్ రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలన్నీ పూర్తిగా డిజిటల్ రూపంలో మార్చాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తొలుత వైఎస్సార్ జిల్లాను 100 శాతం డిజిటల్ జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకుంది. వైఎస్సార్ జిల్లాలో మొత్తం 31,83,960 సేవింగ్ ఖాతాలుండగా.. అందులో ఇప్పటి వరకు 88 శాతం ఖాతాలకు రూపే కార్డులు మంజూరు చేశారు. 24 శాతం మందికి నెట్ బ్యాంకింగ్ సదుపాయం అందించగా.. 38 శాతం మంది మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలను వినియోగించుకుంటున్నారు. -
ICICI Bank: డాక్టర్లకు రూ. పది కోట్ల దాకా లోన్
సాక్షి, ముంబై: వైద్యుల బ్యాం కింగ్ అవసరాలను తీర్చే దిశగా ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ కొత్తగా ’సెల్యూట్ డాక్టర్స్’ పేరిట ప్రత్యేక సొల్యూషన్స్ను ప్రవేశపెట్టింది. వైద్య విద్యార్థి స్థాయి నుంచి సీనియర్ మెడికల్ కన్సల్టెంట్, ఆస్పత్రి లేదా క్లినిక్ యజమానిగా మారే దాకా ప్రతీ దశలోనూ వారికి అవసరమయ్యే ఆర్థిక సేవలను అందించనున్నట్లు బ్యాంక్ హెడ్ (లయబిలిటీస్) ప్రణవ్ మిశ్రా తెలిపారు. డాక్టర్స్ కోసమే ప్రత్యేకమైన ఫీచర్లతో రూపొందించిన సేవింగ్స్, కరెంటు ఖాతాలు మొదలుకుని గృహ, వ్యాపార, వ్యక్తిగత, వ్యాపార రుణాల దాకా పొందవచ్చని పేర్కొన్నారు. రూ. 1 కోటి దాకా విద్యా రుణం పొందవచ్చని వివరించారు. ఆఫర్ల వివరాలు: మెడికల్ ఎక్విప్మెంట్ లోన్ : 10 కోట్ల రూపాయల దాకా రుణ సదుపాయం. వారు బ్యాంక్ కస్టమర్లు అయినా కాకపోయినా వైద్యులందరికీ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. వివరాలకు హెచ్సిఎఫ్ను 567677 కు SMS చేయవచ్చు. బిజినెస్ లోన్: మూలధన అవసరాలకు లేదా క్లినిక్ / ఆసుపత్రిని పునరుద్ధరించడం, వైద్య పరికరాల కొనుగోలు వంటి ఇతర వ్యాపార సంబంధిత ఖర్చులకు రూ. 40 లక్షల దాకా వ్యాపార రుణం ప్రీ అప్రూవ్డ్ కస్టమర్లకు తక్షణమే రుణ సదుపాయం. వ్యక్తిగత రుణం: సాధారణ ఆన్లైన్ డాక్యుమెంటేషన్ , ప్రాసెసింగ్తో రూ. 25 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు ఎడ్యుకేషన్ లోన్: ‘డాక్టర్ సెలెక్ట్ ఐస్మార్ట్ ఎడ్యుకేషన్ లోన్’ అని పిలిచే ఈ సదుపాయం ద్వారా కోటి రూపాయల వరకు రుణం. ఇంకా 50 లక్షల వరకు ఆటో లోన్సదుపాయం ‘ఫ్లెక్సీ ఈఎంఐ’ సౌలభ్యాన్ని కూడా వైద్యులకు అందుబాటులోఉంచినట్టు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. -
ఆర్బీకేల స్థాయికి బ్యాంకింగ్ సేవలు
సాక్షి, అమరావతి: బ్యాంకింగ్ సేవలను ఆర్బీకేల స్థాయికి తీసుకు వచ్చేందుకు కలెక్టర్లు బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. కౌలు రైతులకు నష్టం జరగకుండా కొత్త చట్టం తీసుకొచ్చామని, తద్వారా వారికి మేలు చేసే ప్రక్రియపై అవగాహన కలిగించాలని, వారికి రుణాలు వచ్చేలా చేయడం కలెక్టర్ల బాధ్యత అని స్పష్టం చేశారు. ఇ–క్రాపింగ్ అనేది చాలా ముఖ్యమని, ఇ–క్రాపింగ్ చేయకపోతే కలెక్టర్లు విఫలం ఆయ్యారని భావించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కనీసం 10 శాతం ఇ–క్రాపింగ్ను కలెక్టర్లు, జేసీలు పర్యవేక్షించాలని, లేదంటే రైతులు నష్టపోతారన్నారు. స్పందనలో భాగంగా బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఖరీఫ్ సన్నద్ధత, ఇ–క్రాపింగ్, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాపై జిల్లా అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఇ– క్రాపింగ్ చాలా ముఖ్యం. వివాదంలో ఉన్న భూముల్లో పంట సాగు చేసినా.. ఇ–క్రాపింగ్ చేయాలి. లేదంటే రైతు నష్టపోతాడు. ఇ– క్రాపింగ్ పూర్తి స్థాయిలో చేయకపోతే.. కలెక్టర్ విఫలం అయ్యారని భావించవచ్చు. దిగువనున్న సిబ్బంది కూడా ఇ–క్రాపింగ్ను పర్యవేక్షించాలి. లేకపోతే సేవల్లో నాణ్యత ఉండదు. ఇ– క్రాపింగ్పై శిక్షణ కార్యక్రమం ఆర్బీకే లెవల్లో జూన్ 3 నుంచి 8 వరకు ఏర్పాటు చేశాం. ఎవరైనా మిస్ అయి ఉంటే తిరిగి శిక్షణ ఇప్పిస్తాం’ అని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. వ్యవసాయ సలహా మండలి ► ఆర్బీకేలు మొదలు మండల, జిల్లా స్థాయిలో వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు కావాలి. వాటి సమావేశాలు కచ్చితంగా జరగాలి. ధర వచ్చే పంటలు, డిమాండ్ ఉన్న పంటలు వేయడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషించాలి. ► ఏ పంట వేయవచ్చు, ఏ వెరైటీ వేయకూడదన్న దానిపై కమిటీల సహాయంతో పంటల ప్రణాళిక వేసుకోవాలి. బోరుబావుల కింద, మెట్ట ప్రాంతాల్లో వరి వేయడం అన్నది చాలా రిస్క్. అలాంటి సందర్భాల్లో మంచి ఆదాయాలు వచ్చే పంటలను వారికి చూపించాలి. ► కొర్రలు, రాగులు వంటి ప్రత్యామ్నాయ పంటలను, మెరుగైన ఆదాయాన్నిచ్చే పంటలను చూపించాలి. మార్కెట్లో డిమాండ్ ఉన్న వంగడాలపై రైతులకు చైతన్యం కలిగించాలి. అది రైతుకు, ప్రభుత్వానికి కూడా ఉపయోగపడుతుంది. కస్టమ్ హైరింగ్ సెంటర్లు.. హబ్స్ ► కస్టమ్ హైరింగ్ సెంటర్లు, హబ్స్ అనేవి వ్యవసాయ రంగంలో పెనుమార్పులకు దారి తీస్తాయి. స్థానిక రైతులకు అందుబాటు ధరల్లో యంత్రాలు సేవలు అందిస్తాయి. జిల్లా స్థాయిలో రైతులతో కమిటీలను ఏర్పాటు చేసి వారి సహకారంతో ఏ యంత్రాన్ని ఎంత ధరకు అద్దెకు ఇవ్వొచ్చన్నదానిపై నిర్ణయించాలి. ► జూలై 8న మొదటి విడతగా 3 వేల ఆర్బీకేల పరిధిలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ప్రారంభిస్తున్నాం. అక్టోబర్లో 2వ విడత, జనవరిలో మూడో విడత కస్టమ్ హైరింగ్ సెంటర్లు ప్రారంభిస్తున్నాం. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందాలి ► రైతులకు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలే అందాలి. నకిలీలకు ఆస్కారం ఉండకూడదు. ఈ విషయంలో కలెక్టర్లు దృష్టి పెట్టాలి. మిర్చి, పత్తి, తదితర పంటలకు సంబంధించి ప్రీమియం విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందించాలి. అప్పుడు రైతులకు మరింత భరోసా ఉంటుంది. బ్లాక్ మార్కెటింగ్ కూడా ఉండదు. ► విత్తనాలు, ఎరువులు అమ్మే దుకాణాలపై క్రమం తప్పకుండా తనిఖీలు జరగాలి. డీలర్లు అమ్మే వాటిలో నాణ్యత ఉన్నాయా? లేదా? కచ్చితంగా పరిశీలించాలి. పోలీసుల సహకారంతో ఈ రెయిడ్స్ జరగాలి. అప్పుడే బ్లాక్ మార్కెటింగ్, కల్తీలకు మనం అడ్డుకట్ట వేయగలుగుతాం. ► కర్ఫ్యూ సమయంలో కూడా వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలు కొనసాగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ► నాణ్యత పరీక్షించిన ఎరువులను ఆర్బీకేల ద్వారా రైతులకు అందించాలి. ఎక్కడా కొరత రానీయొద్దు. కాంప్లెక్స్ ఎరువులు కూడా అందుబాటులో ఉంచాలి. పురుగు మందుల విషయంలో కచ్చితంగా నాణ్యత పరీక్షలు జరగాలి. రైతులకు భౌతిక రశీదు ► ఇ–క్రాపింగ్ వివరాల నమోదులో జాగ్రత్తగా వ్యవహరించాలి. మన అలసత్వం వల్ల రైతులకు నష్టం రాకూడదు. మనల్ని ప్రశ్నించే అవకాశం రైతులకు ఉండాలి. అందుకే ఇ–క్రాపింగ్పై ప్రతి రైతుకు డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్తోపాటు భౌతికంగా కూడా రశీదు ఇవ్వాలి. ఈ వివరాల ఆ«ధారంగానే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, బీమా వస్తుంది. ఈ విషయంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. ► ఇ– క్రాపింగ్ చేసేటప్పుడు ప్రతి ఎకరం, ప్రతి పంట వివరాలు నమోదు చేయాలి. హార్టికల్చర్ విషయంలో సీజన్తో సంబంధం లేకుండా ఇ–క్రాపింగ్ చేయాలి. -
అత్యవసరమైతేనే బ్యాంకులకు రండి
సాక్షి, అమరావతి: కరోనా సెకండ్ వేవ్, కర్ఫ్యూ నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలను మంగళవారం నుంచి సవరిస్తూ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 నుంచి 18 వరకు రాష్ట్రంలోని బ్యాంకింగ్ వేళలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరిమితం చేసింది. బ్యాంకుల కార్యాలయాలు మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేసినా.. లావాదేవీలకు మాత్రం 12 గంటల వరకే అనుమతించాలని ఎస్ఎల్బీసీ ఆదేశాలిచ్చింది. కర్ఫ్యూ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎస్ఎల్బీసీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు.. ఆర్బీఐ, నాబార్డు ప్రతినిధులతో వర్చువల్గా సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. కోవిడ్–19 కట్టడిలో భాగంగా ఖాతాదారులు సాధ్యమైనంత వరకు బ్యాంకులకు రాకుండా ఇతర ప్రత్యామ్నాయ విధానాలను వినియోగించుకోవాలని ఎస్ఎల్బీసీ విజ్ఞప్తి చేసింది. అత్యవసరమైతేనే బ్యాంకులకు రావాలని సూచించింది. ఆన్లైన్ బ్యాంకింగ్, ఏటీఎం, మొబైల్, యూపీఐ, బ్యాంక్ మిత్ర వంటి సేవలను వినియోగించుకోవడం ద్వారా కరోనా కట్టడికి కృషి చేయాలని కోరింది. బ్యాంకులు కూడా ఈ దిశగా ఖాతాదారులను ప్రోత్సహించేందుకు బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. కాగా, వ్యాక్సినేషన్కు అర్హులైన ఉద్యోగుల జాబితాను పంపించాలని ఎస్ఎల్బీసీని రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ కోరారు. -
ఇంటి ముంగిటే బ్యాంకింగ్ సేవలు
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకుల సేవలు (పీఎస్బీలు) కొత్త పుంతలు తొక్కనున్నాయి. కస్టమర్ తన పనుల కోసం బ్యాంకు శాఖ వరకు రావాల్సిన అవసరం ఉండదు. కాల్ చేస్తే చాలు.. బ్యాంకింగ్ కరస్పాండెంట్ కస్టమర్ ఇంటికే వచ్చి కావాల్సిన పనులను చక్కబెట్టి వెళతారు. ప్రభుత్వరంగ బ్యాంకులు కరోనా కాలంలో ఈ వినూత్నమైన ఆలోచనను ఆచరణలో పెడుతున్నాయి. ఇలా కస్టమర్ల ఇంటి వద్దే సేవలు అందించేందుకు గాను 12 ప్రభుత్వరంగ బ్యాంకులు కలసి ‘పీఎస్బీ అలయన్స్ ప్రైవేటు లిమిటెడ్’ పేరుతో కంపెనీని ఏర్పాటు చేశాయి. ఈ కంపెనీ బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోనుంది. వారి ద్వారానే బ్యాంకింగ్ సేవలను చేపట్టనున్నాయి. కరోనా వైరస్ కల్పిస్తున్న ఆటంకాల నేపథ్యంలో పీఎస్బీలు ఈ విధమైన ఆవిష్కరణతో ముందుకు రావడాన్ని అభినందించాల్సిందే. 12 పీఎస్బీల తరఫున ఒకే ప్రామాణిక నిర్వహణ విధానాన్ని పీఎస్బీ అలియన్స్ అనుసరించనుంది. ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ సేవలను సైతం కరస్పాండెంట్ల ద్వారా అందించనుంది. ఎస్బీఐ మాజీ చీఫ్ జనరల్ మేనేజర్, రిలయన్స్ జియో పేమెంట్స్ బ్యాంకు డిప్యూటీ సీఈవో రాజిందర్ మిరాఖుర్ను పీఎస్బీ అలియన్స్ సీఈవోగా నియమించడం కూడా పూర్తయింది. నమూనాపై కసరత్తు.. ‘‘నమూనాను ఖరారు చేసే పనిలో ఉన్నాము. వివిధ రకాల బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోవడం ద్వారా వారి టెక్నాలజీ, మానవవనరులను వినియోగించుకునే ఆలోచన ఉంది. లేదా సొంతంగా ఒక అప్లికేషన్ను అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా అన్ని పీఎస్బీల పరిధిలోని బ్యాంకింగ్ కరస్పాండెంట్లు దీన్ని వినియోగించుకునేలా ఒక ఆలోచన కూడా చేస్తున్నాం. దీనివల్ల అందరూ ఒకే వేదికపైకి వస్తారు’’ అని మిరాఖుర్ వివరించారు. అత్యతి టెక్నాలజీస్, ఇంటెగ్రా మైక్రోసిస్టమ్స్ను పీఎస్బీ అలయన్స్ నియమించుకుంది. రూ.14 కోట్ల మూలధనాన్ని బ్యాంకులు సమకూర్చాయి. 2010లో నిర్వహణ రిస్క్లను అధ్యయనం చేసేందుకు పీఎస్బీలు ‘కార్డెక్స్ ఇండియా’ పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేశాయి. ఇప్పుడు దీన్నే పీఎస్బీ అలయన్స్గా పేరు మార్చడంతోపాటు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ను మార్చి, ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను అందులో చేర్చాయి. కార్డెక్స్లో ఐసీఐసీఐ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకులకు సైతం వాటా ఉండగా, వాటి వాటాలను వెనక్కిచ్చేశాయి. ‘‘పీఎస్బీలు అన్నీ కలసి ప్రమోట్ చేస్తున్న సంస్థ ఇది. విడిగా ఒక్కో బ్యాంకు 10 శాతానికి మించి వాటా కలిగి ఉండదు. ప్రస్తుతానికి ప్రతీ బ్యాంకు ఒక ప్రతినిధిని నియమించుకున్నాయి. రానున్న రోజుల్లో ఎంత మంది అవసరం అన్నది చూడాలి’’ అని మిరాఖుర్ చెప్పారు. ఖర్చులు ఆదా చేసుకోవడంతోపాటు ఎన్నో ప్రయోజనాలు పీఎస్బీ అలయన్స్ రూపంలో పొందొచ్చని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ‘‘వనరులను చక్కగా వినియోగించుకోవచ్చు. ఉమ్మడిగా ఒకే విధమైన అవగాహన కలిగిన సిబ్బంది ఉండడం అనుకూలత. దీనివల్ల ఒకరి అనుభవాల నుంచి మరొకరు ప్రయోజనం పొందొచ్చు’’ అని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎండీ రాజ్కిరణ్రాయ్ పేర్కొన్నారు. కస్టమర్ల ఇంటి వద్దే సేవలను అందించడం వల్ల బ్యాంకు శాఖలకు వచ్చే రద్దీని తగ్గించొచ్చని.. దీనివల్ల వైరస్ విస్తరణను నియంత్రించడంతోపాటు బ్యాంకు సిబ్బందికి ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టే వీలు ఏర్పడుతుందని బ్యాంకర్లు భావిస్తున్నారు. కొన్ని బ్యాంకుల పరిధిలో.. ‘ప్రస్తుతం అయితే కొన్ని పీఎస్బీలు తమ పరిధిలోనే బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకుని.. వారి ద్వారా కస్టమర్లకు ఇంటి వద్దే సేవలను అందిస్తున్నాయి. పీఎస్బీ అలయన్స్ ఏర్పాటుతో కరస్పాండెంట్లను అన్ని పీఎస్బీలు తక్కువ వ్యయాలకే వినియోగించుకునే వెసులుబాటు లభిస్తుంది’ అని రాజిందర్ మిరాఖుర్ తెలిపారు. నాన్ ఫైనాన్షియల్ సేవలైన చెక్కులను తీసుకోవడం, అకౌంట్ నివేదిక ఇవ్వడం, టీడీఎస్ సర్టిఫికెట్, పే ఆర్డర్లను ప్రస్తుతానికి కస్టమర్లు ఇంటి వద్దే పొందే అవకాశం ఉంది. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను కూడా ఆర్డర్ చేసి ఇంటివద్దకే తెప్పించుకోవచ్చు. ఫైనాన్షియల్ సేవల్లో నగదు ఉపసంహరణ సేవ ఒక్కటే అందుబాటులో ఉంది. నెట్ బ్యాంకింగ్ పోర్టల్, మొబైల్ యాప్, ఫోన్కాల్ రూపంలో ఇంటి వద్దకే సేవలను ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక్కో సేవకు రూ.88 చార్జీతోపాటు, జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వసూలు చేసే చార్జీల్లో కొంత మేర కరస్పాండెంట్కు బ్యాంకులు చెల్లిస్తాయి. -
డిజిటల్కు సానుకూలం.. రికవరీకి ప్రతికూలం
