bones
-
ఎముకలు, కండరాలు దృఢంగా ఉండాలంటే ఇలా చేయండి!
శరీరం తేలికగా కదలటానికి, చురుకుగా ఉండటానికి ఎముకలు బలంగా ఉండటం ఎంతైనా అవసరం ఎముకలు బలహీనపడితే.. విరగడం, ఆస్టియోపోరోసిస్ ముప్పు పెరుగుతుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జీవన శైలిమార్పులతోపాటు, వ్యాయామాన్ని కూడా క్రమం తప్పకుండా చేయాలి. ఎముకలు, కండరాలను బలోపేతం చేయడానికి, అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదాన్ని నివారించగల శక్తి అధో ముఖానికి ఉంది. రోజూ ఈ ఆసనాన్ని దినచర్యలో భాగం చేస్తూ ఉంటే మైండ్, బాడీ చురుకుదనం పెరుగుతుంది. ఇలా వేయాలి....∙మ్యాట్ పైన లేదా నేలపైన నిటారుగా నిల్చొని చేతులను పైకి స్ట్రెచ్ ఉంచాలి. తర్వాత నడుం భాగం వంచుతూ, చేతులను పూర్తిగా నేలమీద ఆనించాలి. ∙చేతులను పాదాలకు దూరంగా తీసుకెళుతూ త్రికోణాకారంలో ఉండాలి.కాలి వేళ్ల మీద ఉంటూ మడమలను పైకి లేపాలి. శరీర బరువు చేతులు, కాలి ముని వేళ్ల మీద ఉంటుంది. ∙నిమిషం సేపు ఇదే భంగిమలో ఉండాలి. తిరిగి యధాస్థితికి రావాలి. ఇలా ఒకటి నుంచి 3 సార్లు ఈ ఆసనాన్ని పునరావృతం చేయాలి.ఈ ఆసనం వేయటానికి మొదట్లో కాస్త కష్టంగా వున్నా రోజూ సాధన చేస్తూ ఉంటే సులువవుతుంది. వెన్నెముక, కాళ్ళను బలోపేతం చేస్తుంది. అదే విధంగా ఏకాగ్రత పెంచి, ఒత్తిడి నుండి రిలీఫ్ని ఇస్తుంది. అజీర్తి సమస్యలు దూరమవుతాయి. నడుము నొప్పి తగ్గుతుంది. ఆస్టియోపోరోసిస్ సమస్య నుండి రక్షిస్తుంది. సైనస్, ఆస్తమా, పీరియడ్స్లో వచ్చే సమస్యల నుంచి రిలీఫ్ని ఇస్తుంది. ఇన్ని ప్రయోజనాలని ఈ ఆసనం ద్వారా పొందవచ్చు. ఎముకలు దృఢంగా ఉండటానికి ఏం చేయాలి?ఎముకలు దృఢంగా ఉండాలంటే.. సమతుల్య, పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి.కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు సమృద్ధిగా లభించే ఆహారం తినాలి.పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులు తినాలి.విటమిన్ డి సమృద్ధిగా ఉండే ఆహారాలు తినాలి.బాల్యంలో ఎముకలు దృఢంగా ఉండటానికి పోషకాలు తీసుకోవడం ముఖ్యం.వ్యాయామం చేయడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.మెనోపాజ్ దాటిన స్త్రీలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.ఎముకలు, కండరాలను బలోపేతం చేసేలా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.ఇదీ చదవండి: టాటూ కోసం వెళ్లి..వ్యాపారవేత్త, పాపులర్ ఇన్ఫ్లూయెన్సర్ మృతి -
అంత్యక్రియలయ్యాక నాలుగు రోజులకు..
ఇల్లంతకుంట(మానకొండూర్): ఓ వ్యక్తి అంత్యక్రియలు పూర్తయిన నాలుగు రోజులకు మృతుడి ఎముకలు సేకరించిన ఘటన ఇల్లంతకుంట మండలంలోని ఓబులాపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓబులాపురం గ్రామానికి చెందిన పెంటల శ్రీనివాస్(35) గత శుక్రవారం రాత్రి ఇంట్లోనే నిద్రించాడు. శనివారం ఉదయం అతను మృతిచెందినట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. అదేరోజు సాయంత్రం దహన సంస్కారాలు నిర్వహించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా, శ్రీనివాస్ మృతిపై అనుమానం ఉందని బంధువుల్లో ఒకరు ఇల్లంతకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో తహసీల్దార్ ఎంఏ.ఫారుక్, ఎస్సై శ్రీకాంత్ గౌడ్, సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు ఫాతిమా మంగళవారం ఓబులాపురం చేరుకున్నారు. మృతుడిని దహనం చేసిన స్థలానికి వెళ్లి, వైద్య సిబ్బంది సహకారంతో ఎముకలు సేకరించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించనున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. -
ఆస్టియోపోరోసిస్: 40 ఏళ్లు దాటాక.. ఈ జాగ్రత్తలు తప్పవు లేదంటే రిస్కే!
మామూలుగానే భారతీయుల్లో ఆస్టియో పోరోసిస్ కేసులు ఎక్కువ. ఇక మహిళల్లో ఈ రుగ్మత ముప్పు మరింత ఎక్కువ. యాభై ఏళ్లు దాటాక మహిళల్లో దాదాపు 40% నుంచి 50% మందిలో ఆస్టియోపోరోసిస్ కనిపించడం చాలా సాధారణంగా జరిగేదే. అలాగే మెనోపాజ్ దాటిన మహిళల్లో కనీసం 40% మందిలో ఇది కనిపిస్తుందంటే దీని విస్తృతి అర్థం చేసుకోవచ్చు. ఇక ఆస్టియోపోరోసిస్ వచ్చిన మహిళల్లో మూడింట ఒక వంతు మందికి ఏదో ఒక దశలో తుంటి ఎముక ఫ్రాక్చర్ కేసులు తప్పక కనిపిస్తాయి. వారికి ముప్పుగా పరిణమిస్తూ, వారిలో ఇంత విస్తృతంగా కనిపించే ఆస్టియోపోరోసిస్ గురించి తెలుసుకుందాం. మానవులందరిలోనూ 20 ఏళ్లు వచ్చే వరకు ఎముకల పెరుగుదల సంభవిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఆగిపోతుంది. కానీ దాదాపు 40 ఏళ్లు వచ్చేవరకు ఇవి బలంగానే ఉంటూ, ఆ తర్వాత క్రమంగా తమ బలాన్ని కోల్పోతూ పెళుసుగా మారి΄ోతుంటాయి. కానీ మహిళల్లో మాత్రం వాళ్ల ఓవరీల నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్– ఈస్ట్రోజెన్ తగ్గడం మొదలుకాగానే ఎముకలు బలహీనం కావడం ప్రారంభమవుతుంది. ఇక రుతుక్రమం ఆగిపోయాక ఈస్ట్రోజెన్ ఉత్పత్తి కూడా తగ్గిపోవడంతో ఈ అంశమే వాళ్లలో ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారిపోయి, తేలిగ్గా విరిగిపోయే కండిషన్ అయిన ఆస్టియోపోరోసిస్కు కారణమవుతుంది. మహిళల్లోనూ ఈ ముప్పు ఎవరెవరిలో... వయసు పెరుగుతున్న కొద్దీ ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు అందరికీ ఉన్నప్పటికీ, కొందరిలో మాత్రం ఈ రిస్క్ మరీ ఎక్కువ పోషకాహార లోపాలున్నవారికి... మన దేశంలో మహిళలు పాలు, విటమిన్ డి ఉన్న పదార్థాలు తీసుకోవడం చాలా తక్కువ. అన్ని పోషకాలూ ఉన్న ఆహారాలు తీసుకోవడమూ వాళ్లలో తక్కువే. కాబట్టి మహిళల్లో ఈ రిస్క్ మరింత ఎక్కువ రుతుక్రమం ఆగిన మహిళల్లోనూ, గర్భసంచితో పాటు ఒకటి లేదా రెండు ఓవరీస్ తీయించుకున్న వాళ్లల్లో. చాలాకాలం పాటు స్టెరాయిడ్స్ వాడేవారిలో వ్యాయామం చేయని వారిలో (మన దేశంలో మహిళల్లో వ్యాయామం చాలా తక్కువ) పొగతాగే అలవాటు ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి స్మోకింగ్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే టమద్యం తీసుకోవడం వల్ల శరీర కణాల (ప్రధానంగా ఎముక కణాల) అభివృద్ధి, పెరుగుదల ప్రభావితం అవుతాయి. ఫలితంగా మద్యం అలవాటు ఉన్నవాళ్లలో ఆస్టియోపోరోసిస్ రిస్క్ పెరుగుతుంది టకుటుంబ చరిత్ర... కుటుంబంలో ఎవరికైనా ఆస్టియో పోరోసిస్ ఉంటే ఆ కుటుంబ సభ్యులకు దీని రిస్క్ ఎక్కువ. ఆస్టియోపోరోసిస్ – నిర్ధారణ...రక్తపరీక్ష, ఎక్స్–రే, బీఎమ్డీ (బోన్ మాస్, డెన్సిటీ – అంటే ఎముక సాంద్రత నిర్ధారణ చేసే పరీక్షల ద్వారా రోగిలో దీన్ని నిర్ధారణ చేయవచ్చు)చికిత్స ఇలా...ప్రాథమిక నివారణ చర్యలు ఆస్టియోపోరోసిస్ కండిషన్ను ఆలస్యం చేస్తాయి. ఫలితంగా వయసు రిస్క్ తగ్గుతుంది. క్యాల్షియమ్, విటమిన్ ‘డి’...డాక్టర్లు ప్రాథమిక చికిత్సగా క్యాల్షియమ్, విటమిన్ ‘డి’ ఇస్తారు. అంటే... 60 ఏళ్లు దాటిన వారికి ప్రతిరోజూ 1500 ఎంజీ క్యాల్షియమ్నూ, విటమిన్–డిని రోజూ 10 నుంచి 15 ఎంజీ ఇస్తారు. బిస్ఫాస్ఫోనేట్స్...ఇవి ఒక రకం మందులు. వీటినే బిస్ఫాస్ఫోనేట్స్ అని కూడా అంటారు. ఎముక తనలోని పదార్థాన్ని కోల్పోయే ప్రక్రియను ఇవి ఆలస్యం చేస్తాయి. ఫలితంగా ఎముక సాంద్రత తగ్గే వేగం మందగిస్తుంది. దానివల్ల ఎముక మరింత కాలం దృఢంగా ఉంటుంది. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ రుతుక్రమం ఆగిన మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ను తిరిగి భర్తీ చేసే ఈ చికిత్స ప్రక్రియను కూడా అవసరాన్ని బట్టి డాక్టర్లు చేస్తుంటారు. అయితే ఈ హెచ్ఆర్టీ వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా కనిపిస్తాయి. అంటే... రొమ్ముల సలపరం, మళ్లీ రుతుస్రావం మొదలుకావడం, బరువు పెరగడం, మూడ్స్ మాటిమాటికీ మారి΄ోవడం, మైగ్రేన్ తలనొప్పి రావడం వంటివన్నమాట. కాబట్టి రోగి కండిషన్ ను బట్టి హెచ్ఆర్టీ అవసరమా కాదా అన్నది డాక్టర్లే నిర్ధారిస్తారు. క్యాల్సిటోనిన్: ఈ మందులు ముక్కు ద్వారా పీల్చే మందుగా లభిస్తాయి. అయితే ఇవి తప్పనిసరిగా డాక్టర్ల సలహా మేరకే తీసుకోవాల్సి ఉంటుంది. టెరీపారటైడ్: ఇది ఆస్టియోపోరోసిస్ చికిత్స ప్రక్రియలో ఇది కూడా ఒక మందు. ఇది ఎముకలో పెళుసుబారిన చోట కొత్త కణజాలం ఉత్పత్తి అయ్యేలా దోహదపడుతుంది. ఫలితంగా ఎముక ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి. ఈ మందును కడుపు ప్రాంతంలోగాని, తొడల ప్రాంతంలోగాని ఇంజెక్షన్ చేయడం ద్వారా శరీరంలోకి పంపుతారు. దాదాపు ఏడాదిన్నరపాటు ఉపయోగించాల్సి ఉంటుంది. మంచి ప్రభావకారి అయినప్పటికీ ప్రస్తుతం దీని ఖరీదు ఎక్కువ. వికారం (నాసియా), తలనొప్పి, కాళ్లూచేతుల నొప్పి వంటి కొన్ని సైడ్ఎఫెక్ట్స్ కూడా కనిపించే ఈ మందుల దీర్ఘకాల ప్రభావాలు ఇంకా తెలియదు.డోనోసుమాబ్స్: ఇది సరికొత్త మందు. చాలా వేగంగా పనిచేస్తుంది. చవకగా కూడా లభిస్తుంది. తీసుకోవడమూ సులభం.లక్షణాలు... ఎముకలు దేహం లోపల ఉంటాయి కాబట్టి ఆస్టియోపోరోసిస్ వచ్చే సూచనలు ముందే కనిపించేందుకు అవకాశం లేదు. ఇది చాప కింద నీరులా వచ్చే పరిణామం. ఎముకలు పలచబారడం దీర్ఘకాలం జరుగుతూ పోతే చిన్న గాయలకే ఎముకలు విరిగే ముప్పు పెరుగుతుంది. చిన్నపాటి ప్రమాదానికే ఎముక తేలిగ్గా విరిగిపోతుంటే దాన్ని ఆస్టియో పోరోసిస్గా గుర్తించవచ్చు. ఇక సాధారణంగా కనిపించే కొన్ని లక్షణాలు... ఒళ్లు నొప్పులు (జనరలైజ్డ్ బాడీ పెయిన్స్) టఎముకలు, కీళ్ల నొప్పులు (బోన్ అండ్ జాయింట్ పెయిన్స్) అలసట (ఫ్యాటిగ్నెస్)చిన్న ప్రమాదానికే ఎముక విరగడం విపరీతమైన వెన్ను నొప్పి, కాస్తంత వెన్ను ఒంగినట్లయి శరీరం ఎత్తు తగ్గడంసీ, డీ, ఈ, ఎఫ్, జీ, ఎస్.. ఎముకలు వీక్ ఆస్టియోపోరోసిస్ నివారణ కోసం ఉపయోగపడే అంశాలను చాలా తేలిగ్గా గుర్తు పెట్టుకోవచ్చు. ఇంగ్లిష్ అక్షరాలు వరుసగా సీ, డీ, ఈ, ఎఫ్, జీ గుర్తు పెట్టుకుంటే చాలు. ‘సి’ ఫర్ క్యాల్షియమ్– అంటే అది ఎక్కువగా తీసుకోవాలి. ‘డి’ ఫర్ విటమిన్ డి – అంటే శరీరానికి తగినంత అందేలా చూసుకోవాలి. ‘ఈ’ ఫర్ ఎక్సర్సైజ్ – అంటే శరీరాన్ని కాస్తంత శ్రమపెట్టి ఎక్సర్సైజ్ చేయించాలి. ‘ఎఫ్’ ఫర్ ‘ఫాల్స్’ – అంటే ఇంగ్లిష్లో పడిపోవడం. కాస్తంత వయసు పైబడ్డాక బాత్రూమ్ల వంటి చోట్ల, ఇతరత్రా కింద పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ‘జి’ ఫర్ గెయిన్ వెయిట్ – అంటే శరీరం బరువు కాస్తంత పెరగాలి. అది ఎత్తుకు తగినట్లుగా ఉండాలి. -
మోకాళ్లు నొప్పులా? ఎముక పుష్టికోసం ఇలా చేయండి!
వయసు నలభై దాటిందో లేదో చాలామందిలో కీళ్ల నొప్పులు, ఎముకలు బలహీనపడటం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. జీవన శైలి, ఆధునిక అలవాట్లతో పాటు, ఎండ ఎరగని ఉద్యోగాలు, యుక్తవయసు నుంచీ డైటింగ్ పేరుతో పోషకాహారం తీసుకోకపోవడంతో ఎముకలు బలహీన పడుతున్నాయి. ఫలితగా మోకాళ్ల నొప్పులు రికెట్స్ ,బోలు ఎముకల వ్యాధి వంటి పరిస్థితులకు కారణమవుతుంది. ఇది పెద్ద వయసులో తూలి పడిపోవడం, కాళ్లు చేతులు, ప్రధానంగా తుంటి ఎముక విరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. మరి ఎముకల గట్టిదనం కోసం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి.మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. అందుకే ఆరోగ్య కరమైన సమతుల్య ఆహారం చిన్న వయస్సు నుండే అలవాటు చేయాలి. ఇది జీవితాంతం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తు పెట్టుకోవాలి. పెద్దలకు రోజుకు 700మిల్లీగ్రాముల కాల్షియం అవసరం.మెనోపాజ్ఆడవారిలో మెనోపాజ్ తరువాత ఎముకలు బలహీనపడతాయి. కాబట్టి ఈ విషయాన్ని మరింత అప్రమత్తంగా ఉండాలి. బహిష్టులు ఆగిపోయిన తరువాత ఈస్ట్రోజెన్ ఉత్పత్తి ఆగిపోవడంతో ఇది ఎముకలపై ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే కాల్షియం ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. శరీరం కాల్షియంను గ్రహించాలంటే విటమిన్ డీ చాలా అవసరం. నిరంతరం వ్యాయామం చేయాలి. ముఖ్యంగా 40 దాటిన తరువాత కాళ్లు, చేతులు, కండరాలు, ఎముకలను పటిష్టం చేసే వ్యాయామాలను చేయాలి. మోకాళ్లు నొప్పులొచ్చిన తరువాత కచ్చితంగా నడక, యోగా తదితర తేలికపాటి వ్యాయామాలు చేయాల్సిందే. ఏదైనా ఎముకలకి సంబంధించి ఏదైనా సమస్యను గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, చికిత్స పొందాలి. నిపుణుల సలహా మేరకు సంబంధిత వ్యాయామాలను రెగ్యులర్గా చేయాలి. ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు తీసుకోవాలి.చేపలు, గుడ్లు, పాలు, బాదం, మొలకెత్తిన ధాన్యాలు ఆహారంలో చేర్చుకోవాలి. బలవర్థకమైన సోయా,నువ్వులతోపాటు విటమిన్ సి లభించే సిట్రస్పండ్లను తీసుకుంటే మంచిది. అలాగే విటమిన్ డి కోసం ఉదయం ఎండలో కొద్దిసేపు కూర్చోవాలి. తగినంత నిద్రపోవాలి. -
గుడ్లు ఎక్కువగా తింటున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు!
గుడ్లు ఎక్కువుగా తింటే అస్సలు భయపడాల్సిన పనిలేదు. పైగా మీ ఆరోగ్యం పదిలం అని ధీమాగా చెబుతున్నారు వైద్యులు. అస్సలు ఆ సమస్యలు బారినపడరని అన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే కొన్ని రకాల సమస్యలు సైతం రావని శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఆ అధ్యయనంలో బయటపడ్డ ఆసక్తికర విషయాలేంటంటే.. గుడ్డు ఎముకలు బలంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుందట. రోజుకి ఒక గుడ్డు తినడం అనేది ఎంతో మంచిదని, దీని వల్ల ఫోలేట్, బీ విటమిన్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయని అన్నారు. అలాగే ఎముకల వ్యాధి రాకుండా నివారిస్తుందని చెప్పారు. ముఖ్యంగా గుండెతో ఎముకల ఆరోగ్యం ముడిపడి ఉందనే ఆసక్తికర విషయం తమ పరిశోధనలో బయట పడిందని హువాజోంగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్త తెలిపారు. అందుకోసం నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ దాదాపు 1900 మందిపై అధ్యయనం నిర్వహించింది. పరిశోధకులు గుడ్డు వినియోగం తోపాటు, వారి ఎముకల బలాన్ని కూడా అంచనా వేశారు. ఈ పరిశోధనలో పాల్గొనేవారికి గుడ్డులోని 3.53 ఔన్సుల పోషకాలు వారి తొడలు, వెన్నుముకలోని ఎముకలను దృఢంగా ఉంచాయిని తెలిపారు. వారిలో అధిక బీఎండీ స్థాయిలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా వృద్ధుల్లో అయితే బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గిందని చెప్పారు. వయసు పెరిగే కొద్ది ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి. ఆ సమస్య రాకూడదంటే గుడ్డుకి మించిన తగిన పోషకాహారం లేదని ఈ పరిశోధనలో తేలిందని చెప్పారు. అలాగే ఇదే సమయంలో తగినంత పోషకాహారం లేకపోవడం, తక్కువ శారీరక శ్రమ, ధూమపానం, అధిక మొత్తంలో మద్యం సేవించడం, కొన్ని రకాల మందులు దీర్థకాలికంగా వాడడం వంటి ఇతక కారణాల వల్ల కూడా ఈ బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఎముకలను ఎలా ఆరోగ్యంగా ఉంచుతాయంటే.. గుడ్లు ప్రోటీన్తో నిండి ఉంటాయి. ఇవి ఆల్కలీన్ ఫాస్ఫేటేస్ అని పిలువబడే శారీరక ఎంజైమ్ల సమూహాన్ని సక్రియం చేసి, ఎముకలను బలోపేతం చేస్తుంది. ఆల్కలీన్ ఫాస్ఫేటేస్ అనేది ప్రధానంగా కాలేయం, ఎముకలు, మూత్రపిండాలు మొదలైన వాటిలో ఉండే ఎంజైమ్ల సమూహం. ఇది ఎముక జీవక్రియ బయోమార్కర్ గుడ్లు తీసుకోవడం వల్ల ఏఎల్పీ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దీంతో తొడ, కటి వెన్నెముక వంటి భాగాల్లోని ఎముకలను బలంగా ఉంచుతుంది. అంటే ఇక్కడ గుడ్లలో డి విటమిన్ పుష్కలంగా ఉంటుందని తేలింది. అందువల్ల దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం అంది ఎముకలు దృఢంగా ఉండేందుకు ఉపకరిస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: చెఫ్గా పదిమందికి కడుపు నిండా భోజనం పెట్టేది..కానీ ఆమె అన్నమే..!) -
Peddapalli: శ్మశానంలో ఎముకల దొంగలు!
సుల్తానాబాద్(పెద్దపల్లి): శ్మశానంలో దొంగలు పడ్డారు.. శవాన్ని దహనం చేయగా మిగిలిన పుర్రెలు, ఎముకల్ని చోరీ చేస్తున్నారు.. వీటిని ఏం చేస్తారో తెలియదు కానీ.. కొందరు యువకుల ముఠా ఈ దురాగతానికి పాల్పడుతోంది.. మంత్రతంత్రాలు, పూజలు, చేతబడులు చేయడం లాంటి మూఢనమ్మకాల్ని ఇప్పటిదాకా చూశాం.. విన్నాం.. కానీ, ఇలాంటి విచిత్రమైన ఘటన జిల్లాలో చోటుచేసుకోవడం విస్మయం కలిగిస్తోంది. రెండు రోజుల్లో నలుగురి పట్టివేత.. సుల్తానాబాద్లోని హిందూ శ్మశానవాటికలో రెండురోజుల వ్యవధిలో నలుగురు వ్యక్తులు ఎముకలు చోరీచేస్తూ స్థానికులకు పట్టుబడ్డారు. శవాలను కాల్చివేయగా మిగిలిన ఎముకలను పోగుచేసుకుని, ఒక సంచీలో వేసుకుని తీసుకెళ్తున్నారు. శుక్రవారం ఇద్దరు యువకులు ఇలా ఎముకలు తీసుకెళ్తుండగా స్థానికులు పట్టుకున్నారు. ఎముకల్ని అక్కడే వదిలివేయగా, ఆ యువకులను బెదిరించి అక్కడి నుంచి పంపించివేశారు. శనివారం ఇద్దరు మహిళలు కూడా శ్మశానంలో ఎముకలు పోగుచేస్తూ అక్కడి మున్సిపల్ సిబ్బందికి పట్టుపడ్డారు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నా.. కొన్నిరోజులుగా వైకుంఠధామాల్లోని ఎముకలు మాయమువుతున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. మృతదేహాల ఎముకలను కుటుంబ సభ్యులు సేకరించి 5, 9, 11వ రోజుల తర్వాత గోదావరి నదిలో కలుపడం సంప్రదాయం. అయితే, కొన్నిరోజులుగా శ్మశానంలో అస్థికలు కనిపించకపోవడంతో చాలామంది అవి కాలిపోయినట్లు ఇంతకాలం భావిస్తూ వచ్చారు. ఎముకల దొంగలు పట్టుపడడంతో తమవారి ఎముకలను కూడా వారే ఎత్తుకెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ముఠాను మున్సిపల్ సిబ్బంది రాజకుమార్, వినోద్ పట్టుకున్నారు. మాజీ సర్పంచ్ అంతటి అన్నయ్య, బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ సిబ్బందికి సహకరించారు. విచారణ జరుపుతున్న పోలీసులు.. రెండురోజుల వ్యవధిలో నలుగురు ఎముకల దొంగలు పట్టుపడడంతో సుల్తానాబాద్ మున్సిపల్ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కాగా, పదేళ్లక్రితం మృతదేహాలను కాల్చిన కట్టెల బొగ్గులు తీసుకుని వచ్చి కంకులు కాల్చేవారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇలా చేసేవారు. -
స్వలింగ సంపర్కుడి ఇంట్లో మనిషి ఎముకలు!
