cultural
-
తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ‘మీట్ అండ్ గ్రీట్’
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో జనవరి 18న ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ (GIIS) స్కూల్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఐటీ/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్/ఇండస్ట్రీస్ & కామర్స్/లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నాగార్జున సాగర్ ఎం ఎల్ ఏ జయవీర్ కుందూరు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు/బాన్సువాడ ఎం ఎల్ ఏ/ మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, డిసిసి ప్రెసిడెంట్ డాక్టర్ రోహిణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారందర్ని అతిధి మర్యాదలతో తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వ్యవస్థాపక అధ్యక్షులు బండ మాధవ రెడ్డి , పూర్వ అధ్యక్షులు నీలం మహేందర్, అధ్యక్షులు గడప రమేష్ బాబు తదితరులు సింగపూర్ తెలుగు ప్రజల సమక్షంలో ఘనంగా ఆహ్వానించారు. సింగపూర్ తెలుగు ప్రజల మరిచిపోలేని మధుర క్షణాలను మదిలోనింపుకొన్నరోజు ఇదే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. చిన్నారుల నృత్యప్రదర్శనలు, స్వాగత గీతంతో ఆహ్వానించారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షులు గడప రమేష్ స్వాగత ప్రసంగంతో.. తెలంగాణ కల్చరల్ సొసైటీ స్థాపన తెలుగు సంప్రదాయాలను, ఆచారాలను, ఆధ్యాత్మిక తత్వాలను భావితరాలకు అందించే కృషిలో సొసైటీ నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించడం జరిగింది.తెలంగాణ మీద ఉన్నప్రేమను చూపించడానికి విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రోహిణ్ కుమార్ రెడ్డి, ఇతర సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా తెలంగాణ కల్చరల్ సొసైటీకి వెన్నంటి ముందుండి నడిపించి తమ సహాయ సహకారాలను ఎల్లవేళల అందించే వ్యవస్థాపక అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, పూర్వ అధ్యక్షులు నీలం మహేందర్, NRI Cell మంద భీం రెడ్డి కి, GTA గ్లోబల్ ఛైర్మెన్ కల్వల విశ్వేశర్ రెడ్డి, GIIS ఛైర్మెన్ అతుల్ తెముర్ణికర్, సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ అంతే కాకుండా ఈ కార్యక్రమానికి సహకరించిన బసిక శ్రీకాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్లో నివసిస్తున్న తెలుగు ప్రజలను ఉద్దేశించి తెలంగాణలో పలు రంగాలలో చేస్తున్న అభివృద్ధిని, తెలంగాణ ఔన్నత్యాన్ని భావితరాలకు అందించే ప్రణాలికను, ప్రపంచదేశాలు తెలంగాణను తలెత్తి చూసే సమయం ఆసన్నమైంది. అందుకు విదేశాలలో నివసిస్తున్న మన తెలంగాణ తెలుగు ప్రజల సహాయ సహకారాలు ఉండాలని కోరారు. అదేవిధంగా ఐటీ(IT) మినిస్టర్ శ్రీధర్ బాబు, డిజిటల్ రంగంలో చేస్తున్న అభివృద్ధిని వివరించారు .తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, IT మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర మంత్రివర్గ సభ్యులను, తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) కమిటి, సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ GIIS ఛైర్మెన్ అతుల్ తెముర్ణికర్ ఘనంగా సత్కరించారు.