china rajappa
-
పెద్దాపురం నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం
-
నిమ్మకాయల చినరాజప్ప ఇన్ సైడర్ ట్రేడింగ్
-
‘చినరాజప్పను కోర్టు అనర్హుడిగా ప్రకటిస్తుంది’
సామర్లకోట, (పెద్దాపురం): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తప్పుడు అఫిడవిట్ను దాఖలు చేసి ఎన్నికల కమిషన్ను మోసం చేశారని ఆ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసిన తోట వాణి ఆరోపించారు. పెద్దాపురంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. అఫిడవిట్ ఫారం–26లో 5వ కాలమ్లో అభ్యర్థిపై ఏమైనా క్రిమినల్ కేసులున్నాయా, లేవా.. అనే కాలమ్లో ఎటువంటి కేసులు లేవన్నట్టు ధ్రువీకరణ పత్రం ఇచ్చారని తెలిపారు. అయితే ఓబుళాపురం మైనింగ్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండగా దౌర్జన్యంగా మారణాయుధాలు ధరించి దాడి చేశారని, పోలీసులు వారించినా వినకుండా ఎమ్మెల్యే నాగం జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో మైనింగ్ కార్యాలయానికి వెళ్లి ఆస్తులు ధ్వంసం చేశారని చెప్పారు. అడ్డువచ్చిన పోలీసులను తోసివేసి అసభ్య పదజాలంతో దూషించిన నేరానికి.. రాజప్పతో పాటు మరో 20 మందిపై 2007 జూలై 21న పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 15వ ముద్దాయిగా ఉన్న చినరాజప్పకు రాయదుర్గం కోర్టు అరెస్టు వారెంట్ జారీచేసిందని, తదుపరి ఈ కేసు విజయవాడ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయిందన్నారు. విజయవాడ కోర్టు కూడా 2018 డిసెంబర్ 28న కేసు నంబరు 50గా నమోదుచేసి అరెస్టు వారెంటు ఇచ్చిందని ఆమె చెప్పారు. కేసు నమోదు 2014 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎమ్మెల్సీగా పెన్షన్ పొందుతున్నారని, 2019 ఎన్నికలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా ఆదాయం పొందుతూ ఉండగా.. కేవలం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నట్లు అఫిడవిట్లో పేర్కొని ఎన్నికల కమిషన్ను మరో మోసం చేశారని ఆమె చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన తప్పుడు అఫిడవిట్లో దాఖలు చేసిన నకలు ఆధారాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన తప్పుడు అఫిడవిట్లపై ఈ నెల 5వ తేదీన ఏపీ హైకోర్టులో రాజప్పపై కేసు నమోదైందని.. ఆరు నెలల్లో ఆయనను కోర్టు అనర్హుడిగా ప్రకటిస్తుందని.. తదుపరి వచ్చిన మెజార్టీ ఆధారంగా ఎమ్మెల్యేగా తనకు అవకాశం వస్తుందని తోట వాణి వివరించారు. సమావేశంలో మాజీ ఎంపీ తోట నరసింహం తదితరులున్నారు. -
తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన చినరాజప్ప
-
‘చినరాజప్ప చేసిన అవినీతిని బయటపెడతా’
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా : మాజీ మంత్రి చిన రాజప్పపై పెద్దాపురం వైఎస్సార్సీపీ ఇంచార్జీ తోట వాణి ఫైర్ అయ్యారు. గత ఐదేళ్లలో అభివృద్ధి ముసుగులో రాజప్ప అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చిన రాజప్ప హోంమంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో శాంత్రి భద్రతలు కరువై 5 మర్డర్లు జరిగాయని గుర్తు చేశారు. ఐదేళ్లలో ఆయన చేసిన అవినీతిని త్వరలోనే బయటపెడతామన్నారు. ప్రజలకు సేవ చేయాలంటే పదవులే ఉండాల్సిన అవసరం లేదన్న విషయాన్ని చినరాజప్ప గమనించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను నియోజకవర్గంలో ప్రజలకు సక్రమంగా చేరేలా కృషి చేస్తానని వాణి పేర్కొన్నారు. -
రాజప్పకు మళ్లీ చుక్కెదురు
సాక్షి, కాకినాడ: ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అవినీతి, అక్రమమైనింగ్లతో తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న ఆయనకు ఎక్కడికి వెళ్లినా ఛీత్కారాలు తప్పడం లేదు. మూడు రోజుల క్రితం సామర్లకోట మండలం హుస్సేన్పురంలో అక్కడి ప్రజలు ఆయన ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి మరో భంగపాటు ఎదురైంది. మాధవపట్నం సమీపంలోని జమునా నగర్కాలనీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనను అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. ఐదేళ్లుగా తమ గ్రామ సమస్యలేవీ తీర్చారంటూ నిలదీశారు. స్మశానానికి దారిలేదంటూ ఎన్నో సార్లు సమస్యను మీ దృష్టికి తీసుకొచ్చినా పరిష్కరించలేదని మండిపడ్డారు. ఎవరైనా చనిపోతే రైలుపట్టాలు మీదుగా మృతదేహాన్ని స్మశానవాటికి తీసుకువెళ్లాల్సి వస్తోందని ఎన్నో సార్లు చెప్పినా నాడు మీరు ఎందుకు స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవపట్నం, జమునానగర్లలో స్థానిక సమస్యలు పత్రికల్లో ప్రచురితమవుతున్నా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. రాజప్ప డౌన్డౌన్ అంటూ నినాదాలు చేయడంతో రాజప్పకు మింగుడుపడలేదు. ఎన్నికలైన తరువాత ఈ సమస్యకే తొలి ప్రాధాన్యం ఇస్తానని రాజప్ప హామీ ఇవ్వగా మూడేళ్ల కిందటి నుంచి ఇదే మాట చెబుతున్నారని ధ్వజమెత్తారు. ‘చెప్పింది విను’ అని రాజప్ప చెప్పడంతో ‘ఎన్నిసార్లు వినాలి’ అంటూ కేకలు వేశారు. ఆ గ్రామ మాజీ సర్పంచి పిల్లి కృష్ణ ప్రసాద్ ఆందోళనకారులను వారించే ప్రయత్నం చేసినా గ్రామస్తులు వినకపోవడంతో ‘వాహనం ముందుకు పోవాలి’ అని రాజప్ప చెప్పి జారుకున్నారు. వరుస వ్యతిరేక చర్యలతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. రాజప్ప ఏటికి ఎదురీదాల్సిన పరిస్థితి పెద్దాపురంలో నెలకొందంటూ ఆ పార్టీ నేతలే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. -
టిక్కెట్ వచ్చిన ఆనందమేదీ..?
సాక్షి, అమలాపురం: ఆయన నిన్నటి వరకు రాజకీయ జీవితాన్నిచ్చిన గురువు. ఈయన గురువు అడుగుజాడల్లో నడిచే శిష్యుడు. కానీ రాజకీయాల్లో ఇటువంటివి తాత్కాలికమే కానీ...శాశ్వతం కాదని మరోసారి రుజువయింది. దీంతో శిష్యునికి టిక్కెట్ రాకుండా గురువు ప్రయత్నిస్తే..గురువును కాదని టిక్కెట్ తెచ్చుకున్న శిష్యుడు. ఇటువంటప్పుడు సర్వసాధారణంగా జరిగేది గురువు వైపు కొందరు..శిష్యుడు వైపు మరికొందరుగా గ్రూపులుగా ఏర్పడడం. ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకోవాలని చూడడం సర్వసాధారణం. ఇలా గురు, శిష్యుల పోరుతో అమలాపురం అసెంబ్లీ రాజకీయం రసవత్తరంగా మారింది. తెలుగుదేశం పార్టీని పుట్టి్టముంచనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ గురువు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అయితే.. శిష్యుడు అయితాబత్తుల ఆనందరావు. ఎమ్మెల్యే ఆనందరావుపై నియోజకవర్గంలో ఆ పార్టీలోనే అసంతృప్తి ఉంది. అల్లవరానికి చెందిన కొంతమంది కీలక నేతలు ఆనందరావుకు టిక్కెట్ ఇవ్వవద్దని అధిష్టానానికి ఫిర్యాదు చేసిన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అమలాపురం అసెంబ్లీ నుంచి కొత్తవ్యక్తిని పోటీ చేయించాలని ఉప ముఖ్య మంత్రి చినరాజప్ప గట్టి ప్రయత్నాలే చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆనందరావు స్థానంలో ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన బాలయోగి తనయుడు గంటి హరీష్ మాధుర్కు అవకాశం కల్పించాలని, లేదంటే పార్టీలోనే మరొకరికి అవకాశం ఇవ్వాలని అనుకున్నారు. అందుకు తగినట్టుగా వూహ్యాలు రచించారు. ఎన్నికల ముందు జరిగిన కొన్ని పరిణామాలు వీరిద్దరి మధ్య దూరాన్ని పెంచింది. మరీ ముఖ్యంగా తన తమ్ముడు జగ్గయ్యనాయుడుపై మీడియాలో వచ్చిన కథనాల వెనుక ఆనందరావు హస్తం ఉందని రాజప్ప ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు. ఇదే ఇద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచిందని అనుకుంటున్నారు. వీరిద్దరి మధ్య స్థాయిలో విభేదాలు చోటుచేసుకోవడంతో ఎట్టి పరిస్థితుల్లోను ఆనందరావుకు అవకాశం రాదని టీడీపీ క్యాడర్ భావించింది. కానీ నియోజకవర్గ సమన్వయ కమిటీ పార్టీ ఆధిష్టానంపై ఒత్తిడి చేసి ఆనందరావును తమ అభ్యర్థిగా చేసుకుంది. ముఖ్యంగా పట్టణానికి చెందిన మెట్ల రమణబాబు అతని వర్గీయులు పట్టుబట్టి ఆనందరావుకు టిక్కెట్ వచ్చేలా చేశారు. తద్వారా నియోజకవర్గంలో పట్టు సాధించారు. ఇదే సమయంలో అమలాపురంలో తనను కాదని పార్టీ ఆనందరావుకు టిక్కెట్ ఇవ్వదని భావించిన రాజప్పకు ఇది షాక్ అనే చెప్పాలి. తన మాట జవదాటని సమన్వయ కమిటీలో మెజార్టీ సభ్యులు ఆనందరావు వెనుక నిలబడడం, తీవ్ర జాప్యం తరువాత అధిష్టానం ఆనందరావును అభ్యర్థిగా ఎంపిక చేయడం రాజప్ప నియోజకవర్గంపై పట్టుకోల్పోయారనే ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాలు రాజప్ప వర్గీయులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ఆనందరావుకు టిక్కెట్ వచ్చినందుకు జరిగిన సంబరాల్లో రాజప్ప పేరు మచ్చుకైనా వినిపించలేదు. అతని సోదరుడు జగ్గయ్యనాయుడు, అతని వర్గీయులు ఈ సంబరాలకు దూరంగానే ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే అమలాపురం అసెంబ్లీ పరిధిలోని టీడీపీలో అసమ్మతి చాపకింద నీరులా మారింది. పరిణామాలన్నీ చూస్తుంటే ఈ ఎన్నికల్లో రాజప్ప వర్గీయులు అభ్యర్థి ఆనందరావుకు ఎన్నికల్లో సంపూర్ణ సహకారం అందిస్తారనే నమ్మకం కలగడం లేదు. దీనిని గుర్తించిన ఆనందరావు నష్ట నివారణ చర్యలకు దిగారు. రాజప్ప, అతని సోదరుడు జగ్గయ్యనాయుడుతో మంతనాలు చేపట్టారు. మంగళవారం రాత్రి పెద్దాపురం వెళ్లిన ఆనందరావు రాజప్పను కలిసి గతంలో జరిగిన పరిణామాల్లో తన ప్రమేయం లేదని వివరణ ఇవ్వడంతోపాటు తనను ఆశీర్వదించాలని కోరినా పెద్దగా ఫలితం లేదని తెలిసింది. ‘అధిష్టాన నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. నిన్ను గెలిపించాలని పార్టీ నాయకులకు చెబుతాను. నేను ఇక్కడ అభ్యర్థిని కాబట్టి నీ వెంట నేను ప్రచారానికి రాలేను’ అని చినరాజప్ప తేల్చిచెప్పేశారు. అన్నయ్యతోపాటు పెద్దాపురంలో ఉంటాను, నీ వెంట ఉండలేనని జగ్గయ్యనాయుడు కూడా కుండబద్దలు కొట్టడంతో నిరాశగానే వెనుతిరగాల్సి వచ్చింది. మరోవైపు ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురంలో ఆనందరావుపై అసంతృప్తితో ఉన్న కొంతమంది ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు టీడీపీని వీడే యోచనలో ఉన్నారు. ఇది పార్టీకి మరింత తలనొప్పిగా మారనుంది. జరుగుతున్న ఈ పరిణామాలతో పోరాడి టిక్కెట్ తెచ్చుకున్నాననే ఆనందం అభ్యర్థి ఆనందరావుకు లేకుండాపోయింది. పార్టీ పెద్దలు కలగజేసుకుని సర్ధిచెప్పినా ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. -
చిన రాజప్పకు చంద్రబాబు హ్యాండ్..!
సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలకు తీవ్ర అవమానం ఎదురవుతోంది. ఇప్పటికే మంత్రులు గంటా శ్రీనివాసరావు, స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు టికెట్ల కేటాయింపు విషయంలో టీడీపీ అధిష్టానం వ్యవహరించిన తీరు.. ఆయా నేతల అనుచరుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ఇప్పుడు ఏకంగా ఉపముఖ్యమంత్రి చిన రాజప్ప సీటుకే ఎసరు పరిస్థితి కనిపిస్తోంది. చిన రాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గం సీటు విషయంలో కొత్త పేరు తెరపైకి వచ్చింది. బొడ్డు భాస్కర రామారావుకు పెద్దాపురం నుంచి టికెట్ ఇచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. తాజాగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు భాస్కర రామారావును అమరావతికి పిలువడంతో.. ఆయనకు సీటు ఖరారైందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో డిప్యూటీ సీఎం చిన రాజప్పకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారని, ఆయనకు టీడీపీ టికెట్ లేనట్టేనని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు తన సీటు వేరే వ్యక్తికి కేటాయించేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారని తెలియడంతో ఆందోళన చెందిన చిన రాజప్ప హుటాహుటిన అమరావతికి బయలుదేరారు. -
చినరాజప్పపై తోట వాణి ఆగ్రహం
-
‘చనిపోయిన నా తండ్రినీ ఆయన వదల్లేదు’
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ మంత్రులు చినరాజప్ప, యనుమల రామకృష్ణుడిపై కాకినాడ ఎంపీ తోట నరసింహం సతీమణి తోట వాణి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. ‘రాజకీయంగా నా తండ్రితో పాటుగా నా కుటుంబాన్ని తొక్కెయ్యడానికి హోం మంత్రి రాజప్ప ప్రయత్నాలు చేశారు. చనిపోయిన నా తండ్రిని కూడా రాజప్ప వదల్లేదు. టీవీలలో నా తండ్రి మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణను వాడు వీడు అని రాజప్ప సంభోధించారు. నా తండ్రి.. నా భర్త నేర్పిన సంస్కారం వల్ల రాజప్పను తిరిగి నేను ఒక్క మాట కూడా తప్పుగా అనలేదు. రాజప్ప మా కుటుంబాన్ని ఎంత దారుణంగా అణగదొక్కారో ప్రజలందరికి తెలుసు. ఎక్కడో కోనసీమ నుంచి తీసుకొచ్చి రాజప్పను పెద్దాపురంలో పెడతారా. ఇక్కడ నాయకులు లేరా. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో చెప్పబోతున్నాను’ అని వాణి ధ్వజమెత్తారు. సంస్కారం లేని పెద్దాయన ‘నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయాలన్న జ్ఞానం లేని ఓ పెద్దాయన జిల్లాలో ఉన్నారు. ఆయనది బలుపో.. బద్దకమో తెలియదు’ అని పరోక్షంగా ఆర్థిక మంత్రి యనుమల రామకృష్ణుడికి వాణి చురకలు అంటించారు. అలాంటి వ్యక్తుల మధ్య మనుగడ సాధించలేమని భావించిన కారణంగా తాను, తన భర్త నరసింహం టీడీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నామని స్పష్టం చేశారు. ‘రేపు వైఎస్సార్ సీపీలో చేరుతున్నాం. ఆ పార్టీ మాకు సముచిత స్ధానం ఇస్తుందని నమ్ముతున్నాం. వైఎస్ జగన్ మాకు భరోసా కూడా ఇచ్చారు’ అని ఆమె హర్షం వ్యక్తం చేశారు. -
టీడీపీలో బయటపడ్డ గ్రూపు రాజకీయాలు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. వచ్చే ఎన్నికలకు ప్రస్తుతం హోంమంత్రి చినరాజప్పకే మళ్లీ పెద్దాపురం సీటును చంద్రబాబు ఖరారు చేయడంతో పార్టీలో లుకలుకలు వెలుగుచూశాయి. పెద్దాపురం సీటు తనకే వస్తుందని చివరి నిమిషం వరకు ఆశపడ్డ మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు భంగపడ్డారు. దీంతో పెద్దాడలోని తన నివాసంలో బొడ్డు భాస్కర్, అనుచరులతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ మారైనా వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం నుంచే పోటీ చేయాలని సన్నిహితులు సమావేశంలో ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. అధిష్టానం నిర్ణయం మారుతుందో లేదో రెండు రోజులు వేచి చూసి టీడీపీకి బైబై చెప్పే యోచనలో బొడ్డు భాస్కర్ రామారావు ఉన్నట్లు తెలిసింది. కార్యకర్తలతో సమావేశం ముగిసిన తర్వాత బొడ్డు మాట్లాడుతూ.. పెద్దాపురం సీటు తనకు ఇవ్వకపోతే వేరే పార్టీ నుంచి లేదా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. రాజమండ్రి ఎంపీగా తాను పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కూడా తేల్చిచెప్పారు. -
డేంజర్ డెంగీ..
సాక్షాత్తూ అది రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప నియోజకవర్గంలోని పెద్దాపురం మున్సిపాలిటీ. మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన పలు ప్రాంతాల్లో డెంగీ మహమ్మారి జడలు విప్పుతోంది. పారిశుద్ధ్య నిర్వహణను ఆ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని వార్డుల కౌన్సిలర్లే చెబుతున్నారంటే అక్కడి అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజాప్రతినిధుల మాటకే విలువ ఇవ్వని అధికారులు ఇక ప్రజల మాట ఎందుకు వింటారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారి నిర్లక్ష్యం కారణంగా పట్టణంలో పలువురు డెంగీ వంటి విషజ్వరాల బారిన పడుతున్నారు. తూర్పుగోదావరి, పెద్దాపురం: డెంగీ మహమ్మారీ జడలు విప్పుతోంది. గతంలో మండలంలోని గోరింట, చదలాడ గ్రామాల్లోని పలువురితో పాటు పెద్దాపురం పట్టణంలోని ఒకటో వార్డు కౌన్సిలర్కు ఈ వ్యాధి సోకింది. అపారిశుద్ధ్యంపై పత్రికల్లో కథనాలు వచ్చినా స్పందించని మున్సిపల్, వైద్య శాఖాధికారుల వైఫల్యానికి తాజాగా 17వ వార్డు కౌన్సిలర్ తాళాబత్తుల కామేశ్వరి కుమార్తె సావిత్రి (22) ఈ డెంగీ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమెను విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పారిశుద్ధ్య విభాగ అధికారుల పనితీరు అసంతప్తిగా ఉందనడానికి నిదర్శనం ఈ డెంగీ కేసులు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. గతంలో డయేరియా మహమ్మారి పట్టణాన్ని ఓ కుదుపు కుదిపేసిన సంఘటనలు మరచిపోయి కనీసం శానిటేషన్ పనులు పూర్తిగా చేయకపోవడం పట్ల పాలనా యంత్రాంగానికి ప్రజారోగ్యంపై ఎంత బాధ్యత ఉందో అర్థమవుతూనే ఉందని పలువురు వాపోతున్నారు. రోగాలపై ప్రజలకు అవగాహన కల్పించి ఇళ్ల వద్ద పరిశుభ్ర వాతావరణం కల్పించాలని వైద్యాధికారులు కరపత్రాల ద్వారా బృందాలు ఏర్పాటు చేసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అది కాస్తా తూతూ మంత్రంగానే చేయడంతో చాలా చోట్ల అపరిశుభ్ర వాతావరణ మధ్యనే ప్రజలు జీవిస్తున్నారు. సంబంధిత వార్డు కౌన్సిలర్ కామేశ్వరి భర్త సాయి పలుమార్లు ఎన్టీఆర్ విగ్రహం వద్ద పేరుకుపోయిన పూడిక తీయాలని ఐదు నెలలుగా అధికారులకు చెబుతున్నా వారు పట్టించుకోలేదు. ఫలితంగా తన కుమార్తెకు డెంగీ ప్రబలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిపినా కనీసం డ్రెయిన్లో పూడిక చేపట్టకపోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్, వైద్య శాఖల ఉన్నతాధికారులు స్పందించి డెంగీ కారణాలపై ప్రజలకు అవగాహనతో పాటు పారిశుద్ధ్య పనులు మెరుగు పర్చాలని పలువురు కోరుతున్నారు. -
తెలంగాణలో టీడీపీ బలంగా లేదు : చినరాజప్ప
సాక్షి, అమరావతి : తెలంగాణలో టీడీపీ బలంగా లేకపోవడంతోనే 13 స్థానాల్లో పోటీ చేశామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చినరాజప్ప అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తొలిసారి ఆయన స్పందించారు. ప్రజలు మంచోళ్లు, తెలివైన వాళ్లు కాబట్టే అభివృద్ధికి ఓటేశారని వ్యాఖ్యానించారు. ఏపీలో కూడా ప్రజలు అదే విధంగా తీర్పును ఇస్తారని అభిప్రాయపడ్డారు. కాగా తెలంగాణ ఎన్నికల్లో 13 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన విషయం తెలిసిందే. -
వాల్.. వార్..
