Bhuvanangiri
-
మమ్మీ.. నన్ను క్షమించు..
♦ అమెరికాలో స్థిరపడిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య? ♦ భువనగిరిలో విషాదఛాయలు నల్లగొండ : కుటుంబ కలహాలో.. మరో సమస్యో కారణాలైతే తెలియవు కానీ అమెరికాలో స్థిరపడిన ఓ సాఫ్ట్ ఉద్యోగి అమెరికాలో బలవన్మరణానికి ఒడిగట్టి తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చాడు. దీంతో యాదాద్రిభువనగిరి జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం గ్రామానికి చెందిన గూడూరు బాల్రెడ్డి, సుగుణ దంపతులు చాలా ఏళ్ల క్రితం భువనగిరికి వచ్చి స్థిరపడ్డారు. స్వగ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ ప్రతిరోజు భువనగిరి నుంచి సొంత వాహనంపై వెళ్లి వస్తుండేవారు. బాల్రెడ్డికి ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు మధుకర్రెడ్డి(37) 14 ఏళ్ల క్రితం ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికా వెళ్లాడు. తదనంతరం అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉండిపోయాడు. ఏడేళ్ల క్రితం భువనగిరికి వచ్చి స్వాతిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయనకు నాలుగు సంవత్సరాల కుమార్తె ఉంది. ఈయన కుటుంబ సభ్యులతో కాలిఫోర్నియా రాష్ట్రంలో నివాసం ఉంటున్నాడు. ఉదయం ఎనిమిది గంటలకు.. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో టిక్కీ ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న మధుకర్రెడ్డి భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8గంటలకు మృతిచెందినట్లు తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం అం దించారు. దీంతో కుటుంబ సభ్యులు మృతికి గల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా ఫలితం లేదు. మృతిచెందిన సమాచారం అందిన వెం టనే తల్లి సుగుణ మొబైల్కు మధుకర్రె డ్డి పెట్టిన మమ్మీ నన్ను క్షమించు మే సే జ్ను చూసుకున్నారు. అమెరికా కాలమా నం ప్రకారం పగలు సమయంలో పె ట్టి న మేసేజ్ తల్లికి భారత కాలమాన ప్రకా రం అర్ధరాత్రి సమయంలో వచ్చింది. వారం రోజుల క్రితమే.. మధుకర్రెడ్డి ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలో సొంత ఇల్లు కొనుగోలు చేశాడు. విషయం తెలిసిన తండ్రి బాల్రెడ్డి వారంరోజుల క్రితమే తన కుమారుడితో ఫోన్లో మాట్లాడి డబ్బులు కూడా పంపించాడు. తమ కుమారుడికి ఆర్థిక ఇబ్బందులు లేవని రోదిస్తూ తం డ్రి బాల్రెడ్డి చెప్పాడు. తల్లి కి రాత్రి మమ్మీ తనను క్షమించమని రెం డుసార్లు మేసేజ్ పెట్టాడని ఆ మేసేజ్ను ఉదయం చూసుకున్నామని చెప్పాడు. కుటుంబ కలహాతోనేనా? భువనగిరి మండలం మద్దెలగూడేనికి చెందిన స్వాతిని వివాహం చేసుకున్న అనంతరం మధుకర్రెడ్డి కాలిఫోర్నియాకు వెళ్లిపోయాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వీరి దాంపత్య జీవితం కొంతకాలం పాటు సాఫీగా సాగింది. అనంతరం వీరికి శర్మిష్ట జన్మించింది. ప్రస్తుతం పాపకు నాలుగు సంవత్సరాలు. కొంత కాలంగా దంపతుల మధ్య కలహాలు ఏర్పడినట్లు సమాచారం. కుటుంబ కలహాలతోనే మధుకర్రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మిన్నంటిన రోదనలు అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న మధుకర్రెడ్డి తల్లిదండ్రులు ఉన్న భువనగిరి పట్టణంలోని నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చి పరామర్శిస్తున్నారు. తల్లిదండ్రులు ఏడుస్తున్న తీరును చూసి బంధుమిత్రులు కంటతడిపెట్టారు. కాలిఫోర్నియాలో ఆత్మహత్య చేసుకున్న మధుకర్రెడ్డి మృతదేహం గురువారం భువనగిరికి చేరుకునే అవకాశం ఉంది. -
అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
భువనగిరి అర్బన్ : కొంత కాలంగా తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం భువనగిరి పట్టణ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ పాలకుర్తి యాదగిరి నిందితుడి వివరాలు వెల్లడించారు. మోత్కూర్ గ్రామంలోని పోతాయిగడ్డకు చెందిన సిరిగిరి సాయిబాబా అలియస్ సాయికుమార్ స్టవర్ రిపేర్ చేస్తానని పట్టణంలో, గ్రామాల్లో తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని ఎవరూ లేని సమయంలో తాళాలు పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లేవాడు. గత నెల 31న తుర్కపల్లి గ్రామంలోని గుండెబోయిన కవిత ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాను పగలగొట్టాడు. బంగారు పుస్తెలతాడు, జత చెవి కమ్మలు, జత బంగారు మాటీలు, నాలుగు జతల వెండి పట్టాగోలుసులు, రూ.400 నగదు, మొత్తం నాలుగున్నర తులాల బంగారం, 55 తులాల వెండి ఎత్తుకెళ్లాడు. జనవరి 1న మధ్యాహ్నం 12 గంటల సమయంలో పట్టణంలోని ప్రగతినగర్ కాలనీలో కన్నారపు ప్రసాద్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి మన్నా చర్చిలో ప్రార్థనకు వెళ్లారు. ఈ సమయంలో ఇంటి తాళం పగలగొట్టి బీరువాను తెరిచి నగల బాక్స్లోని నల్లపూసల బంగారు గొలుసు లాకెట్, బంగారు గుండ్ల గొలు సు, లాకెట్ చైను, గ్రీన్ స్టోన్ రింగు, ఒక సెల్ఫోన్, ఐ ఫోన్ ఎత్తుకెళ్లాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పాత నేరస్తులు అనుమానితులను తనిఖీ చేస్తుం డగా పట్టణ శివారులోని సింగన్నగూడెం చౌరస్తా వద్ద ఒక డేరాలో నివాసముంటున్న సాయిబాబాను విచారించడం తో దొంగతనాలు చేస్తునట్లు ఒప్పుకున్నాడు.సాయిబాబా నుంచి ఎనిమిదిన్నర తులాల బంగారం, చెవి కమ్మలు, మాటీలు, వెండి పట్టాగోలుసులు, సమ్సంగ్, ఐ సెల్ఫోన్ల, రూ.4వేలు, 3 బైకులను స్వాధీనం చేసుకునట్లు చెప్పారు. సాయిబాబాకు సహకరించిన తండ్రి పరుశారం బంగారు గుండ్ల గొలుసుతో పారిపోయి తప్పించుకుని తిరుగుతున ట్లు తెలిపారు. అతనిపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు చె ప్పారు. నిందితుడిని కోర్టుకు రిమాండ్ చేస్తామన్నారు. సమావేశంలో ఏసీపీ సాధు మోహన్రెడ్డి, సీఐ ఎం.శంకర్గౌడ్, ఎస్ఐ రాజశేఖర్రెడ్డి, కానిస్టేబుల్ కిరణ్ ఉన్నారు. ఇతర జిల్లాల్లోనూ చోరీలు.. 2010 నుంచి ఇప్పటి వరకు మోత్కూర్, నల్లగొండ టౌన్, జనగాం, వరంగల్ జిల్లా హుస్నాబాద్, వర్థన్నపేట, వరంగల్ మిల్స్కాలనీ, మర్రిపెడ బంగ్లా, మహబూబాబాద్, దుగ్గొండి పోలీస్స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలు చేసినట్లు చెప్పారు. వరంగల్ సెంట్రల్ జైలు, నల్లగొండ జిల్లా జైలు, జనగాం సబ్జైల్లో రి మాండ్ ఉన్నట్లు చెప్పారు. 2016 నవంబర్లో వరంగ ల్ సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి తుర్కపల్లి, భువనగిరిలో 14 దొంగతనాలకు పాల్పడ్డాడు. -
ఆర్థిక లావాదేవీలతోనే..
భువనగిరి అర్బన్ : బాకీ డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులు గురిచేస్తున్నాడే కారణంతోనే కాంట్రాక్టర్ హత్యకు గురైనట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ నెల 18వ తేదీన బొమ్మలరామారం గ్రామ శివారులో వెలుగుచూసిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. డీసీపీ పాలకుర్తి యాదగిరి బుధవారం తన కార్యాలయంలో నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లోని హబ్సిగూడకు చెందిన గుండుగ బ్రహ్మాజీరావు(45) రోడ్డు కాంట్రాక్టు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2008 సంవత్సరంలో నాగిరెడ్డి రాంరెడ్డి అనే వ్యక్తితో బ్రహ్మజీరావుకు పరిచయం ఏర్పడింది. అయితే నాగిరెడ్డి రాంరెడ్డికి ఉన్న టిప్పర్ లారీని బ్రహ్మాజీరావు మధ్యవర్తి సాయంతో రోడ్డు పనులకు ఎంగేజీకు పెట్టి కంకరపోయించారు. ఆ విషయంలో నాగిరెడ్డి రాంరెడ్డికి సుమారు రూ.13లక్షల వరకు కాంట్రాక్టర్ బకాయి ఉన్నాడు. ఆ కాంట్రాక్టర్ డబ్బులను ఇవ్వడం లేదు. ఆ డబ్బులను బ్రహ్మజీరావు ఇచ్చే విధంగా ఒప్పుకుని ప్రామిసరి నోటు, చెక్కులు ఇచ్చినా కూడా డబ్బులు ఇవ్వలేదు. రాంరెడ్డి తన డబ్బులు చెల్లించాలని బ్రహ్మాజీరావును ఎన్నిసార్లు అడిగినా రేపుమాపు అంటూ తిప్పుతున్నాడు. దీంతో రాంరెడ్డి విసుగుపోయి బ్రహ్మజీరావును హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. బైటికి వెళ్దామని తీసుకొచ్చి.. రాంరెడ్డి 17వ తేదీన హబ్సిగూడలో ఉన్న బ్రహ్మజీరావు ఇంటికి వెళ్లాడు. పని ఉంది బైటికి వెళ్దామని నమ్మించి బ్రహ్మాజీరావును తన బైక్ ఎక్కించుకుని బయలుదేరా డు. కీసరలో లీటర్ పెట్రోల్ బైక్లో పోసుకున్నాడు. బొమ్మలరామారం గ్రామ శివారులోని బెజ్జంకి నర్సిరెడ్డి బీడు భూములోకి తీసుకెళ్లాడు. పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న సుత్తెతో అతడిపై దాడి చేశాడు. అలాగే కిందపడవేసి గొంతునులిమి చంపేశాడు. ఆపై శవాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ మృతుడి ఒంటిపై పోసి తగులబెట్టి పరారయ్యాడు. సెల్ఫోన్ ఆధారంగా.. మృతదేహం సమీపంలో బ్రహ్మాజీరావు సెల్ఫోన్ పోలీసులకు లభించడంతో కేసు ఛేదన సులువైంది. అతడి కుటుంబ సభ్యులను సంప్రదించగా మృతదేహం బ్రహ్మాజీరావుదేనని, 17న ఉదయం రాంరెడ్డి తీసుకెళ్లాడని పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు అతడిని వెతికి పట్టుకుని విచారించగా నేరం అంగీకరించాడని డీసీపీ యాదగిరి వివరించారు. నిందితుడి వద్ద నుంచి మోటార్ సైకిల్, హెల్మెట్, సుత్తి, సెల్ఫోన్, డ్రెస్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో ఏసీపీ మోహన్రెడ్డి, భువనగిరి రూరల్ సీఐ అర్జునయ్య, యాదగిరిగుట్ట సీఐ రఘువీర్రెడ్డి, ఎస్ఐ వెంకటేష్ ఉన్నారు. -
ఉద్రిక్తత మధ్య అంత్యక్రియలు
* పోలీసు బందోబస్తు మధ్య నయీమ్ మృతదేహం భువనగిరికి తరలింపు * నయీమ్ భార్య, పిల్లల్ని తీసుకొచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమన్న బంధువులు * మత పెద్దలు, కుటుంబ సభ్యులతో పోలీసుల చర్చలు * రాత్రి 10.21 గంటలకు ఖాజీ మహల్లా దర్గాలో ఖననం భువనగిరి: ఎన్కౌంటర్లో మృతి చెందిన నయీమ్ అంత్యక్రియలు తీవ్ర ఉత్కంఠ మధ్య మంగళవారం రాత్రి ముగిశాయి. సోమవారం మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్వద్ద జరిగిన ఎన్కౌంటర్లో నయీం మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రే నయీమ్ మృతదేహానికి షాద్నగర్ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మంగళవారం ఉదయం నయీమ్ సోదరి, బావ వచ్చి మృతదేహాన్ని తీసుకుని... మధ్యాహ్నం భువనగిరిలోని నయీం ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భువనగిరిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మృతదేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు నయీమ్ ఇంటివద్దకు చేరుకున్నారు. మృతదేహాన్ని ఇంట్లో ఉంచిన తర్వాత నయీమ్ తల్లి తాహెరాబేగం, బంధువులు, కుటుంబ సభ్యులు వచ్చారు. అయితే నయీమ్ భార్య ఫర్హానా, పిల్లలు, నయీం సోదరిలను తీసుకువచ్చే వరకు అంత్యక్రియలు జరపబోమని కుటుంబ సభ్యులు తొలుత ప్రకటించారు. నయీమ్ను కడసారి చూసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడంతో.. ఏఎస్పీ గంగాధర్, యాదగిరిగుట్ట డీఎస్పీ సాధుమోహన్రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ముస్లిం మత పెద్దలు, కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. నయీమ్ భార్య పోలీసు కేసులో ఉన్నందున ఆమెను తీసుకురావడం వీలుకాదని వివరించారు. అత్యవసర సమయంలో భార్య లేకున్నా అంత్యక్రియలు చేయవచ్చని మత పెద్దలు సూచించడంతో.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించారు. చివరికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. మరో సమీప బంధువు రావాల్సి ఉన్నందున కొంత సమయం కావాలని కోరారు. రాత్రి 8.45 సమయంలో అంత్యక్రియలను ప్రారంభించారు. స్థానిక ఖాజీ మహెల్లా దర్గా మసీదులో జనాజున్ నమాజ్ నిర్వహించిన అనంతరం పక్కనే ఉన్న శ్మశాన వాటికలో 10.21 గంటలకు ఖననం చేశారు. ముందుగానే సమాధి స్థలం ఎంచుకున్న నయీమ్ నయీం మరణించడానికి ముందే తన సమాధి స్థలాన్ని ఎంపిక చేసుకున్నాడు. తన తండ్రి ఖాజా నసీరుద్దీన్, సోదరులు అలీమోద్దీన్, సమీ సమాధుల పక్కన తనను సమాధి చేయాలని కుటుంబ సభ్యులకు చెప్పేవాడు. ఆ ప్రకారమే కుటుంబ సభ్యులు నయీం మృతదేహాన్ని సమాధి చేశారు. కాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా అంత్యక్రియలు పూర్తి కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే నయీమ్ అనుచరులు, మాజీ నక్సలైట్లు జనంలో కలసి అంత్యక్రియలకు రావొచ్చనే ఉద్దేశంతో పోలీసులు అనుమానితుల ఫొటోలు, వీడియోలు తీశారు. వారం పాటు గ్రామాల్లోకి వెళ్లొద్దు అధికార పార్టీ నేతలకు పోలీసుల హెచ్చరిక నయీమ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో అధికార పార్టీ నాయకులెవరూ నల్లగొండ జిల్లాలోని గ్రామాలకు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా భువనగిరి, మునుగోడు, న ల్లగొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లో నయీమ్ అనుచరుల కదలికలు ఉంటాయనే అనుమానంతో అంతర్గతంగా ఈ హెచ్చరికలు చేసినట్లు సమాచారం. వారం రోజుల పాటు తమకు సమాచారం ఇవ్వకుండా గ్రామాల్లో ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దని సూచించినట్లు తెలిసింది. దీంతో అధికార పార్టీ నేత లు కొందరు హైదరాబాద్కు పరిమితమైనట్లు సమాచారం. -
యాదాద్రి నూతన నమూనా
యాదాద్రి దివ్యక్షేత్రం ప్రధాన ఆలయం నూతన నమూనా సిద్ధమైంది. సీఎం కేసీఆర్.. యాదగిరిగుట్టను తిరుమల తరహా దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం సూచనల మేరకు కొండపైన ఆగమ, వాస్తు శాస్త్రాలకు అనుగుణంగా ఆలయ ప్రణాళికలను తీర్చిదిద్దారు. ముందుగా తయారు చేసిన ప్రణాళికల్లో మార్పులు.. చేర్పులను సీఎం సూచించగా.. అందుకనుగుణంగా వైటీడీఏ అధికారులు తాజా ప్రణాళికలను రూపొందించారు. కొండపైన ప్రధాన ఆలయం, ఆలయ ప్రాంగణం, మాడవీధులు, రాజగోపురాలు, దివ్య విమాన గోపురం, ఎత్తై ఆంజనేయ విగ్రహం ఎక్కడెక్కడ ఉండాలో ప్రణాళిల్లో పొందుపరిచారు. నూతన నిర్మాణాల కోసం ఇప్పటికే కొండపైన నిర్మాణాలను కూల్చివేయడంతోపాటు దక్షిణ దిశలో రిటైనింగ్ వాల్ నిర్మాణపు పనులు ప్రారంభించారు. మరో వైపు పెద్దగుట్టపై లేఅవుట్ ప్రకారం అభివృద్ధి చేస్తున్నారు. - భువనగిరి -
భువనగిరిలో ఆర్టీఏ కార్యాలయం
భువనగిరి : భువనగిరి కేంద్రంగా ఏర్పాటు కానున్న యాదాద్రి జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. కలెక్టరేట్ ఇతర శాఖల కార్యాలయాల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను పరిశీలించి ఎంపిక చేసిన అధికారులు తా జాగా ఆర్టీఏ ఆఫీస్ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించా రు. కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్ స్థానిక అధికారులతో కలిసి మం గళవారం భువనగిరి శివారులో స్థలాన్ని పరి శీలించా రు. యాదాద్రి జిల్లాలో భువనగిరి కేంద్రంగా ఎంవీఐ కార్యాలయం పని చేయనుంది. ప్రస్తుత ప్రతి పాదనల ప్రకారం యాదాద్రిలో వరంగల్ జిల్లా జనగామ కలిస్తే భువనగిరి, అక్కడ ఉన్న ఆర్టీఏ కార్యాలయాలు రెండు వాహనదారులకు అందుబాటులోకి వస్తాయి. తప్పనిసరిగా సర్దుబాటు చేయాల్సిందే.. ప్రస్తుతం జిల్లాలో డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ పర్యవేక్షణలో నల్లగొండ, సూర్యాపేటల్లో ఆర్టీఏలు ఉం డగా, భువనగిరిలో ఎంవీఐతో సరిపెట్టారు. తాజాగా 3 జిల్లాల ప్రతిపాదనలు రావడంతో నల్లగొండ, సూర్యాపేటల్లో ఎంవీఐలతోనే కార్యాలయాలు కొనసాగించవ చ్చు. భువనగిరిలో మాత్రం ఎంవీఐ స్థానం లో ఆర్టీఏను నియమిస్తారు. ఇందుకోసం పూర్తిస్థాయి కార్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉంది. కార్యాలయానికి 3నుంచి 5 ఎకరాల ప్రభుత్వ స్థలం భువనగిరి శివారులో ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేటల్లో ఆర్టీఏ కార్యాలయాల పక్కా భవనాల కోసంప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసింది. భువనగిరిలో కూడా స్థలం ఖరారైతే నిధులు మంజూరు అవుతాయి. అద్దెభవనంలో ఎంవీఐ కార్యాలయం భువనగిరిలోని ఎంవీఐ కార్యాలయం అద్దెభవనంలో నడుస్తోంది. చాలా కాలంగా సొంత భవనం కోసం అధికారులు ప్రయత్నిస్తున్నా అది నెరవేరలేదు. పలుమార్లు కార్యాలయూన్ని మార్చారు. ప్రస్తుతం నల్లగొండ రోడ్డులో కొనసాగుతోంది. కార్యాలయం స్థా యి పెరగడంతో సొంత భవనం నిర్మిం చడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. భువనగిరి శివారులో స్థల పరిశీలన.. ఆర్టీఏ కార్యాలయం భవనం స్థలం కోసం వడపరి,్త మోత్కూరు రోడ్డులో రవాణా శాఖ డిటీసీ ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. 3 నుంచి 5 ఎకరాల స్థలం కావాలని రెవెన్యూ అధికారులను కోరారు. దీంతో రెండు చోట్ల ఉన్న స్థలం వివరాలను రెవెన్యూ అధికారులు రవాణా శాఖ అధికారులకు తెలియజేశారు. ఈ మేరకు తమకు కావాల్సిన స్థలం వివరాలను తహసీల్తార్కు తెలియజేశామని డీటీసీ చంద్రశేఖర్గౌడ్ తెలిపారు. స్థలం ఖరారైతే భవనం నిర్మాణం చేపడతామని చెప్పారు. డీటీసీ వెంట ఎంవీఐ వెంకటేశ్వర్రెడ్డి, ఏఎంవీఐ నరేష్ ఉన్నారు. -
కట్నం కార్చిచ్చుకు.. తల్లీకూతురు బలి
పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన ఆ యువతికి రెండేళ్లకే కష్టాలు మొదలయ్యాయి. కట్నం కోసం భర్తపెట్టే చిత్రహింసలు తట్టుకోలేక పోయింది.. ఒంటిమీది ఆభరణాలను అమ్ముకున్నా ఓర్చుకుంది.. కడుపున పుట్టిన చిన్నారిని చూసుకుని బాధలను దిగమింగుకుంది.. ఇకనైనా మారతాడేమో అన్న చిన్న ఆశ కూడా ఆవిరైపోయింది.. ఇక తాను లేని లోకంలో కూతురు ఎన్ని కష్టాలు పడుతుందో అని.. మదనపడింది. చివరకు తనతో పాటే తీసుకెళ్లాలని నిర్ణయించుకుని.. ఆరునెలల చిన్నారిని నీటిసంపులో వేసి..తాను అగ్నికి ఆహుతైంది. * కూతురిని నీటిసంపులో పడేసి..తాను అగ్నికి ఆహుతై.. * భువనగిరి మండలంలో విషాదం భువనగిరి: కట్నం కార్చిచ్చుకు..తల్లీకూతురు బలయ్యారు. ఈ విషాదకర ఘటన భువనగిరి మండలం గౌస్నగర్లో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్ర కారం.. భువనగిరి మండలం గౌస్నగర్కు చెందిన నల్లమాస వెంకటయ్య, లింగమ్మల కుమారుడు నల్లమాస భాస్కర్కు చౌటుప్పల్ మండలం తంగెడపల్లికి చెందిన చిక్కురి యాదగిరిస్వరూపల కుమార్తె మమత(22) తో 2014 ఏప్రిల్ 20న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఒప్పుకున్న రూ.7.70 లక్షల వరకట్నంలో రూ.7.10 లక్షల వరకు నగదు,అభరణాలు, ఇతర వస్తువులను ము ట్టచెప్పారు. అయితే రెండున్నర సంవత్సరా లు అవుతున్నా కట్నం పూర్తిగా ఇవ్వలేదని ఆ డబ్బులు తేవాలని భాస్కర్ మమతను వే ధించసాగాడు. దీంతో పాటు భాస్కర్ కొంతకాలంగా పనిలేకుండా ఉన్నాడు. జేసీబీ ఆపరేటర్ అయిన భాస్కర్ ఏజీఐ గ్లాస్ఫ్యాక్టరీలో పనిచేస్తూ మానేశాడు. కొన్నినెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు. దీం తోపాటు మమతకు చెందిన బంగారు అభరణాలను తాకట్టు పెట్టాడు. అలాగే మమతకు చెందిన బుట్టాలు అమ్మినట్లు తెలియడంతో దంపతుల మధ్య గొడవలు మొదల య్యాయి. ఈ నేపథ్యంలో బాకి ఉన్న మిగతా కట్నం డబ్బు తీసుకురావాలని మమతను వేధించసాగారు. బంగారం అమ్మిన విషయం మమత తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మాట్లాడడానికి వస్తామన్నారు. ఈ విషయంలోనే శనివారం రాత్రి దంపతులు గొడవ పడ్డారు. అందరూ నిద్రిస్తుండగా.. అందరు నిద్రిస్తున్న సమయంలో మమత తన కూతురు భానును నీళ్లసంపులో వేసింది. దీంతో చిన్నారి ఊపిరాడక చనిపోయింది. వెంటనే మరుగుదొడ్డిలోకి వెళ్లి కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు లేవడంతో ఇంట్లో నిద్రిస్తున్న వారు మేలుకుని బయటకు వచ్చారు. అప్పటికే మమత తలభాగం నుంచి మంటలు పెద్దగా లేవడంతో పందిరికూడా అంటుకుంది. చల్లార్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె మంటల్లో కాలి చనిపోయింది. అనంతరం పాప కోసం వెతకగా సంపులో శవమై కన్పించింది. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ అర్జునయ్య, ఎస్ఐ సాజిదుల్లాలు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ నిర్వహించారు. మమత తండ్రి యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరారీలో భర్త భాస్కర్ ఈ సంఘటన జరిగిన వెంటనే మమత భర్త భాస్కర్ కన్పించకుండాపోయాడు.పోలీస్లు గ్రామానికి వచ్చి గట్టి బందోబస్తూ ఏర్పాటు చేశారు.సంఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించారు. గ్రామస్తులను విచారించారు. నా కూతురును వేధించి చంపారు కట్నం కోసం తన కూతురుని వేధించడం వల్లే చనిపోయింది. పెళ్లి సమయంలో ఒప్పుకున్న కట్నం డబ్బులు ఇచ్చాను. కొంత ఇవ్వాల్సి ఉంటే త్వరలో ఇస్తానని చెప్పాను. అయినా వినకుండా నా కూతురిని చిత్రహింసలు పెట్టడంతో తన కూతురును చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. - చిక్కురి యాదగిరి మమత తండ్రి వేధింపుల వల్లే అత్తింటి వేధింపుల వల్లే మమత ఈ ఘాతుకానికి పాల్పడింది. కట్నం డబ్బుల కోసం భర్తభాస్కర్ తరుచు వేధించే వాడని తమ విచారణలో తేలింది. ఇందుకు సంబంధించి మృతురాలి తండ్రి ఫిర్యాదు చేశాడు. వేధింపుల కేసు నమోదు చేశాం. - అర్జునయ్య, భువనగిరి రూరల్సీఐ -
గ్రామాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే
వడాయిగూడెం(భువనగిరి అర్బన్) : నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం వడాయిగూడెం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలను తీసుకోవాలన్నారు. త్వరలోనే వడాయిగూడెం గ్రామానికి బీటీరోడ్డును వేస్తామన్నారు. మండలంలోని సూరేపల్లి గ్రామంలో మిషన్కాకతీయ రెండవ విడుత పనులను ప్రారంభించారు. అలాగే బొల్లేపల్లి గ్రామంలో ఉన్న శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చేరాలని ఆడ్మిషన్లు పొందే కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు కోట పెద్దస్వామి, అబ్బగాని వెంకట్గౌడ్, గోద శ్రీనివాస్గౌడ్, సతీష్పవన్, రఘురామయ్య, సింగిల్విండో చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, నాయకులు డాక్టర్ జడల అమరేందర్, పట్టణ, మండలశాఖ మారగోని రాముగౌడ్, కొల్పుల అమరేందర్, నోముల పరమేశ్వర్రెడ్డి, చిందం మల్లికార్జున్, జనగాం పాండు, మొలుగు లక్ష్మయ్య, పుట్ట వీరేష్, బబ్బూరి శంకర్గౌడ్ , తదితరులు ఉన్నారు. సర్పంచ్ను పరామర్శించిన ఎమ్మెల్యే పగిడిపల్లి గ్రామ సర్పంచ్ కట్కూరి భాగ్యమ్మ నివాసానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి బుధవారం వెళ్లారు. ఈ నెల 8న జరిగిన దాడి విషయంపై సర్పంచ్ను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన ఆమె కుటుంబ సభ్యులను పరమర్శించారు. అనంతరం భువనగిరి పట్టణంలోని శృతినగర్లో జరుగుతున్న ప్రముఖ న్యాయవాది నాగారం అంజయ్య తండ్రి అంత్యక్రియలకు హాజరై మృతదేహంపై పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జడల అమరేందర్గౌడ్, రావి సురేందర్రెడ్డి, మారగోని రాముగౌడ్, కొల్పుల అమరేందర్, మొలుగు లక్ష్మయ్య, అంజనేయులు, నాగయ్యగౌడ్ తదితరులు ఉన్నారు. -
ఇక ఒక్కరోజే..
భువనగిరి : మహిమాన్విత స్వయంభు యాదగిరి లక్ష్మీనారసింహ స్వామి, అమ్మవార్ల దర్శనానికి ఒక్క రోజే మిగిలింది. సీఎం కేసీఆర్ సంకల్పించిన మహోన్నత అభివృద్ధి క్రతువులో భాగంగా ఈ నెల 21 నుంచి స్వయంభువుల దర్శనాలు నిలిచిపోనున్నాయి. వేల ఏళ్లక్రితం కొండ గుహలో వెలిసిన పంచనారసింహులను ద ర్శించుకోవడానికి అనుమతించరు. నూతనంగా నిర్మించిన బాలాలయంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్స్వామి ఆధ్వర్యంలో విగ్రహాలను ప్రతిష్ఠింప జేసే కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి. ఈ మేరకు మంగళవారం బాలాలయంలోని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దేవాలయ విస్తరణ పనులు పూర్తయ్యే వరకూ భక్తులు బాలాలయంలోనే స్వామి, అమ్మవార్లను దర్శించుకోవాలి. ఈమేరకు దేవస్థానం తగిన ఏర్పాట్లు చేస్తోంది. భక్తులను సంతృప్తి పరిచే విధంగా.. ప్రధాన ఆలయంలో స్వయంభూ దేవతామూర్తుల దర్శనం ఏవిధంగా ఉంటుందో అదేవిధంగా బాలాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. గుహాలయం మాదిరిగా బాలాలయ నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నారు. తూర్పు దిక్కునుంచి స్వామి వారి ఆలయంలోకి ప్రవేశించేలా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానాలయం మాదిరిగానే ఆండాల్ అమ్మవారి అల యం నిర్మించారు. రామానుజ కూటమి, స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేశారు. ఈ నెల 21 నుంచి బాలాలయంలోనే స్వామి అమ్మవార్ల దర్శనాలు ఉంటాయని ఇప్పటికే విస్తృతంగా జరిగిన ప్రచారం నేపథ్యంలో ప్రధానాలయంలో స్వయంభువులను దర్శించుకునేందుకు మంగళవారం భక్తులు ఎగబడ్డారు. బాల ఆలయంలో చినజీయర్ స్వామి ఆధ్వర్వంలో ఉత్సవ మూర్తులకు ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. -
పున్నమి రోజున పింక్మూన్
21వ తేదీ రాత్రి 10.54 నిమిషాల నుంచి 22న ఉదయం 3.42 నిమిషాల వరకు అద్భుత దృశ్యం కన్పించే అవకాశం భువనగిరి : చంద్రుడు అంతరిక్షంలో పింక్ మూన్గా కన్పించే అరుదైన సంఘటన జరగనుందని బహ్రశ్రీ దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాంతి చెబుతున్నారు . వివరాలు ఆయన మాటల్లోనే.. భారత దేశం మొత్తంలో ఈనెల 21వతేదీ పున్నమి రోజు రాత్రి 10.54 నిమిషాల నుంచి 22 వ తేదీ ఉదయం 3.42 నిమిషాల వరకు ఈ అద్భుత దృశ్యం కన్పించనుంది. రాత్రి 1.24 గంటల నుంచి 12 నిముషాల పాటు చంద్రుడు పూర్తిగా గులాబీరంగులోకి మారుతాడు. సూర్యుడు 0 డిగ్రీల నుంచి 15 డిగ్రీలలోపు మేష రాశిలో అశ్విని నక్షత్రంలో సంచరిస్తున్న సమయంలో దానికి వ్యతిరేక దిశలో 180 డిగ్రీల్లో చిత్ర నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఈ విధమైన పింక్ మూన్ వస్తుంది. ఇది ఏఫ్రిల్ మాసంలోనే వస్తుంది. అలాగని ప్రతీ ఏప్రిల్ నెలలో మాత్రం రాదు. రెండు మూడు సంవత్సరాలకోసారి వస్తుంది. విదేశీయులు దీన్ని గ్రహణంగా భావిస్తారు. పౌర్ణమి చంద్రుడి కిరణాలు సోకగానే ప్రతి జీవిలో కొత్త చైతన్యం కలుగుతుంది. మానసిక ఉత్సాహం కలుగుతుంది. సముద్రంలో ఉండే జీవజాలం కూడా ఉత్సాహంగా ఉంటుంది. పింక్ కలర్లో చంద్రుడు రావడం శుభసూచకం. గతంలో 2009, 2014 సంవత్సరాల్లో ఏప్రిల్లో వచ్చింది. ఇక 2016 ఏప్రిల్ మాసంలో వస్తుంది. మళ్లీ 2018 లో పింక్ మూన్ వస్తుంది. ఈ శుభ సమయంలో ఏ చిన్న పుణ్య కార్యం సంకల్పించినా వెరుు్యరెట్లు అధికంగా లాభం చేకూరుతుందని బృహత్ సంహితలో చెప్పారు. చంద్రుడు ఆహ్లాదకరమైన మనస్సుకు సంకేతమైన వాడు కాబట్టి పింక్మూన్ దర్శనమిస్తున్నసమయం మేషంలో సూర్యుడు, తులలో చంద్రుడు కన్పిస్తున్నాడు. కాబటి చంద్రుడు నీటికి, వృక్షాలకు, ఔషధాలకు నెలరాజు. అందువల్ల పాలకులు వరుణ యాగాలు చేయడం, సామాన్యులు నీటిని దానం చేయడం అంటే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇది పూర్తి శుభ సూచకం ఎలాంటి పనులు చేపట్టినా అతిశీఘ్రంగా ఫలిస్తాయి. ఎలాంటి చెడు ప్రభావాలు ఉండవు. అందరు పింక్ మూన్ ను దర్శించుకోవచ్చని అని సిద్ధాంతి సూచిస్తున్నారు. -
అధికారుల పేరుతో వసూళ్లు
భువనగిరి: ‘మీ వెంచర్ మీద ఫిర్యాదులు వచ్చాయి.. కలెక్టర్ సీరియస్గా ఉండు.. నేను రిపోర్టు పంపానో మీ వెంచర్ మూసుకోవాల్సిందే.. వెంటనే వచ్చి కలుస్తావా లేదా నీ ఇష్టం..’ ఓ వెంచర్యజమానికి గ్రామస్థాయి అధికారి ఫోన్లో హెచ్చరిక...‘మీ గ్రామంలో వెంచర్ అయ్యింది.. అతను సర్పంచ్నే కలిశాడు.. వార్డు సభ్యులను కలువలేదు.. మీరు వెంటనే అతనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేయండి.. ఆపై అంతా నేను చూసుకుంటా..’ ఓ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు ఆ గ్రామ అధికారి ఉద్బోధ... ఇదీ భువనగిరి డివిజన్లో ప్రస్తుతం నెలకొన్న రియల్ దందా తీరు. సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఎంతో శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఇదే అదనుగా యాదగిరిగుట్ట, తుర్కపల్లి,భువనగిరి, ఆలేరు, బీబీనగర్ మండలాల్లో అత్యధికంగా నూతన వెంచర్లు వెలిశాయి. యాదగిరిగుట్ట అభివృద్ధిని బూచిగా చూపి ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు వెలుస్తున్నా యి. కనీసం గ్రామ పంచాయతీ దరఖాస్తు కూడా చేసుకోకుండా వెంచర్ల యజ మానులు అక్రమాలకు పాల్పడుతున్నారు. జిల్లా కలెక్టర్ డీపీఓ వంటి అధికారులు ఎప్పటికప్పుడు అక్రమాలపై వేసిన నిఘా క్షేత్రస్థాయి ఉద్యోగులకు కాసుల వర్షం కురిపిస్తోంది. అక్రమ వెంచర్ల వివరాలను సేకరించాలని చెబితే కొందరు ఉద్యోగులు రియల్టర్లతో బేరసారాలు పెట్టారు.ఫలితంగా ఉన్నతాధికారుల పేరు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని సమాచారం. పంచాయతీ కార్యదర్శులపై కలెక్టర్ ఆగ్రహం భువనగిరిలో డి విజన్స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సమయంలో కలెక్టర్ సత్యనారాయణరెడ్డి కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ వెంచర్ల వివరాలు సేకరించి వాటిని తొలగించాలని చెబితే తన పేరు చెప్పి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారట ఈ విషయాన్ని తాను తీవ్రంగా పరిగణిస్తానని కలెక్టర్ హెచ్చరించారు. తన పేరుతో అక్రమాలకు పాల్పడితే ఊపేక్షించేది లేదని హెచ్చరించారు. గ్రామాల్లో చిచ్చు పెడుతున్న వెంచర్లు గ్రామ పంచాయతీ పరిధిలో విచ్చల విడిగా ఏర్పాటవుతున్న వెంచర్లలో అధికారుల పాత్ర క్రియాశీలకంగా మారింది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్- వార్డు సభ్యుల మధ్యన వెంచర్ల విషయంలో తీవ్ర స్థాయిలో విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు వార్డు సభ్యులకు అక్రమ వెంచర్ల వివరాలను గ్రామ స్థాయి అధికారులు అందించడంతో వివాదాలను మధ్యవర్తులుగా ఉండి సర్దుబాటు చేస్తున్నారు. అక్రమ వెంచర్ల విషయంలో సర్పంచ్, వార్డు సభ్యుల మధ్యవివాదాలు కలెక్టర్కు ఫిర్యాదు చేసే వరకు వెళ్తున్నాయి. భువనగిరి మండలం రాయిగిరిలో వెలిసిన 400 ఎకరాల వెంచర్కు అనుమతి విషయంలో గ్రామ పంచాయతీ సర్పంచ్- వార్డు సభ్యుల మధ్య వివాదం తలెత్తి పరస్పరం దాడులు చేసుకున్నారు. నూతన వెంచర్లు వెలిసిన చోటే.. నూతన వెంచర్లు వెలిసినచోటే ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఉన్నతాధికారులుఎన్ని నిబంధనలు జారీ చేసినా టాస్క్పోర్స్ అధికారులు అక్రమ వెంచర్లు గుర్తించి నోటీస్లు జారీ చేసినా అక్రమాలు మాత్రం ఆగడం లేదు. క్షేత్రస్థాయిలో అధికారుల అండదండలతో పేర్లు మార్చి కొత్త వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. యాదగిరిగుట్ట, రాయగిరి, వడాయిగూడెం, సైదాపురం, వంగపల్లి, పెద్ద కందుకూరు వంటి గ్రామాల్లో రియల్ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. గ్రామాల్లో పలు వివాదాలకు కారణం అవుతున్నాయి. అలాంటి వారిని ఊపేక్షించం, ఎన్. మధుసూదన్, ఆర్డీఓ, భువనగిరి రియల్ వ్యాపారుల మోసాలకు ఆసరాగా నిలిచే ఉద్యోగులను ఊపేక్షించం. ఉన్నతాధికారుల పేరు చెప్పి కొందరు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అలాంటి వారిపై నిఘాపెట్టాం. వారిపై శాఖాపరమైన చర్యలకు వెనుకాడబోం. అన్ని అనుమతులు తీసుకునే విషయంలో స్థానికంగా అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుమతులు లేని వెంచర్లను తొలగించాలి. -
వ్యక్తి దారుణ హత్య
భువనగిరి : పట్టణంలోని బాహార్పేటకు చెందిన పొట్టేటి పోశయ్య(28) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన పట్టణ శివారులో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పోశయ్య పట్టణంలోని ఇసుక ట్రాక్టర్పై డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. బుధవారం ఉదయం నుంచి ఇంటి వద్దే ఉన్న పోషయ్యకు మధ్యాహ్నం సమయంలో పలుమార్లు ఫోన్లు రావడంతో 3 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వెళ్లిన పోశయ్య రాత్రి వరకు రాకపోవడంతో భార్య స్వప్న 7.30 గంటలకు ఫోన్ చేసింది. ఎవరూ మాట్లాడకపోగా వాహనాల చప్పుడు వినపడింది. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్లు సమాధానం రావడం తో అనుమానం వచ్చిన స్వప్న తెలిసిన వారితో గాలించింది. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం సింగన్నగూడెం కాలనీ సమీపంలోని వ్యవసాయబావి వద్ద పోశయ్య మృతదేహం పడి ఉన్నట్టు కొందరు గుర్తించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. సీఐ తిరుపతితోపాటు ఎస్ఐలు భిక్షపతి, హన్మంత్లాల్లు సంఘటన స్థలంలో పంచనామా నిర్వహిం చారు. సంఘటన జరిగిన తీరు చూస్తే ఎవరో పిలిపించి పోశయ్యపై దాడిచేసి తలపై రాల్లతో మోది కట్టెలతో కొట్టి హత్య చేసినట్లు రూరల్ సీఐ తిరుపతి గుర్తించారు. దాడి చేసిన అనంతరం కట్టెలు, రాళ్లను పక్కనే ఉన్న వరి పొలంలో పడవేశారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పట్టుకునేందుకు నల్లగొం డ నుంచి డాగ్ స్క్వాడ్ను పిలిపించి పరిశీ లన చేశారు. జాగిలాలు బైకు దగ్ధం చేసి న సంఘటనలో తిరుగగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మృతుని తల్లి యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పట్టణ ఎస్ఐ సతీష్రెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. మృత దేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని సీఐ తెలిపారు. -
ధరలకు రెక్కలు
రాయగిరి నుంచి జిల్లా సరిహద్దు వరకు భూములకు భలే డిమాండ్ రోడ్డు వెంట రూ.20లక్షల నుంచి రూ.50లక్షలకు చేరిన ఎకరం ధర యాదాద్రి అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటే కారణం భువనగిరి : జాతీయ రహదారి 163 విస్తరణ భూసేకరణ పనులు వేగవంతం కావడంతో రాయగిరి నుంచి జిల్లా సరిహద్దు వరకు రోడ్డు వెంట గల భూములకు ఒక్కసారిగా రేట్లు పెరిగిపోయాయి. హెచ్ఎండీఏ, వైటీడీఏ (యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి మండలి) పరిధిలో గల భువనగిరి మండలం రాయగిరి, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి, ఆలేరు మండలాలకు అనుసంధానంగా జాతీయ రహదారి విస్తరణకు రంగం సిద్ధమైంది. ఇటీవల రూ.384 కోట్లకు పైగా నిధులతో ఈ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు భూసేకరణ పనులను ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్ యాదాద్రి డెవలప్మెంట్కు అధిక ప్రాధాన్యతను ఇవ్వడంతో గుట్టకు 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. రూ.పది లక్షల లోపు ఉన్న భూముల ధరలు అమాంతం ఆయా ప్రాంతాన్ని బట్టి నాలుగింతలు పెరిగాయి. దీంతోపాటు హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి వెంట సీఎం కేసీఆర్ పారిశ్రామిక కారిడార్గా ప్రకటించడంతో ఒక్కసారి పరిశ్రమల యజమానులు, రియల్టర్లు రోడ్డు వెంట గల భూములతోపాటు ఆయా ప్రాంతాల్లోని 15 కిలోమీటర్ల వరకు భూములను కొనుగోలు చేస్తున్నారు. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ రియల్టర్లతోపాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, విదేశాల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులు, పెద్దఎత్తున భూములను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే విస్తరించిన వ్యాపారం బీబీనగర్ నుంచి భువనగిరి, యాదగిరిగుట్ట, వంగపల్లి, ఆలేరు, జనగాం వరకు ప్రధాన రహదారి వెంట ఎకరం ధర రూ.20 నుంచి రూ.50 లక్షలకు చేరింది. ఈ ధర ఈ ప్రాంతంలో అధికమైనప్పటికీ గతంలో రాజీవ్ రహదారి, బెంగుళూరు రోడ్డు, శ్రీశైలం, ముంబాయి రహదారి వెంట ఎకరం ధర కోట్లలో పలుకుతుండడంతో సహజంగానే కొనుగోలుదారులు ఇటువైపు ఆసక్తి చూపుతున్నారు. పారిశ్రామిక కారిడార్లోకి రాష్ట్రరాజధానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక జోన్లోకి చేరింది. నగరంలోని పరిశ్రమలు 70 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇప్పటికే ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు కూడా భువనగిరి డివిజన్లో భూములపై కన్నెయడంతో అమాంతం ధరలు పెరిగాయి. డివిజన్ పరిధిలోకి వచ్చే ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, మోత్కూరు, ఆత్మకూరు (ఎం) ప్రాంతాల్లో భూముల కొనుగోళ్లు పెరిగాయి. మారుమూల మండలాల్లో రూ.వేలల్లో పలికే ఎకరం భూమి ప్రస్తుతం రూ.లక్షల్లోకి చేరింది. జాతీయ రహదారి పరిధి విస్తరించడం, రోడ్డు సౌకర్యం మెరుగుపడడంతో పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. భువనగిరి ప్రాంతం వరకు రాజధాని నుంచి రవాణా సౌకర్యాలు విస్తృతంగా ఉండడం భూముల కొనుగోలు డిమాండ్ పెరిగింది. సికింద్రాబాద్ - ఖాజీపేట, బీబీనగర్ - నడికుడి రైల్వే మార్గాలు భువనగిరి డివిజన్ మీదుగా వెళ్తుండడం, పలు రైళ్లు ఈ మార్గం గుండా ప్రయాణించడంతో రవాణా సౌకర్యాలు మెరుగుకావడం అనుకూలాంశం. శంషాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు భువనగిరికి 70 కిలోమీటర్ల లోపు ఉండడం, అభివృద్ధికి మరింత దోహదపడుతుంది. ఎన్ఆర్ఐల ఆసక్తి విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారు పంపుతున్న డబ్బుతో ఇక్కడ గల వారి తల్లిదండ్రులు భూములను లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేయడం లేదు. ఎకరాల కొద్దీ భూములను కొనుగోలు చేసి వాటిలో ఫామ్హౌస్లు, పండ్ల తోటలు, డెయిరీలను స్థాపిస్తున్నారు. భువనగిరి పరిసర ప్రాంతాల్లో అపార్ట్మెంట్లను, కమర్షియల్ కాంప్లెక్స్లను నిర్మిస్తున్నారు. మరికొందరు అధికారులు, బడా వ్యాపారులు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి భూముల కొనుగోలుపై ఆసక్తిని చూపుతున్నారు. రిజిస్ట్రేషన్ వాల్యు ప్రకారం వేలల్లో ఉంటున్న ధర వాస్తవ రేటు లక్షలు పలుకుతుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి వందలాది ఎకరాల భూములు కొంటున్నా ప్రభుత్వ రికార్డుల ప్రకారం వాటి విలువ లక్షల్లోనే ఉంటుంది. మార్కెట్ వాల్యూ ప్రకారం తక్కువ ధర ఉండడమే ఇందుకు కారణం. దీని వల్ల పెద్ద ఎత్తున బ్లాక్మనీ చేతులు మారుతోంది. సామాన్యుల చేజారుతున్న భూములు హైవే వెంట ఎకరం ధర లక్షల్లో పలుకుతుండడంతో పెద్ద ఎత్తున అమ్మకాలు సాగుతున్నాయి. ముఖ్యంగా పేదలు తమ అవసరాల కోసం అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో పేద రైతులు భూములను కోల్పోతున్నారు. తిరిగి కొనుగోలు చేయాలన్నా వారికి భూ ముల ధరలు అందనంతదూరంలోకి వెళ్తున్నాయి. -