తమిళనాడు: తంజావూరు సమీపంలో అరెస్టయిన స్వలింగ సంపర్కుడి ఇంటి ఆవరణలో తవ్వగా ఎముకలు బయటపడ్డాయి. వివరాలు.. తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని చోళపురానికి చెందిన నకిలీ సిద్ధ వైద్యుడు కేశవ మూర్తి(47). గతేడాది 3వ తేదీన మందు కోసం వచ్చిన అదే ప్రాంతానికి చెందిన డ్రైవర్ అశోక్రాజ్(27)కు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడి, అతడిని హత్య చేసి మృతదేహాన్ని ఇంటి వెనుక పూడ్చిపెట్టాడు. దీంతో పోలీసులు కేశవమూర్తిని అరెస్టు చేసి, జరిపిన విచారణలో అశోక్రాజ్ను హత్య చేసి ముక్కలుగా నరికి ఇంట్లోనే మసాలా వేసి కాలేయాన్ని వండి తిన్నట్టు తెలిపాడు. అలాగే నవంబర్ 27, 2021, 30వ తేదీన అదే ప్రాంతానికి చెందిన తప్పిపోయిన ఆటో డ్రైవర్ మహ్మద్ అనస్ (26)ని కూడా హత్య చేసి, అతని శరీర భాగాలను ముక్కలుగా చేసి ఇంటి పెరట్లో పూడ్చిపెట్టాడు. కొన్ని భాగాలను వండుకుని తిన్నట్టు తెలిపాడు. ఈ ఘటనలో మహ్మద్ అనాస్ మృతదేహాన్ని పోలీసులు ఇంకా వెలికితీయకపోగా.. ఇతడిని కూడా కేశవ మూర్తి హత్య చేసి ఉంటాడని పోలీసులు సందేహించారు. ఈ కేసులో చోళపురంలో ఉన్న సిద్ధ వైద్యుడు కేశవమూర్తి ఇంటిలో, వేలిముద్రల నిపుణులు ఏడీఎస్పీ హేమ, సహాయ సహాయకుడు రామచంద్రన్ (27) సమక్షంలో తిరువిడైందూరు డీఎస్పీ జబర్ సిద్ధిక్ నేతృత్వంలో కేశవ మూర్తి ఇంట్లో విచారణ చేపట్టారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి పోలీసు జాగిలాలు సోదాలు చేశాయి. ప్రొక్లైన్ సాయంతో ఇంటిపక్కన చెట్లు, ఇంటిముందు పచ్చిమిర్చి మొక్క. అరటి చెట్లను నరికి తొలగించారు. వరుసగా 2 చోట్ల 3 అడుగుల లోతు తవ్వగా 30కి పైగా ఎముకలు బయటపడ్డాయి. వాటిని తంజావూరు ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. -
వ్యాయామం రోజూ ఒకే టైంలో చేస్తున్నారా? వెలుగులోకి షాకింగ్ విషయాలు
మనం కొత్తగా ఏదైన డైట్ లేదా వ్యాయామాలకు సంబంధించి మార్పులు తీసుకునేటప్పుడూ సమయపాలనే అనేది ముఖ్యం. అంటే.. ఇక్కడ రోజూ ఒకే టైంలోనే ఏదైనా చేయమని నొక్కి చెబుతుంటారు నిపుణులు. మన చిన్నప్పుడూ కూడా ఈ టైం కల్లా చదువుకోవడం పూర్తి చేసుకుని నిద్రపోండి అని మన పెద్దవాళ్లు పదేపదే చెబుతుంటారు. ఇలానే ఎందుకు? ఇది మన శరీరాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుంది తదితరాల గురించి తాజా అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకు గల కారణాలకు సరైన సమాధానం కూడా దొరికింది. మనం చేసే వ్యాయామం లేదా ఏదైన పని రోజూ ఒకే టైంలో చేస్తే చక్కటి ఫలితం ఉంటుందట. ఈ మేరకు మాంచెస్టర్ విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో..ఏ వ్యక్తి అయినా వ్యాయామాన్ని ఇష్టారీతిలో తనకు కుదిరిన సమయంలో చేసిన వారి కంటే ఒక నిర్దేశిత టైంలో చేసిన వారిలోనే మెరుగైన పలితాలు కనపడటం గుర్తించారు. దీనికి గల కారణాల గురించి సాగిన పరిశోధనలో చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మానవుని శరీరం బాహ్య వాతావరణంతో ప్రభావితవుతుంది. అందుకు తగ్గట్టుగా మన అంతర్గత శరీరీం స్కిరాడియన్ గడియారాన్ని సెట్ చేసుకుంటుందట. ఇక్కడ స్కిరాడియన్ గడియారం అంటే జీవక్రియ గడియారం. దీని అర్థం ఉదయం మేల్కోనగానే కాసేపు బద్ధకంగా అనిపించటం, తర్వాత ఆకలి.. ఆ తర్వాత రోజూవారి పనుల్లో నిమగ్నమవ్వడం ఒక లయబద్ధంగా మన మెదడు సిగ్నల్స్ పాస్ చేయడంతో ఆటోమెటిక్గా చేసుకుంటూ పోతున్న విధానాన్నే జీవగడియారం అంటారు. అంటే..ఇక్కడ మన జీవక్రియ గడియారానికి మన శరీర భాగాలకు మధ్య మెదడు అనే సెంట్రల్ గడియారం సమన్వయంతోనే ఇదంతా సాధ్యమవుతుంది. అందువల్ల సాయంత్రం చీకటి పడగానే ఆటోమెటిక్ నిద్రకు ఉపక్రమించడం, వెలుగు అనగానే బాడీ సెట్ రైట్ అయిపోయి లేవాలనే ఫీల్ కలగడం జరుగుతుంది. కాబట్టి మనిషి ఏదైనా డైట్ లేదా వ్యాయామం చేయాలనుకుంటే..రోజూ ఒక నిర్దేశిత టైంలో చేస్తే రిజల్ట్ బాగుండటమే గాక అనారోగ్యాల బారిన పడకుండా ఫిట్గా ఉండగలుగుతారని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడయ్యింది. అంతేగాదు రోజులో 24 గంటలు అనే రోజు చక్రానికి అనుగుణంగా మన బాడీ ప్రతిస్పందిస్తుంది. అదే శరీరంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రత మారడం, రక్తంలో స్థాయిలు మార్పులు, తదితరాలకు కారణం అని పరిశోధకులు పేర్కొన్నారు. మన శరీరంలోని ఇతర భాగాలు గనుక మన జీవ గడియారం, సెంట్రల్ గడియారానికి అనుగుణంగా పనిచేయకపోయినప్పుడే అనారోగ్య సమస్యలు ఉత్ఫన్నమవుతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితే మన శరీరంలో చెడు కొలస్ట్రాల్కు కారణమని అన్నారు. అలాగే పగటిపూట మాగ్జిమమ్ తిరుగుతూ ఏదో ఒక పని చేస్తుంటాం. అందువల్ల మన వెన్నెముకలోని ఇంటర్వర్టెబ్రల్ డిస్క్ల నుంచి తుంటి, మోకాళ్లలోని మృదులాస్థి నుంచి నీరు బయటకు వచ్చి రోజూ ముగిసే సమయానికి కాస్త పొట్టిగా కనిపిస్తాం. ఇది రోజు ముగిసే సమయానికి మనల్ని కొంచెం పొట్టిగా కనిపించేలా చేస్తుంది. అదే రాత్రి విశ్రాంత తీసుకునే సమయంలో నీరు తిరిగి మన బాడీకి వస్తుంది మనం యథావిధిగా కనిపిస్తాం అని చెప్పారు. అందుకోసం తాము ఎలుకలపై అధ్యయనం చేయగా.. ఈ ఫలితాలను గుర్తించామని అన్నారు. మన డైట్కి సంబంధించి లేదా వ్యాయామం వంటివి చేసేటప్పుడూ వీలు కుదరినప్పుడల్లా చేస్తే డీసింక్రోనైజేషన్కి గురయ్యి ఫలితం సరిగా ఉండదు. పైగా మన ఇతర వ్యవస్థలపై ప్రభావం ఏర్పడి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అన్నారు. కాబట్టి మనం రోజూ శారీరక శ్రమకు సంబంధించి(వ్యాయామం తదితర పనులు) ఒకే సమయానికి చేయడం వల్ల శరీరంలోని ఇతర వ్యవస్థలన్ని సమన్వయం అయ్యి, గాయాల బారినపడకుండా ఉండటమే గాక వయసు రీత్య వచ్చే కీళ్ల సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం కూడా తగ్గుతుందని చెప్పుకొచ్చారు మాంచెస్టర్ పరిశోధకులు. (చదవండి: సరికొత్త ఔషధం..ఒక్క డోసు తీసుకుంటే చాలు.. దెబ్బకు కొలస్ట్రాల్ మాయం!) -
పిల్లల ఎముకలు బలంగా పెరగాలంటే..
పిల్లల ఎదుగుదల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే పెద్దవారితో పోల్చితే పిల్లల ఎముకలు బలహీనంగా ఉంటాయి. దీనివల్ల చిన్న చిన్న దెబ్బలు తాకినా తొందరగా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. బాల్యంలోని బలమైన ఎముకలు వారి జీవితకాల ఆరోగ్యానికి అద్భుతమైన పునాదిని అందిస్తాయి. అందువల్ల వారి ఎముకలు దృఢంగా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన ఆహార నియమాలపై అవగాహన కోసం... కాల్షియం గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, ఎముకలను అభివృద్ధి చేయడానికి కాల్షియం అవసరం అని తెలుసు కాబట్టి పిల్లలు రోజుకు కనీసం రెండు గ్లాసుల పాలను తాగేట్టు చూడాలి. అలాగే ఆహారంలో బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరలు, బెండ, పొట్ల వంటి కూరగాయలు ఉండేట్టు చూడండి. అలాగే రోజుకు ఒకసారైనా పెరుగును తినేట్టు చూడండి. సోయా పాలు, సోయా పెరుగు వంటి సోయాబీన్ ఉత్పత్తుల్లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి శరీరానికి కావలసిన కాల్షియంను గ్రహించేందుకు విటమిన్ డి సహాయపడుతుంది. విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా, కొన్ని రకాల ఆహారాల ద్వారా పొందవచ్చు. పిల్లల ఆహారంలో తగినంత విటమిన్ డి లేకపోతే విటమిన్ డి సప్లిమెంట్ను తీసుకోవాలి. నవజాత శిశువులకు కూడా విటమిన్ డి సప్లిమెంట్స్ అవసరం. కానీ డాక్టర్లను సంప్రదించిన తర్వాతే ఇవ్వాలి. మెగ్నీషియం, విటమిన్ కె శరీరంలో విటమిన్ కె, మెగ్నీషియం స్థాయిలు ఎక్కువగా ఉంటే ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే రికెట్స్, బోలు ఎముకల వ్యాధితో సహా ఎన్నో ఎముకల సమస్యలను తగ్గించడానికి ఇవి సహాయపడతాయి. కాల్షియంతో పాటుగా ఈ విటమిన్లు కూడా మీ పిల్లల ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. బచ్చలికూర, Mక్యాబేజీ, మొలకలు వంటి వాటిల్లో విటమిన్ కె, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. పిల్లలకు తృణధాన్యాలను పెట్టండి. కార్బోనేటేడ్ పానీయాలు వద్దే వద్దు కార్బోనేటేడ్ పానీయాలలో సాధారణంగా కొన్ని ఫాస్పోరిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇది శరీరం కాల్షియాన్ని గ్రహించకుండా నిరోధిస్తుంది. ఈ ఆమ్లం ఎముకల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కార్భోనేటెడ్ పానీయాలకు బదులుగా నారింజ రసం వంటి హెల్తీ పానీయాలను తాగించండి. ఎముకలను బలోపేతం చేసేవాటిలో ముఖ్యమైనది శారీరక శ్రమ. అందుకే పిల్లలు బాగా ఆటలు ఆడేలా చూడండి. వీలైతే చిన్న చిన్న వ్యాయామాలను చేయించండి. (చదవండి: వాస్తవికతకే రూపం ఇస్తే..పాజిటివ్ ఎమోషన్..) -
ఆ విటమిన్ లోపిస్తే తినాలనే ఆసక్తి కోల్పోతాం!
శరీరానికి అన్ని విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా ఉండగలం. ఏ విటమిన్ లోపించిన దాని దుష్ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అందులోనూ మన శరీరానికి ప్రకృతి సిద్ధంగా లభించే విటమిన్ల విషయంలో అజాగ్రత్త వహిస్తే ఆ పరిస్థితి మరి దారుణంగా ఉంటుంది. విటమిన్లలో సహజసిద్ధంగా లభించే విటమిన్ డీ. ఇది మనకు సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. ఆ విటమిన్ లోపం కారణంగా తినబుద్ది కాదని, పూర్తిగా నీరసించి దారుణమైన స్థితికి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు న్యూట్రిషియన్లు. ఐతే విటమిన్ డీ లోపించిదని ఇచ్చే సంకేతాలు, లక్షణాలు ఏంటో చూద్దామా! డీ విటమిన్ లోపం గురించి ఇచ్చే పది సంకేతాలు ఏంటంటే.. అలసిపోవడం మాటిమాటికి అలసట వస్తున్నా లేదా ఎక్కువ సేపు ఏ పనిచేయక మునుపే తొందరగా అలసటతో కూర్చుండిపోతే డి విటమిన్ లోపించిందని అర్థం. ఇది డీ విటమిన్ లోపానికి సంబంధించిన బలమైన సంకేతంలో ప్రధానమైంది నిద్ర పట్టకపోవడం టైంకి పడుకున్నా కూడా నిద్ర పట్టకపోతే అది డీ విటమిన లోపమే కారణం. మెలటోనిన్ అనే హార్మోన్ మానవ సిర్కాడియన్ లయలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా నిద్ర పట్టకపోవడం అనే సమస్య ఎదురవుతుంది. ఈ డీ విటమిన్ శరీరంలో నిద్ర వచ్చే హార్మోన్ని ఉత్పత్తి అయ్యేలా చేసి కంటి నిండా నిద్రపోయేలా చేస్తుంది. కీళ్లపై ప్రభావం దీర్ఘకాలిక కండరాల అసౌకర్యం, బలహీనతకు మూలం విటమిన్ డీ. కాల్షియం శోషణలో సహయపడుతుంది. ఇది లేకపోవడం వల్ల కీళ్లపై ప్రభావం చూపుతుంది. డిప్రెషన్ లేదా విచారం డిప్రెషన్కి డీ విటమిన్తో ఎలాంటి సంబంధం లేనప్పటికి..పరిశోధనల్లో అలటస కారణంగా మానసికంగా బలం కీణించి అనేక రుగ్మతలకు లోనై డిప్రెషన్కి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలడం డీ విటమిన్ లోపిస్తే జుట్టు రాలడం, జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపడం వంటివి జరగుతాయి. కొన్ని సందర్భాల్లో ఆ లోపం ఎక్కువగా ఉంటే అలోపేసియాకు కూడా కారణమయ్యే అవకాశం ఉంది. దీంతో తలపై జుట్టు తోపాటు, శరీరంపై ఉండే వెంట్రుకలన్నింటిని పూర్తిగా కోల్పోయేలా ప్రమాదం ఉంది. కండరాల బలహీనత విటమిన డీ ఆరోగ్యకరమైన కండరాల పెరుగుదల, అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే కండరాల సంకోచాన్ని నియంత్రించడానికి కీలకం కూడా. శరీరంలో తక్కువ డీ విటమిన్ స్థాయిలు వివిధ రకాల కండరాల కణాల పనితీరుని ప్రభావితం చేసినట్లు పలు పరిశోధనల్లో తేలింది. డార్క్ సర్కిల్స్ కళ్లు బూడిద రంగులోకి మారడం, కళ్ల కింద ఉన్న చర్మం ఉబ్బడం లేదా మృదువుగా లేనట్లు ఉన్నట్లయితే ఎక్కువసేపు ఎండలో గడపాలని అర్థం. ఆకలి లేకపోవడం ఆహారం పట్ల ఆకస్మికంగా విరక్తి ఏర్పడటం, ఆకలి అనే అనూభూతి లేకపోవడం వంటివి జరుగుతాయి. తరుచుగా అనారోగ్యం రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండి, తరుచుగా అనారోగ్యానికి గురవ్వడం జరుగుతుంది. చర్మం పాలిపోవడం ఆరోగ్యకరమైన చర్మ కణాల ఉత్పత్తికి విటమిన్ డీ అవసరం. కాబట్టి చర్మం పాలిపోయినట్లుగా ఉంటే విటమిన్ డీ లోపం ఉన్నట్లు క్లియర్గా అర్థమవుతుంది. కావున ఆయా వ్యక్తులు సూర్యరశ్మీలో గడపడం అత్యంత ముఖ్యం. అంతేగాదు అధిక రక్తపోటు, మధుమేహం, ఫైబ్రోమైయాల్జియా,మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి నాడీ సంబంధిత పరిస్థితులు విటమిన్ డీ లోపంతో సంబంధం కలిగి ఉంటాయి. ఏం చేయాలంటే.. విటమిన్ డీ కి చక్కని సోర్స్ సూర్య రశ్మే. ఆ తరువాత స్థానంలో చేపలు, కాడ్లివర్ ఆయిల్, గుడ్డు పచ్చ సొన, ష్రింప్, ఫోర్టిఫైడ్ మిల్క్, ఫోర్టిఫైడ్ బ్రేక్ ఫాస్ట్ సెరియల్, ఫోర్టిఫైడ్ యోగర్ట్, ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్ ఉంటాయి. (చదవండి: 1990లలో అపహరించిన జీప్ అనూహ్యంగా ఎలా బయటపడిందంటే) -
లక్షమందిలో ఒకరికి సంభవించే వ్యాధి..ఉన్నపళంగా ఎముకలు..
కొన్ని వ్యాధులు చాలా అరుదుగా సంభవిస్తుంటాయి. ఇలాంటి వ్యాధి కూడా ఉంటుందా అనేలా ఉంటాయా ఆ వ్యాధులు. అలాంటి అరుదైన వ్యాధి బారినేపడింది సదరు మహిళ. అసలేం జరిగిందంటే..న్యూయార్క్కి చెందిన 24 ఏళ్ల బెథాని ఈసన్ అనే మహిళ జస్ట్ అలా బాత్రూంకి వెళ్లింది అంతే మోకాలి ఎముకలు పెళ పెళ మంటూ విరిగిపోయాయి. దీంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి వెళ్లగా..ఎక్స్రే తీయించుకోవాల్సిందిగా సూచించారు వైద్యులు. ఆ తదనంతరం నిర్వహించి వైద్య పరీక్షల్లో ఆమెకు ఎముకల్లో కణితి ఉన్నట్లు తేల్చారు. దీని వల్ల చుట్టుపక్క ఉన్న మృదుకణజాలం బలహీనమై మెకాలి నుంచి తొడ ఎముకలు పెళపెళమని విరగిపోతాయని అన్నారు. వెంటనే సర్జరీ చేయాలని చెప్పారు. ఆ సర్జరీ కూడా అత్యంత క్లిష్టమైనది, విజయవంతమయ్యే అవకాశాలు కూడా తక్కువ. దీంతో బెథానికి ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కంపించినట్లయ్యింది. ఈ వ్యాధి గురించి పలువురిని సంప్రదించింది కూడా అందరూ అదేమాట చెప్పారు. పైగా దీని భారినపడిన వారుకూడా ఇప్పటికీ తాము నడవలేకపోతున్నట్లు ఆమెకు చెప్పారు. అంతేగాదు పలువురు బతికే ఉన్నా కూడా.. నడుం కింద నుంచి శరీరం అంతా చచ్చుపడిపోయే అవకాశం కూడా లేకపోలేదని ఆమెను హెచ్చరించారు కూడా. అయినప్పటికి ధైర్యం తెచ్చుకుని మరీ విజయవంతంగా ఆపరేషన్ చేయించుకుంది. ఆమె మోకాలి నుంచి తొడ ఎముకల వరకు సర్జరీ చేశారు వైద్యులు. ఇంకెప్పుడూ హీల్స్ ధరించకూడదని సూచించారు. అంతేగాదు ఆమె కొత్తగా నడవడం నేర్చుకోవాల్సి ఉంటుందని బెథానికి తెలిపారు వైద్యులు. ఇది చాలా నొప్పితో కూడిని సర్జరీ అని బెథాని చెబుతోంది. ప్రాణాంతకం కాకుడాదంటే.. నొప్పిని భరిస్తూ సర్జరీ చేయించుకోక తప్పదని వాపోయింది. (చదవండి: ఢిల్లీ వెళ్లి చూడండి..భారత్లో ప్రజాస్వామ్యం చాలా శక్తిమంతంగా ఉంది: అమెరికా) -
మెడి టిప్
అందరిలోనూ 20 ఏళ్లు వచ్చే వరకు ఎముకలు వేగంగా పెరుగుతుంటాయి. మనలో దాదాపు 40 ఏళ్లు వచ్చేవరకు ఎముకలు కాస్త బలంగా గట్టిగా ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా పలచబడుతూ, పెళుసుగా మారుతూ ఉంటాయి. ఇలా ఎముకలు పలచబా రుతూ తేలిగ్గా విరిగేలా పెళుసుబారడాన్ని ‘ఆస్టియోపోరోసిస్’ అంటారు. ఈ ముప్పు మహిళల్లో మరీ ఎక్కువ. మహిళలైనా, పురుషులైనా ఆస్టియోపోరోసిస్ నివారణ కోసం ఈ కింది అక్షరాల సహాయంతో అవలంబించాల్సిన జాగ్రత్తలను గుర్తుపెట్టుకోవచ్చు. అవి... ♦ ‘సి’ ఫర్ క్యాల్షియమ్– ఎక్కువగా తీసుకోవాలి. అంటే క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పాలు, ఆకుకూరల వంటివి. ♦ ‘డి’ ఫర్ విటమిన్ డి – శరీరానికి తగినంత అందేలా చూసుకోవాలి. ఇందుకోసం లేత ఎండలో నడక, వ్యాయామం మేలు. ♦ ‘ఈ’ ఫర్ ఎక్సర్సైజ్ – శరీరాన్ని తగినంత వ్యాయామాన్ని అందించాలి. ♦ ‘ఎఫ్’ ఫర్ ‘ఫాల్స్’ – ఫాల్ అంటే ఇంగ్లిష్లో పడిపోవడం. వయసు పెరిగినవారికి బాత్రూమ్ల వంటి చోట్ల, ఎక్కడానికి అంత అనువుగా లేని మెట్లు ఉండే చోట్ల పడిపోవడం సాధారణంగా జరుగుతుంటుంది. ఇలా పడిపోయే అవకాశాల్ని తగ్గించుకోవాలి. అంటే ఆయా ప్రదేశాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. -
వెజ్ బిర్యానీలో మాంసం బొక్కలు.. కంగుతిన్న వ్యక్తి ఏం చేశాడంటే..
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటేనే భోజన ప్రియులు కాస్తా వెనకడుగు వేస్తున్నారు. ఒకటి ఆర్డర్ ఇస్తే ఇంకోటి రావడం, భోజనంలో పురుగులు, కుళ్లిన ఆహారం వస్తుందోనని జంకుతున్నారు. తాజాగా రెస్టారెంట్కు వెళ్లిన ఓ శాకాహారికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. వెజిటేరియన్ ఫుడ్ ఆర్డరిస్తే.. అందులో మాంసం ముక్కలు దర్శనమిచ్చాయి. ఎంతో ఇష్టంగా తిందామనుకున్న వెజ్ బిర్యానీలో నాన్వెజ్ కనిపించడంతో షాకైన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్లోని ఇండోర్ నగరంలో చోటుచేసుకుంది. అక్షయ్ దూబే అనే వ్యక్తి విజయ్ నగర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్కు వెళ్లి వెజ్ బిర్యాని ఆర్డర్ చేశాడు. అసలే ఆకలి మీదున్న అక్షయ్.. టేబుల్ మీదకొచ్చిన ఘుమఘుమలాడే వెజ్ బిర్యానీని ఓ పట్టున లాగేస్తున్నాడు. అయితే ఒక్కసారిగా బిర్యానీలో మాసం బొక్కలు కనిపించడంతో అతడు కంగుతున్నాడు. వెంటనే ఈ విషయాన్ని రెస్టారెండ్ మేనేజర్, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా.. పొరపాటు జరిగిందంటూ వారు క్షమాపణలు తెలియజేశారు. అంతేగాక ఆక్షయ్.. విజయ్ నగర్ పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశాడు. శాఖాహారులకు మాంసాహారం అందిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు రెస్టారెంట్ యజమాని స్వప్నిల్ గుజరాతీపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని.. తదుపరి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసల్ సంపత్ ఉపాధ్యాయ తెలిపారు. చదవండి: జమ్మూ కశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం -
అడవిలో దొరికిన ఎముకలు శ్రద్ధవే.. తేల్చిన డీఎన్ఏ రిపోర్టు
న్యూఢిల్లీ: శ్రద్ధ వాకర్ హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. డిల్లీ మెహ్రౌలీ అడవిలో దొరికిన ఎముకలు శ్రద్ధవే అని తేలింది. ఆమె తండ్రి డీఎన్ఏతో ఈ సాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. సెంట్రల్ ఫోరెన్సిస్ సైన్స్ లాబోరేటరీ నివేదిక దీన్ని ధ్రువీకరించింది. అలాగే శ్రద్ద హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలా పాలీగ్రాఫ్ టెస్టు పూర్తి నివేదిక పోలీసులకు అందింది. దీంతో అధికారులు ఈ కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయనున్నారు. ఢిల్లీ మోహ్రాలీలో ఈ ఏడాది మేలో జరిగిన శ్రద్ధ వాకర్ హత్య కేసు ఆరు నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శ్రద్ధ బాయ్ఫ్రెండ్ అప్తాబే ఆమెను గొంతునులిమి చంపాడు. అనంతరం శవాన్ని 35 ముక్కలు చేసి అడవిలో పడేశాడు. పోలీసులు అడవి మొత్తం గాలించి 13 ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. డీఎన్ఏ టెస్టుతో అవి శ్రద్ధవే అని తేలింది. కోర్టు అనుమతితో ఈ కేసులో నిందితుడు అఫ్తాబ్కు పాలీగ్రాఫ్తో పాటు నార్కో టెస్టు కూడా నిర్వహించారు అధికారులు. అతని స్టేట్మెంట్ రికార్డు చేశారు. శ్రద్ధను తానే చంపానని, కానీ చంపినందుకు ఎలాంటి పశ్చాతాపం లేదని అఫ్తాబ్ విచారణలో చెప్పాడు. చదవండి: లైంగిక వేధింపులు.. హెడ్ మాస్టర్ను కర్రలతో చితకబాదిన అమ్మాయిలు -
వామ్మో! దగ్గితే పక్కటెముకలు విరిగిపోవడమా!