ఏలేరు ఆధునికీకరణ పనులు అధికార పక్ష ప్రజాప్రతినిధుల మధ్య వివాదానికి ఆజ్యం పోశాయి. సాక్షాత్తూ హోంమంత్రి, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప అనుచరులు, పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడం హాట్ టాపిక్గా మారింది. రక్షణ గోడ పనుల విషయంలో రాద్ధాంతం మొదలైంది. ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వర్మ ఆందోళనకు దిగడంతో పరిస్థితి మరింత తీవ్రతరమైంది. తూర్పుగోదావరి, పెద్దాపురం: ఏలేరు ఆధునికీకరణ పనులు అధికార పక్ష ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వివాదానికి తెర తీశాయి. శివారు భూములకు ఏలేరు నీరు అందాల్సి ఉండగా, ఏలేరు ఆయకట్టుపై పెద్దాపురం మండలం దివిలిలో నిర్మిస్తున్న రక్షణ గోడ నిర్మాణ విషయంలో ఆదివారం మధ్యాహ్నం పిఠాపురం ఎమ్మెల్యే వర్మ, మంత్రి రాజప్ప అనుచరుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. పిఠాపురం రోడ్డులో అప్రోచ్ నిర్మాణం జరుపుతున్న మండల సర్పంచ్ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు కొత్తెం కోటి, వారి అనుచరులపై అప్రోచ్ నిర్మాణం ఆపాలంటూ ఎమ్మెల్యే వర్మ ఆందోళనకు దిగారు. అక్రమ కట్టడం కాదని, రక్షణ గోడ నిర్మాణం చేపడుతుంటే పనులు నిలపాలనడం సరికాదంటూ కోటి వర్గీయులు పనులు ఆపకుండా కాంక్రీట్ పనులు చేపట్టారు. దీంతో ఆగ్రహించిన వర్మ ప్రత్తిపాడు –సామర్లకోట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పెద్దాపురం డీఎస్పీ చిలకా వెంకట రామారావు ఆధ్వర్యంలో సీఐ యువకుమార్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు కల్పించారు. మంత్రి సహాయకులు నిమ్మకాయల సుబ్బారావు, ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణారావు వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వర్మ ఆగలేదు. ‘‘ఆరు రోజుల నుంచి ఈ ఈఈ గాడికి చెబుతూనే ఉన్నాను.. అయినా ఈ నా కొడుకులు పట్టించుకోవట్లేదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన వర్గీయులు ఆందోళన తీవ్రతరం చేయడంతో విషయాన్ని ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు నిర్మాణ పనులు తాత్కాలికంగా వాయిదా వేస్తామని హామీ ఇవ్వడంతో వర్మ ఆందోళన విరమించారు. మూడు గంటల ఉద్రిక్త పరిస్థితుల అనంతరం ఆందోళన విరమించడంతో ఇటు పోలీసులు, ఇరిగేషన్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైతులకు అన్యాయం జరిగితే సహించం ఏలేరు రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ అన్నారు. దివిలి జంక్షన్లో రైతులు చేపట్టిన ఆందోళనకు ఆయన మద్దతు పలికారు. అప్రోచ్ నిర్మాణంలో అక్రమంగా రైతులకు నీరు విడుదల కాకుండా చేస్తే సహించేది లేదన్నారు. రైతుల పక్షాన ఆందోళనకు సిద్ధమవుతాం.. ఏలేరు నీరు శివారు భూములకు అందకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే రైతుల పక్షాన ఆందోళనకు సిద్ధమవుతామని పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ పెండెం దొరబాబు హెచ్చరించారు. ఏలేరు ఆధునికీకరణ పనుల పేరుతో దివిలిలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై రైతుల ఆందోళనకు మద్దతుగా దివిలి వచ్చిన ఆయన అధికారులతో మాట్లాడారు. ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణారావు, సర్పంచ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు కొత్తెం కోటి, రైతులతో సమావేశమై రైతులకు ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు చేపట్టాలని నీరు ఇబ్బందులకు కారణమైతే ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. అప్రోచ్ నిర్మాణం తాత్కాలిక వాయిదాకు చర్యలు దివిలిలో జరుగుతున్న అప్రోచ్ నిర్మాణాన్ని రైతుల అభిప్రాయాల మేరకు తాత్కాలిక వాయిదాకు చర్యలు చేపట్టామని ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణారావు అన్నారు. పిఠాపురం నియోజకవర్గ రైతుల ప్రధాన డిమాండ్ మేరకు జిల్లా కలెక్టర్ దృష్టిలో ఉంచామని, అప్రోచ్ నిర్మాణంపై పూర్తి విచారణ చేపట్టి రక్షణ గోడ నిర్మాణం చేపడతామన్నారు. -
చినరాజప్పకు మిత్రుడిగా ఉండడం కంటే...
తూర్పుగోదావరి, సామర్లకోట (పెద్దాపురం): ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప లాంటి సంస్కారహీనుడికి మిత్రుడిగా ఉండడం కంటే శత్రువుగా ఉండడమే సంతోషమని మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు వ్యాఖ్యానించారు. రాజప్ప ఇటీవల ఒక టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూపై స్పందిస్తూ భాస్కర రామారావు బహిరంగ లేఖ రాశారు. దాని పూర్తి పాఠం.. గౌరవ ఉపముఖ్యమంత్రి వర్యులు, హోంశాఖ మంత్రి వర్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారికి.. మీ స్థాయికి, సంస్కారానికి సంబంధం లేదని మీ మాటలు నిరూపిస్తున్నాయి. ఒక రాష్ట్ర శాంతి భద్రతలని పరిరక్షించే అత్యంత కీలకమైన హోంమంత్రి పదవిలో వుండి దాని పరువు తీస్తూ నోరు పారేసుకోవడం మీకే చెల్లింది. ఈ మధ్య కాలంలో ఒక టీవీ చానల్కు ఇచ్చిన ప్రోగ్రామ్లో నన్ను మరియు దివంగత నేత మెట్ల సత్యనారాయణరావును మీ శత్రువులుగా చెబుతూ ఏక వచనంతో హీనంగా, అణుమాత్రం సభ్యత లేకుండా మాట్లాడిన తీరు రాష్ట్ర ప్రజ లంతా అసహ్యించుకొనేలా ఉంది. జీవించినంత కాలం మంచికి మారుపేరుగా నిలిచిన మెట్ల సత్యనారాయణరావుని, మీ జీవిత కాలంలో ఏమీ చేయలేని మీరు ఆయన మరణించిన తరువాత ఇప్పుడు విమర్శిస్తుంటే ఆకాశం మీద ఉమ్మేసినట్లుంది. చనిపోయిన వారి గురించి చెడుగా మాట్లాడే సంస్కారం ఏ సీమదో తెలియదుగానీ, కోనసీమది మాత్రం కాదు, తెలుగుజాతిది కాదు. ఇక నన్ను శత్రువుగా భావిస్తూ మీరు మాట్లాడడం, ఏకవచనంతో వెటకారంగా మాట్లాడడం బాధనిపించినా మీలాంటి సంస్కారహీనుడికి మిత్రుడుగా కన్నా శత్రువుగా ఉండడమే మేలు! మీ శత్రుత్వం మాకు సంతోషం. ఇకపై దానినే కొనసాగిద్దాం! మీరు టీవీ చానల్లో మాట్లాడినవి అన్నీ అబద్ధాలే. గత 25 సంవత్సరాలలో జిల్లా తెలుగుదేశం పార్టీకి, పెద్దాపురం నియోజకవర్గానికి మీరేం చేశారో, నేనేం చేశానో జిల్లా నాయకులకు మరియు పెద్దాపురం నియోజకవర్గ ప్రజలకు, బాగా తెలుసు. ఈ విషయంలో నేను బహిరంగ చర్చకు సిద్ధం. మన పార్టీ పెద్దలు అయిన యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ వంటి పెద్దల సమక్షంలోఈ బహిరంగ చర్చకు నేను సిద్ధం. పెద్దాపురం నియోజకవర్గం నా జన్మభూమి. ఇక్కడ ప్రజలతో నాది ఎప్పుడూ రక్త సంబంధమే. ఇక్కడ నేనెప్పుడూ అతిథిని కాదు. సొంత మనిషిని. అని మళ్లీ వక్కాణిస్తూ బహిరంగ చర్చకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ.... మీరు శత్రువుగా భావించే – బొడ్డు భాస్కర రామారావు -
‘పవన్ కల్యాణ్ స్థిరత్వం లేని మనిషి’
సాక్షి, అమరావతి : సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెనుక బీజేపీ ఉందన్న విషయం మాజీ మంత్రి మాణిక్యాల రావు మాటలతో స్పష్టమైందని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. అమరావతిలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. ఎవరైనా తమ పార్టీ బలంగా ఉందంటారు కానీ పవన్ కల్యాణ్ బలంగా ఉన్నారని బీజేపీ నాయకులు ఎలా చెబుతారని ఎద్దేవా చేశారు. ముద్రగడ పద్మనాభం వెనక ఎంత మంది కాపులున్నారో, పవన్ కల్యాణ్ వెనుక అంతే మంది కాపులున్నారని తెలిపారు. ఏపీలో ఉండాల్సిన పవన్ కల్యాణ్ ఏపీలో రెండు రోజుల టూర్ పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. వాళ్లు అప్పుడప్పుడు పోరాడుతున్నారని, తాము ఎప్పుడూ పోరాడుతూనే ఉన్నామని వ్యాఖ్యానించారు. పవన్ స్థిరత్వం లేని మనిషి: కళా వెంకట్రాటావు మరో మంత్రి కళా వెంకట్రావు మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ స్థిరత్వం లేని మనిషని తేలిపోయిందని వ్యాఖ్యానించారు. పేదలు, రైతులు ప్రభుత్వ పనితీరుతో సంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఎంతమంది కలిసి పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసినా టీడీపీ ఇబ్బంది ఉండదని చెప్పారు. -
