Chit chat
-
మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదు
సాక్షి, న్యూఢిల్లీ: మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదని సీఎం రేవంత్రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ(Cabinet Expansion)పై ఏఐసీసీ పెద్దలతో చర్చించినా, ప్రస్తుత ఎన్నికలు, ఇతర అంశాల దృష్ట్యా ప్రస్తుతం విస్తరణ చేయడం లేదన్నారు. ‘‘మంత్రివర్గ విస్తరణపై చర్చ లు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికైతే విస్తరణ ఉండదు. ఓ వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీనిపై అధిష్టానం ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు విస్తరణ ఉంటుంది. ఈ విషయంలో నా ప్రమేయం ఏమీ లేదు. నేను మంత్రి పదవుల కోసం ఎవరి పేరును సిఫార్సు చేయడం లేదు.మంత్రి పదవులకు అర్హులైన వారిని ఏఐసీసీనే ఎంపిక చేస్తుంది. వారు ఎవరి పేరు సూచిస్తే వారితో ప్రమాణస్వీకారం చేయిస్తా..’’అని చెప్పా రు. శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శితో కేసీ వేణుగోపాల్లతో భేటీ అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ చిట్చాట్ చేశారు. అత్యంత శాస్త్రీయంగా కులగణన నిర్వహించామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా ఒక్కరోజులో పూర్తి చేయలేదని చెప్పారు.1.12 కోట్ల కుటుంబాల సమగ్ర వివరాలు సేకరించాకే లెక్కలు బయటపెట్టామన్నారు. ఈ సర్వేలో ఎక్కడా బీసీల శాతం తగ్గలేదని, బీసీలు ఐదున్నర శాతం పెరిగారని.. ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా బీజేపీ సభ్యులు సైతం అంగీకరించారని పేర్కొన్నారు. ఈ కులగణన లెక్కల ఆధారంగానే సంక్షేమ విధానాలకు రూపకల్పన చేస్తామన్నారు. ప్రస్తుత సర్వేతో ముస్లిం రిజ ర్వేషన్లకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. కేటీఆర్ అరెస్ట్పై తొందరపడం.. ఫార్ములా–ఈ రేసు కేసులో చట్టప్రకారమే నడుచుకుంటున్నామని, ఇప్పటికే నగదు బదిలీ జరిగిన కంపెనీకి నోటీసులు ఇచ్చామని సీఎం రేవంత్ తెలిపారు. నోటీసులపై స్పందించేందుకు సదరు కంపెనీ గడువు కోరిందన్నారు. ఈ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ను అరెస్ట్ చేయాలన్న తొందరేమీ తమకు లేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలపై కేసుల విషయంలో ఎక్కడా రాజకీయ జోక్యం లేదని, చట్టప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జస్టిçస్ లోకూర్ కమిషన్ నివేదిక అందిందని, దానిని అడ్వొకేట్ జనరల్ పరిశీలనకు పంపామని వెల్లడించారు. రాహుల్గాం«దీతో దూరమేమీ లేదు.. రాష్ట్రంలో పీసీసీ కమిటీ కూర్పు కొలిక్కి వచ్చిందని, ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై ప్రకటన ఉంటుందని రేవంత్ చెప్పారు. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటారని, అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఇక పార్టీ అగ్రనేత రాహుల్గాం«దీతో తనకు ఎలాంటి గ్యాప్ లేదని రేవంత్ చెప్పారు. ఈ పర్యటనలో తాను రాహుల్ అపాయింట్మెంట్ కూడా కోరలేదన్నారు. రాహుల్ గాంధీతో ఎప్పటికప్పుడు ఫోన్లో టచ్లో ఉన్నామంటూ.. రాహుల్ గాంధీ పెట్టిన మెసేజీలను చూపించారు. -
సీఎం రేవంత్ రెడ్డి కావాలనే కేసు పెట్టించారు: KTR
-
ధరణి ముసుగులో వేలాది ఎకరాలు అన్యాక్రాంతం
సాక్షి, హైదరాబాద్: ధరణి ముసుగులో విలువైన ప్రభుత్వ, ఇనాం, పడావు, ఎవాక్యుయీ భూములు వేలాది ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని ప్రభుత్వం గుర్తించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. అన్యాక్రాంతమైన ఈ భూములను ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దాదాపు పదిహేను వేల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని, చేతులు మారాయని తేలిందని.. కనిష్టంగా ఒక ఎకరా రూ.10 కోట్లు అని అనుకున్నా వీటి విలువ దాదాపు రూ.1.5 లక్షల కోట్లు ఉంటుందని చెప్పారు. బుధవారం శాసనసభలోని తన కార్యాలయంలో భట్టి మీడియాతో ముచ్చటించారు. 10 వేల ఎకరాలు ధారాదత్తం చేశారు ‘అన్యాక్రాంతమైన భూములే కాకుండా అస్సైన్డ్ భూములను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే.. మళ్లీ ప్రభుత్వ అవసరాల కోసమే వినియోగించాలి. కానీ ఇబ్రహీంపట్నం మండలంలో పది వేల ఎకరాలను ధారాదత్తం చేశారు. గతంలో భూముల రిజి్రస్టేషన్ అనంతరం రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ భూముల మ్యుటేషన్ జరిగి పట్టాదార్ పాస్ పుస్తకాలు వచ్చేవి. కానీ ధరణి వచి్చన తర్వాత రిజి్రస్టేషన్ కాగానే వెంటనే మ్యుటేషన్ అవడం, ధరణి పోర్టల్లో వేలిముద్రలు, ఫోటో రాగానే.. అక్కడికక్కడే ఇతరులకు విక్రయించడం వల్ల అసలు ఆ భూముల చరిత్ర తెలియకుండానే క్రయ విక్రయాలు, మ్యుటేషన్లు జరిగిపోయాయి.ఇనాం, పడావు, ఎవాక్యుయీ ప్రాపర్టీ, ప్రభుత్వ భూములను ధరణిలో ఎంట్రీ చేసే సమయంలోనే పేర్లు మారిపోయాయి. ఒకసారి ధరిణిలో ఎంటర్ అయ్యాక వాటిని మార్చే అవకాశం లేకుండా పోయింది. కొన్నింటిని కావాలనే పార్ట్ ‘బీ’లో చేర్చారు. దీనిని అడ్డు పెట్టుకుని పెద్ద ఎత్తున భూములు చేతులు మారాయి. ధరణిలో ఒక్క భూ యజమాని పేరు మినహా కాస్తుదారులు/ అనుభవదారుల కాలమ్ లేకపోవడంతో ఇష్టానుసారం భూములు చేతులు మారాయి..’అని డిప్యూటీ సీఎం చెప్పారు. పార్ట్ ‘బీ’భూముల్లోనే పెద్దయెత్తున దందా ‘ధరణికి ముందున్న రికార్డులను, ధరణిలోకి వచ్చిన తరువాత మారిన భూముల వివరాలను పరిశీలిస్తాం. పూర్తిస్థాయిలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. భూములు మూడు, నాలుగు చేతులు మారినా..అవి ఫ్రభుత్వానికి చెందిన భూములు అని తేలితే స్వాధీనం చేసుకుంటాం. ప్రధానంగా పార్ట్ ‘బీ’కింద పెట్టిన భూముల్లోనే ఈ దందా పెద్ద ఎత్తున సాగింది..’అని భట్టి అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి పైసా తెస్తాంమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన నిధులు ప్రతి పైసా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. కేంద్రం రాష్ట్రాల వారీగా నిధులు కేటాయించదని, పథకాల వారీగా చేయాల్సిన ఖర్చునకు అనుగుణంగా కేటాయింపులు జరుపుతుందని అన్నారు. బుధవారం శా సనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు కవిత, దయానంద్ తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు భట్టి సమాధానం చెప్పారు.గత పదేళ్ల నుంచి కేంద్ర ప్ర భుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, ఏడా ది కాలంగా వచి్చన నిధులకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం సభముందు ఉంచామని తెలిపారు. కేవలం ఏడాదిలో పదేళ్లలో సాధించిన దానికంటే మించి పురోగతి సాధించామని భట్టి పేర్కొన్నా రు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రత్యేకంగా పథకాలు రూపొందించాల్సిందిగా సంబంధిత కార్పొరేషన్ను ఆదేశించామన్నారు. 2026 డిసెంబర్ నాటికి ‘పాలమూరు’ పూర్తి: మంత్రి ఉత్తమ్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని, ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయిస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగిందని, దీనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. కొడంగల్–నారాయణపేట ప్రాజెక్టు కొత్తదేమీ కాదని, ఉమ్మడి రాష్ట్రంలోనే జీవోలు వచ్చాయని వెల్లడించారు.అర్చకుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. ధూపదీప నైవేద్యం కోసం నెల కు రూ.4 వేలు, గౌరవ వేతనం కింద రూ.6 వేలు చొప్పున మొత్తం రూ.10 వే లు ఇస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ పరిషత్ను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసు కొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామ న్నారు. యాదగిరిగుట్టలో టీటీడీ స్థాయి లో పాలకమండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. పలు బిల్లులకు ఆమోదం మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) పేరు పెడుతూ మండలిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బిల్లు ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. ది యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ బిల్లుతో పాటు తెలంగాణ యూనివర్సిటీల సవరణ బిల్లు, తెలంగాణ గూడ్స్ అండ్ సరీ్వస్ ట్యాక్స్ సవరణ బిల్లులను సంబంధిత మంత్రులు ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. -
ఎవరిని ఎలా పిలవాలి?