ఏదైన ప్రమాదం బారిన పడితేనో లేక పోట్లాడినప్పుడో ఎముకలు విరగడం జరుగుతుంది. మహా అయితే ఏదైన వ్యాయమం చేసినప్పుడూ ఏదైన ఎముక బెణికి విరిగే అవకాశం ఉంటుంది. అంతేగానీ ఉత్తిపుణ్యానికి అదికూడా కేవలం దగ్గితే ఎముకలు విరగడం గురించి విన్నారా! వాస్తవానికి ఏదైన జన్యులోపంతో ఎముకలు బలహీనంగా ఉండి విరిగిపోవడం జరుగుతుంది. కానీ కేవలం దగ్గితే ఎముకలు విరిగిపోవడం ఏమిటి అని ఆశ్చర్యంగా అనిపించినా అది నిజం. వివరాల్లోకెళ్తే...చైనాలోని షాంఘైకి చెందిన హువాంగ్ అనే మహిళకు దగ్గినందుకు ఛాతీలోని నాలుగు పక్కటెముకలు విరిగిపోయాయి. ఆమె ఒక రోజు స్పైసీ ఫుడ్ తింటున్నప్పుడూ విపరీతమైన దగ్గు వచ్చింది. అప్పుడూ ఆమెకు ఏదో లోపల విరిగిన శబ్దం వచ్చింది కూడా. ఐతే ఆమె మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత నుంచి ఆమె గాలి పీల్చుకుంటున్న, మాట్లాడుతున్న విపరీతమైన నొప్పి రావడం ప్రారంభమైంది. దీంతో ఆమె ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ హువాంగ్కి స్కాన్ చేయగా మొత్తం నాలుగు పక్కటెముకలు విరిగినట్లు గుర్తించారు వైద్యులు. ఆ తర్వాత ఆమెకు బ్యాడేజ్ వేసి నయం అయ్యేంతవరకు నెలరోజులు విశ్రాంతి తీసుకోమని సూచించారు వైద్యులు. ఐతే స్థానిక మీడియా దగ్గితే పక్కటెముకలు విరగడం ఏమిటని వైద్యులను ప్రశ్నించింది. హువాంగ్ బరువు తక్కువగా ఉండటమే అందుకు కారణమని వైద్యులు తేల్చి చెప్పారు. ఆమె సుమారు 171 సెంటిమీటర్లు పొడవు ఉంటుందని, బరువు కేవలం 57 కిలోగ్రాములే ఉంటుందని చెప్పారు. ఆమె శరీరంలో పైభాగం చాలా బలహీనంగా ఉండటమే గాక శరీరం నుంచి ఎముకలు చాలా స్పష్టంగా కనిపిస్తాయని చెబుతున్నారు. ఎముకలకు మద్దతు ఇచ్చేలా కండ లేకపోవడంతో.. దగ్గినప్పుడల్లా... పక్కటెముకలు సులభంగా విరిగిపోతాయని చెప్పారు వైద్యులు. ఆమె కోలుకున్నాక కచ్చితంగా బరువు పెరిగేందుకు వ్యాయమాలు చేస్తానని చెబుతోంది. (చదవండి: -
శ్రద్ధ హత్య కేసు.. అడవిని జల్లెడ పట్టిన పోలీసులు.. 3 ఎముకలు స్వాధీనం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ హత్య కేసు విచారణను వేగంగా పుర్తి చేస్తున్నారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా మెహ్రౌలీ అడవిలో శ్రద్ధ శరీర భాగాల కోసం ముమ్మరంగా గాలించారు. నవంబర్ 16న మూడుసార్లు ఈ అడవినంతా జల్లెడపట్టారు. ఈ క్రమంలోనే అక్కడ ఓ పెద్ద ఎముకను గుర్తించారు. అది ఫీముర్(తొడ ఎముక) అయి ఉంటుందని పేర్కొన్నారు. ఆ తర్వాత అడవిలోని ఇతర ప్రాంతాల్లో మరో రెండు ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి కచ్చితంగా శ్రద్ధవే అయి ఉంటాయని చెబుతున్నారు. అడవిని గాలించేందుకు నిందితుడు అఫ్తాబ్ను కూడా తీసుకెళ్లారు పోలీసులు. ముక్కలు ముక్కలుగా చేసిన శ్రద్ధ శరీర భాగాలను ఎక్కడ పడేశాడో చూపించమన్నారు. అతడు చెప్పిన వివరాల ప్రకారం అడవినంతా వెతికి మొత్తం మూడు ఎముకలను గుర్తించారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు తొలిసారి ఓ సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 18 తెల్లవారుజామున నిందితుడు అప్తాబ్ తన ఇంటి నుంచి ఓ బ్యాగ్ వేసుకుని, సంచిపట్టుకుని బయటకు వెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ బ్యాగులో శ్రద్ధ శరీరా భాగాలు ఉండి ఉంటాయని, అప్తాబ్ వాటిని అడవిలో పడేసేందుకు తీసుకెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఢిల్లీ మొహ్రౌలీలో ఆరు నెలల క్రితం జరిగిన శ్రద్ధ హత్య ఘటన ఇటీవలే వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు, శ్రద్ధ బాయ్ఫ్రెండ్ అఫ్తాబ్ ఇప్పటికే నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. అయితే పోలీసులు ఇంకా శ్రద్ధ శీరర భాగాలన్నింటినీ స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అలాగే ఆమె ఫోన్, నిందితుడు ఉపయోగించిన కత్తిని కనిపెట్టాల్సి ఉంది. చదవండి: షాకింగ్.. ఇంజనీరింగ్ కాలేజ్లో 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు.. -
అవగాహనతోనే ఆస్ట్రియోపోరోసిస్ నివారణ
ఎముకలు బోలుగా మారే వ్యాధినే ఆస్టియో పోరోసిస్ గా పేర్కొంటారు ఇది మహిళల్లో బాగా కనిపించే వ్యాధి. మధ్య వయసు దాటాక దాడి చేసే ఈ వ్యాధి ఆధునిక జీవనశైలి, తగిన వ్యాయామం లేకపోవడంతో పాటు అవగాహన లేక దీని దుష్ప్రభావాలు ఎదుర్కుంటున్నవారెందరో... ఈ నేపధ్యంలో ఈ వ్యాధి ముందస్తు హెచ్చరిక సంకేతాలు, ఆ వ్యాధికి గురయ్యాక శరీరంలో వచ్చే మార్పులు, తగ్గించుకునే మార్గాల గురించిౖ హెదరాబాద్లోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ ఆర్థ్రోస్కోపీ సర్జన్ డాక్టర్ వీరేంద్ర ముద్నూర్ ఇలా వివరిస్తున్నారు. బలం నుంచి బోలు వరకూ... శరీరంలోని మస్క్యులోస్కెలెటల్ వ్యవస్థ వందలాది కదిలే మూలకాలను (ఎముకలు, కండరాలు, స్నాయువులు, స్నాయువులు, మృదులాస్థి) కలిగి ఉంటుంది, ఇవి శరీరం సమతుల్యతతో కదలడానికి, సరైన విధంగా పనిచేయడానికి సహకరిస్తాయి. అయితే అన్ని శారీరక అంతర్గత అవయవాలలాగే ఈ భాగాలు గాయపడవచ్చు, కాలక్రమేణా బలహీనపడవచ్చు లేదా అనారోగ్యాలకు గురికావచ్చు. ఎముకలు చాలా బలంగా ఉన్నప్పటికీ, అవి సజీవ కణజాలంతో తయారవుతాయి, ఇవి నిరంతరం విచ్ఛిన్నమవుతూ తిరిగి పునర్నిర్మించబడతాయి. మనిషికి 20 ఏళ్ల వయస్సు వచ్చే వరకు శరీరం ఇప్పటికే ఉన్న ఎముక కణజాలాన్ని విచ్ఛిన్నం చేయడం కంటే త్వరగా కొత్త ఎముకలను నిర్మించగలదు. పెరిగే వయస్సుతో, ఈ ప్రక్రియ మందగిస్తుంది. పాత ఎముక కణజాలం భర్తీ చేయగల దానికంటే వేగంగా క్షీణించవచ్చు. ఇది ఎముకలు మరింత సన్నగా పెళుసుగా మారడానికి ఫలితంగా బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది, ఈ వ్యాధి ఎముక పగుళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఆరోగ్యంగా మరియు ఫిట్గా ఉండటానికి, ఆస్టియోపోరోసిస్ వ్యాధికి సంబంధించిన హెచ్చరిక సంకేతాలను గుర్తించడం చాలా అవసరం. లక్షణాలివే... చిగుళ్లు తగ్గుముఖం పట్టడం – దంతాలు సాధారణంగా దవడ ఎముకకు అతుక్కొని ఉంటాయి దవడ ఎముక సన్నబడటం ప్రారంభించిన తర్వాత, చిగుళ్ళు తగ్గడం కూడా గమనించవచ్చు. గ్రిప్ బలం తగ్గడం – వ్యక్తులు కింద పడిపోవడాన్ని నివారించడానికి మంచి పట్టు, సమతుల్యత కండరాల బలం అవసరం. అలాగే, తగ్గిన పట్టు బలం పడిపోయే అవకాశాన్ని పెంచుతుంది. ఒక వ్యక్తి హ్యాండ్గ్రిప్ వదులైనప్పుడు, అది ఈ వ్యా«ధికి సంకేతం. ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలకు సంబంధించి చేసిన ఓ అధ్యయనంలో బలహీనమైన హ్యాండ్గ్రిప్, తక్కువ ఎముక ఖనిజ సాంద్రత మధ్య సంబంధాన్ని పరిశోధకులు కనుగొన్నారు. తిమ్మిరి/ నొప్పులు – కండరాల తిమ్మిరి, నొప్పులు సాధారణమైనవే అని తరచుగా నిర్లక్ష్యం చేస్తాం, అయితే ఇది బోలు ఎముకల వ్యాధి ప్రారంభ సూచన. కూడా అత్యంత కీలకమైన ఎముక బిల్డర్ అయిన విటమిన్ డిలో గణనీయమైన లోపాన్ని ఇది సూచిస్తుంది. రాత్రి సమయంలో వచ్చే తిమ్మిర్లు రక్తంలో తగ్గిన కాల్షియం, మెగ్నీషియం/ పొటాషియం స్థాయిలను సూచిస్తాయి. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే అధిక ఎముక నష్టం కలిగే అవకాశం ఉంది. ఎత్తు తగ్గుదల ఎముకల వ్యాధి ప్రారంభాన్ని గుర్తించదగిన శారీరక మార్పుల సంకేతాలలో ఒకటి ఎత్తు కోల్పోవడం. ఏ వ్యక్తి అయినా రెండు అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు కోల్పోయినా లేదా వెన్నెముకలో వక్రతను ఆర్థోపెడిక్ ద్వారా గుర్తించినా బోలు ఎముకల వ్యాధికి రిస్క్ జో¯Œ లో ఉన్నట్టే. అంటే ఈ అనారోగ్యం ఇప్పటికే వెన్నుపూసను ప్రభావితం చేసిందని అర్థం. పెళుసుగా ఉండే వేలిగోళ్లు ఆర్థోపెడిక్ ప్రకారం, ఒకరి గోళ్ల బలం ఒకరి ఎముకల ఆరోగ్యాన్ని సూచిస్తుంది. గోరు ఎముక ఆరోగ్యం ఎముక సాంద్రతతో ముడిపడి ఉంటుంది. హ్యాండ్ వాష్ లేదా ఇతర కార్యకలాపాల తర్వాత తరచుగా విరిగిపోయే బలహీనమైన వేలిగోళ్లు ఎముక సాంద్రతలో తగ్గుదలని సూచిస్తాయి. అయితే, గోళ్లపై ప్రభావం చూపే అదనపు అంశాల్లో అత్యంత వేడి లేదా చల్లదనానికి గురికావడం, నెయిల్ పెయింట్ రిమూవర్ లేదా యాక్రిలిక్ నెయిల్లను క్రమం తప్పకుండా ఉపయోగించడం లేదా నీటిలో ఎక్కువసేపు ముంచడం వంటివి కూడా ఉన్నాయి. నివారించడం ఇలా ... తరచుగా వ్యాయామం చేయడం, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం, ఆల్కహాల్, ఇతర డ్రగ్స్కు దూరంగా ఉండటం ద్వారా బోలు ఎముకల వ్యాధిని నివారించవచ్చు. ఎముక ద్రవ్యరాశికి సహాయపడే మందులు బోలు ఎముకల వ్యాధి చికిత్సలో భాగం. ఈ మందులు సాధారణంగా హార్మోన్ల ప్రభావాలను కలిగి ఉంటాయి, ఎముకల అభివృద్ధిని ప్రేరేపించడానికి ఈస్ట్రోజె¯Œ తో సమానంగా పెరుగుతాయి లేదా పనిచేస్తాయి. ఈ వ్యాధి దాని ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలను కలిగి ఉండదు. ఆస్టియోపెనియాలో తక్కువ ఎముక సాంద్రత, తరచుగా పగుళ్లు, భంగిమలో సమస్యలు బోలు ఎముకల వ్యాధికి సూచికలు. ఏదేమైనా ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడానికి ఎముక ఆరోగ్యం జీవన నాణ్యత రెండింటినీ మెరుగుపరచడానికి క్రమం తప్పకుండా వ్యాధి పరీక్షలు చేయించడం అవసరం. –డా.వీరేంద్ర ముద్నూర్ కన్సల్టెలంట్ జాయింట్ రీప్లేస్మెంట్,ఆర్థోస్కోపీ సర్జన్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్, -
నెల క్రితం కిడ్నాప్.. ఇప్పుడు ఎముకల గూడుగా..
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): సేలం జిల్లాలో గత 6వ తేదీన అదృశ్యమైన ఓ కళాశాల విద్యార్థిని మృతదేహం తలలేకుండా బావిలో తేలుతున్న ఎముకల గూడుగా బయటపడింది. వివరాలు.. సేలం, కారిపట్టి, పిన్నాంపల్లికి చెందిన కాశీ విశ్వనాథన్కు చెందిన వ్యవసాయ బావిలో తల లేకుండా ఎముకల గూడుగా తేలుతున్న యువతి మృతదేహాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఎముకల గూడును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలు ధరించిన దుస్తుల ఆధారంగా గత 6వ తేదీ అదృశ్యమైన మిన్నాంపల్లి ఎంజీఆర్ నగర్కు చెందిన కన్మణి కుమార్తె తిత్తిమిలా (19) మృతదేహాంగా గుర్తించారు. ఈమె సేలం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నట్టు తెలిసింది. తల్లిదండ్రులు దుస్తులను చూసి తిత్తిమిలా అని నిర్ధారించారు. తల కనబడకపోవడంతో బావిలో తీవ్రంగా గాలిస్తున్నారు. చదవండి: స్నేహం ముసుగులో యువతులను లొంగదీసుకుని.. ఆతర్వాత -
హైనాల స్థావరం.. గుహ నిండా ఎముకలే
రియాద్ : ఏడు వేల సంవత్సరాల నాటి హైనాల స్థావరాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సౌదీ అరేబియాలోని ఓ లావా గుహలో ఈ స్థావరాన్ని గుర్తించారు. ఈ గుహ మొత్తం ఎముకలతో నిండి ఉంది. ఈ గుహలో దాదాపు 40 రకాల జంతువుల ఎముకలు బయటపడ్డాయి. వీటిలో మనుషులు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలు, మేకలు, జింకలు, ఇతర హైనాల ఎముకలు సైతం ఉన్నాయి. ఈ గుహ కొన్ని వేల సంవత్సరాల పాటు హైనాలు విందు ఆరగించే ప్రదేశంగా ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. హైనాలు మాంసం కోసం స్మశాన వాటికలలోని మనుషుల మృతదేహాలను గుహలోకి లాక్కువచ్చుంటాయని అభిప్రాయపడుతున్నారు. 2007లో ఈ గుహను కనుగొన్నప్పటికి లోపలినుంచి జంతువుల అరుపులు వినపడ్డంతో పరిశోధకులు లోపలికి వెళ్లేప్రయత్నం చేయలేదు. ఈ గుహనుంచి పరిశోధనల నిమిత్తం 1,917 ఎముకలు, పళ్లను వెలికి తీశారు. వీటిలో 1,073 ఎముకలు అస్థిపంజరానికి చెందినవిగా గుర్తించారు. 13 శాంపిల్స్ను రేడియో కార్బన్ డేటింగ్ టెస్ట్ చేయగా వాటిలో కొన్ని ఎముకలు 6,839 ఏళ్ల నాటి వని తేలింది. హైనాలు ఒకరకంగా చెప్పాలంటే సర్వభక్షకాలు. అయితే, ఎక్కువగా మాంసాహారానికి మొగ్గుచూపుతాయి. ఇతర జంతువుల్ని గుంపుగా వేటాడి, చంపి తింటాయి. ఇతర జంతువులకంటే హైనాల జీర్ణవ్యవస్థ ప్రత్యేకమైనది. జంతువుల అన్ని రకాల ఎముకలను సైతం తిని అరిగించుకోగలవు. -
ముక్కు, నోరు మూసుకుని తుమ్మాడు.. ఆపై
తుమ్మేటప్పుడు ఆటోమెటిక్గా కళ్లు వాటంతటవే మూతపడతాయి. ఇక ఏదైనా శుభకార్యాల సమయంలో తుమ్ము వస్తే.. బలవంతంగా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తాం.. లేదంటే తిట్లు పడతాయి కాబట్టి. అలా బలవంతంగా తుమ్ము ఆపుకుంటే కళ్లలోకి నీళ్లు వస్తాయి. అలాంటిది తుమ్ము వచ్చేటప్పుడు ముక్కు, నోరు మూసుకుంటే.. ఏం జరుగుతుంది?. ఇదిగో ఇలాంటి అనుమానామే ఓ వ్యక్తికి వచ్చింది. దాంతో ఓ సారి ప్రయత్నించి చూద్దాం అనుకున్నాడు.. ఇప్పుడు ఆస్పత్రిలో చేరి అపసోపాలు పడుతున్నాడు. మరి అతడి ప్రయోగంలో ఎలాంటి ఫలితం ఇచ్చిందో తెలియాలంటే ఇది చదవాల్సిందే. ఎందుకు అనిపించిందో ఏమో కానీ ఓ 34 ఏళ్ల వ్యక్తి తుమ్మును ఆపాలనుకున్నాడు. దాంతో తుమ్ము వస్తుండగా ముక్కు, నోరు ఒకే సారి మూసుకున్నాడు. ఈ క్రమంలో ఎముక విరిగిపోయిన శబ్దం వినిపించింది. ఆ తర్వాత నోట్లో నుంచి రక్తం వచ్చింది. అతడి వాయిస్ మారిపోయింది. గొంతులో నొప్పి.. మింగడంలో ఇబ్బంది పడ్డాడు. బాధ భరించలేక ఆస్పత్రికి వెళ్లాడు. దాంతో వైద్యులు అతడి మెడను స్కాన్ చేయగా అక్కడ ఉన్న ఎముకలు పక్కకు కదిలి విరగడంతోపాటు లోతైన కణజాలం, కండరాల లోపల గాలి బుడగలు వచ్చినట్లు వైద్యులు కనుగొన్నారు. (చదవండి: తుమ్మినందుకు చితక్కొట్టారు..) గాలి నిండిన కణజాలానికి వ్యతిరేకంగా గుండె కొట్టుకున్నప్పుడు కూడా ఎముకల పగుళ్లు ఏర్పడుతున్నందున వైద్యులు అతని మృధువైన మెడ కణజాలం, ఛాతీని స్కాన్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతానికైతే అతడు కోలుకుంటున్నాడు. ఇక మీదట ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేయవద్దని వైద్యులు అతడిని హెచ్చరిస్తున్నారు. -
ఆస్పత్రిలో పుర్రె, ఎముకలు.. పాల్వంచలో కలకలం
సాక్షి, పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో మనిషి అవశేషాలున్న డబ్బా సోమవారం కలకలం సృష్టించింది. అందులో పుర్రె, చేతి ఎముక, పళ్లు ఉన్నాయి. ఆస్పత్రి వర్గాల కథనం ప్రకారం.. పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)లో దుర్వాసన వస్తుండటంతో.. సిబ్బంది పరిశీలించి జనరేటర్ ఉండే ఎలక్ట్రికల్ గది నుంచి వస్తున్నట్లు గుర్తించారు. ఆ గదిలో మూలకు నీలం రంగు లుంగీతో కట్టిన మూట కనిపించింది. శానిటేషన్ సూపర్వైజర్ దుర్గా, వార్డు బాయ్ ఎన్సీపీ.బాబు దాన్ని విప్పి పరిశీలించగా.. అందులో బాక్స్ ఉంది. తెరిచి చూడగా.. ప్లాస్టిక్ డబ్బా, ప్లాస్టిక్ కవర్ కనిపించాయి. ప్లాస్టిక్ డబ్బాలో మనిషి మొండెం నుంచి వేరు చేసిన పుర్రె, చేతి ఎముక ఉన్నాయి. కవర్లో కళ్లు, పళ్లు ఉన్నాయి. నాలుగైదు రోజుల క్రితం మృతి చెందిన శవం అవశేషాలుగా సిబ్బంది భావిస్తున్నారు. ఈ అవశేషాల మూటను మార్చురీ గదికి తరలించారు. పోలీసులు ఆస్పత్రి సిబ్బంది సహకారంతో సీసీ పుటేజీలో నాలుగైదు రోజులుగా ఆస్పత్రికి రాకపోకలు సాగించిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, ఈ ఘటనపై సిబ్బంది మాట్లాడుతూ వాటిని పోస్ట్మార్టం కోసం తెచ్చామని చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. పోస్ట్మార్టం సిబ్బంది మాత్రం అటువంటిదేమీ లేదని పై అధికారులకు తెలిపినట్లు సమాచారం. సూపరింటెండెంట్ ముక్కంటేశ్వరరావును వివరణ కోరగా.. తాను మీటింగ్ ఉండటం వల్ల ఆస్పత్రిలో లేనని, వివరాలు తెలుసుకుంటానని పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని సిబ్బంది పరిశీలించారని, ఫిర్యాదు ఇస్తే దర్యాప్తు చేస్తామని ఎస్ఐ ప్రవీణ్ తెలిపారు. -
లాక్డౌన్: పుత్తూరు కట్టుకు విశ్రాంతి
ఆకుపసరు.. వెదురు దబ్బలతో విరిగిన ఎముకలకు కట్లు కట్టే పుత్తూరు శల్య వైద్యానికి తాత్కాలికంగా బ్రేక్పడింది. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు లాక్డౌన్ ప్రకటించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. ఫలితంగా వందలాది మంది రోగులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఎంతో విశిష్ట చరిత్ర కలిగిన పుత్తూరు కట్టుకు గతంలో ఎన్నడూ ఇలాంటి అవరోధం కలగలేదు. సాక్షి, పుత్తూరు: దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన పుత్తూరు శల్య వైద్యానికి తాత్కాలిక విరామం వచ్చింది. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని రాచపాళెంలో శతాబ్ద కాలంగా శల్యవైద్యశాల ద్వారా విరిగిన ఎముకులకు ఆకు పసురుతో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇదే పుత్తూరు కట్టుగా వాసికెక్కింది. సినీ రాజకీయ ప్రముఖుడు ఎన్టీఆర్ మూడుసార్లు ఇక్కడ చికిత్స చేయించుకున్నారు. పల్లెటూరి పిల్ల, సర్దార్ పాపారాయుడు సినిమాల చిత్రీకరణ సమయంలో ఆయన గాయపడగా.. ఆయనకు పుత్తూరు కట్టు కట్టి సమస్యను పరిష్కరించారు. మాజీ ఉప రాష్ట్రపతి వీవీ గిరి, హీరో కృష్ణంరాజుకు కూడా పుత్తూరు శల్యవైద్యులు సేవలు అందించారు. కొంత కాలం క్రితం ప్రముఖ వైద్య సంస్థల అధినేత డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డికి కూడా సేవలు అందించారు. సగటున రోజూ సుమారు 300 మంది రోగులు చికిత్స కోసం తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ ఆరుగురు వైద్యులు, 50 మంది సిబ్బంది రోగులకు సేవలు అందిస్తున్నారు. దీంతో పాటు ఇక్కడి వైద్యులు తిరువనంతపురం, బెంగళూరు, ముంబయి తదితర నగరాలకు నెలకు ఒకసారి వెళ్లి సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ సూరపరాజు ప్రతాప్ రాజు తెలిపారు. కాగా లాక్డౌన్ నేపథ్యంలో మార్చి 25వ తేదీ నుంచి శల్యవైద్యశాలను మూసివేశారు. ప్రజారవాణాతో పాటు ఇతర రవాణా మార్గాలు మూతబడడంతో రోగుల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత తిరిగి ఆస్పత్రిలో వైద్య సేవలను పునరుద్ధరించనున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా.. రోగులతో పాటు వారి బంధువులు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది రోజూ ఆçస్పత్రికి వస్తుంటారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్డౌన్ పూర్తయ్యే వరకు ఆçస్పత్రిని మూసివేశాం. లాక్డౌన్ తరువాత పూర్తిస్థాయిలో రోగులకు చికిత్స అందిస్తాం. పరిస్థితిని రోగులు అర్థం చేసుకుని, సహకరించాలి. – డాక్టర్ కృష్ణంరాజు, శల్యవైద్యులు, పుత్తూరు -
తీవ్రమైన వెన్ను నొప్పి... తగ్గేదెలా?
నా వయసు 39 ఏళ్లు. విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. నా సమస్యకు హోమియోలో చికిత్స ఉందా? ఇటీవల వెన్నునొప్పి చాలా ఎక్కువ మందిలో కనిపిస్తున్న సాధారణమైన సమస్య. ఎక్కువగా బరువు ఎత్తడం, దించడం, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు, క్యాల్షియమ్ లోపం, విటమిన్ బి12, డీ3 లోపాలు, ఎముకల సాంద్రత తగ్గడం వంటివి వెన్నునొప్పికి కొన్ని కారణాలు. డిస్క్ బల్జ్, డిస్క్ కంప్రెషన్, నరాలమీద ఒత్తిడి పెరగడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. హోమియోలో ఇలాంటి వెన్ను సంబంధమైన నొప్పులు వచ్చినప్పుడు... ఉదాహరణకు డిస్క్ బల్జ్ వల్ల నరాలమీద ఒత్తిడి పెరిగినప్పుడు తగ్గించడానికి కోబాల్ట్ లాంటి ప్రభావపూర్వకమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఇక మెడభాగంలో ఉండే వెన్నుపూసలు అరిగినప్పుడు వచ్చే నొప్పిని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. మెడ భాగంలో సి1 నుంచి సి7 వరకు ఉండే వెన్ను పూసలను సర్వైకల్ పూసలు అంటారు. ఇవి అరిగినప్పుడు వెన్నుపూసల కీళ్ల మధ్య భాగం తగ్గిపోవడం వల్ల డిస్క్బల్జ్ ఏర్పడటం, వెన్నుపూసల మధ్య రాపిడి పెరగడం వంటి కారణాల వల్ల మెడ భాగం నుంచి నొప్పి మొదలై చేతి వేళ్ల వరకు నొప్పి పాకుతూ ఉంటుంది. దాంతో పాటు తిమిర్లు, చేయి మొద్దుబారడం, మెడ ఫ్రీగా తిరగలేకపోవడం, మెడ పట్టివేసినట్లుగా ఉండటం వంటివి చూస్తుంటాం. చికిత్స: మెడ ఫ్రీగా తిరగకుండా పట్టేసినట్లుగా ఉన్నవారికి యాసిడ్ఫాస్ అనే మందు బాగా పనిచేస్తుంది. ఇక మెడ, నడుము, వెన్నెముక నొప్పులకు ఆస్క్యులస్ హిప్, రస్టాక్స్, బ్రయోనియా ఆల్బ్, కాల్కేరియా ఫ్లోర్, హైపరికం, మహిళల్లో వచ్చే ఇలాంటి సమస్యలకే సిమిసిఫ్యూగా వంటివి అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
నడుమంత్రపు నొప్పి!
తమ జీవితకాలంలో నడుమునొప్పి రానివారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఇది మధ్యవయస్కుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా 35 ఏళ్లు పైబడితే ఏదో ఒక సమయంలో నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే సాధారణంగా నడుమునొప్పి అరుదుగా తప్ప అది పెద్దగా ప్రమాదకరం కాదు. దాదాపు అందరూ ఎదుర్కొనే ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం. నడుమునొప్పికి కారణాలు నడుమునొప్పికి చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణకు... కండరాలు, లిగమెంట్లు, టెండన్లు, డిస్క్లు, ఎముకలు... ఇలా ఎక్కడ సమస్య ఉన్నా నడుము నొప్పి రూపంలో బయటపడుతుంది. సాధారణంగా నడుమునొప్పికి ఎక్కువగా కారణమయ్యే అంశాలివి... ►నడుము కండరాలు తీవ్రమైన ఒత్తిడికి గురై, స్ప్రెయిన్ కావడం ►లిగమెంట్లు దెబ్బతినడం ►నడుము పరిసరాల్లో ఉండే కండరాలు పట్టేయడం. ►పై కండిషన్లకు కారణమయ్యే అంశాలు... ►ఏదైనా బరువును సక్రమంగా ఎత్తకపోవడం ►ఎక్కువ బరువును అకస్మాత్తుగా ఎత్తడం ►సరైన పోష్చర్లో కాకుండా అడ్డదిడ్డంగా కదలడం లేదా నడవడం ►అకస్మాత్తుగా జరిగే ఒంటి కదలికలు... ఇలాంటి సంఘటనలతో ఈ కింద పేర్కొన్న పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవి నడుమునొప్పి కారణమవుతాయి. ►ప్రతి రెండు వెన్నుపూసల మధ్య కుషన్లాంటి ఒక డిస్క్ ఉంటుంది. ఏవైనా కారణాల వల్ల డిస్క్ దెబ్బతినడంతో అక్కడి నరం మీద ఒత్తిడి పెరిగి నడుము నొప్పి రావచ్చు ►వెన్నుపూసకు ఇరుపక్కలా ఉండే డిస్క్లో వాపు రావడం వల్ల నడుము నొప్పి వస్తుంది. ►సయాటికా: మనదేహంలో అన్నిటి కంటే పెద్ద నరం నడుము దగ్గర మొదలై అది కాలివరకు వెళ్తుంది. ఆ నరాన్ని ‘సయాటిక్’ నరం అంటారు. ఏవైనా కారణాల వల్ల ఆ నరం నొక్కుకుపోతే... నడుము దగ్గర నొప్పి మొదలై అది కాళ్ల వరకు పాకుతుంది. దీన్నే ‘సయాటికా నొప్పి’ అంటారు. ►కొందరిలో వయసు పెరుగుతున్న కొద్దీ స్పాండిలోసిస్లో రెండు వెన్నుపూసల మధ్య ఉండాల్సిన గ్యాప్ తగ్గి, ఆ రెంటిమధ్యన నరం ఇరుక్కుపోవడంతో నడుమునొప్పి వస్తుంది. ►కొందరిలో వెన్ను అసహజంగా ఉంటుంది. ఈ కండిషన్ను ‘ఫ్లాట్ బ్యాక్ సిండ్రోమ్’ అంటారు. ఈ అసహజ భంగిమ వల్ల కొందరిలో నొప్పి రావచ్చు. ఇది ఎక్కువగా తప్పుడు భంగిమల్లో కూర్చున్నవారిలో వస్తుంటుంది. ►మరి పొట్ట ఎక్కువగా ఉన్నా నడుమునొప్పి రావచ్చు. ►కొందరిలో ఎముకలు పెళుసుబారిపోయి తేలిగ్గా విరిగిపోయే ‘ఆస్టియోపోరోసిస్’ కండిషన్ ఏర్పడి వెన్ను కూడా విరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా నడుము లేదా వెన్ను నొప్పికి ఒక కారణం. నడుం నొప్పి ముప్పును పెంచే అంశాలు (రిస్క్ ఫ్యాక్టర్స్) : ►వృత్తులో తీవ్రమైన ఒత్తిడి ఉండటం ►మహిళల్లో గర్భధారణ ∙అదేపనిగా కూర్చొని పనిచేయడం ► పెరిగే వయసు ►ఊబకాయం ►పొగతాగడం ►చాలా ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం లేదా సరిగా చేయకపోవడం ►చాలా ఎక్కువగా చేసే శారీరక శ్రమ ►నిర్ధారణ: నడుమునొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఏ కారణం వల్ల ఆ నడుమునొప్పి వస్తుందో తెలుసుకోవడం కోసం కొన్ని పరీక్షలు అవసరం. ఇందుకోసం ఎక్స్రే, అవసరాన్ని బట్టి సీటీస్కాన్ లేదా ఎమ్మారై, బోన్స్కాన్, ఎలక్ట్రోమయోగ్రఫీ వంటి పరీక్షలు చేయించడం అవసరమవుతుంది. ►చికిత్స: ముందుగా కారణం తెలుసుకోవాలి. దాన్నిబట్టి నొప్పిని దూరం చేయడానికి ఫిజియోథెరపిస్ట్ సహాయంతో అవసరమైన వ్యాయామాలు లేదా (ఇంటర్ ఫెరెన్షియల్ థెరపీ) ఐఎఫ్టీ వంటి ప్రక్రియలతో చేసే చికిత్సలు కూడా నడుమునొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ట్రాన్స్క్యుటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్ అనే మాటలకు సంక్షిప్త రూపమైన ‘టెన్స్’ చికిత్స కూడా నడుమునొప్పికి పనిచేస్తుంది. ఇందులో ఎలక్ట్రోడ్ల సహాయంతో చిన్న చిన్న విద్యుత్ ప్రకంపనలను చర్మం కిందికి పంపుతారు. ఫలితంగా ఉపశమనం కలుగుతుంది. అయితే గర్భవతులు, మూర్ఛ రోగులు, గుండెజబ్బులు ఉన్నవారు లేదా గుండెలో పేస్మేకర్ అమర్చిన వాళ్లకు టెన్స్ చికిత్స సరికాదు. ఇలాంటి చికిత్సలు వైద్యనిపుణుల పర్యవేక్షణలోనే సాగాలి. ►ఇక పై మార్గాలన్నీ విఫలం అయినప్పుడు ఎముకల వైద్య నిపుణులు లేదా న్యూరోసర్జన్లు లేదా స్పైన్ సర్జన్లు అవసరమైన శస్త్రచికిత్సను నిర్వహించి పరిస్థితిని పూర్తిగా చక్కబరుస్తారు. ►తక్షణ నొప్పి నివారణ కోసం: నొప్పిని తాత్కాలికంగా తగ్గించడం కోసం పెయిన్ కిల్లర్స్ అందుబాటులో ఉన్నా... ఇవి కేవలం తక్షణ నొప్పి నివారణ కోసమే పనికి వస్తాయి. వీటిని రెండు వారాలకు మించి తీసుకోవడం సరికాదు. దీనికి బదులు ఉపశమనం కోసం పైపూత మందులు (టాపికల్ మెడిసిన్స్) వాడటం మరింత మంచిది. ►ఒకవేళ నడుమునొప్పి దీర్ఘకాలం పాటు కొనసాగితే మాత్రం వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. మరికొన్ని అసాధారణ కారణాలు కాడా ఈక్వినా సిండ్రోమ్: ప్రతి రెండు వెన్నుపూసల మధ్య నుంచి కొన్ని నరాలు బయటకు వచ్చినట్లుగానే... నడుము కింది వెన్నుపూస నుంచి నరాలన్నీ బయటికి వచ్చి నడుము కింది ప్రాంతమంతా విస్తరిస్తాయి. కొన్నిసార్లు వెన్నుపూస చివరి భాగం నుంచి వచ్చిన నరాలనుంచి ఒక సన్నటి నొప్పి (డల్ పెయిన్) బయల్దేరి... పిరుదులు, జననాంగాలు, తొడల భాగమంతా ఆ నొప్పి విస్తరిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో పిరుదుల కింది భాగమంతా అసలు లేనేలేదేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. దాంతో కొందరిలో అది మల, మూత్ర విసర్జన కలగబోయేముందు వచ్చే ఫీలింగ్ కూడా లేనట్లుగా ఉంటుంది. ఈ కండిషన్ను కాడా ‘ఈక్వినా సిండ్రోమ్’ అంటారు. ►వెన్నెముక క్యాన్సర్ : ఇది అరుదైన కండిషన్. ఇలాంటి సమయాల్లో వెన్ను కింది భాగంలో ఎక్కడైనా క్యాన్సర్ గడ్డ ఏర్పడి అది అక్కడి నరాలను నొక్కేయడం వల్ల నడుము నొప్పి రావచ్చు. ►వెన్నెముక ఇన్ఫెక్షన్ : ఏదైనా వెన్నుపూసలో వాపు రావడం వల్ల అక్కడి మృదువైన భాగాల మీద ప్రభావం పడి నడుమునొప్పి రావచ్చు. ఇలాంటి సమయాల్లో జ్వరం కూడా ఉంటుంది. ►ఇన్ఫెక్షన్లు: మహిళల్లో వచ్చే ‘పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్’ వంటి ఇన్ఫెక్షన్లు లేదా యూరినరీ బ్లాడర్ సమస్యలు, కిడ్నీ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నడుము నొప్పి రావచ్చు. ►నరాలకు వచ్చే ‘షింగిల్స్’ అనే సమస్య ఉన్నప్పుడు కూడా అది ఒకవేళ నడుము భాగంలోని నరాలు దెబ్బతింటే నడుమునొప్పి రావచ్చు. ►పక్క సరిగా లేకపోయినా : కొన్ని సందర్భాల్లో పక్క సరిగా కుదరక... అది ఉండాల్సిన తీరులో లేనందువల్ల కూడా నడుము నొప్పి రావచ్చు. ►కూర్చోవడంలో తప్పుడు భంగిమలు: కూర్చొని పనిచేసేవారిలో దాదాపు 80 శాతానికి పైగా సరైన భంగిమలో ఎలా కూర్చోవాలో తెలియదు. దాంతో నడుమునొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. దాంతోపాటు నడుమునొప్పికి కారణమయ్యే కొన్ని అంశాలివి... ►అసహజ భంగిమల్లో అకస్మాత్తుగా వంగడం లేదా పక్కకు తిరగడం ►నొక్కడం ►లాగడం ►ఎత్తడం ►చాలాసేపు నిలబడటం ►ముందుకు ఒంగడం ►ఒక్కపెట్టున తుమ్మడం ►దగ్గడం ►అతిగా ఒంగడం ►కంప్యూటర్ను చూస్తూ మెడను అసహజ భంగిమలో చాలాసేపు వంచి ఉంచడం ►చాలా సేపు డ్రైవ్ చేయడం డా. సుధీంద్ర ఊటూరి లైఫ్స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
మెడనొప్పి చేతులకూ పాకుతోంది..?