ఈ వేడుకల్లో మాతృశ్రీసాయి ఇన్స్టిట్యూట్, సర్వ ఫైన్ ఆర్ట్స్, దుర్గ శర్మ గ్రూప్, దీపారెడ్డి అండ్ గ్రూప్ మరియు స్వర్ణకళామందిర్ నుండి చిన్నారుల నృత్యప్రదర్శనలు, మధురమైన గీతాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి కాసర్ల శ్రీనివాస రావు, మిర్యాల సునిత రెడ్డి ముఖ్య సమన్వయ కర్తలుగా వ్యవహరించి అందరిని అలరించారు.కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వ్యవస్థాపక అధ్యక్షులు బండ మాధవ రెడ్డి , పూర్వ అధ్యక్షులు నీలం మహేందర్, సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యుల చేతుల మీదుగా 2025 తెలుగు క్యాలెండర్ (సింగపూర్ కాలమాన ప్రకారం)ను విడుదల చేసి, అందరికీ వాటిని పంపిణీ చేశారు.తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, IT మినిస్టర్ శ్రీధర్ బాబు, ఇతర ముఖ్య అతిథులకు ధన్యావాదాలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన సొసైటీ సభ్యులు ఆలెక్స్ తాళ్ళపల్లి, మల్లారెడ్డి కళ్లెం, లక్ష్మణ్ రాజు కల్వ, రాకేష్ రెడ్డి రజిది, సురేందర్ రెడ్డి గింజల, సింగపూర్ తెలుగు ప్రజలకు అభినందనలు తెలియజేసారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల, కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ, అలాగే 'మీట్ అండ్ గ్రీట్' కు హాజరైన ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసారు. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన సొసైటీ మహిళా విభాగ సభ్యులు గడప స్వాతి, బసిక అనిత రెడ్డి, జూలూరు పద్మజ, సునీత రెడ్డి, హేమ లత, దీప నల్ల,కాసర్ల వందన, బొందుగుల ఉమా రాణి, నంగునూరు సౌజన్య, నడికట్ల కళ్యాణి, హరిత విజాపుర్, ఆవుల సుష్మ, పులిగిల్ల హరిత, సౌజన్య మాదారపు, ఎర్రమ రెడ్డి దీప్తి, సృజన వెంగళ, హర్షిణి మామిడాల, సుధా రాణి పెసరు, వాసవి పెరుకు, రావుల మేఘన, చల్ల లత మొదలగు వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: సెంట్రల్ బక్స్ సౌత్ హైస్కూల్కి నాట్స్ విరాళం) -
ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్కు పిలుపు..
ఘనం.. వారిరువురూ వృత్తి రిత్యా నగిషీ కళాకారులు.. వారసత్వంగా వచ్చిన వృత్తిపై మామకారాన్ని పెంచుకున్నారు. అంతటితో ఆగకుండా తమ వృత్తికి కళాత్మకతను జోడించి వివిధ కళారూపాలను తీర్చిదిద్దారు. తమ కళతో అందరినీ మెప్పించి అనేకమందిని ఆకర్షించారు. తమలోని భిన్నమైన కళతో ప్రముఖుల నుంచి శభాష్ అనిపించుకుంటున్నారు. వారే హైదరాబాద్లోని అంబర్పేట డీడీ కాలనీలో నివసించే కృష్ణాచారి, గౌరిదేవి దంపతులు.. గత 30 ఏళ్లుగా వెండితో ఫిలిగ్రీ కళారూపాలను తయారు చేస్తూ తమదైన ముద్ర వేసుకున్నారు. వీరి కళను గుర్తించి కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను అందించి అభినందించింది. వీరి ఫిలిగ్రీ కళలో చేస్తున్న కృషికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటిప్పుడు గుర్తించి పలు అవార్డులను అందించి సత్కరిస్తున్నాయి. గణతంత్ర వేడుకలకు.. ఫిలిగ్రీ కళలో వీరి ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకలకు వీరిని ఆహా్వనించింది. 