సాక్షి, అమరావతి: కోవిడ్–19 లాక్డౌన్ సమయం బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రధానంగా దేశంలో వ్యవసాయ రంగానికి రుణాల మంజూరుపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. రుణాల రికవరీ దారుణంగా పడిపోయింది. లాక్డౌన్ నేపథ్యంలో రవాణా సౌకర్యం లేకపోవడం, భౌతికదూరం పాటించడం వంటి కారణాలతో డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై సానుకూల ప్రభావం పడింది. ఈ విషయాలు దేశ వ్యాప్తంగా జిల్లాల వారీగా నాబార్డు నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యాయి. కోవిడ్ లాక్డౌన్ సమయంలో వ్యవసాయ రంగానికి కిసాన్ క్రెడిడ్ కార్డులు, టర్మ్ రుణాల మంజూరు, రుణాల రికవరీ, డిజిటల్ బ్యాంకింగ్తో పాటు కనీస బ్యాంకింగ్ సేవలపై పడిన ప్రభావంపై జిల్లాల వారీగా నాబార్డు సర్వే నిర్వహించింది. బ్యాంకింగ్ సేవలపై ప్రభావం కొన్ని జిల్లాల్లో తీవ్రంగా ఉండగా కొన్ని జిల్లాల్లో మోస్తరుగా ఉంది. కొన్ని జిల్లాల్లో ఎటువంటి ప్రభావం చూపలేదు. లాక్డౌన్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో వ్యవసాయం, డెయిరీ, మత్స్యరంగం, ఉద్యానరంగంపై ప్రభావం పడింది. జీవనోపాధిపైన ప్రభావం చూపింది. దీంతో రైతులు రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితి నెలకొంది. బ్యాంకుల రుణాల రికవరీపై దేశంలో 94 శాతం జిల్లాల్లో తీవ్ర ప్రతికూల ప్రభావం కనిపించింది. ► కిసాన్ క్రెడిడ్ కార్డులపై రైతులకు రుణాల మంజూరుపై దేశ వ్యాప్తంగా 59 శాతం జిల్లాల్లో ప్రతికూల ప్రభావం పడింది. మణిపూర్, మిజోరాం, సిక్కిం రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రభావం చూపింది. కేరళలో నూరు శాతం జిల్లాల్లో, అసోంలో 75, పశ్చిమ బెంగాల్లో 76, ఉత్తరప్రదేశ్లో 75, బిహార్లో 73, మహారాష్ట్రలో 71 శాతం జిల్లాల్లో రైతులకు రుణాల లభ్యతపై తీవ్ర ప్రభావం పడింది. ► కనీస బ్యాంకింగ్ సేవలైన డిపాజిట్లు, విత్డ్రాలపైన 50 శాతం జిల్లాల్లో ప్రతికూల ప్రభావం పడింది. ఛత్తీస్గడ్లో 78 శాతం, జార్ఖండ్లో 75 శాతం, మహారాష్ట్రలో 68 శాతం జిల్లాల్లో ప్రతికూల ప్రభావం కనిపించింది. ► టర్మ్ రుణాల మంజూరుపై 89 శాతం జిల్లాల్లో ప్రతికూల ప్రభావం పడింది. లాక్డౌన్లో రాకపోకలపై ఆంక్షలు కారణంగా ప్రాజెక్టును సందర్శించేందుకు బ్యాంకు సిబ్బంది ఆసక్తి చూపకపోవడంతో పాటు ఆర్థిక, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొత్త పెట్టుబడులు, ప్రాజెక్టులు చేపట్టడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. చిన్న రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. హరియాణా, హిమాచల్ప్రదేశ్లలో వందశాతం, బిహార్, పంజాబ్, రాజస్థాన్లలో 95 శాతం, మహారాష్ట్రలో 94 శాతం, మధ్యప్రదేశ్లో 91 శాతం జిల్లాల్లో ప్రతికూల ప్రభావం పడింది. ► బ్యాంకింగ్ డిజిటల్ లావాదేవీలపై 63 శాతం జిల్లాల్లో సానుకూల ప్రభావం చూపింది. గతంలో డిజిటల్ లావాదేవీలు చేసేందుకు ఇష్టపడని వారు కూడా లాక్డౌన్ నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలు నిర్వహించారు. దీనిపై అవగాహనలేనివారు కూడా ఇతరుల సహాయంతో చేశారు. కేరళలో 95 శాతం, పంజాబ్లో 91, రాజస్థాన్లో 90, హరియాణాలో 87, బిహార్లో 81 శాతం డిజిటల్ లావాదేవీలపై సానుకూల ప్రభావం నెలకొంది. -
కార్పొరేట్ బ్యాంకులతో చిక్కులు
దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమై మూడు దశాబ్దాలు కావస్తుండగా ఇన్నాళ్లకు అసలు సిసలైన బ్యాంకింగ్ సంస్కరణలకు తెరలేచింది. ఈమధ్యే భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అంతర్గత కార్యాచరణ బృందం కార్పొరేట్ సంస్థలు ప్రైవేటు బ్యాంకుల్ని తెరిచేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ సిఫార్సు చేసింది. వారు సమర్పించిన నివేదికపై వచ్చే ఏడాది జనవరి 15లోపు అన్ని వర్గాల అభిప్రాయాలు పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆర్బీఐ అంటోంది. ఎన్డీఏ ప్రభుత్వం తొలి అయిదేళ్లలోనూ, ఈమధ్యకాలంలోనూ ఆర్థిక రంగ సంస్కరణలపై చూపిస్తున్న శ్రద్ధను గమ నించినవారికి తుది నిర్ణయం ఎలా వుండగలదో ఇప్పటికే అర్థమైంది. ఇది చివరకు బ్యాంకింగ్ రంగ ప్రైవేటీకరణకు కూడా దారితీయొచ్చన్నది కొందరు నిపుణుల విశ్లేషణ. ఈ నేపథ్యంలో అయిదు దశాబ్దాలక్రితం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఒకేసారి 14 బ్యాంకుల్ని జాతీయం చేయడానికి దారితీసినప్పటి పరిస్థితులను మాత్రమే కాదు... రెండేళ్లక్రితం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఐఎల్ అండ్ ఎఫ్ఎస్)కు, పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)కి, నిరుడు యస్ బ్యాంకుకు, ఈమధ్య లక్ష్మీ విలాస్ బ్యాంకుకు ఏమైందో కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ తీసుకున్న రూ. 91,000 కోట్ల రుణాలకు అది కనీసం వడ్డీ కూడా కట్టలేని స్థితికి చేరుకుని చతికిలబడినప్పుడు ఆ పరిణామాన్ని ‘మినీ లేమాన్ బ్రదర్స్ సంక్షోభం’గా నిపుణులు అభివర్ణించారు. ఇక యస్ బ్యాంకు కథ కూడా ఇలాంటిదే. 2004లో ప్రారం భమైన ఆ బ్యాంకు చకచకా ఎదిగింది. రేటింగ్ సంస్థల నుంచి ఎప్పటికప్పుడు మంచి మార్కులు కొట్టేసింది. çపదిహేనేళ్లు గడిచేసరికి అంతా తారుమారయింది. దాని పారుబాకీలు రూ. 17,134 కోట్లకు చేరుకున్నాయి. అది మునుగుతూ పలు సంస్థలనూ, బాండ్లు కొన్నవారిని, డిపాజిట్దార్లను ముంచేసింది. ఇక నీరవ్ పుణ్యమా అని పీఎన్బీ భారీ స్కాంలో కూరుకుపోయింది. తగిన హామీలేమీ లేకుండానే అతగాడికి రూ. 11,357 కోట్లు సమర్పించుకుంది. కనుక ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటు విషయంలో అతి జాగ్రత్తగా అడుగులేయాలన్నది నిపుణుల హెచ్చరిక. ఆర్బీఐ ఇంతక్రితం 2001లోనూ, 2013లోనూ ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. పర్యవసానంగా ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీవంటి ప్రైవేటు బ్యాంకులొచ్చాయి. అయితే కార్పొరేట్ దిగ్గజాలు ఈ రంగంలోకి రాకుండా కట్టుదిట్టమైన నిబంధనలు విధించారు. ఇందుకు కారణం కూడా చెప్పారు. పారిశ్రామిక సంస్థలు బ్యాంకులు ప్రారంభిస్తే అవి సులభంగా ఆ బ్యాంకులనుంచి రుణాలు తీసుకోగలవు. ఎందుకు తీసుకుంటున్నారని వాళ్లను ప్రశ్నించేవారుండరు. పారిశ్రామికవేత్తే తమ యజమాని అయినప్పుడు బ్యాంకు నిర్వాహకులు వారిని ప్రశ్నించే సాహసం ఎలా చేస్తారు? ఈ ప్రశ్నలు గాల్లోంచి పుట్టుకురాలేదు. స్వాతంత్య్రానంతరం కొన్ని భారీ పారిశ్రామిక సంస్థలు ఇలాగే కావలసినప్పుడల్లా తమ సొంత బ్యాంకుల నుంచి తరచుగా రుణాలు తీసుకుని ఆ బ్యాంకుల్ని దివాళా తీయించాయి. ఇప్పుడు తాజాగా ఆర్బీఐ అంతర్గత కార్యాచరణ బృందం ఆ చరిత్రను దృష్టిలో పెట్టుకున్న దాఖలా కనిపించడం లేదు. రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్, మాజీ డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్యలు దీనిపైనే ప్రశ్నలు సంధించారు. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరే అన్నదాంతో వారు ఏకీభవించలేదు. ఇప్పుడు అంతకన్నా ప్రమా దకర పరిస్థితులున్నాయన్నది వారి అంచనా. వారి దృష్టిలో కేవలం ఆ సంస్థలు జనం దగ్గరనుంచి సేకరించే డిపాజిట్ల మొత్తంనుంచి సొంతానికి రుణాలు తీసుకోవడం ఒక్కటే సమస్య కాదు. వాటి రాకడ పెత్తందారీ ఆశ్రిత పెట్టుబడిదారీ పోకడలకు దారితీస్తుందన్నది వారి ఆందోళన. ఇలాంటి పరిస్థితులు తలెత్తితే సకాలంలో గుర్తించి సరిచేయడానికి నియంత్రణ వ్యవస్థ అమల్లో వుంటుందన్న వాదనతో వారు ఏకీభవించలేదు. రాజన్, ఆచార్యల వాదనలు కొట్టివేయదగ్గవి కాదు. అందుకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండి బకాయిలే ఉదాహరణ. ప్రతి బ్యాంకు బోర్డు లోనూ రిజర్వ్బ్యాంకు ప్రతినిధి వుంటారు. ఏ బ్యాంకు కార్యకలాపాలు ఏవిధంగా వున్నాయన్నది వారు గమనిస్తూ వుండాలి. కానీ బ్యాంకుల రుణ వితరణలో రాజకీయ జోక్యం పెరుగుతున్నా, పర్యవసానంగా బ్యాంకు నిండా మునిగే పరిస్థితి ఏర్పడినా ఆర్బీఐ రంగంలోకి దిగి అడ్డుకున్న దాఖలా లేదు. పారు బాకీలు పెరిగిపోయి, మూలధన కొరత, విస్తరణ సాధ్యపడక అవి నీరసిం చాయి. ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వం ఆదరాబాదరాగా ఆదుకోవడమే తప్ప, వాటంతటవి నిలబడిన ఆచూకీ లేదు. గత కొన్నేళ్లుగా పారు బాకీల లెక్కలు పక్కనపడేసి, ఆ ఏడాది ఆర్థిక కార్యకలాపాలను మాత్రమే చూపి బ్యాంకులకు లాభాలొచ్చినట్టు అంకెలు చూపుతున్నారు. వాస్తవానికి ఆ పారు బాకీలన్నీ బహిరంగపరిస్తే దాదాపు ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాల్లో వున్న వైనం కళ్లకు కడుతుంది. కొత్తగా ఏర్పాటయ్యే బ్యాంకులను పర్యవేక్షించే నియంత్రణ వ్యవస్థ అందుకు భిన్నంగా ఏం చేయగలుగుతుంది? ఎన్ని లోటుపాట్లున్నా మన బ్యాంకింగ్ వ్యవస్థకు మంచి పేరే వుండేది. కానీ అదంతా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, మరో నాలుగు బ్యాంకులు చతికిలబడటానికి ముందు. బ్యాంకుల వైఫల్యం అంతకంతకూ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ కొత్త మార్గం ఎంతవరకూ శ్రేయస్కరమో పాలకులు ఆలోచించాలి. కార్పొరేట్ దిగ్గజాలు బ్యాంకులు ప్రారంభిస్తే మొదట్లో అవి జనాన్ని ఆకర్షిస్తాయి. డిపాజిట్లు వెల్లువలా వస్తాయి. కానీ రకరకాల రూపాల్లో నియంత్రణ వ్యవస్థల కన్నుగప్పి సొంత ప్రయోజనాలకు భారీ మొత్తాలు మళ్లించుకుంటే...ఆనక ఆ బ్యాంకులు దివాళా తీస్తే ప్రజానీకం తీవ్రంగా నష్టపోతారు. కనుక ఈ విషయంలో ఆచితూచి అడుగేయడమే ఉత్తమమని కేంద్రం, ఆర్బీఐ గుర్తిస్తే మంచిది. -
కొత్తగా 14వేల మంది కరస్పాండెంట్ల నియామకం
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రణాళికను సిద్ధం చేసింది. అందులో భాగంగా తన బ్యాంకింగ్ కరస్పాండెట్ల సంఖ్యను రెట్టింపు చేయాలని యోచిస్తోంది. దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి కస్టమర్కు ఉత్తమ బ్యాంకింగ్ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీనియర్ అధికారి సమిత్ భగత్ పేర్కొన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న 11వేల మంది కరస్పాండెట్లకు మరో అదనంగా 14వేల మందిని నియమిస్తామని తెలిపారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని వారు కొత్త ఖాతాను తెరవడం, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం, పేమెంట్ ప్రొడెక్ట్లు, లోన్ క్లోజింగ్ లాంటి సదుపాయాలను ఇంటి వద్ద నుంచే పొందవచ్చని ఆమె వివరించారు. అలాగే కరస్పాండెంట్ల వ్యవస్థను మరింత బలపరించేందుకు, విస్తరించేందుకు ప్రభుత్వ కామన్ సర్వీసు సెంటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకునే యత్నాలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. -
ఆర్థిక పునరుత్తేజంలో బ్యాంకులే ఆయుధం
ముంబై: ఆర్థిక పునరుత్తేజంలో బ్యాంకులదీ కీలక పాత్ర అని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇంటింటికీ బ్యాంకింగ్ సేవలకు సంబంధించి పీఎస్బీ అలయెన్స్ కార్యక్రమాన్ని బుధవారం ఆమె ఆవిష్కరించారు. ప్రజలకు మరింత చేరువకావడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమం సందర్భంగా ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బ్యాంకర్లను ఉద్దేశించి మాట్లాడారు. బ్యాంకింగ్ తమ వ్యాపార కార్యకలాపాలతో పాటు ఆర్థికవృద్ధి, సంక్షేమం పట్ల కూడా దృష్టి కలిగి ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అన్నారు. ‘‘ రుణాలు ఇవ్వడం... తద్వారా డబ్బు సంపాదించడం. ఇది మీ చట్టబద్ధమైన కార్యక్రమం. దీనిని మీరు మర్చిపోవక్కర్లేదు. మీరు మీ విధిని నిర్వహించాల్సిందే. అయితే ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావడంపైనా బ్యాంకింగ్ దృష్టి పెట్టాలి’’ అని ఆమె అన్నారు. ప్రైవేటు బ్యాంకుల సహకారం అవసరం ప్రభుత్వ పథకాలు విజయవంతం కావడానికి ప్రైవేటు రంగంలోని బ్యాంకులు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని ఆర్థికమంత్రి అన్నారు. బ్యాంకుల ద్వారా అమలు జరిగే ప్రభుత్వ పథకాల వివరాలు అన్నింటినీ సిబ్బంది తెలుసుకోవాలని ఆమె అన్నారు. ‘‘పలు పథకాలను కేంద్రం మీ ద్వారానే ప్రజలకు అందిస్తుంది. అందువల్ల ఈ పథకాల గురించి క్షుణ్నంగా తెలుసుకోవడమూ మీ బాధ్యతే. ఉద్యోగులకు సంబంధించి ప్రతి స్థాయిలో ఆయా అంశాలను తెలుసుకుంటారని భావిస్తున్నా’’ అని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా అన్నారు. తద్వారా ప్రభుత్వ పథకాలు పొందాలనుకునే ప్రజలకు బ్యాంకింగ్ మరింత చేరువవుతుందన్నారు. ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి దేబాశిష్ పాండా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాంకింగ్ సేవల విస్తరణకు ఉద్దేశించిన పీఎస్బీ అలయెన్స్ కార్యక్రమంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి దేబాశిష్ పాండా కూడా చిత్రంలో ఉన్నారు -
ఆర్బీకేల్లో బ్యాంకింగ్ సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) నుంచి మరో వినూత్న సేవను అందించేందుకు వ్యవసాయ శాఖ సంకల్పించింది. రైతులకు బ్యాంకింగ్ సేవలను సైతం ఆర్బీకేల నుంచి అందించడానికి కృషి చేస్తోంది. ఈమేరకు వ్యవసాయ శాఖ ప్రతిపాదించిన ముసాయిదాను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) సూత్రప్రాయంగా ఆమోదించింది. ప్రాథమిక అవగాహన కూడా కుదిరింది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపింది. అక్కడి నుంచి గ్రీన్సిగ్నల్ వచ్చిన వెంటనే ఆర్బీకేల నుంచి సేవలు ప్రారంభించనున్నారు. అన్నదాతలకు అండగా నిలవాలన్న వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధికి ఈ కొత్త ఆలోచన మరో తార్కాణం అని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు. పరపతి (క్రెడిట్) సౌకర్యం లేకనే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ పలు కమిటీలు చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రానికి నివేదించిన అంశాలు ► వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే క్రమంలో భాగంగా రాష్ట్రంలో గత నెల 30న సీఎం వైఎస్ జగన్ 10,641 ఆర్బీకేలను ప్రారంభించారు. ► ఆర్బీకేలలో గ్రామ వ్యవసాయ సహాయకుడు (వీఏఏ), గ్రామ ఉద్యాన సహాయకులు (వీహెచ్ఏ), విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ (వీఎస్ఏ) కీలకపాత్ర పోషిస్తారు. ► వ్యవసాయానికి అవసరమైన అన్నింటిని రైతు ఇంటి ముంగిటే అందించడం ఆర్బీకేల ఉద్దేశం. ఈ క్రమంలో బ్యాంకింగ్ సేవల్ని సైతం రైతుకు తన సొంత గ్రామంలోనే అందించాలని ప్రతిపాదిస్తున్నాం. ► బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అందించే సేవలు.. ఆర్బీకేల్లో వీఏఏలు, వీహెచ్ఏలు, వీఎస్ఏలు అందించేందుకు అనుమతించాల్సిందిగా కోరుతున్నాం. రైతులు, బ్యాంక్ బ్రాంచ్ల మధ్య వారు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. ► క్రెడిట్ కోసం బ్యాంక్కు సమర్పించడానికి వీలుగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో దరఖాస్తు ఫారాలను నింపడానికి సహకరిస్తారు. పశుసంవర్ధక, మత్స్య రంగాలకు కూడా బ్యాంకింగ్ సేవలను అందిస్తారు. ► రూపే కిసాన్ క్రెడిట్ కార్డు జారీకి అవసరమైన ఆధార్ కార్డుల అనుసంధానానికి, కొత్త కార్డుల జారీకి, కేసీసీ పునరుద్ధరణకు దరఖాస్తు ఫారాలు ఆర్బీకేలలో అందుబాటులో ఉంచవచ్చు. ► పీఎంజేడీవై, పీఎంఎస్బీవై, ఏపీవై పథకాలలో నమోదుకు అర్హులైన రైతుల నుంచి సమ్మతి పత్రాలను సేకరించడానికి అనుమతించవచ్చు. అర్హత ఉన్న రైతులందరికీ లబ్ధి చేకూరేలా చూడవచ్చు. ► అర్హులైన వారికి రైతు భరోసా డబ్బు