టేబుల్కు ఎదురుగా ఉన్న వ్యక్తులు ఇద్దరూ సమానమే అన్న అంచనాతో (భ్రమతో?) ఇంటర్వ్యూ మొదలవుతుంది. అప్పుడు మాత్రమే, ఇంటర్వ్యూ చేసేవాళ్లకు శోధించేందుకు, అవసరమైతే వ్యతిరేకించేందుకు ఇరువురి సమానత్వం ఒక హక్కును కల్పిస్తుంది. అవతలి వ్యక్తి నీ కంటే పెద్ద స్థాయివాడు కాదని అనుకున్నప్పుడే, అవసరమైనప్పుడు వారి మాటలను అడ్డుకునేందుకు సందేహించాల్సిన అవసరం ఉండదు. అందుకే ఎంపీలు, మంత్రులు, అధికారులను... మిస్టర్, మిసెస్, మిస్ అనో... ప్రభుత్వంలో ఉంటే మినిస్టర్ అనో సంబోధించడం ఉచితంగా ఉంటుంది. అదే సెలబ్రిటీలను చేసే ఛాట్ షో ఇంటర్వ్యూల విషయానికి వస్తే ఇవన్నీ మారిపోతాయి. వాళ్లను ‘మిస్టర్’ అంటే దూరం జరిగినట్టు అవుతుంది. అప్పుడు పేరు పెట్టి పిలవడం ఉత్తమం.ఆ మధ్య నాకు ఒక లేఖ అందింది.అందులో చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఒకటుంది. సమాధానం ఇలా బహిరంగంగానే ఇస్తే మేలు అనిపించింది. ‘‘ఇంటర్వ్యూ చేసే వారిని మీరు రకరకాలుగా సంబోధించడాన్ని గమనించాను’’ అంటూ మొదలైంది ఈ లేఖ. ‘‘కొంతమందిని మిస్టర్ ఎక్స్ అంటారు.. ఇంకొంతమందిని ‘మినిస్టర్’ అంటూ వారి పదవితో సంబోధించారు. మరికొన్ని సందర్భాల్లో వాళ్ల పేరుతో పిలిచారు. కానీ ఎప్పుడూ ‘సర్’ అని పిలవడం మాత్రం చూడలేదు. ఎందుకలా? అసలు ఎవరిని ఎలా పిలవాలో మీరు ఎలా నిర్ణయిస్తారు?’’సర్ అంటే వేరే!ఈ ప్రశ్నలు చూసిన వెంటనే నా ఆలోచనలు రెండు దశాబ్దాల వెనక్కు వెళ్లాయి. ఆ రోజు జీవితంలో మొట్టమొదటిసారి ఓ ప్రము ఖుడిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. తర్వాత బ్రిటన్ హోమ్ శాఖ మంత్రి అయిన డేవిడ్ వాడింగ్టన్ ఇంటర్వ్యూ అది. 1983లో మార్గరెట్ థాచర్ మంత్రివర్గంలో ఇమ్మిగ్రేషన్ శాఖల మంత్రిగా ఆయన పని చేశారు. ప్రస్తుత ‘బీబీసీ’ ఛైర్మన్ సమీర్ షా అప్పట్లో నా బాస్. బీబీసీ కార్యక్రమం ‘ఐ విట్నెస్’ ప్రొడ్యూసర్ ఆయన.ఇంటర్వ్యూ కోసం స్టూడియోలోకి వెళుతూండగా సమీర్ మాట్లా డుతూ, ‘‘ఒక్క విషయం గుర్తుంచుకో కరణ్’’ అన్నారు. ‘‘ఆయన్ని మిస్టర్ వాడింగ్టన్ అనైనా పిలువు. లేదా మినిస్టర్ అను. సర్ అని మాత్రం పిలవొద్దు’’ అని సలహా ఇచ్చారు. బ్రిటిష్ ఇంగ్లీషులో ‘సర్’కు ఉన్న అర్థం వేరు కావడమే దీనికి కారణం. దానివల్ల ఇంటర్వ్యూలో వాడింగ్టన్ హోదాను ఇంటర్వ్యూ చేసేవాడికన్నా ఎక్కువ అనుకునేలా చేస్తుంది. ఇంటర్వ్యూ చేసేవాడు, ఇచ్చే మనిషి ఇద్దరూ సమానమే అన్న అంచనాతో(లేదా భ్రమ?) ఈ ఏర్పాటు అన్నమాట. ఇంటర్వ్యూ చేసేవాళ్లకు శోధించేందుకు, అవసరమైతే వ్యతిరేకించేందుకు ఇరువురి సమానత్వం ఒక హక్కును కల్పిస్తుంది. అలాగే అవతలి వ్యక్తి నీ కంటే పెద్ద స్థాయివాడు కాదని తెలిస్తే అవసరమైనప్పుడు వారి మాటలను అడ్డుకునేందుకూ సందేహించాల్సిన అవసరం ఉండదు.వాస్తవానికి ఆ ఇంటర్వ్యూ బ్రిటిష్ ఇమ్మిగ్రేషన్ నిబంధనల అంశంపై సాగింది. ఆనాటి నిబంధలు ఆసియా ప్రాంత వాసులకు ఇబ్బందికరంగా ఉండేవి. హాట్ టాపిక్ కాబట్టి ఇంటర్వ్యూ కూడా అదే స్థాయిలో ఉండటం సహజం. వాడింగ్టన్ సమాధానాలు నాకు సంతృప్తి కలిగించే అవకాశమే లేదు. అందుకే సమీర్ నన్ను పరోక్షంగా హెచ్చ రిస్తూ ఆ మాటలు అన్నారు. ఆయన్ని నేను సంబోధించే విధానం నా స్థితిని బలహీనం చేయకూడదన్నది సమీర్ ఉద్దేశం. కాబట్టి... సర్ అన్న సంబోధన లేకుండా పోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ నాకు సమీర్ మాటలే పరమ ధర్మంలా మిగిలాయి. అధికారంలో ఉన్న వ్యక్తి ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నా... ఎంపీలు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు, అధికారులు, ప్రముఖులు ఎవరైనా సరే... మిస్టర్, మిసెస్, మిస్ అని కానీ... ప్రభుత్వంలో ఉంటే మినిస్టర్ అని కానీ సంబోధించడాన్ని ఒక నియమంగా పెట్టుకున్నాను. ఇలా ఎందుకో చెబుతాను.‘‘సర్... మీరు చెబుతున్నది కరెక్ట్ కాదు’’ అని ప్రతిసారీ చెప్ప లేం. ‘సర్’ అని సంబోధిస్తూంటే... ఇలా చెప్పే అవకాశం గట్టిగా చెప్పలేకపోవచ్చు. అదే ‘మినిస్టర్’ అని సంబోధిస్తున్నాం అనుకోండి... ఎప్పుడు కావాలంటే అప్పుడు ‘‘సారీ, మీరు తప్పు చెబుతున్నారు’’ అనేయవచ్చు. ‘సర్’ అంటే ఒకపక్క ఉన్నత స్థానం కల్పిస్తూ... ఇంకో పక్క తప్పు అంటున్నాం. పరస్పర విరుద్ధం ఇవి. ‘మినిస్టర్’అంటున్నప్పుడు మీరు చెబుతున్నది తప్పు అనేందుకు పెద్దగా ఇబ్బంది పడనక్కరలేదు. సన్నిహిత సంభాషణల్లో... పేరుతో!అయితే... ఛాట్ షో ఇంటర్వ్యూల విషయానికి వస్తే ఇవన్నీ మారి పోతాయి. అవతలి వ్యక్తి గ్లామర్, సెలిబ్రిటీ స్థాయిని బట్టి కదా ఇంటర్వ్యూకు ఎంచుకున్నాను. అది వర్తమాన అంశాలకు సంబంధించిన ఇంటర్వ్యూ కాదు. విధాన నిర్ణయాల గురించి గుచ్చిగుచ్చి అడిగేది కాదు. వారి జీవిత ఘట్టాలు, జ్ఞాపకాలకు సంబంధించినది కాబట్టి, వారి వ్యక్తిత్వాన్ని పరిచయం చేసే షో కాబట్టి... ‘మిస్టర్’, ‘మిస్’ అంటే వారికి దూరం జరిగినట్టు అవుతుంది. ఇది చర్చను ముందుకు పోనీయదు. అలాంటి సందర్భాల్లో వారిని పేరుతో పిలుస్తూంటాను. అందుకే జావేద్(అఖ్తర్), షారుఖ్(ఖాన్ ), మాధురీ (దీక్షిత్), షర్మిలా (ఠాగూర్), విక్రమ్(సేథ్), సచిన్ (టెండూల్కర్) అన్న పేర్లతో సంబోధన ఉంటుంది.ఒక్కోసారి పరిస్థితి వికటించే అవకాశం కూడా ఉంది. నేను ఇంటర్వ్యూ చేసేవాళ్లలో కొంతమంది నాకు బాగా పరిచయమైన రాజకీయ నేతలు కూడా ఉంటూంటారు. ఉదాహరణగా చెబు తున్నా... అలాంటి వారిని ‘మిస్టర్ థరూర్’ అని సంబోధించాల్సి వస్తుంది. నాకు వ్యక్తిగతంగా ఆయన శశిగానే తెలిసినప్పుడు ‘మిస్టర్ థరూర్’ అని పిలవడం ఎబ్బెట్టుగా ఉంటుంది. వీలైనంత వరకూ పేరు పెట్టి పిలవకుండా, ఇంటిపేరుతో కలిపి పిలవడం ద్వారా బ్యాలెన్ ్స చేస్తూంటాను. ఇది ఫార్మల్గానూ ఉంటుంది, అలాగే వ్యక్తిగత సాన్ని హిత్యాన్ని సూచించేందుకూ ఇబ్బందిగా ఉండదు.నేను చేయని పనల్లా ఒక్కటే! మంత్రిని పేరు పెట్టి పిలవను. వాళ్లు నాకు తెలిసినప్పటికీ పీయూశ్, కపిల్ అంటూ పేర్లతో పిలవను. ఫార్మల్ ఇంటర్వ్యూలో ఇలా పిలవడం అంత మంచిది కాదు. వీక్షకులు వెంటనే సాన్నిహిత్యాన్ని పసిగట్టేస్తారు. నాకు వచ్చిన ప్రశ్నకు సమాధానం దక్కిందనే అనుకుంటున్నాను. ఇదెంత అర్థవంతంగా ఉందో నిర్ణయించుకోవాల్సింది మాత్రం మీరే!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, రాజకీయాంశాల వ్యాఖ్యాత -
మహేష్ బాబుతో నటించాలన్నదే నా చిరకాల కోరిక..
సీతమ్మధార(విశాఖ): అటు అందం.. ఇటు అభినయం కలగలిపిన విశాఖ సోయగం హేమలతారెడ్డి.. గ్లామర్ ఫీల్డ్లో పాదరసంలా దూసుకుపోతున్నారు. బుల్లితెర, వెండితెర, ఫ్యాషన్ రంగాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పలు టీవీ చానళ్లలో యాంకర్గా కెరీర్ ప్రారంభించిన ఆమె దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతూ వచ్చారు. అటు సీరియళ్లు, సినిమాలు.. ఇటు ఫ్యాషన్ రంగంలో విజయాలతో తన కలలను సాకారం చేసుకుంటున్నారు. వెండితెరపై నా పేరుండాలి.. నా నటన అందరూ గుర్తు పెట్టుకోవాలి.. అని అంటున్న ఆమె హైదరాబాద్లో ఉంటున్నారు. ఇటీవల ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. విశాఖలోనే ఓనమాలు విశాఖ నటనలో నాకు ఓనమాలు నేర్పింది. ఇక్కడ ఎన్నో విషయాలు నేర్చుకున్నా.. ఇప్పుడీస్థాయిలో ఉండడానికి కారణం నా తల్లిదండ్రులే. డాబాగార్డెన్స్లో ఉంటున్నాం. నాన్న సూర్య దేవర వెంకటరావు నేవీలో పనిచేసి రిటైరయ్యారు. ఇక్కడే సెటిల్ అయ్యారు. చదువుంతా సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థలో సాగింది. తాను ఇంటర్ వరకు అక్కడే చదివా. తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ క్లాసికల్ చేశా. తల్లి ధనలక్ష్మి ఫైనాన్స్ వ్యాపారం.న్యూస్రీడర్ నుంచి హీరోయిన్ వరకు.. నాన్న నన్ను న్యూస్ రీడర్గా చూడాలనుకున్నారు. ముందుగా టీవీ 9, తర్వాత ఎన్టీవీలో ఎంటర్టైన్మెంట్ షోలు చేశా. ఎందరో హీరోయిన్లను ఇంటర్వ్యూ చేశా. జెమిని టీవీలో సినిమా న్యూస్రీడర్గా చేశా. మంచు విష్ణు నిర్మించిన హ్యాపీడేస్ సీరియల్లో కల్యాణి పాత్రలో నటించా. ఆ సీరియల్కు, అందులో నా పాత్రకు మంచి ఆదరణ లభించింది. అంతఃపురం, క్రైమ్ తదితర సీరియల్స్ చేశాను. జెమిని, మా టీవిలో నేను నటించిన సీరియల్స్ ప్రసారమయ్యాయి. నేను ఇప్పటివరకు సుమారుగా 20 వరకు సీరియల్స్లో నటించాను. గతంలో విశాఖ బిగ్ ఎఫ్ఎంలో జాబ్ కోసం ట్రై చేశా. ఇప్పుడు అదే ఎఫ్ఎంలో నన్ను ఇంటర్వ్యూ అడగడం చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబుతో నటించాలన్నదే నా చిరకాల కోరిక. సౌందర్య, సమంత తన అభిమాన హీరోయిన్లు. తెలుగు హీరోయిన్లు అంజలి, వైష్ణవి సినిమాల్లో రాణిస్తున్నారు. వారి లాగే నన్ను ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. వీరభద్ర క్రియేషన్స్ పేరిట సొంత బ్యానర్ 2017లో ప్రారంభించాను.గ్లామర్ ఆన్ మిసెస్ ఇండియా అవార్డుతో విశాఖలో జని్మంచిన పోతురెడ్డి హేమలతా రెడ్డి మలేసియాలో జరిగిన గ్లామ్ ఆన్ మిసెస్ ఇండియాగా నిలిచారు. మొదట లోకల్ టీవీ, జెమినీ టీవీ యాంకర్గా కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత పలు షోలో పాల్గొన్నారు. హ్యాపీడేస్ సీరియల్లో లీడ్ రోల్ చేసి బుల్లితెర ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. అనంతరం హీరో జగపతిబాబుతో ప్రవరాఖ్యుడు సినిమాలో నటించారు. అందులో హేమలతా రెడ్డి హీరోయిన్ ప్రియమణి స్నేహితురాలిగా నటించారు. నిన్నే చూసి సినిమాలో హీరోయిన్గా నటించి నిర్మాతగా వ్వవహరించారు. అక్కడ నుంచి మిసెస్ ఇండియా పోటీలో విశాఖ నుంచి ప్రాతినిథ్యం వహించి ప్రపంచ వ్యాప్తంగా 300 మందిలో విజేతగా నిలిచారు. -
