Communist Party of India (Maoist)
-
బూటకపు ఎన్నికలను బహిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వం ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోగా, ప్రజలకు వ్యతిరేకం గా పాలన సాగిందన్నారు. తెలంగాణ ఉద్యమ ఫలితాలను కేసీఆర్ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుని మోసం చేశారని తెలిపారు. ప్రజాద్రోహిగా, నియంతగా పరిపాలించిన కేసీఆర్ పాలనపట్ల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందన్నారు. ఆ ఆగ్రహం సంఘటితం కాకముందే వీలైనంత త్వరగా బయటపడాలని కేసీఆర్ ఎత్తుగడ వేశారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఓడిపోతామని ఊహించారన్నారు. కేసీఆర్ ముందుగానే ప్రధాని మోదీని, ఎన్నికల కమిషన్ను కలిసి అసెంబ్లీ రద్దుకు సిద్ధపడ్డారన్నారు. 25 లక్షల మం దితో గొప్పసభ నిర్వహించాలని భావించి ఘోరంగా విఫలమయ్యారన్నారు. మొదటి నుంచీ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇతర పార్టీలలోని ఎమ్మెల్యే, ఎంపీలకు పదవులు, డబ్బు ఆశ చూపించి ఫిరాయింపులు ప్రోత్సహించి ప్రతిపక్షాలను బలహీన పరిచారని ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు బంగారు తెలంగాణ సాధన లక్ష్యం అని ప్రకటించారన్నారు. తెలంగాణలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు సహార, ఈఎస్ఐ వంటి స్కాము ల్లో నిందితుడని ఘాటుగా విమర్శించారు. షాబుద్దీన్ కేసులో అమిత్షా వ్యవహారం బయటకు రాకుండా, రామేశ్వర్రావుకు నయీం వల్ల సమస్యలు రాకుండా హత్య చేసి ఎన్కౌంటర్ కట్టుకథ అల్లారని ఆరో పించారు. సీపీఎం దళితుల ఓట్లు సంపాదించడానికి గద్దర్ వంటి వాళ్లతో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ను ఏర్పా టు చేసి అధికారంలో వాటా కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ కూటమితో కలిసి చివరికి చేరాల్సిన చోటుకే చేరారని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ దోపిడీ వర్గ పార్టీలేనని, సీపీఐ, సీపీఎంల రివిజనిస్టు విధానాలను బహిష్కరించాలని కోరారు. ధర్నా చౌక్ను పునరుద్ధరిం చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
సమాచారం, సహకారం ఇచ్చి పుచ్చుకోవాలి: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: శాంతి భద్రతల పరిరక్షణ, మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణ, నేరాల నియంత్రణలో రాష్ట్రాల పోలీసు విభాగాలు పరస్పర సమాచార మార్పిడి, సహకారం ఇచ్చి పుచ్చుకోవాలని డీజీపీ మహేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం భువనేశ్వర్లో సదtరన్ రాష్ట్రాల డీజీపీల భేటీ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు కృషి చేస్తున్న అంశాలు, ప్రణాళికలపై డీజీపీలు చర్చించారు. మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణకు అన్ని రాష్ట్రాలు పరస్పర సహకారం తీసుకోవాల్సిందిగా ఈ సదస్సులో అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న టెక్నాలజీ వ్యవస్థపై డీజీపీ మహేందర్రెడ్డి ఈ సదస్సులో ప్రజెంటేషన్ ఇచ్చారు. -
మోదీ హత్యకు కుట్ర?
పుణె: ప్రధాని మోదీ హత్యకు మావోయిస్టులు భారీ కుట్ర పన్నారా? మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య తరహాలో మోదీపై దాడికి వ్యూహ రచన చేశారా? అవుననే అంటున్నారు పుణె పోలీసులు. ప్రధానిని హత్య చేసేందుకు మావోయిస్టులు పెద్ద ప్రణాళిక రచించారంటూ వారు సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్రలోని భీమా–కోరెగావ్లో జరిగిన అల్లర్లతో సంబంధమున్న ‘ఈల్గర్ పరిషద్’కు చెందిన ఒక వ్యక్తి అరెస్టుతో ఈ కుట్ర కోణం వెలుగులోకి వచ్చిందని పుణె సెషన్స్ కోర్టుకు పోలీసులు తెలిపారు. భీమా–కోరెగావ్ కేసులో ఈ వారంలో ముంబై, నాగపూర్, ఢిల్లీల్లో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేయగా.. వారిలో ఒకరైన రోనా విల్సన్ ఇంటి నుంచి పోలీసులు 3 లేఖల్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఆ ఐదుగురిని సెషన్స్ కోర్టులో హాజరుపర్చిన సందర్భంగా ఒక లేఖలోని అంశాల్ని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల పవార్ కోర్టుకు వెల్లడించారు. ‘మాజీ ప్రధాని రాజీవ్గాంధీని హత్య చేసిన తరహాలో రోడ్షోల్లో మోదీని లక్ష్యంగా చేసుకోవాలని లేఖలో ఉంది. తనను తాను ‘ఆర్’గా పేర్కొన్న ఒక వ్యక్తి.. మావోయిస్టు ప్రకాశ్ను ఉద్దేశించి ఈ లేఖ రాశారు. హత్య కోసం ఎం–4 రైఫిల్, 4 లక్షల రౌండ్ల మందుగుండు సమకూర్చుకునేందుకు రూ. 8 కోట్లు అవసరముందని లేఖలో పేర్కొన్నారు’ అని పవార్ కోర్టుకు వెల్లడించారు. విల్సన్తో పాటు మరో నలుగురికి కోర్టు జూన్ 14 వరకు రిమాండ్ విధించింది. అరెస్టైన వారిలో విల్సన్తో పాటు లాయర్ సురేంద్ర గాడ్లింగ్, దళిత కార్యకర్త సుధీర్ ధావలే, షోమా సేన్, మహేశ్ రౌత్ ఉన్నారు. విల్సన్ ఇంటి నుంచి పోలీసులు మరో 2 లేఖల్ని స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని ఒకదాంట్లో విప్లవ రచయిత వరవరరావు పేరు ఉంది. ఆయన మార్గదర్శకత్వం ఆధారంగా గడ్చిరోలి, చత్తీస్గఢ్, సూరజ్గఢ్లో జరిపిన దాడులతో మనకు దేశవ్యాప్తంగా పేరొచ్చిందని ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం. అసలు లేఖలో ఏముంది.. ‘హిందూ అతివాదాన్ని ఓడించడం మన ప్రధాన అజెండానే కాకుండా పార్టీ ముఖ్య కర్తవ్యం. సీక్రెట్ సెల్స్కు చెందిన పలువురు నేతలు, ఇతర సంస్థలు ఈ విషయాన్ని చాలా గట్టిగా నొక్కిచెప్పాయి. స్థానిక ఆదివాసీల జీవితాల్ని మోదీ నేతృత్వంలోని హిందూ అతివాద పాలన నాశనం చేస్తోంది. బిహార్, పశ్చిమ బెంగాల్ల్లో ఓడినా 15కిపైగా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాల్ని మోదీ ఏర్పాటు చేయగలిగారు. ఇదే వేగం కొనసాగితే అన్ని వైపులా నుంచి మన పార్టీకి భారీ నష్టం తప్పదు. మోదీరాజ్ను అంతమొందించేందుకు కామ్రేడ్ కిషన్, మరికొందరు సీనియర్ కామ్రేడ్స్ నిర్మాణాత్మక చర్యల్ని ప్రతిపాదించారు. రాజీవ్ హత్య∙తరహాలో మేం ఆలోచిస్తున్నాం’ అని లేఖలో ఉంది. మే 21, 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో మహిళా ఆత్మాహుతి దాడిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చనిపోయారు. ‘అయితే ఇది ఆత్మహత్యాసదృశ్యమే. దీని అమలులో మనం విఫలమయ్యే అవకాశమున్నా పార్టీ పీబీ(పోలిట్ బ్యూరో/సీసీ(సెంట్రల్ కమిటీ)ఈ ప్రతిపాదనపై ఆలోచన చేయాలని మనం కోరుకుంటున్నాం. మోదీ రోడ్షోలను లక్ష్యంగా చేసుకోవడం ఉత్తమ వ్యూహం. అన్ని త్యాగాల కంటే పార్టీ మనుగడే ముఖ్యమని మనమంతా నమ్ముతున్నాం’ అని లేఖలోని అంశాల్ని పవార్ కోర్టుకు వివరించారు. రెండో లేఖలో ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తీర్పు ప్రస్తావన ఇక రెండో లేఖను కామ్రేడ్ ఆనంద్ను ఉద్దేశిస్తూ కామ్రేడ్ ప్రకాశ్ రాసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ‘ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలో మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తప్పకుండా గొడవలకు దారి తీస్తుంది. మనం మూడు నెలల క్రితం ఒక రాష్ట్రంలో ప్రారంభించాం. అది మరో మూడు రాష్ట్రాలకు వ్యాపించింది. దళిత ప్రచారం విషయంలో మీరు చేసిన కృషి పట్ల సీసీ(సెంట్రల్ కమిటీ) ఆనందంగా ఉంది. దళిత అంశాలపై సెమినార్లు, ప్రసంగాల కోసం ఏడాదికి రూ. 