నా వయసు 52 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. నొప్పి చేతుల వరకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. మందులు వాడుతున్నంత కాలం బాగానే ఉన్నా అవి ఆపేస్తే మాత్రం మళ్లీ నొప్పి వస్తోంది. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా? వివరంగా చెప్పగలరు. వయసు పెరగడం వల్ల వచ్చే మెడ నొప్పికి పూర్తి పరిష్కారం లభించదని చాలామంది అనుకుంటుంటారు. కానీ హోమియోచికిత్స ద్వారా ఈ సమస్యకు పూర్తి పరిష్కారం దొరుకుతుంది. మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. దీనినే సర్వైకల్ స్పైనల్ ఆర్థరైటిస్ అని కూడా అంటారు. దాదాపు 85 శాతానికి పైగా ఇది 60 ఏళ్ల వయసు పైబడిన వారిలో కనిపిస్తుంది. ప్రస్తుతం జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: ►వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ►క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం ►డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ►వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం ►ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ►ఎక్కువ సేపు కంప్యూటర్పై పనిచేయడం, ఎక్వు సమయం మెడను వంచి ఫోన్లలో మాట్లాడటం ►ఎత్తైన దిండ్లు వాడటం ∙మెడకు దెబ్బతగలడం ►మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ►తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: ►సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ►నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ►మెడ బిగుసుకుపోవడం ►తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం ►నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ►చిన్న బరువునూ ఎత్తలేకపోవడం ►నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్ఆర్, ఎక్స్–రే సర్వైకల్ స్పైన్, ఎమ్మారై పరీక్షలు చేయించడం ద్వారా వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు. హోమియో చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కళ్లు పచ్చగా ఉన్నాయి...పరిష్కారం చెప్పండి నా వయసు 35 ఏళ్లు. నా కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. మూత్రం కూడా పసుపురంగులో వస్తోంది. ఈ లక్షణాలు చూసి నాకు ఆందోళనగా ఉంది. నా సమస్య ఏమిటి? దీనికి హోమియోలో మంచి చికిత్స ఉందేమో దయచేసి వివరించండి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు కామెర్లు సోకినట్లు తెలుస్తోంది. ఇది దీర్ఘకాలంలో కాలేయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. మానవ శరీరంలో కాలేయం అతి ముఖ్యమైన భాగం. ఈ అవయవానికి వైరస్ కారణంగా ఇన్ఫెక్షన్ సోకితే ఎన్నో సమస్యలు మొదలవుతాయి. కాలేయం ప్రభావం చూపే వైరస్లలో ముఖ్యమైనవి హెపటైటిస్–బి, హెపటైటిస్–సి. ఈ వైరస్లు సోకగానే బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కొంతకాలం పాటు ఆ వైరస్ వారి శరీరాల్లో నిద్రాణంగా ఉంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా కాలేయాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రాణాంతకంగా మారుతుంది. లివర్ క్యాన్సర్ సిర్రోసిస్, వైరల్ హెపటైటిస్ వ్యాధులు రావడానికి కారణమవుతుంది. లక్షణాలు: హెపటైటిస్ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే లక్షణాలు బయటకేమీ కనిపించవు. అవి కనిపించడానికి చాలా ఏళ్లు పడుతుంది. కొంతమందిలో వైరస్ సోకిన కొద్దిరోజులకే కామెర్లు వస్తాయి. దీన్ని ఎక్యూట్ స్టేజ్గా చెప్పవచ్చు. ఈ దశలో వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. కొంతమందిలో ఈ వైరస్ తొలగిపోకుండా, శాశ్వతంగా శరీరంలోనే నివాసం ఏర్పరచుకొని బలం పెంచుకుంటూ పోతుంది. దీనిని క్రానిక్ స్టేజ్ అంటారు. ఈ దశలోనే కాళ్లవాపు, పొట్ట ఉబ్బరం, వాంతులు, ఆకలి తగ్గిపోవడం, మూత్రం పచ్చగా రావడం, జ్వరం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స: రోగి శారీరక మానసిక లక్షణాలను పరిశీలించి చికిత్స అందించడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు. మీరొకసారి హోమియో వైద్యుడిని సంప్రదించండి. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల ఆధ్వర్యంలో మందులు వాడితే భవిష్యత్తులో కాలేయానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా పూర్తిగా కాపాడుకోవచ్చు. డా‘‘ కె. రవికిరణ్, మాస్టర్స్ హోమియోపతి, హైదరాబాద్ -
లైఫ్ జర్నీకి బోన్ స్ట్రెంగ్త్
కండరాలే కాదు.. ఎముకలూ ముఖ్యమే ప్రత్యేక వ్యాయామాలతో అదనపు శక్తిచూడడానికి మంచి ఫిజిక్. బాడీ టోన్ సరే.. మరి శరీరంలోని బోన్స్(ఎముకల) సంగతి ఏమిటి? అవీ పటిష్టంగా ఉన్నట్టేనా? వ్యాయామం చేస్తూ చక్కని శరీర సౌష్టవం సొంతం చేసుకున్నా కొంత మందికి బ్యాక్ పెయిన్, మోకాలి నొప్పి, మడం నొప్పివగైరాలు ఎందుకు వస్తాయి? అంటే.. ‘బోన్ బలం వేరు.. కండలు తిరగడం వేరు’ అంటున్నారు కూకట్పల్లిలోని ప్రతిమ ఆస్పత్రికి చెందిన ఆర్థోపెడిక్ సీనియర్కన్సల్టెంట్ డాక్టర్ సాగి రాధాకృష్ణారావు. వ్యాయామం చేస్తే చాలదని, ఎముకల సామర్థ్యం పెరగడానికి ప్రత్యేకంగా మరికొన్ని వ్యాయామాలు తప్పక చేయాలనిసూచిస్తున్నారాయన. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. అందరికీ ‘లో’.. కొందరికే హై.. ప్రతి అడుగులో ఒక కాలి వెయిట్ పడుతుంటుంది. కాబట్టి వాకింగ్ ఎముకల బలోపేతానికి మేలు చేస్తుంది. అలాగే జాగింగ్ కూడా ఓకే. అయితే రెండు కాళ్ల బరువు ఒకేసారి పడే అవకాశం ఉండేది జంపింగ్స్లోనే. తద్వారా బోన్ క్వాలిటీ బాగా మెరుగవుతుంది. అయితే ఈ తరహా హై ఇంపాక్ట్ వ్యాయామాలు అందరూ చేయలేకపోవచ్చు. అంతేకాక దీనివల్ల గాయపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ‘డీ’ కొట్టాల్సిందే.. వ్యాయామంతో పాటు ఎముకల్లో బలానికి ‘విటమిన్ డి’ అంతకు మించిన అవసరం. కాబట్టి శారీరకంగా చూడడానికి బాగుండడం మాత్రమే కాకుండా మంచి బోన్ స్ట్రెంగ్త్కావాలనుకునేవారు తప్పకుండా సూర్యరశ్మి సోకే చోట ఏదో ఒక వ్యాయామం చేయడం మంచిది. సూర్యరశ్మి సోకడం వల్ల శరీరానికి ‘డి విటమిన్’ లభ్యతతో పాటు అదిశరవేగంగా శక్తిగా మారి ఎముకల్లోనిల్వ అయ్యేందుకు వ్యాయామంతోడ్పడుతుంది. కాబట్టి పైన పేర్కొన్న వ్యాయామాల్లో కొన్నయినా వీలైనంతఎండ పడే చోట చేయడం మంచిది. ప్రభావం చూపేవి ఎంచుకోవాలి ఎముకల బలానికి శారీరక శ్రమ ఉపకరిస్తుందనేది వాస్తవం. అయితే, వీటిలో బోన్స్కి మేలు చేసే వ్యాయామాలను ‘నో ఇంపాక్ట్, లో ఇంపాక్ట్, హై ఇంపాక్ట్’గా విభజించవచ్చు. స్విమ్మింగ్, సైక్లింగ్, యోగా, స్ట్రెచ్ ఎక్సర్సైజ్లు, సైడ్స్, క్రంచెస్.. ఇలాంటి వాటిని బోన్స్పై నో ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. అలాగే వాకింగ్, పంచెస్, లంజెస్, కిక్స్.. వంటివి లో ఇంపాక్ట్ వ్యాయామాలుగా, స్టెప్ ఎరోబిక్స్, జంపింగ్ జాక్స్, నడుముకి రోప్ కట్టుకుని చేసే జంపింగ్స్, స్కిప్పింగ్.. వగైరాలను హై ఇంపాక్ట్ వ్యాయామాలుగా చెప్పొచ్చు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎముకల బలాన్ని కోరుకునేవారు మరీ ఎక్కువ కాకుండా తగినంత బరువు శరీరం మోయగలిగితే ఆ మేరకు ఎముకల సామర్థ్యం మెరుగవుతుంది. దీనికి వెయిట్స్ను లిఫ్ట్ చేయడం ద్వారా చేసే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఒక మార్గం. దీనిలో చేతులు, ఛాతి, కాళ్లు.. ఇలా అన్ని శరీర భాగాలలోని బోన్స్కి వ్యాయామాన్ని అందించేందుకు వీలుంటుంది. -
ఎముకల బలాన్నిచాలాకాలం కాపాడుకుందాం
ఎముక గట్టిగా ఉండాలంటే అందులో ఉండాల్సిన పదార్థాలూ, ఖనిజ లవణాలన్నీ కూరి కూరి నిండి ఉన్నట్లుగా ఉండాలి. అప్పుడే ఎముకకు బలం. అదే కూరినట్లుగా కాకుండా వదులొదులుగా ఉంటే అది పెళుసుగా ఉంటుంది. అంటే... దీన్ని బట్టి తెలిసేదేమిటంటే... ఎముకలో ఉండాల్సిన ఖనిజాలు, పదార్థాల సాంద్రత ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఎముక అంత ఆరోగ్యంగా ఉంటుంది. అలాంటి ఎముకలు ఉన్నవారిలో ఆస్టియోపోరోసిస్ జబ్బుల్లాంటివి త్వరగా రావు. అలా ఎముక సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు జబ్బులేమీ రాకుండా చూసుకోవడంతో పాటు వాటిని ఎక్కువ కాలం కాపాడుకోడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే ఎముకలో క్యాల్షియమ్, ఇతర మినరల్స్ వంటివి తక్కువగా ఉంటే అది పెళుసుగా మారిపోతుంది. పెళుసుగా ఉన్నవి త్వరగా విరిగిపోతాయన్న సంగతి తెలిసిందే కదా. ఎముకలు అలా పెళుసుబారకుండా ఉండాలంటే ఎముకలో ఉండాల్సిన పదార్థాల సాంద్రత (బోన్ మినరల్ డెన్సిటీ) ఎంత ఉండాలి, అసలు బోన్ మినరల్ డెన్సిటీ అంటే ఏమిటి, దాన్ని సమకూర్చుకోడానికి ఏం చేయాలి వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. మన ఎముకలు చిన్నప్పుడు కాస్తంత మెత్తగా ఉంటాయి. మెత్తగా అనడం కంటే ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. మనిషి ఎదిగే కొద్దీ అవి క్రమంగా బలం పుంజుకుని, గట్టిపడుతుంటాయి. అంటే మునుపు ఉన్న ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుందన్నమాట. ఇలా ఎముకలు బలం పుంజుకోడానికి... మనం తీసుకునే ఆహారం నుంచి, సూర్యరశ్మి నుంచి అవి అనేక పోషకాలను గ్రహిస్తుంటాయి. ఆహారం నుంచి క్యాల్షియమ్, సూర్యరశ్మి నుంచి విటమిన్ ‘డి’ గ్రహిస్తాయి. ఈ రెండింటితో పాటు మనం చేసే శారీరక శ్రమ కూడా తోడైతే అవి మరింత బలంగానూ, ఆరోగ్యకరంగానూ తయారవుతాయి. ఇలా ఎముకలు బలం పుంజుకుని, వాటిలో ఉండాల్సిన పదార్థాన్ని, ఖనిజాలను సమకూర్చుకుని పూర్తి సాంద్రతను సమకూర్చుకోడం అన్నది ఎదిగే పిల్లలు ఎదిగే క్రమంలో నిరంతరం జరిగే ప్రక్రియ. ఇలా ఎముకలో ఉండే సాంద్రతను బోన్ మాస్ డెన్సిటీ (బీఎమ్డీ) అంటారు. ముప్ఫై ఏళ్ల వయసులో గరిష్ఠ సాంద్రత ఒక మనిషికి 30 ఏళ్లు వచ్చే నాటికి అతడి ఎముకల్లోని సాంద్రత గరిష్టంగా ఉంటుంది. అలా గరిష్టంగా ఉన్న 30 ఏళ్ల వయసు తర్వాత నుంచి... క్రమంగా ఎముకలోని పదార్థాన్ని కోల్పోతూ ఉంటారు. దీన్నే ‘ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ అని వ్యవహరిస్తారు. ఒకవేళ ఎముకలు త్వరత్వరగా తమ సాంద్రత కోల్పోతే అవి చాలా త్వరగా పెళుసుబారి త్వరగా ఆస్టియోపోరోసిస్కు దారితీస్తుంది. అయితే కొందరిలో ఎముక సాంద్రతను కోల్పోయే ప్రక్రియ చాలా నెమ్మదిగా, ఆలస్యంగా జరుగుతుంది. కానీ ఒక వయసు తర్వాత మాత్రం ఎముక తన సాంద్రతను కోల్పేయే పరిస్థితి క్రమంగా కొనసాగుతూనే ఉంటుంది. మహిళల్లో మెనోపాజ్ తర్వాత... మహిళల విషయానికి వస్తే రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్) తర్వాత ఎముక సాంద్రత కోల్పోయే వేగం బాగా పెరుగుతుంది. (అందుకే మెనోపాజ్ ఆగిన మహిళల్లో ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఎక్కువ). కాబట్టి మన ఎముకలోని సాంద్రతను వీలైనంత ఎక్కువ కాలం మనం నిలుపుకోగలిగితే మన ఎముక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎముకల్లో సాంద్రత తగ్గించే రిస్క్ ఫ్యాక్టర్లు ఇవే... ఎముకల్లో సాంద్రత తగ్గేలా చేసే పొగాకు, ఆల్కహాల్ దురలవాట్లు, వ్యాయామం చేయకపోవడం వంటి వాటిని మనం ప్రయత్నపూర్వకంగా మార్చుకుని ఆరోగ్యాన్ని సమకూర్చుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని మార్చుకోలేని, తప్పనిసరి రిస్క్ ఫ్యాక్టర్లు కూడా ఉన్నాయి. అవి... మహిళలు ఎముకల సాంద్రత కోల్పోవడం ఎక్కువ (మరీ ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత), పొట్టిదనం (అరవై కిలోల కంటే లోపు ఉండి, 155 సెం.మీ. కంటే తక్కువ ఎత్తున్న మహిళల్లో ఎముక సంద్రత తగ్గడం చాలా త్వరగా, వేగంగా జరుగుతుంటుంది). దీనికి తోడు మన ప్రాంతీయత కూడా ఎముక సాంద్రతకు దోహదం చేస్తుంది. (పాశ్చాత్యులతో పోలిస్తే ఆసియన్లు, చైనీయులు, కాకసాయిడ్స్లో ఎముక సాంద్రత స్వతహాగానే తక్కువ). అలాగే మన కుటుంబ చరిత్ర (కొందరిలో ఎముకలు తేలిగ్గా విరిగే తత్వం ఉంటుంది), మన జీవనశైలి, కాఫీ, ఆల్కహాల్ వంటి అలవాట్లు... ఇవన్నీ ఎముక సాంద్రత త్వరగా తగ్గడానికి దోహదం చేసే అంశాలే. ఎముక సాంద్రతను తక్కువ చేసే జబ్బులివి... ఇక హైపోగొనాడిజమ్, థైరోటాక్సికోసిస్, కుషింగ్ సిండ్రోమ్, అనొరెక్సియా నర్వోజా (తిండిపై ఆసక్తికోల్పోయి అసలు ఆహారం తీసుకోకపోయే రుగ్మత), మాల్ అబ్షార్ప్షన్ సిండ్రోమ్ (మనం తీసుకున్న పోషకాలు వంటికి పట్టని రుగ్మత), దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు, దీర్ఘకాలిక మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, ఫిట్స్ వస్తున్నప్పుడు తీసుకునే మందులైన యాంటీ కన్వల్సెంట్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక ఇన్ఫ్లమేటరీ వ్యాధుల వల్ల కూడా ఎముక సాంద్రత తగ్గిపోయి, ఆ తర్వాతి దశలో మొదటి వ్యాధుల ఫలితంగా సెకండరీ ఆస్టియోపోరోసిస్కు దారితీస్తుంది. ఎముక సాంద్రతపై దృష్టి పెట్టాల్సిన వారెవరు? ►మహిళలు 55 ఏళ్లు దాటిన వారైతే, పురుషులైతే 65 ఏళ్లు దాటినవారైతే ఒకసారి ఎముక సాంద్రత పరీక్ష చేయించుకోవాలి. ఇక ఈ కింది కండిషన్స్ గాని ఉంటే 50 ఏళ్ల పైబడ్డవారంతా ఎముక సాంద్రతపై దృష్టిపెట్టాలి. అవి... ►గతంలో ఏదైనా ప్రమాదం జరిగి ఎముక విరగడం వంటి ట్రామా కేసుల వారు. తక్కువ బరువు ఉన్నవారు. ►గతంలో తుంటి ఎముక ఫ్రాక్చర్ అయినవారు ►వెన్నెముకకు సంబంధించిన రుగ్మత లేదా అబ్నార్మాలిటీస్ ఉన్నవారు. ►గ్లూకోకార్టికాయిడ్ స్టెరాయిడ్ను ఒక మందుగా తీసుకుంటున్నవారు ►హైపర్ థైరాయిడిజమ్తో బాధపడుతున్నవారు ►ఆస్టియోపోరోసిస్ జబ్బుకు మందు తీసుకుంటూ... డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉన్నవారు. ►తినడానికి సంబంధించిన రుగ్మతలు (అంటే తిన్నది సరిగా ఒంటబట్టకపోవడం వంటి) ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నవారు... వీరితో పాటు పొగతాగడం, మద్యపానం అలవాటు ఉన్నవారు, విటమిన్ ‘డి’ లోపం ఉన్నవారు తప్పనిసరిగా మీద 50 ఏళ్లు పైబడ్డ నాటి నుంచే డాక్టర్ సలహా మేరకు ఎముక సాంద్రత పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఎముక సాంద్రత తెలుసుకోవడం ఎలా..? నిజానికి ఇది ఆస్టియోపోరోసిస్ నిర్ధారణకు చేసే పరీక్ష. దీన్ని ‘డ్యుయల్ ఎనర్జీ ఎక్స్–రే అబ్జార్షియోమెట్రీ’ అంటారు. దీనితో కేవలం ఐదు నిమిషాల్లోనే ఎముక సాంద్రత ఎంత అన్నది తెలిసిపోతుంది. అయితే ఈ విలువను అందరిలో ఒకేలా కాకుండా వయసును పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి దీన్ని ‘టీ’ స్కోర్గా చెబుతారు. దీనితో పాటు సీరమ్ లెవల్స్ ఆఫ్ క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఆల్కలైన్ ఫాస్ఫేట్స్, ఇన్టాక్ట్ పారాథైరాయిడ్ హార్మోన్ (పీటీహెచ్) వంటి పరీక్షలు కూడా అవసరమవుతాయి. ఎముక సాంద్రతను పెంచుకోవాలంటే... ముందు చెప్పుకున్నట్లుగానే ఎముక సాంద్రతకు మంచి బీజం యుక్తవయసులోనే పడాలి. పైగా ఎముక సాంద్రత పెరగడానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ పెద్దగా ఖర్చు లేకుండానే స్వాభావికంగా జరిగేవే ఎక్కువ. కాబట్టి పిల్లలందరినీ యుక్తవయసులోకి వచ్చే ముందు క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని అంటే పాలు, పెరుగు, బ్రకోలీ వంటి తాజా కూరలు ఎక్కువగా తీసుకునేలా చూడాలి. అలాగే ఆరుబయట ఎండకు ఎక్స్పోజ్ అవుతూ ఎక్కువసేపు ఆడేలా ప్రోత్సహించాలి. దీనివల్ల శరీరంలో విటమిన్ ‘డి’ ఎక్కువగా తయారవుతుంది. మనం తీసుకున్న ఆహార పదార్థాల్లోని క్యాల్షియమ్ను ఎముకల్లోకి ఇంకేలా చేస్తుంది విటమిన్ ‘డి’. అందుకే కేవలం క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకున్నంత మాత్రాన కాకుండా... విటమిన్ ‘డి’ వల్ల కూడా ఎముకలకు బలం చేకూరుతుంది. దీనితో పాటు ఆ సమయంలో వారు తగినంతగా శారీరక శ్రమ, వ్యాయామం చేసేలా చూస్తే పిల్లలు బలంగా మారడమే కాకుండా, వారు మంచి బలంగా తయారవుతారు. చాలాకాలం... అంతెందుకు వృద్ధాప్యంలోనూ వారు ఇంచుమించుగా దాదాపుగా అంతే బలంతో ఉంటారు. ఎముక సాంద్రతను నిర్ణయించే అంశాలు... మనలోని చాలా అంశాలు ఎముక సాంద్రతతో కీలక భూమిక పోషిస్తాయి. ఉదాహరణకు ఒకరి జన్యువుల్లోనే ఎముక సాంద్రత అధికంగా ఉండే గుణం ఉంటుంది. దాంతోపాటు వ్యాయామం / శారీరక శ్రమ, క్యాల్షియమ్ తీసుకోవడం, విటమిన్ ‘డి’ని గ్రహించడం వంటి అంశాలు కూడా ఎముక సాంద్రతకు దోహదపడతాయి. ఇక పొగతాగడం, మద్యపానం, తరచూ జబ్బుపడటం, శారీరక శ్రమ చేయకుండా ఒక చోట కూర్చొని పనిచేయడం లేదా బద్దకంగా ఉండటం, కొన్ని రకాల మందులు (గ్లూకోకార్టికాయిడ్స్, యాంటీ ఎపిలెప్టిక్ మందులు) తీసుకోవడం వంటి అంశాలు ఎముక సాంద్రతను గుల్లబార్చి అవి బలహీనంగా మారేలా చేస్తాయి. యౌవన దశే కీలకం మన బాలలు యౌవన ప్రవేశకాలంలో ఎక్కువగా క్యాల్షియమ్ ఉండే ఆహారాన్ని తీసుకోవడం, ఆ సమయంలో ఎక్కువగా విటమిన్ ‘డి’ని గ్రహించేలా ఆరుబయట తిరగడం, వ్యాయామం చేయడం వంటివి చేయాలి. ఎందుకంటే ఆ సమయంలో సమకూర్చుకున్న ఎముక సాంద్రత దాదాపు జీవితకాలమంతా రక్షణ ఇస్తుంది. ఆ సమయంలో ఎంత ఎక్కువ సాంద్రతను గ్రహిస్తే, క్రమంగా కోల్పోయే దశ ప్రారంభమైనా కూడా అది చాలాకాలం ఉండేలా తోడ్పడుతుంది. ఆ సమయంలో దురలవాట్లకు చేరువ కావడం, వ్యాయామం చేయకపోవడం వంటివి చేస్తే అది ఆ తర్వాత కాలంలోనూ నష్టం చేకూరుస్తుంది. డాక్టర్ కె. సుధీర్రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్మార్క్ హాస్పిటల్స్, కేపీహెచ్బీ, హైదరాబాద్ -
ఆర్థరైటిస్ నివారణకు తేలిక మార్గాలు
ఒక వయసు దాటాక ఎముకలు అరిగిపోవడం సహజం. పైగా వయసు పెరుగుతున్న కొద్దీ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు మరీ ఎక్కువ. ఇలా ఎముకలు అరిగిపోవడం వల్ల వచ్చే ఆర్థరైటిస్ సమస్యను కొన్ని సాధారణ జాగ్రత్తల ద్వారా నివారించుకోవచ్చు. అవేమిటో తెలుసుకోండి. చాలాకాలం పాటు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ►స్థూలకాయం వల్ల మీ ఒంటి బరువు ఎముకలపై పడి ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి. ►మన శరీర కదలికలు చురుగ్గా ఉండేలా చూసుకోవాలి. కూర్చుని చేసే వృత్తుల్లో ఉండేవారు వారంలో కనీసం ఐదు రోజుల పాటు రోజూ 30 నిమిషాలు వేగంగా నడవడం వంటి వ్యాయామాలు చేయాలి. ►మరీ ఎక్కువగా కీళ్లు అరిగే అవకాశం ఉన్నవారు కీళ్లకు తగినంత విశ్రాంతి కల్పించాలి. వేగంగా పరుగెత్తే తరహా వ్యాయామాలు చేసేవారు తమ స్పోర్టింగ్ యాక్టివిటీస్ను తగ్గించాలి. దానికి బదులు వేగంగా నడవడం మంచిది. తమ ఒంటి బరువును గణనీయంగా తగ్గించే ఈదడం (స్విమ్మింగ్ ఎక్సర్సైజ్) ఇంకా మంచిది. ►కాళ్లు మడిచి, బాసిపట్లు వేసి కూర్చోవడం (స్క్వాటింగ్) మంచిది కాదు. వీలైనంత వరకు కుర్చీ లేదా బల్ల వంటి వాటి మీద కూర్చోవాలి. ►పాల వంటి క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ►మెనోపాజ్ వచ్చిన మహిళల్లో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ►కీళ్లలో నొప్పి కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను తప్పక సంప్రదించాలి. -
ఆమె ఆరోగ్యం
సాక్షి మహిళలను జాగృతం చేయడానికిమహిళల్లో ఉన్న శక్తిని సమాజానికే కాదు... వారికీ తెలిసేలా చేయడానికి ఎప్పుడూ ముందడుగు వేస్తూనే ఉంది. కాపాడుకోవడం... పరిరక్షించుకోవడం... సమాధాన పరచడం... పరామర్శించడంఇవి కాదు మహిళలకు కావల్సింది. వారిలో ఉన్న శక్తికి అద్దం పట్టాలి.‘నువ్వే శక్తి’ అని మహిళలకు సాక్షి గుర్తు చేస్తోంది.మహిళ అంటే మాకు గౌరవం... మాకు స్ఫూర్తి!మా అక్షరానికి శక్తి... జై స్త్రీ శక్తి!! ఆకుకూరలు... ఇందులో ఉండే మెగ్నీషియం, విటమిన్ కె, విటమిన్ సి, ఫైటో న్యూట్రియెంట్స్ వల్ల ఎముకలు దృఢంగా, బలంగా పెరుగుతాయి. తృణధాన్యాలు... బ్రౌన్ రైస్, కినోవా జీర్ణశక్తిని బలపరుస్తాయి. జీర్ణకోశం స్వచ్ఛంగా ఉంటే, మలబద్దకాన్ని, కోలన్ క్యాన్సర్ని నివారించుకోవచ్చు. నట్స్... శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. బాదం పప్పులలో ఎముకలను దృఢపరిచే గుణాలు ఉన్నాయి. పిస్తాలలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6లు ఎక్కువగా ఉన్నాయి. కోడిగుడ్లు... ఇందులో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఉల్లిపాయలు... ఉల్లిపాయలలో ఎముకలకు బలాన్ని కలిగించే శక్తి ఎక్కువ. రోజుకో ఉల్లిపాయ తినడం వల్ల ఎముకలలో రోజుకి ఐదు శాతం చొప్పున శక్తి సమకూరుతుంది. 50 సంవత్సరాలు దాటిన మహిళల మీద .జరిపిన పరీక్షలో తుంటి ఎముక విరగడం అనేది 20 శాతం తక్కువ కనిపిస్తోంది. పెరుగు... పెరుగు లేదా మజ్జిగను ఎక్కువగా తీసుకోవాలని ప్రాచీన కాలం నుంచి చెబుతున్నారు. ఇందులో ఉండే ప్రోబయాటిక్ బ్యాక్టీరియా... జీర్ణక్రియను సవ్యంగా సాగేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది. టొమాటోలు... టొమాటోలు తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. పాలు... ఇందులో ఉండే క్యాల్షియం, పొటాషియం, విటమిన్ బి 12 వంటివి ఉంటాయి. ఇవి ఎముకలకు దృఢత్వాన్ని ఇస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్, కాలన్ క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి. అరటిపళ్లు... ఇందులో ఉంటే పొటాషియం, శరీర వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. మలబద్దకాన్ని దూరం చేస్తుంది. -
ఎముకల వైద్యంలో నిమ్స్కు గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: బొక్కల దవాఖానాగా గుర్తింపు పొందిన ప్రతిష్టాత్మక నిమ్స్(నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్) ఆస్ప త్రి అందుకు తగ్గట్లుగానే ఎముకల చికిత్సల విభాగంలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఢిల్లీలోని ఎయిమ్స్కు ఏమాత్రం తీసిపోకుండా చికిత్సలు చేయడమే కాదు.. టాప్–5 ఆస్పత్రుల జాబితాలో చోటు సంపాదించింది. ఈ చికిత్సల్లో ఎయిమ్స్ మొద టిస్థానంలో ఉండగా, తమిళనాడులోని వేలూరు సీఎంసీ రెండోస్థానంలో, చండీగఢ్లోని పీజీఐ మూడోస్థానంలో నిలిచాయి. ఆ తర్వాతిస్థానంలో నిమ్స్ ఉన్నది. అత్యంత క్లిష్టమైన స్పైన్ స్కోలియోటిక్ (వెన్నెముక వంకరగా ఉండటం) చికిత్సల్లో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఆర్థోపెడిక్ విభాగంలో గతేడాది 3 వేలకుపైగా సర్జరీలు నిర్వహించారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో కేవ లం రెండుశాతం చికిత్సలు జరుగగా, 98 శాతం కేసులు ఇక్కడే జరుగుతున్నాయి. ఈ చికిత్సకు కార్పొరేట్ దవాఖానాల్లో రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చవుతుండగా నిమ్స్లో కేవలం రూ.1.5 లక్షలకే నిర్వహిస్తున్నారు. మోకాలు, కీళ్ల మార్పిడి చికిత్సలకు నిమ్స్లోని ఆర్థోవిభాగం ప్రత్యేక గుర్తింపు పొందింది. -
మహిళల బోలు ఎముకల సమస్యకు కొత్త పరిష్కారం
ప్రపంచవ్యాప్తంగా కనీసం 20 కోట్ల మందిని ఇబ్బంది పెడుతున్న ఆస్టియోపొరోసిస్ (బోలు ఎముకల వ్యాధి)కు సరికొత్త చికిత్స లభించనుంది. అంతా కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితం. ఎలుకల మెదళ్లలో కొన్ని న్యూరాన్లను తొలగించినప్పుడు అవి విపరీతంగా బరువు పెరగడాన్ని గుర్తించిన డాక్టర్ కొరేరా ఆ దిశగా మరిన్ని పరిశోధనలు చేపట్టారు. పెరిగిన బరువు కండరాలు, కొవ్వుల్లో కాకుండా ఎముకల్లో మాత్రమే ఉండటం.. ఖనిజ సాంద్రత కూడా ఎక్కువ కావడం గుర్తించిన కొరేరా ఈ పద్ధతిని బోలు ఎముకల వ్యాధి చికిత్సకు వాడవచ్చునని గుర్తించారు. మహిళల్లో రుతుక్రమం ఆగిపోయిన తరువాత ఎముకలు బోలుగా మారిపోవడం ఎక్కువన్నది తెలిసిందే. సాధారణ ఎలుకలతో పోలిస్తే ఈస్ట్రోజెన్ రిసెప్టర్ ప్రొటీన్లు తొలగించిన వాటిల్లో ఎముకల ద్రవ్యరాశి దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉండటం తాము గమనించామని... మెదడులోని హైపోథాలమస్లో ఇలాంటి ప్రొటీన్లు కొన్ని వందల రకాలు ఉన్నట్లు తెలుసుకున్నామని కొరేరా వివరించారు. ముదిమి వయసులో ఈ న్యూరాన్లు ఎముకల పెరుగుదలకు తక్కువ శక్తిని కేటాయించేలా సంకేతాలు పంపడం వల్ల ఎముకలు గుల్లబారుతున్నట్లు తాము భావిస్తున్నామని చెప్పారు. ఈ న్యూరాన్లను ఎలా నియంత్రించాలన్న అంశాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నామని.. అది తెలిస్తే వయసు మళ్లిన తరువాత కూడా ఎముకలు దృఢంగా ఉండేలా చేయడం సాధ్యమవుతుందని అన్నారు. -
టెండ నైటిస్ తగ్గుతుందా?