ముందు ఎంజీబీఎస్,మెట్రో పిల్లర్లు కూల్చండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేసే ముందు మహాత్మాగాం«ధీ బస్టాండ్ (ఎంజీబీఎస్)ను, మెట్రో పిల్లర్లను కూల్చాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. వాటిని తొలగించకుండా మూసీ ప్రక్షాళన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్రెడ్డి తన ప్రణాళికలను రీషెడ్యూల్ చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ‘ఈ ప్రాజెక్ట్ కోసం రూ.1.5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఎలాంటి డీపీఆర్, కార్యాచరణ ప్రణాళిక లేకుండా, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దకుండా సుందరీకరణ ఎలా చేస్తారు? ప్రభుత్వమే రోడ్లువేసి, విద్యుత్ కనెక్షన్లు, ఇంటినంబర్, ఆధార్కార్డ్లు ఇచ్చి.. ఇప్పుడు పేదలు, దిగువ మధ్యతరగతి వారి ఇళ్లు కూలుస్తామంటే ఎలా? ముందు ఇళ్లు కూల్చుతాము, ఆ తర్వాత ప్రణాళిక వేస్తామంటే.. భవిష్యత్లో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోతే బాధిత ప్రజలు ఎక్కడికి వెళ్లాలి? ఇళ్ల కూలి్చవేతపై మూసీ ప్రభావిత ప్రాంతంలో సీఎం రేవంత్రెడ్డి దర్బార్ పెట్టి ప్రజలను ఒప్పించాలి.సీఎం వస్తే నేను కూడా అక్కడకు వచ్చి ప్రజల తరఫున మాట్లాడేందుకు సిద్ధం’అని కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చే ముందు ఇమ్లీబన్లోని ఎంజీబీఎస్ను, అక్కడి మెట్రో పిల్లర్లు, స్టేషన్ను కూల్చాలి. మూసీ పరీవాహక ప్రాంతంలో 30, 40 ఏళ్ల కిందటే పేదలు తమ కష్టార్జితంతో ఇళ్లు కట్టుకుని నివసిస్తుంటే, ప్రభుత్వం పెద్ద పెద్ద ఫామ్హౌస్లను వదిలిపెట్టి పేదలపై పడతామంటే మేము విడిచిపెట్టే ప్రసక్తే లేదు’అని హెచ్చరించారు. కాగా, తమతో బీఆర్ఎస్ నేతలెవరూ టచ్లో లేరని స్పష్టం చేశారు. తెలంగాణను లూటీ చేసిన ఆ పార్టీతో ఎలాంటి రాజీ లేదని, ఆ పార్టీ అవినీతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుతో పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఎలాంటి ప్రాజెక్ట్ పెట్టదని, అక్కడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. హైడ్రా, మూసీపై నేను చెప్పేదే పార్టీ పాలసీ.. ‘హైడ్రా ద్వారా దుందుడుకు చర్యలు తీసుకోవడం సరికాదు. హైడ్రా అనేది రేవంత్రెడ్డి పెట్టుకున్న పేరు. అక్రమ నిర్మాణాల కూలి్చవేతలకు జీహెచ్ఎంసీలో ఓ వ్యవస్థ ఉంది. హైడ్రా వెనుక సీఎం రేవంత్రెడ్డికి వేరే ఉద్దేశాలు ఉన్నాయి’అని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీలో హైడ్రాపై భిన్నస్వరాలు వినిపించడంపై ఏమంటారని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘పేదల ఇళ్లు కూల్చమని మా ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరైనా చెప్పారా’అని కిషన్రెడ్డి తిరిగి ప్రశ్నించారు. హైడ్రా, మూసీపై తాను చెప్పేదే పార్టీ పాలసీ అని స్పష్టంచేశారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించం జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదాన్ని ఉపేక్షించమని కిషన్రెడ్డి చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా శాంతిభద్రతలు క్షీణిస్తే కేంద్రం జోక్యానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ‘కశ్మీర్లో బీజేపీ వంద శాతం లక్ష్యం చేరుకుంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఏకాకి చేయగలిగాం. భారత్కు వ్యతిరేకం కాబట్టి ఆ దేశానికి చైనా అన్నిరకాలుగా సహాయపడుతోంది’అని తెలిపారు. ఆరి్టకల్ 370 పునరుద్ధరణ అసాధ్యమని, అది ముగిసిన అధ్యాయమని అన్నారు. జమ్మూకశీ్మర్కు రాష్ట్ర హోదా కల్పనపై తగిన సమయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. -
‘రాజకీయాల నుంచి తప్పుకుంటే.. గోవా వెళ్తా.. ఎంజాయ్ చేస్తా’
సాక్షి, హైదరాబాద్: తనకు గోవాలో హోటల్ ఉందని.. రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తానంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి మల్లారెడ్డి. శుక్రవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, మనిషి జీవితం ఒకేసారి వస్తుందని..ఎంజాయ్ చేయాలన్నారు తన కుమారుడికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వమని అడుగుతున్నా.. కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే రేవంత్ను పట్నం మహేందర్ కలిశారు. ఎంపీ రంజిత్రెడ్డి చేరికకు ముందే మహేందర్ కర్చీఫ్ వేశారు. జగ్గారెడ్డి ఫోకస్ కావడం కోసమే నా పేరు వాడుకుంటున్నారు. ఎంపీ టికెట్ కోసమే జగ్గారెడ్డి.. రేవంత్ను పొగుడుతున్నాడు. మల్లారెడ్డి పేరు చెప్పకపోతే జగ్గారెడ్డిని ఎవరూ పట్టించుకోరు. గతంలో రేవంత్రెడ్డిపై ఆయన చేసిన విమర్శలు అందరికీ గుర్తున్నాయి’’ అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. సబితారెడ్డితో కేటీఆర్ భేటీ అసెంబ్లీలో సబితారెడ్డితో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. మహేందర్ రెడ్డి, సునీతారెడ్డి పార్టీ వీడితే ఎదురయ్యే పరిణామాలపై చర్చించారు. ఇప్పటికే ప్రకాష్ గౌడ్, తీగల కృష్ణారెడ్డిలు.. సీఎంను కలవడంపై చర్చాంశనీయంగా మారింది. జిల్లాలో పార్టీ పరిస్థితి పై చర్చించినట్లు సమాచారం ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం -
నా జీవితంలో అది ఎప్పటికీ ప్రత్యేకమే: నిహారిక
మెగాడాటర్, నాగబాబు కూతురు నిహారిక కొణిదెల టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. మెగా కుటుంబం నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు పోస్టులు చేస్తూ టచ్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా నెటిజన్స్తో సరదాగా చిట్ చాట్ నిర్వహించారు. ఈ ఇంటరాక్షన్లో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. అసలు ఆమెను ఎలాంటి ప్రశ్నలు అడిగారో ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: ‘భోళా శంకర్’కు తొలి రోజు ఊహించని కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే.. ) నిహారిక తన ఫ్యాన్స్తో నిర్వహించిన చిట్చాట్లో ఆమె ఇష్టమైన విషయాల గురించి మాట్లాడారు. మీకిష్టమైన ప్రదేశం, వెబ్ సిరీస్లు ఏవని అడగ్గా.. ఇండోనేషియాలోని బాలి తన బెస్ట్ వెకేషన్ ప్లేస్ అని వెల్లడించింది. ఇక వెబ్ సిరీస్లు విషయానికొస్తే దిస్ ఇజ్ అజ్, డెక్ట్సర్ అని తెలిపింది. మరో నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేయగా.. నిహారిక బదులిచ్చింది. వరుణ్తేజ్తో దిగిన ఏ ఫోటో మీకు ఇష్టమని ప్రశ్నించగా.. ఎంగేజ్మెంట్లో అన్నయ్యతో దిగిన ఫోటోనే నా జీవితంలో అత్యంత ప్రత్యేక సందర్భమని తెలిపింది. అంతే కాకుండా నాకు బోర్డ్ గేమ్స్ అంటే చాలా ఇష్టమని.. రొమాన్స్, మర్డర్ మిస్టరీ జోనర్ సినిమాలంటే తనకు ఆసక్తి అని వెల్లడించింది. కాగా.. ఇటీవలే తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'జైలర్' థియేటర్లో అత్తగారి ముందే ఆ హీరోయిన్తో ధనుష్ రచ్చ) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
సరైన టైంలో నిర్ణయం.. అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 50 శాతం స్థానాల్లో పోటీపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. తాజ్మహల్ కంటే అందమైన సెక్రటేరియట్ కేసీఆర్ కట్టారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామం అని అసదుద్దీన్ పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో మంచి పరిపాలన చేస్తున్నారు.. దేశమంతా వస్తే మంచిదే. మమ్మల్ని బీజేపీ బీ టీం అని కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేస్తున్నారు. బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో జేపీసీ కోసం అడిగితే మోదీ ఒప్పుకోవడం లేదు. సెక్రటేరియట్ ఓపినింగ్ అధికారిక కార్యక్రమం.. అక్కడికి వెళ్తాము. పరేడ్ గ్రౌండ్ మీటింగ్ బీఆర్ఎస్ రాజకీయ సమావేశం.. మాకు సంబంధం లేదు.. ఇతర పార్టీలని పిలిస్తే వాళ్ల ఇష్టం అని అసదుద్దీన్ అన్నారు. చదవండి: సీఎం కేసీఆర్తో జగ్గారెడ్డి భేటీ.. కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? -
డ్రోన్ అంటే కెమెరా ఒక్కటే కాదు!
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘‘పిల్లలూ డ్రోన్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా? డ్రోన్ అంటే కెమెరా ఒక్కటే కాదు.. దానితో పొలాల్లో పురుగుమందు స్ప్రే చేయవచ్చు.. అమ్మాయిల భద్రత విషయంలో చర్యలు తీసుకోవచ్చు. గుట్టలు, చెరువులు, కుంటల సరిహద్దులను నిర్ధారించవచ్చు. సరిహద్దుల్లో ఎవరు చొరబడకుండా చూడవచ్చు. భవిష్యత్లో మనుషులను తీసుకెళ్లే వాహనం కూడా అవుతుంది’’అంటూ గురుకుల విద్యార్థులతో మంత్రి కేటీఆర్ చిట్చాట్ చేశారు. మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్, గూడూరు శివారులో మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ బాలుర, బాలికల గురుకుల పాఠశాల భవనాలను కేటీఆర్ ప్రారంభించారు. తర్వాత విద్యార్థులతో కలిసి ముచ్చటిస్తూ భోజనం చేశారు. ఈ సందర్భంగా కవరేజ్లో భాగంగా ఆ వైపు వచ్చిన డ్రోన్ను చూసిన కేటీఆర్ దానివల్ల ఏమేం చేయొచ్చో విద్యార్థులకు వివరించారు. చదువుకుని ఏమవుతారని, ఉద్యోగం చేస్తారా? అని ప్రశ్నించారు. ఉద్యోగం చేయడమే కాకుండా పది మందికి ఉద్యోగం కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. ఇక్కడ పదో తరగతి, ఇంటర్మీడియెట్ చదివే పిల్లలను హైదరాబాద్లోని టీ–హబ్కు తీసుకువెళ్లి చూపించాలని ప్రిన్సిపాల్కు సూచించారు. తాను నాన్వెజ్ బంద్ చేశానని.. అందుకే పప్పు, చారు, పెరుగుతో ముగిస్తున్నానని విద్యార్థులకు చెప్పారు. భారీగా అభివృద్ధి పనుల ప్రారంభం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు, కమలాపూర్ గ్రామాల్లో రూ.49 కోట్ల అంచనాలతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అంతకుముందు మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్యాదవ్ తదితరులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కమలాపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద శిలాఫలకాలను ఆవిష్కరించారు. తర్వాత కుల సంఘాల భవన సముదాయాన్ని ప్రారంభించారు. కాగా.. మంత్రి కేటీఆర్ పర్యటన సమయంలో ఎన్ఎస్యూఐ కార్యకర్తలు కాన్వాయ్లోకి చొరబడి నల్లచొక్కాలతో నిరసన తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. -
మహేష్ బాబు ఒకప్పటిలా లేడు: సుధీర్ బాబు
-
వాల్తేరు వీరయ్య తో సాక్షి చిట్ చాట్
-
బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ కీర్తి భట్ తో " చిట్ చాట్ "
-
బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ శ్రీ సత్యతో " చిట్ చాట్ "
-
జాన్ సే డైరెక్టర్ తో " చిట్ చాట్ "
-
మట్టి కుస్తీ మూవీ టీంతో " స్పెషల్ చిట్ చాట్ "
-
జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తో " చిట్ చాట్ "
-
యాంకర్ ఓంకార్, కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ తో " స్పెషల్ చిట్ చాట్ "
-
బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ బాలాదిత్య తో " స్పెషల్ చిట్ చాట్ "
-
యశోద మూవీ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తో " స్పెషల్ చిట్ చాట్ "
-
" లైక్, షేర్ & సబ్స్క్రైబ్ " మూవీ టీంతో చిట్ చాట్
-
లైగర్ ఫ్లాప్పై తొలిసారి స్పందించిన పూరీ
-
లైగర్ ఫ్లాప్పై తొలిసారి స్పందించిన పూరీ, ఏమన్నాడంటే
విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్చించిన చిత్రం లైగర్. పాన్ ఇండియా మూవీగా రూపొందిన లైగర్ భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బొల్తా పడింది. దీంతో ఈ మూవీ నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు లైగర్ నష్టాలను మిగిల్చింది. ఇదిలా ఉంటే విడుదలకు ముందు బ్లాక్బస్టర్ హిట్ ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన పూరీ విడుదల అనంతరం సినిమా గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. చదవండి: ‘బాహుబలి’ ఆఫర్ వదులుకున్నందుకు గర్వపడుతున్నా: మంచు లక్ష్మి మూవీ పరాజయంపై ఇంతవరకు ఆయన నేరుగా స్పందించింది లేదు. ఈ నేపథ్యంలో చిరుతో ఇన్స్టాగ్రామ్ వేదికగా లైవ్లో పాల్గొన్న పూరీ ఈ సందర్భంగా లైగర్ ఫ్లాప్పై స్పందించాడు. కాగా గాడ్ ఫాదర్ బ్లాక్బస్టర్ హిట్ నేపథ్యంలో పూరీ జగన్నాథ్-చిరంజీవి ఇన్స్ట్రాగ్రామ్ లైవ్ ద్వారా ముచ్చటించారు. ఈ నేపథ్యంలో చిరు, పూరీని ఇలా ప్రశ్నించాడు. పూరీ మీరు అనుకున్న రిజల్ట్ రాకపోతో ఎలా తీసుకుంటారు? అని అడగ్గా.. ‘దెబ్బ తగినప్పుడు హీలింగ్ టైమ్ ఉంటుంది చూశారా.. అది తక్కువగా పెట్టుకోవాలి. ఆస్తులు పోవచ్చు లేదా యుద్ధాలు జరగోచ్చు ఏం జరిగినా హీలింగ్ టైమ్ నెలకు మించి ఉండకూడదు. ఒక నెలలో వేరే పనిలో పడిపోవాలి అంతే. కొన్నిసార్లు నమ్మిన వాళ్లు కూడా ఫ్లిప్ అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు’ అన్నాడు. చదవండి: వెండితెర ఎంట్రీ ఇస్తున్న కార్తీక దీపం ఫేం ‘వంటలక్క’, ఫస్ట్లుక్ రిలీజ్ అనంతరం ‘నేను లైగర్ సినిమా తీశాను. మూడేళ్లు సినిమాకి పనిచేస్తూ ఎంతో ఎంజాయ్ చేశాను. మంచి సెట్స్ వేశాం. కాస్ట్ అండ్ క్రూ, మైక్ టైసన్ ఇలా అంతా ఎంతో ఆనందంగా చేశాం. కానీ, సినిమా ఫ్లాప్ అయ్యింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా రిజల్ట్ కోసం ఆదివారం వరకు వేచి చూశా. ఆ తర్వాత మూవీ ప్లాప్ అని అర్థమైంది. ఆ మరుసటి రోజు సోమవారం జిమ్కు వెళ్లి 100 స్క్వాడ్స్ చేశా. ఒత్తిడి మొత్తం పోయింది. నా జీవితం నేను బాధగా ఉన్న రోజుల కంటే నవ్వుతూ ఉన్న రోజులే ఎక్కువ’ అంటూ పూరీ సమాధానం ఇచ్చాడు. ఇక ప్రస్తుతం తాను ముంబైలో కొత్త కథలు రాసే పనిలో ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు. కాగా గాడ్ ఫాదర్లో పూరీ జర్నలిస్ట్గా కీ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. -
జిన్నా మూవీ టీం తో స్పెషల్ చిట్ చాట్
-
గాడ్ ఫాదర్ గ్రాండ్ సక్సెస్.. మూవీ టీమ్ స్పెషల్ చిట్ చాట్
-
మంచు లక్ష్మితో స్పెషల్ చిట్ చాట్
-
అడగరాని ప్రశ్న అడిగిన నెటిజన్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన బిగ్బాస్ బ్యూటీ
బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా పాపులర్ అయిన నటి పునర్నవి భూపాలం. అంతకు ముందు కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ.. అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్బాస్ మూడో సీజన్లో పాల్గొని, తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఏ విషయంలోనైనా ఓపెన్గా మాట్లాడుతూ..బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చకుంది. బిగ్బాస్ షో తర్వాత చాలా సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ.. నో చెప్పి పై చదువుల కోసం లండన్ వెళ్లింది. ప్రస్తుతం ఆమె లండన్లో సైకాలజీ హయ్యర్ స్లడీస్ చేస్తోంది. సినిమాల ద్వారా కాకపోయినా.. సోషల్ మీడియా ద్వారా అయినా అభిమానులతో టచ్లో ఉంటుంది ఈ బోల్డ్ బ్యూటీ. ఇటీవల ఇన్ స్టా లైవ్లోకి వచ్చిన పునర్నవి తన డేటింగ్ విషయంపై స్పందించింది. మీరు ఎవరితోనైనా డేటింగ్లో ఉన్నారా? అని ఓనెటిజన్ ప్రశ్నించగా.. ఎస్ అని అన్సర్ ఇచ్చింది. అలాగే మీరు వర్జిన్ నా? అని మరో నెటిజన్ ప్రశ్నించగా.. పునర్నవి మొహమాటం లేకుండా నేను ఇలాంటి ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నానని సమాధానం చెప్పారు. పునర్నవి చేసిన ఈ చిట్ చాల్ నెట్టింట వైరల్ అవుతోంది. -
నల్లగొండ: పార్టీ మార్పుపై కోమటిరెడ్డి రాజగోపాల్ చిట్చాట్
-
సితార సోఫాలో నుంచి కిందపడిపోయింది: మహేశ్ బాబు
Mahesh Babu About Sitara In Chit Chat With Youtubers: 'ఆ సీన్ చూసి సితార ఇచ్చిన రియాక్షన్ ఇప్పటివరకు నేను ఎప్పుడూ చూడలేదు' అని సూపర్ స్టార్ మహేశ్ బాబు పేర్కొన్నాడు. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు మహేశ్ బాబు. ఇందులో భాగంగా శనివారం (మే 21) పలువురు యూట్యూబర్లతో చిట్చాట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్ బాబు, కీర్తి సురేశ్, డైరెక్టర్ పరశురామ్ పాల్గొన్నారు. యూట్యూబర్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా, ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను వారితో పంచుకోవాలని మహేశ్ బాబు తెలిపాడు. ''ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో కీర్తి నన్ను తిట్టాలి. 3 టేకులు తీసుకున్నప్పటికీ కీర్తి చేయలేకపోయింది. దీంతో డైరెక్టర్ ఆమె దగ్గరికి వెళ్లి 'మేడమ్.. మీరు సార్ను తిట్టాలి. గుర్తుపెట్టుకోండి ఆయన్ను మీరు తిట్టాలి.' అని చాలాసార్లు చెప్పారు. కీర్తి ఇబ్బందిపడుతోందని నాకు అర్థమైంది. అప్పుడు నేను 'పర్వాలేదు కీర్తి.. నన్ను నువ్వు తిట్టు' అని చెప్పాను. దానికి ఆమె 'సార్.. నేను మిమ్మల్ని తిట్టలేను. ఒకవేళ నేను మిమ్మల్ని తిడితే మీ ఫ్యాన్స్ నన్ను ఏదో ఒకటి అంటారు.' అని చెప్పింది. 'నా ఫ్యాన్స్ ఏం అనరమ్మ. నువ్వు తిట్టు.' అని నచ్చజెప్పి ఆ సీన్ పూర్తయ్యేలా చేశాం. కానీ మొన్న నా ఫ్యామిలీతో కలిసి ఆ సీన్ చూసినప్పుడు సితార ఇచ్చిన రియాక్షన్ ఇప్పటివరకూ నేను ఎప్పుడూ చూడలేదు. తను సోఫాలో నుంచి కిందపడిపోయి మరి నవ్వింది.'' అని చెప్పుకొచ్చాడు మహేశ్బాబు. చదవండి: అలా ఎందుకు జరిగిందో తెలియదు: మహేశ్ బాబు ఆ సినిమా చూసి ఏడ్చేశాను : మహేశ్ బాబు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_721246091.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ రెండింటికి దూరంగా ఉండాలనుకుంటున్నా : సమంత
స్టార్ హీరోయిన్ సమంత తాజాగా నటించిన సినిమా కాతువాక్కుల రెండు కాదల్. ఈ సినిమాని తెలుగులో ‘కణ్మణి ర్యాంబో ఖతీజా’ పేరుతో విడుదల చేశారు. విజయ్ సేతుపతి, నయనతారతో పాటు సమంత నటించిన ఈ సినిమా ఏప్రిల్28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన సమంత వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.చదవండి: ఎప్పటికీ కృతజ్ఞురాలినే,మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా : సమంత ప్రేక్షకులను నవ్వించడం కోసమే ఖతీజా పాత్రలో నటించానని చెప్పిన సమంత ప్రతి ఒక్కరు వారి జీవితంలో కాస్త విరామం ఇచ్చి ఈ సినిమా చూసి హాయిగా నవ్వుకోమని కోరింది. ఇక ఈ సినిమాలో తనకు ‘డిప్పం డిప్పం’ పాట అంటే ఎంతో ఇష్టమని సమంత ఈ సందర్భంగా పేర్కొంది. నయనతార గురించి చెబుతూ..తాను కలిసిన వాళ్లలో మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్ నయనతార అని ఆమెలాంటి వ్యక్తి మరొకరు ఉండరు అని పేర్కొంది. ఇక ఓ నెటిజన్ ఒకే సమయంలో ప్రేక్షకుల నుంచి ప్రేమ, విపరీతమైన ద్వేషం రావడం ఎలా అనిపిస్తుంది అని అడగ్గా.. ఆ రెండింటికి దూరంగా ఉంటానని, అయితే అభిమానులు తనపై చూపించే ప్రేమకు కృతఙ్ఞతతో ఉంటానని సామ్ చెప్పుకొచ్చింది. దీంతో ప్రేమపై కూడా తనకు నమ్మకం లేదని ఈ సమాధానం ద్వారా సమంత చెప్పకనే చెప్పింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: సమంతపై ప్రాంక్.. విజయ్ సర్ప్రైజ్ మామూలుగా లేదుగా I try not to buy into the love or the hate .. stay a safe distance away from it all ♥️#AskSam https://t.co/RyLXiPjxca — Samantha (@Samanthaprabhu2) April 29, 2022 #Nayanthara is #Nayanthara💕there is no one like her . She is real,fiercely loyal and one of the most hard working people I have met #Kanmani #KaathuvakulaRenduKaadhal #AskSam https://t.co/8Crkmn8BLE — Samantha (@Samanthaprabhu2) April 29, 2022 -
KGF Chapter 2 మూవీ టీం తో స్పెషల్ ఇంటర్వ్యూ
-
'ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను.. మాటల్లో చెప్పలేని ఫీలింగ్'
సెకండ్ లాక్డౌన్ (గత ఏడాది)లో వెడ్ లాక్ (2021 మే 30)లోకి ఎంటరయ్యారు ప్రణీత. వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఆమె వివాహం జరిగింది. సోమవారం (ఏప్రిల్ 11) సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఓ తీపి కబురు పంచుకున్నారు ప్రణీత. తల్లి కాబోతున్న విషయాన్ని తెలియజేసి, స్కానింగ్ కాపీని చూపిస్తూ భర్తతో కలిసి ఉన్న ఫొటో షేర్ చేశారామె. ఈ సందర్భంగా ప్రణీతతో ‘సాక్షి’ స్పెషల్ చిట్ చాట్. ►పెళ్లి సింపుల్గా చేసుకుని, ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తల్లి కాబోతున్న విషయాన్నీ సోషల్ మీడియా ద్వారానే ప్రకటించారు..(నవ్వేస్తూ).. నాకు సింపుల్ వెడ్డింగ్ అంటే ఇష్టం. అందుకు తగ్గట్టుగా అప్పుడు లాక్డౌన్ కూడా. అందుకే మాకు నచ్చినట్లు దగ్గర బంధువులు, అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకుని, సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాం. హడావిడి లేకుండా మా పెళ్లి ప్రశాంతంగా జరిగింది. ►ఇప్పుడు తల్చుకున్నా చాలా స్వీట్గా ఉంటుంది. ఇక నా లైఫ్లో జరిగే ప్రతి మంచి విషయాన్ని నా ఫ్యాన్స్కి తెలియజేయాలనుకుంటాను. అందుకే అప్పుడు పెళ్లి, ఇప్పుడు తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాను. 2021లో పెళ్లితో లైఫ్లో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంకో కొత్త చాప్టర్. ఈ కొత్త ఫీలింగ్ గురించి... ►నిజంగా మాటల్లో చెప్పలేని ఫీలింగ్ ఇది. ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను. నితిన్కి చెప్పాను. మా అమ్మవాళ్లకి, అత్తమామలకు చెప్పేటప్పుడు మాత్రం బిడియంగా అనిపించింది. నాకు నేను కొత్తగా అనిపించాను. అలానే వేరే ఫ్రెండ్స్తో కూడా సిగ్గుపడుతూ మాట్లాడాను. ►మీ అమ్మగారు గైనకాలజిస్ట్ కాబట్టి గైడెన్స్ విషయంలో మీకు ఇబ్బంది ఉండదు... అవును. అమ్మ సలహాలు తీసుకుంటాను. ఏం తినాలి? ఏం తినకూడదు? అని చాలామంది చెప్పారు. నాకు వామిటింగ్, వేరే ఏ ఇబ్బందులు లేవు. అందుకని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేంతవరకూ నేను ప్రెగ్నెంట్ అని కన్ఫార్మ్గా తెలుసుకోలేకపోయాను. మామూలుగా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బొప్పాయి, పైనాపిల్ తినకూడదంటారు. కానీ టెస్ట్ చేసుకోకముందు కొన్ని రోజులు ఈ రెండూ బాగానే తిన్నాను. థ్యాంక్ గాడ్... ఏమీ కాలేదు. ►ఇప్పుడు ఎన్నో నెల? అది మాత్రం సస్పెన్స్. డెలివరీ ఈ సంవత్సరమే. ►ప్రెగ్నెన్సీ టైమ్లో చేసే యోగా, ఎక్సర్సైజ్లవీ ప్లాన్ చేసుకున్నారా? ఇంకా లేదు. కొన్ని రోజులు మెల్లిగా నడవాలనుకుంటున్నాను. ఆ తర్వాత యోగా వంటివి ప్లాన్ చేస్తాను. ఈ మధ్య కాజల్ అగర్వాల్ (ప్రస్తుతం కాజల్ గర్భవతి) యోగా చేస్తూ పెట్టిన వీడియోలు చూశాను. కొన్ని రోజుల తర్వాత నేనూ అవి చేయాలనుకుంటున్నాను. ►ఇప్పుడు ఏమేం తినాలనిపిస్తోంది? ప్రస్తుతానికి నాకు చాక్లెట్లు, ఐస్క్రీములు తినాలనిపిస్తోంది. ఇంతకుముందూ తినేదాన్ని కానీ ఇప్పుడు ఈ రెండింటి మీద మనసు బాగా లాగుతోంది. అయితే నా ఆరోగ్యం, బేబీ ఆరోగ్యం కోసం కొంచెం కంట్రోల్ చేసుకుంటాను. ఇంకా డైట్ ప్లాన్ చేయలేదు... చేయాలి. ►పాప కావాలా? బాబు పుట్టాలనుకుంటున్నారా? మా ఇద్దరికీ (భర్త నితిన్ రాజు) ఎవరైనా ఓకే.. ప్రస్తుతం ఓ కన్నడ సినిమా చేస్తున్నట్లున్నారు.. లక్కీగా ఆ సినిమా షూటింగ్ పూర్తయింది. ►సినిమాలు కంటిన్యూ చేస్తారా? తప్పకుండా. ఇప్పుడు కూడా ఏమైనా యాడ్స్కి అవకాశం వస్తే చేస్తాను. సినిమాలు వదిలే ప్రసక్తే లేదు. ►ఫైనల్లీ.. కంగ్రాట్స్ ప్రణీత... టేక్ కేర్.. థ్యాంక్యూ సో మచ్. ఓ కొత్త ఫీలింగ్తో నా ఫీలింగ్స్ని షేర్ చేసుకున్నాను. ‘ఐయామ్ వెరీ హ్యాపీ’. -
నిహారిక అకౌంట్ను నేనే డియాక్టివేట్ చేశాను : నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ విషయంపై అయినా తనదైన స్టైల్లో సమాధానమిస్తుంటాయరన. తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్తో చిట్చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అయితే ఓ యూజర్ నిహారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను ఎందుకు డిలీట్ చేసింది?ఆ రూమర్స్పై రెస్పాండ్ అవ్వండి అని అడిగారు. దీనికి రిప్లై ఇచ్చిన నాగబాబు.. 'నిజానికి నేనే కోడింగ్ నేర్చుకొని అకౌంట్ హ్యక్ చేసి అకౌంట్ డియాక్టివేట్ చేశాను. మళ్లీ డీకోడింగ్ నేర్చుకొని అకౌంట్ రీ యాక్టివ్ చేస్తాను' అంటూ ఫన్నీగా బదులిచ్చారు. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నిహారిక కొన్ని రోజుల క్రితం తన ఇన్స్టా అకౌంట్ని డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పలు ఊహాగానాలు తెరమీదకి వచ్చాయి. కానీ నిహారిక భర్త చైతన్య తన ఇన్స్టా నుంచి ఇద్దరి ఫోటోలు షేర్ చేస్తూ ఆ రూమర్స్కి చెక్ పెట్టారు. -
రోజుకో సినిమా చూసి గానీ పడుకునే వాన్ని కాదు: నిర్మాత
మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి, ఆర్య, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'పడి నెట్టం పడి'. శంకర్ రామకృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో ఘన విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రాన్ని 'గ్యాంగ్స్ ఆఫ్ 18' పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. ఈ నెల 26న తెలుగులో గ్రాండ్గా విడుదల కానుంది ఈ సినిమా. ఈ సందర్భంగా ఈ మూవీ విశేషాలను పంచుకున్నారు నిర్మాత గుదిబండ వెంకట సాంబి రెడ్డి. సినిమాపై ఆసక్తితో.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు విద్యాసంస్థలు స్థాపించాను. సినిమా రంగంలోకి రావాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. అందులో భాగంగానే తొలి సినిమాగా 'పండుగాడి ఫొటోస్టూడియో' చిత్రం నిర్మించాను. దాని తర్వాత ‘గ్యాంగ్స్ ఆఫ్ 18’ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 26న సినిమాను గ్రాండ్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నాం. సందేశాత్మకంగా ఉంటుంది.. మీరు గమనించినట్లయితే ‘'గ్యాంగ్స్ ఆఫ్ 18' సినిమాకు 'నా స్కూల్ డేస్' అనే ట్యాగ్లైన్తోనే సినిమా స్టోరి ఏంటో చెప్పాం. స్టూడెంట్ దశ గురించి ఈ చిత్రంలో దర్శకుడు చాలా చక్కగా చూపించారు. విద్యార్థులకు సరైన గురువు దొరికితే వాళ్ల జీవితం ఎలా మారుతుంది. జీవితంలో వాళ్లు ఎంత ఎత్తుకు ఎదగగలరు అనే చక్కటి సందేశం ఈ సినిమాలో ఉంటుంది. అలాగే ప్రభుత్వ కళాశాలకు చెందిన స్టూడెంట్స్ను కార్పొరేట్ విద్యాసంస్థలకు చెందిన స్టూడెంట్స్ చిన్న చూపు చూడటం. ఇలాంటి క్రమంలో ఒక ప్రభుత్వ కళాశాల విద్యార్థులు మంత్రితో పందెం కట్టడం ఆ విద్యార్థులు ఆ పందెంలో ఎలానెగ్గారు. చివరికి ఆ మంత్రి ఏం చేశాడు. అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రతి సన్నివేశం ఎంతో కొత్తగా, ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు మలిచిన తీరు అత్యద్భుతం అని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఇక ఆచార్యుని పాత్రలో మమ్ముట్టి గారు అద్భుతమైన నటన కనబరిచారు. అతను స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేసే విధానం గానీ, వారి అభివృద్దికి తోడ్పడే అంశాలుగానీ నిజ జీవితంలో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటాయి. కాబట్టి ప్రతి స్టూడెంట్తో పాటు ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు కచ్చితంగా చూసి తీరాల్సిన అవసరం ఉంది. ఆ అంశాలు అదనపు ఆకర్షణ వర్షంలో వచ్చే బస్సు ఫైట్, సైకిల్ మీద ఫైట్ అలాగే ఏఆర్ రహమాన్ మేనల్లుడు ఏహెచ్ కాశీఫ్ అద్భుతమైన ఐదు పాటలు కంపోజ్ చేశారు. ప్రతి పాట ఎంతో వినసొంపుగా ఉంటుంది. ఇప్పటికే ఒక పాట రిలీజ్ చేశాం. యూట్యూబ్లో ఆ సాంగ్ చాలా బాగా ట్రెండ్ అవుతోంది. సంగీతంతో పాటు సినిమాటోగ్రఫీ, దర్శకుడి టేకింగ్, మమ్ముట్టి, ప్రియమణి, ఆర్య, పృథ్వీరాజ్ నటన సినిమాకు హైలెట్గా నిలిచే అంశాలు. అలాగే బాహుబలి చిత్రానికి పని చేసిన కెచ్చ ఈ చిత్రానికి అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేశారు. ఈ ఫైట్స్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. తెలుగు సినిమాలానే.. చైతన్య ప్రసాద్, శ్రేష్ణ, కృష్ణ మాదినేని ఇందులో పాటలు రాశారు. అలాగే మైథిలి కిరణ్, దీపిక రావ్ సంభాషణలు సమకూర్చారు. అందరూ కలిసి డబ్బింగ్ సినిమాలా కాకుండా తెలుగు స్ట్రయిట్ సినిమాలా ఎంతో క్వాలిటీ వర్క్ ఇచ్చారు. మా బ్యానర్లో మరిన్ని.. ప్రస్తుతం తెలుగులో ఒక స్ట్రయిట్ ఫిలిం ప్లాన్ చేశాను. ప్రస్తుతం దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అలాగే వెబ్ సిరీస్ కూడా తీయాలన్న ఆలోచన ఉంది. ఇలా కంటిన్యూయస్గా మా బ్యానర్లో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రోజుకో సినిమా చూసి.. పడుకునే ముందు రోజుకో సినిమా చూసి కానీ పడుకోను. ఇటీవల ఓటీటీ ఫిలింస్, వెబ్ సిరీస్లు చాలా చూస్తున్నా. యంగ్ జనరేషన్ అంతా మంచి కథాంశంతో వస్తున్నారు. కచ్చితంగా న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తాను. మంచి ఆడియో ఉండేలా.. ఏ జానర్ తీసుకున్నా కూడా కథ, కథనాలు ఆసక్తికరంగా, బోర్ కొట్టించకుండా, తర్వాత ఎలా ఉంటుంది? అనేలా ఉండాలి. అప్పుడే నాకు ఆ సినిమా నచ్చుతుంది. నాకు మాత్రమే కాదు ప్రేక్షకులు అంతా కూడా ఇలా ఉంటేనే ఇష్టపడారు. కాబట్టి మంచి స్క్రిప్ట్, చక్కటి సన్నివేశాలు, ఆకట్టుకునే పాటలు ఉంటే సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇటీవల కాలంలో చూస్తున్నాం. ఒక్క పాట హిట్ అయినా ఆ సినిమా ఎక్కడికో వెళ్తుంది. మా తదుపరి సినిమాల్లో మంచి ఆడియో ఉండేలా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాం. చివరిగా ‘గ్యాంగ్స్ ఆఫ్ 18’ ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. తమ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని వెంకట సాంబిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. -
అతన్ని తొలిసారి అప్పుడే కలిశాను: శ్రుతీహాసన్
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటారు హీరోయిన్ శ్రుతీహాసన్. వీలు కుదిరినప్పుడల్లా తన అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటారు. తాజాగా ఫ్యాన్స్కి ఆ అవకాశం ఇచ్చారు. అయితే తన ఫేవరెట్ విషయాలను మాత్రమే అడగాలని కండీషన్ పెట్టారు శ్రుతి. కానీ నెటిజన్స్ ఊరుకుంటారా? ఎవరికి నచ్చినవి వాళ్లు అడిగారు. అవేంటో చూద్దాం. వారంలో ఏ రోజు అంటే మీకు ఇష్టం? ప్రత్యేకంగా కారణం చెప్పలేను కానీ శనివారం అంటే ఇష్టం. ఆ తర్వాత గురువారం. వర్కౌట్స్ గురించి ఏం చెబుతారు? మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకోవడాన్ని చాలా ఎంజాయ్ చేస్తాను. ఇంకా స్విమ్మింగ్, డ్యాన్సింగ్ అంటే ఇష్టం. అయితే ఎక్కువ సమయం కేటాయిం చాల్సిన యోగా అంటే నాకు అంత ఇష్టం లేదు. ఎలాంటి పువ్వులను ఇష్టపడతారు? రోజా పువ్వులంటే చాలా ఇష్టం. ఆ తర్వాత లిల్లీ పువ్వులు ఇష్టం. మీరు ఏ ఫలాన్ని ఇష్టంగా తింటారు? సీతాఫలాలు. వీటితో పాటు చెర్రీస్ కూడా. మీకు ఇష్టమైన ఫుడ్? దోసె, సాంబార్, రసం వడ. శంతను (శ్రుతి బాయ్ఫ్రెండ్)ని మీరు ఎప్పుడు కలిశారు? తొలిసారి 2018లో శంతనుని కలిశాను. 2020 నుంచి మేం రిలేషన్షిప్లో ఉన్నాం. గిటార్ లేదా పియానోలలో ఏది ఇష్టం? నాకు గిటార్ సౌండింగ్ ఇష్టం. కానీ గిటార్ను ప్లే చేయలేను. అందుకే పియానో నా ఫేవరెట్. మీ ఫేవరెట్ బుక్? ద ఓల్డ్మ్యాన్ అండ్ ది సీ స్ట్రయిట్ లేదా కర్లీ హెయిర్.. ఏది ఇష్టం? నాకు స్ట్రయిట్ హెయిర్ అంటేనే ఇష్టం. ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? ఎప్పటికీ ఏఆర్ రెహమాన్గారే. మీ శరీరంలో మీకు ఇష్టమైనవి? నా బ్రెయిన్,నా హార్ట్. -
'అనసూయ.. మిమ్మల్ని అక్కా అని పిలవాలా? లేక ఆంటీనా'?