10 లక్షలు ఇచ్చేందుకు సీసీ అంగీకరించింది’ అని లేఖలో ఉంది. మహారాష్ట్ర సీఎంకు బెదిరింపు లేఖలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్కు మావోల నుంచి 2 బెదిరింపు లేఖలొచ్చాయి. ‘నన్ను, నా కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తూ మావోలు సీఎం కార్యాలయానికి ఈ లేఖలు పంపారు. ఇంతవరకూ నక్సల్స్ గ్రామీణ ప్రాంతాలకే పరిమితమయ్యారు. ఇప్పుడు పట్టణ ప్రాంతాలకు విస్తరించారు’ అని ఫడ్నవిస్ చెప్పారు. ఈ లేఖల్లో గడ్చిరోలి ఎన్కౌంటర్లలో 39 మంది మావోలు మరణించిన అంశాన్ని ప్రస్తావించారని, వారం క్రితం ఈ లేఖలు సీఎం కార్యాలయానికి వచ్చాయని, దర్యాప్తు కోసం వాటిని పోలీసులు అందచేసినట్లు మహారాష్ట్ర హోం శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మూడో లేఖలో వరవరరావు ప్రస్తావన.. ‘గత 4 నెలల్లో నక్సల్ సానుభూతిపరుడు వరవర రావు, కామ్రేడ్ సురేంద్ర గాడ్లింగ్ అందించిన మార్గనిర్దేశకత్వం ఆధారంగా మనం చేసిన దాడులతో జాతీయ స్థాయిలో పేరొచ్చింది. గడ్చిరోలి, చత్తీస్గఢ్, సూరజ్గఢ్లో చేసిన దాడులు పేరు తీసుకొచ్చాయి. వచ్చే కొద్ది నెలలు వీటిని కొనసాగించాలి. ఇదే తరహా దాడుల్ని విజయవంతంగా కొనసాగించే బాధ్యతను వరవర రావుకు అప్పగించారు. వాటి కోసం సురేంద్రకు వరవర రావు నిధులు సమకూర్చారు. నిధులు సురేంద్ర మీకిస్తారు. మార్చి, ఏప్రిల్లో జరిగే సమావేశాల కోసం వరవర రావు, సురేంద్ర వ్యక్తిగతంగా మార్గనిర్దేశకత్వం చేస్తారు’ అని కామ్రేడ్ ‘ఎం’ ఈ లేఖ రాశారని పోలీసులు చెప్పారు. ఈ కథలు మోదీకి మామూలే ప్రజాదరణ తగ్గినప్పుడల్లా ఇలాంటి కథలు అల్లడం సీఎంగా ఉన్నప్పటి నుంచి మోదీకి అలవాటేనని కాంగ్రెస్ పార్టీ నేత సంజయ్ నిరుపమ్ అన్నారు. లేఖల కల్పితమని చెప్పట్లేనని, విల్సన్ ఇంట్లో దొరికినట్లు చెపుతున్న లేఖలపై దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మమ్మల్ని కలచివేశాయి: రవిశంకర్ మోదీని హత్య చేసేందుకు మావోలు కుట్ర పన్నారన్న కథనాలు తీవ్రంగా కలచివేశాయని, మావోయిస్టులకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. మావోల కుట్రను బయటపెట్టేలా నిజాయతీగా దర్యాప్తు జరగాలని, దోషులకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు. -
‘పోలీసులకు తగిన గుణపాఠం చెబుతాం’
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గడ్ రాష్ట్రంలో సుక్మా జిల్లాలోని జేగురు కాండు అటవీ ప్రాంతంలో శనివారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మరోసారి కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో పలువురు మావోలు చనిపోగా, ఆ కాల్పుల్లో తప్పించుకున్న వారికోసం నిన్నటి నుంచి దండకారుణ్యంలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఉదయం సుక్మాలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు.. మావోయిస్టులు ఎదురుపడటంతో మరోసారి కాల్పులు మోత కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్లు బూటకం మరోవైపు మహారాష్ట్ర - ఛత్తీస్గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లు బూటకమని మావోయిస్టు పార్టీ నేత జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. పోరుబిడ్డలపై రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్న పాలకులకు ప్రజల చేతిలో శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. త్వరలో పోలీసులకు తగిన గుణపాఠం చెబుతామని జగన్ పేర్కొన్నారు. -
భద్రాద్రి జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం
సాక్షి, భద్రాద్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు సమీపంలోని రోటింత వాగుపై నిర్మించిన లెవల్ చప్టా (కల్వర్టు)ను మావోయిస్టులు పేల్చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు విధించిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం నిరసన దినంగా ప్రకటించాలని మావోయిస్టులు మంగళవారం లేఖను విడుదల చేశారు. ఈ క్రమంలోనే కల్వర్టును ధ్వంసం చేశారు. భారీ మందు పాతర వినియోగించడంతో కల్వర్టు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. -
ఎన్కౌంటర్: ఐదుగురు మావోయిస్టుల మృతి
రాంచీ : జార్ఖండ్లోని లతేహర్ జిల్లాలో బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. సెరెన్దాగ్ అటవీ ప్రాంతంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఏకే 47 రైఫిల్స్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కూంబింగ్ కొనసాగుతున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. -
జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్
రాంచీ : జార్ఖండ్లోని పలము జిల్లాలో సోమవారం తెల్లవారుజాము సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలకు మావోయిస్టులు తారసపడగా.. ఇరు వర్గాల మధ్య ఎదరుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందినట్టు బలగాలు గుర్తించాయి. మరికొందరు మావోయిస్టులు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. వారి ఆచూకీ కోసం కూంబింగ్ కొనసాగుతోంది. -
ఏవోబీలో విస్తృత తనిఖీలు
సాక్షి, విశాఖ: ఏవోబీ సరిహద్దులో మావోయిస్టుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇటీవల జరిగిన మావోయిస్టుల దాడుల నేపథ్యంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. హెలికాప్టర్ల ద్వారా కూంబింగ్ను నిర్వహిస్తున్నారు. కాగా, ఇటీవల సరిహద్దులోని పాములగెడ్డ, టిక్కరపాడు ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టుల ఉన్నట్టు గుర్తించారు అదే విధంగా మావోయిస్టు అగ్రనేత ఆర్కే సరిహద్దులో ఉన్నట్టు నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మావోయిస్టులు, భద్రతా బలగాల మోహరింపు మధ్య సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఆ ముగ్గురు ఎవరు?
కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు గోదావరి తీర ప్రాంతమైన మహదేవపూర్ మండలంలో మావోయిస్టుల అలజడి మళ్లీ మొదలైందని ప్రచారం జరుగుతోంది. సోమవారం మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ముగ్గురు మావోయిస్టులు సంచరించారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడు కరపత్రాలు వదలడం, ఇన్ఫార్మర్లను హతమార్చడం ద్వారా మావోయిస్టులు గోదావరి తీరప్రాంతాల్లో తమ ఉనికిని చాటుకుంటున్నారు. కాళేశ్వరంలో ముగ్గురి సంచారం ? తాజాగా ఈ నెల 5న మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అదే రోజు కాళేశ్వరంలో ముగ్గురు అనుమానితులు సంచరించినట్లు సమాచారం. వారి మాటల ప్రకారం మావోయిస్టులుగా అనుమానించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నట్లు తెలిసింది. అసలు వారు నకిలీలా ? నిజంగా మావోయిస్టులా అనే విషయం కూడా తేల్చేందుకు పోలీసులు కూపీ లాగుతున్నట్లు సమాచారం. మకాం మార్చిన నాయకులు.. మావోయిస్టుల బంద్ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భూసేకరణలో కీలకపాత్ర పోషించిన వారిపై మావోయిస్టులు గురిపెట్టినట్లు స్థానికంగా జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో అధికార పార్టీ నాయకులను పిలిచి పోలీసులు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో అధికారపార్టీ నాయకులంతా హైదరాబాద్, వరంగల్ నగరాలకు మకాం మార్చారు. భారీ బందోబస్తు.. సరిహద్దులో మావోయిస్టుల సంచారం నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో పాటు కన్నెపల్లి పంప్హౌస్కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రాంతంలో పోలీసులు పహారా కాస్తున్నారు. ఎస్పీ ఆర్.భాస్కరన్ ప్రత్యేక పోలీసు బలగాలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాళేశ్వరం బ్యారేజీల వద్ద భద్రతను పటిష్టం చేస్తున్నారు. మావోయిస్టులు రాలేదు.. సోమవారం సాయంత్రం కాళేశ్వరంలో మావోయిస్టులెవరూ రాలేదు. అనుమానితులు మద్యం తాగినట్లు ఉన్నట్లు తెలిసింది. వారిని మహారాష్ట్రకు చెందినవారిగా స్థానికులు గర్తించారు. మావోయిస్టులు మాత్రం కాదు. బంద్ నేసథ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా బ్యారేజీల వద్ద కూంబింగ్ చేస్తున్నాం. – సీహెచ్.శ్రీనివాస్, ఎస్సై, కాళేశ్వరం -
దంతెవాడ జిల్లాలో ఎదురుకాల్పులు
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య గురువారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టులు హతమయ్యాడు. సంఘటనా స్థలం నుంచి ఓ రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దులో మావోయిస్టులు దాడులకు పాల్పడుతుండటంతో బలగాలు కూంబింగ్ను విస్తృతం చేశారు. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామున మావోయిస్టులు ఉనికితో భద్రతా బలగాలు కాల్పలు జరిపినట్టు తెలుస్తోంది. -
నల్లమలలో మావోయిస్టుల డంప్
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో కలకలం రేగింది. జిల్లాలోని నాగలూటీ చెంచు గూడెం వద్ద మావోయిస్టుల డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డంప్లో గ్రనేడ్, జిలెటిన్ స్టిక్సను గుర్తించారు. మావోయిస్టుల డంప్ లభ్యం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అటవీ ప్రాంతమంతా జల్లెడ పడుతున్నారు. -
సీఆర్పీఎఫ్ క్యాంపుపై మావోయిస్టుల దాడి?
సాక్షి, భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. జిల్లాలోని చర్ల మండలంలోని కలివేరు గ్రామంలో ఉన్న సీఆర్పీఎఫ్ పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ రోజు తెల్లవారుజామున పెద్ద శబ్ధం వినిపించిందని గ్రామస్తులు చెబుతున్నారు. సీఆర్పీఎఫ్ క్యాంపుపై మూడు ప్రెషర్ బాంబులను విసిరినట్టు సమాచారం . ఈ ఘటనలో పలువురు జవాన్లకు గాయాలయ్యాయని తెలుస్తోంది. అయితే ఈ సంఘటనను పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. కాగా, ఒక పక్క మావోయిస్టులు మరో పక్క పోలీసుల మధ్య ఆదివాసీలు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయాందోళనలు చెందుతున్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మావోయిస్టులను నిర్మూలించే పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై చేస్తున్న ఫాసిస్టు నిర్బంధానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 5న బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్, తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్లు సంయుక్తంగా ప్రకటన జారీ చేశారు. -
12 మంది మావోయిస్టుల అరెస్టు
చత్తీస్ఘడ్: చత్తీస్ఘడ్లోని భారీ ఎత్తున మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. మల్కన్గిరి జిల్లాలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మల్కన్గిరిలో 12 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని కలిమెల, మాథిలి, చిత్రకొండ ప్రాంతాలలో వారిని అరెస్టు చేశారు. మల్కనగిరిలో ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో పోలీసులు అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే మావోలు పట్టుబడినట్టు తెలిపారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులు వివిధ విభాగాలకు చెందిన వారని, పలువురు ఈ మధ్యకాలంలో జరిగిన ముగ్గురు వ్యక్తుల హత్యలో పాల్గొన్నారని తెలిపారు. -
భూపాలపల్లి జిల్లాలో బాంబుల కలకలం
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాంబులు కలకలం రేపాయి. జిల్లాలోని వెంకటాపురం(కె) మండలంలోని అబ్బాయిగూడెం సమీపంలోని రహదారిపై రెండు బాంబులు అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల వాహనాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులే ఈ ఘతుకానికి పాల్పడి ఉంటరాని అనుమానిస్తున్నారు. రహదారిలో ప్రెషర్ బాంబులు అమర్చినట్లు గుర్తించడంతో.. బాంబు స్క్వాడ్ సాయంతో వాటిని నిర్వీర్యం చేయడానికి యత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సర్పంచ్ను హతమార్చిన మావోయిస్టులు
కోరాపుట్: ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాలో ఓ గ్రామ సర్పంచ్ను మావోయిస్టులు హతమార్చారు. హతిబరి గ్రామ సర్పంచ్ జగన్నాధ్ఖొరా ఇంటిపై 50 నుంచి 60 మంది మావోయిస్టులు అర్ధరాత్రివేళ దాడిచేసి ఆయన్ను కాల్చి చంపారు. ఆయనకు చెందిన కారు, ఒక ట్రాక్టరు, ఒక కమాండర్ వాహనాన్ని తగులబెట్టారు. -