జమ కాకపోతే.. ఆ రైతుల తరఫున బ్యాంకులకు కావాల్సిన పత్రాలను సమర్పించవచ్చు. ► రుణాల రికవరీలో వీఏఏలు, వీహెచ్ఏలు, వీఎస్ఏలు బ్యాంకులకు సహాయం చేస్తారు. ► తనిఖీ కోసం బ్యాంకర్లు తమ రుణగ్రహీతల జాబితాలను వారికి అందజేయవచ్చు. ► అన్ని రకాల వ్యవసాయ రుణాలను సమీక్షించేందుకు (క్వాంటిటేటివ్) బ్యాంకులు తమకు బకాయి ఉన్న వారి వివరాలను వీఏఏలు, వీహెచ్ఏలు, వీఎస్ఏలతో పంచుకోవచ్చు. ► ఆర్బీకే సిబ్బందికి బ్యాంకులు ఓ సమయాన్ని కేటాయిస్తే ఇతర ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పని పూర్తికి వీలు కల్పించవచ్చు. ► బ్యాంక్ మిత్రలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు తమ సేవలను ఆర్బీకేల నుంచి సాగించవచ్చు. వారే అక్కడ రైతులతో నేరుగా మాట్లాడి సందేహాలు తీర్చవచ్చు. అవసరమైన సేవల్ని అందించవచ్చు. ► నిర్దేశిత సమయంలో బ్యాంక్ అధికారులు ఆర్బీకేకు వెళితే ఆ గ్రామ రైతులతో భేటీ అయి బ్యాంకింగ్ సమస్యలన్నింటినీ అక్కడికక్కడే పరిష్కరించవచ్చు. పరపతి లక్ష్యాలను చేరుకునేందుకు వేదికలుగా ఆర్బీకేలను ఉపయోగించుకోవచ్చు. ► ఇలా చేయడం వల్ల బ్యాంకుల చుట్టూ తిరిగే బాధ రైతులకు తప్పుతుంది. రుణాల జాప్యాన్ని నివారించవచ్చు. అర్హులైన వారందరికీ రుణాలు ఇచ్చి పంటల సాగుకు తోడ్పడవచ్చు. రైతులకు సేవలందించే క్రమంలో బ్యాంకర్లు ఆర్బీకే సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇస్తే వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. రుణాలు, ప్రభుత్వ పథకాలు సకాలంలో అందించేందుకే.. రైతులకు సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న ఆలోచనల్లో భాగంగా వారి ఇంటి ముంగిటే బ్యాంకింగ్ సేవలు అందించాలన్న ప్రతిపాదన వచ్చింది. రైతుల్లో చాలా మందికి బ్యాంకింగ్, ఆర్థిక వ్యవహారాలపై అవగాహన ఉండదు. ఆ అంశాలపై అవగాహన కల్పించి త్వరితగతిన సేవలు అందిస్తే రైతులు తమ ఊరికి దూరంగా ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి సమయాన్ని వృథా చేసుకునే అవసరం ఉండదు. దరఖాస్తు ఫారాలను నింపడానికి ఇతరుల సహకారం తీసుకునే పని ఉండదు. ఆధార్ అనుసంధానం కాలేదన్న సాకుతో రుణాలో, ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయమో సకాలంలో అందలేదన్న ఫిర్యాదులు లేకుండా చేయొచ్చు. రుణాలు, ప్రభుత్వ పథకాలు సకాలంలో అందించే కృషిలో భాగంగా ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోంది. – కురసాల కన్నబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి -
యస్పై మారటోరియం ఎత్తివేత
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ 13 రోజుల తర్వాత మారటోరియంపరమైన ఆంక్షల నుంచి బైటపడింది. బుధవారం సాయంత్రం 6 గం.ల నుంచి పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలను పునరుద్ధరించింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు బ్యాంకింగ్ వేళలను కూడా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం మార్చి 19 నుంచి 21 దాకా ఉదయం 8.30 గం.లకే శాఖలు తెరుచుకుంటాయి. సీనియర్ సిటిజన్ ఖాతాదారుల కోసం మార్చి 19 నుంచి 27 దాకా సాయంత్రం 4.30 గం.ల నుంచి 5.30 గం.ల దాకా సేవలు అందిస్తాయి. అయితే, సేవలు పునరుద్ధరించిన కాస్సేపటికే మొబైల్ యాప్ క్రాష్ కావడం, వెబ్సైట్ పనిచేయకపోవడంతో ఖాతాదారులు అసహనానికి లోనయ్యారు. సోషల్ మీడియాలో బ్యాŠంక్ను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ సమస్యలిక పడలేమని, తాము డిపాజిట్లను మరో బ్యాంకుకు మార్చేసుకుంటామని సూచిస్తూ పలువురు పోస్ట్ చేశారు. దీంతో ఖాతాదారులకు కలిగిన అసౌకర్యానికి యస్ బ్యాంక్ క్షమాపణలు కోరింది. సమస్యను సత్వరం పరిష్కరిస్తున్నామని పేర్కొంది. మార్చి 5 నుంచి నెలరోజులపాటు యస్ బ్యాంక్పై ఆర్బీఐ మారటోరియం విధించడం, ఈ వ్యవధిలో రూ. 50,000కు దాటకుండా విత్డ్రాయల్స్పై ఆంక్షలు విధించడం తెలిసిందే. ఎస్బీఐ సహా ఇతరత్రా బ్యాంకులు.. యస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయడంతో మారటోరియం తొలగింది. మరోవైపు, యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్పై మనీ లాండరింగ్ కేసులో డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు మరోసారి విచారణకు గైర్హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి భయాలను ఇందుకు కారణంగా వారు చూపారు. ఇండస్ఇండ్ బ్యాంకు పటిష్టంగానే ఉంది బ్యాంకు యాజమాన్యం ప్రకటన న్యూఢిల్లీ: ఆర్థికంగా బలమైన స్థితిలో, తగినన్ని నిధులతో, లాభాలతో, బలమైన నిర్వహణతో నడుస్తున్నట్టు ఇండస్ఇండ్ బ్యాంకు ప్రకటించింది. యస్ బ్యాంకు సంక్షోభం అనంతరం ఇండస్ఇండ్ బ్యాంకు ఆర్థిక సామర్థ్యంపై పెద్ద స్థాయిలో మార్కెట్ వదంతులు, ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది. డిసెంబర్ త్రైమాసికం నాటికి బ్యాంకు స్థూల ఎన్పీఏలు 2.18%గా ఉన్నాయని, పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఇది తక్కువగా ఉందని తెలిపింది. ‘‘క్రితం త్రైమాసికం స్థాయిలోనే స్థూల ఎన్పీఏలు ప్రస్తుత త్రైమాసికంలోనూ ఉండొచ్చు. అలాగే, క్రితం త్రైమాసికం నాటికి 1.05%ఉన్న నికర ఎన్పీఏలు ప్రస్తుత త్రైమాసికంలో 1%లోపునకు తగ్గనున్నాయి’’ అని బ్యాంకు తన ప్రకటనలో వివరించింది. ఫిబ్రవరి నాటికి వాణిజ్య, నివాస రియల్టీ, జెమ్స్, జ్యుయలరీ రంగాలకు ఎక్స్పోజర్ లేదని స్పష్టం చేసింది. -
కొనసాగుతున్న భారత్ బంద్.. విజయవాడలో ఉద్రిక్తత
నేడు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10 ప్రధాన కార్మిక సంఘాలు నేడు భారత్ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే పలు చోట్ల బంద్ ప్రారంభమైంది. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలపై వ్యతిరేకంగా ఈ సమ్మె జరగనుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ బంద్లో దాదాపు 25 కోట్ల మంది దాకా పాల్గొంటున్నారని కార్మిక సంఘాలు అంచనా వేస్తున్నాయి. విజయవాడ: విజయవాడలో బంద్ కొనసాగుతోంది. బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై వామపక్ష పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. ఎన్ఆర్సీ, సీఏఏ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బంద్ చేపట్టినట్లు తెలిపారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, ఎన్ఆర్సీ, సీఏఏ ,అలాగే కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని కేంద్రంలోని బీజేపీకి కాలం చెల్లిందాని ఆందోళన కారులు నిరసన తెలియజేస్తున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖపట్నం : కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ విశాఖ జిల్లా మద్దిలపాలెం కూడలిలో వామపక్ష నేతలతో పాటు కార్మిక సంఘాలు కదంతొక్కాయి. ఉదయం 6 గంటల నుంచి కార్మికులంతా సమ్మెలో పాల్గొని నిరసనలు తెలిపారు. కేంద్రం.. కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు: కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారత్ బంద్కు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. బంద్ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో విద్యాలయాలకు, వ్యాపార సంస్థలకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు. బస్టాండ్ వద్ద వామపక్ష పార్టీ నేతలు బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. బీఎస్ఎన్ఎల్, రైల్వేస్, పోస్ట్ ఆఫీస్ లాంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే వామపక్ష నేతలు ఉద్యమం మరింత ఉధృతం చేస్తామంటున్నారు. మంచిర్యాల/ భద్రాద్రి/ పెద్దపల్లి: మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి జిల్లాల్లో సింగరేణి కార్మికులు రోడ్డెక్కారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమ్మెకు దిగారు. నిరసన చేపట్టిన కార్మిక నాయకులు గనుల్లోకి వచ్చేందుకు ప్రత్నించడంతో పోలీసులువారి అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు, కార్మిక నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. -
వేలి ముద్రతో నగదు డ్రా
రామకృష్ణ అత్యవసర పని మీద అనంతపురం జిల్లాలోని ఇప్పేరు గ్రామానికి వెళ్లాడు. ఆన్లైన్ చెల్లింపులకు అలవాటు పడిన అతను అత్యవసరంగా అక్కడ రూ.8,000 నగదు చెల్లించాల్సి వచ్చింది. ఆ ఊళ్లో బ్యాంకు, ఏటీఎం లేదు. కనీసం 20 కి.మీ దూరం వెళ్తేకానీ ఏటీఎం సెంటర్ లేదు. ఏం చేయాలో పాలుపోక బిజినెస్ వ్యవహారాలపై అవగాహన ఉన్న తన స్నేహితునికి ఫోన్ చేశాడు. సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్తే రూ.10 వేల వరకు నగదు తీసుకోవచ్చని అతను సలహా ఇచ్చాడు. నమ్మకం కలగనప్పటికీ, ప్రయత్నిద్దామని పక్కనే ఉన్న పోస్టాఫీసుకు వెళ్లి పోస్టుమాస్టర్కు తన పరిస్థితి వివరించాడు. అతను రామకృష్ణ వేలిముద్రలు తీసుకొని వెంటనే రూ.10 వేలు ఇచ్చాడు. ఆ వెంటనే తన ఎస్బీఐ ఖాతా నుంచి రూ.10 వేలు డ్రా అయినట్లు ఫోన్కు మెసేజ్ రావడంతో ఆశ్చర్యపోయాడు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే పోస్ట్మ్యాన్ మన ఇంటి వద్దకే వచ్చి నగదు డిపాజిట్, విత్డ్రా, మనీ ట్రాన్స్ఫర్ వంటి సేవలను అందిస్తున్నారు. విద్యుత్, గ్యాస్, వాటర్ బిల్లు తదితర చెల్లింపులు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సేవలన్నీ పోస్టాఫీసు వద్దకు వెళ్లి ఉచితంగా పొందవచ్చు. పోస్ట్మ్యాన్ ఇంటి వద్దకు వచ్చి ఈ సేవలు అందిస్తే క్యాష్ డిపాజిట్, విత్డ్రాయల్స్కు రూ.25, ఇతర సేవలకు రూ.15 చొప్పున సర్వీస్ చార్జి వసూలు చేస్తారు. రాష్ట్రంలో 10,489 పోస్టాఫీసుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. సాక్షి, అమరావతి: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గత ఏడాది అధునాతన టెక్నాలజీని వినియోగించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 15 రోజుల క్రితం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసులను ప్రవేశపెట్టింది. ఏటీఎం కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలతో పనిలేకుండా నేరుగా పోస్టాఫీసుకు వెళ్లి వేలిముద్ర వేయడం ద్వారా నగదు తీసుకునే సౌకర్యం కల్పించింది. ఆధార్తో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతా నుంచి ఈ విధానంలో నగదు తీసుకోవచ్చు. ఖాతాదారునికి నాలుగు బ్యాంకు అకౌంట్లు ఉంటే, ఆధార్ డేటాబేస్లో చివరిసారి ఏ బ్యాంకు ఖాతాతో అనుసంధానమై ఉందో ఆ బ్యాంకు ఖాతా నుంచి మాత్రమే నగదు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా కొన్ని బ్యాంకులు రోజుకు గరిష్టంగా రూ.10 వేలు, మరికొన్ని బ్యాంకులు రూ.5 వేలు తీసుకోవడానికి అనుమతిస్తున్నాయి. దీంతో బ్యాంకులు, ఏటీఎంలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఖాతాల పెంపుపై దృష్టి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో కొద్ది రోజులుగా ఖాతాల పెంపుపై దృష్టి సారించారు. ఈ ఖాతాల్లో గరిష్టంగా రూ.లక్షకు మించి దాచుకోవడానికి వీలుండదు. అందుకని వీటిని పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలకు అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల రూ.లక్షకు మించి ఉన్న నగదు నేరుగా సేవింగ్స్ ఖాతాలోకి వెళ్తుంది. (రూ.లక్షకు మించి డిపాజిట్ చేయాలంటే సేవింగ్స్ ఖాతా తప్పనిసరి) అవసరమైనప్పుడు ఈ మొత్తాన్ని వెనక్కు తీసుకోవచ్చు. పోస్టాఫీసు అందిస్తున్న బ్యాంకింగ్ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టామని ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ రామ్ భరోసా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన, అతి తక్కువ ప్రీమియంతో అధిక బీమా రక్షణ కల్పించే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై) పథకాలతో పాటు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి అన్ని రకాల పథకాలు, సేవలను పోస్టాఫీసుల్లో అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 59 పోస్టల్ ఏటీఎంలను ఏర్పాటు చేశామని చెప్పారు. మొదటి స్థానంలో ఏపీ సర్కిల్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాలను ప్రారంభించడంలో ఏపీ సర్కిల్ మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 10.33 లక్షల ఖాతాలతో రూ.21.59 కోట్ల డిపాజిట్లను సేకరించింది. గత ఏడు నెలల్లోనే 6.91 లక్షల ఖాతాలను ప్రారంభించాం. ఈ ఏడాది మొత్తం ఖాతాల సంఖ్యను 30 లక్షలకు చేర్చాలన్నది లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఆధార్ ఎనేబుల్డ్ సర్వీస్ ద్వారా పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పోస్టాఫీసు ఉన్న ప్రతి గ్రామంలో అన్ని బ్యాంకులు, వాటి ఏటీఎంలు ఉన్నట్లే లెక్క. – జి.ప్రశాంతి, సీనియర్ మేనేజర్, పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, విజయవాడ డివిజన్. -
బ్యాంకుల దేశవ్యాప్త 24 గంటల సమ్మె
సాక్షి, ముంబై: ప్రభుత్వ బ్యాంకుల విలీనానికి నిరసనగా బ్యాంకు ఉద్యోగుల సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. రేపు (మంగళవారం, అక్టోబరు 22) ఒక రోజు సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంక్ యూనియన్లు పేర్కొన్నాయి. రెండు బ్యాంకు సంఘాలు అక్టోబర్ 22న 24 గంటల సమ్మెను ప్రకటించడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. దాదాపు 2 లక్షలకు పైగా ఉద్యోగులు పాల్గొనవచ్చని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవలి బ్యాంకు విలీనాలు, డిపాజిట్ రేట్లు తగ్గడం, ఉద్యోగ భద్రత సమస్యలపై నిరసనగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) మరియు బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) ఈ సమ్మెను చేపట్టనున్నాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమ్మెలో పాల్గొనడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు కూడా సమ్మెలో పాల్గొనవు.అయితే తన ఉద్యోగులలో ఎక్కువమంది పాల్గొనే యూనియన్లలో సభ్యులు కానందున సమ్మె ప్రభావం తమ కార్యకలాపాలపై తక్కువగా ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేర్కొంది. సమ్మె కారణంగా తమ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడొచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా మార్కెట్ రెగ్యులేటరీకి ఇప్పటికే తెలియజేసింది. తమ కార్యక్రమానికి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల నుండి మంచి స్పందన వస్తుందని తాము ఆశిస్తున్నామని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (స్టేట్ ఫెడరేషన్) ప్రధాన కార్యదర్శి జాయిదేబ్ దాస్గుప్తా అన్నారు. ఎస్బీఐ కూడా సమ్మెలో భాగమైతే బావుండేదన్నారు. -
పేపర్లెస్ ఖాతాలకు ఎస్బీఐ ‘యోనో’ నో..