నేటి నుంచి షర్మిల పరామర్శయాత్ర
-
నేటి నుంచి షర్మిల పరామర్శయాత్ర
నల్లగొండ జిల్లాలో 4 రోజులపాటు పర్యటన ⇒ ఆరు నియోజకవర్గాల పరిధిలో 18 కుటుంబాలకు పరామర్శ ⇒ వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్రెడ్డి, శివకుమార్ సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల నల్లగొండ జిల్లాలో రెండో విడత యాత్రను మంగళవారం నుంచి చేపట్టనున్నారు. శుక్రవారం వరకు నాలుగు రోజులపాటు ఆరు నియోజకవర్గాల్లోని 18 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆయన తరఫున పరామర్శ యాత్రను చేపట్టిన షర్మిల.. మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో ఇదివరకే యాత్రను నిర్వహించారు. నల్లగొండ జిల్లాలో మిగిలిన భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల పరిధిలో పరామర్శ యాత్ర చేపట్టేందుకు మంగళవారం ఉద యం 9.30కు హైదరాబాద్లోని లోటస్పాండ్ లోని తమ నివాసం నుంచి బయలుదేరుతారు. బుధవారం నుంచి యాత్ర ఇలా.. బుధవారం ఉదయం ఆలేరు నియోజకవర్గం లోని శారాజీపేటలో ఎదుల్ల శ్రీనివాస్ కుటుం బాన్ని షర్మిల పరామర్శిస్తారు. అక్కడి నుంచి తుంగతుర్తి నియోజకవర్గం పల్లెపహాడు, మోత్కూరు మీదుగా పొడిచేడు చేరుకుని దీటి గౌరమ్మ కుటుంబ సభ్యులను కలుసుకుం టారు. అనంతరం నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మీదుగా సిరిపురం చేరుకుని పున్న వీరయ్య కుటుంబాన్ని, కట్టంగూరు టౌన్లో గాదగోని రాములు కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత నకిరేకల్లోని మర్రూరుకు చేరుకుని పుట్ట సైదులు కుటుంబాన్ని కలుసుకుంటారు. ఇక గురువారం ఉదయం నకిరేకల్ నియోజకవర్గ భీమారంలో నెమ్మాది శేఖర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి నల్లగొండ నియోజకవర్గం ఇందుగులకు చేరుకుని రాయించు నర్సింహ కుటుంబా న్ని, తిప్పర్తిలో గుంటి వెంకటేశం, చందనపల్లిలో చింతా భిక్షయ్య కుటుంబాన్ని, నల్లగొండ టౌన్లో బాండేకర్ దయానంద్ కుటుంబాన్ని కలుసుకుంటారు. శుక్రవారం ఉదయం కనగల్ చౌరస్తాలో వైఎస్సార్ విగ్రహానికి షర్మిల పూల మాల వేసి యాత్ర కొనసాగిస్తారు. మునుగోడు నియోజకవర్గం నాంపల్లికి చేరుకుని ఆస్తర్బీ, తాన్దార్పల్లిలో మునగాల పుల్లమ్మ కుటుంబాలను, తర్వాత చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో బిగ్ర వసంతరావు కుటుం బాన్ని పరామర్శిస్తారు. బీబీనగర్ వద్ద ప్రారంభం.. నల్లగొండ జిల్లా భువనగిరి నియోజకవర్గ పరిధిలోని బీబీనగర్ టోల్గేట్ సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి షర్మిల పూలమాల వేసి.. పరామర్శ యాత్రను ప్రారంభిస్తారని వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యద ర్శులు కె.శివకుమార్, గట్టు శ్రీకాంత్రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘‘బీబీనగర్లోని వెంకిర్యాలలో చెరుకు కిష్టయ్యగౌడ్ కుటుంబాన్ని తొలుత పరామర్శిస్తారు. అక్కడి నుంచి రాఘవాపురం, చిన్నరావులపల్లి, ఎర్రంబెల్లి, గౌస్నగర్ మీదుగా కంచనపల్లికి చేరుకుని అక్కడ కొలిచెల్మి అంజయ్య కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. భోజన విరామం అనంతరం బండ సోమారం, చాడ ఎక్స్రోడ్ మీదుగా ముస్త్యాలపల్లి చేరుకుని కళ్లెం నర్సయ్య కుటుంబాన్ని, అనంతరం ఆలేరు నియోజకవర్గంలోని దాతరుపల్లిలో ఎ.చంద్రమ్మ కుటుంబాన్ని, యాదగిరిపల్లిలో చింతల కృష్ణ కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారు’’ అని వివరించారు. -
నేడు జిల్లాకు రాజన్న బిడ్డ
బీబీనగర్ మండలం నుంచి ప్రారంభం టోల్గేట్ వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్న వైఎస్ షర్మిల నాలుగు రోజులపాటు సాగనున్న యాత్ర 18 కుటుంబాలకు ఓదార్పు భువనగిరి : తన తండ్రి మరణం తట్టుకోలేక జిల్లాలో గుండెపగిలి మృతిచెందిన వారి కుటుంబాల్లో మనోస్థైర్యం కల్పించేందుకు రాజన్న బిడ్డ షర్మిల మలివిడత పరామర్శ యాత్ర మంగళవారంనుంచి ప్రారంభంకానుంది. 6 నియోజకవర్గాల్లో 18 మంది కుటుంబాలను కలుసుకుని వారి బాగోగులు తెలుసుకోనున్నారు. వారికి తమ కుటుం బం అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మలి విడత పరామర్శ యాత్ర మంగళవారం నల్లగొండ జిల్లాలో ప్రారంభం కానుంది. భువనగిరి నియోజకవర్గం బీబీనగర్ మండలంలోని గూడూరు టోల్గేట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం యాత్ర ప్రారంభమవుతుంది. ఈ నెల 12వ తేదీన మునుగోడు నియోజవర్గం చౌటుప్పల్లో ముగుస్తుంది. భువనగిరి, అలేరు. తుంగతుర్తి, నకిరేకల్, నల్లగొండ, మునుగోడు నియోజవర్గాల్లో 18 కుటుం బాలను షర్మిల పరామర్శిస్తారు. వైఎస్సార్ మరణం తట్టుకోలేక జిల్లాలో 49 మంది చనిపోయారు. అందులో 32 కుంటుంబాలను గతంలోనే ఆమె పరామర్శించిన విషయం తెలిసిందే. షర్మిల పరామర్శ యాత్ర తొలిరోజు షెడ్యూల్.. ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్లోని లోటస్పాండ్నుంచి బయలుదేరుతారు. బీబీనగర్ మండలం గూడూరు టోల్ గేట్ వద్దగల వైఎస్ విగ్రహానికి పూల మాల వేసి అక్కడినుంచి పరామర్శయాత్రకు వెళతారు. తొలిరోజు బీబీనగర్ మండలం వెంకిర్యాలలో గల చెర్కు కిష్టయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడినుంచి వలిగొండ మండలం కంచనపల్లికి వెళ్లి కొలిచెల్మి అంజయ్య కుటుంబాన్ని, భువనగిరి మండలం ముస్త్యాలపల్లికి చెందిన కల్లెం నర్సయ్య కుటుంబాలను పరామర్శిస్తారు. ఇక్కడితో మూడు కుటుంబాల పరామర్శ పూర్తవుతుంది. ఇక్కడితో భువనగిరి నియోజకవర్గం యాత్ర పూర్తవుతుంది. ఆనంతరం ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి గ్రామంలో ఎ.చంద్రమ్మ, యాదగిరిపల్లిలో చింతల కృష్ణ కుటుంబాలను పరామర్శిస్తారు. ఆలేరులో రాత్రి బస చేస్తారు. మలివిడత పరామర్శ యాత్రలో కలిసే కుటుంబాలు.. భువనగిరి నియోజకవర్గంలో బీబీనగర్ మండలం వెకిర్యాల గ్రామానికి చెందిన చెర్కు కిష్టయ్యగౌడ్ కుటుంబ ం వలిగొండ మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన కొలిచెల్మి అంజయ్య కుటుంబం భువనగిరి మండలం ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన కళ్లెం నర్సయ్య కుటుంబ ం ఆలేరు నియోజకవర్గంలో ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన ఎదుల్ల శ్రీనివాస్ కుటుంబం యాదగిరిగుట్ట మండలంలోని యాదగిరిపల్లి గ్రామానికి చెందిన చింతల కృష్ణ కుటుంబ ం యాదగిరిగుట్ట మండలంలోని దాతరుపల్లి గ్రామానికి చెందిన ఎ.చంద్రమ్మ కుటుంబం తుంగతుర్తి నియోజకవర్గంలో మోత్కూర్ మండలం పొడిచేడు గ్రామానికి చెందిన బీతి నర్సమ్మ కుటుంబం నకిరేకల్ నియోజకవర్గంలో రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన పున్న వీరయ్య కుటుంబం కట్టంగూరు మండలంలోని కేంద్రం గ్రామానికి చెందిన గాదగోని రాములు కుటుంబం నకిరేకల్ మండలంలోని మర్రూర్ గ్రామానికి చెందిన పుట్ట సైదులు నెమ్మాది శేఖర్ కుటుంబం నల్లగొండ నియోజకవర్గంలో నల్లగొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన చింతా భిక్షమయ్య కుటుంబం తిప్పర్తి మండలం కేంద్రానికి చెందిన గుంటి వెంకటేశం కుటుంబం తిప్పర్తి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన రాయించు నర్సింహ కుటుంబం నల్లగొండ పట్టణంలో దండేకార్ దయానంద్ కుటుంబం మునుగోడు నియోజకవర్గంలో మర్రిగూడెం మండలం తాన్దార్పల్లి గ్రామానికి చెందిన మునగాల పుల్లమ్మ కుటుంబ ం నాంపల్లి మండలం నాంపల్లికి చెందిన అస్తర్బీ కుటుంబం చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన బిట్ర వసంతరావు కుటుంబ ం. పరామర్శ యాత్ర తొలిరోజు షెడ్యూల్.. మొదట గూడూరు టోల్గేట్ వద్దగల వైఎస్ విగ్రహానికి పూలమాల వేస్తారు. బీబీనగర్ మండలం వెంకిర్యాలలో చెర్కు కిష్టయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. వలిగొండ మండలం కంచనపల్లిలో కొలిచెల్మి అంజయ్య కుటుంబాన్ని కలుసుకుంటారు. భువనగిరి మండలం ముస్త్యాలపల్లికి చెందిన నర్సయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లిలో ఎ.చంద్రమ్మ, యాదగిరిపల్లిలో చింతల కృష్ణ కుటుంబాలను పరామర్శిస్తారు. -
వైఎస్సార్ సీపీని బలోపేతం చేయాలి
భువనగిరి అర్బన్ : తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్ అన్నారు. సోమవారం పట్టణంలోని రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ కీలక పాత్ర పోషించనుందన్నారు. రాష్ర్టంలో అన్ని రాజకీయ పార్టీలకు భిన్నంగా బడుగు, బలహీనవర్గాల ప్రజలు, కార్మికులు, రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల చివరి వరకు ప్రతి మండలం, పట్టణంలో పార్టీ పూర్తిస్థాయి కమిటీల ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో భువనగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ గూడూరు జైపాల్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వేముల శేఖర్రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.రయాజ్అహ్మద్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు బాలెంల మధు, పట్టణ అధ్యక్షుడు చల్లగురుగుల రఘుబాబు, యూత్ విభాగం పట్టణ అధ్యక్షుడు బబ్బూరి నరేష్గౌడ్, వలిగొండ మండల అధ్యక్షుడు ఇంజమూరి కిషన్, నాయకులు పాక శేఖర్యాదవ్, కంసాని రాజేష్, క్రాంతికుమార్ తదితరులు ఉన్నారు. ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం యాదగిరిగుట్ట : ప్రజా సమస్యలపై అలుపెరుగని రీతిలో పోరాటాలు ముమ్మరం చేస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్ అన్నారు. సోమవారం గుట్టలో ఏర్పాటు చేసి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారితో కలిసి ఉద్యమిస్తామని తెలిపారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతగానో మేలు జరిగిందని, వాటిని కొనసాగించాల్సిన అవసరం నేటి ప్రభుత్వాలకు ఉందన్నారు. త్వరలో జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర చేపట్టనున్నారని తెలిపారు. అనంతరం పార్టీ గుట్ట, ఆలేరు మండలాల నూతన అధ్యక్షులుగా గుండు భార్గవ్, కొత్తోజు నర్సింహాచారిలను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి అభినందించారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వడ్లోజు వెంకటేశ్, వేముల శేఖర్రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గూడూరు జైపాల్రెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అద్యక్షుడు బాలెంల మధు, మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.ఫయాజ్ అహ్మద్, పార్టీ జిల్లా కార్యదర్శి బండ్రు ఆంజనేయులు, నాయకులు సతీష్రాజ్, బండారు హరిప్రసాద్, మాలోతు శ్రీను నాయక్, చంద్రం తదితరులు పాల్గొన్నారు. -
రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి : ఎంపీ
భువనగిరి : పంచాయతీరాజ్ గ్రామీణ రోడ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. సోమవారం భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖలో ఎంఆర్ఆర్, సీఆర్ఆర్, పీఎంజీఎస్వై, నాబార్డు రోడ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడాఉతూ ప్రభుత్వం గ్రామీణరోడ్ల అభివృద్ధికి నిధులను కేటాయించిందని వాటిని సకాలంలో ఖర్చు చేసిన నాణ్యతకు లోటు రాకుండా పూర్తి చేయాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ఈ ఉమామహేశ్వర్రెడ్డి, ఈఈలు వెంకటరమణ, డీఈలు పాల్గొన్నారు. -
యాదాద్రి పాలక మండలికి నోటిఫికేషన్
భువనగిరి : ఆరు సంవత్సరాలుగా అడ్రస్లేకుండా పోయిన యాదగిరిగుట్ట దేవస్థానం ధర్మకర్తల మండలి నియామకానికి ఎట్టకేలకు ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే వలిగొండ మండలంలోని వేములకొండ మత్స్యగిరి లక్ష్మీనర్సింహస్వామి పాలక మండలి సభ్యుల నియామకానికి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఔత్సాహికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. యాదగిరిగుట్ట ధర్మ కర్తల మండలి పదవీ కాలం 2009 నవంబర్ 18 న ముగిసింది. అయితే గత ప్రభుత్వంలో అడ్రస్లేకుండా పోయిన పాలకవర్గ నియామకం కోసం ఫిబ్రవరి 14 న జీఓనంబర్ 221ని జారీ చేశారు. దీని ఆధారంగా శుక్రవారం నోటిఫికేషన్ వెలువడింది. నోటిఫికేషన్ జారీ అయిన 20 రోజులలోపు ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ప్రభుత్వం వాటిని పరిశీలించి ధర్మకర్తలను నామినేట్ చేస్తుంది. సేవాగుణం, సచ్చీలత ఆధారంగానే.. నిజాం కాలం నుంచి ధర్మకర్తల నియామకం ప్రారంభమైంది. 1966లో దేవాదాయ చట్టం రూపొందించారు. ఈ ఆలయానికి వంశపారం పర్య ధర్మకర్త పాలకమండలి చైర్మన్గా ఉంటారు. అందువల్ల ఈ చట్టం ప్రకారం మరో 8మంది సభ్యులను ప్రభుత్వం నియమించనుంది. యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి కోసం వైటీడీఏ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ తనే చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అయితే దేవస్థానం ధర్మకర్తల మండలి ఎంపిక కూడా ఆయనే స్వయంగా చేయనున్నారు. ఈ విషయంలో ఆధ్యాత్మికత, సేవాగుణాలు, సచ్చీలత వంటి అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఒక ధర్మ కర్త స్థానాన్ని ఎస్సీ,ఎస్టీ, బలహీనవర్గాలకు తప్పనిసరి కేటాయించాలి. వీరి పదవీ కాలం రెండు సంవత్సరాలు ఉంటుంది. ధర్మకర్తల ఎంపికలో ఇద్దరు స్థానికులను నియమించే అవకాశం ఉంది. మిగతా ఆరు స్థానాలను మాత్రం తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా నియమించే అవకాశం ఉంది. సీఎం వైటీడీఏ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టిపెట్టి నందున ధర్మకర్తల నియామకంపై కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారనడంలో సందేహం లేదు. పూర్తిగా నామినేటెడ్ పదవులు అయినప్పటికీ ఆ పదవికి మరింత గౌరవాన్ని తెచ్చే వారిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే,ఎంపీ, జిల్లాకు చెందిన మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి ధర్మ కర్తల నియామకంలో కీలకపాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. పైరవీలు ముమ్మరం ధర్మకర్తల నియామకం కోసం నోటిఫికేషన్ రావడంతో ఔత్సాహికుల్లో ఆసక్తి పెరిగింది. తమకు ధర్మకర్త పదవి ఇప్పించాలని పలువురు పైరవీలు ముమ్మరం చేశారు. మరో 20 రోజులు ఉండడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. -
వివాహిత బలవన్మరణం
పచ్చర్లబోడుతండా(భువనగిరి అర్బన్): కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని పచ్చర్లబోడుతండాలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పచ్చర్లబోడుతండా గ్రామానికి చెందిన మేగావత్ సర్థార్కు 15 సంవత్సరాల క్రితం మీటితండాకు చెందిన బుజ్జమ్మతో వివాహం జరిగింది. మూడేళ్లకే మనస్పర్థలు వచ్చి విడిపోయారు. సర్థార్నాయక్ 12 ఏళ్ల క్రితం బొమ్మలరామారం మండలానికి చెందిన మేగావత్ పద్మ(28)ను వివాహం చేసుకున్నాడు. వీరికి 7 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఇదిలా ఉండగా మేగవత్ సర్థార్ కొన్ని రోజులుగా మొదటి భార్య బుజ్జమ్మతో సఖ్యతగా ఉంటున్నాడు. ఈ విషయం పద్మకు తెలియడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. సర్థార్ ఎంత చెప్పినా వినకపోవడంతో పద్మ మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో గురువారం ఉదయం 5 గంటల సమయంలో గ్రామ సమీపంలోని ఓవ్యవసాయ బావిలో దూకింది. కల్లాపి చల్లడానికి పేడ తీసుకువస్తానని వెళ్లిన పద్మ ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఓ వ్యవసాయ బావి వద్ద ఆమె చెప్పులు, పేడ జబ్బ కనపించింది. వెంటనే బావిలోకి దిగి చూడగా అప్పటికే పద్మ మృతిచెందింది. ఈ మేరకు సంఘటన స్థలం వద్ద రూరల్ పోలీసులు శవ పంచానమా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్టు రూరల్ ఎస్ఐ నర్సింగ్రావు తెలిపారు. -
పురిటిబిడ్డల తారుమారు ..!