2025 జనవరి 26న జరిగే వేడుకల్లో పాల్గొనాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే కబురు అందింది. ఈ నెల 23న ఢిల్లీకి చేరుకోవాల్సిందిగా కోరింది. దీంతో కృష్ణాచారి, గౌరిదేవి దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశ గణతంత్ర వేడుకలకు తమను ప్రత్యేకంగా ఆహ్వానించడంతో ఎంతో గర్వంగా ఉందన్నారు. ఢిల్లీ వెళ్లడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నామని వారు సాక్షితో వెల్లడించారు. వివిధ కళారూపాలు.. వెండితో గత 30 ఏళ్లుగా వివిధ కళారూపాలను రూపొందిస్తున్నామన్నారు. ప్రజలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో అతిథుల జ్ఞాపికలు అందించేందుకు తమను సంప్రదించి ప్రత్యేక కళారూపాలను తయారు చేయించుకుని వెళ్తారన్నారు. వెండితో చార్మినార్, హైటెక్ సిటీ, చారిత్రాత్మక గుర్తులు, వీణ, రాట్నం, వెండి బుట్టలు వంటి కళారూపాలను రూపొందించామన్నారు. అవసరమైన వారికి తాము చెప్పిన రీతిలో అందిస్తామంటున్నారు. కళను గుర్తించి.. కృష్ణాచారి శ్రమ, కళను గుర్తించి 2006 అప్పటి రాష్ట్రపతి ప్రతిభపాటిల్ జాతీయ అవార్డు అందజేశారు. తన సతీమణ గౌరిదేవికి 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ అవార్డు అందజేశారు. వీటితో పాటు రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులను ఈ దంపతులు అందుకున్నారు. ఫిలిగ్రీ కళ తరపున రాష్ట్ర, దేశ బృందాల్లో వీరు చోటు సంపాదించుకుని తమదైన ముద్ర వేస్తున్నారు. మహేశ్వరం బీసీ హాస్టల్ విద్యార్థి గొల్ల అక్షయ్ మహేశ్వరం : దేశ రాజధాని ఢిల్లీలో జరిగే కర్తవ్య ఫరేడ్ విక్షించడానికి ప్రధాన మంత్రి యశస్వి పథకం కింద తెలంగాణ నుండి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం బీసీ హస్టల్లో తొమ్మిదో తరగతి చదివే విద్యార్థి గొల్ల అక్షయ్ ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రదర్శన కారులు, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆదర్శంగా నిలిచన వారిని, ఇలా తెలంగాణ రాష్ట్రం నుండి 31 మందిని ఎంపిక చేశారు. ఇందులో మహేశ్వరం బీసీ హస్టల్లో ఉంటూ స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్న గొల్ల అక్షయ్ని ఎంపిక చేశారు. అక్షయ్ స్వగ్రామం కొల్పూరు, మండలం మగనూర్, నారాయణపేట్ జిల్లా. నీరుపేద కుటుంబానికి చెందిన అక్షయ్ తల్లి చిన్న తనంలో మరణించడంతో గొర్లకాపరి అయిన తండ్రి రంగప్ప కులవృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన ఇద్దరి పిల్లలనూ 2021లో మహేశ్వరం బీసీ హస్టల్లో చేర్పించారు. అక్షయ్ చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనభరుస్తున్నాడు. హస్టల్ వార్డెన్ కృష్ణ ప్రోత్సాహంతో ఓబీసీ, ఈబీసీ విద్యార్థులకు ప్రధాన మంత్రి యశస్వి పథకం కింద ఆర్థిక సాయాన్ని సంవత్సరానికి రూ.2 లక్షల ఉపకారవేతనం ప్రత్యేకంగా అందిస్తోంది. అక్షయ్ ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మొయినాబాద్ నుంచి బాత్కు అశ్విని.. మొయినాబాద్ రూరల్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నుంచి బాత్కు అశ్విని ముఖ్య అతిథిగా ఆహా్వనితులయ్యారు. ఈ మేరకు ఢిల్లీ హోంశాఖ విడుదల చేసిన స్పెషల్ కేటగిరి తెలంగాణ జాబితాలో 31 మంది ప్రత్యేక అతిథుల పేర్లల్లో అశ్విని ఆహా్వనం పొందారు. వివిధ రంగాలు, ప్రభుత్వ పతకాల వినియోగదారుల జాబితాలో మొయినాబాద్ మాడల్ మండల సమైక్యకు చెందిన బాత్కు అశ్విని ఆహా్వనం పొందడంతో ఆమె హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