న్యూఢిల్లీ: ‘యూ ఓన్లీ నీడ్ వన్ (యోనో)’ యాప్ ద్వారా కాగిత రహిత బ్యాంక్ ఖాతాలను తెరిచే విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ నిర్ణయించింది. ఆధార్ వినియోగంపై పరిమితులు విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ అధికారి ఒకరు తెలిపారు. డిజిటల్ అకౌంట్లను తెరవడానికి ప్రత్యామ్నాయ పరిష్కార సాధనాల వినియోగంపై స్పష్టతనివ్వాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్ను కోరినట్లు వివరించారు. బ్యాంకింగ్ సేవలు మొదలైనవి పొందడానికి ఆధార్ నంబరును అనుసంధానం చేయడం తప్పనిసరేమీ కాదంటూ సెప్టెంబర్ 26న సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎలక్ట్రానిక్ పద్ధతిలో గుర్తింపు ధృవీకరణ (ఈ–కేవైసీ) కుదరని పరిస్థితి నెలకొంది. 2017 నవంబర్లో ప్రారంభించిన డిజిటల్ ప్లాట్ఫాం ‘యోనో’ ద్వారా బ్యాంకు శాఖకు కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఖాతాను తెరవడం నుంచి అన్ని రకాల ఆర్థిక సేవలను పొందే వెసులుబాటును ఎస్బీఐ అందుబాటులోకి తెచ్చింది. -
సింగపూర్ ఫిన్టెక్ వేడుకలో మోదీ ప్రసంగం
సింగపూర్: సింగపూర్లో జరిగే ప్రపంచవ్యాప్త అతిపెద్ద ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీల సమ్మేళనంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అంతర్జాతీయ ఫిన్టెక్ కంపెనీలు, పరిశ్రమల ప్రతినిధులు, స్టార్టప్ కంపెనీలకు చెందిన సుమారు 30,000 మంది ఇందులో పాల్గొంటారు. మన దేశం నుంచి 400 మంది హాజరుకానున్నారు. అలాగే, 18 కంపెనీలు కూడా ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఈ సందర్భంగా బ్యాంకు ఖాతా లేకపోయినా సేవలు అందుకునేందుకు ఉద్దేశించిన అప్లికేషన్ ‘అపిక్స్’ను ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ నెల 14, 15వ తేదీల్లో ప్రధాని సింగపూర్ పర్యటనలో భాగంగా ప లు సదస్సులు, ఆసియాన్ భేటీలోనూ పాల్గొంటారు. అపిక్స్ అప్లికేషన్ ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మందికి బ్యాంకింగ్ సేవలను చేరువ చేసేందుకు వర్చుసా కంపెనీ అపిక్స్ అప్లికేషన్ను రూపొందించింది. హైదరాబాద్, కొలంబో, లండన్కు చెందిన నిపుణులు దీన్ని డిజైన్ చేయడం గమనార్హం. సింగపూర్ మానిటరీ అథారిటీ, ఇంటర్నేషన్ ఫైనాన్స్కార్ప్, ఆసియాన్ బ్యాంకింగ్ అసోసియేషన్, వర్చుసా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిఖిల్ మీనన్ ఆహ్వానం మేరకు ప్రధాని టెక్నాలజీ సమ్మేళనంలో ఈ అప్లికేషన్ను ఆవిష్కరిస్తారు. భారత్ సహా 23 దేశాల ప్రజలకు ఈ అప్లికేషన్ అందుబాటులోకి వస్తుంది. మోదీ ఈ పర్యటనలో భాగంగా తూర్పు ఆసియా సదస్సు, ఆసియాన్–భారత అనధికారిక సమావేశంలో పాల్గొంటారు. -
బ్యాంకులపై పెరుగుతున్న ఫిర్యాదులు..!
న్యూఢిల్లీ : దేశంలోని బ్యాంక్లపై వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఆర్బీఐ నిర్వహిస్తున్న బ్యాంకింగ్ అంబుడ్స్మన్కు బ్యాంకింగ్ సేవలపై ఈ ఏడాది వచ్చిన ఫిర్యాదులను బట్టి ఈ విషయం అర్థమవుతోంది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ... గతేడాదితో పోలిస్తే 2017-2018లో ఫిర్యాదుల్లో 25 శాతం పెరుగుదల ఉండవచ్చని ఆర్బీఐ అధికారులు అంచనా వేస్తున్నారు. గత నాలుగేళ్లలో గుజరాత్ నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 93 శాతం పెరుగుదల నమోదైంది. 2014-2015లో 4,965 ఫిర్యాదులు రాగా, 2017-2018లో ఆ సంఖ్య 9,600కు చేరింది. కానీ దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఈ నాలుగేళ్లలో పెరుగుదల కేవలం 7 శాతంగా ఉంది. వీటిలో ఏటీఎం కార్డుల సమస్యలపైనే ఎక్కువ మంది వినియోగదారులు బ్యాంకింగ్ అంబుడ్స్మన్ను ఆశ్రయిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా బ్యాంకులు విధిస్తున్న చార్జీలపై వస్తున్న ఫిర్యాదులు ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి. అందులో ముఖ్యంగా మొబైల్, ఇంటర్నెట్ బ్యాకింగ్ వినియోగించేవారిపై చార్జీల బాదుడు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. -
ఖాతా... క్యాష్ ఇంటివద్దే..
సాక్షి, హైదరాబాద్: ఇంతకాలం ఉత్తరాల బట్వాడా.. చిన్న మొత్తాల పొదుపు, బీమా తదితర సేవలను అందిస్తున్న తపాలా శాఖ ఇకపై పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు అందించనుంది. గ్రామీణ ప్రాం తాల్లో సరిపడా బ్యాంకు శాఖలు లేకపోవడం, గ్రామీ ణ ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ కార్యకలాపాలపై పూర్తి అవగాహన లేకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం తపాలా శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్(ఐపీపీబీ)ను ఏర్పాటు చేసింది. ఐపీపీబీ ద్వారా ఖాతాదారులు, ప్రజలకు సులభతరంగా బ్యాంకింగ్ సేవలు అందనున్నాయి. ఇప్పటివరకూ పొదుపు ఖాతా తెరడానికి వినియోగదారులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. సరైన ధ్రువీకరణ పత్రాలు ఉంటే ఇకపై ఇంటి వద్దనే పోస్టల్ బ్యాంకు ఖాతా తెరవవచ్చు. నగరంలోని జనరల్ పోస్టాఫీసు(జీపీవో), ప్రధాన తపాలా కార్యాలయాలు(హెచ్పీవో), ఉప తపాలా కార్యాలయాలు(ఎస్పీవో), బ్రాంచి పోస్టాఫీసు(బీపీవో)ల్లో బ్యాంకింగ్ సేవలు అందించడానికి తపాలా శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే తపాలా సిబ్బందికి కర్ణాటక లోని మైసూర్లో ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించింది. మేనేజర్లను నియమించింది. దేశంలోని 650 జిల్లాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెస్తుండగా.. రాష్ట్రం లో తొలి విడతగా హైదరాబాద్తోపాటు ఉమ్మడి జిల్లాల్లోని 13 ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో కి తెచ్చింది. తపాలా శాఖ ఏ పథకం తెచ్చినా నగరంలోని జీపీవోలో మొదట ప్రారంభిస్తామని ఖైరతాబాద్ సీనియర్ పోస్టుమాస్టర్ జయరాజ్ తెలిపారు. ఇంటి వద్దనే లావాదేవీలు.. ♦ పొదుపు ఖాతా కోసం ఆధార్ కార్డు ఉంటే చాలు. సంబంధిత పోస్ట్మాన్ ఇంటికి వచ్చి ఖాతా తెరు స్తారు. వారికి ఆండ్రాయిడ్ ఫోన్, బయోమెట్రిక్ పరికరం ఇస్తారు. ♦ తపాలా కార్యాలయాల్లో పొదుపు ఖాతా మాత్ర మే తెరవడానికి వీలుండేది. ప్రస్తుతం కరెంట్ ఖాతా కూడా తెరవవచ్చు. ♦ ఖాతాదారు రోజుకు రూ.లక్ష వరకు నగదు లావాదేవీలు చేయవచ్చు. తపాలా కార్యాలయాలకు వెళ్లలేని వారు వివిధ లావాదేవీలను ఇంటివద్దనే నిర్వహించే వీలుంది. ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ, ఆన్లైన్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, ఏటీఎం కార్డులు, చెక్కుల లావాదేవీలు నిర్వహించవచ్చు. ♦ నగదు డిపాజిట్, ఉపసంహరణ కోసం సంబంధిత పోస్ట్మాన్కు 24గంటల ముందు సందేశం పంపితే ఇంటికి వచ్చి లావాదేవీలు నిర్వహిస్తారు. ఈ లావాదేవీలు రూ.10 వేలకు మించరాదు. బయోమెట్రిక్ పరికరం ద్వారా వేలిముద్ర తీసుకుంటారు. ♦ నగదు ఉపసంహరించుకున్నా, డిపాజిట్ చేసినా వాయిస్ మెసేజ్ వస్తుంది. దీంతో చదువు రాని వారు కూడా లావాదేవీలు తెలుసుకోవచ్చు. ♦ పోస్టల్ ఏటీఎం ద్వారా జరిపే లావాదేవీలకు చార్జీ లు వసూలు చేయరు. ఎన్నిసార్లు నగదు తీసుకు న్నా అదనపు చార్జీలు చెల్లించనవసరం లేదు. -
రెండో రోజూ స్తంభించిన బ్యాంకింగ్ సేవలు
న్యూఢిల్లీ: స్వల్ప వేతనాల పెంపును నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన రెండు రోజుల సమ్మె గురువారంతో ముగిసింది. దాదాపు 10 లక్షల మంది పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో రెండో రోజున కూడా బ్యాంకింగ్ సేవలు స్తంభించాయి. డిపాజిట్లు, ఫిక్సిడ్ డిపాజిట్లు, ప్రభుత్వ ట్రెజరీ.. మనీ మార్కెట్ లావాదేవీలపై ప్రతికూల ప్రభావం పడటంతో పాటు దేశవ్యాప్తంగా పలు చోట్ల ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చాయి. సమ్మె ముగియడంతో శుక్రవారం నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థాయికి రానున్నాయి. సమ్మె కాలంలో చెక్కుల క్లియరింగ్ మినహా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి ప్రైవేట్ బ్యాంకుల్లో కార్యకలాపాలు యథాప్రకారంగానే కొనసాగాయి. బ్యాంకుల యాజమాన్యాల అసోసియేషన్ ఐబీఏ ఈసారి రెండు శాతమే వేతనాల పెంపును ప్రతిపాదించడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు యూనియన్లు బుధ, గురువారాల్లో రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ, లక్నో, గౌహతి మొదలైన ప్రాంతాలన్ని చోట్లా ఉద్యోగులు పాల్గొనడంతో సమ్మె ’విజయవంతం’ అయిందని సమ్మెకు పిలుపునిచ్చిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సంబంధించి 80 లక్షల పైచిలుకు చెక్కుల క్లియరింగ్ నిల్చిపోయిందని తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని శాఖలూ మూతబడ్డాయని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ హర్వీందర్ సింగ్ తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు వంటి ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా కొన్ని చోట్ల తమ యూనియన్లలో సభ్యత్వం గల ఉద్యోగులు ఉన్నారని, వారు సైతం సమ్మెలో పాల్గొన్నారని సింగ్ వివరించారు. దాదాపు 9 బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు.. యూఎఫ్బీయూలో భాగంగా ఉన్నాయి. మొత్తం 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు దేశవ్యాప్తంగా 85,000 పైచిలుకు శాఖలు ఉన్నాయి. -
ఏటీఎంతో... ఎన్నో పనులు!
ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్లు వచ్చాక కొన్ని రకాల బ్యాంకింగ్ సర్వీసులను ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా పొందే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. కాకపోతే ఏటీఎంలు వచ్చి చాలా కాలమైనా ఇప్పటికీ చాలా మంది వీటిని కేవలం క్యాష్ విత్డ్రాయల్, బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి బేసిక్ సేవలకు మాత్రమే వాడుతున్నారు. వాస్తవానికి ఏటీఎంలు ఈ రెండింటికే పరిమితం కాకుండా ఇతరత్రా అనేక బ్యాంకింగ్ సేవలను కూడా అందిస్తున్నాయి. వాటిపై పూర్తి అవగాహన కల్పించడానికే ఈ కథనం. నగదు డిపాజిట్లు చేయొచ్చు.. ప్రస్తుతం చాలా మటుకు బ్యాంకుల ఏటీఎంలలో నగదు డిపాజిట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటోంది. వీటిల్లో చిన్న మొత్తాలు డిపాజిట్ చేసుకోవచ్చు. సదరు డిపాజిట్ మెషీన్లో మీ కార్డును ఇన్సర్ట్ చేస్తే డిపాజిట్ ఎలా చేయాలన్న సూచనలు తెరపై కనిపిస్తాయి. వాటిని పాటిస్తూ, మీరెంత అమౌంటు డిపాజిట్ చేస్తున్నారన్నది ఎంటర్ చేస్తే చాలు. మెషీన్ మీ డిపాజిట్ను ధ్రువీకరించిన తర్వాత ఆ వివరాలకు సంబంధించిన ధ్రువీకరణ మెసేజి కూడా మీకు వస్తుంది. ప్రీ–అప్రూవ్డ్ పర్సనల్ లోన్ దరఖాస్తులు.. ఏటీఎంల ద్వారా ఎలాంటి బాదరబందీ లేకుండా రుణం కూడా పొందవచ్చనే అంశం చాలా మందికి తెలియదు. సాధారణంగా ఖాతాదారు లావాదేవీల తీరుతెన్నులు, రుణాల చెల్లింపు విధానం, క్రెడిట్ స్కోరు మొదలైనవాటన్నింటిని పరిగణనలోకి తీసుకుని బ్యాంకులు కొన్ని సార్లు ప్రి–అప్రూవ్డ్ లోన్లు ఆఫర్ చేస్తుంటాయి. చిన్నపాటి సూచనలు పాటిస్తూ ఏటీఎంల ద్వారానే ఈ లోన్లను తక్షణం పొందవచ్చు. ఇందుకోసం ఏటీఎం స్క్రీన్ మీద పర్సనల్ లోన్ ఆప్షన్ ఎంచుకుంటే.. మీకు లోన్ ఆఫర్ ఏదైనా ఉంటే తెరపై కనిపిస్తుంది. వడ్డీ రేట్లు, చార్జీలు, వ్యవధి మొదలైనవన్నీ మీకు ఆమోదయోగ్యమైతే, షరతులు.. నిబంధనలకు ఓకే చెప్పిన పక్షంలో మీ బ్యాంకు ఖాతాలోకి రుణ మొత్తం తక్షణం క్రెడిట్ అవుతుంది. నగదు బదిలీ చేసుకోవచ్చు.. సొంత బ్యాంకు లేదా ఇతర బ్యాంకుల్లోని అకౌంట్లకు కూడా నగదు ట్రాన్స్ఫర్ చేసే సదుపాయాన్ని ఏటీఎంలు అందిస్తున్నాయి. ఇందుకోసం ఫండ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత ఐఎంపీఎస్ ఆప్షన్ని ఎంచుకుని, లబ్ధిదారు ఖాతా, మొబైల్ నంబరు, ఎంఎంఐడీ, ఎంత మొత్తం బదిలీ చేయాలనుకుంటున్నారు వంటి వివరాలను పొందుపర్చి, కన్ఫర్మ్ చేస్తే చాలు. ఫండ్ ట్రాన్స్పర్ లావాదేవీ పూర్తయిపోయినట్లే. బిల్లులూ చెల్లించొచ్చు.. కరెంటు బిల్లు, గ్యాస్ సిలిండర్ బిల్లు మొదలైన బిల్లులన్నీ చెల్లించేందుకు కూడా ఏటీఎంలు ఉపయోగపడతాయి. డెబిట్ కార్డు ఇన్సర్ట్ చేశాక, పిన్ నంబరు ఎంటర్ చేసిన తర్వాత.. సదరు బిల్లు సర్వీసును ఎంచుకుని చెల్లించేయవచ్చు. మొబైల్, డీటీహెచ్ రీచార్జ్.. ఏటీఎంల ద్వారా ప్రీపెయిడ్ మొబైల్, డీటీహెచ్ కనెక్షన్లను రీచార్జ్ చేయించుకోవచ్చు. మీ కనెక్షన్ నంబరు, రీచార్జ్ అమౌంటు వివరాలు పొందుపరిస్తే చాలు. మీ ఖాతా నుంచి ఆ మొత్తం డెబిట్ అయ్యాక.. మీ మొబైల్ లేదా డీటీహెచ్ కనెక్షన్ రీచార్జ్ పూర్తవుతుంది. టర్మ్ డిపాజిట్ లేదా మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి... కొన్ని బ్యాంకుల ఏటీఎంల నుంచి నేరుగా ఫిక్సిడ్ డిపాజిట్లు కూడా చేయొచ్చు. ఎంత అమౌంటు ఎఫ్డీ చేద్దామనుకుంటున్నారు? కాల వ్యవధి ఎంత? వడ్డీ రేటెంత? వంటి వివరాలు ఎంటర్ చేసి, కన్ఫర్మ్ చేస్తే చాలు. లావాదేవీ పూర్తయిపోయాక.. మీ రిజిస్టర్డ్ అడ్రెస్కు ఎఫ్డీ సర్టిఫికెట్ పోస్టులో వస్తుంది. ఇక ఏటీఎం ద్వారా ఫండ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. సర్వీసును ఉపయోగించుకోవడానికి ముందుగా మీరు రిజిస్టర్ చేసుకుని ఉండాలి. ఆధార్ వివరాల నమోదు.. బీమా ప్రీమియంల చెల్లింపు.. ఏటీఎం ద్వారా మీ ఖాతాకు ఆధార్ నంబరును అనుసంధానం చేయొచ్చు. ఇందుకోసం ఏటీఎంలోకి కార్డ్ ఇన్సర్ట్ చేశాక రిజిస్ట్రేషన్ ఆప్షన్ను ఎంచుకోవాలి. లాగిన్ అయ్యాక, ఏ తరహా అకౌంటన్నది ఎంచుకుని, ఆధార్ నంబరు ఎంటర్ చేశాక... ఓకే చేస్తే సరిపోతుంది. మీ వివరాలు నమోదవుతాయి. ఇది జరిగిన 24 గంటల్లో సీడింగ్ కన్ఫర్మేషన్ మీకు అందుతుంది. ఎల్ఐసీ, ఎస్బీఐ లైఫ్ వంటి బీమా సంస్థలూ ఏటీఎంల ద్వారా బీమా ప్రీమియం కట్టే వెసులుబాటు అందిస్తున్నాయి. ఇందుకు బిల్ పే ఆప్షన్ను ఎంచుకుని, బీమా సంస్థ, పాలసీ నంబరు, పుట్టిన తేది, ప్రీమియం వంటి వివరాలు పొందుపర్చాక.. చెల్లింపును ధ్రువీకరించాలి. కార్డ్రహిత నగదు విత్డ్రాయల్స్.. డెబిట్ కార్డు ద్వారానే కాకుండా కార్డు లేకుండా కూడా ఏటీఎంల నుంచి నగదు విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే, కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాయల్ ఫీచరు గల ఏటీఎంలు అందుబాటులో ఉన్న వేరే ఎవరికైనా కూడా ఈ విధానంలో నిధులను ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నిర్దిష్ట కోడ్స్ని, అమౌంటుని, మొబైల్ నంబరుని ఎంటర్ చేస్తే చాలు.. ఏటీఎం లేదా డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎం మెషీన్ నుంచి క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇవి కాకుండా బ్యాంకులు ఇతరత్రా కూడా పలు సర్వీసులు ఏటీఎంల ద్వారా అందిస్తున్నాయి. మీ బ్యాంకును సంప్రతిస్తే ఆ వివరాలు పొందవచ్చు. -
ఎస్బీఐ కస్టమర్లకు చాట్బోట్