భువనగిరి: ఆపరేషన్ థియేటర్ నుంచి తెచ్చిన పురిటిబిడ్డను అప్పగించడంలో జరిగిన పొరపాటు నాలుగు గంటల పాటు పెద్ద వివాదాన్ని సృష్టించింది. భువనగిరి ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం ఇద్దరు పురిటి బిడ్డలు తారుమారు కావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. డాక్టర్, పోలీస్ల జోక్యంతో వివాదం తాత్కాలికంగా శాంతించింది. డీఎన్ఏ,రక్తపరీక్షలు నిర్వహిస్తామని నచ్చచెప్పడంతో సుమారు నాలుగుగంటల తర్వాత పసికందులు తల్లిపాలకు నోచుకున్నారు. బంధువులు శాంతించారు. భువగిరి ఏరియా ఆస్పత్రిలో కాన్పుకోసం మండలంలోని వడపర్తికి చెందిన నల్లా దీపిక, యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరుకు చెందిన కనకలక్ష్మిలు వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం వీరికి డాక్టర్ కోట్యానాయక్, డాక్టర్ శ్రీదేవి శస్త్ర చికిత్స చేసి ప్రసవాలు చేశారు. ఇందులో 12-34 గంటలకు దీపికకు మగ బిడ్డ జన్మించగా, 12.21 నిముషాలకు కనకలక్ష్మికి ఆడబిడ్డ జన్మించింది. ఇద్దరికి తొలికాన్పు కావడంతో వారి బంధువులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన సిబ్బ ంది ఇస్తారమ్మ కనకలక్ష్మికి మగబిడ్డను అప్పగించింది. దీపికకు ఆడబిడ్డను అప్పగించింది. ఇంతలో డాక్టర్ వచ్చి దీపికకు మగబిడ్డ, కనకలక్ష్మికి ఆడబిడ్డ జన్మించిందని చెప్పాడు. పొరపాటు జరిగిన విషయాన్ని చెప్పడంతో కనకలక్ష్మి కుటుంబ సభ్యులు మాకు మగబిడ్డ జన్మించాడని ఆస్పత్రిలో కావాలని ఇలా చేస్తున్నారని వాగ్వాదానికి దిగారు. ఆడబిడ్డను తీసుకోవడానికి వా రు నిరాకరించారు. దీంతో పరిస్థితి కొంత మేరకు ఉద్రిక్తంగా మారింది. మగబిడ్డను ఇచ్చేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. డాక్టర్ కోట్యానాయక్ పట్ల దురుసుగా మాట్లాడడంతో ఆయన వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు. అనంతరం మళ్లి ఆస్పత్రికి వచ్చి ఇరువర్గాల వారితో చర్చలు జరిపారు. ఏ తల్లికి ఎవరు జన్మిం చారో తనకు స్పష్టంగా తెలుసునని చెప్పారు. అయితే మీరు నమ్మకపోతే డీఎన్ఏ,రక్తం, పాదాలు, చేతి వేళ్లు, సమయం పరిక్షించి నిర్ధారణ చేయడం జరుగుతుందని చెప్పారు సాయంత్రం 4.20 గంటల వరకు మగబిడ్డను పొందిన కనకలక్ష్మి కుటుంబానితో డాక్టర్ చర్చలు జరిపారు. చివరికి పట్టణ ఇన్స్పెక్టర్ సతీష్రెడ్డి ఆస్పత్రికి వచ్చి పరీక్షలు నిర్వహించాలని, అప్పటి వర కు రికార్డుల ప్రకారం ఎవరి బిడ్డను వారికి అప్పగించాలని డాక్టర్కు సూచించారు. కనకలక్ష్మికి ఆడబిడ్డను, దీపికకు మగబిడ్డను అప్పగించారు. దీంతో నాలుగు గం టల పాటు సాగిన వివాదం నిలిచిపోయింది. సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం ఆపరేషన్ థియేటర్ నుంచి పురిటి బిడ్డలను తెచ్చి ఇవ్వడంలో ఇంతటి వివాదానికి కారణమైన సిబ్బంది ఇస్తారమ్మపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని డాక్టర్ కోట్యానాయక్ చెప్పారు. డీఎన్ఏ పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి ఎవరి సంతానాన్ని వారికి అప్పగించడం జరుగుతుందని చెప్పారు. నాలుగు గంటల పాటు పాలు లేక.. పుట్టిన బిడ్డకు వెంటనే పాలు ఇవ్వాల్సి ఉండగా వివాదంతో నాలుగు గంటలపాటు పురిటిబిడ్డలు తల్లిపాలకు నోచకోలేకపోయారు. వివాదం తేలేవరకు వారికి పాలు ఇవ్వకపోవడంతో ఒక దశలో ఏడ్వడం మొదలు పెట్టా రు. తల్లులు సైతం తమ కన్నబిడ్డలకు పాలు ఇవ్వలేక న రకయాతన అనుభవించారు. ఒక సారి పాలు ఇవ్వడం జరిగితే వివా దం మరింత పెద్దదౌతుందని ఆస్పత్రిలో భావిం చారు. వివాదం తాత్కాలికంగా సద్దుమణిగిన వెంటనే తల్లులు తమ బిడ్డలకు పాలు ఇచ్చారు. -
అడ్డొస్తున్నాడనే...
వివాహేతర బంధం సాగకుండా ఒకరికి.. రాజకీయంగా మరొకరికి ఆయన అడ్డొస్తున్నాడు.. గ్రామంలో పెద్ద మనిషిగా రోజురోజుకూ గుర్తింపు పొందుతున్నాడు.. ఇది వారు జీర్ణించుకోలేకపోయారు.. అదునుకోసం చూశారు.. వ్యవసాయబావి వద్ద పాలుపితుకుతుండగా.. కళ్లలో కారం చల్లి.. ఆపై వేటకొడవళ్లతో దారుణంగా నరికి ఆ పెద్ద మనిషిని హత్య చేశారు.. ఇవీ మోత్కూర్ మండలం రాగిబావికి చెందిన పుట్ట ప్రభాకర్రెడ్డి హత్యోందం వెనుక ఉన్న కారణాలు.. - భువనగిరిటౌన్ మోత్కూర్ మండలం రాగిబావిలో ఈ నెల 8వ తేదీన జరిగిన పుట్ట ప్రభాకర్రెడ్డి(50) హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భువనగిరి డీఎస్పీ మోహన్రెడ్డి నిందితుల వివరాలు, కారణాలు, హత్య జరిగిన తీరుతెన్నులను వివరించారు. గ్రామానికి చెందిన ప్రభాకర్రెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడు గ్రామంలో పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నాడు. కాగా అదే గ్రామానికి చెందిన జక్కుల యాదయ్య భార్య ఆరు సంవత్సరాల క్రితం మృతిచెందింది. దీంతో అతడు అదే గ్రామానికి చెందిన పద్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం పంచాయతీ పెద్దల వరకు వెళ్లింది. దీంతో ప్రభాకర్రెడ్డి పలుమార్లు యాదయ్యను ఈ విషయం హెచ్చరించాడు. తన సంబంధం కొనసాగకుండాప్రభాకర్రెడ్డి అడ్డొస్తున్నాడని యాదయ్య అతడిపై కక్ష పెంచుకున్నాడు. రాజకీయంగా అడ్డు తగులుతున్నాడని.. అదే గ్రామానికి చెందిన యెన్నం శ్రీనివాస్రెడ్డికి ప్రభాకార్రెడ్డికి రాజకీయ పరంగా విభేదాలు ఉన్నాయి. శ్రీనివాస్రెడ్డి కూడా అదును కోసం ఎదురు చూస్తున్నాడు. ఇదే క్రమంలో యాద య్య పంచాయతీ తెలుసుకున్న శ్రీనివాస్రెడ్డి అతడికి డబ్బు ఎర వేశాడు. ప్రభాకర్రెడ్డి హత్య చేస్తే రూ. 20 వేలు ఇస్తానని, కేసు ఖర్చులు భరిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీని లో భాగంగా రూ. 15 వేలు ముట్టజెప్పాడు. కాంట్లో కారం చల్లి.. అదును కోసం ఎదురుచూస్తున్న యాదయ్య ఈ నెల 8వ తేదీన తెల్లవారుజామున ప్రభాకర్రెడ్డి ఒంటరిగా వ్యవసాయ బావి వద్దకు వెళ్లడాన్ని గమనించాడు. వెంటనే పద్మను తీసుకుని అక్కడికి వెళ్లాడు. పాలుపితుకుతున్న ప్రభాకర్రెడ్డి వద్దకు తొలుత పద్మ వెళ్లి మాటలు కలిపి కంట్లో కారం చల్లింది. వెంటనే యాదయ్య వెళ్లి వేటకొడవలితో నరికి అక్కడి నుంచి పరారయ్యారు. అనుమానం రాకుండా.. ప్రభాకర్రెడ్డిని హత్య చేస్తే తనపైనే అనుమా నం వస్తుందని శ్రీనివాస్రెడ్డి భావించాడు. దీంతో తన గడ్డివామును యాదయ్యతో తగులబెట్టించాడు. శ్రీనివాస్రెడ్డి గ్రామంలో జరుగుతున్న విషయాలను యాదయ్యకు ఎప్పటికప్పుడూ చేరవేస్తున్నాడు. పోలీసుల విచారణలో.. ప్రభాకర్రెడ్డి హత్య అనంతరం యాదయ్య పరారీలో ఉండడంతో పోలీసులకు అతడిపై అనుమానం వచ్చింది. అతడి ఆచూకీ లభించకపోవడంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న పద్మను అదుపులోకి తీసుకుని విచారించాడు. దీంతో హత్యోదంతం వెనక ఉన్న కారణాలు అన్నీ వెల్లడైనట్టు డీఎస్పీ వివరించారు. పక్కా సమాచారం మేరకు యాదయ్యను రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో వ్యవసాయం బావి వద్ద, నల్లగొం డలో కుమారుడి ఇంట్లో ఉన్న శ్రీనివాస్రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిదింతులను పట్టుకోవడం కోసం ఇంతకు ముందు ప్రకటించిన ప్రకారం పోలీస్ సిబ్బంది అంజనేయులు, జానికిరాములకు రివార్డు కింద ఒక్కొక్కరికి రూ 5వేలు చొప్పున డీఎస్పీ అందజేశారు. సమావేశంలో భువనగిరి పట్టణ సీఐ సతీష్రెడ్డి, రూరల్ సీఐ తిరుపతి, రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి, యాదగిరిగుట్ట సీఐ శంకర్గౌడ్, మోత్కూర్ ఎస్సై పురేందర్భట్లు పాల్గొన్నారు. -
న్యూ ‘ఇయర్’ రూల్స్..!
భువనగిరి/ కోదాడటౌన్ : నవ వసంతానికి స్వాగతం పలికేందుకు యువత ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటుంటుంది. అయితే ఆనందంగా గడుపుకోవాల్సిన నూతన సంవత్సర వేడుకల్లో విషాదం నిండాకుండా ఉండేందుకు పోలీస్శాఖ కొన్ని సూచనలు చేసింది. హద్దు మీరితే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది. రెస్టారెంట్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు.. ఇంకెవరైనా సరే.. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించాలంటే ప్రభుత్వం జారీ చేసిన సరికొత్త నిబంధనలు పాటించాల్సిందే. ఈవెంట్ ఆర్గనైజర్లు ఎవరైనా వేడుకలను నిర్వహిస్తే ముం దస్తు అనుమతి తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి రూ.3వేల ఫీజు చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అనుమతులు లేకుండా వేడుకలు నిర్వహిస్తే నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని ఉన్నత స్థాయి నుంచి ప్రత్యేక ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. అంతేకాకుండా వేడుకలను నిర్ణీత సమయం వరకే నిర్వహించాల్సి ఉంటుంది. అనుమతులు కోసం ఎక్సైజ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను జిల్లా అధికారులకు పంపి వారి ఆమోదం పొందిన అనంతరం అనుమతులు జారీ చేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సివిల్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మద్యం మత్తులో రోడ్లపై మోటార్సైకిళ్లతో విన్యాసాలు చేస్తే వారి వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామంటున్నారు. వేడుకల పేరుతో శ్రుతిమించి వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని చెబుతున్నారు. న్యూ ఇయర్ రోజున హోటళ్లు, మ ద్యం దుకాణాలను రాతిర11 గంటల వరకు మూసివేయాలని, అనుమతులు తీసుకున్న వారు కూడా తమతమ ప్రదేశాల్లోనే ప్రశాం తంగా వేడుకలను నిర్వహించాలని, అనుమతి ఉన్న సమయం లోపే వాటిని ముగించాలని ముందస్తుగానే హెచ్చరిస్తున్నారు. అనుమతులు తీసుకోవాలి : మల్లయ్య, ఎక్సైజ్ సీఐ, కోదాడ ఈవెంట్ ఆర్గనైజర్లు నూతన సంవత్సరం వేడుకలను నిర్వహించినా, అందులో మద్యం వినయోగించినా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. రూ. 3 వేలు చలానా రూపంలో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. పాటించాల్సిన నిబంధనలు... బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించవద్దు. డిసెంబర్31 వతేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. {పజలకు ఆటంకం కలగకుండా వేడుకలను నిర్వహించుకోవాలి. అనుమతి పొందిన కార్యక్రమాలను మాత్రమే నిర్వహించాలి. తాత్కాలిక స్టేజ్లను ఏర్పాటు చేస్తే తగిన పటిష్టత ఉందంటూ,అధికారు ల వద్ద అనుమతి పత్రం పొందాలి. వేడుకల్లో భాగంగా మద్యం ఇచ్చేలా ఉంటే దానికి సంబంధించిన అనుమతిని పొందాలి. హోటళ్లు, ఫాంహౌస్లకు వచ్చేవారి వాహనాలు నిలిపేందుకు తగిన పార్కింగ్ స్థలాన్ని కేటాయించాలి. ముఖ్యైమైన ప్రాతాల్లో నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా హోటళ్లు, ఫాంహౌస్ నిర్వహకులు చర్యలు తీసుకోవాలి. ఒక వేళ ఏమైనా జరిగినా వాటికి హోటళ్లు ఫాంహౌస్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మద్యం తాగిన వారు తమ నివాసాలకు భద్రంగా చేరే విధంగా కార్యక్రమ నిర్వాహకులు తగు ఏర్పాట్లు చేయాలి. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చే విదేశీయులకు సంబంధించిన వివరాలు సమీపంలోని పోలీసు స్టేషన్లో సమర్పించాలి. ఈత కొలనుపై తాత్కాలిక స్టేజ్లను ఏర్పాటు చేయడానికి అనుమతి లేదు కొత్త సంవత్సరానికి వేసే లైటింగ్ విద్యుత్ సంబంధిత అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదం జరిగితే విద్యుత్ శాఖ బాధ్యత వహించదు. నిబంధనలు ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవంటూ హెచ్చరిక జారీ చేసింది. -
కొండకు కృష్ణాజలాలు
భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనారసింహస్వామి దేవస్థానంలో ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్యలైన మంచినీరు, పారిశుద్ధ్యంపై యంత్రాంగం దృష్టిపెట్టింది. మొదటినుంచి ఇక్కడ మంచినీటి సమస్య ఉంది. దీంతోపాటు కొండపైనా పారిశుద్ధ్యలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. ఇదే విషయమై సీఎం కేసీఆర్ కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అక్టోబర్ 17న యాదగిరిగుట్టకు వచ్చిన సమయంలో పారిశుద్ధ్యం, పందుల విహారంపై అసహనం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా క్షేత్రం ప విత్రతను కాపాడడానికి అవసరమైన అన్ని చర్య లూ తీసుకోవాలని సీఎం అధికారులను అదేశిం చారు. ఈ క్రమంలోనే సుమారు రూ.750 కోట్లతో పలు సమస్యల పరిష్కారం, అభివృద్ధి చేసే బృహత్తర ప్రణాళిక కోసం కసరత్తు జరుగుతోంది. మంచినీటి ఎద్దడి నివారణ.. నిత్యం వచ్చే భక్తుల అవసరాలను తీర్చడానికి యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం యాదగిరికొండపై మంచినీటి ఎద్దడిని నివారించేందుకు శాశ్వత ప్రణాళిక రూపొందించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం భువనగిరి నుంచి కృష్ణాజలాలు వస్తున్నప్పటికీ అవి రోజూ రావడం లేదు. వారం రోజులకోసారి వస్తుండడంతో అవి ఏమూలకూ సరిపోవడం లేదు. అయితే కృష్ణాజలాలను నేరుగా ఉదయసముద్రం నుంచి యాదగిరిగుట్టకు తీసుకురావడానికి ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. కలెక్టర్ ఆదేశంతో ఆ శాఖ అధికారులు అంచనాలు కూడా ూపొందించారు. నల్లగొండ శివారులోని పానగల్లు ఉదయసముద్రం నుంచి గుట్టకు తీసుకురావాలంటే రూ.100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఈ ఊపులోనే నిధుల మంజూరు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో గుట్ట అధికారులున్నారు. పారిశుద్ధ్యం ఇలా.. పారిశుద్ధ్య సమస్య దేవస్థానంతోపాటు గుట్టపరిసరాల్లో తీవ్రంగా ఉంది. ప్రధానంగా పందుల స్వైరవిహారం సాగుతోంది. పందులను దూరంగా తరిమివేయడంతోపాటు, ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నిర్ణయించారు. ఇందుకోసం ముందుగా అనుకున్నట్లు గుట్ట చుట్టూ ప్రహరీ నిర్మించడానికి పెద్దఎత్తున నిధులు అవసరమవుతున్నాయి. ప్రస్తుతం దేవ స్థానం వద్ద అన్ని నిధులు లేనందున కొండచుట్టూ ట్రెంచ్కట్ చేయడం కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో ఈపని చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేర కు కలెక్టర్ చిరంజీవులు ఉపాధి హామీ పీడీకి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు కొండపైన పం దులకు ఆహారం దొరకకుండా చేయడానికి పారిశుద్ధ్యం మెరుగుపర్చడం కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇం దుకోసం అధికారుల బృందంసర్వేలు ప్రారంభించింది. నివేదికలు రూపొందించాం దేవస్థానంలో మంచి నీటి ఎద్దడి నివారణకు శాశ్వత ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రస్తుతం వస్తున్న కృష్ణాజలాలు ఏమూలకూ సరిపోవడం లేదు. శాశ్వత మంచినీటి ఎద్దడి నివార ణకు కృషి చేస్తున్నాం. అలాగే పారిశుద్ధ్యం మెరుగుదల, పందులు రాకుండా అడ్డుకోవడానికి ఉపాధి హామీలో ట్రెంచ్కట్ చేయాలని ఆలోచిస్తున్నాం. దీనిపై ఉపాధి పీడీ గుట్టకు రానున్నారు. - గీతారెడ్డి, ఈఓ, గుట్ట దేవస్థానం -
నేడు గుట్టకు సీఎం కేసీఆర్ రాక
-
నేడు గుట్టకు సీఎం కేసీఆర్ రాక