చర్లలో మావోయిస్టు పోస్టర్ల కలకలం
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు పోస్టర్ల కలకలం రేగింది. జిల్లాలోని చర్ల మండల పరిషత్తు కార్యాలయం వద్ద మావోయిస్టు పార్టీ చర్ల, శబరీ ఏరియా కమిటీ పేరుతో పోస్టుర్లు వెలిసాయి. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా మారితే కఠిన చర్యలు తప్పవని. పోడు భూముల జోలికి వస్తే వదిలేది లేదని.. నకలీ విత్తనాలతో అమాయకులను మోసం చేయాలని చూస్తే ఇబ్బందులు తప్పవని.. నాణ్యమైన విత్తనాలనే సరఫరా చేయాలని వ్యాపారులను హెచ్చరించారు. -
ఛత్తీస్గఢ్లో మళ్లీ కాల్పుల కలకలం
నారాయణపూర్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మళ్లీ విరుచుకుపడ్డారు. నారాయణపూర్ జిల్లా ధనోరా అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ధనోరా అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజాము నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపైకి మావోలు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుదాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పినపాకలో మావోయిస్టు పోస్టర్లు
పినపాక: ఖమ్మం జిల్లా పినపాక మండలం మల్లారం పంచాయతీ వెంకటేశ్వరపురం గ్రామంలో మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. నక్సల్బరీ సాయుధ 50వ వార్షికోత్సవాలను గ్రామ గ్రామాన విప్లవ ఉత్తేజంతో జరపాలని అందులో పేర్కొన్నారు. నక్సలిజమే భారత ప్రజల విముక్తికి ఏకైక మార్గమని, నక్సలిజం రగిల్చి ప్రజా యుద్ధ జ్వాలల్లో భూస్వాములను భస్మీపటలం చేద్దామని ప్రజలకు నక్సల్స్ పిలుపునిచ్చారు. నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేద్దామని, నక్సల్బరీ ఏకీ రాస్తా అని, సామ్రాజ్యవాదం నశించాలని ఆ పోస్టర్లలో నక్సల్స్ పేర్కొన్నారు. -
బస్సును తగులబెట్టిన నక్సల్స్
ఛత్తీస్గఢ్: నారాయణపూర్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఓ ప్రైవేటు బస్సును మావోయిస్టులు తగులబెట్టారు. అబూజ్మడ్-నారాయణపూర్ రహదారి నిర్మాణాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఘటనకు పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. -
ఆ ఎమ్మెల్యేను బెదిరించింది బంధువులే
ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యను రెండేళ్లుగా బెదిరింపులకు గురిచేసిన వారిని పోలీసులు పట్టుకున్నారు. నక్సలైట్ల పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురిని టేకులపల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఆయనకు రెండు సార్లు బెదిరింపు లేఖలు, రెండుసార్లు బెదిరింపు ఫోన్కాల్స్ వచ్చాయి. ఎమ్మెల్యే ఫిర్యాదుతో అప్పమత్తమైన పోలీసులు దర్యాప్తు చేప్టటారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యేను బెదిరించిన నిందితులు ఆయన బంధువులు కావడం విశేషం. నిందితులు పూనెం బాలకృష్ణ, పూనెం ప్రకాష్, ఇర్ప కిషోర్లు చాలా సార్లు ఎమ్మెల్యేకు ఫోన్ చేసి బెదిరిస్తుండేవారు. తండ్రీకొడుకులైన బాలకృష్ణ, ప్రకాష్లు మరో నలుగురితో కలిసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇంకా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రూ. లక్ష ఇవ్వాలని ఎమ్మెల్యే కనకయ్యను డిమాండ్ చేస్తూ చంపుతామని హెచ్చరించారని వివరించారు. వీరిని రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. -
ఇల్లందు ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖలు
ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు మావోయిస్టుల పేరుతో బెదిరింపులు వస్తుండటం జిల్లాలలో కలకలంగా మారింది. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఆయనకు రెండు సార్లు బెదిరింపు లేఖలు, రెండుసార్లు బెదిరింపు ఫోన్కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. ఎమ్మెల్యే కనకయ్యకు భద్రను పెంచారు. ఆయన నివాసం చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమరాలు ఏర్పాటుచేయడంతో పాటు, రక్షణ కోసం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన కొరం కనకయ్య.. కొద్ది నెలలకే టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాగా, బెదిరింపు వ్యవహారం మావోయిస్టుల పనేనా? లేక నకిలీలదా అనేది తెలియాల్సిఉంది. -
ఎన్కౌంటర్: మావోయిస్టు ఏరియా కార్యదర్శి మృతి
చర్ల: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ బార్చూర్ ఏరియా కమిటీ కార్యదర్శి విలాప్ మృతి చెందాడు. సంఘటన స్థలంలో ఏకే-47 ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల సరిహద్దులో ఉన్న బస్తర్ జిల్లాలోని బుర్గుం పోలీస్స్టేషన్ పరిధిలో గల అటవీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో తారసపడ్డ మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన బార్చూర్ ఏరియా కమిటీ కార్యదర్శి విలాప్ మృతి చెందారు. మృతదేహం వద్ద నుంచి ఒక ఏకే-47 తుపాకీని, కిట్బ్యాగ్ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టు ఏరియా కమిటీ కార్యదర్శి విలాప్పై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రూ 16 లక్షల రివార్డ్ను ప్రకటించి ఉన్నట్లు తెలిసింది. -
ముగ్గురు మావోయిస్టుల పట్టివేత
రాయిపూర్: తీవ్రవాద ప్రభావిత ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పోలీసులు ముగ్గురు మావోయిస్టులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు ఒడిశాకు చెందిన వారు. పుష్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో రాష్ట్ర భద్రతా బలగాలు, పోలీసులు చేపట్టిన సంయుక్త కూంబింగ్లో వీరు పట్టుబడ్డారని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. బస్తర్ జిల్లా దర్భా ప్రాంతానికి చెందిన కవాసి హద్మా(32)తో పాటు, ఒడిశా రాష్ట్రం మల్కన్గిరికి చెందిన రామ్నాథ్ నాగ్(21), బచ్ఛా ధుర్వా(24)గా గుర్తించారు. మావోయిస్టు పార్టీలో భాగమైన జన్మిలీషియాకు చెందిన ఈ ముగ్గురూ మార్చి 28వ తేదీన పోలీసులపై జరిగిన దాడిలో కీలక సూత్రధారులని తెలిపారు. మంగళవారం వీరిని సుక్మా జిల్లా కోర్టులో హాజరుపరిచామన్నారు. -
జై బోలో పార్లమెంటు!