సాక్షి, ముంబై : ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం ఓ చాట్బోట్ను లాంచ్చేసింది. ఎస్బీఐ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారితంగా రూపొందించిన ఎస్బీఐ ఇంటెలిజెంట్ అసిస్టెంట్ లేదా ఎస్ఐఏ అనే చాట్ అసిస్టెంట్ను లాంచ్ చేసినట్టు ఏఐ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ పేజో తెలిపింది. ఈ చాట్ అసిస్టెంట్ బ్యాంకింగ్ ప్రతినిధి లాగా ప్రతిరోజూ బ్యాంకింగ్కు సంబంధించిన లావాదేవీల్లో కస్టమర్లకు సహకరించిందని కంపెనీ తెలిపింది. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఎస్ఐఏ ఓ విప్లవమని పేజో ఫౌండర్, సీఈవో శ్రీనివాస నిజయ్ అన్నారు. సెకనుకు 10 వేల ఎంక్వయిరీలను, రోజుకు 864 మిలియన్ల ఎంక్వయిరీలను ఇది పరిష్కరిస్తుందని చెప్పారు. ఎస్ఐఏ కస్టమర్ సర్వీసుల నాణ్యతను పెంచుతుందని ఎస్బీఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శివ్ కుమార్ బాసిన్ చెప్పారు. బ్యాంకింగ్ డొమైన్లో అత్యంత నిపుణి అయిన పేజో, తమకు ఎస్ఐఏ అభివృద్ధి చేయడంలో ఎంతో సహకరించిందని తెలిపారు. నిర్వహణ వ్యయాలను ఎస్ఐఏ తగ్గిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకింగ్ ఉత్పత్తుల, సర్వీసుల ఎంక్వయిరీలను ఎస్ఐఏ పరిష్కరిస్తోంది. -
పెట్రోల్ బంకుల్లో బ్యాంకింగ్ సేవలు
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తాజాగా హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్)తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు హెచ్పీసీఎల్ పెట్రోల్ బంకుల్లో కొత్తగా ఖాతాను ప్రారంభించొచ్చు. అలాగే క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. కస్టమర్ల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, వారికి ఉపయోగకరమైన సేవలను అందించడం సహా దేశంలో డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది. ‘‘దాదాపు 14,000కు పైగా ఉన్న హెచ్పీసీఎల్ పెట్రోలు బంకులన్నీ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్కు బ్యాంకింగ్ పాయింట్లుగా వ్యవహరిస్తాయి. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు వీటి వద్ద ఖాతాను ప్రారంభించటం, నగదు డిపాజిట్, విత్డ్రాయెల్స్, మనీ ట్రాన్స్ఫర్ వంటి బ్యాంకింగ్ సేవలను పొందొచ్చు’’ అని అలాగే బ్యాంక్ కస్టమర్లు వారి హ్యాండ్సెట్స్ సాయంతో డిజిటల్ పేమెంట్స్ ద్వారా హెచ్పీసీఎల్ స్టేషన్లలో ఫ్యూయెల్ను కొనుగోలు చేయవచ్చని తెలిపింది. -
మీ సేవా కేంద్రాల్లో బ్యాంకింగ్ సేవలు
నగదు రహిత లావాదేవీలపై శిక్షణ కార్యక్రమంలో జేసీ గిరీషా చిత్తూరు (కలెక్టరేట్): మీసేవా కేంద్రాల్లో బ్యాంకింగ్ సేవలు నిర్వహించాలని జిల్లా జారుుంట్ కలెక్టర్ పీఎస్ గిరీషా తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని డీఆర్డీఏ కార్యాలయ సమావేశ భవనంలో జిల్లాలోని మీ సేవా ఆపరేటర్లకు నగదు రహిత లావాదేవీలు, బ్యాంకింగ్ సేవలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జేసీ ప్రారంభించారు. లో భాగంగా కామన్ సర్వీస్ సెంటరు ద్వారా రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా మన జిల్లాలో మీసేవా కేంద్రాల ద్వారా నగదు రహిత, బ్యాంకింగ్ సేవలు చేపట్టనున్నామన్నారు. మీసేవా కేంద్రాలకు వివిధ పనుల నిమిత్తం విచ్చేసే ప్రజల నుంచి నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలన్నారు. అదేగాక సామాజిక పింఛనుదారులకు పింఛను మొత్తాలను బయోమెట్రిక్ విధానంతో వారి బ్యాంకు ఖాతాలోని నగదును ట్రాన్సఫర్ చేసుకుని, పింఛను మొత్తాలను అందించే ప్రక్రియను కూడా చేపట్టాలన్నారు. బ్యాంకుల్లో ఖాతాదారులకు కూడా మీసేవా కేంద్రాల్లో నగదును అందించాలన్నారు. ఇందుకోసం ప్రతి మీసేవా కేంద్రంలో ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేసుకుని నగదు లావాదేవీలను నడపాలన్నారు. ప్రస్తుతం అర్బన్ ప్రాంతాల్లో ఈ-పాస్ మిషన్ల ద్వారా నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. దీనిని వందశాతం మేరకు పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇందుకోసం మీ సేవా ఆపరేటర్లు ఈ-పాస్ యంత్రాలు, మొబైల్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యాప్, మెబైల్ వాలెట్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు ఏవిధంగా జరపాలనే విషయాలను ఈ శిక్షణ ద్వారా పూర్తి స్థారుులో అవగాహన పొందాలన్నారు. ప్రస్తుతం వస్తున్న టెక్నాలజీలోని మార్పులను ఆపరేటర్లు పూర్తిస్థారుులో అవగాహన పెంచుకుని, ప్రజాసేవ చేయాలని డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్డీయం రామ్మోహన్, మైనార్టీ కార్పోరేషన్ ఈడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
పేమెంట్ బ్యాంకులు మాకొద్దు!
⇔ లైసెన్సులు పొంది కూడా వెనక్కెళుతున్న సంస్థలు ⇔ ఇప్పటికే మూడు కంపెనీలు వెనకబాట ⇔ ఇక మిగిలినవి 8 కంపెనీలే ⇔ లాభదాయకత సమస్యలే కారణం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చే మహత్తర లక్ష్యంతో చాన్నాళ్ల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఈ మధ్య మళ్లీ కొత్త బ్యాంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే చిన్న బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేసుకోవటానికి పచ్చజెండా ఊపింది. మైక్రోఫైనాన్స్ సంస్థలు మొదలుకుని రిలయన్స్ నుంచి బిర్లాల దాకా పెద్ద పెద్ద కంపెనీలు సైతం పోటీపడి మరీ వీటి లెసైన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. 41 కంపెనీలు పోటీ పడితే చివరకు గతేడాది ఆగస్టులో 11 సంస్థలు పేమెంటు బ్యాంకు అనుమతుల్ని దక్కించుకున్నాయి. అయితే, ఇంత పోటీపడి అనుమతులు దక్కించుకున్నప్పటికీ ... తీరా ఏర్పాటు చేసే సమయం వచ్చేసరికి ఒక్కొక్క సంస్థ వెనక్కి జారుకుంటోంది. అన్నింటికన్నా ముందుగా ఈ ఏడాది మార్చిలో చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ సంస్థ తమకు పేమెంట్ బ్యాంకు లెసైన్స్ వద్దంటూ వెనక్కెళ్లిపోయింది. రెండు నెలల తర్వాత ఈ మే నెల్లో సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ, ఐడీఎఫ్సీ బ్యాంక్, టెలినార్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కన్సార్షియం కూడా పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించాయి. పెద్ద ఎత్తున విస్తరించేందుకు సంఖ్యాపరంగా తమకు తగినన్ని శాఖలు/కార్యాలయాలు లేవని ప్రమోటర్లు భావించడమే ఇందుకు కారణంగా ఈ సంస్థలు చెప్పాయి. ఇక తాజాగా ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా సైతం తప్పుకుంది. మహీంద్రా ఫైనాన్స్తో కలిసి అక్టోబర్-నవంబర్ నాటికల్లా పేమెంట్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని కసరత్తు చేసినప్పటికీ... అధిక పోటీ, ఒత్తిళ్లు తదితర అంశాల వల్ల ఈ రంగంలో లాభాలు రావటానికి చాలా సమయం పడుతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని టెక్ మహీంద్రా ఎండీ సీపీ గుర్నానీ చెప్పారు. తాము ఎంతో కష్టపడి మదింపు చేసి మరీ ఎంపిక చేసిన సంస్థలు ఇలా ఒక్కొక్కటిగా వైదొలుగుతుండటంతో ఆర్బీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎందుకిలా తిరుగు టపా!! మొదట్లో అంత స్పష్టంగా వెల్లడించకపోయినా... రానురాను పేమెంటు బ్యాంకులకున్న పరిమితులన్నీ బయటపడ్డాయి. ఈ బ్యాంకులు రూ.1 లక్ష వరకూ మాత్రమే డిపాజిట్లు స్వీకరించే అవకాశం ఉంటుంది. దీనికితోడు ఎవ్వరికీ రుణాలివ్వటానికి వీలుండదు. క్రెడిట్ కార్డులు కూడా జారీ చేయకూడదు. వీటన్నిటికీ తోడు ఈ బ్యాంకులు తాము సేకరించే నిధుల్లో 75 శాతం నిధుల్ని ప్రభుత్వ బాండ్లలోనే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మిగతా డబ్బును లిక్విడిటీ అవసరాల కోసం తమ వద్ద అట్టే పెట్టుకోవచ్చు. రుణాలెలా ఇవ్వవు కాబట్టి మొండి బకాయిల సమస్యా ఉండదు. అయితే, డిపాజిట్లను ఆకర్షించేందుకు అవి ఎంతో కొంత వడ్డీ రేటయితే చెల్లించక తప్పదు కదా!!. ఇక్కడే అసలు సమస్య వచ్చేది. ఏడాది మెచ్యూరిటీ వ్యవధి ఉండే ప్రభుత్వ బాండ్ల విషయం చూస్తే ప్రస్తుతం సుమారు ఏడు శాతం పైచిలుకు మాత్రమే రాబడి ఉంటోంది. మరోవైపు, ఇతర బ్యాంకులతో పోటీ పడాలంటే ఈ పేమెంటు బ్యాంకులు డిపాజిట్లపై ఎంత లేదన్నా నాలుగు నుంచి ఆరున్నర శాతమైనా వడ్డీ రేటు ఇస్తే కానీ ఖాతాదారులు ముందుకు రారు. అంటే నికరంగా వాటికి అర శాతం నుంచి ఒక్క శాతం మాత్రమే మార్జిన్ ఉంటుంది. నిర్వహణ ఖర్చులన్నీ కూడా ఈ కాస్త మొత్తంలోనే చూసుకోవాలి. అది సాధ్యం కావాలంటే ఖాతాదారులు, లావాదేవీల సంఖ్య భారీగా ఉండటం తప్పనిసరి. ఇతరత్రా బిల్లు పేమెంట్లు వంటివాటిపై చార్జీలు వసూలు చేసుకునే వీలున్నప్పటికీ... ఆరంభంలోనే వడ్డించడం మొదలుపెడితే కస్టమర్లు రారు. కాబట్టి ప్రారంభ దశలో కొన్నాళ్లైనా కొన్ని సేవలు ఉచితంగానే అందించక తప్పదు. ఇవన్నీ చూసుకుంటే సదరు బ్యాంకులు బ్రేక్ ఈవెన్ (లాభనష్ట రహిత స్థితి) సాధించాలన్నా కనీసం మూడు నుంచి అయిదేళ్ల కాలం పట్టేస్తుందని అంచనా. కోట్ల కొద్దీ కస్టమర్లు... భారీ నెట్వర్క్ ఉన్న టెలికం కంపెనీలు, పోస్టల్ విభాగం మొదలైన వాటికి ఈ పేమెంట్ బ్యాంకులు ప్రయోజనకరంగా ఉండగలవని విశ్లేషకుల అభిప్రాయం. బరిలో మిగిలినవి.. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా నువో (ఐడియా సెల్యులార్), ఎయిర్టెల్, వొడాఫోన్, పోస్టల్ శాఖ, ఫినో పేటెక్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డీఎల్), విజయ్ శేఖర్ శర్మ (పేటీఎం వ్యవస్థాపకుడు). -
ప్రతీ గ్రామంలో ‘బ్యాంకింగ్’
న్యూఢిల్లీ: సాంకేతికత, ఉమ్మడి సేవా కేంద్రాల(సీఎస్సీ) సహాయంతో దేశంలోని అన్ని గ్రామాల్లో బ్యాంకింగ్ సర్వీసులను ప్రారంభించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని టెక్నాలజీ, కమ్యూనికేషన్, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సీఎస్సీల కింద పనిచేస్తున్న గ్రామస్థాయి మహిళా పారిశ్రామికవేత్తల(వీఎల్ఈ) సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే సీఎస్సీల ద్వారా నగదు తీసుకునే అవకాశం ఉంది. తొందరలోనే ఈ కేంద్రాల్లో అకౌంట్ తెరిచే సదుపాయాన్ని కూడా ప్రారంభించనున్నామని ఆయన వివరించారు. పాన్కార్డులు, పాస్పోర్టులు, రైల్టికెట్ల ద్వారా వీఎల్ఈలు రూ. 438 కోట్లు సంపాదిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రధాన కల అయిన స్టార్టప్ విప్లవంలో వీఎల్ఈలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం, లబ్ధిదారులకు మధ్య సమన్వయానికి, అవినీతి, జాప్యం తగ్గించడానికి సీఎస్సీలు ప్రధానంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. -
బ్యాంకింగ్ సేవలపై సమ్మె ప్రభావం పాక్షికం
నిల్చిన 21 లక్షల చెక్కుల క్లియరెన్సు లావాదేవీలు న్యూఢిల్లీ: బ్యాంకుల సిబ్బంది సమ్మెతో శుక్రవారం దాదాపు రూ. 16,000 కోట్ల విలువ చేసే 21 లక్షల చెక్కుల క్లియరెన్స్ నిల్చిపోయినట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 3,50,000 మంది బ్యాంకర్లు ఈ సమ్మెలో పాల్గొన్నట్లు వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు.. క్లరికల్ ఉద్యోగులపై సర్వీసు నిబంధనలను ఏకపక్షంగా రుద్దుతున్నాయన్న ఆరోపణలపై జరిగిన ఒక రోజు దేశవ్యాప్త సమ్మెతో బ్యాంకింగ్ కార్యకలాపాలపై పాక్షికంగా ప్రభావం పడింది. ఏఐబీఈఏ బలంగా ఉన్న బ్యాంకుల శాఖల్లో నగదు హ్యాండ్లింగ్, చెక్కుల క్లియరెన్సులు మొదలైన లావాదేవీలపై ప్రతికూల ప్రభావం పడింది. అధికారులు ఈ సమ్మెలో పాల్గొనలేదు. ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని, సిబ్బందిపై ఏకపక్షంగా నిబంధనలు రుద్దుతున్నాయన్న ఆరోపణలతో ఉద్యోగ సంఘాలు డిసెంబర్ 28న సమ్మె నోటీసులు ఇచ్చాయి. దేశవ్యాప్తంగా తమ 3,000 శాఖలు/కార్యాలయాల్లో దాదాపు 10,000 మంది, తెలంగాణలోని శాఖల్లో సుమారు 2,500 మంది పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నట్లు ఆంధ్రా బ్యాంక్ అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ విభాగం జనరల్ సెక్రటరీ ఎన్వీ రమణ తెలిపారు. కాగా, అనుబంధ బ్యాంకుల్లో సర్వీసు నిబంధనలు మార్చని పక్షంలో ఏఐబీఈఏ నిరవధిక సమ్మెకు దిగుతుందని, జనవరి 13న చెన్నైలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నామని రాజస్తాన్ ప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ మహేశ్ మిశ్రా తెలిపారు. -
ఫినో మనీ ద్వారా 6 నెలల్లో బ్యాంకింగ్ సేవలు
ఫినో పే టెక్ జోనల్ హెడ్ అజయ్ పరిహార్ సాక్షి, హైదరాబాద్: ఫినో మనీ మార్ట్లో వచ్చే ఆరునెలల్లో బ్యాంకింగ్ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని ఫినో పే టెక్ లిమిటెడ్ జోనల్ హెడ్ అజయ్ పరిహార్ పేర్కొన్నారు. హైదరాబాద్లో ఫినో మనీ మార్ట్ కార్యాలయాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అజయ్ పరిహార్ మాట్లాడుతూ సంస్థ ద్వారా హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న ఔట్ లెట్లలో ఈ బ్యాంకింగ్ సేవలను అందుబాటులో తేవడానికి రిజర్వుబ్యాంక్ అనుమతి పోందడం జరిగిందన్నారు. ఇటీవల ఫినో మనీకి పేమెంట్ బ్యాంకు లెసైన్సు లభించిన సంగతి తెలిసిందే. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి 500 దాకా ఫినో మనీ ఫ్రాంచైజీలు పనిచేస్తుండగా, హైదరాబాద్ నగరంలో 17 ఔట్లెట్లను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా విద్యుత్, మున్సిపల్, మొబైల్ బిల్లులు ఎల్ఐసీ ప్రీమియంలు చెల్లించడానికి, బస్సు, రైలు, విమాన టికెట్లను పొందడానికి, ఆన్లైన్ షాపింగ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. నగరంలోని ఔట్లెట్ల ద్వారా ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వినియోగదారులు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. ఎలాంటి బ్యాంక్ అకౌంట్ లేకపోయినా వివిధ ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన వారు తమ కుటుంబసభ్యులు, స్నేహితులు, ఇతరుల బ్యాంక్ అకౌంట్లలోకి నగదును పంపించడానికి అవకాశం కల్పిస్తున్నా మన్నారు. -
ఐ-వాచ్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రైవేటు రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దేశంలోనే తొలిసారిగా ఐ-వాచ్లో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందరికీ డిజిటల్ బ్యాకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో యాపిల్ వాచీ ద్వారా బ్యాంకింగ్ సేవలను ప్రారంభించినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. దేశంలో వేరబుల్ మార్కెట్కు డిమాండ్ పెరుగుతుండటంతో తొలుత యాపిల్ వాచీలో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చామని, త్వరలోనే ఐవోఎస్, ఆండ్రాయిడ్ వేరబుల్స్లో కూడా బ్యాంకింగ్ సేవలను తీసురానున్నట్లు హెచ్డీఎఫ్సీ డిజిటల్ బ్యాంకింగ్ హెడ్ నితిన్ చుగ్ తెలిపారు. ప్రారంభంలో ఐవాచ్ ద్వారా కేవలం 10 బ్యాంకింగ్ సేవలను మాత్ర మే అందుబాటులోకి తెచ్చామని, రానున్న కాలం లో మరిన్ని సేవలను తీసుకురానున్నట్లు ఆయన తెలి పారు. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ ఆన్లైన్ నెట్ బ్యాం కింగ్లో 150, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా 80 బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. ఐ-వాచ్లో బ్యాంకింగ్ సేవల కోసం మొబైల్ బ్యాంక్కు కోసం అభివృద్ధి చేసిన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుందని నితిన్ చుగ్ వెల్లడించారు. -
‘బంధన్’కు లైన్క్లియర్