TCSS ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్(TCSS)ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు సంబవాంగ్ పార్క్లో అక్టోబర్ 5న(శనివారం) ఎంతో కన్నుల పండుగగా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరు సాంప్రదాయ పాటలు ఆటలతో ఎంతో హుషారుగా గడిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సింగపూర్ బతుకమ్మ ఉయ్యాలో పాటలతో ఈ వేడుకలు మిన్నంటాయి. ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు ఎంతో మంది ఎన్నారైలు సుమారు 4000 నుండి 5000 వరకు పాల్గొని బతుకమ్మ ఆడారు. సింగపూర్ లో నివసిస్తున్న తెలుగు వారందరికీ , స్థానికులకు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తు దశాబ్దానికి పైగా సింగపూర్లో బతుకమ్మ పండుగకు విశేష ఆదరణ కలుగజేయడం ద్వారా టీసీఎస్ఎస్ చరిత్రలో నిలిచిపోయిందని సొసైటీ సభ్యులు అన్నారు. ఈ సంబురాల్లో అందంగా ముస్తాబైన బతుకమ్మలకు, ప్రత్యేక సాంప్రదాయ, ఉత్తమ వస్త్రధారణలో మహిళలకు గృహ ప్రవేశ్, సౌజన్య డెకార్స్, ఎల్ఐఎస్ జువెల్స్ , బీఎస్కే కలెక్షన్స్ వారు ప్రత్యేక బహుమతులు అందజేశారు.ఇరు తెలుగు రాష్ట్రాల తెలుగువారు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ వైభవాన్ని చాటి చెప్పడం ఎంతో సంతోషకరమని, బరాలు విజయవంతంగా జరుగుటకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ టీసీఎస్ఎస్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. టీసీఎస్ఎస్తో ప్రేరణ పొంది ఇతర సంస్థలు కూడా బతుకమ్మ నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు.ఈ వేడుకల్లో టీసీఎస్ఎస్ ప్రత్యేకంగా తయారు చేయించిన బతుకమ్మ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా విడుదల చేసిన సింగపూర్ బతుకమ్మ ప్రోమో పాట "సింగపూర్ కొచ్చే శివుని పెండ్లాము.. సిరులెన్నో తీసుకొచ్చే మా పువ్వుల కోసము.." యూట్యూబ్లో విడుదల చేసినప్పటి నుంచి వేల వీక్షణాలతో దూసుకుపోతుందని తెలిపారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికీ సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి , కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు రోజా రమణి, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.వీరితో పాటు సొసైటీ మహిళా విభాగ సభ్యులు రోజా రమణి, గడప స్వాతి, బసిక అనిత రెడ్డి, జూలూరు పద్మజ, సునీత రెడ్డి, హేమ లత, దీప నల్ల,కాసర్ల వందన, బొందుగుల ఉమా రాణి, నంగునూరు సౌజన్య, నడికట్ల కళ్యాణి, హరిత విజాపుర్, ఆవుల సుష్మ, పులిగిల్ల హరిత, సౌజన్య మాదారపు, ఎర్రమ రెడ్డి దీప్తి, సృజన వెంగళ, హర్షిణి మామిడాల, సుధా రాణి పెసరు ఈ బతుకమ్మ పండుగ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. సింగపూర్ వేడుకలను సొసైటీ ఫేస్బుక్ ,యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.ఈ వేడుకలకు సహకారం అందించిన సంపంగి రియాలిటి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, మై స్క్వేర్ ఫీట్ (గృహప్రవేశ్) ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో, సరిగమ గ్రాండ్ రెస్టారెంట్ అండ్ బిస్ట్రో, జి.ఆర్.టి జ్యూవెల్లర్స్, మై హోమ్ గ్రూప్ కంస్ట్రక్షన్స్, అభిరామి జ్యూవెల్లర్స్, వీర ఫ్లేవర్స్ ఇండియన్ రెస్టారెంట్, ప్రద్ ఈవెంట్ మేనేజ్ మెంట్, జి.ఆర్.టి ఆర్ట్లాండ్, జోయాలుక్కాస్ జ్యూవెల్లర్స్, ఏ.ఎస్.బి.