‘ఎర్ర చొక్కానే నీ కోసం మార్చాను.. సాయుధ పంథాకే గుడ్ బై కొట్టాను.. ఓటు బాటనే ట్రెండీగా పట్టాను.. పార్టీని వదిలేసి నీ కోసం వచ్చాను.. ఓటరూ.. లెట్స్ డూ ఓటింగూ..’ సుబ్బారావు ఆనందం పట్టలేక గద్దర్ని కావలించుకున్నాడు. ప్రజాగాయకుడు గద్దర్, సుబ్బారావు చాలాకాలంగా స్నేహితులు. గద్దర్ మావోయిస్టు పార్టీకి రాజీనామా చేసినట్టు పేపర్లో చదవగానే సుబ్బారావు గద్దర్ ఇంటికి వెళ్లాడు. సుబ్బారావు లోపలి వెళ్లగానే గద్దర్ ఏదో సీరియస్గా రాసుకుంటూ కనిపించాడు. ఎదురుగా లాప్ టాప్, పక్కనే సీడీలు, పుస్తకాలూ... ‘రా, సుబ్బన్నా.. రా... చాలా కాలానికి కనిపించి నవు.. ‘నోరారా ఆహ్వానించాడు గద్దర్ సుబ్బారావుని. ‘నువ్వు మావోయిస్టు పార్టీకి రాజీనామా చేసి ప్రయోజన జీవన స్రవంతిలోకి వచ్చావు కదా.. శుభాకాంక్షలు చెప్పి పోదామని వచ్చాను’ అన్నాడు సుబ్బారావు. కొరకొరా చూశాడు గద్దర్. ‘గదేం మాట భై ...నేనేం అజ్ఞాతంలో లేను, అయినా ప్రయోజన జీవన స్రవంతి అని కొత్త మాట అంటున్నవేంది..’ అన్నాడు. ‘అంటే.. పార్లమెంటు, ఎన్నికలు, ఓటు అంటూ ఏదేదో మాట్లాడావు కదా.. అందుకే అలా అన్నా.. నాకో చిన్న డౌట్ అన్నా.. ఇదివరకు పోలీసులు నిన్ను మావోయిస్టు పార్టీ సభ్యుడివి అంటే అంతెత్తున ఎగిరి పడి ఖండించేవాడివి, కేవలం ఆ పార్టీ సానుభూతిపరుణ్ణి అని చెప్పేవాడివి.. సానుభూతిపరుడివే అయితే రాజీ నామా చేయడమెందుకు, పార్టీ వాళ్లు నిన్ను బతిమాలడం ఎందుకు..’ తెగించి అడిగేశాడు సుబ్బారావు. ‘అది అప్పటి వ్యూహం.. అది ఒక చారిత్రక అవసరం..’ అనేసి మళ్లీ బరబరా రాసుకోవడంలో మునిగిపోయాడు గద్దర్. సుబ్బారావులో కుతూహలం పెరిగింది, గద్దర్ ఏంటి రాస్తున్నాడా అని. అదే అడిగాడు. గద్దర్ రాయడం ఆపి, మెటికలు విరుచుకుంటూ అన్నాడు. ‘చూడు సుబ్బన్నా.. గతంలో నేను కొన్ని వందల విప్లవ గీతాలు పాడిన.. కొన్ని వేరేటోల్లయి.. కొన్ని నేను రాసుకున్నయి.. గిప్పుడు మనం రూటు మార్చినం కదా.. మళ్లీ గవ్వే పాడితే బాగుండదని నా కొత్త పంథాకి తగ్గట్టుగా తిరగ రాస్తున్నా..’ ‘కొత్త పంథా అంటే ? ఎలగెలగెలాగా?’ అమాయకంగా అడిగాడు సుబ్బారావు. గద్దర్ నవ్వుతూ చెప్పాడు. ‘ఇన్నాళ్లుగా జనంకి నా పాటల ద్వారా ఏం చెప్పా ను? రాజ్యాంగాన్ని నమ్మొద్దన్నాను.. రాజ్యం మీద తిరగబడమన్నాను.. ఎన్నికలు బూటకమన్నాను.. ఎన్నికల్ని బహిష్కరించమన్నాను.. బులెట్ ద్వారా తప్ప బ్యాలెట్ ద్వారా పేదోడికి న్యాయం జరగదన్నాను.. సాయుధ పోరాటానికి సిద్ధం కావాలన్నాను.. గిప్పుడు సీను రివర్స్ అయింది బిడ్డా.. గిప్పుడు మనది ఎన్నికల పాట.. పార్లమెంటరీ ప్రజాస్వామ్య బాట.. దానికి తగ్గట్టుగా నా పాత పాటల్ని అటకెక్కించి వాటిని మార్చి తిరగరాస్తున్నా..’ ‘చాలా మంచి పని చేస్తున్నావు గద్దరన్నా .. ఏదీ, ఒక శాంపిల్ వినిపించు’ గద్దర్ ఒక్క గెంతులో నిలబడి ‘హా..’ అని పెడబొబ్బ పెట్టాడు. సుబ్బారావు తుళ్లిపడి, గద్దర్ పాటలోకి దిగుతున్నాడని గ్రహించి స్తిమితపడ్డాడు. గద్దర్ మొదలెట్టాడు. ‘ఈ ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా.. ఓటు మనదిరా, పోలింగ్ బూతు మనదిరా, మావో ఏందిరో.. వాని పీకుడేందిరో..’ సుబ్బారావు చప్పట్లు కొట్టాడు. ‘సూపరుంది గద్దరన్నా.. ఆ పాత చింతకాయ విప్లవ బాణీని వదిలేసి ఈ రోజులకి తగ్గట్టుగా ట్రెండీ వరసలో పాడరాదే..’ అని సలహా ఇచ్చాడు. గద్దర్కి ఆ సలహా నచ్చింది. ఎలాగో చెప్పమన్నాడు. వెంటనే సుబ్బారావు లాప్టాప్లో యూట్యూబ్ ఓపెన్ చేసి చిరంజీవి లేటెస్ట్ సినిమాలో పాట ప్లే చేశాడు. గద్దర్ ‘ప్రేమమ్’ సినిమాలో శృతి హాసన్లా ఒకటికి రెండుసార్లు విని, మళ్లీ ఎగిరి గంతెయ్యబోయాడు. సుబ్బారావు అతడ్ని చటుక్కున ఆపి, ‘ఈ పాటకి గంతులు, హా హూ లు లేవు’ అన్నాడు. గద్దర్ తల ఊపి చిరంజీవి స్టెప్పుల్తో పాట మొదలుపెట్టాడు. ‘ఎర్ర చొక్కానే నీ కోసం మార్చాను.. సాయుధ పంథాకే గుడ్ బై కొట్టాను.. ఓటు బాటనే ట్రెండీగా పట్టాను.. పార్టీని వదిలేసి నీ కోసం వచ్చాను.. ఓటరూ.. లెట్స్ డూ ఓటింగూ..’ సుబ్బారావు ఆనందం పట్టలేక గద్దర్ని కావలించుకున్నాడు. ‘గద్దరన్నా.. ఇకనుంచి నువ్వు ప్రజాయుద్ధనౌకవి కావన్నా.. ఓటు యుద్ధనౌకవి..’ పారవశ్యంతో అన్నాడు. గద్దర్ కళ్లు చెమర్చాయి. ‘చాలా థాంక్స్ అన్నా.. అది సరే గానీ, ఇంకో పాట రాస్తూ చిన్న డౌట్ వచ్చి ఆపిన.. అది విని, ఆ డౌట్ తీర్చి పో..’ అన్నాడు. సరేనన్నాడు సుబ్బారావు. గద్దర్ మొదలుపెట్టాడు. ‘ఆగదు, ఆగదు, ఆగదు, ఈ బాలెట్ పోరు ఆగదు.. ఈ పార్టీ పాలన అంతం వరకు నా ఓట్ల పాట ఆగదు.. తొర్రపడ్డ ఊపిరితిత్తి ఊదూమంది రాగం తీసి, కిడ్నీనుంచి పోయిన తూటా మీటుమంది కిన్నెరనేమొ, ఈ ఎడమచేతిని చీల్చిన తూటా ఎత్తూమందీ ఎర్ర జెండా..’ అంటూ ఆగిపోయాడు గద్దర్. ‘గిప్పుడు ఎర్రజెండాని వదిలి పెట్టిన కదా సుబ్బన్నా.. ఏ రంగు జెండా రాయాల్నా అని ఆలోచిస్తున్న.. నువ్ జెప్పు..’ అన్నాడు. సుబ్బారావు కాసేపు ఆలోచించి, ‘తెల్ల రంగు అయితే బెటరేమో గద్దరన్నా..’ అన్నాడు. తెల్ల రంగు ఎందుకని అడిగాడు గద్దర్ అర్థం కాక. సుబ్బారావు వివరించాడు. ‘సాధారణంగా యుద్ధంలో ఓడిపోయినప్పుడు శత్రువుని శరణువేడుతూ సింబాలిక్గా తెల్లజెండా పట్టుకుం టారు కదా. నీ మారిన పంథాకి తెల్ల జెండా సూటవుతుం దని అలా చెప్పా.. సరే కాని సాయంత్రం రామాలయంకి వచ్చేయ్.. అక్కడ కలుద్దాం.. మాంచి భజన ప్రోగ్రాం ఉందిలే ఇవాళ.. కలిసి విందాం.. నే వెళ్తున్నా మరి..’ మంగు రాజగోపాల్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు ఈమెయిల్ : mangurajagopal@gmail.com -
గద్దర్ సంచలన ప్రకటన
-
తూటా వదిలిన పాట