విడ్డూరం.. హోంమంత్రికి దారివ్వలేదని
సాక్షి, ముమ్మడివరం : తూర్పు గోదావరి ముమ్మడివరం పోలీసులు అత్యుత్సాహం చూపారు. స్వామి భక్తిని నిరూపించుకొనే పని చేశారు. రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా.. పోలీసుల అనుకుంటే కేసుల కొదవా అన్నట్లు ముమ్మడివరం పోలీసులు ఏకంగా ఆర్టీసీ బస్సునే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. బస్సును పోలీస్ స్టేషన్ తరలించడం ఏంటి అనుకుంటున్నారా? అవును నిజమే. ఏం జరిగిందంటే.. హోంమంత్రి చిన రాజప్ప జిల్లా పర్యటన నిమిత్తం కాన్వాయ్ కాకినాడ - అమలాపురం మార్గంలో వెళ్తోంది. అదే మార్గంలో నాన్స్టాప్ సర్వీస్ ఆర్టీసీ బస్ వెళ్తోంది. రోడ్డులో ఇతర వాహనాలు ఎక్కువగా ఉండటంతో ఆర్టీసీ డైవర్ హోంమంత్రి కాన్వాయ్కు సైడ్ ఇవ్వలేక పోయారు. అంతే హోంమంత్రి దగ్గర స్వామి భక్తి నిరూపించుకొనే అవకాశం వచ్చిందనుకున్నారో ఏమో, ఆర్టీసీ బస్సును ముమ్మడివరం పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సంఘటనపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రికి దారి ఇవ్వలేదంటూ బస్సును పోలీస్ స్టేషన్ తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. తాము ఓట్లేసి గెలిపిస్తే అధికారంలో ఉన్న నాయకులు, ప్రజలను ఇలా ఇబ్బందుల పాలు చేయడం ఏంటని మండిపడ్డారు. -
ఏపీ హోం మంత్రికి తీవ్ర అవమానం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చినరాజప్పకు తీవ్ర అవమానం జరిగింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభానికి హోంమంత్రికి ఆహ్వానం లభించలేదు. వివరాల్లోకి వెళ్తే ఫోరెన్సిక్ ల్యాబ్ కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శంఖుస్థాపన చేశారు. అయితే ఆసమయంలో హోంమంత్రి అక్కడ లేకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు ప్రొటోకాల్ పాటించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభానికి హోంమంత్రి చినరాజప్పకు ఆహ్వానం అందలేదు. తూతూ మంత్రంగా ఒక కానిస్టేబుల్తో ఆహ్వానం పంపించి చేతులు దులుపుకున్నారు. దీంతో హోంమంత్రి చినరాజప్ప అలకపూనారు. ప్రారంభోత్సవానికి వెళ్లకుండా హుటాహుటిన తిరుమలకు వెళ్లారు. ఇప్పటికే చాలా సార్లు ఇలాంటి సంఘనలు జరిగాయని మంత్రి వాపోయినట్టు సమాచారం. ఇప్పటివరకూ తనకు ఆహ్వానం అందినా అందకపోయినా ప్రతి కార్యక్రమానికి వెళ్లానని, కానీ ఇప్పుడు సొంత శాఖలో జరిగిన అవమానాన్ని మాత్రం ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నానని అన్నారు. అయితే ఈసంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్లో హోంమంత్రిని బుజ్జగించే పనిచేశారు. దీనిపై స్పందిచడానికి హోంశాఖ అధికారులు, ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు నిరాకరించారు. సాక్షాత్తు మంత్రికే ఇలా జరగడంతో భవిశ్యత్తులో తమలాంటి చిన్న నేతల పరిస్థితి ఏంటని తెలుగుదేశం నేతలు గుసగుసలాడుతున్నారు. చినరాజప్పకు తీవ్ర అవమానం -
ఆ బాధ్యత మాపై ఉంది: చినరాజప్ప
అమరావతి: ఏపీలో శాంతిభద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత మాపై ఉందని ఏపీ ఉప ముఖ్య మంత్రి చినరాజప్ప తెలిపారు. ఇందులో భాగంగానే అనుమతి లేని సభలను నియంత్రిస్తున్నామని చెప్పారు. తెలంగాణ వాళ్లు వచ్చి ఆంధ్రాలో సమస్యలు సృష్టించాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రాలో ఎవరికి ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. -
ఏఎంసీలు ఉత్సవ విగ్రహాలు కాకూడదు
భీమవరం : వ్యవసాయ మార్కెట్ కమిటీలు (ఏఎంసీ)లు ఉత్సవ విగ్రహాలుగా కా కుండా రైతులకు ఉపయోగపడేలా పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. భీమవరం వ్యవసాయ మార్కె ట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆదివారం ఏఎం సీ ఆవరణలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. మార్కెట్ కమిటీలు పుంత రోడ్లు, గోదాముల నిర్మా ణం, పశుసంపద అభివృద్ధికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేయాలని సూచిం చారు. ప్రస్తుత దాళ్వా సీజన్కు గోదావరిలో నీరు తక్కువ ఉన్నందున సీలేరు, బలిమిలేరు నుంచి నీరుతెస్తున్నామని కా లువల ఆధునికీకరణపై దృష్టిసారించామని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో రైతులకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని దీనిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రైతులకు అండగా ఉండాలి ఏఎంసీలు రైతులకు అండగా నిలవాలలని గనులు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఎమ్మె ల్యే పులపర్తి రామాంజనేయులు అధ్యక్షత వహిం చి కమిటీ అధ్యక్షుడు కోళ్ల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు చెల్లబోయిన వెంకట సుబ్బారావు, సభ్యులు బొక్కా చంద్రమోహన్, భలే లూర్ధమ్మ, సాలా నర్సింహమూర్తి, సయ్యపరాజు భాస్కరరాజు, ఎండీ ఆలీషా (షా బు), దంపనబోయిన అప్పారావు, కడలి నెహ్రు, నాగిడి తాతాజీ, కొల్లాటి శ్రీనివాసరావు, భూపతిరాజు నాగేంద్రవర్మ, గొలగాని సత్యనారాయణ, కురిశేటి శ్రీరామమూర్తి, ముచ్చకర్ల సుబ్బారావు, కొటికలపూడి గోవిందరావు, నూకల కేశవ రమేష్ అప్పాజీతో ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మెల్యేలు వేటుకూరి వెంకటశివరామరాజు, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, పాకా సత్యనారాయణ, గోకరాజు రామం, మెంటే పార్థసారథి, కారుమూరి సత్యనారాయణమూర్తి, మామిడిశెట్టి ప్రసాద్, వబిలిశెట్టి కనకరాజు, గనిరెడ్డి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. కోడి పందేలకు దూరంగా ఉండాలి కోర్టు ఉత్తర్వుల దృష్ట్యా కోడి పందేలకు ప్రజలు దూరంగా ఉండాలని చినరాజప్ప పిలుపునిచ్చారు. భీమవరంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సం క్రాంతిని పురస్కరించుకుని తెలుగురాష్ట్రాల్లో కోడిపందేలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తుందని, అందువల్లనే తమ ప్రభుత్వం కూడా ముందుగా పందేల నిర్వహణపై ఉదాసీనంగా ఉం దని చెప్పారు. ఇటీవల హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పుల దృష్ట్యా సంక్రాంతికి కోడిపందేలు నిర్వహించరాదని హోం మం త్రి చినరాజప్ప సూచించారు. -
అమరావతిలో సైకిల్, వాకింగ్ ట్రాక్లు
- తిరుపతిలో హాఫ్ మారథాన్ ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం చిన రాజప్ప తిరుపతి గాంధీరోడ్డు: ఏపీ రాజధాని అమరావతిలో సైకిల్, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర హోం మంత్రి, డిప్యూటీ సీఎం చినరాజప్ప తెలిపారు. డిసీజ్ ఎరాడికేషన్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ ప్రివెన్షన్(డిప్) సంస్థ తిరుపతిలో ఆదివారం నిర్వహించిన సెవెన్ హిల్స్ మారథాన్ 21కె, 10కె, 5కె, 3కె రన్ ముగింపు సభలో ఆయన పాల్గొని విజేతలకు బహుమతులందజేశారు. 5కె, 3కె పరుగులో పాల్గొన్న వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థ, సుధారాణి ఫౌండేషన్, టీటీడీ సహకారంతో డిప్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మారథాన్లో పెద్ద ఎత్తున యువత పాల్గొనడం సంతోషకరమన్నారు. ప్రజల్లో ఆరోగ్యం పట్ల చైతన్యం కలిగించేందుకే ఈ మారథాన్ను తిరుపతిలో నిర్వహించామని తెలిపారు. ప్రజలు ప్రతిరోజూ సైకిల్ తొక్కడానికి, వాకింగ్ను ప్రోత్సహించేందుకు అమరావతిలో సైకిల్, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇదే తరహాలో తిరుపతిలో కూడా వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేస్తామన్నారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ వారంలో 150 నిమిషాలు ఏదో ఒక వ్యాయామం చేస్తే గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చన్నారు. మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ బాల్యం నుంచే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో మారథాన్ నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సమావేశంలో అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్, టీటీడీ జేఈవో పోలా భాస్కర్, తిరుపతి ఎస్పీ జయలక్ష్మి, సబ్ కలెక్టర్ హిమాంశు శుక్లా, నగర కమిషనర్ వినయ్చంద్, ఎస్వీయూ వీసీ దామోదరం, పారిశ్రామికవేత్త గల్లా రామచంద్రనాయుడు, డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, సంస్థ నిర్వాహకులు రాకేష్, నన్నపనేని మురళి, మధు తదితరులు పాల్గొన్నారు. మంత్రుల ఆస్తులు ప్రకటిస్తాం ముఖ్యమంత్రి ఆస్తుల వివరాలు ప్రకటించినట్టుగానే రాష్ట్ర మంత్రుల ఆస్తుల వివరాలను స్పీకర్కు అందజేస్తామని విలేకరుల ప్రశ్నలకు హోం మంత్రి చిన రాజప్ప సమాధానమిచ్చారు. -