నా వయసు 42 ఏళ్లు. నేను క్రికెట్ ఎక్కువగా ఆడతాను. ఇటీవల కొంతకాలంగా చేయి కదిలించినప్పుడు భుజంలో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్ను సంప్రదిస్తే టెండన్స్కి సంబంధించిన వ్యాధి అని చెప్పారు. ఎన్ని మందులు వాడుతున్నా సమస్య నుంచి ఉపశమనం లభించడం లేదు. హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? మీరు వివరంగా తెలిపిన లక్షణాలను బట్టి మీరు టెండినైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మన శరీరంలోని కండరాలను ఎముకలతో జతపరిచే తాడు లాంటి కణజాలాన్ని టెండన్స్ అని అంటాము. ఇవి ఫైబ్రస్ కణజాలంతో ఏర్పడతాయి. వీటికి సాగగల గుణం ఉండటం వల్ల ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. కాబట్టి అవి కండరాలు ముడుచుకునే సమయంలో, ఎముకలు, కీళ్ల కదలికలకు సహకరిస్తాయి. ఏ కారణం చేతనైనా వీటికి హానికలిగితే, కదలికలు ఇబ్బందికరంగా మారి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఈ టెండన్స్ ఇన్ఫెక్షన్కు గురికావడాన్ని టెండినైటిస్ అంటారు. శరీరంలో ఎక్కడైనా ఏర్పడే ఈ సమస్య... భుజాలలో, మోచేతుల్లో, మణికట్టు, బొటనవేలు మొదటి భాగంలో, తుంటి, మోకాలు, మడమలు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఏ వయసు వారిలోనైనా కనిపించే ఈ సమస్య ఎక్కువగా పెద్దవయసు వారిలో (ముఖ్యంగా 40 ఏళ్లు పైబడినవారిలో) కనిపిస్తుంది. ఆ వయసు వారిలో సాధారణంగా టెండాన్స్ సాగేతత్వం, ఒత్తిడిని తట్టుకునే శక్తి తగ్గిపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. కారణాలు:వయసు పెరగడం, గాయం కావడం. ∙వృత్తిరీత్యా లేదా హాబీల కారణంగా టెండన్స్పై అధిగ ఒత్తిడి కలిగించే ఒక రకమైన కదలికలను ఎక్కువగా కొనసాగించడం. ఉదా: కంప్యూటర్ కీ–బోర్డులు, మౌస్లు ఎక్కువగా వాడటం, కార్పెంటింగ్, పెయింటింగ్ మొదలైనవి. క్రీడల వల్ల... పరుగెత్తడం, టెన్నిస్, బాస్కెట్బాల్, గోల్ఫ్, బౌలింగ్ మొదలైనవాటివల్ల డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్థూలకాయం వంటి ఇబ్బందులతో బాధపడేవారిలో ఈ సమస్యకు గురయ్యే అవకాశం ఉంది ∙కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఈ టెండినైటిస్ సంభవించే అవకాశం ఉంది. లక్షణాలు:∙టెండినైటిస్కి గురైన ప్రదేశంలో నొప్పి, బిగువుగా ఉండటం ∙ఆ భాగాన్ని కదిలించినప్పుడు నొప్పి అధికమవ్వడం ∙కొన్ని రకాల శబ్దాలు వినిపించడం, వాపు, చేతితో తాకితే ఆ ప్రదేశం వేడిగా అనిపించడం ∙ఎర్రగా మారడంవంటి లక్షణాలను గమనించవచ్చు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ∙కంప్యూటర్లను, కీబోర్డులను, మౌస్లను సరైన పొజిషన్లో సర్దుబాటు చేసుకోవడం పనిలో కొంత విశ్రాంతి తీసుకోవడం వ్యాయామాలు ఒకేసారి అధిక ఒత్తిడికి గురిచేసేలా కాకుండా నెమ్మదిగా ప్రారంభించడం క్రీడలలో కోచ్ సలహా మేరకు జాగ్రత్తలు పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు. చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శారీరక పరిస్థితులు, తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించండం ద్వారా రోగి తాలూకు రోగ నిరోధకశక్తిని సరిచేయడం వల్ల ఎలాంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నా దానిని నయం చేయడమే కాకుండా టెండన్స్ను దృఢపరచి సమస్యను సమూలంగా దూరం చేయడం జరుగుతుంది. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ ఉబ్బిన రక్తనాళాలు, చికిత్స చెప్పండి నా వయసు 46 ఏళ్లు. కనీసం పది నిమిషాల పాటు నిల్చోలేకపోతున్నాను. కాళ్లు లాగుతున్నాయి. కాళ్లపై నరాలు ఉబ్బి పాదాలు నలుపు రంగులోకి మారుతున్నాయి. దీనికి హోమియోలో పరిష్కారం ఉందా? మీకు ఉన్న సమస్యను వేరికోస్ వెయిన్స్ అంటారు. శరీరంలోని సిరలు బలహీనపడటం వల్ల ఈ వేరికోస్ వెయిన్స్ సమస్య వస్తుంది. ఈ సమస్యలో రక్తనాళాల రంగు మారడం లేదా నలుపు రంగుకి రావడం జరుగుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, అవగాహన లేమి వల్ల ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చి ఇతర సమస్యలకు దారితీస్తోంది. సాధారణంగా రక్తం కింది నుంచి గుండెవైపునకు వెళ్లే సమయంలో భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో రక్త సరఫరా అవుతుండటం వల్ల రక్తప్రసరణ మందగించడం, కాళ్ల ఒత్తిడి పెరగడం జరగవచ్చు. ఈ క్రమంలో సిరలు (రక్తనాళాలు) నలుపు లేదా ఊదా రంగుకు మారుతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడి నడవడానికీ వీలు కాదు. ఈ వేరికోస్ వెయిన్స్ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలలోనూ వస్తుంది కానీ 80 శాతం కేసుల్లో ఇది కాళ్లపైనే కనిపిస్తుంది. సాధారణంగా 30 ఏళ్ల పైబడిన వారిలో ఈ వేరికోస్ వెయిన్స్ కనిపిస్తుంది. మహిళలు, స్థూలకాయులు, వ్యాయామం చేయనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు:ముందుకు ప్రవహించాల్సిన రక్తం వెనకకు రావడం ∙కొంతమంది మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు ∙ఎక్కువ సేపు నిలబడి చేయాల్సిన ఉద్యోగాల్లో (పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, కండక్టర్, వాచ్మేన్, సేల్స్మెన్, టీచర్లు వంటి) ఉద్యోగాలలో ఉండేవారికి ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు:కాళ్లలో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం ∙కొద్దిసేపు నిలబడితే నొప్పి రావడం, దాని తీవ్రత పెరుగుతూ పోవడం ∙చర్మం దళసరిగా మారడం ∙చర్మం ఉబ్బడం, పుండ్లు పడటం. వ్యాధి నిర్ధారణ:అల్ట్రాసౌండ్, డ్యూప్లెక్స్ డాప్లర్ అల్ట్రా సౌండ్. చికిత్స:వేరికోస్ వెయిన్స్, వేరికోసిల్ వంటి వ్యాధులకు హోమియోపతి చికిత్సలో అనుభవం ఉన్న, పరిశోధనల అనుభవం ఉన్న వైద్యులు చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతను పరిశీలించి, రోగి వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఆపరేషన్ అవసరం లేకుండానే మంచి మందులు సూచిస్తారు. హోమియోలో ఈ సమస్యకు హామామెలిస్, పల్సటిల్లా, కాల్కేరియా, గ్రాఫైటిస్, కార్బోవెజ్, ఆర్నికా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఒళ్లంతా తెల్లమచ్చలు పెరుగుతున్నాయి... తగ్గేదెలా? నా వయసు 39 ఏళ్లు. నా శరీరమంత తెల్లమచ్చలు వచ్చాయి. మొదట్లో కాస్త చిన్నవిగా ఉండి, ఇప్పుడు క్రమంగా పెద్దవవుతూ అందరూ గమనించేలా ఉంటున్నాయి. ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నాను. నాకు హోమియోలో పరిష్కారం సూచించండి. శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్దది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, నరాలతో పాటు చర్మం చాయకు కారణమైన మెలనోసైట్స్ కూడా ఉంటాయి. ఏప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. ఇప్పుడు మీరు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల లోపిస్తుంది. దాంతో మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది. ►బొల్లి వ్యాధికి ముఖ్యమైన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఇది స్త్రీ, పురుషుల తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రావచ్చు. డిప్రైషన్, యాంగై్జటీ న్యూరోసిస్ మొదలైన మానసిక పరిస్థితులు దీనికి దారితీయవచ్చు. ►పోషకాహారలోపం కూడా బొల్లి వ్యాధికి దారితీయవచ్చు. ►జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా కూడా వ్యాధి రావచ్చు. దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు : ఆహారంలో రాగి, ఇనుము మొదలైన ధాతువులు లోపించడం వల్ల విటమిన్లు, ప్రోటీన్ల వంటి పోషకాహార లోపం వల్ల గానీ, అమీబియాసిస్, బద్దెపురుగుల వంటి పరాన్నజీవుల వల్లగానీ తెల్లమచ్చలు కనిపించవచ్చు. ►మందులు, రసాయనాలు దుష్ఫలితాలు, క్వినోన్స్, క్లోరోక్విన్, యాంటీబయాటిక్స్ వంటి పరిశ్రమల్లో పనిచేయడం లేదా వాటిని సరైన మోతాదులో వాడకపోవడం వల్ల కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ►కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్స్ లోపాలు, డయాబెటిస్లో వంటి వ్యాధులలో తెల్లమచ్చలు ఎక్కువగా కనిపించే వీలుంది. ►వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం, మన వ్యాధి నిరోధకత మనకే ముప్పుగా పరిణమించే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల మన సొంతకణాలే మనపై దాడి చేయడం వల్ల కూడా బొల్లి సోకే అవకాశం ఉంది. లక్షణాలు: మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాల్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు. చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
పెరుగుతో జలుబు దూరం!
టెక్సాస్: పెరుగు ఆరోగ్యానికి మంచిది. ఎముకలను దృఢంగా చేయడమే కాకుండా రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అయితే జలుబు చేసినప్పుడు ఎక్కువ అవుతుందని చాలామంది పెరుగుకు దూరంగా ఉంటారు. కానీ పెరుగు జలుబు లక్షణాలను తగ్గిస్తుందని అమెరికాలోని నేషనల్ డైరీ కౌన్సిల్లోని న్యూట్రీషియన్ రీసెర్చి వైస్ ప్రెసిడెంట్ మైకీ రుబిన్ తెలిపారు. పెరుగులో ఉండే జింక్, ప్రోబయాటిక్స్లు జలుబును నియంత్రించడంలో తోడ్పడతాయని పేర్కొన్నారు. -
ఆ వయసులో ఎముకలు విరిగితే అంతే..
కాన్బెర్రా : యాభై ఏళ్లు పైబడిన తర్వాత ఎముకలు విరగటం వల్ల తొందరగా మరణించే అవకాశాలు ఎక్కువని తాజా పరిశోధనలో తేలింది. 50ల తర్వాత ఎముకలు విరిగిన వారు 10సంవత్సరాలు ముందుగా చనిపోయే అవకాశం ఉందని వెల్లడైంది. ఆస్ట్రేలియాకు చెందిన ‘‘గర్వాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇన్ ఆస్ట్రేలియా’’ జరిపిన పరిశోధనల్లో పలు విషయాలు వెలుగుచూశాయి. వయసు పైబడిన వారిలో.. నడుము ఎముకలు విరగటం వల్ల 10సంవత్సరాలు, శరీరంలోని మిగిలిన ఎముకలు విరగటం ద్వారా 5సంవత్సరాలు ముందుగా చనిపోయే అవకాశం ఉందని తెలిపింది. 2001లో డెన్మార్క్లోని 50ఏళ్లు పైబడిన వారు ఎముకలు విరగటం మూలంగా పది సంవత్సరాలు తొందరగా చనిపోయారని పేర్కొంది. ఈ ప్రమాదం మగవారిలో 33శాతం ఉంటుందని, ఆడవారిలో 20 ఉంటుందని వెల్లడించింది. పరిశోధకుడు జాక్వెలిన్ సెంటర్ మాట్లాడుతూ.. ఎముకలు విరగటం అన్నది ఆరోగ్య సమస్యలు రావటానికి ప్రధాన కారణమని, నయం కావటానికి ఎక్కువ సమయం పట్టటమే కాకుండా తొందరగా మరణం సంభవిస్తుందని పేర్కొన్నారు. ఎముకలు విరగటానికి గల కారణాలను అన్వేషించి దానికి అనుగుణంగా చికిత్స చేసే విధానాలను కనుగొనే ప్రయత్నంలో ఉన్నామన్నారు. -
నొప్పి మెడ నుంచి చేతులకు పాకుతోంది..?
నా వయసు 53 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. నొప్పి చేతుల వరకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. హోమియోలో నా సమస్యకు పూర్తి పరిష్కారం ఉందా? – ఎన్. ఆంజనేయరెడ్డి, కర్నూలు మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. గతంలో పెద్దవారిలో కనిపించినా, జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇప్పుడిది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: ∙వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ∙క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం ∙డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ∙వృత్తి రీత్యా అధిక బరువులు మోయడం ∙ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ∙ఎక్కువ సేపు కంప్యూటర్పై పనిచేయడం, ఎక్కువ సమయం మెడను వంచి ఫోన్లలో మాట్లాడటం ∙ఎల్తైన దిండ్లు వాడటం ∙మెడకు దెబ్బతగలడం ∙మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: ∙సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ∙నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ∙మెడ బిగుసుకుపోవడం ∙తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురుకు వ్యాపించడం ∙నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ∙చిన్న బరువునూ ఎత్తలేకపోవడం ∙నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. హోమియో చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. - డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
'బొక్కలు' బుక్కుతున్నరు!
హైదరాబాద్లోని ఉప్పల్కు చెందిన ప్రైవేటు ఉద్యోగి ఎన్.రాజేశ్ ద్విచక్ర వాహనంపై ఆఫీసుకు బయలుదేరాడు. ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టడంతో అక్కడే పడిపోయాడు. వెంటనే సమీపంలోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. రెండు కాళ్లు విరిగిపోయాయి. ఆరోగ్యశ్రీ అధికారుల ఆమోదంతో ఆస్పత్రి వైద్యులు శస్త్ర చికిత్స చేసి ఇంటికి పంపారు. అయితే వెళ్లిన రెండో రోజే ఎడమ కాలిలో నొప్పి మొదలైంది. ఆస్పత్రికి వెళ్తే ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పారు. మరోసారి శస్త్ర చికిత్స చేసి పంపారు. జనగామ జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా మేస్త్రీ రమణ కాలు జారి కింద పడ్డాడు. అక్కడి నుంచి కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. మోకాలి భాగంలో శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తేల్చారు. ఆరోగ్యశ్రీ కార్డు ఆధారంగా చికిత్స చేసి పది రోజుల తర్వాత ఇంటికి పంపించారు. రెండు నెలల తర్వాత పనికి వెళ్దామంటే రమణ శరీరం సహకరించలేదు. కాలు లాగడం, తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. ఆస్పత్రికి వెళ్లి పరీక్షిస్తే ఇన్ఫెక్షన్ సోకిందని, మళ్లీ శస్త్ర చికిత్స అవసరమని చెప్పారు. రెండోసారి శస్త్ర చికిత్స చేయడంతో రమణ ఆరు నెలలపాటు ఏ పనికి వెళ్లలేకపోయాడు. ఈ రెండు కేసుల్లోనూ నాసిరకం ఔషధ పరికరాలను అమర్చడం వల్లే ఇన్ఫెక్షన్ సోకిందని ఆరోగ్యశ్రీ విజిలెన్స్ విభాగం నిర్ధారించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులు యథావిధిగా విజిలెన్స్ విభాగం సూచనలను పక్కన పెట్టేశారు. ఇలా పేద ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకం అధికారుల కక్కుర్తితో అస్తవ్యస్తంగా మారుతోంది. సేవల పరంగానే కాకుండా శస్త్ర చికిత్సల్లోనూ నాసిరకం పరికరాలను అమర్చి రోగుల జీవితాలను ప్రైవేటు ఆస్పత్రులు నాశనం చేస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ నాసిరకం వైద్యం.. ప్రమాదవశాత్తు ఎముకలు విరిగిన వారికి మెరుగైన చికిత్స అనేది కష్టంగా మారుతోంది. విరిగిన ఎముకలు మళ్లీ అతుక్కునేందుకు అవసరమైన కట్లు, శస్త్ర చికిత్సలో నాసిరకం వైద్యం ఉంటోంది. శస్త్ర చికిత్స చేసేటప్పుడు నాణ్యతలేని ప్లేట్లు, స్క్రూలను బిగిస్తున్నా.. ఆరోగ్యశ్రీ అధికారులు ఇవేమి పట్టించుకోవడంలేదు. రోగులు ఇంటికి చేరేలోపే శస్త్ర చికిత్స చేసిన ప్రదేశంలో ఇన్ఫెక్షన్లు జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ఎముకల శస్త్రచికిత్స చేయించుకున్న వారిలో గరిష్టంగా నాలుగు శాతం రోగులు మాత్రమే ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది. కానీ మన రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సల్లో మాత్రం 15 శాతం రోగులు ఇన్ఫెక్షన్కు గురవుతున్నారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ విజిలెన్స్ విభాగం పరిశీలనలో నాసిరకం శస్త్ర చికిత్సల విషయం వెలుగు చూసింది. అయినా ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. 949 రకాల చికిత్సలు ఆరోగ్యశ్రీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 949 రకాల చికిత్సలు అందిస్తోంది. పేదలకు కార్పొరేట్ వైద్యం కోసం ఏటా రూ.650 కోట్లు ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో 85 లక్షల పేద కుటుంబాల్లోని 2.75 కోట్ల మందికి ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది. ఆరోగ్యశ్రీలో ఎక్కువగా ఎముకల శస్త్ర చికిత్సలే జరుగుతున్నాయి. ఒక్కో శస్త్ర చికిత్సకు రూ.32 వేలను ఆరోగ్యశ్రీ పథకం కింద చెల్లిస్తారు. ఒకేసారి రెండు ఎముకలకు శస్త్రచికిత్స చేస్తే రూ.16 వేలు అదనంగా చెల్లిస్తారు. ప్రైవేటు ఆస్పత్రుల ఇష్టారాజ్యం మరోవైపు ఆరోగ్యశ్రీ వైద్యాధికారుల ఆమోదం లేకుండానే శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని అంతర్గత విచారణలో తేలింది. ఆరోగ్యశ్రీ మొదలైన ఏడాది (2007)లో ఎముకల చికిత్స కోసం రూ.10 కోట్లు ఖర్చయ్యేది. ప్రస్తుతం ఈ మొత్తం రూ.100 కోట్లు దాటింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎముకల వైద్య చికిత్స నిపుణులు పూర్తి స్థాయిలో లేరు. దీంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులకే వెళ్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎముకలు విరిగిన సందర్భాల్లో ఎక్కువగా శస్త్ర చికిత్సలే జరుగుతున్నాయి. విరిగిన ఎముకలు సవ్యంగా ఉండేందుకు లాకింగ్ నెయిల్స్, స్క్రూలు, క్లిప్లు, రాడ్స్ అమర్చుతారు. టైటానియంతో తయారు చేసిన పరికరాలనే వినియోగించాల్సి ఉండగా.. తక్కువ ధరకు లభ్యమయ్యే స్టెయిన్లెస్ స్టీల్ పరికరాలను వాడుతున్నారు. దీంతో ఇన్ఫెక్షన్కు గురయ్యే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎముకల చికిత్సలు, చెల్లింపులు -
డీ విటమిన్తో మరెన్నో ఉపయోగాలు
న్యూయార్క్: మానవ శరీరంలోని ఎముకలు, కండరాలు గట్టిగా, దృఢంగా ఉండాలంటే శరీరంలో చాలినంత డీ విటమిన్ ఉండడం తప్పనిసరి. శరీరంలోని కాల్షియం, ఫాస్పేట్, న్యూట్రియంట్ల పాళ్లను క్రమబద్ధీకరించడంలో డీ విటమిన్ ఎంతో ఉపయోగపడుతుంది. సూర్యరశ్మి నుంచి ఉచితంగా లభించే ఈ డీ విటమిన్ వల్ల ఇంతకుముందు అంచనా వేసిన వాటికన్నా మరెన్నో ఉపయోగాలున్నాయని ప్రపచంవ్యాప్తంగా నిర్వహించిన పలు తాజా పరిశోధనల్లో తేలింది. డీ విటమిన్ లోపం వల్ల పిల్లల్లో డయాబెటీస్ ఒకటవ రకం వస్తుంది. డీ విటమిన్ ఎక్కువ వున్న వారికంటే డీ విటమిన్ తక్కువ ఉన్న యువకులలో పెద్దవాళ్లలో గుండె జబ్బులు, కార్డియో వాస్కులర్ డిసీజ్లు వచ్చే అవకాశం రెండింతలు ఎక్కువ. డీ విజమిన్ లోపం క్యాన్సర్కు కారణం అవుతుందని తేలింది. డీ విటమిన్ ట్యాబ్లెట్లను తీసుకోవడం వల్ల క్యాన్సర్ను తగ్గించవచ్చా అన్న అంశంలో మాత్రం ఇంకా ప్రయోగాలు నిర్వహించాల్సి ఉంది. డీ విటమిన్ ట్యాబ్లెట్లను వాడడం వల్ల గుండె జబ్బులు తగ్గాయన్న అంశం ఇప్పటికే రుజువైంది. డీ విటమిన్ల వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో బ్యాక్టరీ ఇన్ఫెక్షన్లను కూడా సమర్థంగా ఎదుర్కొనవచ్చు. శిశుప్రాయంలో డీ విటమిన్ సప్లిమెంట్లను తరచుగా ఇవ్వడం వల్ల 90 శాతం మంది పిల్లల్లో డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గిందని ఫిన్లాండ్లో 30 ఏళ్లపాటు నిర్వహించిన సర్వేలో తేలింది. డీ విటమిన్ కండరాల నొప్పులు రాకుండా నిరోధిస్తుంది. అమెరికా, కెనడా లాంటి దేశాల్లో రోజుకు ఒక మనిషి 15 గ్రాముల డీ విటమిన్ తీసుకోవాలి. నేడు డీ విటమిన్ లోపమన్నది ప్రపంచ సమస్య. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద కోట్ల మంది ప్రజలు డీ విటమిన్ లోపం వల్ల బాధ పడుతున్నారు. సూర్య కిరణాలు ఎక్కువలేని ప్రాంతాలే కాదు, సంవత్సరం పొడవున సూర్య కిరణాలు ప్రసరించే దేశాల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంది. నల్ల వాళ్లుండే ఆఫ్రికా దేశాల్లో మరి ఎక్కువగా ఉంది. మాంసం, గుడ్లు, చేపల్లో లభించే డీ విటమిన్, శాకాహారమైన ఒక్క పాలల్లో మాత్రమే లభిస్తుంది. అందుకని ఎక్కువ మంది డీ విటమిన్ సప్లిమెంట్లను తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం ఎండల్లో డీ విటమిన్ ఉచితంగా లభిస్తుందిగానీ కొన్ని దేశాల సంప్రదాయ దుస్తులు సూర్య కిరణాలు చర్మాణికి సోకకుండా అడ్డు పడతాయి. -
మణికట్టులో నొప్పి...