మావోయిస్టు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన గద్దర్ సాక్షి, హైదరాబాద్: విప్లవ గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ మావోయిస్టు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తాను ఓటరుగా కూడా నమోదు చేసుకున్నానని, పార్లమెంటరీ పంథాలో జనం ముందుకు వెళతానని పేర్కొన్నారు. పల్లె పల్లె పార్లమెంటుకు అనే నినాదంతో పర్యటిస్తానని చెప్పారు. ఎర్ర జెండాను పక్కనపెట్టి.. తనపై కాల్పులు జరిగి ఇరవై ఏళ్లయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గద్దర్ మాట్లాడారు. తన మాతృ సంస్థ మావోయిస్టు పార్టీ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. అమరవీరులకు కన్నీళ్లతో వందనాలు చెబుతూ.. చేతిలోని ఎర్రజెండాను పక్కన పెట్టి, బుద్ధుడి జెండా కట్టిన కర్రను చేతిలోకి తీసుకున్నారు. ‘‘మార్క్స్ జ్ఞాన సిద్ధాంతం మాత్రమే చాలదు.. అంబేడ్కర్ ఫూలేల మార్గం అవసరమంటూ నా మాతృ సంస్థతో పలుమార్లు చర్చించాను. అయితే ఇది మిత్ర వైరుధ్యమే. నన్ను వెళ్లవద్దని వారించారు కూడా. కానీ రెండు దశాబ్దాలుగా తుపాకీ తూటాలను నాలో మోస్తున్నా. రెండు పడవలపై కాళ్లుపెట్టలేనని స్పష్టం చేశాను..’’అని పేర్కొన్నారు. మార్క్స్ జ్ఞాన సిద్ధాంతాన్ని, అంబేడ్కర్, ఫూలేల ఆలోచనలతో.. పల్లె పల్లె పార్లమెంటుకు అనే నినాదంతో ప్రజల ముందుకు వస్తున్నానని తెలిపారు. తాను ఓటరుగా కూడా నమోదు చేసుకున్నానని చెప్పారు. అయితే ఇప్పుడు తాను కేవలం ఓటరునేనని, ఏ రాజకీయ పార్టీ సభ్యత్వం లేదని పేర్కొన్నారు. తాను పార్టీ పెట్టడం కాదని, పార్టీని అల్లడానికి పూలలో దారం అవుతానని చెప్పారు. దొరల తెలంగాణ వస్తుందని అప్పుడే భావించాం ఎటువంటి తెలంగాణ అవసరమో ఉద్యమం నాడే చెప్పి ఉండాల్సిందని... అంబేడ్కర్ స్వాతంత్య్రం వస్తే నా జాతికేమిస్తారని అడిగినట్టే, మేం తెచ్చిన తెలంగాణ ఇలా ఉండాలని ముందే చెప్పి ఉండాల్సిందని గద్దర్ వ్యాఖ్యానించారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ల మాదిరిగానే ఇక్కడా దొరల రాజ్యం వస్తుందని ముందే భావించామని చెప్పారు. ఇప్పుడున్న భౌగోళిక తెలంగాణ కాదని, పాలన, అధికారం, అభివృద్ధి పైనుంచి కాకుండా.. కింద నుంచి అన్నీ అందాలని పేర్కొన్నారు. అటువంటి త్యాగాల తెలంగాణకు సిద్ధం కావాలని గద్దర్ పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయం కావాలి: ప్రత్యా మ్నాయ తెలంగాణ కోసం పల్లె పల్లె పార్లమెంటుకు పాటతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని గద్దర్ పేర్కొన్నారు. ఇదెవరికీ వ్యతిరేకం కాదన్నారు. కొద్దిరోజుల్లో దక్షిణ భారతదేశంలోని 175 ప్రాంతాలను సందర్శించనున్నట్టు తెలిపారు. భావ సారూప్యత కలిగిన పార్టీలన్నీ ఏకం కావాలని.. జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలవాలని పిలుపునిచ్చారు. అప్పుడు మీరు కోరుకుంటే తాను దండలో దారం అవుతానని వ్యాఖ్యానించారు. తన మిగిలిన జీవితం అంతా అమర వీరుల స్వప్నమేనని పేర్కొన్నారు. గద్దర్ మిగతా జీవితం కూడా ఇప్పటిలాగే ప్రజలతో ముడిపడి ఉండాలని కోరుకుంటున్నట్లు గద్దర్ భార్య పేర్కొన్నారు. కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు హాజరయ్యారు. -
నిమ్మవాగులో బయటపడ్డ తుపాకులు
గుండాల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ముత్తాపురం గ్రామ సమీపంలోని నిమ్మ వాగు చెరువులో రెండు తుపాకులు సోమవారం బయటపడ్డాయి. తుపాకులు రెండూ తుప్పుపట్టి ఉన్నాయి. స్థానికులు వాటిని గుర్తించి సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తుపాకులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మావోయిస్టులు వాగులో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. -
ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు
హైదరాబాద్: ప్రొఫెసర్ సాయిబాబాకు మహారాష్ట్రలోని గడ్చిరోలి ఓ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఆయనకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని విశ్వసించి ఈ మేరకు తీర్పునిచ్చినట్లు న్యాయస్థానం పేర్కొంది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను గడ్చిరోలి పోలీసులు 2014లో అరెస్టు చేశారు. వికలాంగుడైన ఆయన తీవ్ర అనారోగ్యంగా ఉండడంతో తర్వాత ప్రభుత్వం విడుదల చేసింది. ఆయనపై ఉన్న ఆరోపణలను గడ్చిరోలి న్యాయస్థానం ఇటీవల విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపైనే ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు జేఎన్టీయూ విద్యార్థి హేమ్ మిశ్రా, మాజీ జర్నలిస్టు ప్రశాంత్ రాహి తదితరులకు కూడా ఇదేవిధంగా జీవిత ఖైదు విధించింది. -
ఎదురు కాల్పుల్లో జవాను మృతి
భద్రాచలం: ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక జవాను మృతిచెందారు. బీజాపూర్ జిల్లా మిర్తుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోరాలి ప్రాంతంలో శుక్రవారం ఉదయం పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో బీఎస్ఎఫ్ దళానికి చెందిన జవాను మృతిచెందగా మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. -
మావోయిస్టుల కిరాతకం
ఛత్తీస్గఢ్: దంతెవాడ జిల్లా దర్భ డివిజన్లో ఒక వ్యక్టిని మావోయిస్టులు అతి కిరాతకంగా హత్య చేశారు. మొండెం నుండి తలను వేరు చేశారు. ఆ డివిజన్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ఈ దారుణం చేసినట్టు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, సుకుమా జిల్లా బడిశెట్టి గ్రామంలో మడకం పారా అనే గిరిజనుడిని కూడా మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. -
పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు మృతి
కొండాగావ్: మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఈ సంఘటన ఛత్తీస్గఢ్లోని కొండాగావ్ అటవీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతాదళాలను గుర్తించిన మావోయిస్టులు వారిపైకి కాల్పులు జరిపారు. దీనికి ప్రతిగా పోలీసులు కూడా ఫైర్ ఓపెన్ చేశారు. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
ఒడిశాలో మావోయిస్టుల బీభత్సం
కొరాపుట్: రహదారి నిర్మాణ పనులను వ్యతిరేకిస్తూ.. మావోలు రెచ్చిపోయారు. ఒడిశాలోని కొరాపుట్ జిల్లా సిమిలిగూడ సమితి పరిధిలోని బిస్తర్కోట వద్ద రహదారి నిర్మాణ పనులకు వినియోగిస్తున్న 5 వాహనాలను దగ్ధం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి బిస్తర్కోట వద్దకు చేరుకొని అక్కడ పని చేస్తున్న సూపర్వైజర్ జైరాంను ఇన్ఫార్మర్ నెపంతో గొంతుకోసి హత్య చేసిన మావోలు పక్కనే ఉన్న 5 వాహనాలకు నిప్పుపెట్టారు. -
ఖమ్మం జిల్లాలో పోలీసుల తనిఖీలు