దుర్గమ్మ సన్నిధిలో డెప్యూటీ సీఎం
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గమ్మను బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. డెప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సతీసమేతంగా తరలివచ్చారు. ఆయనకు ఈవో సూర్యకుమారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఉత్సవ ఏర్పాట్లపై డెప్యూటీ సీఎం సంతృప్తి వ్యక్తంచేశారు. దుర్గమ్మను దర్శించుకున్న బీసీసీఐ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ దుర్గమ్మను బీసీసీఐ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ బుధవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం, ప్రసాదాలు అందజేశారు. -
చంద్రబాబుతో హోంమంత్రి సమావేశం
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప శుక్రవారమిక్కడ సమావేశం అయ్యారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష, తాజా పరిణామాలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. మరోవైపు ఈ సమావేశానికి పోలీసు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. మరోవైపు ముద్రగడ చేపట్టిన దీక్ష నేటికి తొమ్మిదో రోజుకు చేరింది. కాగా ముద్రగడకు సంఘీభావంగా కాపులు నిరసనలు, ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. -
ముద్రగడ.. సీబీఐ విచారణ వద్దంటున్నారు: చినరాజప్ప
తుని ఘటనపై సీబీఐ విచారణకు ముద్రగడ పద్మనాభం అంగీకరించడం లేదని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చిరంజీవి మాత్రం దీనిపై సీబీఐ విచారణ కోరుతున్నారన్నారు. ఈ విషయాన్ని తాము పోలీసుల ద్వారా ముద్రగడ వద్దకు పంపితే, ఆయన వద్దన్నారని చినరాజప్ప తెలిపారు. ఈ విషయంపై ప్రజలే ఆలోచించాలని ఆయన అన్నారు. ముద్రగడకు వైద్యసేవలు చేసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారని, అయితే ఆయనే అంగీకరించడం లేదని చెప్పారు. ఆయన చేస్తున్న డిమాండ్లు ఆమోదయోగ్యం కాదని తెలిపారు. తుని ఘటనలో అరెస్టులు ఆపాలని, ఇప్పటికే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ముద్రగడ డిమాండ్ చేస్తున్నారని.. అయితే ఆ విషయం కోర్టు పరిధిలో ఉన్నందువల్ల తాము ఏమీ చేయలేమని హోం మంత్రి అన్నారు. సీబీఐ విచారణ జరుగుతుందో లేదో త్వరలోనే తేలుతుందని ఆయన చెప్పారు. -
చానళ్ల ప్రసారాలు కావాలనే ఆపేశాం
ఆంధ్రప్రదేశ్లో కొన్ని మీడియా చానళ్లను కావాలనే నియంత్రించామని ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్షకు ప్రజల మద్దతు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ముద్రగడ అరెస్టుకు నిరసనగా కాపులు పిలుపునిచ్చిన తూర్పుగోదావరి జిల్లా బంద్ విఫలమైందని, పోలీసులు ఆ బంద్ను విజయవంతం కానివ్వరని చెప్పారు. రేపటి బంద్ను కూడా విఫలం చేస్తామన్నారు. ఇదే సమయంలో సాక్షి టీవీ ప్రసారాలను ఎందుకు ఆపేశారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. కొన్ని చానళ్లను కావాలనే నియంత్రించామని ఆయన అన్నారు. శాంతిభద్రతల సమస్యలు వస్తాయనే తాము నియంత్రించినట్లు ఆయన స్వయంగా చెప్పారు. ముద్రగడ దీక్ష కొనసాగేవరకు ఈ నియంత్రణ కొనసాగుతుందని పరోక్షంగా చెప్పారు. దీక్షకు మద్దతు ఇస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందనే వాటిని ఆపేశామన్నారు. -
ముద్రగడ డిమాండ్లకు తలొగ్గేది లేదు: చినరాజప్ప
రాజమండ్రి: తుని ఘటనలో అరెస్ట్ చేసినవారిపై ముద్రగడ పద్మనాభం చెప్పినంత మాత్రాన కేసులు ఉపసంహరించుకునేది లేదని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ ముద్రగడ డిమాండ్లకు తలొగ్గేది లేదని, ఇంకా అరెస్టులు జరుగుతున్నాయన్నారు. కోర్టులో ఉన్న కేసులను ఉపసంహరించే అధికారం ప్రభుత్వానికి లేదని ఆయన పేర్కొన్నారు. అరెస్ట్ అయిన ఏడుగురు రౌడీషీటర్లేనని, ప్రత్యక్ష నేరచరిత్ర ఉన్నవారినే అరెస్ట్ చేసినట్లు చినరాజప్ప తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉందని తేలితే ముద్రగడ మీద కూడా కేసు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా గడువులోగా కాపులను బీసీల్లోకి చేర్చుతామన్నారు. కాగా తుని సంఘటనలో నమోదైన కేసులకు సంబంధించి పోలీసులు అరెస్టులు ప్రారంభించడంతో కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం లోగా కేసులు ఉపసంహరించుకోకపోతే ఈనెల 9 నుంచి దీక్షకు ఉపక్రమిస్తానని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకపోతే గురువారం ఉదయం 9 గంటలకు కిర్లంపూడిలోని తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. -
వల్లభనేని తప్పు చేస్తే శిక్ష తప్పదు: చినరాజప్ప
రాజమండ్రి: వల్లభనేని వంశి అరెస్ట్ విషయంలో చట్టం తన పని తాను చేసుకెళ్తుందని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కేసు దర్యాప్తులో ఉందని విచారణలో తప్పు చేసినట్లు తేలితే శిక్ష తప్పదని ఆయన అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో సోమవారం నుంచి ప్రారంభమైన రాష్ర్ట వ్యాప్త జైళ్ల శాఖ పునరుశ్ఛరణ తరగతులకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తుని ఘటనపై సీఐడీ విచారణ జరుగుతోందని దోషులను కఠినంగా శిక్షంచడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. కృష్ణా జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ శివారు రామవరప్పాడులో ఇన్నర్ రింగ్రోడ్డు పనులు నిమిత్తం రైవస్ కాల్వకట్టపై ఇళ్లు తొలగించాలంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడం, అందుకు నిరసనగా స్థానికులు రహదారిపై రాస్తారోకో చేశారు. అయితే ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, ప్రజలను రెచ్చగొట్టారని, జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి వాహనదారులకు ఇబ్బంది కలిగించారనే అభియోగాలతో వివిధ సెక్షన్ల కింద ఎమ్మెల్యేతోపాటు 200 మందిపై కేసు నమోదు చేశారు -
విశాఖలో చినరాజప్ప సమీక్ష
విశాఖపట్నం: ఈ నెల 19న జరగనున్న రెండవ ప్రపంచ కాంగ్రెస్ విపత్తు నిర్వాహణ సదస్సు కోసం జరుగుతున్న ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశానికి ప్రపంచంలోని 43 దేశాలకు చెందిన 150 మంది విదేశి ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న 28 విపత్తులకు సంబంధించిన అంశాలు, వాటిని ఎదుర్కోవడానికి అనుసరించవలసిన మార్గాలు అనే అంశాలపై ఏయూ కాన్వకేషన్ హాల్లో ఈ సదస్సు జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప అధికారులతో సమావేశమై చర్చించారు. -
రైతుల ఆత్మహత్యలు పట్టని ప్రభుత్వాలు