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. నా బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, నా కుడి మణికట్టులో కొద్ది నెలలుగా తీవ్రమైన నొప్పి వస్తోంది. దాంతో ఏ పనీ చేయలేకపోతున్నాను. దాన్ని కొద్దిగా వంచినప్పుడు క్లిక్ మనే శబ్దం వచ్చి నొప్పి వస్తోంది. పరిష్కారం చెప్పండి. - చంద్రశేఖర్, విజయవాడ మణికట్టులో 15 ఎముకలు ఉంటాయి. రిస్ట్ అనేది ఎన్నో లిగమెంట్లతో కూడిన సంక్లిష్టమైన నిర్మాణం. కొన్ని చిన్న ఎముకలు విరిగినప్పుడు ఆ విషయమే మనకు తెలియదు. ఉదాహరణకు స్కాఫాయిడ్ అనే ఎముక మనం మణికట్టును గుండ్రగా తిప్పడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు కొన్ని రకాల ఎముకలు విరిగిన విషయం సాధారణ ఎక్స్రేలో తెలియపోవచ్చు కూడా. అయితే కొన్నిసార్లు రెండు, మూడు వారాల తర్వాత చేసే రిపీటెడ్ ఎక్స్రేలో తెలుస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలు స్కాఫాయిడ్ ఎముక విరిగినట్లు సూచిస్తున్నాయి. మీ సమస్య టీనోసైనోవైటిస్ లేదా రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజ్యురీ కూడా కావచ్చు. కాబట్టి ఒకసారి ‘ఆర్థోపెడిక్ సర్జన్’ను కలిసి తగిన ఎక్స్-రే పరీక్షలు చేయించుకోండి. నా వయసు 58 ఏళ్లు. నేను గత ఐదేళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్ను సంప్రదించాను. నేను ఆస్టియో ఆర్థరైటిస్తో బాధపడుతున్నానని డాక్టర్ చెప్పారు. గత కొంతకాలంగా క్యాల్షియమ్ ఇస్తున్నారు. అయినా నాకు నొప్పి తగ్గడం లేదు. దీర్ఘకాలికంగా క్యాల్షియమ్ వాడుతుంటే కిడ్నీలో రాళ్ల సమస్య వచ్చే అవకాశం ఉందని నాకు ఈ మధ్య తెలిసింది. అప్పట్నుంచి చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వగలరు. రమాసుందరి, నిడదవోలు ఆస్టియో ఆర్థరైటిస్లో మొదట ఎముకల చివరల (అంటే కీళ్ల ఉపరితలంలో) ఉండే చిగురు ఎముక (కార్టిలేజ్) క్రమంగా అరిగిపోతుంది. కార్టిలేజ్లో క్యాల్షియమ్ ఉండదు. బహుశా మీ డాక్టర్ క్యాల్షియమ్ ఇచ్చింది మీ ఆస్టియో ఆర్థరైటిస్కు అయి ఉండదు. మీ సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇచ్చే మందుల్లో భాగంగా ఆయన క్యాల్షియమ్ను సూచించి ఉంటారు. ఆర్థరైటిస్కు కేవలం క్యాల్షియమ్తో గుణం కనిపించదు. మీ మోకాలి నొప్పి తగ్గదు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ‘ఆస్టియో ఆర్థరైటిస్’కు కాకుండా...‘ఆస్టియో పోరోసిస్’ కండిషన్లో మీ ఎముకలు బలహీనం అయిపోకుండా చూడటానికి క్యాల్షియమ్ను డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేస్తారు. మీరు మరోసారి మీ డాక్టర్ గారిని సంప్రదించండి. డాక్టర్ కె. సుధీర్రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ పంచకర్మ చికిత్స... ఆయుర్వేద కౌన్సెలింగ్ పంచకర్మ చికిత్సలతో చాలా రకాల (సాధారణంగా మందులతో పూర్తిగా నయం కాని పక్షవాతం, సెరెబ్రల్పాల్సీ, సెరిబెల్లార్ అటాక్సియా, పార్కిన్సోనిజం వంటి) వ్యాధులను నయం చేయవచ్చని విన్నాం. పంచకర్మ అంటే ఏమిటో వివరించండి. - సుచిత్ర, విశాఖపట్నం ఐదు విశిష్టమైన ప్రత్యేక చికిత్స ప్రక్రియల్ని ‘పంచకర్మలు’గా ఆయుర్వేదం వర్ణించింది. అవి ‘వమన, విరేచన, నస్య, వస్తి, రక్తమోక్షణ’ ప్రక్రియలు. సుశ్రుతాచార్యుడు చెప్పిన రక్తమోక్షణకు బదులుగా ‘వస్తి’ కర్మలోనే రెండు రకాలు చెప్పాడు చరకమహర్షి (అనువాసనవస్తి, నిరూహవస్తి). వీటినే శోధన కర్మలని కూడా అంటారు. అంటే శరీరాన్ని శుద్ధిచేయటానికి ఉపకరిస్తాయన్నమాట. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యవంతుడు కూడా సందర్భోచితంగా వీటిని ఆచరించుకోవచ్చు. దాని వల్ల దేహదారుఢ్యం కలిగి, మానసిక ఉల్లాసంతో, పంచజ్ఞానేంద్రియ పటుత్వంతో సంపూర్ణ ఆయుష్కుడుగా జీవిస్తాడు. అదేవిధంగా వ్యాధి లక్షణాలన్ని తాత్కాలికంగా తగ్గించే శమన చికిత్సలతో బాటు, అవసరమైన పంచకర్మల్ని చేస్తే వ్యాధి సంపూర్ణంగా తగ్గిపోవడానికి దోహదపడుతుంది. ఇదీ శోధన కర్మకి అర్థం. అయితే ఏ వ్యాధి ఎంత మేరకు తగ్గుతుందన్నది వ్యాధి లక్షణాలు, రోగబలం, రోగి బలం, ఉపద్రవాస్థలపై ఆధారపడి ఉంటుంది. ఏ వ్యక్తికి, ఏ రోగంలో, ఏ విధమైన పంచకర్మ చేయాలో నిర్ణయించడం, కేవలం అనుభజ్ఞులైన ఆయుర్వేద వైద్య నిపుణులకు మాత్రమే సాధ్యం. చాలా సహేతుకంగా, శాస్త్రబద్ధంగా ఆచరింపజేయాలి. లేకపోతే ప్రాణాలకు కూడా ప్రమాదకరం. వీటికి ముందుగా చేసే పూర్వకర్మలు (స్నేహస్వేదకర్మలు, ఆయిల్ మసాజ్, స్టీమ్బాత్), పంచకర్మ అనంతరం చేసే పశ్చాత్ కర్మల (జఠరాగ్నివర్ధక, బలవర్ధక ఆహారవిహారాల) గురించి ఎంతగానో వివరించింది ఆయుర్వేదం. అదేవిధంగా ధారాచికిత్స, శిరోవస్తి, కటివస్తి, గ్రీవావస్తి, ఉత్తరవస్తి మొదలగు వాటి వల్ల చాలా ప్రయోజనాలు సమకూరుతాయి. ఉదాహరణకు నిద్రలేమి, ఆందోళన, మానసిక ఒత్తిడి, స్పాండిలైటిస్, కీళ్లనొప్పులు, కండరాల వ్యాధులు, సంతానలేమి, శుక్రకణ క్షీణత మొదలైన వికారాలలో పైన పేర్కొన్న చికిత్స మార్గాల ద్వారా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. అయితే పైన చెప్పిన స్నేహ, స్వేదకర్మలనే (పూర్వకర్మలు) పంచకర్మలని భావిస్తుంటారు. కానీ అది సరికాదు. ఇవి కూడా మంచి ఫలితాలనిస్తాయి. వస్తి కర్మ : మలమార్గంలో ఉండే మ్యూకస్ మెంబ్రేన్కి ఏ ద్రవ్యాన్నైనా అతివేగంగా పీల్చుకునే శోషణ క్రియా సామర్థ్యం చాలా ఎక్కువ. ఈ మార్గం ద్వారా కొన్ని ఔషధ తైలాలని, కషాయాలని... క్రమబద్ధంగా ప్రవేశపెట్టడాన్ని వస్తికర్మ అంటారు. ఈ మందుల్ని లోనికి పంపడానికి, ప్రాచీనకాలంలో ఒక పరికరం వాడుతుండేవారు. అది మేక తాలూకు ‘మూత్రాశయం’. (యూరినరీ బ్లాడర్ను సంస్కృతంలో ‘వస్తి’ అంటారు. అందువల్ల ఈ ప్రక్రియకు వస్తికర్మ అని పేరు పెట్టారు). వాతరోగాలకు వస్తికర్మ అద్భుతమైన చికిత్స. పిత్తరోగాలలో ‘విరేచన కర్మ’, కఫరోగాలకు ‘వమనకర్మ’ లను పేర్కొన్నారు. మీరు ఉదాహరించిన పక్షవాతం, పార్కిన్సోనిజం, సెరెబెల్లార్ ఎటాక్సియా మొదలైనవి ఆయుర్వేద శాస్త్రం వాతరోగాలుగా పరిగణించింది. వీటిలో కేవలం మందులకు అంతగా గుణం కనిపించదు. వస్తికర్మను, సుశిక్షితుడైన ఆయుర్వేద నిపుణులు శాస్త్రోక్తంగా (అంటే పూర్వకర్మ, ప్రధాన కర్మ, పశ్చాత్ కర్మలను... ప్రీఆపరేటివ్, ఆపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్) అమలు చేస్తే చాలావరకు మంచి ఫలితాలతో గుణం కనిపిస్తుంది. ఏదిఏమైనా, వస్తికర్మని నెలలో వారం రోజుల పాటు, కనీసం, ఆరునెలల నుంచి ఒక ఏడాది వరకు ప్రయోగించాల్సిన అవసరం ఉండవచ్చు. కాబట్టి ఇది చేయించుకోవాలంటే రోగికి అవగాహన, సహనం, ఆశావహదృక్పథం చాలా అవసరం. వీటితో బాటు ఆహార, విహార, వ్యాయామాలు, కొన్ని ఔషధాలు కూడా వైద్యుడు నిర్ణయిస్తాడు. అప్పుడే సరైన ఫలితం కనిపిస్తుంది. గమనిక : పంచకర్మలు సునాయాసంగా తమకు తాముగా ఆచరించే చికిత్సలు కావు. ఆయుర్వేద నిపుణుల ఆధ్వర్యంలోనే చేయాల్సిన చికిత్సలవి. డాక్టర్ వి.ఎల్.ఎన్. శాస్త్రిఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్నగర్, హైదరాబాద్ మంచి నిద్రకోసం చేయాల్సినవి... స్లీప్ కౌన్సెలింగ్ ఈమధ్య నాకు నిద్ర బాగా తగ్గింది. రాత్రివేళ బాగా నిద్రపట్టడం లేదు. టాబ్లెట్లు వాడకుండా నేచురల్గానే నిద్రపట్టే మార్గాలు చెప్పండి. - శరత్కుమార్, ఒంగోలు రాత్రి వేళల్లో మీరు నిద్రించే వ్యవధి తగ్గినా, ఆ మర్నాడు పగలంతా ఉల్లాసంగా ఉన్నప్పుడు మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మంచి నిద్ర కావాలనుకునే వాళ్లు ఈ కింది సూచనలు పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అవి... పొగతాగే అలవాటును పూర్తిగా మానేయాలి. బెడ్రూమ్ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. మరీ చల్లగానూ, మరీ వేడిగా లేకుండా చూసుకోవాలి. నిద్ర సమయంలో గదిలో ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి. సాయుంత్ర వేళలనుంచి కాఫీలు, టీలను, కెఫిన్ ఉండే కూల్డ్రింక్స్ తీసుకోకండి. రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయూలి. {పతీ రోజూ ఒకే నిర్ణీత వేళకి నిద్రపొండి. పగటి పూట చిన్న కునుకు (పవర్ న్యాప్) మాత్రమే చాలు. ఎక్కువసేపు నిద్రపోవద్దు. రాత్రి బాగా నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపరుునా పగటి వెలుగులో (డే లైట్) గడపాలి. పగలు వుసక వెలుగు రూమ్లలో గడిపేవారికి రాత్రివేళల్లో సరిగా నిద్రపట్టదు. గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది. నిద్రకు వుుందు పుస్తకాలు చదవడం వంటివి చేయువద్దు. నిద్రకు ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. కొందరిలో ఆల్కహాల్ నిద్ర పట్టడానికి దోహదం చేసినా అది గాఢనిద్ర దశలోకి వెళ్లనివ్వదు. దాంతో నిద్రలేచాక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు. అందుకే వుద్యం తాగాక నిద్ర వచ్చినా మెలకువ తర్వాత అలసటంతా తీరిపోరుున రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు. డాక్టర్ రమణ ప్రసాద్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఆరోగ్య ఫలం... అత్తిపండు!
తిండి గోల అత్తిపండంటే తెలంగాణలో అందరికీ అంతగా తెలియదేమోగానీ, అంజీరపండంటే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో అందరికీ తెలుసు. అంజీర అనేది హిందీపదం. ఆంగ్లంలో ఫిగ్స్ అంటారు. మర్రి, మేడి, అత్తి ఒకేజాతికి చెందినవి. అతి పురాతనమైన ఫలవృక్షాలలో అత్తి ఒకటి. దీనిని ప్రపంచవ్యాప్తంగా పండిస్తారు. ఆకులు బొప్పాయి ఆకుల్లా ఉంటాయి. 15-25 అడుగుల ఎత్తువరకు పెరుగుతాయి. దాదాపు 150 రకాలున్నప్పటికీ నాలుగైదు రకాలే బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. లేత ఆకుపచ్చ రంగులో ఉండి , పక్వానికి వచ్చాక తియ్యగా ఉండే ఈ పళ్లు మూడు నాలుగు రోజులకి మించి నిల్వ ఉండవు. అందుకే వీటిని ఎండబెడతారు. ఎండిన కొద్దీ తియ్యగా ఉంటాయి. పోషక విలువలు కూడా పెరుగుతాయి. ఎ,ఇ,కె విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఏదైనా వ్యాధిబారిన పడి కోలుకుంటున్న వారికి ఇవి తినడం వల్ల తొందరగా బలం పుంజుకుంటారు. అంతేకాదు, ఇది హృద్రోగులకు చాలా మంచిది. ఎముకలు ఫెళుసుబారకుండా ఉండాలంటే అత్తిపళ్లు తరచు తింటూ ఉండాలి. అయితే వీటిని మితంగా తినడమే మేలు... -
ఎముకలు పూడ్చి పెట్టిన పోలీసులు
వికారాబాద్ రూరల్: అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ఎముకలను శుక్రవారం పట్టణానికి దూరంగా గొయ్యి తవ్వి పూడ్చి వేశారు. కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో ఎముకల వ్యాపారం జరుగుతున్న దృష్ట్యా పోలీసులు గట్టినిఘా ఏర్పాటు చేశారు. మూడు రోజుల క్రితం ఎముకలు తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగడి వద్ద ఎముకలను తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకుని స్టేషన్కు తరలించారు. శుక్రవారం ఆ లారీ లోని ఎముకలను అనంతగిరిపల్లి దాటిన తరువాత బహిరంగ ప్రదేశంలో జేసీబీ సాయంతో గుంత తీసి అందులో పూడ్చివేశారు. -
నేను మీ చేతిని
దురదృష్టం కొద్దీ ఒకవేళ తనకు కళ్లు పోయినా, కాళ్లు పోయినా అంతకంటే ఘోరం ఉండదనుకుంటాడు ఆనంద్. అయితే, నన్నూ, నా భాగస్వామిని కోల్పోతే మాత్రం అతడికి అంతకు మించిన కష్టం తప్పదు. నేను ఆనంద్ కుడి చేతిని. ఆనంద్ శరీరంలో నేనూ, నా భాగస్వామి కీలకమైన దేహ యంత్ర భాగాలం. ఆనంద్ శరీరంలోని ఇతర భాగాల్లాగానే మేము కూడా అతడి మెదడు అధీనంలో పనిచేస్తుంటాం. మెదడే నియంత్రణలోనే పనిచేస్తుంటాం చాలా మానవ నిర్మిత యంత్రాలన్నీ నా ముందు బలాదూరే! ఆనంద్ నైపుణ్యం గల టైపిస్ట్ అనుకోండి... నేనూ, నా భాగస్వామి కలిసి నిమిషానికి 120 పదాలను అలవోకగా టైప్ చేసేస్తాం. మమ్మల్ని నియంత్రించడానికే మెదడులో రెండు ప్రత్యేక భాగాలు పనిచేస్తుంటాయి. మెదడులో అవి ఉన్న ప్రదేశాన్నే ‘మోటార్ కార్టెక్స్’ అంటారు. ఆనంద్ తన బొటనవేలిని ఆడిస్తున్నాడనుకోండి... చాలా చిన్నగా కనిపించే ఈ చర్య కోసం మెదడు నుంచి... ఈ కండరాన్ని కొంచెం ముడుచుకోనీ, ఆ కీలును రిలాక్స్ కానివ్వు... వంటి వేలాది ఆదేశాలు అందుతూ ఉంటాయి. ఆనంద్ నిద్రపోతున్నప్పుడు తప్ప నేనూ, నా భాగస్వామి ఎప్పుడూ ఖాళీగా ఉండలేదు. ఆనంద్ జీవితకాలంలో కనీసం రెండున్నర కోట్ల సార్లు అతడి పిడికిలి ముడుచుకోవడానికి, తెరుచుకోవడానికి దోహదపడేది మేమే. ఆనంద్ శరీరం బరువుకు సపోర్ట్ చేయడానికి తగినంత బలం ఉంటుంది మాకు. ఆనంద్ ముంజేతి కండరాల్లో ఉండే శక్తి ఫలితంగా బిగించి పట్టే అతడి పట్టు బలం 45 కిలోల వరకు ఉంటుంది. ఒకవేళ ఆనంద్ క్రమం తప్పని వ్యాయామంతో దృఢంగా ఉన్నాడనుకోండి అప్పుడు అతడి పట్టు బలం 60 కిలోల కంటే ఎక్కువే ఉంటుంది. నాలో 27 ఎముకలు ఉంటాయి భౌతికమైన పనులు చేయడంలోనే కాదు, మేధా వికాసంలోనూ మా పాత్ర ఉందని గర్వంగా చెప్పుకోగలం. గణితశాస్త్రం అభివృద్ధిలో మాది కీలక పాత్ర. నాకు, నా భాగస్వామికి ఉన్న పది వేళ్లతో పాటు, అతడి రెండు పాదాలకూ ఉండే పదివేళ్లు దశాంశ విధానాన్ని కనుగొనడానికి ఎంతగానో దోహదపడ్డాయి. ఇతర అవయవాలతో పోలిస్తే, నిర్మాణపరంగా నేను చాలా సంక్లిష్టంగా ఉంటాను. నా మణికట్టులో 8 ఎముకలు, అరచేతిలో 5 ఎముకలు, వేళ్లలో 14 ఎముకలు- నాలో మొత్తం 27 ఎముకలు ఉంటాయి. నా భాగస్వామిలో కూడా ఇదే సంఖ్యలో ఎముకలు ఉంటాయి. ఆనంద్ శరీరంలో ఉండే మొత్తం ఎముకల్లో నాలుగో వంతు కంటే ఎక్కువ ఎముకలు మాలోనే ఉంటాయి. నాలోని ప్రతి చదరపు సెంటీమీటర్లోనూ వేలాది నరాల చివర్లు అనుసంధానమై ఉంటాయి. వీటి ద్వారానే వేడి, చల్లదనం, స్పర్శ తెలుసుకోగలుగుతాను. వేరు చేసే వేలిముద్రలు ఆనంద్ కడుపులో ఉండగా నాలుగో నెలలోనే వేలిముద్రలు ఏర్పడతాయి. ఒకరికి ఉండే వేలిముద్రలు ప్రపంచంలో వేరొకరికి ఉండనే ఉండవు. వేలిముద్రలే ఆనంద్ ఉనికిని ఇతరుల నుంచి వేరుచేసే ఆధారాలు. ఇక నా అరచేతుల్లో చాలా స్వేదగ్రంథులు ఉంటాయి. లక్షలాది ఏళ్ల కిందట ఆనంద్ పూర్వీకులు ఎక్కువగా చెట్ల మధ్య తిరుగాడేవారు. కొమ్మలను పట్టుకుని వేలాడటంలో చెమ్మదేరిన అరచేతులు వాళ్లకు మంచి పట్టు ఇచ్చేవి. ఇప్పుడు కూడా ఆనంద్కు క్రికెట్ బ్యాట్ పట్టుకోవడంలోను, కారు స్టీరింగ్ పట్టుకోవడంలోను చెమ్మదేరిన అరచేతులే చక్కని పట్టు ఇస్తాయి. ఇవీ నా కష్టాలు ఆనంద్ చేసే పనుల్లో చాలా వరకు కీలక పాత్ర పోషించే నాకు చాలా కష్టాలు కూడా ఉన్నాయి. అతడు ప్రమాదాలకు గురైనప్పుడు తరచు గాయపడేది నేనే. వంటపని చేస్తున్నప్పుడు కాలడం, కూరగాయలు తరుగుతున్నప్పుడు కోసుకోవడం, మట్టి పనులు ఏవైనా చేసినప్పుడు కమిలిపోవడం వంటి బాధలు నాకు ఎదురవుతూ ఉంటాయి. ఇవి కాకుండా, తరచు ఫంగస్ ఇన్ఫెక్షన్లు సోకడం, సొరియాసిస్ వంటి చర్మవ్యాధులకు, అలెర్జీలకు కూడా గురవుతూ ఉంటాను. ఆర్థరైటిస్ వంటి ఇక్కట్లు నాలోని కీళ్లకు తీవ్రమైన నొప్పులు కలిగిస్తాయి. ప్రమాదవశాత్తు బలమైన దెబ్బలు తగిలినప్పుడు నా టెండన్లు, లిగమెంట్లు దెబ్బతింటాయి. ఒక్కోసారి ఎముకలు కూడా విరిగిపోతూ ఉంటాయి. తగిన చికిత్సలతో ఈ బాధలు నయమవుతూ ఉంటాయి. అదృష్టవశాత్తు నాకు క్యాన్సర్ సోకే అవకాశాలు మాత్రం చాలా చాలా అరుదు. ఇతర అవయవాలకు ప్రత్యామ్నాయం మేమే! ప్రపంచంలో దాదాపు 95 శాతం మందికిలాగే ఆనంద్ది కూడా కుడిచేతి వాటమే. అతడు శిశువుగా ఉన్నప్పుడు తొలి ఆరునెలల్లోనే తన చేతి వాటాన్ని ఎంచుకున్నాడు. ఆనంద్ పూర్వీకులు నిటారుగా నిలుచునే భంగిమను ఎంచుకోకుంటే, మనుషులు అతి దుర్బలమైన జీవులుగా మిగిలిపోయేవారు. ఏ పులికో, సింహానికో పలారమైపోయేవారు. నిటారుగా నిలబడే భంగిమ కారణంగానే చేతులు స్వేచ్ఛను పొందాయి. మెదడు కూడా అందుకు అనుగుణంగా పరిణామం చెందింది. ఫలితంగా చేతులు ఆయుధాలను ఉపయోగించడం సహా రకరకాల నైపుణ్యాలను నేర్చుకున్నాయి. కళ్లకు, గొంతుకు, చెవులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడగల సామర్థ్యం మాది. ఆనంద్కు ఒకవేళ చూపుపోయిందనుకోండి... బ్రెయిలీ లిపిని చదవడానికి అతడి మమ్మల్ని వాడుకోవచ్చు. ఒకవేళ మూగ బధిరుడయ్యాడనుకోండి... సైగల భాష ద్వారా ఇతరులతో సంభాషించడానికి మేమే ఉపయోగపడతాం. మా స్పర్శజ్ఞానం గొప్పది. ఆనంద్ జేబులోంచి ఐదురూపాయల నాణెం తీయాలనుకోండి... జేబులోకి చూడకుండానే, వేళ్లతో తడిమి కచ్చితంగా అదే నాణేన్ని బయటకు తీయగలడు. బొటనవేలే కీలకం నాలో ఎక్కువగా పనిచేసే భాగాలు వేళ్లే. నాలుగు వేళ్లూ ఎంత పనిచేసినా, వాటికి వ్యతిరేకంగా బొటనవేలు లేకుంటే మాత్రం అవి అంత పనిచేయలేవు. బొటనవేలి సాయం లేకుండా ఆనంద్ను ఓ గ్లాసు నీళ్లు పెకైత్తమనండి చూద్దాం... పోనీ అంతొద్దు... పెన్ను తీసుకుని మిగిలిన నాలుగు వేళ్ల సాయంతోనే ఏదైనా రాయమనండి చూద్దాం. నేను చేసే పనుల్లో దాదాపు 45 శాతం బొటనవేలి సాయంతోనే సాధ్యమవుతాయి. బొటనవేలి సాయమే లేకపోతే ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా దాదాపు అసాధ్యంగా అనిపిస్తాయి. నాలో ఒకదానికి మరొకటిగా అతుక్కుని ఉండే ఎముకల మధ్య సున్నితమైన టెండన్లు, లిగమెంట్లు వాటి కదలికలకు దోహదపడతాయి. వాటిపై కనెక్టివ్ టిష్యూలతో పొరలా ఉండే ఫ్యాషియా నరాలు, రక్తనాళాలు వంటి ఇతర అంశాలకు పునాదిలా పనిచేస్తుంది. నాలో లెక్కలేనన్ని రక్తనాళాలు ఉంటాయి. -
పొలాల్లో ఎముకల దహనం
ఎడపల్లి: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ శివారులో కొంతమంది పశువుల ఎముకలను ఆరబెట్టడంతో ఆదివారం స్థానిక యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎముకలపై కిరోసిన్, డీజిల్ పోసి నిప్పంటిచారు. కొంత కాలంగా పంట పొలాల్లో పశువుల ఎముకలను ఆరబెట్టడంతో తీవ్ర దుర్గంధం వస్తోందని రైతులు, యువకులు ఆభ్యంతరం తెలిపారు. అయినా తొలగించకపోవడంతో యువకులు ఎముకలు ఆరబెడుతున్న స్థలానికి వెళ్లి అక్కడి వారితో వాగ్వాదానానికి దిగారు. ఇరువురి మధ్య మాట-మాట పెరిగి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్సై ఆసిఫ్ ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపచేశారు. ఆరబెడుతున్న ఎముకలను తొలగించాలని సూచించారు. లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
పుర్రెలు, ఎముకలతో భయాందోళన
తాండూరు: పట్టణంలో మనిషి పుర్రెలు, ఎముకలు కలకలం సృష్టించాయి. జనవాసాల సమీపంలో రోడ్డు పక్కన పుర్రె, ఎముకలు కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ సంఘటన బుధవారం తాండూరులో వెలుగు చూసింది. వివరాలు.. తాండూరులోని యాదిరెడ్డి చౌక్ నుంచి పోలీసుస్టేషన్ వెళ్లే మార్గంలో రోడ్డుపక్కన ఓ ప్లాస్టిక్ కవర్ను పారిశుద్ధ్య సిబ్బంది గుర్తించారు. అందులో చూడగా మనిషికి చెందిన రెండు పుర్రెలు, ఎముకలు, దంతాలు కనిపించాయి. కౌన్సిలర్ పట్లోళ్ల నర్సింలు సమాచారంతో ఎస్ఐ మహ్మద్ ఖలీల్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పుర్రెలు, ఎముకలు గుర్తుతెలియని వ్యక్తులు కొద్దిదూరంలో ఉన్న శ్మశానంలో క్షుద్రపూజల కోసం వినియోగించి పడేసి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. పుర్రెలు, ఎముకలపై ఇంగ్లీష్లో మెడికల్ టర్మినాలజీ పదాలు రాసి ఉన్నాయని ఎస్ఐ చెప్పారు. ఆస్పత్రుల నిర్వాహకులు, లేదా ఎంబీబీఎస్ విద్యార్థులు తమ చదువుల నిమిత్తం పుర్రెలను తీసుకువచ్చి ఇక్కడ పడేసి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పుర్రెలు, ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
చరణ్కి ఎముకలు లేవేమో అనిపించింది!