భువనగిరి : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం యాదగిరిగుట్టకు రానున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాటు చేసింది. సీఎం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఉదయం 11 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుంటారు. స్వామివారి దర్శనం అనంతరం గుట్ట అభివృద్ధిపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. అనంతరం ఆయన మెదక్ జిల్లా గణపురం వెళ్లనున్నారు. కాగా సీఎం రాక సందర్భంగా కలెక్టర్ చిరంజీవులు మంగళవారం యాదగిరిగుట్టకు చేరుకుని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రధానంగా హెలిపాడ్ ఎక్కడ ఏర్పాటు చేయాలని స్థానిక అర్డీఓ ఎన్.మధుసూదన్, డీఎస్పీ ఎస్. మోహన్రెడ్డి, దేవస్థానం ఈఓ గీతారెడ్డి, ఆర్ఆండ్బీ ఈఈ లింగయ్యలతో సమీక్షించారు. యాదగిరి గుట్టకు పక్కనే ఉన్న భువనగిరి మండలం వడాయిగూడెంలోని ఓ వెంచర్లో హెలిపాడ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడి పరిస్థితులను కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇక్కడ ఏర్పాటు చేసిన హెలిపాడ్ ద్వారా దిగి అనంతరం జరిగిన సభలో పాల్గొన్నారు. మళ్లీ అదే స్థలంలో హెలిపాడ్ ఏర్పాటు చేస్తే రోడ్డు మార్గం గుండా గుట్టపైకి నేరుగా చేరుకోవచ్చునని అధికారులు నిర్ణయించారు. సురేంద్రపురి వద్ద గల ఈ స్థలంలో హెలిపాడ్ను ఏర్పాటు చేశారు. శాశ్వత హెలిపాడ్ అవసరం ఉంది.. గుట్టను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో పలుమార్లు ఆయన గుట్టకు రానున్నారు. అలాగే మిగతా వీఐపీలు ఎవరైనా గుట్టకు నేరుగా రావడానికి హెలిపాడ్ అవసరం ఉందని భావించిన కలెక్టర్ గుట్ట పక్కన గల గోశాల ఆవరణలో శాశ్వత హెలిపాడ్ ఏర్పాటు చేస్తే బాగుంటుం దని భావించి స్థల పరిశీలన చేశారు. కలెక్టర్ వెంట ఆర్ఆండ్బీ ఈఈ బాల స్వామి, తహసీల్దార్లు సోమ్లానాయక్, వెంకట్రెడ్డి, గుట్ట సీఐ శంకర్గౌడ్ వివిధ శాఖల అధికారులు ఉన్నారు. భూసేకరణ ఫైల్ సిద్ధం చేసిన కలెక్టర్ గుట్టను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్న కేసీఆర్ బడ్టెట్లో రూ.100 కోట్లు కేటాయించడంతోపాటు, యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి బోర్డును నియమించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 17న యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం తిరుపతి తరహాలో అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట చుట్టూ రెండు వేల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. కలెక్టర్ చిరంజీవులు నేతృత్వంలో రెవెన్యూ అధికారులు 2వేల ఎకరాలకు సంబంధించిన భూమి వివరాలను తయారు చేశారు. ఇందులో 130 ఎకరాలు దేవస్థానానికి చెందినవికాగా, మరో 300 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండగా, మిగిలిన 1570 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందులోకూడా మరో 270 ఎకరాల ప్రభుత్వ భూమి లభించినా 1300 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించడానికి అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. గుట్టకు 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న దాతర్పల్లి, యాదగిరిపల్లి, మల్లాపురం, సైదరాపురంతోపాటు, భువనగిరి మండలం రాయగిరి గ్రామాల్లోని గుట్టలను సేకరించడానికి అధికారులు పూర్తి వివరాలతో నివేదికను సిద్ధం చేశారు. అభివృద్ధి పనులపై సమీక్ష చేయనున్న కేసీఆర్ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉదయం 11 గంటలకు యాదగిరిగుట్టకు వచ్చిన 12 గంటలకు మెదక్ జిల్లా పర్యటనకు వెళ్తారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తెలిపారు. హెలికాప్టర్లో ఆయన హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట చేరుకోగానే మొదట గుట్టపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారని చెప్పారు. అనంతరం గుట్ట అభివృద్ధి కోసం ఆయన రూపొందించిన ప్రణాళికపై అధికారులతో చర్చలు జరుపుతారన్నారు. ప్రధానంగా గుట్ట చుట్టూ రెండు వేల ఎకరాల భూసేకరణ, గుట్టపైన చేపట్టే అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించనున్నారన్నారు. సీఎం వెంట గుట్ట డెవలప్మెంట్ అధారిటీ ప్రత్యేకాధికారి కూడా వస్తారని తెలిపారు. ఇవీ.. అంచనాలు.. కేసీఆర్ ఆలోచన ప్రకారం యాదగిరి క్షేత్రాన్ని వాటికన్ సిటీ, తిరుపతి క్షేతం తరహాలో అభివృద్ధి చేయడానికి పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇందుకోసం అధికారులు రూపొందించిన ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.750 కోట్లు అవసరం అవుతాయని నిర్ణయించారు. ఇందులో గుట్ట మాస్టర్ప్లాన్ ప్రధానమైంది. దీనికోసం రూ.200 కోట్లు, అభయారణ్యం, జింకల పార్క్కు 100 కోట్లు, ఆలయగోపురం ఎత్తుపెంపు, స్వర్ణ తాపడానికి రూ.50 కోట్లు, ఆలయ మండపం, మాడ వీధుల విస్తరణకు రూ.100 కోట్లు, ఎత్తై ఆంజనేయ విగ్రహం ఏర్పాటుకు రూ.50 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం అదనంగా మరో రూ.100 కోట్లు అవసరం అవుతాయని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నివేదికలను రూపొందించారు. ముఖ్యమంత్రి ఇప్పటికే బడ్జెట్లో 100 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఏ పనులు ముందుగా చేపట్టాలి. ఏ పనులు ఎప్పుడు చేపట్టాలి అనే విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడంతో అధికారులు సైతం ఇప్పుడే ఏమీ చెప్పలేకపోతున్నారు. సీఎం సమీక్ష అనంతరం పనుల విషయంలో ఒక అంచనాకు వస్తామని అధికారులు భావిస్తున్నారు. -
వేర్వేరు చోట్ల ఇద్దరి బలవన్మరణం
భువనగిరి అర్బన్ : వేర్వేరు చోట్ల ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. జిల్లాలోని భువనగిరి, పెద్ద అడిశర్లపల్లి మండలాల పరి ధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.. బీబీనగర్ మండలం మగ్దుంపల్లి గ్రామానికి చెందిన మట్ట వెంకటేష్(25)కు ఏడాదిన్నర క్రితం వివాహం జరి గిం ది. అప్పటి నుంచి అతడు ఏ పని చేయ డం లేదు. దీంతో కుటుంబలో తగాదా లు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన వెంకటేష్ మంగళవారం గ్రామ సమీపంలో గల నాగిరెడ్డిపల్లి- బొమ్మాయిపల్లి మధ్య ఉన్న 9/1 రైలు పట్టాలపై గుర్తు తెలియని రైలు కింద పడడంతో అక్కడికక్కడే మృతిచెందా డు. స్థానికులు గమనించి రైల్వేపోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటన స్థలాన్ని రైల్వే ఎస్ఐ జానకిరాములు పరిశీలించా రు. మృతుడి జేబులో లభించిన సూసైడ్నోట్ను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలిం చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. పురుగులమందు తాగి... పెద్ద అడిశర్లపల్లి: పీఏపల్లి గ్రామ పంచాయతీ పరిధి బాలాజీనగర్కు చెందిన మెగావత్ శ్రీరామ్కు మిర్యాలగూడ మండలం ఐలాపురం గ్రామానికి చెం దిన బాణోతు జాను, నారమ్మ దంపతుల కూతురు సుజాత(26)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. శ్రీరామ్ కొండమల్లెపల్లిలోని చికెన్ సెంటర్లో పనిచేస్తుండగా, సుజాత గ్రామంలోనే వ్యవసాయపనులు చూసుకుంటోంది. వీరికి ఆరేళ్లలోపు ఇద్దరు కుమారులు. ఈ ఏడాది ఉన్న ఎకరం పొలంలో పత్తిసాగు చేయగా దిగుబడిరాలేదు. ఆర్థికంగా నష్టపోయి తీవ్ర మనోవేదనకు గురైన సుజాత సోమవారం సాయంత్రం పొ లం వద్దనే పురుగులమందు తాగి ఇంటి కి నడుచుకుంటూ వచ్చింది. ఇంట్లో పడిపోయి నురగలు కక్కుతుండగా ఇరుగుపొరుగు గమనించి భర్తకు సమాచారం ఇచ్చారు. ఆమెను ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా చిల్కమర్రి స్టేజీ సమీపంలో మృతిచెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ కె.కొండల్ రెడ్డి తెలిపారు. -
ప్రైవేట్ ఉద్యోగులూ అర్హులే..
భువనగిరి :ఆహారభద్రతా (రేషన్) కార్డులకు ప్రైవేటు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అర్హులేనని పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శాసనసభలో జరిగిన చర్చలు, సభ్యులనుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం నిబంధనలను కొంతమేర సడలించింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి అదివారం ఈ అదేశాలు అందాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.లక్షన్నర, పట్టణ ప్రాం తాల్లో రూ.2లక్షల అదాయ పరిమితినే ప్రాతిపదికగా తీసుకొని అర్హులకు కార్డులు జారీ చేయాలని అ శాఖ అధికారులు సూచించారు. అక్టోబర్ 10వ తేదీ వరకు జిల్లాలో 10,67,004 మంది ఆహార భద్రతాకార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే దర ఖాస్తుల పరిశీలనకు ఉన్న నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే వాటిపై పరిశీలనాధికారి పరిశీలించి సంతృప్తి చెందితే వారికి కార్డులు జారీ చేయవచ్చని స్పష్టం చేశారు. ఇప్పటికే పింఛన్ల దరఖాస్తులో ఆహార భద్రతాకార్డుల పరిశీలన చేశారు. మారిన నిబంధనల నేపథ్యంలో గతంలో పరిశీలన జరిపిన దరఖాస్తులకు కొత్త పరిమితుల మేరకు పునఃపరిశీలన చేయాల్సి ఉంటుంది. ఆహార భద్రతా కార్డుల జారీలో ఎలాంటి అవకతవకలు జరిగినా, అర్హులకు అందకున్నా, అనర్హులకు అందినా సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం పకడ్బందీగా విచారణ జరపాలని కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. కార్డులజారీపై వినతుల స్వీకరణకు గ్రీవెన్స్ సెల్ సీనియర్ అధికారులతో బృందాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. వచ్చే నెలలో నూతనకార్డులు జారీ చేసే అవకాశం ఉంది. 16 నుంచి 30 కిలోలకు పెరగనున్న బియ్యం ఆహార భద్రతాకార్డు కింద యూనిట్కు బియ్యం కోటా పెరగనుంది. ఇప్పటివరకు రేషన్కార్డులో యూనిట్కు నాలుగు కిలోల చొప్పున బియ్యం సరఫరా చేసేవారు. గరిష్టంగా 16 కిలోలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆహార భద్రత కార్డు కింద ఒక్కో సభ్యుడికి(యూనిట్) ఆరు కిలోల చొప్పున బియ్యం ఇవ్వనున్నారు. కార్డుకు ఐదు యూనిట్లు వరకే పరిమితి చేశారు. కార్డుకు గరిష్టంగా 30 కిలోలు అందజేస్తారు. అంత్యోదయ కార్డులకు గతంలో ఇచ్చినట్టుగానే 3 కిలోల బియ్యం ఇస్తారు. కిలో బియ్యం రూపాయికే సరఫరా చేస్తారు. -
రైతులకు 7గంటల విద్యుత్ ఇవ్వాలి
భువనగిరి : రైతాంగ సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 7గంటల విద్యుత్ అందించాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఎలిమినేటి ఉమామాదవరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక రహదారి బంగ్లాలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మరో మూడేళ్ల వరకు విద్యుత్ సమస్యలు తప్పవని ప్రభుత్వం పేర్కొనడం దారుణమన్నారు. అర్హులందరికీ పింఛన్లు అందించాలని కోరారు. బీబీనగర్లోని నిమ్స్ను పూర్తి చేయాలని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుందారపు కృష్ణాచారి, మండల ప్రధాన కార్యద ర్శి నాయిని జయరాములు, నాయకులు ఎక్భాల్ చౌదరి, పోశెట్టి బాల్రాజు తదితరులు పాల్గొన్నారు. -
పింఛను అస్తదో..రాదోనని
భువనగిరి : భార్యాభర్తలిద్దరూ వృద్ధులు.. భార్య పక్షవాతంతో మంచానపడింది. పెద్దాయనకు వచ్చే పింఛను డబ్బులతో ఇల్లు గడిచేది. ప్రభత్వుం కొత్తగా రూపొందించిన పింఛన్ల జాబితాలో పేరు ఉందో లేదోనని పలువురి వద్ద వాకబు చేశాడు. లేదని చెప్పడంతో ఆ ముదుసలి గుండె పగిలింది. పడుకున్న వాడు పడుకున్నట్లే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. వృద్ధాప్యంలో..అదీ పక్షవాతంతో మంచానపడిన భార్యను ఒంటరి చేశాడు. యాదగిరిగుట్ట మండలం దాతర్పల్లి గ్రామానికి చెందిన బాలయ్య, అనసూయలు భార్యభర్తలు. బాల య్య(80) వృత్తిరీత్యా వడ్రంగి. 2003 నుంచి వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నాడు. ఈయనకు ముగ్గురు కుమారులు. అందరి పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు కుమారులు మరో గ్రామానికి వలస పోయి కూలి పని చేసుకుంటూ బతుకుతున్నారు. మరో కుమారుడు గ్రామంలోనే ఉంటున్నాడు. బాలయ్యకు వచ్చే పింఛను డబ్బులతోనే కుటుంబం గడుస్తున్నది. ఈ క్రమంలో భార్య అనసూయకు పక్షవాతం వచ్చి మంచానపడింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న రూ.వెయ్యి పింఛను కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు. ఇంటికి వచ్చి విచారణ కూడా జరిపారు. శుక్రవారం జాబితాను గ్రామ పంచాయతీ వద్ద అతికిచ్చినట్లు ఇరుగుపొరుగు చెబితే వెళ్లాడు. అక్కడున్న వారిని ‘నా పేరు ఉందో..లేదో..చూడయ్యా’ అని అడగగా వారు చూసి ‘నీ పేరు లేదు’ అని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.1000 పింఛన్తో బతుకుదామనుకుంటే లిస్టులో తన పేరు రాకపోవడంతో కుమిలిపోయాడు. గ్రామ పంచాయతీ వద్ద క నబడిన వారికల్లా ‘నాకు పింఛన్ రాలేదు. రేపటి నుంచి ఎట్ల బతకాలి’ అంటూ తన గోడును వెల్లబోసుకున్నాడు. గ్రామ సర్పంచ్ ఆయిలయ్యను కలిసి తనకు పింఛన్ ఇప్పించమని వేడుకున్నాడు. సాయంత్రం వరకు గ్రామంలో తిరిగి బరువెక్కిన గుండెతో ఇంటికి వెళ్ల్లాడు. రాత్రి నిద్రపోయాడు. అర్ధరాత్రి తర్వాత గుండెలో దడగా ఉందని..భార్య అనసూయకు చెప్పగా ఆమె కేకలు వేసి ఇరుగుపొరుగును పిలిచింది. వారు గ్రామంలోని ఆర్ఎంపీని పిలిచేలోపే బాలయ్య తుది శ్వాస విడిచారు. అధికారులు ఇప్పటికైనా అర్హులైన వృద్ధులందరికీ పింఛన్లు ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ విషయమై తహసీల్దార్ సోమ్లానాయక్ మాట్లాడుతూ పింఛన్ల లిస్ట్లో బాలయ్య పేరు ఉందని తెలిపారు. పేరును సరిగా గమనించకపోవచ్చని పేర్కొన్నారు. -
గుట్ట అభివృద్ధికి రూ.100 కోట్లు
భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని తిరుమల తిరుపతికి దీటుగా అభివృద్ధి చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు తగ్గట్టుగానే బడ్జెట్లో పెద్దపీట వేశారు. బుధవారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో గుట్ట దేవస్థానం అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన యాదగిరిగుట్ట రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. కాగా గత నెల 17న గుట్టకు వచ్చిన ముఖ్యమంత్రి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని గుట్ట అభివృద్ధిపై హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో యాదగిరి క్షేత్రం అభివృద్ధికి తీసుకునే చర్యలు సూచించారు. బడ్జెట్లో సైతం గుట్ట అభివృద్ధికి నిధులు కేటాయించడంలో ఇక్కడి ప్రజలు, స్వామి భక్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం కేటాయించిన నిధులతో స్వామివారి గర్భగుడి ఆలయ గోపురం ఎత్తుపెంపుతో పాటు స్వర్ణతాపడం ముఖ్యమైనది. దీంతోపాటు గుట్ట పరిసర ప్రాంతాల్లో రెండు వేల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయిం చారు. ఇందులో 400 ఎకరాల్లో నర్సింహ అభయారణ్యం పేరిట జింకల పార్కును, మిగి లిన 16 వందల ఎకరాల్లో తిరుమల తిరుపతి తరహాలో ఉద్యానవనాలు, అధ్యాత్మిక కేంద్రా లు, కల్యాణమంటల నిర్మాణంతో పాటు వేదపాఠశాల ఏర్పాటు చేయనున్నారు. నా పూర్వ జన్మ సుకృతం నా హయంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించడం నా పూర్వ జన్మసుకృతం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గుట్ట క్షేత్రం లో అధునాతన సదుపాయలు కల్పిస్తాం. -గొంగిడి సునీత, ఎమ్మెల్యే ఆలేరు సంతోషంగా ఉంది.. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించడం సంతోషంగా ఉంది. స్థపతుల సలహా తీసుకుని వాస్తు ప్రకారం అభివృద్ధి చేయాలి. ఆలయం చుట్టూ ప్రాకారం, నాలుగు రాజగోపురాలు నిర్మిస్తే బాగుంటుంది. -కారంపూడి నరసింహాచార్యులు, గుట్ట ప్రధానార్చకులు -
చంద్రబాబు ఇంటి ఎదుట ధర్నా చేయండి
భువనగిరి : విద్యుత్ సమస్యతో అల్లాడుతున్న తెలంగాణ రైతులపై టీడీపీ నాయకులకు ప్రేమ ఉంటే విద్యుత్ కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి ఎదుట ధర్నా చేయాలని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో ఎక్కడ విద్యుత్ ఉత్పత్తి జరిగినా తెలంగాణకు 54 శాతం ఇవ్వాలన్న నిబంధనను చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కారన్నారు. వెంకయ్య నాయుడు ఏపీ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నారు తప్ప కేంద్రమంత్రిగా పనిచేయడం లేదన్నారు. భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గొంగిడి సునీత మాట్లాడుతూ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి భువనగిరి ప్రాంతానికి సాగు నీరందించాలన్నారు. ప్రతి మండలానికి 20 చెరువు చొప్పున అభివృద్ధి చేయడానికి సీఎం నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. గంధమల్ల చెరువును రిజర్వాయర్ చేయబోతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీఆర్ఎస్ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్రెడ్డి, నాయకులు జడల అమరేందర్, ఎడ్లసత్తిరెడ్డి, నాగారం అంజయ్య,గాదె నరేందర్రెడ్డి, కొలుపుల అమరేందర్, మారగోని రాముగౌడ్, సిద్దుల పద్మలు పాల్గొన్నారు. -
ఎవరెస్టే ధ్యేయంగా...