నానా పాటేకర్ బాలీవుడ్ నటుడు. రాజకీయవాది కాదు. ఓట్లు అడిగిన వాడు, పొందిన వాడు కాదు. కానీ విద ర్భలో రైతుల ఆత్మహత్యలపై వేదన చెంది స్పందించాడు. మృతుల కుటుంబాలను పరామర్శించి, చేతనైన సహాయం చేశాడు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని మీ కష్టాలలో తోడుగా ఉంటాననీ రైతు లకు భరోసా ఇచ్చాడు. మరోపక్క ఇంత కుమించి స్పందించాల్సిన వాళ్లు మన ఓట్లు పొంది మన డబ్బుతో పెత్తనం చెలాయిస్త్తున్న కేంద్ర మంత్రి రాధామోహన్సింగ్ పార్ల మెంటులో రైతుల ఆత్మహత్యలకు భగ్న ప్రేమలు, నపుంసకత్వం ముఖ్య కారణాలుగా పేర్కొన్నారు. ఏపీ హోంమంత్రి చినరాజప్ప అదే పాటపాడుతూ ఆత్మహత్యలకు కుటుంబ కలహాలు మరో కారణం అన్నారు. ఇంత దారుణంగా రైతులను పరిహసించిన తీరుకంటే జుగుప్సాకరం మరొకటి ఉండదు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల రుణ విముక్తి ప్రదాతగా సెప్టెంబర్ 9 నుండి రైతు యాత్రలు ప్రారంభించారు. ఎన్నికల వాగ్దానం ప్రకారం 60, 70 వేల కోట్ల రుణమాఫీ జరగాలి. కమిటీ లు, కార్డులు పత్రాలు తిరకాసులతో దానిని రూ.24 వేల కోట్లకు కత్తిరించారు. దానిలో చెల్లించింది రూ.7,500 కోట్లు మాత్రమే. పంచపాండవులు ఎంతమంది అంటే తిప్పితిప్పి ఒక్కడన్నట్లుగా సాగిన రుణమాఫీ తంతుకు కొండంత రూపమిస్తూ, లబ్ధిదారుల తో ముచ్చట్ల యాత్ర సాగిస్తున్నారు. యాత్ర మొదలై మూడు నా లుగు రోజులు కాకుండానే అనంతపురం, ప్రకాశం జిల్లాలలో రుణ భారంతో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారు తమ ప్రాణత్యాగంతో రుణమాఫీ డొల్లతనాన్ని ప్రకటించారు. గత ఇరవై ఏళ్లలో దేశంలో 3,00,000 మంది రైతులు ఆత్మ హత్యల పాలైనట్లు లెక్కల రికార్డులు కనిపిస్తున్నాయి. ఇందులో సింహభాగం మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్ర దేశ్లలోనే జరుగుతున్నాయి. 2014 నేషనల్ శాంపుల్ సర్వే ప్రకా రం ఆంధ్రప్రదేశ్లో 92 శాతం, తెలంగాణలో 89 శాతం రైతు కుటుంబాలు అప్పులలో ఉన్నాయి. వ్యవసాయరంగ సంక్షోభం కొత్తదీ కాదు, పాలక పక్షాలకి, ప్రతిపక్షాలకి తెలియందీ కాదు. ఎన్నికల్లో అందరూ లాభసాటి వ్యవసాయం మీద గొంతు చించు కోవడం, ఎన్నికల తర్వాత మూగనోము పట్టడం పరిపాటైంది. కేంద్రంలో, రాష్ర్టంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీలు దీనికి మినహాయింపు కాదని వారి నడక చెబుతున్నది. వ్యవసాయ ఉత్పత్తులకు లాభసాటి ధరలు రాకపోవడమే రైతులు అప్పులలో కూరుకుపోవడానికి, ఆత్మహత్యలకు ప్రధాన కారణం గా ఉంది. లాభసాటి ధరల చుట్టూ ఉన్న సమస్యలపై ఎలాంటి కొత్త చొరవలనీ ఈ ప్రభుత్వాలు తీసుకోవడం లేదు. మొదటిది మద్దతు ధర: స్వామినాథన్ కమిటీ సిఫారసు మేరకు వ్యవసాయ పంటలకు ఉత్పత్తి వ్యయం మొత్తం మీద 50 శాతం అదనంగా కలిపి మద్దతు ధర ప్రకటిస్తామని బీజేపీ ఎన్ని కల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని ఆ పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ఉన్న మోదీ తన ఎన్నికల ప్రచార సభలలో పదేపదే ప్రకటించారు. ఎన్నికైన తర్వాత షరా మామూలుగా మాటమార్చారు. ఎన్నికల వాగ్దానం మేరకు మద్దతు ధరల నిర్ణాయక కమిటీ లెక్కల ప్రకారం గానైనా ధాన్యానికి క్వింటాలుకు రూ. 2,000ల పైన మద్దతు ధర ప్రకటించాలి. దీనికి భిన్నంగా ఏటా ఇస్తున్న రూ.50లు మాత్రమే పెంచి 2015-16కు గానూ క్వింటాలుకు రూ.1,410లను మద్దతు ధరగా ప్రకటించారు. ఎన్నికల వాగ్దానాన్ని తుంగలో తొక్కడమే కాకుండా, స్వామినాథన్ కమిటీ సిఫారసు అమలు చేస్తే ధరల వక్రీకరణ జరుగుతుందని ప్రకటించారు. కేంద్రం వాగ్దానం చేసిన మద్దతు ధర ప్రకటించకపోయినా, రాష్ర్ట్ర ప్రభుత్వం కోరిన రూ.2,636 మద్దతు ధరను పట్టించుకోక పోయినా ముఖ్యమంత్రి మౌనం పాటించడం తప్ప నోరు విప్ప డం లేదు. కేంద్రం ఇవ్వకపోతే రాష్ర్టం రైతుల కోరిక మేరకు కనీ సం క్వింటాలుకు రూ.300 బోనస్గా ఇస్తామని ప్రకటించనూ లేదు. గట్టిమాటలు లేకుండా వట్టి చేతులతో రైతు యాత్రలు మాత్రం చేస్తున్నారు. రెండవది ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ: చిరకాలంగా రైతులు కోరుతున్న విధంగా తమ పంటలను ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ను కల్పిస్తామన్నారు. కాని ఒకే జాతీయ మార్కెట్ ఏర్పాటుకు అడుగులు పడటం లేదు. ప్రపంచ మార్కెట్లలో అమ్ముకోడానికి అడ్డంగా ఉన్న ఆంక్షలు తొలగించలేదు. మూడవది రైతుల స్వయం మార్కెట్లు: పంటల మార్కెట్లో దళారుల దోపిడీని వ్యవసాయ మార్కెట్ కమిటీలతో అరికడతా మన్న పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి. ఇది జరగా లంటే పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయ సహకార సం ఘాలు లేదా ఉత్పత్తిదారుల కో-ఆపరేటివ్లు ప్రభుత్వ జోక్యానికి వీలులేని చట్టబద్ధ సంస్థలు రావాలి. రైతులు మాత్రమే సభ్యు లుగా, షేర్ హోల్డర్లుగా ఉండాలి. మార్కెట్ యార్డులు రైతుల పంటలను నిల్వ చేసుకోడానికి, మద్దతు ధరకు అమ్ముకునే కేం ద్రాలు కావాలి. ఈ యార్డులు జాతీయ, అంతర్జాతీయ మార్కె ట్లలో అమ్మకాలకు, ముడి పంటలకు అదనపు విలువనిచ్చే పరి శ్రమలతో వ్యవహరించే స్వేచ్ఛ ఉండాలి. వచ్చే లాభాలలో రైతు లకు డివిడెండ్లు ఇవ్వాలి. ఇది వ్యవసాయ మార్కెట్లో దళారుల తొలగింపునకు, రైతుల ఆధిపత్యానికి దారి తీస్తుంది. ఆంధ్రప్రదేశ్లో రాష్ర్ట ప్రభుత్వం ఈ మార్కెట్ కమిటీలను రైతుల ప్రమేయం లేకుండా పాలక పక్ష సభ్యుల నామినేటెడ్ సం స్థగా మార్చింది. రాష్ర్టంలో దాదాపు 90 శాతం యార్డుల్లో కొనుగో లు-అమ్మకాల లావాదేవీలు లేకుండా దళారులకే వదిలేశారు. మార్కెట్ సెస్సుగా వసూలు చేస్త్తున్న వందల కోట్లను రైతులకు కాకుండా ప్రభుత్వమే వాడేసుకుంటున్నది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలతోనూ, ముఖ్యమంత్రి రోజుకో యాత్రతోనూ కాలం వెళ్లబుచ్చకుండా రైతుల ఆత్మహత్యల నివారణకు ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలుకు తగిన చర్యలు తీసుకోకపోతే... ప్రభు త్వాల బాధ్యతా రాహిత్యానికి నానా పాటేకర్ చెప్పినట్లు రైతులు తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే రావచ్చు. - వ్యాసకర్త అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా పార్టీ, మొబైల్ 9866074023 - డీవీవీఎస్ వర్మ -
'మిత్రపక్షంగా ఉంటూనే హోదా కోసం పోరాటం'
-డిప్యూటీ సీఎం చిన రాజప్ప వెల్లడి రాజమండ్రి: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉంటూనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని ఉప ముఖ్యమంత్రి ఎన్.చిన రాజప్ప వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా టేకిశెట్టిపాలెంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం నుంచి వైదొలగితే రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడం కుదరదనే తాము కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చకుండా అప్పటి యూపీఏ సర్కార్ దగా చేసినందునే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నామన్నారు. రాష్ట్రంలో ఐదింటిని కరువు జిల్లాలుగా గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో కరువు నిర్మూలన కోసం కృషి చేస్తామని చెప్పారు. -
పవన్ పై వ్యాఖ్యలను ఖండించిన చినరాజప్ప!
హైదరాబాద్: జనసేన అధ్యక్షడు, సినీ హీరో పవన్ కల్యాణ్ పై టీడీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం చినరాజప్ప ఖండించినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని పాజిటివ్ గా తీసుకోవాలే తప్ప తిరిగి విమర్శలకు దిగడం మంచి పద్ధతి కాదని చిన రాజప్ప పేర్కొనట్లు సమాచారం. టీడీపీ ఎంపీల వ్యాఖల్నివెనక్కు తీసుకోకపోతే ఎలాంటి చర్యలకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన హెచ్చరించారని.. దీనిలో భాగంగానే ఈ విషయాన్ని ఇప్పటికే టీడీపీ ముఖ్య నాయకుల వద్ద ప్రస్తావించారని తెలుస్తోంది. -
పవన్ పై వ్యాఖ్యలను ఖండించిన చినరాజప్ప!