యాంకర్ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై గ్లామరస్ యాంకర్గా రాణిస్తూనే అవకావం వచ్చినప్పుడల్లా వెండితెరపై కూడా సత్తా చాటుతుంది. ఇటీవలె పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో నటించి మరింత పాపులర్ అయిన అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో చిట్చాట్ నిర్వహించిన ఆమె ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అయితే ఓ నెటిజన్ అడిగిన కొంటె ప్రశ్నకు ఘాటుగా బదులచ్చింది. మిమ్మల్ని అక్కా అని పిలవాలా లేదా ఆంటీ అని పిలవాలా అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. 'ఏదీ వద్దు. అలా పిలిచే అంత స్నేహం మన మధ్య లేదు. ఇలా పిలుస్తామని అనడం మీ పెంపకాన్ని ( అప్ బ్రింగింగ్) ప్రశ్నిస్తుంది. ఇది ఏజ్ షేమింగ్ చేసినట్లే. గౌరవం ఇవ్వండి' అంటూ అనసూయ పేర్కొంది. అయితే దీనికి కౌంటర్గా.. 'ఎవరినైనా అక్కా అని పిలిచినంత మాత్రానా ఏజ్ షేమింగ్ అవ్వదు. అలాంటప్పుడు ప్రశంసలు కూడా తీసుకోవద్దు' అంటూ సదరు నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి అనసూయ బదులిస్తే.. 'అయ్యుండొచ్చు. కానీ ఏ ఉద్దేశంతో పిలుస్తున్నారన్నది ముఖ్యం ఇక్కడ. అయినా కాంప్లిమెంట్స్(ప్రశంసలు) తీసుకోవాలా వద్దా అన్నది వాళ్ల ఇష్టం కదా' అంటూ ట్రోలర్ నోరు మూయించింది. -
సంక్రాంతి సాక్షిగా హుషారు
-
సర్పంచ్ నాగలక్ష్మీ, బంగార్రాజుతో ‘గరం’ సత్తి ముచ్చట్లు
-
హీరో విజయ్ అంథోని హీరోయిన్ ఆత్మికలతో స్పెషల్ చిట్ చాట్
-
కబడ్డీ..కబడ్డీ...విత్ గోపిచంద్
-
శంకర ప్రియ తమన
-
హర్భజన్ సింగ్ ఇంటర్వ్యూ
-
రామాచార్య
-
ఇచ్చట వాహనములు నిలుపరాదు టీం తో సరదా ముచ్చట్లు
-
ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీ టీం తో ముచ్చట్లు
-
శ్రీదేవి సోడా సెంటర్ మూవీ టీం తో చిట్ చాట్
-
ఇండియన్ ఐడల్ 12 విన్నర్స్ తో స్పెషల్ చిట్ చాట్
-
గరం గరం ముచ్చట్లు 28 August 2021
-
బిగ్బాస్ దివితో రక్షాబంధన్ స్పెషల్ చిట్ చాట్
-
బర్నింగ్ స్టార్ ట్యాగ్పై సంపూ ఫీలింగ్ ఇది
-
జనారణ్య మూర్తి
-
సాక్షి స్పెషల్ చిట్ చాట్ విత్ అడవి శేషు
-
పాటకు ప్రాణం పోస్తున్న ఫ్యాషనేట్ సింగర్స్
-
తిమ్మరుసు మూవీ టీమ్తో స్పెషల్ చిట్ చాట్
-
చోటీ చోటీ బాతే... సితార, ఆద్య స్పెషల్ ఇంటర్వ్యూ
-
తన బాడీలో ఆ పార్ట్కే ఎక్కువ ఖర్చు పెట్టినట్లు రిప్లై ఇచ్చిన నటి
విలక్షణ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి చాలా సమయమే పట్టింది. నటిగా, సింగర్గా, మంచి డ్యాన్సర్గా ఎదుగుతూ.. కెరీర్ పరంగా దూసుకెళ్తున్న సమయంలో తన వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్లు సినిమాలకు దూరమై.. మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. సినిమాల పరిస్థితి ఎలా ఉన్నా ఈ అమ్మడు తన అభిమానులతో అప్పుడప్పుడు చిట్ చాట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ అభిమాని అడిగిన వింత ప్రశ్నకు షాకింగ్ సమాధానమిచ్చింది. ఎక్కువ ఆ పార్ట్కు ఖర్చు చేశాను.. సినీ పరిశ్రమలో కొంచెం గ్యాప్ తరువాత రీఎంట్రీలో సక్సెస్ సాధించడం అంత సులువు కాదన్న విషయం తెలిసిందే, కానీ ఇది శ్రుతి హాసన్ వీటిని మార్చిందనే చెప్పాలి. తెలుగులో వకీల్సాబ్, క్రాక్ సినిమాలతో హిట్లు అందుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’లో నటిస్తోంది. ఈ రకంగా శ్రుతి స్పీడ్ చూస్తుంటే కాస్త విరామం వచ్చినప్పటికీ తిరిగి తన కెరీర్లో దూసుకెళ్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో ఈ ముద్దు గుమ్మ ఓ అభిమానితో ముచ్చటిస్తుండగా ఆ వ్యక్తి .. ‘మీ శరీరంలో మీకు ఏ భాగం అంటే ఇష్టం.. మీ ముక్కు అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా.. అది నిజమేనా’ అని ప్రశ్నించాడు.అందుకు ఈ అమ్మడు సమాధానంగా.. ‘అవును నాకు ముక్కు అంటే ఇష్టమే.. దాని కోసమేగా చాలా డబ్బులు ఖర్చు పెట్టానంటూ’ ఏ మాత్రం తడుముకోకుండా బదులిచ్చింది. దెబ్బతో క్రాక్ నటి ఇచ్చిన రిప్లైకి షాక్లోకి వెళ్లాడు ఆ నెటిజన్. కాగా ప్రస్తుతం ఈ రిప్లై నెట్టింట వైరల్గా మారి హల్చల్ చేస్తోంది. -
హీరోయిన్ను ఆ విషయం గురించి డైరెక్ట్గా అడిగేసిన నెటిజన్
కరోనా ప్రభావం సినీ ఇండస్ర్గీపై గట్టిగానే పడింది. సినిమా షూటింగులు కూడా ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభిస్తున్నారు. సో కొంచెం ఖాళీ సమయం దొరకగానే అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఇటీవలి కాలంలో చాలామంది నటీనటులు యూజర్లతో చిట్చాట్ సెషన్లు నిర్వహిస్తున్నారు. వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానమిస్తున్నారు. తాజాగా ఓ మలయాళ బ్యూటీ మంజిమ మోహన్ అభిమానులతో ఆస్క్ మీ ఏనీథింగ్ సెషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్..మీరు మీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటి అని డైరెక్ట్గా అడిగేశాడు. దీనిపై స్పందించిన మంజిమ..అందరూ లవ్లో పడుతుంటే..నేను మాత్రం తిండిపై దృష్టి పెడుతున్నాను అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. అంటే పరోక్షంగా తన రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్ అని చెప్పుకొచ్చింది. అయితే మంజిమ షేర్ చేసిన ఫన్నీ మీమ్ నెటిజన్లను మరింత ఆకట్టుకుంది. మీ లైఫ్లో చాలా ముఖ్యమైనవి ఏంటి అని మరో నెటిజన్ ప్రశ్నించగా..'ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, ఫ్యామిలీ, కంపాషన్'అంటూ బదులిచ్చింది. ఇక మొదటి సినిమాతోనే మళయాలంలో హిట్ కొట్టిన మంజిమ ఆ తర్వాత వరుస అవకాశాలతో గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో నాగచైతన్యతో కలిసి 'సాహసం శ్వాసగా సాగిపో' అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. చదవండి : మోనాల్ని అఖిల్ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా? ఆర్ఆర్ఆర్ పోస్టర్పై ట్రాఫిక్ పోలీసుల సెటైర్.. టీమ్ ఫన్నీ రిప్లై -
క్యా కమల్ హై !
-
గుణ చిత్ర శిల్పి
-
క్యాబ్ స్టోరీస్
-
ఏక్ మిని...సినీ సాహసం !
-
ఆ మాట వాస్తవమే: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఈటల ఎపిసోడ్పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మీడియాతో ఆయన మంగళవారం చిట్చాట్ నిర్వహించారు. ఇప్పటి వరకు తానను ఈటల రాజేందర్ కలవలేదని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. తానను కలిసేందుకు సంప్రదించిన మాట వాస్తవమేనన్నారు. ఈటల, తాను 15 ఏళ్లు కలిసి పనిచేశామని.. కలిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. కలిసినంత మాత్రాన పార్టీలో చేరేందుకు అనుకోలేమన్నారు. ఎప్పుడు కలుస్తామన్నది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. అందరినీ కలుస్తున్నా, మిమ్మల్నీ కలుస్తా అని నాతో అన్నారని కిషన్రెడ్డి వివరించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వస్తే పోటీ అంశంపై చర్చించలేదని.. పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కిషన్రెడ్డి తెలిపారు. చదవండి: ఈటలకు బీజేపీ ఆహ్వానం! Corona Vaccine: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం -
భరత్ రెడ్డి నటుడే కాదు, ప్రముఖ కార్డియాలజిస్ట్
-
సినిమా బండి టీమ్తో చిట్ చాట్
-
బాలీవుడ్లో జెండా పాతిన మన తిరుపతి వాసులు
-
వ్యాక్సిన్ లభ్యతే అతిపెద్ద సవాల్: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేవలం 45 రోజుల్లోనే రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చే మౌలిక వసతులు అందుబాటులో ఉన్నా వ్యాక్సిన్ లభ్యత అతి పెద్ద సవాలుగా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. చిన్నారులకు వ్యాక్సినేషన్ జరగనందున ఆన్లైన్ విధానంలో విద్యా బోధన మరికొంత కాలం కొనసాగే అవకాశముందని తెలిపారు. సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్లో ‘ఆస్క్ కేటీఆర్’పేరిట గురువారం నిర్వహించిన కార్యక్రమంలో.. కోవిడ్ నియంత్రణ తదితర అంశాలపై నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలిచ్చారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ ప్రశ్నలు–జవాబుల కార్యక్రమం ట్విట్టర్ ట్రెండింగ్లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. వివిధ ప్రశ్నలకు కేటీఆర్ ఇచ్చిన సమాధానాలు ఆయన మాటల్లోనే.. ఆ పిల్లలకు హెల్ప్డెస్క్ కోవిడ్ మూలంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్ప్డెస్క్ని ఏర్పాటు చేసింది. కరోనా మొదటి దశ సంక్షోభంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆక్సిజన్ పడకల సంఖ్యను పెంచాం. గత ఏడాది సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలో 9,213 ఆక్సిజన్ బెడ్లు ఉండగా, ప్రస్తుతం 20,739కు పెంచాం. రెండో డోసు ఇచ్చేందుకే ప్రాధాన్యం వ్యాక్సినేషన్లో జాతీయ సగటుకన్నా తెలంగాణ ముందు వరుసలో ఉంది. రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారు 92 లక్షలు కాగా, ఇందులో 45 లక్షల మందికి మొదటి డోసు వ్యాక్సిన్ అందింది. మరో 10 లక్షల మందికి రెండో డోసు కూడా పూర్తయింది. మొదటి డోసు తీసుకున్న వారికి రెండో డోసు ఇచ్చేందుకే ప్రాధాన్యత ఇస్తున్నాం. రోజుకు 9 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చే సామర్ధ్యం రాష్ట్రానికి ఉంది. వ్యాక్సిన్ తయారీదారులైన భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్లతో మాట్లాడుతున్నాం. కోవాగ్జిన్ ఫార్ములాను భారత్ బయోటెక్ ఇతర కంపెనీలతో పంచుకొని వ్యాక్సిన్ అందరికీ అందేలా చూడటంలో కేంద్రమే ఒక నిర్ణయం తీసుకోవాలి. కేంద్రం ఆధీనంలో ఆక్సిజన్ ఆక్సిజన్ సరఫరా పూర్తిగా కేంద్రం ఆధీనంలో ఉంది. ఈ విషయంలో యావత్ దేశం సవాలును ఎదుర్కొంటోంది. రెమిడెసివిర్ మందుల వినియోగాన్ని ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్న వారిని అరెస్టు చేస్తున్నాం. కోవిడ్ చికిత్సకు వసూలు చేయాల్సిన బిల్లుల విషయంలో జాతీయ స్థాయిలో ఏకీకృత విధానంపై దృష్టి సారిస్తాం. కరోనా నియంత్రణకు ఇంటింటి సర్వేలో భాగంగా 28 వేల బృందాలు 60 లక్షల ఇళ్లను సందర్శించిన ఫలితాలు త్వరలో వస్తాయి. కరోనాను అధిగమించాలంటే 70 శాతం జనాభాకు వ్యాక్సిన్లు వేయాలి. 