భువనగిరి టౌన్ : చెట్టు ఎక్కగలవ ఓ నరహరి.. పుట్టలెక్కగలవా.. చెట్టు ఎక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా.. అని ప్రశ్నిస్తే చెట్టు ఎక్కగలను.. పుట్టలెక్కగలను.. చెట్టు కొమ్మన ఉన్న చిగురు కోయగలను అని బదులిస్తాడు.. సినీ హీరో. కానీ భువనగిరి ఖిలాపై రాక్క్లైం బింగ్లో శిక్షణ పొందుతున్న ఈ విద్యార్థులు చెట్టులు.. పుట్టలే కాదు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించగలమని ఆత్మవిశ్వాసంతో పేర్కొం టున్నారు. ఏకశిల పర్వతంపై సాహస విన్యాసాలు చేస్తూ అబ్బుర పరుస్తున్నారు. రాష్ట్రం లోని 10 జిల్లాల్లో ఎంపిక చేసిన 30 మంది సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు నాలుగు రోజులుగా ఖిలాపై రాక్క్లైంబింగ్ శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ గురువారం ముగియనుంది. గతంలో భువనగిరి ఖిలాపై శిక్షణ పొందిన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు పూర్ణ, ఆనంద్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన విషయం విధితమే. తాము కూడా వారి స్ఫూర్తితో శిక్షణ తీసుకుం టున్నామని, ఎప్పటికైనా ఎవరెస్ట్ శిఖరాన్ని అందుకోవడమే తమ ధ్యేయమని శిక్షణ పొందుతున్న విద్యార్థులు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడమే నా లక్ష్యం. మొదట్లో రాక్క్లైంబింగ్ చేయటం కష్టంగా అనిపించింది. కానీ ఈ శిక్షణతో భయం తొలిగిపోయింది. ఇప్పడు సుల భంగా రాక్క్లైంబింగ్ చేయగలుగుతున్నాను. పర్వాతారోహణ చేయాలంటే శిక్షణ తప్పని సరి. - టి.సంగీత, 9వ తరగతి, కేజీబీవీ, మెదక్ జిల్లా పర్వతారోహణ అంటే ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి పర్వతారోహణ అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే రాక్ క్లైంబింగ్ శిక్షణ కోసం ఫీజు చెల్లించాను. శిక్షణలో అనేక విషయాలు నేర్చుకున్నా. కోచ్లు ఎన్నో మెళకువలు నేర్పించారు. ఎప్పటికైనా హిమాలయాల్లోని ఏదేని పర్వతాన్ని అధిరోహించాలన్నది నా కోరిక. - ఆర్.శాంతి, 9వ తరగతి, కమదానం, మహబూబ్నగర్ జిల్లా -
నిర్లక్ష్యం ఖరీదు రెండు ప్రాణాలు
భువనగిరి : బాణసంచా వ్యాపారి నిర్లక్ష్యానికి ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోగా,మరొకరు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మంగళవారం రాత్రి భువనగిరిలోని ఆర్బీనగర్లో జరిగిన ప్రమాదానికి వ్యాపారి బుస్స శ్రీనివాస్ తప్పిదమేనని కారణమని తెలుస్తోంది. సొంత ఇంటి నిర్మాణం చేపట్టిన శ్రీనివాస్ ఎ దిరింట్లో అద్దెకు ఉంటున్నాడు. దీపావళి సందర్భంగా సుమారు రూ.లక్ష బాణసంచాను తెచ్చి ఇంట్లో నిల్వఉంచాడు, పేలుడు పదార్థాలు ఇంట్లో ఉంచుకున్న ఇతను కనీస భద్రతా చర్యలు చేపట్టలేదు. తన ఇంట్లోని ముందు గదితో పా టు, వెనక గల మరో గదిలో టపాకాయలను నిల్వ ఉంచాడు.రాత్రి సమయంలో ఇంట్లో ఉన్న ఎమర్జెన్సీలైట్ చార్జర్కు మరమ్మతు చేస్తుండగా మంటలు లేచా యి. దీంతో అక్కడే ఉన్న వ్యాపారి శ్రీని వాస్ కుమారుడు వెంకటేష్ ఆ మంటను పక్కకు తోయడంతో అక్కడేకుప్పగా ఉన్న టపాకాయలపై పడడంతో పెద్దగా పేలుళ్లతో పొగలు వ్యాపించాయి. దీంతో ప్రమాదాన్ని పసిగట్టిన శ్రీనివాస్, అతడి కుమారుడు వెంకటేశ్ వెనక గల ద్వారం గుండా బయటకు పరుగు తీశారు. ఈ లోపు అక్కడే ఉన్న సాయికళ్యాణ్, నాగేశ్వర్రావు, పోశెట్టిలు అందులో చిక్కుకుపోగా పోశెట్టి కాలిన గాయాలతో బయటపడ్డాడు. ఈలోపు వెనక ద్వారం గుండా శ్రీనివాస్ తన కుటుంబంతో సహా వీధిలోకి వచ్చారు. అయితే మం టలు ముందు గదికే పరిమితం కావడం తో వెనకగదిలో ఉన్న బాణసంచాకు నష్టం వాటిళ్ల లేదు. ఒక వేళ వెనక గదిలో గల బాణసంచాకు నిప్పు అంటుకుంటే చుట్టుపక్కల ఇళ్లకు పెద్ద ప్రమాదం సంభవించేది. కాగా విష యం తెలియగానే భువనగిరి అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.అనంతరం మృతదేహాలను పోలీస్లు గుర్తించారు. జనావాసాల మధ్యన జరి గిన ఈ ఘోర సంఘటనతో చుట్టుపక్కల వారు భయంతో వణికిపోయారు. భువనగిరి ఆర్డీఓ మధుసూదన్, డీఎస్పీ ఎస్. శ్రీనివాస్, సీఐ జవ్వాజి నరేందర్గౌడ్, రూరల్ ఎస్ఐ భిక్షపతి సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అగ్నిమాకపక శాఖ అధికారి జిల్లా అగ్ని మాపకశాఖ అధికారి హరినాథ్రెడ్డి బుధవారం సాయంత్రం ఘటన స్థలాన్ని పరిశీలించారు. వ్యాపారి ఇంట్లో ఉన్న టపాసుల స్టాకును వెంటనే అక్కడి నుంచి తొలగించాలని స్థానిక అగ్ని మా కప సిబ్బందిని ఆదేంశించారు. చీకటిని మిగిల్చిన దీపావళి సంతోషాన్ని నింపుతుందనుకున్న వెలుగుల పండగ ఆ రెండు కుటుంబాల్లో పెనువిషాదాన్ని మిగిల్చింది...ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడిని..ఇంటి పెద్దదిక్కును బలితీసుకుంది. భువనగిరి పట్టణం ఆర్బీనగర్లో మంగళవారం రాత్రి జరిగిన బాణసంచా పేలుళ్లలో సాయికళ్యాణ్, నాగేశ్వరరావు మృతిచెందిన విషయం విదితమే. భువనగిరి పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన లక్ష్మీనారాయణకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్దవాడు సాయికళ్యాణ్ శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ శాఖలో కాంట్రాక్టు పద్ధతితో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమారుడు భాను హైదరాబాద్లో ఓకళాశాలలో సీఏ చదువు తున్నాడు. ప్రతిరోజు భువనగిరి నుంచి రైళ్లో హైదరాబాద్కు వెళ్లి అక్కడ విధులు నిర్వహించి తిరుగు ప్రయాణం లో గౌతమి ఎక్స్ప్రెస్లో భువనగిరికి వచ్చేవాడు. గురువా రం దీపావళి పండగ కావడంతో కల్యాణ్ హైదరాబాద్లో చదువుతున్న తమ్ముడిని తీసుకుని బస్లో భువనగిరికి వచ్చాడు. ఈలోపు తండ్రికి ఫోన్ చేసి టపాకాయలు తీసుకుందాం భువనగిరి పెద్ది శ్రీనివాస్ కిరాణం దుకాణం వద్దకు రమ్మని చెప్పడంతో వారు వచ్చారు. అయితే ఇంది రమ్మ కాలనీలో ఇల్లు కట్టుకోక ముందు కల్యాణ్ కుటుం బం ఆర్బీనగర్లోనే ఉండేది. దాంతో వ్యాపారి శ్రీనివాస్ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుమారు రూ.3500 విలువ చేసే టపాకాయలను కల్యాణ్ కొనుగోలు చేసి ప్యాక్ చేయించాడు. ధర విషయం మాట్లాడి డబ్బులు చెల్లించి వస్తానని చెప్పి లోపల ఉన్న శ్రీనివాస్ వద్దకు వెళ్లాడు. ఈలోపు సాయి కల్యాణ్ తండ్రి, తమ్ముడు బయటకు వచ్చారు. ఇంతలోనే ప్రమాదం జరగడం కళ్యాణ్ అందులో చిక్కుకుని సజీవ దహనమయ్యా డు. తమ కళ్లముందు కుమారుడు కాలిపోవడంతో ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం ప్రమాద మృతుల్లో ఒకరైన రావుల నాగేశ్వరరావు(60) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. అద్దె ఇంట్లోనే నివాసం ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతను ఎలక్ట్రీషియన్ నాగేశ్వరరావుగానే అందరికీ సుపరిచితుడు. కుమారుడి వివాహం అనంతరం భార్య అనురాధతో కలిసి నివసిస్తున్నాడు. అయితే బుస్సా శ్రీనివాస్ షాపులో ఎమర్జెన్సీ లైట్కు మరమ్మతు చేయాలని కోరడంతో నాగేశ్వరరావు అక్కడికి వెళ్లి ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలచివేశాయి. చికిత్స పొందుతున్న పోశెట్టి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉపిగాని పోశెట్టిని సికింద్రాబాద్లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఇతడు బాణసంచా కొనుగోలు చేసేందుకు వెళ్లి ప్రమాదానికి గురైనట్టు తెలిసింది. పోశెట్టి పట్టణంలోని గంజ్లోని ఓ దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జాగ్రత్తలు తీసుకోవాలి : ఎంపీ బాణసంచా కాల్చడం, అమ్మడం వంటి విషయాల్లో జాగ్రతలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సూచిం చారు. పట్టణంలోని ఆర్బీనగర్లో ప్రమాద ఘటన స్థలాన్ని బుధవారం పరిశీలించారు. అగ్ని ప్రమాదంలో మృతిచెందిన తీరును ఆయన ఆర్డీఓ మధుసూదన్, సీఐ నరేందర్గౌడ్ను అడిగి తెలుసుకున్నారు. అలాగే భువనగిరి పట్టణంతో పాటు గ్రామాల్లో అనుమతి లేకుండా టపాకాయలు అమ్మకాలు చేయరాదని, బహిరంగ ప్రదేశాలలో, గృహాలకు దురంగా అమ్మకాలు చేయాలని చెప్పారు. అగ్ని ప్రమాదాలు జరగ కూండా తగు జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. మృతుల కుటుంబాలకు పరామర్శ అగ్ని ప్రమాదంలో మృతిచెందిన రావుల నాగేశ్వర్ కుమారుడిని పరామర్శించి ఆపద్బంధు పథకం కింద ఆర్థికసాయం అందే విధంగా చూస్తానని చెప్పారు. అలాగే ఏరియా ఆస్పత్రిలో ఉన్న వలబోజు సాయికళ్యాణ్ మృతదేహాన్ని చూసి అతడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట జడల అమరేందర్, నాగరం ఆంజయ్య, కొల్పుల అమరేందర్, రాముగౌడ్ ఉన్నారు. -
సమాజంలో మార్పు కోసం...
భువనగిరి టౌన్ : సమాజంలోని రుగ్మతలను, అవినీతిని, అన్యాయాలను వెండితెరపై చూపి మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో మెగాఫోన్ పట్టుకున్నా... భిన్న సంస్కృతుల సమ్మేళనమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కొత్తకోణంలో ప్రపంచానికి చూపుతానని పేర్కొంటున్నాడు వర్ధమాన దర్శకుడు నల్ల అక్షయ్ కృష్ణ. ద్రాందత్త్ క్రియేషన్స్ ప్రొడక్షన్-2 ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో జరుగుతున్న సినిమా షూటింగ్ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. మీ నేపథ్యం.. నా పేరు నల్ల అక్షయ్ కృష్ణ. మా స్వస్థలం నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం గూడూరు. సినీరంగ ప్రవేశం.. సినిమా దర్శకుడిని కావాలని గతంలో శివతేజ వద్ద అసిస్టెంట్ డెరైక్టర్గా పనిచేసాను. 14 సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఆటో నడుపుకుంటూ దర్శకత్వం ఛాన్స్ కోసం ప్రయత్నించా. ఆటో నడుపుతున్న సందర్భంలో కడప జిల్లా కమలాపురంకు చెందిన సాయినాథ్శర్మతో పరిచయం ఏర్పడింది. నా ప్రతిభను గుర్తించి సినిమా తీసేందుకు అవకాశం కల్పించాడు. డెరైక్ట్ చేసిన సినిమాలు.. నేను తొలి ప్రయత్నంగా దోమల నివారణకు కోసం ఒక యాడ్ చేశాను. అనంతరం మొదటి సారిగా ‘నా మనస్సులో...’ సినిమా తీశాను. ఇది వచ్చే నెలలో విడుదల కానుంది. ప్రస్తుతం రెండో సినిమా షూటింగ్ జరుగుతోంది. అలాగే వచ్చే నెల 25వ తేదీన ద్రాం దత్త్ క్రియేషన్స్ ఆధ్వర్యంలోనే మరో సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నాం. ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారు ప్రస్తుత సమాజంలో అవినీతి, బాలకార్మిక వ్యవస్థ, ప్రేమ పేరుతో మోసాలు అధికంగా జరుగుతున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ సినిమాలో మహిళలు అసభ్యకరంగా చూపకుండా సినిమాలు తీయాలన్నదే నా ధ్యేయం. -
మిస్టరీగా మారిన రియల్టర్ మృతి
భువనగిరి : మండలంలోని వడాయిగూడెం గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితి లో మృతి చెందిన రియల్టర్ జయరాములు ఉదంతం మిస్టరీగా మారింది. ఇతని మృతి వెనక రియల్ ఎస్టేట్కు సం బంధించిన తగాదాలు గానీ, లేదా ఇం కేమైనా కారణాలు ఉండవచ్చా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబసభ్యులు మాత్రం ఇది హత్యే నంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి మృతుని కుటుంబ సభ్యులు, భువనగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూ రుకు చెందిన సీసీ జయరాములు(53) గతంలో గ్రామానికి మాజీ సర్పంచ్గా పని చే శారు. ఈయన యాదగిరిగుట్టలో నివాసం ఉంటుఉంటూ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున వాకింగ్ కోసం సురేంద్రపురి సమీపంలోని తన సొంత గెస్ట్హౌస్కు వెళ్లాడు. సమయం 8 గంటలవుతున్నా తిరిగి రాకపోవడంతో గెస్ట్హౌస్ వద్ద వాచ్మెన్గా పని చేస్తున్న అశోక్ వెతకడానికి వెళ్లగా పూ ల చెట్ల మధ్యన జయరాములు కదల కుండా బోర్లా పడి ఉన్నాడు. ఈ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారు సంఘటన స్థలానికి వచ్చి చూడగా అప్పటికే జయరాములు మృతి చెంది ఉన్నాడు. మృ తుడి ముఖం, పొట్ట, మర్మావయాలు, కాళ్లపై తీవ్రమైన గాయాలుండటమే కాకుండా రెండు కాళ్లు విరిగిపోయాయి. దీంతో జయరాములుది హత్యేనంటూ అను మానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి పంచనామా చేశారు. మృతదేహానికి భువనగిరి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంఘటన స్థలం వద్ద లభించిన ఆనవా ళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. మృతిపై అనుమానాలెన్నో? జయరాములు మృతిపై పలు అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. సురేంద్రపురి సమీపంలో గల తన సొంత గెస్ట్హౌజ్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ లావాదేవీలు నిర్వహించే జయరాములు ఉదయాన్నే అక్కడ చనిపోవడం, అతని శరీ రంపై పలు చోట్ల గాయాలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. గత వారం రోజులుగా విదేశాల్లో ఉంటున్న ఓ రియల్టర్కు, జయరాములుకు మధ్య భూ వివాదం నడుస్తున్నట్లు సమాచా రం. ఓ భూమికి సంబంధించి లక్షల రూ పాయల లావాదేవీల విషయంలో తలెత్తిన వివాదం జయరాములు మృతికి కా రణమై ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. శనివారం రాత్రి నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు వచ్చి గెస్ట్ హౌస్లో బస చేశారని తెలుస్తుంది. వా రే ఉదయం 7గంటల సమయంలో జ యరాములును హత్య చేసి ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతోంది. జయరాములు చనిపోయిన తర్వాత కొత్త వ్యక్తు లు కన్పించకుండా పోయారు. బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ పరామర్శ ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ భువనగిరి ఏరియా ఆస్పత్రికి వచ్చి జయరాములు మృతదేహాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. జయరామలు మృతితో ఆయన కుటుంబ సభ్యులు, బంధవుల రోధనలు మిన్నంటాయి. -
ఎన్నికల హామీలు నెరవే ర్చాలి : రాజగోపాల్రెడ్డి
భువనగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని భువనగిరి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కోరారు. బుధవారం రాత్రి స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్పార్టీ నాయకురాలు సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేసిందన్నారు. నూతన రాష్ట్రంలో పరిపాలనపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో జాప్యం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ ఇతరపార్టీల నుంచి ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడం తగదన్నారు. ప్రజల పక్షాన, కార్యకర్తల కోసం ఎప్పుడూ పోరాడుతామన్నారు. ఈ సమావేశంలో పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బర్రె జహంగీర్, పోత్నక్ప్రమోద్కుమార్, పచ్చిమట్ల శివరాజ్గౌడ్లు ఉన్నారు. -
పండగ పూట ఎండిల్లేనా?