నేటి తరం కథానాయిక ఎలా ఉండాలో రకుల్ ప్రీత్సింగ్ అచ్చంగా అలానే ఉంటారు. మెరుపుతీగకు చిరునామానేమో అన్నంత స్లిమ్గా ఉంటారు రకుల్. అందంతో పాటు అభినయంలో కూడా బెస్ట్ అనిపించుకోవడంతో ఇప్పుడు రకుల్ తెలుగు పరిశ్రమలో ‘మోస్ట్ వాంటెడ్ హీరోయిన్’ అయ్యారు. ఈ నెల 16న విడుదల కానున్న ‘బ్రూస్లీ ది ఫైటర్’లో ఆమె కథానాయికగా నటించారు. నేడు రకుల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘బ్రూస్లీ ది ఫైటర్’ విశేషాలతో పాటు ఇతర విశేషాలను ఈ విధంగా పంచుకున్నారు. ‘బ్రూస్లీ ది ఫైటర్’లో నా పాత్ర పేరు రియా. వీడియో గేమ్స్ డిజైనర్ని అన్నమాట. స్టంట్ మాస్టర్ అయిన హీరో రాంచరణ్ కోసం ఓ వీడియో గేమ్ డిజైన్ చేసే పని మీద ఉంటాను. ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. దానికి కారణం ఏంటంటే, రియా మనసుకి ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తుంది. వెనకా ముందూ ఆలోచించదు. అది కామెడీగా ఉంటుంది. ప్రేక్షకులను ఈ పాత్ర నవ్విస్తుంది. ఈ చిత్రంలో నేను చాలా అందంగా, స్టయిలిష్గా ఉంటాను. ఆ క్రెడిట్ దర్శకుడు శ్రీను వైట్లగారికే దక్కుతుంది. ఆయన విజువలైజేషన్ సూపర్. క్లారిటీ ఉన్న డెరైక్టర్. అలాగే నిర్మాత దానయ్యగారు రాజీపడకుండా నిర్మించారు. సినిమా చాలా గ్రాండ్గా ఉంటుంది. భయం వేసింది : రాంచరణ్ మంచి డ్యాన్సర్. నాకైతే తనతో డ్యాన్స్ చేయాలంటే భయం వేసింది. రిహార్శల్ చేయకుండానే చేసేస్తాడు. చరణ్ డ్యాన్స్ చూసినప్పుడు తన బాడీలో బోన్స్ లేవేమో అనిపించింది (నవ్వుతూ). అంతర్జాతీయ స్థాయిలో పాటలు ఉండాలనే పట్టుదలతో రాత్రింబవళ్లు వర్క్ చేశాం. చరణ్ చాలా నైస్ పర్సన్. స్టార్ హీరో అనే ఫీలింగ్ ఏమాత్రం లేకుండా అందరితో సరదాగా ఉంటారు. చిరంజీవిగారు మెచ్చుకున్నారు : ఈ చిత్రం నాకు బోల్డన్ని తీపి గుర్తులు మిగిల్చింది. ‘లే చలో సాంగ్..’ పాటలో బాగా డ్యాన్స్ చేశావనీ, అందంగా కూడా ఉన్నావని చిరంజీవిగారు నన్ను మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. ఎంతో అంకితభావం ఉన్న నటుడాయన. చిరంజీవిగారితో కలిసి నటించే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. డెరైక్టరే షాట్ ఓకే అన్నా, ఇంకోసారి చేస్తాననేవారు. షారుక్ సర్ప్రైజ్ చేశారు : ఈ చిత్రం సమయంలో మిగిలిన మరో తీపి గుర్తు షారుక్ ఖాన్ మా సెట్కి రావడం. ఒకరోజు రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో పాట చిత్రీకరణ జరుగుతోంది. హఠాత్తుగా యూనిట్ సభ్యులందరూ బయటకు వెళ్లిపోయారు. నేనూ, చరణ్ మాత్రమే మిగిలాం. కట్ చేస్తే.. షారుక్ ఖాన్ ఎంటర్ అయ్యి, మాకు సర్ప్రైజ్ ఇచ్చారు. మానిటర్లో చరణ్ స్టెప్స్ చూసి, షారుక్ బాగా ఎంజాయ్ చేశారు. ఏమాత్రం రిహార్శల్ చేయకపోయినా బాగా డ్యాన్స్ చేశావని చరణ్ని అభినందించారు. ఫైట్ సీక్వెన్స్ చూసి కూడా షారుక్ థ్రిల్ అయ్యారు. ‘బ్రహ్మత్సవం’ మిస్ అయినందుకు బాధగా ఉంది: పవన్ కల్యాణ్, మహేశ్బాబు, అల్లు అర్జున్ ఇలా టాలీవుడ్లో నాకు నచ్చిన హీరోలు చాలామంది ఉన్నారు. మహేశ్బాబుతో ‘బ్రహ్మోత్సవం’లో నటించే అవకాశం వచ్చినా. డేట్స్ ఖాళీ లేక వదులుకోవాల్సి వచ్చింది. చాలా బాధపడ్డాను. నాకింకా బోల్డంత కెరీర్ ఉంది. మరో అవకాశం వస్తుందనే నమ్మకం ఉంది. పారితోషికం పెంచారట? అని చాలామంది నన్ను అడుగుతుంటారు. సినిమా సినిమాకీ నా పాపులార్టీ పెరుగుతోంది. అలాంటప్పుడు నా మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని పారితోషికం తీసుకుంటే తప్పు లేదనుకుంటున్నా. నాకు నేనే పోటీ! : ప్రస్తుతం చాలామంది కథానాయికలు ఉన్నారు. అందరూ టాలెంటెడే. నేనెవర్నీ పోటీగా భావించను. నాకు నేనే పోటీ అనుకుంటా. నంబర్ గేమ్ని నమ్మను. కెరీర్ ఆరంభించిన కొంత కాలానికే పెద్ద సినిమాల్లో నటిచండం ఆనందంగా ఉంది. ఫామ్లో ఉన్న ప్రతి కథానాయికతో పోటీపడితే మానసిక ప్రశాంతత కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే నా పని మీద పూర్తిగా ఫోకస్ పెడతా. ఫలితం దేవుడు ఇస్తాడని నమ్ముతాను. -
నైట్డ్యూటీలు చేస్తే డయాబెటిస్ వస్తుందా?
హోమియో కౌన్సెలింగ్ నాకు వెన్ను నొప్పి ఎక్కువగా వస్తుంది. హోమియోలో పరిష్కారం చెప్పండి. - సుందర్, హైదరాబాద్ మన వెన్నెముకలో 33 ఎముకలు ఉంటాయి. అందులో 7 మెడ భాగంలో, 12 వీపు భాగంలో, ఐదు కింది వీపు భాగంలో, మిగిలిన తొమ్మిది కింది నడుము భాగంలో ఉంటాయి. ప్రతి రెండు ఎముకల మధ్య డిస్క్ అనే మెత్తటి పదార్థం ఉంటుంది. మనం కదిలేటప్పుడు, ఏదైనా పనిచేసేటప్పుడు రెండు ఎముకల మధ్య రాపిడిని ఈ డిస్క్ తగ్గిస్తుంది. ఈ డిస్క్ మధ్య భాగం లోంచి మెదడు నుంచి మచ్చే నాడులు ఉంటాయి. మెడ భాగంలోని వెన్నుపూసల మధ్య నరాలు ఒత్తిడికి గురి కావడం వల్ల వచ్చే మెడనొప్పిని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. మెడకు తీవ్రగాయం కావడం వయసు పెరిగేకొద్దీ డిస్క్ అరగడం గంటల తరబడి కూర్చొని పనిచేయడం తీవ్రమైన మానసిక ఒత్తిడి పడటం వంటి కారణాలతో ఇది వస్తుంది. మెడ భాగంలో తీవ్రమైన నొప్పి ఉండి, అది భుజాలు, చేతి వరకు పాకుతుంటుంది. చేతి వేళ్ల తిమ్మిర్లు, మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. లంబార్ స్పాండిలైటిస్: కింద నడుము భాగంలో ఐదు ఎముకలు ఉంటాయి. ఎల్4 - ఎల్ 5 మధ్య సయాటిక్ నరం ఆరంభమవుతుంది. ఈ ఎముకల డిస్క్ అరగడం లేదా పక్కకు జరగడం వల్ల సయాటిక్ నరం మీద ఒత్తిడి పడుతుంది. ఈ తరహా నొప్పి నడుం వద్ద ప్రారంభమై కాలు మొత్తానికి పాకుతుంది. కాలు తిమ్మిర్లు పట్టడం కూడా జరగవచ్చు. కారణాలు: నడుముకు బలమైన గాయం కావడం, వయసు పెరిగేకొద్దీ వచ్చే అరుగుదల సమస్య తదేకంగా ఎలాంటి కదలికలు లేకుండా కూర్చొని పనిచేయడం గర్భిణులు. సయాటికా: సయాటిక్ నరం మన శరీరంలోని అతి పెద్ద నరం. ఇది నడుము దగ్గర ప్రారంభమై, తొడలు, పిక్కల నుంచి వెళ్తూ అరికాలి వరకూ ఉంటుంది. ఈ నరంపై ఒత్తిడి పడటం వల్ల కలిగే నొప్పిని సయాటికా అంటారు. ఇప్పుడు వెన్నుపూసల నొప్పికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రయోనియా, కామొమిల్లా, మాగ్ఫాస్ లాంటి మందులను రోగి తత్వాన్ని బట్టి వాడాల్సి ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా అనుభవజ్ఞులైన వైద్యులు తగిన మందును నిర్ణయిస్తారు. దీన్ని వారు సూచించిన మోతాదులో, నిర్ణీత కాలపరిమితి మేర వాడటం వల్ల వెన్నుకు సంబంధించిన సమస్యల నుంచి ఎలాంటి సర్జరీ లేకుండా శాశ్వతమైన ఫలితం లభిస్తుంది. హోమియో మందులతో పాటు మంచి పౌష్టికాహారం, ఫిజియోథెరపీ వల్ల వెన్ను సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. డయాబెటిక్ కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. గత నాలుగేళ్లుగా కాల్సెంటర్లో పనిచేస్తున్నాను. ఎక్కువగా నైట్డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. నేను ఇటీవల పరీక్షలు చేయించుకుంటే డయాబెటిస్ బార్డర్లైన్లో ఉందని తేలింది. రక్తపరీక్షలు చేయించినప్పటి నుంచి నాకు డయాబెటిస్ చాలా త్వరగా వచ్చేస్తుందేమోనని ఆందోళన కలుగుతోంది. నేను డయాబెటిస్ బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉందా? దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - సోమసుందర్, హైదరాబాద్ వృత్తిపరంగా కంటినిండా నిద్రలేకపోవడం, ఒత్తిడి వల్ల నిద్రపట్టకపోవడం డయాబెటిస్ రావడాన్ని వేగవంతం చేస్తే చేయవచ్చు. గానీ కేవలం నైట్ డ్యూటీస్ వల్లనే డయాబెటిస్ రాదు. ఇది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల్లోగానీ, మీ వంశంలో ఎవరికైనా డయాబెటిస్ ఉందా అన్న అంశాన్ని మీరు తెలపలేదు. జన్యుపరంగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎక్కువగా నైట్డ్యూటీలు చేస్తానని తెలిపారు. అయితే మీరు పగలు పడుకోవడం, రాత్రిళ్లు మేల్కొంటూ ఉండటం వల్ల కొన్ని రకాల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక డయాబెటిస్ కోసం మీరు మీ రక్తపరీక్షలను పరగడపున చేయించుకున్నారా లేక భోజనం చేసిన తర్వాత చేయించుకున్నారా అన్న విషయాలు తెలపలేదు. రక్తపరీక్షలో బార్డర్లైన్ డయాబెటిస్ అని వచ్చింది కాబట్టి డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే ఆరోగ్యకరమైన మీ జీవనశైలి మార్పులతో మీరు మీ డయాబెటిస్ వచ్చే అవకాశాలను సాధ్యమైనంత ఆలస్యం చేయవచ్చు. ఇందుకోసం మీరు రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం లేదా వాకింగ్ తప్పనిసరిగా చేయాలి. స్వీట్లు, పిజ్జాలు, బర్గర్లు వంటి అధిక క్యాలరీలు ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. ప్రతి కొద్దిగంటల తర్వాత కొద్ది మోతాదులో ఆహారం ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి. ఆహారంలో తాజా ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పీచు ఎక్కువగా ఉండే ముడిబియ్యం, కాయధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. నైట్డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో కాఫీలు, టీలు తాగవద్దు. కచ్చితంగా భోజనం వేళకు భోజనం చేయడం, కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు భోజనం చేయడం వంటి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకోండి. మీ బరువును అదుపులో పెట్టుకోండి. ఇలాంటి జీవనశైలి మార్పులు చేసుకుంటే డయాబెటిస్ను సాధ్యమైనంత ఎక్కువగా నివారించవచ్చు. మీ కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 58. షుగర్వల్ల రెండు కిడ్నీలూ పనిచేయడం లేదు. డయాలసిస్ చేయించుకుంటున్న సమయంలో చలి, వణుకు వస్తున్నాయి. నా సమస్యకు పరిష్కారం చూపండి? - రవికుమార్, హైదరాబాద్ ఇప్పుడు వాడుతున్న క్యాథెటర్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది. మొదట ఈ ఇన్ఫెక్షన్ తగ్గడానికి తగ్గడానికి మందులు వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత పర్మ్ క్యాథ్ ద్వారా డయాలసిస్ చేయించుకోవడం మంచిది. ఇలా ఫిస్టులా సమస్య ఉన్నప్పుడు హోమ్ డయాలసిస్ (కంటిన్యువస్ ఆంబుల్యేటరీ పెరిటోనియల్ డయాలసిస్-సీఏపీడీ) చేయించుకోవడం మేలు. సీఏపీడీ వల్ల ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ఇంట్లోనే ఉండి, ఈ డయాలసిస్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ వృత్తినిర్వహణకూ ఇలాంటి ఇబ్బందీ ఉండదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. హోమ్ డయాలసిస్కు అయ్యే ఖర్చు హాస్పిటల్స్ డయాలసిస్ కంటే తక్కువ. నా వయసు 36. కిడ్నీ సైజు తగ్గిందని తేలింది. సీకేడీ స్టేజ్ 5 అని డాక్టర్ చెప్పారు. కిడ్నీ మార్పిడి చేయించుకోవాలి అని సలహా ఇచ్చారు. అది కాకుండా ఇంకేదైనా అవకాశం ఉందా? - మహబూబ్బాషా, గుంటూరు కిడ్నీ మార్పిడి చేయడం మీకు మంచి చికిత్స. మీకు మీ అన్నదమ్ములు గానీ, అక్కచెల్లెళ్లుగానీ లేదా మీ తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు కిడ్నీ ఇవ్వవచ్చు. కిడ్నీ ఇచ్చే వారికి అన్ని పరీక్షలూ చేసి, ఇలా చేయడం వల్ల వారికి ఎలాంటి సమస్యా రాదనీ, ఒక్క కిడ్నీతోనే వారు సాధారణంగా జీవిస్తారని తేలిన తర్వాతనే దాతను నిర్ధారణ చేస్తారు. దాత ఎంత ఎక్కువ దగ్గరి సంబంధీకుడైతే.. ట్రాన్స్ప్లాంట్ తర్వాత రోగి శరీరంలో కిడ్నీ అంతగా ఇమిడిపోవడానికీ, ఎక్కువ కాలం పనిచేయడానికీ అవకాశం ఉంటుంది. కిడ్నీ మార్పిడి (ట్రాన్స్ప్లాంట్) తర్వాత కూడా మీరు క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. అయితే కిడ్నీ ఇచ్చే దాత లేనివారు క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ, ఎవరైనా బ్రెయిన్డెడ్ దాతల నుంచి కిడ్నీ లభించేవరకూ వేచిచూడాలి. -
70 రోజులు.. 11 లక్షలు!
బెడ్ రెస్ట్ తీసుకుంటే చాలు దరఖాస్తులు ఆహ్వానించిన నాసా కష్టపడి పని చేస్తేనే కానీ డబ్బులు రాని ఈ రోజుల్లో నిద్రపోతే కూడా డబ్బులొస్తాయా? అవును! ప్రయోగశాలకు వచ్చి మంచంపై పడుకుంటే చాలు.. రోజుకు రూ. 10 వేల చొప్పున డబ్బులిచ్చేస్తామంటున్నారు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు! 70 రోజుల పాటు మంచంపై పడుకుంటే సరి.. రూ.11 లక్షలకు పైనే ముట్టజెపుతామని వారు ప్రకటించారు. ఇంతకూ డబ్బెందుకిస్తారు? ఈ వింత ప్రయోగాలేమిటి? ఎందుకు? అంటే... భూమి మీద రోదసి ఎఫెక్ట్ అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేమి వల్ల దీర్ఘకాలంలో వ్యోమగాముల ఆరోగ్యంపై దుష్ర్పభావాలు పడతాయి. కండరాలు, ఎముకలు కరిగిపోతాయి. గుండె పనితీరు మందగిస్తుంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారాల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు ప్రయోగాలు చేస్తున్నారు కూడా. అయితే, అన్ని పరీక్షలూ అంతరిక్షంలోనే చేయాలంటే కష్టం కాబట్టి.. ఇలా భూమ్మీదే రోదసి పరీక్షలకు రంగం సిద్ధం చేశారు. గురుత్వాకర్షణ లేమి ఎఫెక్ట్ కోసమని.. ఎల్లప్పుడూ తలను వెనక్కి వాల్చి.. కాళ్లు కొంచెం ఎత్తుగా చాపుకుని వెల్లకిలా పడుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని రోజులూ మంచం మీదే! పరీక్షలకు ఎంపికైతే.. తల కిందికి వాల్చి, కాళ్లు పైకి ఉంచి వెల్లకిలా పడుకోవడం, చిన్నచిన్న పనులు చేసుకోవడంలో రెండు వారాలు శిక్షణ ఇస్తారు. తర్వాత పది వారాలు పూర్తిగా మంచంపై పడుకునే గడపాల్సి ఉంటుంది. ఈ సమయంలో పైకి లేచేదే ఉండదు. ఒకటీ, రెండూ అన్నీ మంచంపైనే! షవర్ హెడ్తో స్నానం చేయాలి. అప్పుడప్పుడూ చిన్నచిన్న కసరత్తులూ చేయాలి. ఇలా 70 రోజుల పాటు పడుకుని ఉంటే.. మెడ, దేహం, కండరాలు, ఎముకల్లో కలిగే మార్పులు, నొప్పి, గుండె ఆరోగ్యం వంటివి నిరంతరం పర్యవేక్షిస్తారు. పరీక్షలు అయిపోయాక 14 రోజుల్లో కోలుకుని ఇంటికి వెళ్లిపోవచ్చు. కొంచెం కష్టమే కానీ.. ఇంత డబ్బు ఇస్తామంటే మేం రెడీ! అంటారా? కానీ కుదరదు లెండి. ఎందుకంటే ఈ పడక చాన్స్ అమెరికా పౌరులకు మాత్రమే! -
ఈ రెస్టారెంట్ నిండా ఎముకలే..!
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నారు! మెక్సిలో ఇటీవలే ప్రారంభమైన ఈ రెస్టారెంటుకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. పైకి మామూలుగానే కనిపిస్తున్నా, ఈ రెస్టారెంటు లోపలకు వెళ్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఇంటీరియర్ మొత్తాన్ని జంతువుల ఎముకలు, పుర్రెలతో అలంకరించారు. ఇందుకోసం ఏకంగా 10 వేలకు పైగా ఎముకలు, పుర్రెలు ఉపయోగించారు. వీటిలో చాలావరకు నిజమైనవే కాగా, కొన్ని మాత్రం అల్యూమినియంతో తయారుచేశారు. ఇగ్నాకియో కడెనా అనే ఆర్కిటెక్ట్ ఈ డిజైన్ను రూపొందించారు. తెల్లని పెయింట్, అందంగా అమర్చిన ఎముకలతో ఈ రెస్టారెంటు చాలామందిని ఆకర్షిస్తోంది. అయితే, శాఖాహారులు, జంతు ప్రేమికులు ఇందులో కనీసం సలాడ్ కూడా తినడానికి ఇష్టపడకపోవచ్చని కడెనా పేర్కొంటున్నారు. అన్నట్టు ఈ రెస్టారెంటు పేరు.. ‘హ్యూసో’. అంటే ఎముక అని అర్థం! -
జ్యూస్.. ఫ్రెష్ జ్యూస్..
జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే. చిత్రంలోని జ్యూస్ మరీ మంచిదట. ఆస్తమా, రక్తహీనత పోవడంతోపాటు ఎముకలు దృఢమవుతాయట. మెదడుకూ ఎంతో మంచిదట. తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు, లైంగిక సామర్థ్యం తగ్గినవారు ఈ జ్యూస్ తాగితే ఇక ఆ సమస్యలు దరిచేరవట. ఇంకా చాలాచాలా సుగుణాలు ఉన్నాయట. పెరూ, బొలీవియాకు వెళ్తే.. అక్కడివాళ్లు ఈ జ్యూస్ గొప్పతనం గురించి ఇంకా చాలా చెబుతారు. ఇంతకీ ఈ జ్యూస్ను దేంతో తయారుచేస్తారో చెప్పలేదు కదూ.. అయితే.. రాసుకోండి.. తయారీ విధానం.. మొదటగా కొన్ని క్యారెట్లు తీసుకోండి.. తర్వాత కప్పుడు తేనె.. రెండింటినీ మిక్సీలో వేయండి.. బాగా ముద్దలా మారిన తర్వాత వెనీలా ఎసెన్స్ వేయండి. మళ్లీ మిక్సీ చేయండి. ఇప్పుడిక అసలు పని మొదలవుతుంది. చేతులు క్లీన్ చేసుకుని.. టిటికాకా నీటి కప్పలను తీసుకోండి. మీరు విన్నది నిజమే. కప్పలనే. ఎందుకంటే ఈ జ్యూస్ను అరుదైన టిటికాకా కప్పలతోనే తయారుచేస్తారు.. ఆశ్చర్యపోకుండా ముందు రాసుకోండి.. అవి చచ్చిన తర్వాత చర్మం వలిచి.. క్లీన్ చేసి.. మిక్సీలో బాగా రుబ్బండి. మధ్యలో కొన్ని ఐసు ముక్కలు వేయండి. ఇక జ్యూస్ రెడీ. అతిథులకు చల్లగా అందించండి. గమనిక: స్థానికులు సర్వరోగనివారిణి అని ఈ కప్పల జ్యూస్ను తెగ తాగేస్తున్నా.. పై రోగాలను ఇది తగ్గిస్తుందనడానికి ఏ ఆధారమూ లేదని వైద్యులు అంటున్నారు. -
నిద్రమత్తు వదిలించే...తాడాసనం
వ్యాయామం ఉదయం నిద్రలేవగానే బద్ధకంగా ఉండి నిద్రమత్తు వదలకపోతే రెండు నిమిషాల పాటు ఈ ఆసనాన్ని సాధన చేస్తే చాలు. దేహం చైతన్యవంతమై రోజంతా ఉత్సాహంగా పనిచేస్తుంది. ఎలా చేయాలి? రెండుపాదాలను దగ్గరగా ఉంచి, రెండు చేతులు శరీరానికి ఇరువైపులా చాచి నిటారుగా నిలబడాలి. రెండు చేతులను అలాగే పైకి తీసుకుని వ్రేళ్లలో వ్రేళ్లు చొప్పించాలి(ఇంటర్లాక్). ఇప్పుడు పూర్తిగా శ్వాస తీసుకుని రెండు అరచేతులనూ ఆకాశం చూస్తున్నట్లుగా పైకి లాగాలి. అదే సమయంలో కాలి మునివేళ్లపైన శరీర బరువు ఉంచి దేహాన్ని లాగినట్లుగా పైకి లేపాలి. ఈ స్థితిలో శ్వాస తీసుకోకుండా ఉండగలిగినంత సేపు ఉండి, ఆ తర్వాత నిదానంగా రెండు అరచేతులను తల పైన బోర్లించి రెండు పాదాలను నేల పైన ఉంచాలి. ఇలా మూడుసార్లు చేస్తే చాలు. రోజును ఉత్సాహంగా గడిపేయవచ్చు. ఇతర ప్రయోజనాలు: ఎముకలు, కండరాలు చైతన్యవంతం అవుతాయి. కాలివేళ్లు, మడమలు, మోకాళ్లు, భుజాలు, మోచేతులు, మణికట్టు, చేతివేళ్లు శక్తిమంతం అవుతాయి. ఈ ఆసనం ఎత్తు పెరగడానికి ఉపయోగపడుతుంది. జాగ్రత్త: మోకాళ్లు నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు చేయకూడదు. భుజాల కీళ్లు అరిగిపోయిన వాళ్లు కూడా చేయకూడదు. -
మనిషి... మారిపోతున్నాడు!