-
జూన్ 2 నుంచి డ్వాక్రా రుణాల మాఫీ
సామర్లకోట (తూర్పుగోదావరి): ఆంధ్రప్రదేశ్లోని అన్ని డ్వాక్రా సంఘాలకు జూన్ 2వ తేదీ నుంచి రుణమాఫీ అమలు చేయనున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండల పరిధిలో నీరు-చెట్టు పనుల పరిశీలన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళా సంఘాలకు వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ప్రతి సంఘానికి రూ.1 లక్ష చొప్పున, ప్రతి సభ్యురాలికి రూ.10 వేలను నాలుగు వాయిదాల్లో చెల్లిస్తామని తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో 36 చెరువులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఏలేరు కాలువ అభివృద్ధికి గతంలో రూ.24 లక్షలు మంజూరు కాగా ప్రస్తుతం మరో 19 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. -
'సహాయక చర్యల కోసం రూ.120 కోట్లు విడుదల చేశాం'
హైదరాబాద్:అకాల వర్షం కారణంగా నష్టపోయిన కరువు ప్రాంతాల సహాయక చర్యల్లో భాగంగా రూ.120 కోట్లు విడుదల చేశామని డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. అన్ని కరువు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు పూర్తిస్థాయి నిధులు విడుదల చేశామన్నారు. దీంతో పశుగ్రాసానికి ఇబ్బందులు లేకుండా నిధులు విడుదల చేసినట్లు చినరాజప్ప తెలిపారు. -
'ఆ హక్కు బొత్సకు లేదు'
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించడంపై డిప్యూటీ సీఎం చినరాజప్ప మండిపడ్డారు. చంద్రబాబును విమర్శించే హక్కు బొత్సకు లేదని చినరాజప్ప స్పష్టం చేశారు. వోక్స్ వ్యాగెన్ కుంభకోణంలో అవినీతిపరుడిగా ముద్రపడిన బొత్స.. చంద్రబాబును విమర్శించడటం విడ్డూరంగా ఉందన్నారు. పోలీస్ శాఖ విభజన త్వరలో పూర్తవుతుందన్నారు. హుద్ హుద్ ప్రభావిత జిల్లాల్లోరూ. 2200 కోట్లు నిధుల సాయానికి ప్రపంచ బ్యాంక్ అంగీకరించిందని చిన రాజప్ప తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు ప్రపంచ బ్యాంక్ నిధులు వినియోగిస్తామని ఆయన ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. -
హోంమంత్రి రాజప్పకు కోపం వచ్చింది
అమలాపురం : రాష్ట్ర హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు కోపమొచ్చింది. తనకు సెక్యూరిటీ అవసరం లేదంటూ ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది తన ఇంటి ఆవరణ నుంచి వెళ్లిపోవాలని రాజప్ప ఆదేశించారు. దాంతో సెక్యూరిటీ సిబ్బందితో పాటు, స్థానిక పోలీస్ అధికారులు అవాక్కయ్యారు. ఇటీవల అంబాజీపేట మండలంలో దీపావళి రోజున రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన గొడవలో పోలీసుల తీరు రాజప్పకు నచ్చక కొంత అసహనానికి గురైట్లు సమాచారం. అమలాపురంలో ఉన్న ఆయనను కలిసేందుకు ప్రొటోకాల్ ప్రకారం కొందరు అధికారులు మంగళవారం వెళ్లారు. ఆ సమయంలో రాజప్ప వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెక్యూరిటీ సిబ్బందిని ఇంటి ఆవరణ నుంచి ఖాళీ చేయాలని ఆదేశించారు. 'మీ సెక్యూరిటీ నాకు అవసరం లేదు...మీరూ అవసరం లేద'ని రాజప్ప అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన అమలాపురం పర్యటన ముగించుకుని రాజప్ప తన నియోజకవర్గం పెద్దాపురం వెళ్లిపోయారు. కాగా ఈ విషయమై పోలీసు అధికారులను వివరణ కోరగా... చినరాజప్ప స్థానికంగా లేనప్పుడు సెక్యూరిటీ అవసరం లేదని చెప్పారన్నారు. కేబినెట్ సమావేశం ఉన్నందున హోంమంత్రి హైదరాబాద్ వెళుతున్న నేపథ్యంలోనే సెక్యూరిటీ వద్దన్నారని పోలీసు అధికారులు తెలిపారు. -
కేసీఆర్ రాద్ధాంతం చేస్తున్నారు: చిన రాజప్ప
ప్రొద్దుటూరు : రాయలసీమ అవసరాల కోసమే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చిన రాజప్ప తెలిపారు. తెలంగాణకు సరిపడా విద్యుత్ ఇస్తామన్నా కేసీఆర్ రాద్ధాంతం చేస్తున్నారని ఆయన శనివారమిక్కడ మండిపడ్డారు. శ్రీశైలం జలాశయం నీటి వినియోగంపై కేసీఆర్తో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రాజకీయం కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అపవాదు వేస్తున్నారని చిన రాజప్ప వ్యాఖ్యలు చేశారు. ఎర్రచందనం సంరక్షణకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. -
'మహిళలు బయట తిరిగే పరిస్థితి లేదు'
హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని వైఎస్ఆర్ సీపీ సాలూరు ఎమ్మెల్యే పి.రాజన్న దొర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ సహా చాలాచోట్ల మహిళలు బయట తిరిగే పరిస్థితి లేదన్నారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప సమాధానం ఇస్తూ మహిళలపై దాడులు చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కాపులకు చినరాజప్పే సీఎం
పవన్ వల్లే టీడీపీకి అధికారం కాపునాడు సభలో నేతలు ఏలూరు: ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం అండలేకుండా ఏ రాజకీయపార్టీ అధికారంలోకి రాలేదని.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబే అయినా.. కాపులకు మాత్రం ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పే ముఖ్యమంత్రి అని కాపుసంఘం రాష్ట్ర కార్యదర్శి బీఎల్ నరసింహరావు అన్నారు. ఏలూరు నగర కాపునాడు ఆధ్వర్యంలో కాపు సామాజిక మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఆదివారం సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నరసింహరావు మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా వీలైనంత త్వరగా కాపులకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. సినీనటుడు పవన్కళ్యాణ్ వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని, ఏడాదిన్నరలో కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాపులు పనిచేయకముందే రిజర్వేషన్లు ప్రకటించాలని పాలకొల్లు మునిసిపల్ చైర్మన్ నారాయణమూర్తి డిమాండ్ చేశారు. ఉపముఖ్యమంత్రి పదవి కాపుగా ఉన్నందుకే వచ్చిందని, కులం కారణంగానే ఈ పదవిలో ఉన్నానని చిన రాజప్ప చెప్పారు. -
త్వరలో సిటీబస్సు సర్వీసులు : డిప్యూటీ సీఎం
కాకినాడ సిటీ: త్వరలో రాజమండ్రి, కాకినాడ నగరాల్లో సిటీ బస్సులను అందుబాటులోకి తెస్తామని ఉపముఖ్యమంత్రి, హోంశాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. జిల్లాలో వివిధ డిపోల నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన ఐదు బస్సు సర్వీసులను సోమవారం మంత్రి కాకినాడ డిపోలో జెండా ఊపి ప్రారంభించారు. గిరిజన ఉపప్రణాళిక నిధులతో ప్రవేశపెట్టిన మూడు ఏజెన్సీ ప్రాంత కొత్తసర్వీసులను రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కొబ్బరికాయకొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కాకినాడ, రాజమండ్రి నగరాలకు త్వరలో జవహర్లాల్ నెహ్రూ జాతీయ అర్బన్ రెన్యూవల్ మిషన్ పథకం ద్వారా 35 చొప్పున ఆధునిక సిటీబస్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జి.రమాకాంత్ మాట్లాడుతూ కాకినాడ నుంచి అనంతపురానికి సూపర్లగ్జరీ, రాజోలు నుంచి తిరుపతికి డీలక్స్ సర్వీసులను ప్రారంభించామన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద ఏలేశ్వరం నుంచి మోహనాపురానికి, ఏలేశ్వరం నుంచి వంతంగికి, గోకవరం నుంచి కొత్తవీధి కి సర్వీసులు ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో జిల్లాపరిషత్ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంపచోడవరం కో-ఆర్డినేటర్ అనంత ఉదయ్భాస్కర్ ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. పుష్కరాలపై ఎనిమిదిన సమావేశం గోదావరి పుష్కరాలపై సమీక్షించేందుకు ఈ నెల 8న రాజమండ్రిలో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్టు చినరాజప్ప వెల్లడించారు. ఉభయగోదావరి జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. నెలాఖరులోగా ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తి పెద్దాపురం : ఈ నెలాఖరులోగా ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తిచేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినట్టు ఉపముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. సోమవారం మండలంలోని కట్టమూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునవ్యవస్టీకరణ చట్టం ప్రకారం కౌన్సెలింగ్ ఉమ్మడిగానే జరగాలని, విద్యా అంశం పదేళ్లు ఉమ్మడి గానే ఉంటుందని తాను, మరో ఉపముఖ్యమంత్రి కె.వి.కృష్ణమూర్తి గవర్నర్ను కలిశామని చెప్పారు. కౌన్సెలింగ్వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లగా, ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. సుప్రీం తీర్పుతో కౌన్సెలింగ్లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిందన్నారు. యథావిధంగా ఎంసెట్ కౌన్సెలింగ్ జరుగుతుందని చెప్పారు. కోర్టు ఇచ్చిన తీర్పునకు కట్టుబడి తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు. రాజప్పకు సత్కారం స్థానిక సామర్లకోట రోడ్డు మార్గంలో ఉన్న క్రైస్తవ స్వర్ణదేవాలయంలో నిర్వహిస్తున్న తైలాభిషేకం పండగ సోమవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి చినరాజప్ప పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ క్రీస్తుబోధనలు అనుసరణీయమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో క్రైస్తవులు తరలివచ్చి ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైబిల్ మిషన్ ఉపాధ్యక్షుడు సంజీవరావు, స్వర్ణదేవాలయం కన్వీనర్ జి.ఆర్. ఇమ్మానుయేలు ఆధ్వర్యంలో మత పెద్దలు చినరాజప్పను సత్కరించారు. తైలాభిషేకం పండగ సందర్బంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజాసూరిబాబు, మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