ఎల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్, ఎస్.వి.ఎస్ (శ్రీవసుధ) ట్రూ వెల్త్ ఇండియా, ది ఆంధ్ర కర్రీ క్లాసిక్ ఇండియన్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్, కుమార్ ప్రాప్ నెక్స్ , గారెంటో అకాడమీ, ఎస్ పి సిస్నెట్ సొల్యూషన్ దట్స్ పర్ఫెక్ట్ , సౌజన్య హోమ్ డెకార్స్ , ఎల్.వై.ఎస్ జెవెల్స్ మరియు బి.ఎస్.కె కలెక్షన్స్, లాలంగర్ వేణుగోపాల్, రాకేష్ రెడ్డి రజిది, సతీష్ శివనాథుని, కవిత ఆనంద్ అండ్ సంతోష్ ఆమద్యల, హేమ సుభాష్ రెడ్డి దుంతుల, మల్లేష్ బారేపటి, శ్రీధర్ కొల్లూరి,చంద్ర శేఖర్ రెడ్డి కోమటిరెడ్డి, విజయ రామ రావు పొలినేని , సునీల్ కేతమక్క ,రంజిత్ రెడ్డి మండల, నాగేశ్వర్ రావు టేకూరి , బండారు శ్రీధర్ మరియు పార్క్ యాజమాన్యానికి సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ వేడుకలకు సహకారం అందజేసిన కల్వ రాజు, సుగుణాకర్ రెడ్డి రావుల, మల్లేశ్ బరపతి, చల్లా కృష్ణ, మల్లవేని సంతోష్ కుమార్, మల్లారెడ్డి కళ్లెం, బాదం నవీన్, భాను ప్రకాష్ , సాయికృష్ణ కొమాకుల , ముక్కా కిశోర్కు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కీ.శే. గోనె నరేందర్ రెడ్డి గారు సొసైటీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. -
రష్యా కళాకారులపై మోదీ ప్రశంసలు : అక్కడి ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని భారతీయులను కలిశారు. వారినుఉద్దేశించి ప్రసంగించారు. ప్రవాస భారతీయులతో పలు ప్రశ్నలడిగి, వారితో ఉత్సాహంగా ముచ్చటించారు. తనకు స్వాగతం పలికేందుకు ప్రదర్శించిన రష్యన్ కల్చరల్ ట్రూప్ కళాకారులతో ప్రధాని మోదీ సంభాషించారు.మాస్కోలో భారతీయ కమ్యూనిటీని ఉద్దేశించి చేసే ప్రసంగానికి ముందు త్రివర్ణ పతాకాన్ని చేబూనిన భారతీయులు చప్పట్లు, "మోదీ మోదీ" నినాదాలతో హోరెత్తించారు. అనంతరం తన ప్రసంగంలో మోదీ ఒక శుభవార్తను పంచుకున్నారు. రష్యాలో కొత్త కాన్సులేట్లను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. కజాన్, యెకటెరిన్బర్గ్లలో భారత కాన్సులేట్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇది పర్యాటకం, వ్యాపార వాణిజ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు.ఎన్నాళ్లనుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నారని అని కళాకారులను ప్రధాని మోదీ ప్రశ్నించారు. కొంతమంది పదేళ్లు, మరికొంతమంది 30 ఏళ్లు సమాధానమిచ్చారు. కొంతమంది భారతదేశంతో, మోదీతో తమకున్న అనుభవాన్ని పంచుకున్నారు. ఇస్కాన్ మాస్కో ప్రెసిడెంట్, సాధు ప్రియా దాస్, రామ్ కృష్ణ మిషన్ నుండి స్వామి ఆత్మలోకానంద తదితరులు మాట్లాడారు.కాగా సోమవారం సాయంత్రం రష్యాలోని మాస్కోకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా ఉప ప్రధాని డెనిస్ మంత్రోవ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన ఇంటికి వచ్చిన మోదీకి పుతిన్ ఘన స్వాగతం పలికారు మోదీపై పుతిన్ ప్రశంసల్లో ముంచెత్తిన సంగతి తెలిసిందే.#WATCH | Prime Minister Narendra Modi meets artists of the Russian Cultural Troupe who performed to welcome PM Modi during his address to the Indian community in Moscow, Russia(Souce: PMO) pic.twitter.com/qUWMVkVk3K— ANI (@ANI) July 9, 2024 -
శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం!