ఒంటిచేత్తో.. వంద కిలోల బరువు ఎత్తగలరా..? ఆగకుండా.. అలసిపోకుండా 20 కిలోమీటర్లు పరుగెత్తగలరా..? నిండు ఆరోగ్యంతో.. 150 ఏళ్లు బతకగలరా..? మరణం తర్వాతా.. జీవితాన్ని కొనసాగించగలరా..? అమ్మో... ఇవన్నీ శక్తికి మించిన పనులే కదూ! ఊహూ... కానేకాదేమో! టెక్నాలజీ సాయంతో ఈ రోజు కాకపోతే రేపైనా మనిషి... శక్తికి మించిన పనులూ.. చకచకా చేసేయొచ్చు! కుదిరితే అమరత్వమూ పొందొచ్చు!! కొత్త కొత్త టెక్నాలజీలు మనిషి చేసే ప్రతి పనినీ సమూలంగా మార్చివేస్తున్నాయి. అయితే మనిషి పనులను మాత్రమే కాదు.. ఏకంగా మనిషినే టెక్నాలజీలు నిలువెల్లా మార్చేస్తాయని అంటున్నారు శాస్త్రవేత్తలు! పరిమితమైన మనిషి శక్తి సామర్థ్యాలను అపరిమితంగా మార్చివేయడమే కాదు.. మనిషిని అమరుడిని చేసేలా.. శరీరంలో సైతం భాగం అయిపోతాయని చెబుతున్నారు. మొత్తం మీద మనిషి.. తన పరిణామ చరిత్రను తాను సృష్టించుకుంటున్న టెక్నాలజీలతోనే మలుపు తిప్పుకుంటాడని.. నిలువెల్లా రూపాంతరం చెంది.. ‘నరయంత్రుడు’ అయిపోతాడనీ అంటున్నారు. ‘ట్రాన్స్హ్యూమనిజం (మానవ రూపాంతరత)’ భావన వీటన్నింటినీ సాధ్యం చేస్తుందని చెబుతున్నారు విశ్లేషకులు. ఏమిటీ ట్రాన్స్హ్యూమనిజం..? పరిమితంగా ఉన్న శక్తి, సామర్థ్యాలను పెంచుకోవాలన్న మనిషి తపన ఈనాటిది కాదు. జైలు జీవితం నుంచి తప్పించుకుని పక్షిలా ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ దూరతీరాలకు వెళ్లిపోవాలని ఆశపడిన ఇకారస్, డియోడలస్లు పక్షి ఈకలతో రెక్కలు కట్టుకొని ఎగిరేందుకు ప్రయత్నించిన గాథ గ్రీకు పురాణాల్లో కనిపిస్తుంది. ఇక హిందూ పురాణాల్లోనైతే.. సాధారణ మనిషికి సైతం అపరిమిత శక్తులు అబ్బినట్లు చెప్పే గాథలు ఎన్నో ఉన్నాయి. అయితే... ఆధునికయుగంలో సాంకేతికతల ద్వారా మనిషి శక్తి, సామర్థ్యాలను అనూహ్యంగా పెంచుకోవడానికి 1960ల నుంచి మొదలైన ఉద్యమాన్నే ‘ట్రాన్స్హ్యూమనిజం’గా చెప్పుకోవచ్చు. ఇలా టెక్నాలజీల సాయంతో అపరిమిత శక్తులు పొందే మనిషిని ‘ట్రాన్స్హ్యూమన్ (రూపాంతర మానవుడు)’గా పిలుస్తున్నారు. ఇప్పటిదాకా సైన్స్ కాల్పనిక సాహిత్యంలో, సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యమైన ఇలాంటి రూపాంతర మనుషులు మనిషి, యంత్రాలు కలగలిసిపోయినట్లుగా ఉంటారు కాబట్టి.. వారిని మనం ‘నరయంత్రులు’గానూ పిలుచుకోవచ్చు! ఇందుకోసం ఉపయోగపడే సాంకేతికతలన్నింటికీ కలిపి ‘మానవ శక్తులను పెంచే సాంకేతికతలు (హ్యూమన్ ఎన్హ్యాన్సింగ్ టెక్నాలజీస్)’ అనే పేరునూ ట్రాన్స్హ్యూమనిజం కోసం ప్రయత్నిస్తున్నవారు ఉపయోగిస్తున్నారు. బాహ్య అస్థిపంజరంతో కొండంత బలం..! వీపుపై 90 కిలోల బరువు వేసుకుని.. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలరా..? అమెరికా పరిశోధకులు రూపొందిస్తున్న బాహ్య అస్థిపంజరం (ఎక్సో స్కెలిటన్)ను ధరిస్తే.. మీరు వంద కిలోల బరువునూ అవలీలగా మోయగలరు. మనిషిపై దాదాపుగా బరువే పడకుండా చూసే ఈ ‘హ్యూమన్ యూనివర్సల్ లోడ్ క్యారియర్-హెచ్యూఎల్సీ’ని లాఖీడ్ మార్టిన్స్ కంపెనీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇంజనీర్లు సంయుక్తంగా రూపొందిస్తున్నారు. దీనిని గనక సైనికులకు అందుబాటులోకి తెస్తే.. ఇక యుద్ధరంగం రూపురేఖలే మారిపోతాయని నిపుణులు అంటున్నారు. మామూలు పౌరులకు సైతం ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కళ్లజోడు కంప్యూటర్తో చిటికెలో పనులు! ఇంతకుముందు మాదిరిగా మన మానసిక శక్తి ఇంతే.. అని ఇకపై సరిపెట్టుకోనవసరం లేదు. మన శక్తుల పరిమితులను దాటి అనేక విషయాలను సాధ్యం చేసిపెట్టే టెక్నాలజీలు ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్నాయి. ఉదాహరణకు.. కళ్లజోడు కంప్యూటర్గా పేరుపొందిన గూగుల్ గ్లాస్నే తీసుకుంటే.. దీన్ని పెట్టుకుని ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా.. అక్కడి భాష తెలియకున్నా.. మనం చకచకా మాట్లాడేయొచ్చు! మనం మన భాషలో మాట్లాడితే చాలు.. ఇది వారి భాషలో చెప్పి.. వారి మాటలను తిరిగి మన భాషలో మనకు చెబుతుంది. అలాగే మన పరిసరాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమూ లేకుండా దీనికి పురమాయిస్తే.. ముఖ్యమైన సమాచారాన్ని ఇది భద్రం చేసి.. అవసరమైనప్పుడు తిరిగి గుర్తు చేస్తుంది. ప్రస్తుతానికి ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నా.. భవిష్యత్తులో మాత్రం ఇది చాలా పనులను చేసిపెట్టనుంది. జన్యుచికిత్సతో దీర్ఘాయుష్షు! మానవ రూపాంతరతను సాధ్యం చేసే టెక్నాలజీల్లో హ్యూమన్ జెనిటిక్ ఇంజనీరింగ్ కూడా ఒకటి. మన దేహంలో జరిగే అన్ని పనుల వెనకా.. జన్యువులు కీలక పాత్ర పోషిస్తాయన్నది తెలిసిందే. ఆ జన్యువులను నియంత్రించడం ద్వారా అవసరమైన ఫలితాలు రాబట్టుకునే పద్ధతినే మానవ జన్యు ఇంజనీరింగ్గా చెప్పుకోవచ్చు. దీనిద్వారా జీవశాస్త్రపరంగా ఉన్న ఎన్నో పరిమితులను మనిషి అధిగమించవచ్చు. ఔషధాల ద్వారా లేదా ఇతర పద్ధతుల ద్వారా జన్యువులను నియంత్రిస్తూ.. లేదా కత్తిరిస్తూ.. లేదా జతచేస్తూ.. మనిషి ఆరోగ్యాన్ని పెంపొందించి దీర్ఘాయుష్షును ప్రసాదించొచ్చు. ఉదాహరణకు.. స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఇటీవలే జంతువుల్లో ఎన్కోఆర్1 అనే జన్యువును అణచేయడం ద్వారా.. వాటి శరీరాల్లో కండరాల పెరుగుదలను గణనీయంగా పెంచగలిగారు. అంతేకాదు.. కండరాలు దట్టంగా పెరగడమే కాకుండా వాటి కణాల్లో మైటోకాండ్రియాలు కూడా పెద్ద సంఖ్యలో పెరిగాయట. మైటోకాండ్రియాలంటే కణశక్తి భాండాగారాలు. వాటి సంఖ్య పెరగడం అంటే.. పరోక్షంగా.. మన శరీరం శక్తి పెరగడమే! ఈ జన్యుచికిత్సలు మనుషుల్లో ఇప్పుడప్పుడే అయ్యే పని కాకపోవ చ్చు. కానీ.. ఏదోరోజు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. సైబోర్గ్.. మనిషి సహజం అవయవాలు కృత్రిమం చూడటానికి అందరు మనుషుల్లా మామూలుగానే ఉంటారు. కానీ ఎదలో కొట్టుకునే గుండె మాత్రం కృత్రిమం. చక్కగా వినగలుగుతారు. కానీ వారి చెవిలో ఉన్న కాక్లియా మాత్రం పరికరం. ఇంకా.. ఎముకలు, కండరాలు, మెదడుకు అమర్చే కంప్యూటర్ చిప్లు.. పైకి కనిపించని ఎన్నో ఇంప్లాంట్లు, పరికరాలు వారిలో ఉంటాయి. ఇలా.. లోలోపల అవయవాల స్థానంలో కత్రిమ పరికరాలతో జీవిస్తూ.. పైపైకి మామూలుగానే కనిపించే ‘సైబోర్గ్స్’ సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ వస్తున్నారు. మానవ రూపాంతరత సాధించే దిశగా సైబోర్గ్ టెక్నాలజీ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. కంప్యూటర్లోకి మెదడు ఎక్కిస్తే.. అమరత్వం! మనిషి చనిపోతాడు. కానీ.. అతడి జీవితం అక్కడితోనే ముగిసిపోదు. అతడి దేహం మట్టిలో కలిసిపోతుంది. కానీ.. మెదడు మాత్రం కంప్యూటర్లో భద్రంగా ఉంటుంది. కంప్యూటర్ తలకు.. రోబో శరీరం తోడవుతుంది. మరణించిన తర్వాత కూడా మనిషి జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. బంధాలు, బంధుత్వాలు అన్నీ ఉంటాయి. జీవితం తిరిగి కొనసాగుతుంది. ‘మైండ్ అప్లోడింగ్’ టెక్నాలజీతో ఇది సాధ్యం అవుతుందని అంటున్నారు. 2045 నాటికి కంప్యూటర్లోకి మెదడును ఎక్కించడం దాదాపుగా సాధ్యం అవుతుందని, ఆ తర్వాత మరో 90 ఏళ్లలో మనిషి శరీరాల స్థానంలో రోబో శరీరాలు రావడం ఖాయమని అంటున్నారు గూగుల్ కంపెనీ నిపుణులు. ఒకవేళ ఇదే గనక వాస్తవరూపం దాల్చితే మనిషి కొంత మేరకైనా అమరుడు అయినట్లే! - హన్మిరెడ్డి యెద్దుల -
వామ్మో.. చిరుత
* సీసీ కెమెరాల్లో కదలికలు * గొర్రెలు మేపడంపై నిషేధాజ్ఞలు * చిరుత దాడిలో రేంజర్ మృతి చెన్నై, సాక్షి ప్రతినిధి: చిచ్చరపిడుగుల్లాంటి రెండు చిరుతలు చెంగల్పట్టు జనావాసాల్లోకి ప్రవేశించాయి. వీటి కదలికలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయంతో వణికిపోతున్నా రు. చెంగల్పట్టు పరిసరాల్లో చిరుత సంచరిస్తోందని రెండు నెలలుగా స్థానిక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇవన్నీ పుకార్లేనని అటవీశాఖ కొట్టి పారేసింది. ఓ పశువుల కొట్టంలో కట్టివేసిన దూడను మే 19వ తేదీ రాత్రిచంపి తినేసింది. బాధిత రైతు ఫిర్యాదు మేర కు దూడ మాంసాన్ని అటవీశాఖాధికారులు పరిశోధన చేసి నిర్ధారణకొచ్చారు. కలెక్టర్ సౌందరపాండియన్ నేతృత్వంలో చెంగల్పట్టు పరిసరాలైన తిరుమణి, తిరుక్కుళుకున్రం, తాళంపాడు, తిరువడిశూలం, పనంగాటిపాక్కం, వండలూరుల్లో బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుతను ఆకర్షించేందుకు బోన్లలో కుక్కలు, గొర్రెలను ఉంచారు. ఇందు కు జంతు సంక్షేమ సంఘం ప్రతినిధులు నిరసన తెలపడంతో వాటిని వదిలివేసి వలలు ఏర్పాటు చేశారు. గొర్రెల కాపర్లకు, అడవుల్లోకి వెళ్లే ప్రేమజంటలకు చిరుత కనపడుతుందేగానీ సీసీ కెమెరాల్లో చిక్కలేదు. ఆ తరువాత అంజార్ ప్రాంతంలో సీసీ కెమెరాలు పెట్టారు. అయినా ఫలితం లేకపోయింది. అటవీశాఖకు మళ్లీ అనుమానం వచ్చింది. మరో పది చోట్ల సీసీ కెమెరాలను ఉంచారు. ఎట్టకేలకు గురువారం రాత్రి సీసీ కెమెరాల్లో చిరుత సంచారం కనపడింది. ఐదేళ్ల వయస్సు కలిగిన చిరుత కదలికలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. వాటి పాదం గుర్తుల ఆధారంగా వివరాలను సేకరించాల్సిందిగా అటవీశాఖను ఆదేశించినట్లు శుక్రవారం తనను కలిసిన మీడియాకు సౌందరపాండియన్ చెప్పారు. గొర్రెలు మేపరాదని, అటవీ సరిహద్దుల్లో ఒంటరిగా సంచరించరాదని నిషేధాజ్ఞలు జారీచేసినట్లు తెలిపారు. ఊటీ, వాల్పారై, కోవై తదితర ప్రాంతాల్లో చిరుత సంచారం ఉందని ఓ అటవీశాఖాధికారి చెప్పారు. అడవిలో బోన్లు, గొలుసులు పెట్టినట్లు చెప్పారు. బోనులో కుక్క చిక్కుకుంటే 3 కి.మీ, చిరుత, గొర్రె తదితర జంతువులు చిక్కుకుంటే 2 కి.మీ వరకు వినిపించేలా సైరన్ అమర్చినట్టు తెలిపారు. జనావాసంలో సంచరిస్తున్న చిరుతలను వారంలోగా పట్టుకుంటామని వెల్లడిం చారు. సీసీ కెమెరాల్లో కనపడుతున్న చిరుత గర్భంతో ఉందని, ఇదే ప్రాంతంలో మరో మగ చిరుత కూడా ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. చిరుత దాడిలో రేంజర్ మృతి: ఈరోడ్డు జిల్లా సత్యమంగళం అటవీ చెక్పోస్టు వద్ద డ్యూటీలో ఉన్న కృష్ణన్ (53) అనే రేంజర్ను గురువారం రాత్రి ఓ చిరుత పొట్టనపెట్టుకుంది. చెక్పోస్టులో కృష్ణన్తో పాటు ముత్తుస్వామి (40) అనే మరో రేంజర్ కూడా ఉన్నారు. గురువారం రాత్రి చెక్పోస్టుకు సమీపంలోని బంకులో టీ తాగేందుకు ముత్తుస్వామి వెళ్లాడు. ఇంతలో ఓ చిరుత వచ్చి కృష్ణన్పై దాడిచేసింది. భయాందోళనకు గురైన ముత్తుస్వామి ఫ్లయింగ్ స్క్వాడ్, అగ్నిమాపక దళాలకు సమాచారం అందించాడు. హుటాహుటిన అక్కడికి చేరుకుని బాణసంచాకాలుస్తూ, కాగడాలతో చిరుతను తరిమివేశారు. అయితే అప్పటికే కృష్ణన్ చనిపోయినట్లు గుర్తించారు. ఇదే చెక్పోస్టు వద్ద ఇటీవల ఓ లారీ డ్రైవర్ను సైతం చిరుత బలితీసుకుంది. -
బొమికెలను మెడలో వేసుకుందాం..
చికెన్ తింటాం.. మరి మిగిలిపోయిన బొమికెలను ఏం చేస్తారు.. ఏం చేస్తాం.. పడేస్తాం అని అంటారా.. వాటిని మెడలో వేసుకోండి అని మేమంటే.. కచ్చితంగా వెరైటీ లుక్ ఇస్తారు కదూ.. ఇదేం ఆదిమ జాతి అలవాటు అంటూ ముఖం చిట్లిస్తారు కదూ.. ఇది ఆదిమ జాతి అలవాటు కాదు.. ఆధునిక ఫ్యాషన్ అట!! చిత్రంలో కనిపిస్తున్నది అదే. ప్రపంచ ప్రఖ్యాత కేఎఫ్సీ(కెంటకీ ఫ్రైడ్ చికెన్) గురించి అందరికీ తెలిసిందే. ఈ బ్రాండ్కు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులున్నారు. వీరిలో కొందరికి.. తమకు ఎంతగానో నచ్చే కేఎఫ్సీ చికెన్కు మరింత ప్రఖ్యాతి తేవాలని.. అది చిరస్థాయిలో నిలిచిపోయేలా చేయాలని అనిపించింది. దాంతో ఈ చిత్రమైన ఆలోచన వారి బుర్రకు తట్టింది. కేఎఫ్సీ చికెన్ తినగా మిగిలిపోయే బొమికెలను ఆభరణాలుగా మార్చేయాలని ఆ అభిమాన గణంలో భాగమైన ‘కెంటకీ ఫర్ కెంటకీ’ అనే సంస్థ యోచించింది. ఈ పనిని కేఎఫ్సీ అభిమాని, ఆభరణాల డిజైనర్ మెగ్సీకి అప్పజెప్పింది. మెగ్సీ ఏం చేసింది? ఓ రోజు రాత్రి తన బాయ్ఫ్రెండ్తో కలిసి తిన్న కేఎఫ్సీ చికెన్లో మిగిలిపోయిన బొమికెలను జాగ్రత్తగా దాచి పెట్టింది. అవి మొత్తం 20. వాటిని జాగ్రత్తగా కడిగేసి.. కాపర్ పెయింటింగ్ వేసి.. కొన్ని ప్రక్రియల అనంతరం 14 క్యారెట్ల బంగారు నెక్లెస్గా మార్చేసింది. ప్రస్తుతం లిమిటెడ్ ఎడిషన్ పేరిట ఆ 20 కేఎఫ్సీ బోన్ గోల్డ్ నెక్లెస్లను అమ్మకానికి పెట్టారు. వీటిల్లో చిన్న సైజు బొమికెతో చేసిన నెక్లెస్ ధర రూ.7,550 కాగా.. కొంచెం పెద్ద బొమికతో చేసినది రూ.9,550. గత నెల 27 నుంచి అమ్మకాలు మొదలయ్యాయి. -
ఎముక విరిగితే...
ప్రథమ చికిత్స ప్రమాదవశాత్తూ జారిపడడం, వాహనాల ప్రమాదాలలో ఎముక విరగడం లేదా చిట్లడాన్ని చూస్తుంటాం. దీనినే ఫ్రాక్చర్ అంటాం. గాయమైన చోట చేతితో తాకినప్పుడు పేషెంటు భరించలేనంత నొప్పితో బాధపడుతున్నా, గుచ్చినట్లు నొప్పి ఉందని చెప్పినా అది ఫ్రాక్చరైందనడానికి సంకేతం. ఫ్రాక్చరైనప్పుడు కొన్నిసార్లు రక్తస్రావమవుతుంది. కొన్నిసార్లు దెబ్బ బయటకు కనిపించకుండా లోపల ఎముకకు మాత్రమే తగిలినప్పుడు మాత్రం రక్తస్రావం ఉండదు. ఫ్రాక్చర్ అయిన పేషెంటుని చాలా జాగ్రత్తగా లేవదీసి గట్టిగా, సమతలంగా ఉన్న బల్ల మీద పడుకోబెట్టాలి. పేషెంటుని కదిలించినప్పుడు ఎముకలు ఒకదానికొకటి ఒరుసుకుని ‘కరకర’ శబ్దం వచ్చిందంటే అదే ఎముక విరిగిన ప్రదేశం. ఎముక విరిగిన చోట మళ్లీ మళ్లీ రాపిడికి లోను కాకుండా ఉండడానికి దేహాన్ని సమస్థితిలో వెల్లకిలా పడుకోబెట్టాలి. గాయమైన చోట దుస్తులను తొలగించాలి. గాయానికి ఒత్తిడి కలగకుండా తీయడం సాధ్యం కాకపోతే ఆ మేరకు కత్తిరించి తొలగించాలి. గాయంతోపాటు రక్తస్రావమవుతుంటే వస్త్రాన్ని ఒత్తుగా మడత పెట్టి గాయం మీద అదిమి (ఎముకపై ఒత్తిడి పడకుండా ఒక మోస్తరుగా) పట్టుకోవాలి. ఫ్రాక్చరైనప్పుడు గాయాన్ని నీటితో కడిగే యత్నం చేయరాదు. రక్తస్రావం తగ్గిన తర్వాత గాయానికి బ్యాండేజ్ క్లాత్, అందుబాటులోని శుభ్రమైన వస్త్రంతో కట్టుకట్టి హాస్పిటల్కు తీసుకెళ్లాలి. ఎముక విరిగిన చోట ఒత్తుగా వస్త్రాన్ని పెట్టి దానిపై మరో వస్త్రంతో కట్టుకట్టాలి. గాయమైన ప్రదేశాన్ని బట్టి సాధారణ వాహనంలో, లేదా అంబులెన్స్లో తీసుకెళ్లాలి. ఉదాహరణకు చేతి ఎముక ఫ్రాక్చర్ అయితే ప్రథమ చికిత్స తర్వాత సాధారణ వాహనంలో తీసుకెళ్లవచ్చు. కానీ, కాలు, వెన్నెముక, మెడ వంటి చోట్ల ఎముక విరిగినా, చిట్లినా అంబులెన్స్లో తీసుకెళ్లడమే శ్రేయస్కరం. -
ఎముకల నుంచి నూనె, డాల్డా తయారీ
రాజేంద్రనగర్, న్యూస్లైన్: ఆకలి వేస్తోంది కదా అని కనిపించిన ప్రతీ హోటల్లో ఏది బడితే అది తినకండి. అలా తిన్నారా.. చేజేతులా మీ ఆరోగ్యాన్ని మీరే నాశనం చేసుకున్నవారవుతారు. కాసులకు కక్కుర్తిపడి కొందరు ఎముకల నుంచి నూనె, డాల్డా తయారు చేస్తున్నారు. కొన్ని హోటళ్లలో వీటితో ఆహారాన్ని వండి ప్రజల ఆరోగ్యానికి హానికలిగిస్తున్నారు. పశువుల ఎముకల నుంచి అక్రమంగా నూనె, డాల్డా తయారు చేస్తున్న ఓ పరిశ్రమ గుట్టును గగన్పహాడ్ గ్రామస్తులు బుధవారం రట్టు చేశారు. స్థానికుల కథనం ప్రకారం... గగన్పహాడ్ గ్రామ పరిధిలో దాదాపు ఒక ఎకరం స్థలంలో నగరానికి చెందిన హమీద్ అనే వ్యక్తి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి డీసీఎంలో ఎముకలను తీసుకొస్తున్నాడు. పెద్ద పెద్ద కళాయిల్లో ఎముకలను వేసి మరిగించి వాటితో నూనె, డాల్డా తయారు చేయిస్తున్నాడు. అస్సాం, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన కార్మికులను ఈ పనికి ఉపయోగిస్తున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా రాత్రి సమయంలో మాత్రమే ఈ పని చేస్తున్నారు. లారీల కొద్దీ ఎముకలు ఈ ప్రాంతం మీదుగా వెళ్తుండటంతో స్థానిక యువకులకు బుధవారం ఉదయం అనుమానం వచ్చింది. వారు డీసీఎంను అనుసరించగా విషయం బయటపడింది. యువకులు ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పడంతో పెద్దసంఖ్యలో ఆ పరిశ్రమ వద్దకు వెళ్లి తరలివచ్చి దాడి చేశారు. అక్కడి పని చేస్తున్న కార్మికులపై చేసుకున్నారు. వారు ఉంటున్న మూడు గదులను, ఎముకల లోడ్తో వచ్చిన డీసీఎం వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. దాడితో భయకంపితులైన 12 మంది కార్మికులు మూటాముల్లె సర్దుకొని పారిపోయారు. ఇంత జరిగినా శంషాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి రాకపోవడం గమనార్హం. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు అన్ని విధాలా సహకరిస్తుండటంతోనే నిర్వాహకుడి ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. నగరంలోని హోటళ్లకు.... నగరంలోని హోటళ్లకు ఇక్కడి నుండి నూనె, డాల్డాను సరఫరా చేస్తున్నట్లు ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది చెప్పారు. హోటళ్ల నిర్వాహకులు ప్రతీ రోజు ఇక్కడికి వచ్చి.. తాము తయారు చేసిన నూనె, డాల్డా తీసుకెళ్తున్నట్టు వారు తెలిపారు. ఘటనా స్థలంలో 50 డ్రమ్ములలో తయారైన డాల్డా, నూనె నిల్వచేసి ఉంది. గతంలో రెండుసార్లు ఇదే స్థలంలో గతంలో రెండుసార్లు ఎముకల నుంచి నూనె, డాల్డాను తయారు చేస్తుండగా శంషాబాద్ పోలీసులకు పట్టించామని గ్రామస్తులు తెలిపారు. ఆ సమయంలో కేవలం కార్మికులను సామగ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అసలు నిందితున్ని అదుపులోకి తీసుకోలేదని వారు ఆరోపించారు. -
గాల్లో తేలినట్టుందే..!
ఆల్ఫ్స్ పర్వత శ్రేణులు.. ఫ్రాన్స్ పరిధిలోని అతి ఎత్తై మంచుకొండలు. ఎముకలు గడ్డగట్టే చలి. ఇక్కడ పర్యటించడమే పెద్ద సాహసం. అలాంటిది ఈ పర్వతశ్రేణులను అధిరోహించడం మామూలు విషయం కాదు. అయితే కొందరు ఈ మంచుకొండలను ఎక్కే సాహసాలను చేస్తుంటారు. అటువంటి వారికి కొత్తరకమైన అనుభవాన్ని ఇచ్చే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన ‘గ్లాస్కేజ్’ ఏర్పాటు చేశారు. యూరప్ ఖండ పరిధిలోని అతి ఎత్తై మంచుశిఖరం ‘మౌంట్ బ్లాంక్’కు ఈ గ్లాస్కేజ్ ఏర్పాటు చేశారు. పది అడుగుల చదరపు విస్తీర్ణంతో ఉండే ఈ క్యాబిన్లో నిలబడితే దాదాపు గాలిలో తేలిన ఫీలింగ్ ఉంటుంది. కిందివైపుకు చూస్తూ నాలుగు కిలోమీటర్ల లోతువరకూ కనిపిస్తుంది. శిఖరం మీద నుంచి కిందివైపుకు చూడటం ఒక ఎత్తయితే ఈ కేజ్లోకి ప్రవేశించి ఆ పరిసరాలను చూడటం మరో ఎత్తు. ఇదొక అనిర్వచనీైయమెన అనుభవం. -
ఎముకల మరమ్మతుకు బయోపెన్!
మెల్బోర్న్: ప్రమాదాల వల్ల ఎముకలు ధ్వంసం అయినప్పుడు లేదా మోకాలుపై మృదులాస్థి అరిగిపోయినప్పుడు వైద్యులు ఇంప్లాంట్లను అమరుస్తుంటారు. ప్రయోగశాలలో మూలకణాలతో కొన్నివారాలపాటు మృ దులాస్థిని అభివృద్ధిపర్చి కూడా అమరుస్తుంటారు. అయితే ఎముకలు దెబ్బతిన్న చోట నేరుగా మూలకణాలను అచ్చులా పోసి ఎముకలను పెంచేందుకు ఉపయోగపడే వినూత్న ‘బయోపెన్’ను ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ వోలాంగాంగ్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. 3డీ ప్రింటర్లా పనిచేసే ఈ పెన్నులో మూలకణాలు, జెల్ పదార్థాలు, ఇతర పోషక పదార్థాలను కలిపి ఇంకులా వాడతారు. ఈ ఇంకును నేరుగా ఎముకలు దెబ్బతిన్నచోట కావలసిన ఆకారం లో అచ్చుపోస్తే చాలు.. ఆ మూలకణాలు విభజన చెందుతూ ఎముకలను ఉత్పత్తిచేస్తాయి. ఇప్పటిదాకా ప్రయోగశాలలో మోకాలు వంటి మూసలపై ఈ బయోపెన్తో మృదులాస్థిని పెంచగలిగారు. దీనిపై మెల్బోర్న్లోని విన్సెంట్స్ ఆస్పత్రిలో ఔషధ పరీక్షలు చేపట్టేందుకు యత్నిస్తున్నారు. ఎముకలు మాత్రమే కాకుండా కండరాలు, నాడీకణాలను కూడా ఈ పెన్నుతో పెంచవచ్చని పరిశోధన బృందం సారథి ప్రొఫెసర్ పీటర్ చూంగ్ వెల్లడించారు. మూలకణాలతో పాటు కలిపే ఇతర పదార్థాలతో ఎలాంటి హాని ఉండదని, ఎముక కణాలు ఖాళీ చోటును ఆక్రమించగానే జెల్ పదార్థాలు విచ్ఛిన్నమవుతాయన్నారు. -
అరణ్యం: చిట్టీ చిలకమ్మా... నీ గురించి చెప్పమ్మా...
{పపంచంలో మొత్తం 372 రకాల చిలుకలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం ఉష్టమండలాల్లోనే జీవిస్తున్నాయి! చిలుకలకు గ్రహణ శక్తితో పాటు జ్ఞాపకశక్తి కూడా చాలా ఎక్కువ. అందుకే మనుషుల మాటలను అవి త్వరగా గ్రహిస్తాయి. వాటిని గుర్తు పెట్టుకుని తిరిగి వల్లె వేస్తాయి. అయితే అన్ని జాతుల చిలుకలూ అలా చేయలేవు. కొన్నే చేయగలవు. మనుషుల స్వరాన్ని అనుకరించడంలో ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్దే ప్రథమస్థానం! సాధారణంగా పక్షులు నేల మీద ఉన్న ఆహారాన్ని ముక్కుతో పట్టి తినేస్తాయి. కానీ చిలుకలు మాత్రం కాళ్లతో తీసుకుని నోట్లో పెట్టుకుని తింటాయి! చాలా రకాల చిలుకలు దాదాపు ఎనభై ఏళ్ల వరకూ జీవిస్తాయి. కానీ కొన్ని జాతులు పదిహేనేళ్లు మాత్రమే బతుకుతాయి! చిలుకలు మహా సరదాగా ఉంటాయి. వాటికి ఆడుకో వడం చాలా ఇష్టం. వాటి ఆట ఎలా ఉంటుందో తెలుసా? చుట్టుపక్కల ఉన్న వస్తువులను కొరకడం, ముక్కుతో పొడవడం వంటివి చేస్తుంటాయి. అదే వాటి ఆట! చిలుకల ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయి. చిన్న దెబ్బలు కూడా వాటి ప్రాణాన్ని తీసేయగలవు! వీటిలో ఎడమ చేతి (కాలు) వాటం ఉంటుంది. ఏ కాలితో ఆహారాన్ని తీసి నోటితో పెట్టుకుంటాయో, వాటిది ఆ వాటం అన్నమాట! {పయత్నిస్తే చిలుకలకు పదిహేడు వందల మాటల వరకూ నేర్పవచ్చు. అవి అన్ని గుర్తుపెట్టుకోగలవు! తీయని కబుర్లు చెబుతాయన్న మాటే గానీ చిలుకలకు స్వర పేటిక ఉండదు. శ్వాసనాళంలోకి గాలిని బలంగా పీల్చి వదలడం ద్వారా అవి శబ్దాలను సృష్టిస్తాయి! పావురాల ప్రేమికుడు బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ జీవితం... తెరిచిన పుస్తకం. ఆ పుస్తకంలోని పేజీల నిండా ఎన్నో విజయాలు, ఎన్నో విషాదాలు, ఎన్నో వివాదాలు నిండి ఉంటాయి. చిన్న వయసులోనే పెద్ద పెద్ద కష్టాల్ని చవి చూశాడు టైసన్. అన్నీ తట్టుకున్నాడు. ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. అయినా మొండిగా నిలబడ్డాడు. కానీ తన నాలుగేళ్ల కూతురి మరణం అతడిని నిలువునా కుదిపేసింది. బైపోలార్ డిజార్డర్ అతడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. అప్పుడతడికి ఎవరు కనిపించినా చంపెయ్యాలనిపించేదట. అలాంటప్పుడు వెళ్లి తన పెంపుడు పావురాలతో గడిపేవాడట. అప్పుడు మనసు కుదుటపడేదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. టైసన్కి మొదట్నుంచీ పావురాలంటే ఎంతో ఇష్టం. చాలా ఉండేవి అతడి దగ్గర. బాక్సర్ కాకముందు పావురాలతో పందాలు కాసేవాడట. ఆ ఇష్టం అలా పెరుగుతూ పెరుగుతూ వచ్చింది. వాటి గురించి ఎప్పుడు మాట్లాడినా... అవి లేకపోతే నేనేమైపోయేవాడినో అంటుంటాడు!