1956కు ముందు కేసీఆర్ కూడా లేరు
ఏలూరు : రాజ్యాంగం ప్రకారం ఏడేళ్లపాటు ఒకేచోట విద్యాభ్యాసం చేసినవారికి స్థానికులుగా గుర్తింపు లభిస్తుందని, విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో 1956 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలనుకోవటం సరికాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. 1956కు ముందు తెలంగాణలో ఉన్నవాళ్లనే స్థానికులుగా గుర్తిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నా... అవేమీ సాగవని ఆయన వ్యాఖ్యానించారు. ఆ మాటకొస్తే 1956కు ముందు తెలంగాణలో కేసీఆర్ కూడా లేరన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో స్థానికత నిర్ధారణకు 1956 కన్నా ముందు నుంచీ తెలంగాణలో నివసించడాన్నే ప్రాతిపదికగా తీసుకోవాలని కేసీఆర్ సూచించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై చినరాజప్ప పైవిధంగా స్పందించారు. -
కేసీఆర్ పై మండిపడ్డ ఏపీ డిప్యూటీ సీఎం
ప.గో:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చినరాజప్ప మండిపడ్డారు. స్థానికత అంశంపై చోటుచేసుకున్న వివాదంపై చినరాజప్ప శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఏడు సంవత్సరాల అంశాన్ని స్థానికతగా పరిగణించాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో స్థానికత నిర్ధారణకు 1956 కన్నా ముం దు నుంచీ తెలంగాణలో నివసించడాన్నే ప్రాతిపదికగా తీసుకోవాలని కేసీఆర్ సూచించడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పటికి కేసీఆర్ కు కూడా తెలంగాణలో ఉండే అవకాశం లేదన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా రక్షణ చర్యలు చేపడతామన్నారు. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని రాజప్ప తెలిపారు. అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల విద్యుత్ ను అందిస్తామన్నారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ ను కూడా సరఫరా చేస్తామని రాజప్ప హామీ ఇచ్చారు. ఏడేళ్ల విద్యార్హతల ఆధారంగానే స్థానికతను నిర్ణయించాలని కమలనాథన్ కమిటీ సూచించింది. ఈ మేరకు ఉద్యోగుల విభజన అంశానికి సంబంధించి తాము సూచించిన మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ వెబ్సైట్లో కమిటీ ఉంచింది. కేంద్రం ఆమోదం మేరకు 19 పేజీల మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెబ్సైట్లో ఉంచింది. ఉద్యోగులలో దంపతులు, ఒంటరి మహిళలకు ఆప్షన్లు ఉంటాయని, అయితే రిటైరయ్యే ఉద్యోగులకు మాత్రం ఆప్షన్లు లేవని ఆ వెబ్ సైట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
మాతృమూర్తి ఆశీస్సులందుకున్న రాజప్ప
ఉప్పలగుప్తం :పెద్దాపురం శాసనసభ్యునిగా ఎన్నికై నవ్యాంధ్రప్రదేశ్ తొలి ఉపముఖ్యమంత్రిగా, హోంశాఖ, విపత్తుల నివారణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం తన స్వగ్రామమైన పెద్దగాడవిల్లిలో తన తల్లి కొండాయమ్మ ఆశీస్సులు అందుకున్నారు. రాత్రి తొమ్మిదిగంటల సమయంలో ఊరేగింపుగా వచ్చిన రాజప్పకు ఆయన సోదరి సుందరనీడి వరలక్ష్మి హరతి పట్టి ఇంట్లోకి స్వాగతించారు. తండ్రి రంగయ్య చిత్రపటం వద్ద రాజప్ప నివాళులర్పించారు. అనంతరం తల్లి దీవెనలందుకున్నారు. వేదపండితులు ఆశీర్వచనాలందించారు. భార్య అనూరాధ, కుమారుడు రంగనాథ్, సోదరులు బాపూజీ, సత్తిబాబు, జగ్గయ్యనాయుడు కుటుంబ సభ్యులందరూ ఒకొక్కరిగా రాజప్పకు శుభాకాంక్షలు తెలిపారు. రాజప్పకు రాజయోగం పట్టిందని గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చి మిఠాయిలు పంచారు. రాజప్ప తండ్రి వెంకట రంగయ్య ఎన్నికల సమయంలోనే మృతి చెందిన విషయం తెలిసిందే. -
కాకినాడలో పర్యటించిన చిన రాజప్ప
-
హిమాచల్కు వెళ్లిన ఏపీ హోం మంత్రి
సాక్షి, హైదరాబాద్: తెలుగు విద్యార్థులు మృత్యువాతపడ్డ హిమాచల్ప్రదేశ్ లార్జి డ్యామ్ ప్రాంతానికి ఏపీ హోంమంత్రి చినరాజప్ప శుక్రవారం బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నాలుగు రోజుల పాటు సహాయక చర్యలను చినరాజప్ప దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. -
‘దేశం’లో ఉగ్రోష్ణం
సాక్షి ప్రతినిధి, కాకినాడ :కొత్తగా కొలువుదీరిన రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాకు లభించిన ప్రాతినిధ్యం కొందరికి మోదాన్ని, కొందరికి ఖేదాన్ని మిగిల్చింది. ఆదివారం కొలువుదీరిన చంద్రబాబు మంత్రివర్గంలో జిల్లా నుం చి ఇద్దరికి మాత్రమే చోటు దక్కింది. తొలిసారి జిల్లాకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించినందుకు ఒకపక్క సంతోషిస్తూనే మరోపక్క అదే సామాజికవర్గం నుంచి నాలుగో సారి ఎమ్మెల్యే అయిన తోట త్రిమూర్తులుకు మంత్రి పదవి ఇస్తానని మోసం చేశారంటూ ఆయన అనుచరవర్గం మండిపడుతోంది. ఇంకోపక్క బీసీలలో బలమైన శెట్టిబలిజ, ఎస్సీలలో బలమైన మాల సామాజి కవర్గాలకు అమాత్య పదవులు దక్కకపోవడంతో వారు బాబుపై నిప్పులు చెరుగుతున్నారు. డిప్యూటీ సీఎంగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కేబినెట్ మంత్రిగా యనమల రామకృష్ణుడులకు అవకాశం లభించినందుకు సంతోషించాలో లేక రెండు సామాజికవర్గాలకు బెర్త్లు దక్కనందుకు నిరసన వ్యక్తం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నామని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. గొల్లపల్లికి నమ్మకద్రోహం.. జిల్లా నుంచి టీడీపీ తరఫున 13 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. ఎస్సీలకు రిజర్వైన రాజోలు, పి.గన్నవరం, అమలాపురం మూడు స్థానాల నుంచీ టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. వారిలో ఏ ఒక్కరికీ మంత్రి పదవి అవకాశం లభించకపోవడాన్ని ఆ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. వీరిలో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారనే కారణంతో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును పక్కన పెట్టినా సీనియర్లు అయిన పులపర్తి నారాయణమూర్తి, గొల్లపల్లి సూర్యారావు మంత్రి పదవికి అర్హులు కారా అని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ‘గొల్లపల్లికి ఎంపీ సీటు ఇస్తామని నమ్మించి ద్రోహం చేశారు. స్థానికంగా కాకున్నా ఎక్కడో రాజోలు సీటు ఇచ్చినా గెలుపొందిన గొల్లపల్లికి మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించా’రని ఆ పార్టీలోని ఎస్సీలు రగిలిపోతున్నారు. ఇదివరకు మంత్రిగా పనిచేసి, పార్టీ కోసం గత ఏడెనిమిదేళ్లుగా కష్టపడ్డ గొల్లపల్లికి ఇచ్చే గౌరవం ఇంతేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. కోనసీమలో బలమైన సామాజికవర్గాన్ని విస్మరించిన బాబు తీరును వారు గర్హిస్తున్నారు. బీసీలలో బలమైన శెట్టిబలిజ, మత్స్యకార సామాజికవర్గాలు కూడా బాబుపై మండిపడుతున్నాయి. కాకినాడ రూరల్, కాకినాడ సిటీల నుంచి ఎన్నికైన పిల్లి అనంతలక్ష్మి, వనమాడి వెంకటేశ్వరరావులు కేబినెట్లో బెర్త్లు లభిస్తాయని ఆశించారు. తీరా వారిద్దరిలో ఎవరికీ చోటు దక్కకపోవడంపై ఆ రెండు వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. మార్గమధ్యం నుంచే ‘తోట’ తిరుగుముఖం మరోపక్క నమ్మించి మోసం చేశారని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్లో ఉన్న తనకు మంత్రి పదవి ఇస్తానని నమ్మించి టీడీపీలోకి తీసుకువచ్చి, ఇప్పుడు బెర్త్ లేకుండా చేశారని తోట, ఆయన అనుచరవర్గం నిప్పులు కక్కుతున్నారు. మంత్రి పదవి వస్తుందన్న ధీమాతో ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులందరినీ వెంటబెట్టుకుని బయలుదేరిన తోట విజయవాడ నుంచి వెనుతిరిగారు. తోట సహా అనుచరులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. సోమవారం రామచంద్రపురంలో సమావేశమై భవిష్యత్పై నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. మొత్తమ్మీద బాబు తీరు.. జిల్లా టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
చినరాజప్పకు ‘డిప్యూటీ’
సాక్షి ప్రతినిధి, కాకినాడ :కొత్త రాష్ట్రపు తొలి మంత్రివర్గంలో జిల్లాకు పదోన్నతి దక్కింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఉప ముఖ్యమంత్రి పదవి.. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పను వరించింది. ఆదివారం కొలువుదీరిన చంద్రబాబు నాయుడి మంత్రివర్గంలో రాజప్ప ఉప ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో విభజన అనంతరం కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రంలో ఏర్పడిన తొలి ప్రభుత్వంలో జిల్లా నుంచి ఇద్దరికి ప్రాతినిధ్యం లభించినట్టయింది. అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలానికి చెందిన నిమ్మకాయల చినరాజప్ప తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడిగా 22 సంవత్సరాలు పని చేశారు. ఆ పార్టీ చరిత్రలో ఇదో రికార్డు. ఉప్పలగుప్తం ఎంపీపీగా పనిచేస్తూ జెడ్పీలో విప్గా కూడా పనిచేశారు. పార్టీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు, వివాదరహితుడు కావడం రాజప్పకు కలిసి వచ్చి.. తన రాజకీయ జీవితంలో అత్యున్నత పదవిని చేపట్టగలిగారు. శాసనమండలిలో పార్టీ పక్షనేతగా ఉన్న యనమలకు మరోసారి కేబినెట్ హోదా లభించింది. తుని నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన యనమల 2009లో స్థానంలోనే ఓటమి పాలయ్యారు. అనంతరం రాజ్యసభకు వెళ్లాలని ఆశించినా.. ఎమ్మెల్సీ మాత్రమే కాగలిగారు. గతంలో అసెంబ్లీ స్పీకర్గా, ఆర్థిక మంత్రిగా, పీఏసీ చైర్మన్గా పలు పదవులు నిర్వర్తించిన యనమల ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆశ పెంచుకున్నా చివరికి ఆ పదవి చినరాజప్పను వరించింది.