♦ ఆర్బీఐ నుంచి పూర్తిస్థాయి లెసైన్స్ ♦ ఆగస్టు 23 నుంచి కార్యకలాపాలు ♦ దాదాపు 600 శాఖలతో ప్రారంభం ముంబై : సూక్ష్మ రుణాల సంస్థ బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎఫ్ఎస్) ప్రతిపాదిత బ్యాంకుకు రిజర్వ్ బ్యాంకు నుంచి పూర్తి స్థాయి లెసైన్సు లభించింది. దీంతో.. బంధన్ బ్యాంకు కార్యకలాపాలు ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్నాయి. బీఎఫ్ఎస్ డెరైక్టర్ చంద్ర శేఖర్ ఘోష్ బుధవారం ఈ విషయాలు తెలిపారు. తమ కేంద్ర కార్యాలయం ఉన్న కోల్కతాలోనే బ్యాంకును కూడా ఆవిష్కరించనున్నట్లు ఆయన వివరించారు. ముందుగా 500-600 శాఖలతో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ఘోష్ తెలిపారు. తూర్పు, ఈశాన్య రాష్ట్రాలపైనా, బ్యాంకింగ్ సేవలు అంతగా అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాలపైనా ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం 22 రాష్ట్రాల్లో బీఎఫ్ఎస్కి ఉన్న 2,200 కార్యాలయాలు, 17,000 పైచిలుకు ఉద్యోగులు, 66 లక్షల పైగా కస్టమర్లు, రూ. 10,000 కోట్లకు పైగా రుణ ఖాతాలు అన్నీ కూడా తొలి రోజు నుంచే బంధన్ బ్యాంకులో భాగమవుతాయని ఘోష్ పేర్కొన్నారు. మేనేజ్మెంట్ బృందంలో 20 మంది సభ్యులు ఉంటారని, ఇతరత్రా సంస్థల నుంచి 850 మంది ఉద్యోగులను తీసుకున్నామని తెలిపారు. 2006లో కోల్కతాలో బంధన్ ఫైనాన్షియల్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. రిలయన్స్ క్యాపిటల్, టాటా సన్స్ వంటి దిగ్గజాలు పోటీపడినప్పటికీ.. ఇన్ఫ్రా ఫైనాన్స్ సంస్థ ఐడీఎఫ్సీతో పాటు బంధన్ బ్యాంకుకు గతేడాది ఏప్రిల్లో ఆర్బీఐ సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చింది. చిన్న మొత్తాల్లో రుణాలు.. బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించిన తొలి రోజు నుంచే చిన్న మొత్తాల్లో రుణాల మంజూరీ కూడా ఉండగలదని ఘోష్ వివరించారు. దాదాపు రూ. 10 లక్షల దాకా గృహ, వాహన రుణాలను ఇచ్చే అవకాశాలున్నాయని తెలి పారు. ప్రస్తుతం సూక్ష్మ రుణాల సంస్థగా 22.4 శాతం వడ్డీ రేటు విధిస్తుండగా, బ్యాం కుగా మారిన తర్వాత ఈ రేటు తగ్గుతుందని ఆయన చెప్పారు. ఇదంతా కూడా డిపాజిట్ల సమీకరణను బట్టి ఉండగలదన్నారు. ప్రస్తుతానికి డెబిట్ కార్డులు మాత్రమే ఇవ్వనున్నామని, క్రెడిట్ కార్డులు ఉండబోవని ఘోష్ చెప్పారు. ఐఎఫ్సీ, సిడ్బీ తదితర షేర్హోల్డర్లు రూ. 500 కోట్లు సమకూర్చగలరన్నారు. ఇక, తొలి మూడేళ్లలో తమకు అదనంగా నిధులు అవసరం లేదని, 2018 నాటికల్లా ఐపీవోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఘోష్ తెలిపారు. దక్షిణాదిన 4 రాష్ట్రాల్లో విస్తరణ.. ప్రస్తుతం తమ కార్యకలాపాలున్న ప్రాంతాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, దక్షిణాదిన నాలుగు రాష్ట్రాల్లో బంధన్ బ్యాంకు కార్యకలాపాలు ఉండగలవని ఘోష్ తెలిపారు. కొత్తగా ప్రారంభించే శాఖల్లో దాదాపు 200 బ్రాంచీలు మెట్రో, పట్టణ ప్రాంతాల్లోనూ మిగతావి సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉంటాయని ఆయన తెలిపారు. 2,200 పైగా కార్యాలయాలు.. ఖాతాదారులకు ఇంటి వద్దే సర్వీసులు అందించే విధమైన సేవా కేంద్రాలుగా ఉంటాయని ఆయన చెప్పారు. మొదటి రోజు నుంచే 250 ఏటీఎం సెంటర్లు అందుబాటులో ఉండగలవన్నారు. లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అవసరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు వివరించారు. -
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం
ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించాం... * ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు మరిన్ని చర్యలు... * ఏడాది పాలనపై బహిరంగ లేఖలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: దారీతెన్నూలేని ఆర్థిక వ్యవస్థను తమ ప్రభుత్వ ఏడాది పాలనలో చక్కదిద్దామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతేకాకుండా, ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడం, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించిన ఘనత కూడా తమదేనని చెప్పారు. ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న భారీ ఆకాంక్షలను నెరవేర్చడం కోసం రానున్న రోజుల్లో మరిన్ని చర్యలు చేపడతామని ప్రధాని హామీనిచ్చారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మోదీ ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో ఈ ఆర్థికపరమైన అంశాలను ప్రస్తావించారు. ‘మా ప్రభుత్వ హయాంలో ఎకానమీ పునరుత్తేజితమైంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. ద్రవ్యలోటును అదుపులోకి తీసుకొచ్చాం. విదేశీ పెట్టుబడులు పెరిగాయి. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు భారత్పై సానుకూల ధోరణిని అనుసరించేలా చేయగలిగాం’ అని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. పెండింగ్ సంస్కరణలకు మోక్షం... తాము అధికారంలోకి వచ్చాకే డీజిల్ ధరలపై నియంత్రణల తొలగింపు... బీమా, రక్షణ వంటి కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) పరిమితి పెంపు వంటి పెండింగ్లో ఉన్న పలు సాహసోపేతమైన సంస్కరణలకు ఆమోదముద్ర వేశామని ప్రధాని పేర్కొన్నారు. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమల్లో పురోగతి సాధించామన్నారు. ‘నవ భారత్ నిర్మా ణం, గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడం కోసం మీరంతా(ప్రజలు) నమ్మకంతో ఏడాది క్రితం నాకు పట్టంగట్టారు. ఈ దిశగా మేమెంతో ప్రగతి సాధించాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. 2014-15లో 7.4%గా నమోదైన జీడీపీ వృద్ధి రేటు(బేస్ ఇయర్ మార్పు తర్వాత) ఈ ఏడాది 8%పైగా ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కిరప్పించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయడమే కాకుండా.. పార్లమెంటులో దీనికి సంబంధించి చట్టాన్ని కూడా తీసుకొచ్చామని ప్రధాని వివరించారు. మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. * అందరికీ బ్యాంకింగ్ సేవల కల్పన కోసం ప్రారంభించిన జన ధన యోజన పథకం ద్వారా 15 కోట్ల బ్యాంక్ ఖాతాలను తెరిపించాం. దీనిద్వారా రూ.15,800 కోట్ల విలువైన డిపాజిట్లు ఖాతాల్లో జమయ్యాయి. * సామాజిక భద్రతకోసం ఉద్దేశించిన పెన్షన్, జీవితబీమా, ప్రమాద బీమా స్కీమ్లలో తొలి వారం రోజుల్లోనే 6.75 కోట్లమంది చేరారు. * ఉద్యోగాల కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్న చిన్న వ్యాపారవేత్తలకు తగిన రుణ సదుపాయం అందించేందుకు రూ.20,000 కోట్లతో ముద్రా బ్యాంక్ను నెలకొల్పాం. * లక్షలాది కొత్త కొలువుల సృష్టే లక్ష్యంగా ‘మేక్ ఇన్ ఇండియా’కు రూపకల్పన చేశాం. భారత్ను వ్యాపారాలకు అత్యంత అనువైన దేశంగా మార్చడంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాం. * వంటగ్యాస్ ఇతరత్రా ప్రభుత్వ సబ్సిడీలను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి చేర్చేలా తగిన చర్యలు తీసుకున్నాం. * దేశాభివృద్ధిలో రాష్ట్రాలకు తగిన భాగస్వామ్యం కల్పించేలా ‘టీమ్ ఇండియా’ భావనను పెంపొ ందిస్తున్నాం. బొగ్గు గనుల వేలాన్ని పారదర్శకంగా నిర్వహించడం కోసం మైనింగ్ చట్టంలో మార్పులు చేయడమేకాకుండా దీనిద్వారా లభిం చనున్న రూ.3.35 లక్షల కోట్ల ఆదాయాన్ని సంబంధిత రాష్ట్రాలకు అందిస్తున్నాం. * నిలిచిపోయిన హైవే ప్రాజెక్టులను పునరుద్ధరించాం. మా హయాంలోనే విద్యుత్ఉత్పత్తి ఆల్టైమ్ గనిష్టానికి చేరింది. ఏటా రూ.20 వేల కోట్ల ప్రభుత్వ నిధులను అందిచేలా కొత్తగా జాతీయ మౌలికరంగ పెట్టుబడి ఫండ్ను నెలకొల్పాం. -
తెలుగు రాష్ట్రాలపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దృష్టి
వచ్చే ఏడాది కొత్తగా 60కిపైగా శాఖలు బ్యాంకింగ్ సేవలు లేని గ్రామాలే ప్రాధాన్యం తెలంగాణలో 150వ శాఖ ప్రారంభం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ మధుసూదన్ హెగ్డే హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎటువంటి బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని గ్రామాల్లో కొత్త శాఖలు ఏర్పాటు చేయడంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రైవేటురంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది. ఇందుకోసం కేవలం ఇద్దరు ఉద్యోగులతో అన్ని సేవలను అందించే విధంగా ‘మినీ బ్రాంచ్’లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లో 30కిపైగా మినీ బ్రాంచ్లను ఏర్పాటు చేశామని, వచ్చే ఏడాదిలోగా మరో 15 మినీ బ్రాంచ్లను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ మధుసూదన్ హెగ్డే తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 150వ శాఖను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రెండు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది కొత్తగా 60 శాఖలను ఏర్పాటు చేయనున్నామని, ఇందులో 20 నుంచి 25 శాతం మినీ బ్యాంకు శాఖలుంటాయన్నారు. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీకి తెలంగాణలో 150, ఆంధ్రప్రదేశ్లో 107 శాఖలున్నాయి. రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపార అవకాశాలు పెరిగే అవకాశాలు ఉండటంతో అక్కడ కొత్త శాఖల ఏర్పాటుకు డిమాండ్ పెరుగుతుందన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే శాఖల ద్వారా సుమారుగా 800 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. తెలంగాణలో 150వ శాఖ అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో 150వ శాఖను కొండాపూర్లో లాంఛనంగా ప్రారంభించారు. 1997లో తొలి శాఖను లకిడికాపూల్లో ఏర్పాటు చేశామని, ప్రస్తుతం బ్యాంకు వ్యాపార పరిమాణం రూ. 30,700 కోట్లు దాటిందన్నారు. పరిశ్రమ నమోదు చేస్తున్న వృద్ధిరేటు కంటే సగటున 6-7 శాతం అధిక వృద్ధిరేటును నమోదు చేస్తున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా వ్యాపారంలో అదే విధమైన వృద్ధిని కొనసాగించగలమన్న ధీమాను హెగ్డే వ్యక్తం చేశారు. -
ఆరు నెలల ప్రగతిపై ఆర్థిక శాఖ నివేదిక
న్యూఢిల్లీ: మోదీ సర్కారు తొలి ఆరు నెలల్లో సాధించిన పలు విజయాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అందరికీ బ్యాంకింగ్ సేవల కల్పన కోసం ఉద్దేశించిన ప్రధాన మంత్రి జన ధన యోజన(పీఎంజేడీవై), వరిష్ట పెన్షన్ బీమా యోజన(వీపీబీవై), నల్లధనంపై పోరు వంటి కీలకాంశాలను ప్రస్తావించింది. ఈ ఏడాది మే నెలలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కితెచ్చేందుకు తక్షణం సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేసింది. అదేవిధంగా పన్ను ఎగవేతలు, నల్లధనానికి చెక్ చెప్పేందుకు పన్నుల సమాచారాన్ని ఆటోమేటిక్గా ఎక్స్ఛేంజ్ చేసుకునే అంతర్జాతీయ వ్యవస్థ అమలుకు భారత్ మద్దతు పలికిందని పేర్కొంది. జన ధన పథకం కింద వచ్చే జనవరి 26 నాటికి 7.5 కోట్ల బ్యాంక్ ఖాతాలను తెరిపించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. అనూహ్య స్పందనతో ఈ లక్ష్యాన్ని 10 కోట్లకు పెంచినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ నెల 23 నాటికి 9.91 కోట్ల జన ధన ఖాతాలు ప్రారంభమైనట్లు వెల్లడించింది. ఇక ప్రజల్లో పొదుపును ప్రోత్సహించేందుకు వీలుగా కిసాన్ వికాస పత్రాల(కేవీపీ)ను ప్రభుత్వం మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపింది. ఆటోమొబైల్, యంత్రపరికరాల రంగాలకు చేయూతనిచ్చేందుకు సుంకాల్లో రాయితీని ఈ డిసెంబర్ 31 వరకూ పొడిగించిన విషయాన్ని గుర్తుచేసింది. -
స్తంభించిన బ్యాంకింగ్ సేవలు
కొరిటెపాడు(గుంటూరు): వేతన సవరణ అమల్లో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగటంతో జిల్లాలో మంగళవారం బ్యాంకింగ్ సేవలు పూర్తిగా స్తంభించారుు. జిల్లాలోని 27 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 500 బ్రాంచిల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొనటంతో దాదాపు రూ.150 కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయూరుు. ఏటీఎంలలో తగినంత నగదును ముందుగానే పెట్టడంతో సాధారణ ఖాతాదారులకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. సమ్మె నుంచి సహకార రంగ బ్యాంకులను మినహాయించడంతో ఆయూ బ్యాంకుల బ్రాంచిల్లో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు గుంటూరు నగరంలోని పట్టాభిపురం స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొరిటెపాడులోని ఆంధ్రాబ్యాంక్ బ్రాంచిల వద్ద యూనియన్ల నేతలు, ఉద్యోగులు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వందలాది మంది ఎస్బీఐ ఉద్యోగులు నగరం పాలెంలోని ప్రధాన బ్రాంచి నుంచి పట్టాభిపురంలోని బ్రాంచి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కొరిటెపాడు ఆంధ్రాబ్యాంక్, పట్టాభిపురం ఎస్బీఐ శాఖల వద్ద జరిగిన సభల్లో ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ వేతన సవరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. వేతన సవరణను వెంటనే అమలు చేయకపోతే నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. -
బ్యాంకుకు వెళ్లకుండానే బ్యాంకింగ్ సేవలు
బ్యాంకింగ్ సేవల తీరుతెన్నులు గణనీయంగా మారిపోతున్నాయి. గతంలో డిపాజిట్ చేయాలన్నా, తీయాలన్నా ప్రతి దానికీ బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఏటీఎంలు వచ్చిన తర్వాత అది తగ్గింది. అలాగే ఇటీవలి కాలంలో మరికొన్ని మార్గాలూ అందుబాటులోకి వచ్చాయి. బ్యాంకులకు వెళ్లకుండానే సేవలను పొందే మార్గాల్లో కొన్ని ఇవి.. మిస్డ్ కాల్ సర్వీస్.. కొన్ని నగదు రహిత లావాదేవీల కోసం బ్యాంకులు ఈ టోల్ ఫ్రీ సర్వీసును అందిస్తున్నారు. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, చెక్ బుక్ రిక్వెస్టులు, అకౌంటు స్టేట్మెంట్స్ మొదలైన వాటికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. కస్టమరు కోరిన సర్వీసుకు సంబంధించి ఫోనుకు అప్పటికప్పుడు ఎస్ఎంఎస్ అలర్ట్ రూపంలో సమాచారం వస్తుంది. బేసిక్ ఫోన్లతో కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. దీన్ని ఉచితంగానే బ్యాంకులు అందిస్తున్నాయి. డెబిట్ కార్డుల వాడకం.. షాపింగ్కి బయలుదేరేటప్పుడు నగదును విత్డ్రా చేసుకోవడం, వెంట తీసుకెళ్లడం కాస్త రిస్కు కావొచ్చు. కాబట్టి సాధ్యమైన చోట్ల డెబిట్ కార్డులను ఉపయోగిస్తే నగదును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. పాయింట్ ఆఫ్ సేల్ టర్మినల్లో కార్డ్ స్వైప్ చేసి పిన్ నంబరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇది సురక్షితం, సౌకర్యవంతమైన సాధనం. పెపైచ్చు ప్రస్తుతం డెబిట్ కార్డు లావాదేవీలపై ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్ వంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. మొబైల్ బ్యాంకింగ్..నెట్ బ్యాంకింగ్.. ప్రస్తుతం నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ఎక్కడైనా, ఎప్పుడైనా బ్యాంకింగ్ లావాదేవీలు జరిపే వీలుంది. బిల్లులు కట్టాలన్నా, రుణాల ఈఎంఐలు చెల్లించాలన్నా, లేదా ఇతరులకు నగదు బదిలీ చేయాలన్నా ఎన్ఈఎఫ్టీ, ఐఎంపీఎస్ వంటి సదుపాయాలను ఫోన్లు, నెట్ ద్వారా చేసే సదుపాయం ఉంది. నాలుగైదు రోజులకోసారి ఏటీఎంకు.. ఏటీఎం లావాదేవీలపై పరిమితులు విధించిన నేపథ్యంలో వీటి వాడకం కూడా భారంగా మారనుంది. కాబట్టి ప్రతిరోజూ ఏటీఎంలకు వెళ్లకుండా నాలుగైదు రోజులకోసారి వెళ్లేలా ప్లాన్ చేసుకోండి. ఈలోగా మరీ అత్యవసరమైతే తప్ప వెళ్లకండి. సాధ్యమైనంత వరకూ ఏటీఎంలను నగదు విత్డ్రాయల్స్కే ఉపయోగించండి. సొంత బ్యాంకు ఏటీఎంలలో 5 లావాదేవీలను ఉచితంగా ఇస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోండి. మీ మొబైల్ ఫోనులో బ్యాంకు యాప్తో సమీపంలోని ఏటీఎం సమాచారం తెలుసుకోవచ్చు. -
‘సూపర్ మార్కెట్’ బ్యాంకులు వస్తున్నాయ్..!