3.8 కోట్ల డోసుల వ్యాక్సిన్లు అవసరం. సంపూర్ణ లాక్డౌన్ డిమాండ్ ఉన్నా ప్రజల నిత్యావసరాల కోసం ఉదయం పూట వెసులుబాటు కల్పించాం. రాష్ట్రానికి ఆక్సిజన్ కోటా పెంచాలి..: ఏపీ, కర్ణాటక, చత్తీస్గఢ్ నుంచి వస్తున్న రోగులకు కూడా ఇక్కడ చికిత్స అందిస్తున్నందున రాష్ట్రానికి ఆక్సిజన్, ఇతర మందుల కోటా పెంచాలి. కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కొందరు బదనాం చేస్తున్నారు. ప్రస్తుత కోవిడ్ సంక్షోభంలో మన రాష్ట్రంలో ఉన్న ఫార్మా పరిశ్రమ ప్రాధాన్యతను జాతీయ స్థాయిలో తెలుసుకున్నారు. వైద్యుల సూచనలతో అధిగమించా.. నాకు కరోనా సోకినప్పుడు వరుసగా ఏడురోజుల పాటు తక్కువ నుంచి అతి ఎక్కువ డిగ్రీల జ్వరం కొనసాగింది. ఊపిరితిత్తుల్లో కొంత ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. మధుమేహ వ్యాధి ఉండటంతో బ్లడ్ షుగర్, రక్తపోటు నియంత్రణ కొంత సవాలుగా మారింది. అయితే డాక్టర్ల సలహాలు పాటించడం ద్వారా సమస్యలు అధిగమించా. ప్రస్తుతం కొంత బలహీనంగా అనిపిస్తున్నా.. సాధారణ స్థితికి చేరుకున్నా. కోవిడ్ సోకిన వారు ఎవరైనా సొంత వైద్యంతో కాకుండా వైద్యులు సూచించిన మందులు వాడుతూ, మానసిక ధైర్యంతో వైరస్ను జయించాలి. -
అనిల్ రావిపూడి తో స్పెషల్ చిట్ చాట్
-
బాహుబలి లండన్ లో చూసాను : అనుపమ్ ఖేర్
-
నయా రహమానియా
-
బస్తి బాలరాజ్ & టీమ్
-
గంగవ్వతో గరం సత్తి ముచ్చట్లు
-
ఓడిపోతానని కష్టపడేదాన్ని
నటిగా సమంత భయాలేంటి? ఏ జానర్ సినిమాలు ఇష్టపడతారు? ఆమె పాటించే జీవిత సూత్రాలేంటి? అని ఫ్యాన్స్కు తెలుసుకోవాలని ఉంటుంది. బుధవారం సాయంత్రం ట్విట్టర్లో ‘ఏ ప్రశ్న అయినా అడగండి.. సమాధానం చెబుతాను’ అని ఫ్యాన్స్తో అన్నారు సమంత. అంతే.. ఫ్యాన్స్కి ఉన్న ప్రశ్నలన్నీ సమంత మీద కురిపించారు. అందులో కొన్నింటికి ఆమె సమాధానం చెప్పారు. అందులో కొన్నింటిని మీ కోసం తీసుకొచ్చాం. ► చాలా జానర్లలో సినిమాలు చేశారు. మీ ఫేవరెట్ జానర్ ఏది? సమంత: ఫేవరెట్ అంటూ ఏదీ లేదు. కానీ గత సినిమాలో ఏది చేశానో దాన్ని రిపీట్ చేయాలనుకోను. అదే చేస్తే ఆడియన్స్కు, నాకు బోర్ కొడుతుంది. ► ఈ కరోనా కష్టకాలంలో మీ అభిమానులకు ఏం సందేశమిస్తారు? ప్రస్తుతం అందరం కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. కొందరైతే చాలా కష్టాల్లో ఉన్నారు. ఈ కష్టకాలం త్వరగా గడచిపోవాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ► లాక్డౌన్లో మీరు చేసిన మంచి పని ఏంటి? ఈ లాక్డౌన్లో ఓ స్పెషల్ ప్రాజెక్ట్ మీద పని చేశా. అదేంటో మీ అందరికీ త్వరలోనే చెబుతాను. అలాగే కుటుంబంతో ఎక్కువగా గడిపే అవకాశం దొరికింది. అదొక మంచి విషయం. ► కష్టపడి పని చేయడానికి మిమ్మల్ని మీరు ఎలా ప్రేరేపించుకుంటారు? ఇంతకు ముందు ఓడిపోతాం అనే భయంతో కష్టపడేదాన్ని. కానీ కరోనా వల్ల నా ఆలోచనా ధోరణి మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే నాకు సంతోషాన్ని ఇస్తాయి అనే విషయాలకు మాత్రమే కష్టపడాలనుకుని నిర్ణయించుకున్నాను. సంతోషంగా ఉండాలనే ఆలోచన నన్ను మోటివేట్ చేసేస్తుంది. కష్టపడేలా చేస్తుంది. ► జీవితం మెరుగు పడాలంటే ఏం చేయాలి? కచ్చితమైన డైట్ పాటించాలి. యోగా లేదా ధ్యానం లాంటివి చేయాలి. ప్రణాళికతో కూడిన దినచర్యను అలవాటు చేసుకోవాలి. ► ఎలాంటి పాత్రలు చేయడం కష్టంగా అనిపిస్తుంది? దర్శకుడు గౌతమ్ మీనన్ను కలిసే వరకూ రొమాన్స్ కష్టం అనుకున్నాను. నందినీ రెడ్డిని కలిసే వరకూ కామెడీ కష్టమనుకున్నా. కానీ ఇప్పుడు ఎలాంటి పాత్ర అయినా భయపడను. నటిగా నాకెలాంటి భయాల్లేవు. -
క్రేజీ డైరెక్టర్
-
చిన్ని చిన్ని సరదా
కరోనా వల్ల లభించిన ఖాళీ సమయంలో శ్రుతీహాసన్ వంటలు చేస్తున్నారు. ఆన్లైన్లో అభిమానులతో చిట్ చాట్ చేశారు. తనకు ఇష్టమైన సంగీతాన్ని బాగా సాధన చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా ఏదైనా చేయాలనుకున్నారట. అది కూడా ఏదైనా ప్రయోగం అయితే బాగుంటుందని భావించానంటున్నారు శ్రుతీహాసన్. సొంతంగా ఓ మాస్క్ను తయారు చేసుకున్నారు. ఆ మాస్క్ను «ధరించి, ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు శ్రుతి. ‘‘ఈ కరోనా కాలంలో మాస్క్లను తప్పనిసరిగా ధరించండి. వీలైతే సొంత మాస్క్లను తయారు చేసుకోండి. నేను అలానే చేశాను. సొంత మాస్క్ను తయారు చేసుకోవడం చిన్న పనే కావొచ్చు. కానీ ఈ పని నాకు చాలా సరదాగా అనిపించింది. ఈ చిన్ని ప్రయోగం చాలా సంతోషాన్నిచ్చింది. అందుకే ఇలాంటి మరో ఎగై్జటింగ్ ఎక్స్పరీమెంట్ ఏదైనా చేయాలనుకుంటున్నాను. మీరు (అభిమానులు) కూడా సొంతంగా మాస్క్లు తయారు చేసుకోవడాన్ని ఓసారి ప్రయత్నించండి’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. -
అతడు నా అభిమాన హీరో
మహేశ్లో నమ్రతకు నచ్చిన విషయం ఏంటి? మహేశ్ చేసే సినిమాల కథల్లో నమ్రత ఇన్వాల్వ్ అవుతారా? నమ్రత లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ ఏంటి? వంటి పలు ప్రశ్నలను నెటిజన్లు నమ్రతను అడిగారు మంగళవారం నమ్రత తన ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్తో చిట్ చాట్ చేశారు. ఆ విశేషాలు ఈ విధంగా... ► లాక్డౌన్లో ఏం నేర్చుకున్నారు? సహనంగా ఉండటం నేర్చుకున్నాను. ప్రతి చోటా ప్రేమ ఉంటుందని తెలుసుకున్నాను. ► షాపింగ్ అంటే ఇష్టమేనా? ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ► మరాఠీ ప్రజలను మిస్ అవుతున్నారా? మహారాష్ట్రియన్గా గర్వపడుతున్నాను... నా మరాఠీ ఫ్యామిలీని మిస్ అవుతున్నాను. ► మీరు మిస్ఇండియా కావడానికి స్ఫూర్తి? మా అమ్మగారు ► మీ జీవితంలో బెస్ట్ ఫేజ్? మదర్హుడ్ ► మీ హాబీ? హోమ్ ఇంటీరియర్స్ను డిజైన్ చేయడాన్ని బాగా ఇష్టపడతాను. ► మీరు తెలుగు బాగా మాట్లాడగలరా? మాట్లాడతాను కానీ ఇంకాస్త మెరుగుపడాల్సి ఉంది. ► ఫిట్నెస్ సీక్రెట్? వ్యాయామం చేయడం, తినడం, బాగా నిద్రపోవడం. ► మీ లైఫ్లో బెస్ట్ మూమెంట్? నా పెళ్లి రోజు. నేను ఇద్దరు పిల్లలకు తల్లినైన రోజు. ► మీ ఫేవరెట్ టాలీవుడ్ హీరో? ఇంకెవరు? మహేశ్బాబు. ► మీ ఫేవరెట్ ప్లేస్? ప్రస్తుతం ఇంటిని మించిన ఫేవరెట్ ప్లేస్ లేదు. ► మహేశ్గారిలో మీకు నచ్చిన విషయం? రియల్గా ఉండే మహేశ్ వ్యక్తిత్వం ► మీ కూతురు సితార సినిమాల్లో నటిస్తుందా? ఈ విషయం గురించి ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుతం తను తన యూట్యూబ్ చానెల్ (ఆద్యా సితార) కోసం వీడియోలు చేయడంలో చాలా బిజీగా ఉంది. ► మహేశ్బాబు హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో మరో సినిమా ఉంటుందా? ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పగలదు. ►మహేశ్ నటించిన చిత్రాల్లో మీకు ఇష్టమైనవి? ఒక్కడు, పోకిరి, మహర్షి, దూకుడు, సరిలేరు నీకెవ్వరు, భరత్ అనే నేను ► మహేశ్బాబుతో మీరు ఎప్పుడైనా ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యారా? మా ఇద్దరికీ ఒకరికొకరిపై పూర్తి నమ్మకం ఉంది. సో.. ఇన్సెక్యూరిటీకి తావు లేదు. ► మహేశ్బాబు వంట చేస్తానంటే మీరు ఏం వండమని చెబుతారు? మహేశ్ సులభంగా ఏం వండుతాడా? అని నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను. ► సితార, గౌతమ్.. ఎవరి అల్లరి ఎక్కువ? ఎవరి అల్లరి వాళ్లది ► భవిష్యత్లో మహేశ్గారు, మీరు ఒకే సినిమాలో నటిస్తారా? ఈ జీవితకాలంలో అది మళ్లీ సాధ్యం కాకపోవచ్చని నాకనిపిస్తోంది. ► మీ అత్తగారు ఇందిరమ్మ గురించి కొన్ని మాటలు చెప్పండి? ప్రేమకు నిర్వచనం. ► మహేశ్ నిక్నేమ్? నాని ► మహేశ్ స్క్రిప్ట్ సెలక్షన్లో మీ పాత్ర ఉంటుందా? నేను ఇన్వాల్వ్ కాను. ► మీరు సాయిబాబా భక్తురాలిగా ఎలా మారారు? సాయిబాబాకు మా అమ్మగారు పెద్ద భక్తురాలు. నా అనుభవాలు నన్ను బాబా భక్తురాలిగా మార్చాయి. సాయిబాబా.. మై ఓన్లీ గురు. భర్త, పిల్లల పేర్లతో టాటూ -
త్రీఎఫ్ ఉంటే చాలు!