కొత్తగూడెం: ఈ నెల 3వ తేదీన తెలంగాణ బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఖమ్మం జిల్లాలోని సరిహద్దు గ్రామాల్లో పోలీసులు విస్త్రత తనిఖీలు చేపట్టారు. మంగళవారం ఇల్లందులోని విద్యుత్ కార్యాలయం వద్ద వాహనాలను తనిఖీలు చేపట్టి అనుమానితులను విచారించారు. అలాగే, టేకులపల్లి, బోడు పోలీస్స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీలు కూడా చేపట్టారు. -
ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి
కొండగావ్: ఛత్తీస్గఢ్లోని కొండగావ్ జిల్లా మర్దపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. కూంబింగ్ కు వెళ్లిన పోలీసుల పై మావోయిస్టులు ఎదురుదాడి చేయడంతో.. పోలీసులు ధీటుగా జవాబిచ్చారు. కూంబింగ్ కొనసాగుతోంది. -
ఛత్తీస్గఢ్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
దుమ్ముగూడెం: ఖమ్మం జిల్లా సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా కన్నాయిగూడెం అటవీ ప్రాంతంలో మావోలు, పోలీసులకు మధ్య బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మిలీషియా సభ్యులు మృతి చెందారు. వివరాలు.. మారాయిగూడెం-గొల్లపల్లి రోడ్డు నిర్మాణ పనుల వద్ద సోమవారం మావోలు అమర్చిన ప్రెషర్ బాంబు పేలి జవాను మడకం జోగా మృతి చెందాడు. దీంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు(డీఆర్జీ) బలగాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నాయి. అయితే బుధవారం కన్నాయిగూడెం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బలగాలకు మావోయిస్టులు తారసపడగా.. ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ధర్మాంగు గ్రామానికి చెందిన తాటి చుక్కా, కన్నాయిగూడెం గ్రామానికి చెందిన పొడియం దేవా అనే మిలీషియా సభ్యులు మృతి చెందారు. కాల్పుల తర్వాత మావోయిస్టులు పారిపోగా.. ఆ ప్రదేశంలో పోలీసులకు రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని తాటి చుక్కా, పొడియం దేవాగా గుర్తించినట్లు డీఆర్జీ అమిత్, హెచ్సీ మడకం ముద్దరాజు తెలిపారు. కాగా, సంఘటనా ప్రదేశంలో రెండు తపంచాలు, డిటొనేటర్లు, బ్యాటరీలు, 150 మీటర్ల విద్యుత్ వైరు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. -
'తీరు మారకుంటే అంతం చేస్తామన్నారు’
చర్ల: మావోయిస్టుల ఎజెండానే తమ ఎజెండా అని పేర్కొంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ బూటకపు ఎన్కౌంటర్లతో అరాచకాలు సృష్టిస్తున్నారని మావోయిస్టులు మండిపడ్డారు. శనివారం మావోయిస్టుల చెర నుంచి విడుదలైన భద్రాచలం నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జ్ మానె రామకృష్ణ చర్లలో విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టుల సూచన మేరకు ఆయన మీడియాకు వివరాలు చెప్పారు. సర్కారు తీరు మారకుంటే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీఆర్ఎస్ నాయకులను అంతం చేస్తామని మావోయిస్టులు హెచ్చరించినట్టు చెప్పారు. ఇకనైనా సర్కారు తన తీరు మార్చుకోవాలని, ఎన్కౌంటర్లు, కూంబింగ్లు నిలిపివేయాలని చెప్పమన్నారని వెల్లడించారు. మావోయిస్టులు తమను బాగానే చూసుకున్నట్టు రామకృష్ణ చెప్పారు. -
ఆదిలాబాద్ అడవుల్లో భారీ కూంబింగ్
ఆదిలాబాద్: టీఆర్ఎస్ నేతల కిడ్నాప్ వ్యవహారంతో తెలంగాణలో వాతావరణం వేడెక్కింది. కూంబింగ్లు, అనుమానితుల అరెస్టులతో తెలంగాణ జిల్లాలు ఉద్రిక్తంగా మారాయి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దున ఉన్న రిజర్వు ఫారెస్టులో గురువారం నుంచి భారీగా కూంబింగ్ కొనసాగుతోంది. శుక్రవారం కూడా సుమారు 400 మంది పోలీసులు 14 బృందాలుగా విడిపోయి అడవుల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. 30 నుంచి 50 మంది మావోయిస్టులు సంచరిస్తున్నట్టు పోలీసుసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఖమ్మం జిల్లా చర్లలో బుధవారం కిడ్నాప్నకు గురైన నేతల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. దీంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తాజా పరిణామాలతో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో గిరిజనులు వణికిపోతున్నారు. -
ముగ్గురు పాస్టర్లను అపహరించిన మావోలు
చింతూరు: తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం దొంగల జగ్గారం ప్రాంతంలో మావోల కదలికలు పెరిగిపోతున్నాయి. శుక్రవారం రాత్రి ఆ ప్రాంతంలో సంచరించిన మావోలు సమీప ప్రాంతాలకు చెందిన ముగ్గురు పాస్టర్లను అపహరించుకువెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు ధ్రువీకరించలేదు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆపరేషన్ మావో
చెన్నై: కేరళ నుంచి తమిళనాడులోకి మావోయిస్టుల చొరబాటు అనుమానంతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోయంబత్తూరులో మావోయిస్టుల సంచారం సమాచారంలో జాతీయ భద్రత దళాలు రంగంలోకి దిగాయి. స్థానిక పోలీసులతో కలిసి అడవుల్లో కూంబింగ్ ప్రారంభించాయి. కేరళ రాష్ట్రం పుతూరు సమీపంలోని కడుగుమన్నామలై గ్రామంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఈ నెల 17వ తేదీన కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో కొందరు మావోయిస్టులు గాయపడి పరారయ్యారు. వారి కోసం జాతీయ భద్రతా దళాలు కోయం బత్తూరు జిల్లా బిల్లూరు చెరువు తీరంలో గాలింపు చేప్టటాయి. ఈ దళాలకు చెందిన 50 మందితో పాటూ మేట్టుపాళయం, అన్నూర్, కారమడై, పెరియనాయకన్ పాళై, శిరుముగైలోని మరో 15 మంది, ఫ్లయింగ్ స్క్వాడ్కు చెందిన 30 మంది కలిసికట్టుగా కోవై అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే అటవీ గ్రామాల్లోని మావోయిస్టు సానుభూతిపరులను విచారిస్తున్నారు. మావోయిస్టుల సంచారం ఉన్నట్లుగా అనుమానించే ప్రాంతాలను చుట్టుముడుతూ రాష్ట్ర సరిహద్దుల్లోని పది ప్రత్యేక చెక్పోస్టులను అప్రమత్తం చేశారు. పోలీస్స్టేషన్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు, ముఖ్యమైన ప్రదేశాలకు బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తూర్పుమండల పోలీస్ ఐజీ శంకర్ మాట్లాడుతూ ఉత్తర మండలాల సరిహద్దులోపల మావోయిస్టులు లేరని , అయితే కేరళ సరిహద్దుల నుంచి తమిళనాడులోకి ప్రవేశించకుండా ముందు జాగ్రత్తలు చేపడుతున్నామని అన్నారు. కేరళలో జరిగిన కాల్పుల్లో గాయపడిన మావోయిస్టులు తమిళనాడు తూర్పు జిల్లాల్లోకి ప్రవేశించలేదని చెప్పారు. కోవై జిల్లా ఎస్పీ సుధాకర్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా సరిహద్దులోని చెక్పోస్టులు, పోలీస్ స్టేషన్లలో నిఘా కెమెరాలు అమర్చామని చెప్పారు. కేరళ కాల్పుల్లో గాయపడిన మావోయిస్టులు చికిత్స కోసం సరిహద్దులోని కోవైకు వచ్చే అవకాశాలు ఉన్నందున ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్, జాతీయ భద్రతా దళాలు, స్థానిక పోలీసులు మూకుమ్మడిగా కూంబింగ్ నిర్వహిస్తున్నారని చెప్పారు. -
ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి
మల్కన్గిరి:ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా కేంద్రానికి 20 కిలో మీటర్ల దూరాన ఉన్న తోడిక్కి, బురిధి గ్రామాల సమీప అడవుల్లో శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ముందస్తు సమాచారం మేరకు మల్కన్గిరి జిల్లా ఎస్పీ మిత్రభాను మహాపాత్రో ఆధ్వర్యంలో మావోయిస్టులను చుట్టుముట్టారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. చత్తీస్గఢ్ దర్బ డివిజన్కు చెందిన 20 మంది మావోయిస్టులు, ప్రస్తుతం జరుగుతున్న మావోయిస్టు సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సమావేశం ఏర్పాటు చేసేందుకు ఇక్కడికి రాగా, ఈ ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం. మావోయిస్టుల శిబిరం నుంచి పోలీసులు పెద్ద ఎత్తున ఆయుధాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను ఎస్పీ మిత్రభాను మహాపాత్రో దగ్గరుండి మల్కన్గిరి డీపీఓ కార్యాలయానికి తీసుకొచ్చారు. పోస్టుమార్టంకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఇంకా ఎదురు కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. మావోయిస్టు సంస్మరణ వారోత్సవాల వేళ మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగలడం గమనార్హం. -
ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి
ఛత్తీస్ గఢ్: మరోసారి పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. మంగళవారం సుక్మా జిల్లాలోని చింతగుప్ప వద్ద పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. -
విక్రమ్.. ఎక్కడ?
ఎదురుకాల్పుల్లో త్రుటిలో తప్పించుకున్న మావోయిస్టు విక్రమ్ కోసం పోలీసుల గాలింపు ముమ్మరంగా సాగుతోంది. నల్లమలను జల్లెడపడుతూ ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. విక్రమ్ ఏకే-47 వదిలివెళ్లడానికి అవకాశమే లేదని, తప్పించుకుంటే ఆయుధంతోనే వెళ్లేవాడనే భావన కూడా వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో అతడు అడవిలో ఉన్నాడా.. లేక పోలీసుల అదుపులో ఉన్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అచ్చంపేట / మన్ననూర్ : ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెం నల్లమల అటవీప్రాంతంలోని మురారి కురువ వద్ద నాలుగు రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు విక్రమ్ తప్పించుకున్నట్లు భావి స్తున్న పోలీసులు కృష్ణాతీరం, లోతట్టు అటవీప్రాంతంలో పాలమూరు జిల్లా పోలీసులతో పాటు రెండు ప్రత్యేక బృందాలే విస్తృతంగా గాలిస్తున్నాయి. ఓఎస్డీ పర్యవేక్షణలో నాగర్కర్నూల్ డీఎస్పీ అంథోనప్ప ఆధ్వర్యంలో గాలిం పు చర్యలు సాగుతున్నాయి. మరోవైపు ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాల పోలీసులు గాలిస్తున్నారు. గతేడాది జూన్20న మహబూబ్నగర్ కోర్టు సమూదాయం నుంచి ఎత్తికెళ్లిన ఏకే-47, ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెం అటవీప్రాంతంలోని మురారి కురువ వద్ద జరిగిన ఎన్కౌంటర్ ఘటన స్థలం వద్ద లభ్యమైనది ఒక్కటేనని పోలీసులు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. దీనిని ఎత్తుకెళ్లిన విక్రమ్ తప్పించుకున్నట్లు పోలీసులు భావించి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఏడాది కాలంగా ప్రకాశం, మహబూబ్నగర్ జిల్లాల పోలీసులు గాలి స్తున్నా.. అతని ఆచూకీ లభ్యం కావడం లేదు. పోలీసుల అదుపులో విక్రమ్? విక్రమ్ ఏకే-47 వదిలివెళ్లడానికి అవకాశమే లేదని, అతను తప్పించుకుంటే ఆయుధంతోనే వెళ్లేవాడని వివిధ ప్రజాసంఘాల నాయకులు, విద్యావంతులు, మేధావులు భావిస్తున్నారు. ఏకే-47 ఈ జిల్లాదే అని నిర్ధారణకు రావడంతో పాటు పోలీసులకు విక్రమ్ దొరికి ఉండొచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతని పట్టుకుని మావోయిస్టుల వివరాలు ఆరా తీస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. అయితే పోలీసులకు విక్రం దొరికితే అటవీప్రాంతంలో ఇంత శ్రమటోడ్చి గాలింపు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏముందని చెబుతున్నా రు. విక్రమ్ స్వగ్రామం అమ్రాబాద్ మండ లం తిర్మలాపూర్ (బీకే). అతడు ఇక్కడికి వస్తాడనే అనుమానంతో నదీపరివాహక ప్రాంతం వెంట ప్రత్యేక బలగాలు గాలింపు చేపడుతున్నాయి. అటవీ సరి హద్దు గ్రామాలు, చెంచుపెంటలపై పోలీసులు అంతర్గతంగా గట్టి నిఘా ఉంచారు. రెండు రోజుల క్రితం డీఎస్పీ ఆంథోనప్ప అమ్రాబాద్ మండలంలోని కొందరు ఆర్ఎంపీ డాక్టర్లను పిలిచి అనుమానితులు వస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా సూచించినట్లు సమాచారం. అటవీప్రాంతంలో పోలీసుల గాలింపుతో చెంచుపెంటల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఏడేళ్లుగా ప్రశాంతంగా ఉన్న నల్లమలలో ఈ ఎన్కౌంటర్తో మరోసారి ఉలికిపడుతున్నారు. మృతిచెందిన మావోయిస్టురాలు నాగమ్మ, తప్పించుకున్నట్లు అనుమానిస్తున్నా.. విక్రం ఈ మం డలం వారే కావడంతో ఏ సమయంలో ఏమి జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. విక్రం ఎక్కడ ఉన్నాడనేది ఇంకా స్పష్టం కాలేదు. మావోయిస్టులతో కలిశాడా? లేక పోలీసుల అదుపులో ఉన్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాయాలైన అతడు ఇప్పటికీ వైద్యం చేయించుకోకుండా ఎలా ఉంటాడని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతేనేం మురారి కురువ వద్ద జరిగిన ఎన్ కౌంటర్ నల్లమలలో అలజడి రేపింది.