ముంబై: బ్యాంకింగ్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు, పొదుపు అలవాటును ప్రోత్సహించేందుకు చిన్న స్థాయి ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్బీ), పేమెంట్ బ్యాంకులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ గురువారం తుది మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం మొబైల్ ఆపరేటర్లు, సూపర్ మార్కెట్ సంస్థలు, రియల్ ఎస్టేట్ సహకార సంస్థలు పేమెంట్ బ్యాంకులను ఏర్పాటు చేయొచ్చు. ప్రస్తుత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ), సూక్ష్మ రుణ సంస్థలు మొదలైనవి చిన్న స్థాయి ఫైనాన్స్ బ్యాంకుల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, భారీ ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రామిక సంస్థలను మాత్రం ఆర్బీఐ ఇందుకు అనుమతించదు. ఇక, ఈ కొత్త తరహా బ్యాంకుల ఏర్పాటుకు కనీస మూలధనం రూ. 100 కోట్లుగా ఆర్బీఐ నిర్ణయించింది. నిర్దిష్ట నిబంధనలను పూర్తి చేయగలిగితే ఈ చిన్న బ్యాంకులు పూర్తి స్థాయి బ్యాంకులుగా మారవచ్చు. తొలి రౌండులో పర్మిట్ల కోసం ఆసక్తి గల సంస్థలు జనవరి 16 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆర్బీఐ సూత్రప్రాయంగా ఇచ్చే అనుమతుల గడువు 18 నెలల దాకా ఉంటుంది. పేమెంట్ బ్యాంకులు రుణ వితరణ కార్యకలాపాలు జరిపేందుకు అనుమతి ఉండదు. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వీటి ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రారంభ దశలో ఇలాంటి బ్యాంకులో ఒక్కో వ్యక్తిగత ఖాతాదారుకు సంబంధించి గరిష్టంగా రూ. 1 లక్ష మించి బ్యాలెన్స్ అనుమతించరు. ఇవి ఏటీఎం/డెబిట్ కార్డులతో పాటు ఇతరత్రా ప్రీపెయిడ్ పేమెంట్ సాధనాలను జారీ చేయొచ్చు. క్రెడిట్ కార్డులు మాత్రం జారీ చేయకూడదు. ఇక, చిన్న ఫైనాన్స్ బ్యాంకుల విషయానికొస్తే.. ఇవి డిపాజిట్ల స్వీకరణతో పాటు చిన్న.. సన్నకారు రైతులకు, చిన్నవ్యాపార సంస్థలు మొదలైన వాటికి రుణాలివ్వడం వంటి ప్రాథమిక బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించవచ్చు. ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు.. పేమెంట్ బ్యాంకుల ఏర్పాటు చేసేందుకు అవసరమైన అనుభవం ఉన్న వ్యక్తులు, ప్రొఫెషనల్స్తో పాటు ఎన్బీఎఫ్సీలు, కార్పొరేట్ బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్, మొబైల్ టెలిఫోన్ కంపెనీలు, సూపర్ మార్కెట్ చెయిన్స్, కార్పొరేట్ సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకింగ్ సేవలు అంతగా విస్తరించని ప్రాంతాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఏర్పాటు చేయదల్చుకున్న వ్యక్తులకు బ్యాంకింగ్.. ఫైనాన్స్ రంగంలో పదేళ్ల అనుభవం ఉండాలి. బరిలో ఉన్నవి..: శ్రీరామ్ క్యాపిటల్, ముత్తూట్ ఫైనాన్స్ తదితర సంస్థలు ఈ తరహా బ్యాంకుల ఏర్పాటుపై ఆసక్తిగా ఉన్నట్లు ప్రకటించాయి. ఇట్జ్క్యాష్, ఆక్సిజెన్, మణప్పురం ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్తో కూడా ఆసక్తిగా ఉన్నాయి. -
పోస్టాఫీస్లో బ్యాంకింగ్ సేవలు
హన్మకొండ : హన్మకొండలోని ప్రధాన తపా లా కార్యాలయంలో కోర్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు హన్మకొండ అంబేద్కర్ విగ్రహం సమీపంలోని కార్యాలయంలో కోర్ బ్యాంకింగ్ సేవలను సోమవారం కాకతీయ యూనివ ర్సిటీ ఇన్చార్జ రిజిస్ట్రార్ ఎంవీ.రంగారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టల్ శాఖలో కోర్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రావ డం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు మేలు కల గనుందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడి నుంచైనా.... కోర్ బ్యాంకింగ్ ద్వారా ఖాతాదారులు దేశంలో ఏ పోస్టాఫీస్ నుంచైనా సేవలు పొందవచ్చని పోస్టల్ శాఖ హన్మకొండ డివిజన్ సూపరింటెండెంట్ జీ.వీ.సత్యనారాయణ తెలిపారు. డబ్బులు డిపాజిట్ చేయడం, బదిలీ తదితర లావాదేవీలను ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చన్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు సునాయా సం వంటి సేవలను ప్రవేశపెట్టిన తపాలా శా ఖ ద్వారా గ్రామీణ ప్రజలకు సులువైన బీమా పథకాలు అమలుచేస్తున్నామని తెలిపారు. కాగా, త్వరలోనే కోర్ బ్యాంకింగ్ సేవ లు జిల్లాలోని పరకాల, జనగామ ప్రధాన తపాలా కార్యాలయాల్లో అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. అలాగే, వచ్చే ఏడాది మార్చి 21వ తేదీ లోపు తపాల శాఖ ఏటీఎంలు ప్రారంభమవుతాయని, ఈ మేరకు పనులు జరుగుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో హన్మకొం డ హెడ్ పోస్ట్మాస్టర్ పి.సమ్మిరెడ్డి, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు వి.వి.స్వామి, ఏవీఎల్ఎన్ శివలింగం, ఏవీఎన్.నర్సింహారావు, అలీం, సిస్టం అడ్మినిస్ట్రేటర్లు ధర్మేశ్వర్సింగ్ పాషా, గ్రామీణ తపాల ఉద్యోగుల సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి బొద్దున వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఆధార్ నంబర్ భేష్
రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖ న్యూఢిల్లీ: ఆధార్పై కేంద్ర హోంశాఖ తన వైఖరిని పూర్తిగా మార్చుకుంది. ప్రభుత్వ పథకాలు, సేవలు ప్రజల్లోకి వెళ్లేందుకు ఆధార్ చక్కగా ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ మేరకు తాజాగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఒక వ్యక్తి సమస్త వివరాలను క్రోడీకరించి డాటాబేస్ నిర్వహించడంపై యూపీఏ ప్రభుత్వ హయాంలో హోంశాఖ పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఆధార్ నమోదుకు ప్రజలు అనేక గుర్తింపు పత్రాలు అందజేయాల్సి రావడంపైనా అభ్యంతరం తెలిపింది. అయితే ఇప్పుడు హోంశాఖ తన వైఖరిపై యూటర్న్ తీసుకోవడం గమనార్హం. ‘ఆధార్ సార్వత్రిక గుర్తింపుగా ఉపయోగపడుతుంది. నిరుపేదలు బ్యాకింగ్ సేవలు పొందేందుకు దోహదపడుతుంది. ఆధార్లో బయోమెట్రిక్ విధానాన్ని మోసాలను అరికట్టవచ్చు. ఆన్లైన్లో టికెట్ల బుకింగ్కు, పాస్పోర్టు దరఖాస్తుకు, పలుచోట్ల గుర్తింపునకు.. ఇలా ఆధార్ సంఖ్యతో బహుళ ప్రయోజనాలు పొందవచ్చు’ అని పేర్కొంది. -
ప్రతీ 5 కిలోమీటర్లకు బ్యాంక్ శాఖ: వెంకయ్య
జన ధన పథకాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతీ ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ‘జన ధన యోజన’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమం కింద ప్రతీ ఒక్కరితో బ్యాంకు ఖాతాలు తెరిపించడమే కాకుండా, రుణ సౌకర్యం కల్పిస్తున్నామని, మొదటి ఆరు నెలలు ఖాతాను సక్రమంగా వినియోగించిన వారికి రూ. 5,000 ఓవర్ డ్రాఫ్ట్ను ఇస్తున్నామని తెలిపారు. గురువారం హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో వెంకయ్య నాయుడు తెలంగాణలో జన ధన పథకాన్ని ప్రారంభించారు. ప్రతి ఐదు కిలోమీటర్లకూ ఒక బ్యాంకు శాఖతో పాటు, కుటుంబంలో కనీసం ఒక్కరికైనా బ్యాంకు ఖాతా ఉండాలన్నది ప్రధానమంత్రి నరేంద్రమోడీ లక్ష్యమన్నారు. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. సామాన్యునికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న కేంద్ర నిర్ణయాన్ని అభినందించారు. అలాగే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని రూ. 5,000 నుంచి రూ.10,000కి, బీమా రక్షణను రెండు లక్షలకు పెంచాల్సిందిగా వెంకయ్యకు సూచించారు. ఒక్క రోజులో 5 లక్షల ఖాతాలు తెలంగాణ రాష్ట్రంలో జన ధన యోజనకు అనూహ్యమైన స్పందన వచ్చిందని, ఒక్క రోజులోనే ఈ పథకం కింద సుమారు 5 లక్షల ఖాతాలను ప్రారంభించామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజింగ్ డెరైక్టర్ శంతను ముఖర్జీ తెలిపారు. -
బ్యాంకింగ్ లావాదేవీల్లో పెరిగిన ఫిర్యాదులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గడచిన ఆర్థిక ఏడాదిలో బ్యాంకింగ్ సేవలపై అందిన ఫిర్యాదుల్లో 4 శాతం వృద్ధి నమోదైనట్లు ఆర్బీఐ ప్రకటించింది. రెండు రాష్ట్రాల్లో కలిపి బ్యాంకింగ్ సేవలపై 4,477 ఫిర్యాదులు వచ్చాయని ఇందులో అత్యధికంగా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సేవలపైనే ఉన్నట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బ్యాంకింగ్ అంబూడ్స్మన్ ఎన్.కృష్ణ మోహన్ తెలిపారు. 2012-13ల్లో ఫిర్యాదుల సంఖ్య 4,303గా ఉంది. గతేడాది బ్యాంకింగ్ ఫిర్యాదుల వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొత్తం ఫిర్యాదుల్లో 28 శాతం ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సేవలపైనే ఉన్నాయని, ఇది కొద్దిగా ఆందోళన కలిగించే విషయమన్నారు. ఏటీఎం, క్రెడిట్ కార్డుల్లో భద్రతా ప్రమాణాలు పెంచినప్పటికీ ఇంకా ఖాతాదారుల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, అలాగే బ్యాంకులు కూడా మరింత పటిష్టమైన టెక్నాలజీని వినియోగించాల్సి ఉందన్నారు. బ్యాంకుల వారిగా చూస్తే ఎస్బీఐ, దాని అనుబంధ బ్యాంకులపైనే అధిక ఫిర్యాదులు ఉన్నాయని, కాని గతేడాదితో పోలిస్తే ఎస్బీఐ గ్రూపు వాటా తగ్గడం గమనించాల్సిన అంశంగా కృష్ణ మోహన్ పేర్కొన్నారు. 2012-13 ఫిర్యాదుల్లో ఎస్బీఐ గ్రూపు వాటా 47 శాతంగా ఉంటే అది ఇప్పుడు 44 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో ఇతర జాతీయ బ్యాంకులపై వచ్చిన ఫిర్యాదులు 24 శాతంగా ఉంటే ప్రైవేటు బ్యాంకులపై 18 శాతం ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన జరగడంతో ఫిర్యాదులను జిల్లాల వారీగా విభజించి లెక్కించడం జరిగిందని, ఈ ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి 53 శాతం ఫిర్యాదులు వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 47 శాతం వచ్చినట్లు కృష్ణ మోహన్ పేర్కొన్నారు. మెట్రోపాలిటన్, పట్టణాల్లో ఫిర్యాదుల సంఖ్య స్వల్పంగా పెరిగితే, గ్రామీణ ప్రాంతాల్లో తగ్గడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధాని ఏర్పడే వరకు రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఉమ్మడిగా సేవలను అందిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధాని ఏర్పడిన తర్వాత అక్కడ కొత్తగా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయంతో పాటు ప్రత్యేకంగా అంబూడ్స్మన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఆర్బీఐ రీజనల్ డెరైక్టర్ (ఏపీ, తెలంగాణ) కె.ఆర్.దాస్ తెలిపారు. బుధవారం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయంలో అంబూడ్స్మన్ విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
జెట్స్పీడ్లో సర్వీసులు
న్యూఢిల్లీ: దేశీ సర్వీసుల రంగం ప్రపంచంలోనే వేగవంత వృద్ధిని సాధిస్తున్నదని ఆర్థిక సర్వే పేర్కొంది. 2001-2012 కాలంలో వార్షికంగా 9% చొప్పున దూసుకెళుతూ వేగవంత వృద్ధిని అందుకుంటున్న రంగాలలో రెండో స్థానంలో నిలిచినట్లు తెలిపింది. ఈ కాలంలో 10.9% వృద్ధితో చైనా సర్వీసుల రంగం అగ్రస్థానంలో నిలిచినట్లు తెలిపింది. ఇక జీడీపీ విషయానికివస్తే ప్రపంచంలోని టాప్ 15 దేశాలలో ఇండియా 10వ ర్యాంక్లో ఉన్నట్లు వెల్లడించింది. సర్వీసుల జీడీపీ రీత్యా అయితే 12వ స్థానాన్ని పొందినట్లు పేర్కొంది. ప్రపంచ జీడీపీలో సర్వీసుల రంగం వాటా 65.9% అయినప్పటికీ, 2012లో ఉద్యోగ కల్పన విషయంలో ఈ వాటా 44% మాత్రమేనని పేర్కొంది. ఇదే కాలంలో ఇండియా జీడీపీలో సర్వీసుల రంగానికి 56.9% వాటా ఉండగా, ఉద్యోగ కల్పన రీత్యా కేవలం 28.1% వాటాను పొందినట్లు వివరించింది. అత్యంత ప్రాధాన్యత 2012-13తో పోలిస్తే 2013-14లో సర్వీసుల రంగ వృద్ధి నామమాత్రంగా తగ్గి 6.8%కు పరిమితమైనట్లు వెల్లడించింది. వాణిజ్యం హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, నిల్వలు, కమ్యూనికేషన్స్ వంటి విభాగాలు మందగించడం దీనికి కారణమైనట్లు తెలిపింది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాల ఆదాయాలతోపాటు, వాణిజ్యం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐలు), ఉద్యోగ కల్పనకు సంబంధించి ఇండియాలో సర్వీసుల రంగం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నదని వివరించింది. 2005-06లో 10% చొప్పున నిలకడగా దూసుకెళ్లిన ఈ రంగం గత మూడేళ్లుగా కొంతవెనకబడిందని తెలిపింది. సంస్కరణలకు తెర లేపడం, విధాన నిర్ణయాలను వేగంగా తీసుకోవడం, లక్ష్యాలు నిర్దేశించుకోవడం వంటి చర్యల ద్వారా ఈ రంగానికి జోష్ తీసుకురావలసి ఉన్నదని వివరించింది. ఇండియాకు గుర్తింపును తీసుకువచ్చిన సాఫ్ట్వేర్, టెలికం వంటి రంగాలపై ప్రత్యేక దృష్టిని పెట్టాల్సి ఉన్నదని సర్వే తెలిపింది. తయారీకి 16 ప్రత్యేక జోన్లు తయారీ రంగానికి జోష్నిస్తూ ప్రభుత్వం జాతీయ పెట్టుబడులు, తయారీ జోన్లు(ఎన్ఐఎంజెడ్లు) పదహారింటిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. జాతీయ తయారీ విధానాల్లో భాగంగా ప్రభుత్వం ఎన్ఐఎంజెడ్ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు వెల్లడించింది. దశాబ్ద కాలంలో జీడీపీలో తయారీ రంగ వాటాను 25%కు పెంచడం పాలసీ లక్ష్యమని తెలిపింది. తద్వారా 10 కోట్ల ఉద్యోగాల కల్పనను సాధించాలని భావిస్తున్నట్లు తెలిపింది. 