‘త్రీఎఫ్’ ఉంటే చాలు. నేను చాలా హ్యాపీగా ఉంటాను’’ అంటున్నారు త్రిష. ‘త్రీఎఫ్’ అంటే ఏంటి? అని ఆలోచిస్తున్నారు కదూ! ‘ఫుడ్, ఫ్రెండ్స్, ఫిల్మ్స్’ అన్నమాట. తమ అభిమానులతో టచ్లో ఉండేందుకు అప్పుడప్పడూ సినీతారలు సోషల్ మీడియాలో చిట్ చాట్ చేస్తుంటారు. ఇటీవల త్రిష చిట్ చాట్ చేశారు. ‘మిమ్మల్ని హ్యాపీగా ఉంచే మూడు అంశాల గురించి చెప్పండి’ అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ‘ఫుడ్, ఫ్రెండ్స్, ఫిల్మ్స్’ అని చెప్పారు త్రిష. ‘మీ గురించి మూడు మాటల్లో ఏం చెబుతారు?’ అనే ప్రశ్నకు ‘ధైర్యం, నమ్మకం, నిజాయితీ’ అని బదులు చెప్పారు. ‘ఎవరికీ తెలియని మీలో ఉన్న ఓ ప్రతిభ గురించి’ అనే ప్రశ్నకు ‘ఇంటిని సూపర్గా శుభ్రం చేస్తాను. నేను శుభ్రం చేశాక ఇంట్లో ఎక్కడా మురికిని కనిపెట్టలేం’ అని చెప్పారు. -
కింది మెట్టు
కింది మెట్టు లేకుంటే.. పై మెట్టు ఎక్కలేం. కింద.. మెట్టు లేకుంటే పై నుంచి దిగలేం. ఎగువ ఎక్కువ కాదు. దిగువ తక్కువ కాదు. ‘భార్య ఒక మెట్టు కింద ఉండాలి’ అనే మాటపై ఇప్పుడు నెట్లో మెట్లను కూలగొట్టేస్తున్నారు! ‘యానీస్ కిచెన్’లో ఎప్పటి మాటో అది. ఇప్పుడెవరో పైకి తీసి మంటను రాజేశారు. రెండేళ్ల క్రితం ఒక శనివారం. సాయంత్రం 7 గంటలు. అమృత టీవీలో ‘యానీస్ కిచెన్’ కార్యక్రమం మొదలైంది. అప్పటికి మూడేళ్లుగా ప్రసారం అవుతున్న ఆ కిచెన్ని హోస్ట్ చేస్తున్నది ప్రముఖ మలయాళీ నటి చిత్రా షాజీ కైలాస్. ఆ రోజు గెస్ట్గా వచ్చినవారు మరో నటి సరయు మోహన్. ఇద్దరి మధ్య సంభాషణ మొదలైంది. మధ్య మధ్య ఫలానా వంటను ఎలా చేయాలో ‘యానీ’ చెబుతున్నారు. చిత్ర అసలు పేరు అదే. యానీ! పెళ్లయ్యాక చిత్ర అని మార్చేశాడు భర్త. ‘‘ఈ భర్తలు ఎందుకు ఇలా చేస్తారు?’’.. యానీ. ‘‘ఎలా?’’.. సరయు. ‘‘వంట చెయ్యలేరు. చేసిన వంటకు పేర్లు పెడతారు’’. నవ్వారు సరయు. ‘‘ఏం మాట్లాడకుండా తినడం కన్నా, తింటూ ఏదో ఒక మాట అనడం నయం కదా’’ అన్నారు. ‘‘అసలు వీళ్లెందుకు భార్యాభర్త ఇద్దరూ సమానం అనుకోరు. హెల్ప్ చెయ్యరు. కష్టాన్ని గుర్తించరు’’. ‘‘గుర్తింపు అవసరం లేదు. వాళ్లను అలా వదిలేయడమే బెటర్. భార్య భర్త కన్నా ఒక మెట్ట కింద ఉంటే గొడవలే ఉండవు’’ అన్నారు సరయు. ‘‘ఎస్, కరెక్ట్’’ అన్నారు యానీ. ఇదిగో ఈ ముక్కే ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ‘‘ఒక మెట్టు కిందేమిటి! సరయు అంటే అనొచ్చు. హోస్ట్గారు సమర్థించడం ఏమిటి?’’. ట్రోలింగ్ మొదలైంది. యానీ మీద, యానీస్ కిచెన్ మీదా. ఈ లాక్డౌన్లో రెండు నెలలుగా ఆ ప్రోగ్రామ్ రావడం లేదు. లాక్డౌన్ తర్వాత కూడా రావడానికి లేదని డిమాండ్లు ట్వీట్ అవుతున్నాయి. మరి ఆరోజే ఎందుకు ఎవరూ ఏమీ అనలేదు.. రెండేళ్ల క్రితం! ఎవరూ సీరియస్గా తీసుకుని ఉండకపోవచ్చు. ఇప్పుడెవరో దానిని బయటికి తీసి రాజేశారు. గత వారం రోజులుగా తమపై వస్తున్న విమర్శలకు సరయు మాత్రం స్పందించారు. అప్పటికీ ఇప్పటికీ తన ఆలోచనా తీరు మారింది అన్నారు. భార్యాభర్త సమానం అన్నారు. యానీ మాత్రం ఈ విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు లేరు. ‘యానీస్ కిచెన్’కి గృహిణుల్లో మంచి ఆదరణ ఉంది. ఆ ఆదరణే తన సమాధానం అనుకున్నట్లున్నారు యానీ. యానీ కేరళ అమ్మాయి. క్రైస్తవ కుటుంబం. తల్లి మరియమ్మ. తండ్రి జాబీ. ముగ్గురు అక్కలు.. లిస్సీ, మేరీ, టెస్సీ. యానీ ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు తల్లి చనిపోయింది. యానీ తిరువనంతపురంలోని ఆల్ సెయింట్స్ కాలేజీలో చదువుకుంది. కాలేజీలో ఉండగానే సినిమా ఆఫర్ వచ్చింది. ఆమె తొలి చిత్రం ‘అమ్మాయనే సత్యం’ (అమ్మ మీద ఒట్టు) పెద్ద హిట్ అయింది. అందులో డబుల్ రోల్ యానీది. స్త్రీగా, పురుషుడిగా. రెండు మనస్తత్వాల మధ్య గీతను కాకుండా.. దంపతులను మధ్య కలతల్ని మాత్రం ఆమె చెరపదలచుకున్నట్లున్నారు. ‘యానీస్ కిచెన్’లో ఆమె ప్రబోధించే సర్దుబాటుకు అదొక్కటే కారణంగా కనిపిస్తోంది. నేను మారాను అవి రెండేళ్ల క్రితం నాటి అభిప్రాయాలు. ఇప్పుడు నా ఆలోచనలు మారాయి. కొత్తకొత్త స్నేహితులు, కొత్త ప్రదేశాలకు ప్రయాణాలు అందుకు కారణం కావచ్చు. భార్య భర్తకంటే ఒక మెట్టు కిందే ఉండాలి అనే మాటను వెనక్కు తీసుకుంటున్నాను. స్త్రీ అయినా, పురుషుడైనా ఆత్మగౌరవాన్ని కోల్పోకూడదు. – సరయు మోహన్ -
అప్పుడు నేను... ఇప్పుడు అడిడాస్
న్యూఢిల్లీ: భారత మహిళా అథ్లెట్ హిమ దాస్ ‘అడిడాస్’ పేరుపై ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. భారత సీనియర్ క్రికెటర్ రైనాతో ఆమె ఇన్ స్టాగ్రామ్లో చాటింగ్ చేసింది. ఈ సంభాషణలో ఆ సంగతి చెబుతూ ‘పందెం కోసం నా పరుగు ఉట్టి పాదాలతోనే మొదలైంది. ఎలాంటి బూట్లు, పాదరక్షల్లేవ్. అయితే నేను పాల్గొనే తొలి జాతీయ పోటీల కోసం నా తండ్రి తన స్తోమతకు తగిన సాదాసీదా స్పైక్ బూట్లను తెచ్చాడు. అయితే వాటిపై నేను చేతితో అడిడాస్ అనే బ్రాండ్ పేరు రాసి పోటీల్లో పాల్గొన్నాను. ఇప్పుడు అదే అడిడాస్ నాకు స్పాన్సర్ చేసిన కిట్పై నా పేరు రాసివ్వడం గొప్ప అనుభూతినిచ్చింది. షూస్పై హిమ దాస్ అని ఉండటం చూసిన నాకు అప్పటి అనుభవం గుర్తొచ్చింది’ అని చెప్పింది. 20 ఏళ్ల హిమ 2018లో ఫిన్లాండ్లో జరిగిన ప్రపంచ అండర్–20 చాంపియన్షిప్లో 400 మీటర్ల రేసులో పసిడి పతకం గెలిచింది. దీంతో ప్రముఖ షూ కంపెనీ అడిడాస్ ఆమెను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. ఆమె కోసం ప్రత్యేకంగా తయారు చేసిన షూస్లపై హిమ పేరు రాసింది. -
ఆ క్షణం ఇంకా రాలేదు
ముంబై: స్మృతి మంధాన... క్రీజ్లో ఉన్నప్పుడు దూకుడుగా బ్యాటింగ్ చేయడమే కాదు, మైదానం బయట కూడా అంతే చురుగ్గా కనిపించే ఈతరం అమ్మాయి. భారత ఓపెనర్గా ఎన్నో చూడచక్కటి ఇన్నింగ్స్లు ఆడిన స్మృతి క్రికెట్ ముగిశాక తన సొంత ప్రపంచంలో చేసే అల్లరికి అంతే ఉండదు. సహచరురాలు జెమీమా రోడ్రిగ్స్ కూడా జత కలిసిందంటే అంతు లేని ఆటపాటలతో ఇక ఫుల్ బిజీ. భారత డ్రెస్సింగ్ రూమ్లో వీరిద్దరూ అందించే వినోదం ప్రత్యేకం. ఇప్పుడు లాక్డౌన్ కారణంగా ఆటగాళ్లంతా తమ ఇళ్లలోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో సరదాగా మాట్లాడుకుందామని అభి మానులకు స్మృతి పిలుపునిచ్చింది. ట్విట్టర్ వేదికగా ఆస్క్ స్మృతి అంటూ సాగిన సంభాషణలో మహారాష్ట్రకు చెందిన 23 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తన మనసు విప్పి పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. విశేషాలు స్మృతి మంధాన మాటల్లోనే.... ► మైదానంలో దిగాక అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తా. బ్యాటింగ్ సమయంలో కూడా ఒకేసారి ప్రణాళిక రూపొందించుకోకుండా ఒక్కో బంతికి అనుగుణంగా నా ఆటతీరును మార్చుకుంటా. ► అంతర్జాతీయ క్రికెట్లో నేను ఎంతో మంది బౌలర్లను ఎదుర్కొన్నా... వారిలో మరిజాన్ కాప్ (దక్షిణాఫ్రికా పేసర్) బౌలింగ్లో పరుగులు తీయడానికి చాలా కష్టపడ్డాను. ► కెరీర్కు సంబంధించి భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన రోజు నా కెరీర్లో మరచిపోలేనిది. అయితే చిరస్మరణీయ క్షణం మాత్రం ఇంకా రాలేదు. బహుశా భవిష్యత్తులో మేం ప్రపంచ కప్ సాధించిన రోజు అది కావచ్చు. ► సరదాగా చెప్పాలంటే నా మొహం ఇన్ని రోజులు చూస్తూ మా ఇంట్లో వాళ్లే అలసిపోయారు. ఎప్పుడెప్పుడు తర్వాతి టోర్నీ ఉంటుందా అంటున్నారు. అయితే ఈ సమయాన్ని చాలా బాగా గడుపుతున్నామనేది మాత్రం వాస్తవం. ► చిన్నప్పుడు నాకిష్టమైన కార్టూన్ల జాబితాలో నాడీ, బాబ్ ద బిల్డర్, నింజా హటోరి ఉన్నాయి. ఇప్పుడు కూడా సమయం దొరికితే వాటిని చూస్తుంటా. ► అరిజిత్ సింగ్ కాకుండా నాకు ప్రస్తుతం ఇష్టమైన బాలీవుడ్ గాయకుడు ప్రతీక్ బచ్చన్ (సరిలేరు నీకెవ్వరులో సూర్యుడివో, చంద్రుడివో పాట పాడాడు) నా హోటల్ (ఎస్ఎం 18 పేరుతో సాంగ్లీలో ఉంది)లో ఏం బాగుంటాయని అడిగారు. మా మెనూలో అన్ని ఐటమ్స్ మీకు నచ్చుతాయి. ఒకసారి తెరిచాక వచ్చి రుచి చూడవచ్చు. ► అందంగా ఉంటావు కాబట్టి సినిమాల్లో చేయవచ్చు కదా అని ఒక అభిమాని అడిగాడు. అయితే నన్ను చూడటానికి ఎవరైనా థియేటర్కు వస్తారని నేను అనుకోవడం లేదు. కాబట్టి మీరు కూడా అలాంటివి అస్సలు ఆశించవద్దు. ► ప్రస్తుతం నేను ఒంటరిగా ఉన్నానా అని అడుగుతున్నారు.... ఏమో చెప్పలేను. నాకైతే తెలీదు. ► నా జీవిత భాగస్వామి కావాలనుకునే వ్యక్తి నన్ను ప్రేమించేవాడై ఉండాలనేది మొదటి షరతు. ఈ మొదటి షరతుకు కావాల్సిన నిబంధనలను పాటించాలనేది నా రెండో షరతు. ► ప్రేమ పెళ్లా, పెద్దలు కుదిర్చిన పెళ్లా (లవ్ ఆర్ అరేంజ్డ్) అని అడిగితే లవ్–రేంజ్డ్ అని చెబుతా. నాకు దగ్గరలో జెమీమా లేకపోవడం వల్ల లోటేమీ తెలియడం లేదు. ఇంకా కాస్త ప్రశాంతంగా ఉంటున్నా (దీనిపై స్పందించిన జెమీమా... నువ్వు మోసగత్తెవంటూ ట్విట్టర్లోనే సరదాగా బదులిచ్చింది). గతంలో కళ్లద్దాలు పెట్టుకొని నేను బ్యాటింగ్ చేసేదాన్ని. అయితే మూడేళ్ల క్రితం అది మారింది. 2017లో గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కాంటాక్ట్ లెన్స్లను వాడటం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు నేను చాలా సౌకర్యవంతంగా ఉన్నా. తల్లిదండ్రులతో... -
'ఆ జీవోను పెంచి పోషించింది టీడీపీ, కాంగ్రెస్సే'
సాక్షి, తెలంగాణ: రేవంత్రెడ్డి డ్రోన్ కేసుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. రేవంత్ భూవివాదంపై చట్టప్రకారమే చర్యలు తీసుకన్నామని, వ్యక్తిగతంగా ఏమీ లేదని స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీ హాల్లో నిర్వహించిన చిట్చాట్లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మాణం చేయలేదని, ఎవరో కట్టుకున్న దానిని లీజుకు తీసుకుని ఉంటున్నారని వివరించారు. 111 జీవో తీసివేయాలనే డిమాండ్ ఉందని తెలిపారు. అయితే 111జీవోను పెంచి పోషించింది టీడీపీ- కాంగ్రెస్ పార్టీలే అని ఆయన విమర్శించారు. ఇక పద్మారావుకు పార్టీలో ప్రాధాన్యత తగ్గలేదన్నారు. ఆయన గతంలో కంటే చురుగ్గా పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటున్నాడని మంత్రి తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో జనాభాను బట్టి వార్డుల పెరిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా మంత్రి తలసాని పేర్కొన్నారు. చదవండి: ‘ఆయన స్పూర్తితోనే ‘అన్నపూర్ణ’ పథకం’