భువనగిరి : ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అన్న చందంగా తయారైంది పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి. ప్రధాన పండగల వేళ నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఉప్పు పప్పు, చక్కెర, మంచినూనె తదితర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న రేషన్ సరుకులను కుదించడంతో సామాన్యుడిపై అదనపు భారం పడుతోంది. దీంతో తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండగలు ఇప్పుడు సామాన్యులకు భారంగా మారాయి. 9 సరుకులు జాడే లేదు 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8.36 లక్షల కుటుంబాలు ఉన్నాయి. తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు 9,333 ఉండగా వాటిలో 32 లక్షల యూనిట్లు ఉన్నాయి. వీటితో పాటు మరో 62 వేల పింక్ కార్డులు ఉన్నాయి. తెలుపు కార్డులపై కేవలం బియ్యం, అరకిలో చక్కర మాత్రమే సరఫరా చేస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం తె ల్ల రేషన్కార్డులపై 9 రకాల సరుకులను రూ.185కే అందించడానికి ‘అమ్మహస్తం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ప్రస్తుతం 9 సరుకులకు గాను కేవలం బియ్యం, అడపాదడపా చక్కర మాత్రమే ఇస్తుండటంతో కార్డుదారులు మిగతా సరుకులను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో అతిపెద్ద పండగలైన బతుకమ్మ, దసరాకు ప్రజలు ఎక్కువగా పిండి వంటలు చేస్తుంటారు. వీటిలో వినియోగించే పామోలిన్, కందిపప్పు, ఉప్పు, కారం ఇలా ప్రధానమైన సరుకులు రేషన్ దుకాణాల్లో అందుబాటులో ఉండడం లేదు. బయటి మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాలంటే జంకుతున్నారు. ఏడు నెలలుగా నిలిచిన పామోలిన్ రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేసే పామోలిన్ ఏడు నెలలుగా నిలిచిపోయింది. ప్రతి నెలా జిల్లాకు 9 లక్షలకు పైగా పామోలిన్ పాకెట్లు రావాల్సి ఉండగా ఎన్నికల ముందు నుంచి సరఫరా కావడం లేదు. గతంలో ప్ర తిరేషన్కార్డుపై లీటర్ పామోలిన్ రూ.40కు ఇచ్చే వారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో పామోలిన్ రూ.55 ఉంది. అదే విధంగా కంది పప్పుది అదే పరిస్థితి. జిల్లాకు ప్రతి నెలా సుమారు 9 లక్షల కందిపప్పు ప్యాకెట్లు రావాల్సి ఉండగా గత 5 నెలలుగా నిలిచిపోయాయి.కందిపప్పు రేషన్ దుకాణాల్లో కిలో రూ.47కు ఇవ్వగా బహిరంగ మార్కెట్లో రూ. 80కి విక్రయిస్తున్నారు. చేదెక్కిన చక్కెర గత నెల వరకు బహిరంగ మార్కెట్లో కిలో రూ 30 ఉన్న చక్కెర ప్రస్తుతం రూ.34కు చేరింది. బతుకమ్మ, దసరా, బక్రీద్ పండగల నేపథ్యంలో చక్కెర వినియోగం అధికంగా ఉంటుంది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు చక్కెర ధరను అమాంతం పెంచేశారు. ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా ఒక్కో కార్డుపై కేవలం అరకిలో చక్కెర మాత్రమే ఇస్తున్నారు. అదనపు చక్కర కోసం ఆశపడుతున్న వారికి నిరాశే ఎదురవుతోంది. రేషన్షాపులో కిలో రూ.13.50లకు లభించే చక్కెర కాస్తా బహిరంగ మార్కెట్లో రూ.34కి చేరడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. -
పర్యాటక కేంద్రంగా భువనగిరి
భువనగిరి :ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా భువనగిరి ఖిలాను పర్యాటక కేంద్రంగా త్వరలో ప్రారంభించనున్నట్లు ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ వెల్లడించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి స్థానిక ఖిలా వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, కలెక్టర్ చిరంజీవులుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి, యాదగిరిగుట్ట, కొలనుపాకలను కలుపుతూ పర్యాటక సర్కిల్గా తీర్చిదిద్దడానికి కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. భువనగిరి ఖిలాను అభివృద్ధి చేయడంలో భాగంగా ముందుగా రోప్వే నిర్మాణంతోపాటు ఖిలాపై పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ ప్రాంతం హైదరాబాద్కు చేరువలో ఉన్నందున పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. రోజూ వెయ్యిమంది పర్యాటకులు వస్తారని చె ప్పారు. భువనగిరి డివిజన్లో పర్యాటక రంగం అభివృద్ధికి కలెక్టర్ చిరంజీవులు ప్రత్యేక చొరవ చూపాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ చిరంజీవులు మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఉపాధి, ఉద్యోగ అవకాశాలతోపాటు ఆదాయం పెరుగుతుందన్నారు. మన దేశ జాతీయాదాయంలో 7 శాతం పర్యాటక రంగం నుంచి వస్తుందన్నారు. వచ్చే పర్యాటక దినోత్సవం నాటికి రోప్వే పూర్తవుతుందన్నారు. ఎమ్మెల్యే శేఖర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా స్థానికులకు ఆదాయం పెరుగుతుందని చెప్పా రు. ఆర్డీఓ నూతి మధుసూదన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుర్వి లావణ్య, డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ కె.వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు వేముల భాగ్యవతి, ఎండీ నా సర్, పడమటి జగన్మోహన్రెడ్డి, పీఎస్. మంజుల, లతాశ్రీ ఉన్నారు. కాగా విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
భువనగిరి :స్నేహితులతో కలిసి ఆవారాగా తిరిగే ఓ యువకుడు జల్సాలకు అలవాటుపడ్డాడు. సరదాలను తీర్చుకునేందుకు దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు..చిల్లర దొంగతనాల నుంచి అంతర్రాష్ట్ర స్థాయికి ఎదిగాడు..ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడ్డాడు. వాంటెండ్ క్రిమినల్గా మారి, చివరకు పోలీసులకు చిక్కాడు. భువనగిరి రూరల్ సీఐ జువ్వాజి నరేందర్గౌడ్ శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్ సతీష్రెడ్డితో కలిసి శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం సర్వాయ్పాడు పాతబంజర్ గ్రామానికి చెందిన పోడియం మాధవరావు స్వగ్రామంలోనే 8వ తరగతి వరకు చదువుకున్నాడు. స్నేహితులతో కలిసి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. మొదటి దొంగతనం స్వగ్రామంలోని కిరాణ దుకాణంలో చేసి పోలీసులకు చిక్కాడు.18 నెలల శిక్ష అనుభవించిన అనంతరం గత ఏడాది జూలై 4వ తేదీన జైలు నుంచి విడుదలయ్యాడు. బయటికి వచ్చిన మాధవరావు నల్లగొండ, మహబూబ్నగర్, మెదక్, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో సుమారు 24 కేసుల్లో 10 లక్షలకు పైగా సొత్తును అపహరించాడు. ఆ డబ్బుతో బైక్ కొనుగోలు చేయడమే గాకుండా తన స్నేహితుడు బాలకృష్ణ ఇండికా కారుకనుగోలు చేసేందుకు రూ.లక్ష అప్పు ఇచ్చాడు. అన్ని చోరీలు ఒంటరిగానే... మాధవరావు ఒంటరిగానే దొంగతనాలు చేసేవాడు. ఎవరి సహాయం తీసుకోడు. తన స్నేహితుడు కారులో ఉదయం చోరీ చేసే దుకాణాల వద్ద రెక్కీ నిర్వహిస్తాడు. రాత్రి వేళల్లో గుట్టుచప్పుడుకాకుండా వచ్చి గడ్డపారతో దుకాణాల షట్టర్లు పైకిలేపి చోరీలు చేసేవాడు. చాకచక్యంగా చోరీలకు పాల్పడుతూ ఏడు జిల్లాల పోలీసులకు సవాల్గా మారాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 18వ తేదీన భువనగిరి మండలం రాయగిరిలో మెయిన్రోడ్డుపై గల వెంకటేశ్వర, నాగార్జున వైన్స్లలో దొంగతనం చేయడానికి ప్రయత్నించి ఓ చోట విఫలమయ్యాడు. అయితే వెంకటేశ్వర వైన్స్ గల్లాపెట్టెనుంచి 2లక్షల రూపాయలు అపహరించుకుపోయాడు. అలాగే గత సంవత్సరం 2013 సెప్టెంబర్ 21వ తేదీ రాత్రి భువనగిరి పట్టణంలోని సనా మెడికల్ దుకాణంలో రూ.1.50 లక్షల నగదు చోరీ చేశాడు. పట్టుబడ్డాడు ఇలా.. నల్లగొండ జిల్లా బీబీనగర్ టోల్గేట్ సమీపంలో శనివారం పోలీస్లు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి బైక్పై వస్తున్న మాధవరావును పోలీసులు తనిఖీ చేశారు. పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో తాను చేసిన దొంగతనాలు ఒక్కొక్కటిగా బయపెట్టాడు. వెంటనే నివా సం ఉంటున్న హైదరాబాద్లోని ముషిరాబాద్కు వెళ్లి అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా సుమారు రూ.3.28 లక్షల నగదు, పల్సర్ మోటార్సైకిల్, ఒక తులం బంగారు గొలు సు, అకాయ్టీవి, హోంథియేటర్, 4 సెల్ఫోన్లు, ఇండికా కారును స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై తెలంగాణ,ఆంధ్రప్రదేశ్లోని ఏడు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. దొంగిలించిన సొత్తుతో కారు కొన్న బాలకృష్ణ, చోరీలకు పాల్పడిన మాధవరావుపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. దొంగను పట్టుకుని సొమ్మును రికవరీ చేయడంలో భువనగిరి రూరల్ ఎస్ఐ భిక్షపతి, ఏఎస్ఐ బాసు, కానిస్టేబుల్ సిరాజ్, రాజు, సిబ్బంది మధు, నర్సింగ్, మహేందర్లు సహకరించారని చెప్పారు. -
భువనగిరిని నాగుండెల్లో పెట్టుకుంటా
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బంగారు బతుకమ్మ సంబరాలు విజయవంతం భువనగిరి ‘మొదటి రోజునే విజయవంతంగా నిర్వహించిన బంగారు బతుకమ్మ సంబరాలను నా జీవితంలో మరచిపోలేను.. భువనగిరి నా గుండెల్లో నిలిచిపోతుంది’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన బంగారు బతుకమ్మ సంబరాలతో భువనగిరి పట్టణం పూలవనంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన ఈ పండగను తొలిసారిగా భువనగిరిలో ప్రారంభించారు. గ్రామాల నుంచి బతుకమ్మలతో భారీగా తరలి వచ్చిన మహిళలతో ఎక్కడ చూసినా బతుకమ్మ సందడి కనిపించింది. తొలిరోజు భువనగిరిలో నిర్వహించిన బంగారు బతుకమ్మ సంబరాలు విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బతుకమ్మలతో బంగారు తెలంగాణను సాధించుకోవడానికి పెద్ద ఎత్తున హాజరైన మహిళా శక్తి నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతి బింబంగా బతుకమ్మ పండగ ఎదిగిందన్నారు. 2008లో తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి బతుకమ్మ పండగను ప్రారంభించామన్నారు. తెలంగాణ బతుకమ్మ పండగను హేళన చేసినవారికి భువనగిరి సభ సమాధానం చెబుతుందన్నారు. విద్యాశాఖమంత్రి జి.జగదీష్రెడ్డి మాట్లాడుతూ అసమానతలు, ఆకలిచావులు, ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ క ంటున్న కలలకు భువనగిరి బంగారు బతుకమ్మ సభ నిద ర్శనమన్నారు. సుఖశాంతుల కోసం తెలంగాణను పోరాడి సాధించుకున్నామన్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తది అన్న వాళ్లకు భువనగిరిలో జరిగిన బంగారు బతుకమ్మ సంబరాలకు హాజరైన మహిళలను చూస్తే తెలుస్తుందన్నారు. తరతరాలుగా బతుకమ్మ పండగను చేసుకుంటున్నా తెలంగాణ రాష్ర్టం రావడం వల్లే ఇంత పెద్ద ఎత్తున జరుపుకునే అవకాశం ఏర్పడిందన్నారు. ఇంతకాలం చంపుకున్న ఆత్మగౌరవం నిలబెట్టుకున్నామనడానికి, మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించుకున్నామనడానికి ఇది నిదర్శనమన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ మాట్లాడుతూ బంగారు బతుకమ్మ సంబరాలను ప్రభుత్వం నిర్వహించడం పట్ల కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. భువ నగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంస్కృతి, అస్తిత్వం ప్రమాదంలో పడినపుడు పుట్టిన ఉద్యమ కెరటం జాగృతి అన్నారు. కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు ఉద్యమానికి ఊపిరినిచ్చాయని చెప్పారు. కలెక్టర్ చిరంజీవులు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ సంబరాలను తొలిసారిగా భువనగిరిలో ప్రభుత్వం నిర్వహించిందన్నారు. తెలంగాణ ప్రజల సుఖ శాంతుల కోసం ప్రభుత్వం పండగను జరుపుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో సంబరాలను పెద్ద ఎత్తున జరుపుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి మాట్లాడుతూ బంగారు బతుకమ్మ సంబరాలకు వచ్చిన మహిళలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ జాగృతి ద్వారా తెలంగాణ మహిళలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చిన కవితకు కృతజ్ఞతలు తెలిపారు. భువనగిరి ఆర్డీఓ నూతి మధుసూదన్ ఆధ్యక్షతన జరిగి ఈ సభలో ఎస్పీ డాక్టర్ ప్రభాకర్రావు, జేసీ ప్రీతిమీనా, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ ఎమ్మెల్యేలు కె. ప్రభాకర్రెడ్డి, గాదరి కిషోర్, వేముల వీరేశం, ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సుర్వి లావణ్య, పల్లా రాజేశ్వర్రెడ్డి, కొలుపుల అమరేందర్, నాగారం అంజయ్య, సిద్దుల పద్మ, బొట్ల పరమేశ్వర్, బిల్డర్ రవికుమార్, పారిశ్రామికవేత్త ఆంటోనిరెడ్డి, డీఎస్పీ ఎస్. శ్రీనివాస్, తహసీల్దార్లు కె. వెంక ట్రెడ్డి, వీరప్రతాప్, అరుణారెడ్డి పాల్గొన్నారు. వ్యాఖ్యాతగా డాక్టర్ పోరెడ్డి రంగయ్య వ్యవహరించారు. బతుకమ్మ ఆడిన కవిత బంగారు బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. భువనగిరి జూనియర్ కళాశాల మైదానంలో ప్రభుత్వం, తెలంగాణజాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బంగారు బతుకమ్మ ఉత్సవాలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలతో ఆమె కలిసిపోయారు. వారిని పలకరిస్తూ సంప్రదాయ బద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ సుమారు గంటసేపు ఆడారు. దీంతో మహిళలు ఆమెను అనుకరించారు. ఆమెతో కలిసి ఆడడానికి మహిళలు ఆసక్తి చూపారు. సభ అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి మహిళలతో కలిసి వెళ్లారు. ఆమె వెంట ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత, జేసీ ప్రీతిమీనా, పలువురు మహిళా నాయకులు ఉన్నారు. -
నేడు భువనగిరి నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో తొలి బతుకమ్మ వేడుకలు భువనగిరి నుంచి ప్రారంభంకానున్నాయి. మంగళవారం ఎంగిలిపువ్వుతో ఉత్సవాలు మొదలుకానున్నాయి. వేడుకలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత, మంత్రి జగదీష్రెడ్డి హాజరుకానున్నారు. భువనగిరి : బతుకమ్మ ఉత్సవాలకు భువనగిరి పట్టణం ముస్తాబైంది. తెలంగాణలో ఇక్కడినుంచే బుధవారం ఎంగిలిపువ్వుతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. జూనియర్ కళాశాల మైదానం అవరణలో బతుకమ్మ ఆటలు ఆడడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి పర్యవేక్షణలో ఈ ఏర్పాట్లు జరిగాయి. విద్యాశాఖ మంత్రి జగదీష్రెడ్డి, నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె.కవిత ముఖ్య అతిథులుగా హాజరుకాన్నారు. 5వేల మంది హాజరుకానుండడంతో ఆ మేరకు ఏర్పా ట్లు చేశారు. సాయంత్రం 6 గంటలకు బతుకమ్మ ఆటలు ఆడనున్నందున విద్యుత్దీపాలను అమర్చారు. ఇదీ..కార్యక్రమం ఉదయం 9 గంటలకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత భువనగిరికి రానున్నారు. మొదట భువనగిరి ఖిలాను ఎక్కి ఆక్కడ చారిత్రక సంపదపై అధ్యయనం చేస్తారు. మధ్యాహ్నం కిందకు దిగిన తర్వాత బతుకమ్మలను పేర్చే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబిమైన కళలు, కళారూపాల, సాంస్కృతిక కార్యక్రమాలతో హన్మాన్వాడ నుంచి జూనియర్ కళాశాల వరకు ప్రదర్శన నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి బతుకమ్మ ఆటలు ఆడతారు. ఈ ఉత్సవాలకు కలెక్టర్ చిరంజీవులు, భువ నగిరి ఎంపీ డాక్టర్ బూరనర్సయ్యగౌడ్ ఇతర ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. సాయంత్రం 5 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు పట్టణంలో సాయంత్రం 5 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పట్టణ ఇన్స్పెక్టర్ సీహెచ్.సతీష్రెడ్డి చెప్పారు. వినాయక చౌరస్తా నుంచి నల్లగొండ రోడ్డులో ట్రాఫిక్ మళ్లించనున్నామని, ప్రయాణికులు సహకరించాలని కోరారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
రాయగిరి(భువనగిరి అర్బన్) :రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలవ్వగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన భువనగిరి మం డలం గచ్చుబావి సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన బాసాని రాజశేఖర్(25), గొలుసు విజయ్(21), బట్టు రాజశేఖర్, రఘు టాటా ఇండికా కారులో వరంగల్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్నారు. ఇదే సమయంలో భువనగిరికి చెందిన ఉదరి గణేశ్ తన ట్రాక్టర్తో భువనగిరి వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో గచ్చుబావి సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న గణేశ్ ట్రాక్టర్ను, ఇండికా కారు ఓవర్ టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ముందుకూర్చున్న బాసాని రాజశేఖర్, గొలుసు విజయ్లు అక్కడికక్కడే మృతిచెందారు. వెనుక కూర్చున్న బట్టు రాజశేఖర్, రఘుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన బసాని రాజశేఖర్, రఘు ఇద్దరు కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తునట్లు బట్టు రాజశేఖర్ తెలిపారు. భువనగిరి రూరల్ పోలీ సులు సంఘటన స్థలానికి చెరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి అతివేగమే కారణమని భావిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు. -
అందని ‘అమ్మహస్తం’
భువనగిరి : అమ్మహస్తం పథకం పూర్తిగా వినియోగదారులకు అందకుండాపోయింది. ప్రభుత్వం కొత్త పథకం తేకపోవడంతో ఇంకా ఆ పేరుతోనే కొన్ని రేషన్సరుకుల సరఫరా కొనసాగుతోంది. కానీ సరుకుల కుదింపుతో సామాన్యుడిపై అదనపు భారం పడుతోంది. పండగ సమయంలో సరుకుల కోసం రేషన్ దుకాణాలకు వెళ్లిన వారు ఉత్త చేతులతో తిరిగివస్తున్నారు. ఇక పండగలకు ఇచ్చే అదనపు కోటా గురించి పట్టించుకునేవారే లేకుండా పోయారు. గత ప్రభుత్వం సామాన్యుడిని అధిక ధరాభారం నుంచి రక్షించడానికి తె ల్లరేషన్కార్డులపై 9 రకాల సరుకులను 185రూపాయలకే అందించాలని అమ్మహస్తం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి మొదటినుంచీ అవాంతరాలే ఎదురవుతున్నాయి. తాజా పరిస్థితిలో 9 సరుకుల సంగతికి దిక్కులేకుండా పోయింది. కేవలం రెండు రకాల సరుకులతోనే ప్రజలు సరిపెట్టుకోవాల్సి వస్తోంది. తెలంగాణలో అతి పెద్ద పండగలైన బతుకమ్మ, దసరా పండగలకు ప్రజలు ఎక్కువగా పిండివంటలు చేస్తుంటారు. వీటికి అవసరమైన పామోలిన్, కందిపప్పు, ఉప్పు, కారం ఇలా ప్రధానమైన సరుకులు రేషన్ దుకాణాలలో అందుబాటులో ఉండడం లేదు. ఏడు నెలలుగా పామోలిన్ సరఫరా నిలిచిపోయింది. ప్రతినెలా జిల్లాకు 900 టన్నుల పామోలిన్ రావాల్సి ఉంది. ఎన్నికల ముందు నుంచి సరఫరా నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ విషయంలో స్పష్టత లేకపోవడంతో సరఫరా నిలిచిపోయినట్టు అధికారులు తెలుపుతున్నారు. కందిపప్పుది ఇదే పరిస్థితి. ఐదు నెలలుగా కందిపప్పు రావడం లేదు. కొత్త ప్రభుత్వం రావడం రవాణా టెండర్ల విషయంలో రేటు నిర్ణయం కాకపోవడంతో సరఫరా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. పేద ప్రజలకు ప్రధాన అవసరమైన కందిపప్పు, పామోలిన్ రాకపోవడంతో బహిరంగ మార్కెట్లో ఎక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో రేషన్కార్డుల పరిస్థితి.. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8.36 లక్షల కుటుంబాలు ఉండగా, 10.02 లక్షల రేషన్కార్డులు ఉన్నాయి. బోగస్ యూనిట్లు, రేషన్కార్డుల తొలగింపు అనంతరం తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు కలిసి 9,03,333 రేషన్కార్డులు, వాటిలో 32 లక్షల యూనిట్లు ఉన్నాయి. వీటితోపాటు 62 వేల పింక్ కార్డులు ఉన్నాయి. తెలుపు రంగుకార్డులపై కేవలం బియ్యం, అరకిలో చక్కర మాత్రమే సరఫరా చేస్తున్నారు. మిగతా నిత్యావసర సరుకులు సరఫరా లేకపోవడంతో వాటిని అధిక ధరలకు బహిరంగ మార్కెట్లో కొంటున్నారు. -
సమన్వయంతో పనిచేయాలి
రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి రేషన్కార్డుల ఆధార్ సీడింగ్ నూరుశాతం పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ పార్థసారథి సూచించారు. భువనగిరి ఆర్డీఓ కార్యాలయం నుంచి ఆయన జిల్లాలోని తహసీల్దార్లు, పౌర సరఫరాల అధికారులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో మాట్లాడారు. భువనగిరి :రెవెన్యూ, పౌర సరఫరాల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ పార్థసారథి సూచించా రు. బుధవారం భువనగిరి రెవెన్యూ డివి జనల్ అధికారి కార్యాలయం నుంచి జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, పౌర సరఫరాల అధికారులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన రేషన్ కార్డుల ఆధార్ సీడింగ్ కార్యక్రమాన్ని నూరు శాతం పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో ఆధార్ సీడింగ్ కార్యక్రమం 85శాతం వరకు పూర్తి చేసినందుకు ఆయన అధికారులను అభినందించారు. అనర్హులకు చెందిన తెల్లరేషన్ కార్డులు తొలగించడంతో పాటు అర్హులకు మాత్రమే కార్డులు అందించేందుకు క్షేత్ర స్థాయిలో ఆధార్ సీడింగ్ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆలోచనా విధానానికి అనుగుణంగా అధికారులు పనిచేసి అనర్హులకు చెందిన కార్డులు, యూనిట్లను నిబంధనల మేరకు తొలగించాలన్నారు. మరణించిన, వలస వెళ్లిన వారిని, డూప్లికేట్ కార్డులను, యూనిట్లను రద్దు చేయడంలో ఆధార్ నంబర్ను ప్రతిపాదిక తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితిల్లో అర్హులైన వారు నష్ట పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చె ప్పారు. జిల్లాలో ఇంకా 3 లక్షల 50 వేల ఆధార్ సీడింగ్ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. తహసీల్దార్ల వద్ద పెండింగ్లో కన్ఫర్మేషన్ కోసం ఉన్న 1,13, 000 కార్డులను వెంటనే నిజనిర్ధాణ జరిపి తగ్గు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అనర్హులకు చెందిన కార్డులు, యూని ట్లను రద్దుచేసిన అనంతరం రేషన్ డీలర్లకు ఆదాయం పెంచే మార్గాలపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ఈ విధానం ద్వారా ఇప్పటికే ఆదా అయిన కిరోసిన్ను అర్హులైన వారికి కోటా పెంచే అవకాశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ప్రతి తహసీల్దార్ విధిగా ప్రతి రోజూ ప్రభుత్వం నుంచి అందే ఈ మెయిల్ను స్వయంగా పరిశీలించాలని సూచించారు. లేకుంటే తగిన చర్యలు తప్పవన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్లో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా, భువనగిరి ఆర్డీఓ నూతి మధుసూదన్, డీఎస్ఓ నాగేశ్వర్రావు, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ సుధాకర్, డీసీఓ ప్రసాద్, మార్కెటింగ్ శాఖ ఏడీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ధాన్యం సేకరణకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి అధికారులు ఖరీఫ్ ధ్యాన సేకరణకు వెంటనే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని రాష్ర్ట పౌరసరఫరాలశాఖ కమిషనర్ పార్థసారథి అధికారులను ఆదేశించారు. బుధవారం భువనగిరిలోని ఆర్డీఓ కార్యాలయంలో డి విజన్ పరిధిలోని తహసీల్దార్లు, పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో సాగు విస్తీర్ణం, పంటల రకాలు, దిగుబడిని దృష్టిలో ఉంచుకొని మార్కెట్ యార్డులు, ఐకేపీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. అవసరం మేరకు ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. -
అంతుచిక్కని హత్యలు.. ఆత్మహత్యలు
రియల్ ఎస్టేట్ వ్యాపారం, వివాహేతర సంబంధాలు, ఆస్తి, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ తగాదాలు.. కారణాలు ఏవైతేనేం..! జిల్లాలోని హైదరాబాద్ శివారు మండలాల పరిధిలో లభిస్తున్న గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వీటిలో కొన్ని హత్యలు ఉండగా మరికొన్ని ఆత్మహత్యలు న్నాయి. హత్యకు పాల్పడిన వారు ఆనవాళ్లు కూడా దొరక్కుండా పెట్రోల్, యాసిడ్, కిరోసిన్ పోసి మృతదేహాలను కాల్చివేస్తున్నారు. కేసులు నమోదు చేసి శవాల గుర్తింపు కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో సఫలం కావడం లేదని తెలుస్తోంది. భువనగిరి హెచ్ఎండీఏ పరిధిలోని బీబీనగర్, భువనగిరి, పోచంపల్లి, బొమ్మలరామారం, చౌటుప్పల్ మండలాల్లో పలు చోట్ల గుర్తు తెలియ ని వ్యక్తుల మృతదేహాలు లభ్యమవుతుండటం ప్రజల ను భయబ్రాంతులకు గురి చేస్తోంది.రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు పారిశ్రామిక వాడల్లో హత్యగావించబడి న వ్యక్తుల మృతదేహాలను ఇక్కడకు తెచ్చి పడేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు ఆధారాలు దొ రక్కుండా మృతదేహాలను కాల్చేస్తున్నారు. హత్యకు గురవుతున్న వారిలో ఎక్కువగా యువత, మధ్య వయస్సున్న వారే కావడం గమనార్హం. పోలీస్ స్టేషన్లలోనూ ఇటువంటి సంఘటనలకు సంబంధించిన కేసుల సంఖ్య పెరిగిపోతోంది. పొరుగున ఉండటం వల్లేనా..! జిల్లాలోని హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న పలు మండలాలు హైదరాబాద్కు అతి చేరువలో ఉన్నాయి. దీనికి తోడు సికిం ద్రాబాద్, హైదరాబాద్ నగరాల నుంచి రహదారి, రైల్వే మార్గం ఉండడంతో నిందితులు చాకచక్యంగా తమ పని పూర్తిచేసుకుని వెళ్లిపోతున్నారు. ఈ మార్గాల్లో ఎక్కడ కూడా చెప్పుకోదగ్గ పోలీస్ చెక్పోస్ట్ లేకపోవడం కూడా నిందితులకు కలిసి వస్తోంది. మృతదేహాలను నిర్జన ప్రాంతాలు, గుట్టల్లో పడవేస్తుండడంతో రోజుల తరబడి గుర్తించడం కష్టతరమవుతోంది. 2014 సంవత్సరంలో... ఫిబ్రవరి 11న బీబీనగర్ మండలం వెంకిర్యాల సమీపంలో 25-23 ఏళ్ల వయస్సున యువకుడి శవం లభ్యం. మార్చి 26న పెచ్చికల్పహాడ్ శివారులో గుర్తు తెలియని వృద్ధుడి(80) మృతదేహం. మార్చి 29న బీబీనగర్ మండలం జైనపల్లి శివారులో 30-35 సంవత్సరాల వయస్సున్న యువకుడి మృతదేహాన్ని కనుగొన్నారు. మే 20న బీబీనగర్ మండలం రాఘవాపురం వద్ద 60-65 సంవత్సరాల వృద్ధుడు మృతి. జూన్ 9న బీబీనగర్ మండలం కొండమడుగు వద్ద 40-45 సంవత్సరాల వయస్సున్న మహిళ హత్య. ఆగస్టు 4న మాసాయికుంటవద్ద 55 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి శవం లభించింది. ఆగస్టు 18న భువనగిరి-బీబీనగర్ పాత రోడ్డు 25-32 ఏళ్ల వయస్సున్న యువకుడి హత్య. సెప్టెంబర్ 4న గుర్తు తెలియని మహిళ(60) శవం దొరికింది. 2012 సంవత్సరంలో... జూన్ 30న బట్టుగుడెంలో లభ్యమైన 53 ఏళ్ల వయస్సుగల గుర్తు తెలియని వ్యక్తి శవం. నవంబర్ 2న బీబీనగర్ వద్ద 60 వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని కనుగొన్నారు. నవంబర్ 8న మసాయికుంట వద్ద 40 నుంచి 45 ఏళ్ల వయస్సున్న వ్యక్తి మృతదేహం లభించింది. మే 12న పడమటిసోమారం వద్ద 80 ఏళ్ల వయస్సు గల మహిళ, ఇదే నెల 26న గుడూరులో మరో వ్యక్తి మృతి. 2013 సంవత్సరంలో.. ఫిబ్రవరి రాఘవాపురం వద్ద 35-40 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి శవం. ఫిబ్రవరి 4న రాయిగిరి, హన్మాపురం గ్రామాల మధ్య 60 నుంచి 65 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి మృతదేహం లభ్యం. మార్చి 3న బీబీన గర్ వద్ద 35 ఏళ్ల వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంను కనుగొన్నారు. మే 4న రాయిగిరి వద్ద గుర్తు తెలియని వ్యక్తి (55) మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు. జున్ 5న రాయిగిరి సమీపంలో 50 ఏళ్ల వ్యక్తి హత్య. జూన్ 17న బీబీనగర్లో 20-25 మధ్య వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది. జూన్ 18న 60-65 సంవత్సరాల వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి శవం. ఆగస్టు 24న బీబీనగర్ హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో 35-40 ఏళ్ల వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం. అగస్టు 30న కూనూరు వద్ద 60 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు గల వ్యక్తి గుర్తు తెలియని శవం లభ్యం. సెప్టెంబర్ 28 న బీబీనగర్లో 72 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని శవం. అక్టోబర్ 26న రాయిగిరి వద్ద 40-45 మధ్య వయస్సున్న గుర్తు తెలియని శవం. డిసెంబర్ 5న బొమ్మలరామారం మండలం మర్యాలలో 20-30 ఏళ్ల వయస్సున్న యవకుడి హత్య. డిసెంబర్ 16 వడపర్తి వద్ద 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సున్న గుర్తు తెలియని శవం. డిసెంబర్ 25న 21 - 25 సంవత్సరాల వయస్సున్న యువకుడి హత్య. టోల్గేట్కు అవతలివైపునే.. హత్యగావించిబడిన గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలు ఎక్కువగా బీబీనగర్ మండలం గూడూరు వద్ద ఏర్పాటు చేసిన టోల్గేట్ అవతలే లభ్యమవుతున్నాయి. టోల్గేట్ వద్ద గల సీసీ కెమెరాల్లో వాహనాలకు సంబంధించిన సమాచారం నిక్షిప్తం అవుతుండటంతో దుండగులు మృతదేహాలను టోల్గేట్ అవతలి వైపునే వదిలి వెళ్తున్నారు. దీంతో హత్యలన్నీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల బయటపడ్డ గర్తు తెలియని శవాలు ఎక్కువగా బీబీనగర్ మండలంలో లభించడం గమనార్హం. -
గణనాథ... ఇక సెలవు
నీలగిరి : భక్తిశ్రద్ధలతో నవరాత్రి పూజలందుకున్న గణనాథులను ఆదివారం నిమజ్జనం చేశారు. నల్లగొండ, భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ పట్టణాల్లో ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం ముగిసింది. ఆదివారం ఉదయం 9 గంటలకు నల్లగొండలోని మాధవనగర్ మొదటి విగ్రహం వద్ద నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, కలెక్టర్ టి.చిరంజీవులు, ఎస్పీ టి.ప్రభాకర్రావు, మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి, బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం జిల్లా అధ్యక్షులు వీరెల్లి చంద్రశేఖర్, బండా నరేందర్ రెడ్డి, కలీం, కాంగ్రెస్నేత హఫీజ్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణ గౌడ్లు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. సూర్యాపేటలో పూల సెంటర్ విగ్రహం వద్ద జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. నల్లగొండ పట్టణంలోని పాతబస్తీలో ముస్లిం మత పెద్దలు భక్తుల సౌకార్యార్థం తాగునీటి వసతి కల్పించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన ఊరేగింపులు రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా 13 వేల విగ్రహాలను నిమజ్జనం చేశారు. అత్యధికంగా నల్లగొండ పట్టణంలో సుమారు ఐదు వందల విగ్రహాలను నాగార్జునసాగర్ ఎడమకాల్వ 14వ మైలురాయి వద్ద ఏఎమ్మార్పీ కాల్వలో నిమజ్జనం చేశారు. సాగర్లో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సూర్యాపేట, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి ప్రాంతాల్లో చెరువులు, మూసీ నదిలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. సూర్యాపేటలో సద్దల చెరువులో గణనాథులను నిమజ్జనం చేశారు. మిర్యాలగూడ, నకిరేకల్ ప్రాంతాల్లో మూసీ నది, సాగర్ ఎడమ కాల్వలో నిమజ్జనం చేశారు. అనుముల మండలం అలీనగర్ (14వ మైలురాయి ) వద్ద నిమజ్జన కార్యక్రమాన్ని మిర్యాలగూడ డీఎస్పీ మోహన్, ఆర్డీఓ కిషన్రావు పర్యవేక్షించారు. అదే విధంగా జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు నాగార్జునసాగర్లో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. పెద్ద ఎత్తున ఊరేగింపు ఉత్సవాలు గణేశ్ శోభాయాత్రలో విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు, వ్యాపారస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నల్లగొండలో ఉదయం చిరుజల్లుల కురుస్తున్నా శోభాయాత్రను ముందుకు నడిపించారు. పట్టణాల్లో అపార్ట్మెంట్ వాసులు సామూహికంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. రంగులు చల్లుకుంటూ, భజనలు, మహిళ నృత్యాలు, కోలాటాలు చేస్తూ తమ భక్తిని చాటుకున్నారు. నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి పట్టణాల్లో అశేషజనవాహని మధ్య శోభాయాత్ర ప్రజలను కనువిందు చేసింది. ఇదిలావుంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. 2600 మందితో బందోబస్తు నిర్వహించారు. పోలీస్ శాఖతోపాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, రోడ్పార్టీ, స్పెషల్ పోలీసుల సహకారంతో గణనాథుడి శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా తగు జాగ్రత్తలు పాటించారు. తగ్గిన లడ్డూ వేలం పాటలు.. ప్రతి ఏడాది గణేశ్ నిమజ్జనం రోజున లడ్డూ వేలం పాటలు పోటాపోటీగా జరిగేవి. కానీ ఈ ఏడాది మిర్యాలగూడలో వేలం పాటలకు స్వస్తి చెప్పారు. గణేశ్ విగ్రహం వద్ద ఉన్న లడ్డూలను భక్తులు ప్రసాదంగా పంచిపెట్టారు. పట్టణంలోని ముత్తిరెడ్డి కుంటలో గణేశ్ విగ్రహం వద్ద ఉంచిన అతిపెద్ద 66 కిలోల లడ్డూను కూడా భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టారు. నల్లగొండ, సూర్యాపేటలలో కూడా లడ్డూ వేలం పాటలు తగ్గాయి. నల్లగొండలో మాధవనగర్ గణేశ్ విగ్రహం వద్ద నిర్వహించిన వేలం పాటలో లడ్డూ రూ.26 వేలు పలికింది. దేవరకొండలో ఎంకేఆర్నగర్లో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద లడ్డూను రూ.87 వేలకు వేలంపాటలో కిషన్నాయక్ దక్కించుకున్నారు. హుజూర్నగర్లో రెండవ వార్డులో ఏర్పాటు చేసిన వి గ్రహం వద్ద లడ్డూను వేలంలో రూ.66,116లకు దొంతిరెడ్డి గౌతమ్రెడ్డి దక్కించుకున్నారు. మఠంపల్లిలో లడ్డూ ను రూ. 65,000లకు గాయం శ్రీనివాసరెడ్డి సొంతం చేసుకున్నారు. కట్టంగూర్లోని రాంనగర్ విగ్రహం వద్ద లడ్డూను రూ.66 వేలకు అంతటి చంద్రశేఖర్ దక్కించుకున్నారు. కోదాడలో క్వాన్సింగ్ ఏజెంట్స్ ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద 150 కేజీల లడ్డూను వేలం పాటలో రూ.50,116లకు గుడుగుండ్ల రఘు దక్కించుకున్నారు. -
పింఛన్ వస్తదో.. రాదో..!?
భువనగిరి :జిల్లాలోని భువనగిరి డివిజన్లో వేలాది మంది మహిళలు బీడీ పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. బీడీ కార్మికులకు రూ.వెయ్యి పింఛన్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో వారంతా గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం ఇవ్వనున్న పింఛన్ లిమిటెడ్ కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకేనా..? లోకల్ కంపెనీల్లో పనిచేసే వారికి వర్తిస్తుందా.. లేదా.. అన్న అనుమానం వారిని వేధిస్తోంది. లిమిటెడ్ కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలను ఆయా కంపెనీ యాజమాన్యాలు వేగంగా సేకరిస్తుం డడం, అన్ లిమిటెడ్ కంపెనీలు ఆ పని చేయకపోవడంతో అనుమానం మరింత పెరుగుతోంది. దీర్ఘకాలంగా పొగాకుతో పనిచేయడం వల్ల శ్యాసకోస, క్షయ, టీబీ, కంటి జబ్బులు, రక్తహీనత వంటి వ్యాధులతో అవస్థలు పడుతున్నారు. అయినా కంపెనీ యాజమాన్యాలు, కార్మిక శాఖ అధికారులు చాలా మందికి గుర్తింపుకార్డులు అందించలేదు. గుర్తిం పుకార్డులు లేని వారికి పింఛన్ రాదంటే తమకు తీరని నష్టం వాటిల్లినట్లేనని లోకల్ బీడీ పరిశ్రమల కార్మికులు వాపోతున్నారు. డివిజన్లో 20 పరిశ్రమలు భువనగిరి డివిజన్లో సుమారు 20 వరకు చిన్న, పెద్ద బీడీ పరిశ్రమలు ఉండగా వీటిలో నాలుగు మూతపడ్డాయి. ప్రస్తుతం ఉన్న 16 కంపెనీల్లో సుమారు 3వేల మంది పనిచేస్తున్నారు. భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి, బొమ్మలరామారం తదితర మండలాల్లో బీడీ కార్మికుల సంఖ్య అధికంగా ఉంది. అయితే ఈ డివిజన్లో ఉన్నవన్నీ అన్ లిమిటెడ్ కంపెనీలు కావడంతో కార్మికులు ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అందడం లేదు. గుర్తింపు కార్డులుంటేనే.. బీడీ పరిశ్రమల్లో పనిచేస్తున్న పలు కార్మిక కుటుంబాలు ఇప్పటికే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్నాయి. పీఎఫ్, పెన్షన్, వైద్య సౌకర్యం, గృహ నిర్మాణంతోపాటు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందుతున్నాయి. అయితే ఇవన్నీ కార్మికులకు పరిశ్రమల యాజమాన్యాలు ఇచ్చే గుర్తింపుకార్డులు, చెల్లించే పీఎఫ్పైనే ఆధారపడి ఉంటాయి. గుర్తింపు కార్డులు ఉన్నవారు ఒక్కో కంపెనీలో 10 మందికి మించి లేరని తెలుస్తోంది. -
ఈ-బీట్ పోలీసింగ్
భువనగిరి : రాత్రి వేళల్లో నేరాలు అదుపు చేసేందుకు ఆధునికీకరణ దిశగా జిల్లా పోలీస్ యంత్రాంగం అడుగులు వేస్తోంది. అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రైమ్రేట్ను కట్టడి చేయడానికి ఎస్పీ ప్రభాకర్రావు ఎలక్ట్రానిక్ బీట్ పోలీస్ సిస్టమ్కు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రతి పోలీస్స్టేషన్కు జీపీఎస్ విధానం కలిగిన ఆండ్రాయిడ్ సెల్ఫోన్లు పంపిణీ చేస్తున్నారు. దీని ద్వారా భద్రతతోపాటు విధులు ఎగ్గొట్టే పోలీస్ బాబుల ఆటలకు అడ్డుకట్ట వేయడం ప్రధాన లక్ష్యం. ముందుగా జిల్లాలోని ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ బీట్పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. భద్రతను పటిష్టం చేయడం కోసమే.. జిల్లాలో ఇటీవల రాత్రి సమయాల్లో దొంగతనాలు, ఇతర నేరాలు వరుసగా జరుగుతుండడంతో పోలీస్ బాస్.. బీట్ కానిస్టేబుల్ వ్యవస్థపై దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయిలో పోలీస్సిబ్బంది విధుల్లో డుమ్మాలు కొడుతున్నారని గుర్తించారు. నేరాలు జరిగినప్పుడు సంఘటన స్థలానికి సకాలంలో చేరుకోకున్నా ఆక్కడే ఉన్నామంటూ తప్పుడు సమాచారం ఇచ్చే వారిని ఇది గుర్తిస్తుంది. ఇంతవరకు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. పోలీసుల పనితీరు క్రమబద్ధీకరించడం కోసం దీనిని ఇటీవల జరిగిన ఎన్నికల్లో భువనగిరి, కోదాడ డివిజన్లలోప్రయోగాత్మకంగా అమలు చేసి విజయవంతమయ్యారు. దీంతో జిల్లావ్యాప్తంగా అమలుచేయాలని నిర్ణయించారు. ప్రతి స్టేషన్కు 2 నుంచి 5 వరకు.. జీపీఎస్ సిస్టంతో పనిచేసే సెల్ఫోన్లను జిల్లాలలోని ప్రతి పోలీస్స్టేషన్కు రెండు నుంచి 5 వరకు ఇస్తున్నారు. ఇందుకోసం స్టేషన్ల వారీగా ఎన్ని ఫోన్లు కావాలని వివరాలను అడుగుతున్నారు. కొన్ని స్టేషన్లకు ఇప్పటికే వచ్చాయి. సెల్పోన్ల పంపిణీ కూడా జరుగుతోంది. ముందుగా కోదాడ, నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ, భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్, నకిరేకల్ ప్రాంతాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ముందుగా కోదాడ సర్కిల్లో జీపీఎస్ విధానం పైలట్ ప్రాజెక్టుగా అమలు జరుగుతోంది. గత ఎన్నికల ముందు జనవరి, ఫిబ్రవరిలో దీని పనితీరును ప్రారంభించారు. శాటిలైట్ ద్వారా ఇది పనిచేస్తుంది. -
హైకోర్టు కోసం ప్రధానిని కలుస్తా
భువనగిరి :తెలంగాణలో ప్రత్యేక హైకోర్టు సాధన కోసం ప్రధాని నరేంద్రమోడీని కలుస్తానని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. తెలంగాణకు వెంటనే హైకోర్టును ఏర్పాటుచేయాలంటూ స్థానిక కోర్టు ఆవరణలో న్యాయవాదులు చేస్తున్న రిలే దీక్షా శిబి రాన్ని శనివారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయాక ఉమ్మడి కోర్టు ఉండడం వల్ల తెలంగాణ ప్రాంత న్యాయమూర్తులకు, న్యాయవాదులకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. స్వయం పాలన సాధించుకున్న తెలంగాణ ప్రజలకు స్వతంత్ర కోర్టు కూడా ఉండాలన్నారు. ఇందుకోసం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ను కలిసి హైకోర్టు అవసరాన్ని వివరిస్తానన్నారు. అలాగే ప్రధానిని కలిసి హైకోర్టు కోసం విన్నవిస్తానన్నారు. దీక్షలో న్యాయవాదులు రావి సురేందర్రెడ్డి, గడీల నవీన్ కుమార్లు కూర్చున్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపీని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.రమేష్, న్యాయవాదులు వంచ దామోదర్రెడ్డి, జి.రవీందర్రెడ్డి, జి.బాబురావు, ఆకుల ఆంజనేయులు, శంకర్, కమలాకర్, విద్యాసాగర్, వేముల అశోక్, వెంకటేష్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
భువనగిరి అర్బన్ : మండలంలోని మూసుకుంటలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసుకుంటకు చెందిన ఇండ్ల బాలయ్య(55) అనే వ్యక్తి శనివారం సొంత పనిపై వేరే చోటకు వెళ్లారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో స్వగ్రామానికి వచ్చే క్రమంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం అతని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన బాలయ్యను స్థానికులు గమనించి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుమారుడు ఇండ్ల రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. యాదగిరిగుట్ట : మండలంలోని వంగపల్లి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ నర్సింహరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.హైదరాబాద్లోని కిషన్బాగ్కు చెందిన ఎంఏ ఫియాజుద్దీన్ ( 30 ) మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి సొంత పనులపై కారులో ఖాజీపేటకు వెళ్లాడు. తిరుగుప్రయాణంలో వంగపల్లి శివారులోని పైపుల కంపెనీ వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని గమనించకుండా ఢీకొట్టారు. ఈ ఘటనలో ఫియాజుద్దీన్ అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను భువనగిరికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.