16 ఎన్ఐఎంజెడ్లలో ఎనిమిదింటిని ఢిల్లీ-ముంబై కారిడార్(డీఎంఐసీ)లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. మరో 8 ఎన్ఐఎంజెడ్లకు ముందస్తు అనుమతి మంజూరు చేసినట్లు వెల్లడించింది. ఇవి నాగ్పూర్, చిత్తూరు, మెదక్, టుమ్కూర్, కోలార్, బీదర్, గుల్బ ర్గాలలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తూ కనీసం 50 చదరపు కిలోమీటర్ల (5,000 హెక్టార్లు) పరిధిలో సమీకృత టౌన్షిప్ల తరహాలో వీటిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపింది. డీఎంఐసీ ప్రాజెక్ట్ను జపాన్ సహకారంతో అభివృద్ధి చేయనున్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలతోపాటు పశ్చిమ రైల్వే కారిడార్లను కలుపుతూ ఈ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయనున్నట్లు వివరించింది. ఆగ్రోప్రాసెసింగ్, జౌళి, దుస్తులు, తోలు ఉత్పత్తులు, పాదరక్షల రంగాలను పటిష్టపరచడం ద్వారా తయారీ రంగాన్ని మరింత పురోభివృద్ధిలో నిలపవచ్చునని తెలిపింది. చెన్నై-బెంగళూరు-చిత్రదుర్గ పారిశ్రామిక కారిడార్వల్ల కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు లబ్ది చేకూరుతుందని తెలిపింది. ఎగుమతుల వాటా 4 శాతానికి పెంచాలి... ప్రపంచ ఎగుమతుల్లో భారత్ వాటాను వచ్చే ఐదేళ్లలో కనీసం 4 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే సూచించింది. 2013-14లో దేశ ఎగుమతుల వాటా 1.7 శాతంగా ఉంది. దీన్ని 4 శాతానికి పెంచాలంటే ఏటా ఎగుమతుల్లో 30 శాతం వృద్ధిని సాధించాలని కూడా పేర్కొంది. 2003-04 నుంచి 2007-08 మధ్య ఎగుమతుల్లో 20 శాతం వృద్ధి నమోదైందని.. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే లక్ష్యం అసాధ్యమేమీ కాదని కూడా సర్వే తెలిపింది. ప్రపంచ ఎగుమతుల్లో మన వాటా 1990లలో 0.5 శాతం మాత్రమే ఉందని.. 2013 నాటికి ఇది 1.7 శాతానికి పెరిగిందని సర్వే పేర్కొంది. ఇదే సమయంలో చైనా ఎగుమతుల వాటా 1.8 శాతం నుంచి ఏకంగా 11.8 శాతానికి ఎగబాకడాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. 2013-14 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 325 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా... 312 బిలియన్ డాలర్లు మాత్రమే జరిగాయి. అంటే లక్ష్యానికి 13 బిలియన్ డాలర్లు తగ్గాయి. ఇక ఆర్థిక సంవత్సరం మే నెలలో 12.4 శాతం వృద్ధితో 24.9 డాలర్లకు ఎగబాకాయి. గడిచిన ఏడు నెలల్లో మళ్లీ దేశీ ఎగుమతులు రెండంకెల వృద్ధిని అందుకోవడం గమనార్హం. కార్మిక సంస్కరణలు రావాలి కొత్త సంస్థలను ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించేందుకు రెండో తరం కార్మిక సంస్కరణలను అమలు చేయాలి... అపారంగా ఉన్న మానవ వనరులను వినియోగించుకోవాలని సర్వే సూచించింది. 2000-2005 మధ్యకాలంలో 2.8 శాతంగా ఉన్న ఉద్యోగావకాశాల వృద్ధి రేటు 2005-2012 లో 0.5 శాతానికి పడిపోయిన నేపథ్యంలో ఈ సూచనకు ప్రాధాన్యం ఏర్పడింది. దాదాపు 125 కోట్లుగా ఉన్న భారత జనాభా సగటు వయసు 2020లో 29 ఏళ్లుగా ఉంటుందని అంచనా. చైనా, అమెరికా(సగటు వయసు 37 ఏళ్లు)లతో పోలిస్తే ఇండియాలో పిన్నవయస్కులు అధికంగా ఉంటారు. పనిచేసే వయసులో ఉండే జనాభా సంఖ్య 2001లో 58% ఉండగా 2021 నాటికి 64%కి పెరగనుంది. స్పెక్ట్రం పాలసీని మెరుగుపరచాలి... టెలికం స్పెక్ట్రం నిర్వహణకు సంబంధించి మరింత మెరుగైన పాలసీని రూపొందించాలి. ముఖ్యంగా స్పెక్ట్రం ట్రేడింగ్, షేరింగ్కు కంపెనీలను అనుమతించడంద్వారా వ్యయాలు తగ్గించుకునేందుకు దోహదం చేస్తుంది. జతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్(ఎన్ఓఎఫ్ఎన్), దేశవ్యాప్తంగా నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్పీ), గ్రామీణ టెలికం వినియోగదారుల సంఖ్యను పెంచడంపై ప్రభుత్వం దృష్టిసారించాలి. ఎన్ఓఎఫ్ఎన్ కింద దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలను హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవల నెట్వర్క్తో అనుసంధానించాలన్న లక్ష్యాన్ని ఆర్థిక స్పష్టంగా నిర్ధేశించింది. దీనిప్రకారం... వచ్చే ఏడాది మార్చినాటికి 50 వేల పంచాయతీలను, 2016 మార్చికల్లా మరో లక్ష, 2017 మార్చినాటికి పూర్తిగా 2.5 లక్షల పంచాయతీల లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. భారీ వృద్ధికి మూడంచెల వ్యూహం దేశం 7 నుంచి 8 శాతం శ్రేణిలో భారీ వృద్ధి రేటు బాటకు మళ్లడానికి మూడంచెల వ్యూహాన్ని అవలంబించాలి. ద్రవ్యోల్బణం కట్టడి-పన్నుల వసూళ్ల పెంపు, వ్యయ సంస్కరణలు, మార్కెట్ ఎకానమీకి సంబంధించి న్యాయ-నియంత్రణ వ్యవస్థలను మరింత మెరుగుపరచడం ద్వారా మళ్లీ వృద్ధికి ఊపును అందించవచ్చు. పెట్టుబడుల పునరుద్ధరణ, ఉపాధి, ఆదాయాల్లో వృద్దికి ఈ మూడంచెల విధానం దోహదపడుతుంది. ద్రవ్యోల్బణం కట్టడికి తగిన చర్యలతో పాటు, జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) అమలుసహా పన్నుల వ్యవస్థ సంస్కరణలపై దృష్టి సారించాలి. సబ్బిడీల వ్యవస్థ హేతుబద్దీకరణ వ్యయ నియంత్రణలో కీలకపాత్రను పోషిస్తుంది. కొంచెం పెరగనున్న క్యాడ్..! ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్- క్యాపిటల్ ఇన్ఫ్లోస్ మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిధుల మధ్య ఉన్న వ్యత్యాసం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) జీడీపీతో పోల్చితే 2.1 శాతంగా (45 బిలియన్ డాలర్లు) నమోదయ్యే అవకాశం ఉంది. భారత్ ఆర్థిక వ్యవస్థ తట్టుకోగలిగిన స్థాయిలో ఈ రేటు ఉంది. 2012-13లో క్యాడ్ 4.7 శాతం (88.2 బిలియన్ డాలర్లు)కాగా, 2013-14లో 1.7 శాతంగా (32.4 బిలియన్డాలర్లు) ఉంది. మొత్తంగా చూస్తే- క్యాడ్ పరిమాణం దిగిరావడం, తగిన స్థాయిల్లో కొనసాగడం భారత్ ఆర్థిక వ్యవస్థకు కలిసివస్తున్న అంశం. కొత్త ఎఫ్ఆర్బీఎం చట్టం అవసరం... ప్రభుత్వ వ్యయాలు, అకౌంటింగ్ ప్రమాణాలు, బడ్జెటరీ నిధుల నిర్వహణ తత్సంబంధ అంశాల్లో మరింత మెరుగుదల, పటిష్టత అవసరం ఉంది. ఈ దిశలో కొత్త ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ(ఎఫ్ఆర్బీఎం) చట్టానికి రూపకల్పన చేయాలి. బాధ్యతాయుతమైన ద్రవ్య విధాన రూపకల్పన ప్రక్రియలో తాజా ఆలోచనా ధోరణి అవసరం. గడచిన ఎనిమిదేళ్ల కాలంలో ద్రవ్యోల్బణం భారీగా పెరగడం ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ తత్సంబంధ అంశాలపై తీవ్ర ప్రతికూలత చూపుతోంది. అధిక నాణ్యతా ప్రమాణాలు కలిగిన ద్రవ్య సమతౌల్యతను సాధించడానికి అటు పన్నులు, ఇటు వ్యయ వ్యవస్థలను మెరుగుపరచాలి. పన్నుల వ్యవస్థ సరళతరంగా, అమలుకు సాధ్యమయ్యేలా పారదర్శకత, స్థిరత్వంగా ఉండాలి. రైల్వేల్లో ఎఫ్డీఐలపై త్వరిత నిర్ణయం రైల్వేల ప్రైవేటీకరణ, రైల్వే రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ)ను అనుమతించడం అతి పెద్ద సంస్కరణలు కానున్నాయని ఆర్థిక సర్వే పేర్కొంది. రైల్వే రంగంలో ఎఫ్డీఐలను అనుమతించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను జాగ్రత్తగా అధ్యయనం చేయాలని, ఈ విషయమై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక సర్వే సూచించింది. భారత రైల్వేలు ప్రపంచ స్థాయి ప్రమాణాలనందుకోవాలంటే ఎఫ్డీఐలు తప్పనిసరని, అందుకే రైల్వే అధికారులు ప్రస్తుతమున్న ఎఫ్డీఐ విధానంలో తగిన మార్పులు చేయడానికి కసరత్తు చేస్తున్నారని పేర్కొంది. నిర్వహణలో తప్ప అన్ని విభాగాల్లో ఎఫ్డీఐలను అనుమతించాలనే ప్రతిపాదన ఉంది. ఎఫ్డీఐలను అనుమతించడంపై అధ్యయనం చేయాలని పేర్కొంది. ద్రవ్యోల్బణం అదుపుతో వడ్డీరేట్లు కిందకు... ద్రవ్యోల్బణం అదుపునకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2014 యేడాది చివరినాటికి ఈ సమస్య అందుపులోనికి వస్తుందన్న విశ్వాసముంది. ద్రవ్యోల్బణం తగ్గితే ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉంది. అయితే ఈ ఏడాది వర్షపాతం కొరత, ఇరాక్ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో అధిక క్రూడ్ ధరలు వంటి అంశాలు ప్రతికూలతలుగా కనబడుతున్నాయి. ద్రవ్యోల్బణం కాస్త శాంతించినప్పటికీ.. ఇంకా తగ్గాల్సి ఉంది. ప్రత్యేకించి సరఫరాల వైపు సమస్యలు ఆహార ద్రవ్యోల్బణం కట్టు తప్పడానికి కారణమవుతున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడికి రైతులకు ప్రభుత్వ మద్దతు వంటి అంశాల్లో హేతుబద్ధీకరణ వంటి చర్యలు అవసరం. వీటితోపాటు డీజిల్ ధరలపై నియంత్రణల ఎత్తివేత, ద్రవ్యలోటు కట్టడికి ప్రాధాన్యత ఇవ్వాలి. సెజ్లను పునరుద్ధరించాలి.. ప్రత్యేక ఆర్థిక మండళ్లలో (సెజ్లు) తాజా పెట్టుబడులు ఇటీవలి కాలంలో మందగించిన నేపథ్యంలో వాటి పునరుద్ధరణపై డెవలపర్లకు, యూనిట్లకు స్పష్టమైన సంకేతాలివ్వాలని ఆర్థిక సర్వే కోరింది. తయారీ, ఎగుమతి కేంద్రాలుగా ఒకనాడు విలసిల్లిన సెజ్లు 2011లో కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్), డివిడెండ్ పంపణీ పన్నుల (డీడీటీ) విధింపుతో తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయని పేర్కొంది. సెజ్లపై మ్యాట్ను ఉపసంహరించాలని వాణిజ్య శాఖ ఇప్పటికే ఆర్థిక శాఖను కోరింది. సెజ్ల డెవలపర్లు, యూనిట్ల బుక్ ప్రాఫిట్స్పై 18.5 శాతం మ్యాట్ను 2011లో విధించారు. జీఎస్టీ, డీటీసీలే కీలకం... న్యూఢిల్లీ: ప్రస్తుతం సంక్లిష్టంగా ఉన్న దేశీయ పన్నుల విధానాన్ని పూర్తిగా సంస్కరించాలని, అలాగే అనవసర పన్నులను తొలగించాలని ఎకనామిక్ సర్వే పేర్కొంది. పరోక్ష పన్నుల సంస్కరణల్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) ఎంతో కీలకమైనదన్న విషయంపై ఇప్పటికే ఏకాభిప్రాయం ఏర్పడిందన్నారు. జీఎస్టీ అమల్లోకి వస్తే ద్వంద పన్నుల విధానం తొలిగిపోవడమే కాకుండా, ఎగుమతులు, దిగుమతుల పన్నులు కూడా ఒకే పరిధిలోకి వస్తాయి. దీంతో కంపెనీలకు పోటీ సామర్థ్యం పెరిగి ఎగుమతులు వృద్ధి చెందుతాయని పేర్కొంది. అలాగే ప్రస్తుతం విధానంలో ఉన్న సర్ చార్జీలు, సుంకాలు, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ వంటి అనవసర పన్నులు (బ్యాడ్ ట్యాక్స్) తొలగించాల్సిన అవసరం ఉందని సర్వే పేర్కొంది. ఎంతో సంక్లిష్టంగా ఉన్న ఆదాయ పన్నుల చట్టం స్థానంలో డెరైక్ట్ ట్యాక్స్ కోడ్ (డీటీసీ)ని ప్రవేశపెట్టాలని సూచించింది. దీంతో వ్యక్తిగత, వ్యాపార వర్గాల్లో ఆదాయపు పన్నుల సమస్యలు తగ్గి పన్ను వసూళ్లు పెరుగుతాయని పేర్కొంది. మొండిబకాయిల సెగ.. గడచిన రెండేళ్లలో బ్యాంకుల మొండిబకాయిలు(ఎన్పీఏలు) నాలుగు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ సవాలును అధిగమించడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2008-09లో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం రుణాల్లో ఎన్పీఏల రేటు 2.09% కాగా, ఇది 2014 మార్చి నాటికి 4.4%కి ఎగసింది. నిధుల రూపంలో చూస్తే 2010 మార్చి నాటికి స్థూలంగా ఈ మొత్తం రూ.59,972 కోట్లుకాగా 2014 మార్చికి రూ.2,04,249 కోట్లకు చేరింది. ఆర్థిక వ్యవస్థ బాగున్నరోజుల్లో భారీ రుణాల మంజూరు.. అనంతర కాలాల్లో మందగమనం వంటి అంశాలు ఎన్పీఏలు ఎగసేందుకు కారణం. ప్రైవేటురంగం సహా అన్ని బ్యాంకుల ఎన్పీఏల రేటు 2.36% నుంచి 3.90%కి చేరింది. అందరికీ బ్యాంకింగ్ సేవలు..: మారుమూల ప్రాంతాలన్నింటికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోనికి తీసుకురావడం, తద్వారా వృద్ధికి చేయుతనివ్వడం లక్ష్యంగా తగిన అన్ని ప్రయత్నాలను కేంద్రం తీసుకుంటోంది. ప్రస్తుత భారత్ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను వచ్చే 30 ఏళ్లలో అధిగమించాల్సి ఉంది. -
మిస్డ్ కాల్ బ్యాంకింగ్..
మిస్డ్ కాల్ ఇస్తే ఏమిటర్థం? నా దగ్గర బ్యాలెన్స్ లేదు.. కాల్ చేయండనో.. లేదా వీలైనప్పుడు కాల్ చెయ్యమనో అర్థం. అయితే, ప్రస్తుతం బ్యాంకులు ఈ మిస్డ్ కాల్ ఆధారంగా కూడా బ్యాంకింగ్ సర్వీసులు కూడా అందిస్తున్నాయి. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ రిక్వెస్టు ఇలా రకరకాల సర్వీసులను ఆయా బ్యాంకుల ఫోన్ నంబర్లకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పొందవచ్చు. ఈ సర్వీస్ను పొందాలంటే మన మొబైల్ నంబరును ముందు బ్యాంకు దగ్గర రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సదరు సర్వీసుకు ఉద్దేశించిన నంబరుకు కాల్ చేయాలి. రింగ్ అయిన తర్వాత కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. కోరిన సర్వీసు వివరాలు 3-5 నిమిషాలలోగా ఎస్సెమ్మెస్ రూపంలో మొబైల్కి వస్తాయి. ప్రతి సర్వీసుకోసం ఒక ప్రత్యేక నంబరు ఉంటుంది. ఉదాహరణకు బ్యాలెన్స్ ఎంక్వైరీకి ఒకటి, మినీ స్టేట్మెంట్కి మరొకటి ఉండొచ్చు. ఈ సర్వీస్లు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్, ఐసీఐసీఐ, కర్ణాటక బ్యాంక్ మొదలైనవి ఇలాంటి సేవలు అందిస్తున్నాయి.