'శ్రీ సాంస్కృతిక కళాసారథి - సింగపూర్' ఆధ్వర్యంలో పవిత్ర మతత్రయ ఏకాదశి పర్వదిన సందర్భంగా, అంతర్జాల మాధ్యమంగా ప్రత్యేక ప్రవచన కార్యక్రమము ఏర్పాటు చేశారు. పంచమహాసహస్రావధాని అవధాన సమ్రాట్ డా మేడసాని మోహన్ గారు "శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం" అనే అంశంపై రెండు గంటలపాటు ప్రవచనాన్ని అందించారు.యోగిని ఏకాదశి, మతత్రయ ఏకాదశి కలిసిన రోజు విశిష్టతను వివరించి, ఏకాదశి వ్రతమహిమను తెలియజేశారు. అనంతరం కురుక్షేత్ర సంగ్రామం ముందు పాండవులు ఆచరించిన ఏకాదశి వ్రత కథను తెలియజేశారు.కురుక్షేత్ర సంగ్రామానికి ముందు జరిగిన రాయబార ఘట్టాలనుండి సంగ్రామ సమాప్తి వరకు జరిగిన సన్నివేశాలన్నింటినీ కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తూ, తిక్కన భారతంలోని పద్యాలను ఉదహరిస్తూ, వాటిలోని సాహితీ విశిష్టతను తెలియజేస్తూ, శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధాన్ని నడిపించిన తీరు అంతా అద్భుతంగా వివరించారు. తానే కర్త, కర్మ, క్రియ అయ్యి, ధర్మసంస్థాపన మూల లక్ష్యంగా యుద్ధ సారథ్యం చేయడంలో, వివిధ సందర్భాలలో కృష్ణ భగవానుడు ప్రదర్శించిన లీలల వెనక ఉద్దేశాలను చక్కగా వర్ణించి చెప్పడం అందరినీ ఆకట్టుకుంది.శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ "డా మేడసాని మోహన్ గారు ఎంతో అభిమానంగా తమ సంస్థను ప్రోత్సహించే సహృదయులని, గతంలో కూడా వారి ప్రవచనాలను సింగపూర్ తెలుగు ప్రజలు ఆదరించారని, మతత్రయ ఏకాదశి పర్వదిన సందర్భంగా వారు ఈ ప్రత్యేక ప్రవచనం అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.సింగపూర్ నుండి కాకతీయ సాంస్కృతిక పరివారం అధ్యక్షులు పాతూరి రాంబాబు, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధి కాసర్ల శ్రీనివాస్ ఆంధ్ర కళావేదిక ఖతార్ అధ్యక్షులు వెంకప్ప భాగవతుల, ప్రతినిధి సాహిత్య జ్యోత్స్న, యూఏఈ నుంచి దినేష్, బహరేన్ తెలుగు కళా సమితి అధ్యక్షులు జగదీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.సంస్థ ప్రధాన కార్యవర్గ సభ్యురాలు రాధిక మంగిపూడి సభను నిర్వహించగా, రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక నిర్వహణలో యూట్యూబ్, ఫేస్బుక్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయగా, వెయ్యి మందికి పైగా ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ చూసారని నిర్వాహుకులు తెలియచేసారు. -
సాగర తీరంలో ఆకట్టుకుంటున్న మొగ దారమ్మ ఆలయ శిల్ప సౌందర్యం
భారతదేశ సంస్కృతి... ప్రకృతి సౌందర్యం...ఆధ్యాత్మిక శోభ ఉట్టి పడుతూ నిర్మితమైన ఆలయంఒకవైపు పచ్చని కొండలు మరోవైపు నీలి సముద్రం... మధ్య ప్రశాంత వాతావరణంలో ఆలయం. కేవలం ఆధ్యాత్మిక చింతన మాత్రమే కాక ఆలయంలో అడుగు పెడితే మానవ జీవనశైలి... హైందవ ధర్మం... కాలచక్రం అన్ని స్పష్టంగా కనిపిస్తాయి. వందల ఏళ్లుగా పూజలు అందుకుంటున్న ఎండాడ గ్రామ దేవత ఆలయం ఇప్పుడు కొత్తగా ఆకర్షణీయంగా నిర్మితమైంది. ఆలయ చరిత్ర..ఒకప్పుడు విశాఖ నగర శివారు ప్రాంతమైన గొల్లల ఎండాడ ..ముసలయ్య పేట... సాగర్ నగర్ పరిసర ప్రాంత ప్రజలకు మొగ దారమ్మ తల్లి గ్రామ దేవతగా కొనసాగారు. అప్పట్లో పరిసర దాదాపు పది గ్రామాల ప్రజలు ఏ కష్టసుఖాల్లోనైనా అమ్మవారిని తొలి గా పూజించేవారు. ఆ రోజుల్లో అమ్మవారు ప్రతికగా ఓ చలువ పందిరి కింద పూజలు చేశారు. అయితే 1988 ప్రాంతంలో సత్య ప్రసాద్ అనే వ్యక్తి సాగర్ నగర్ పరిసరాల్లో రియల్ వ్యాపారం నిర్వహించారు. ఆతనకు కొంత కలిసి వచ్చింది. దీంతో స్థానికులు అతన్ని అక్కడ ఆలయం అభివృద్ధి చేయాలని కోరారు. ఆమేరకు ఆయన ఆలయ నిర్మాణం చేపట్టారు. అయితే ఆలయాన్ని మొక్కుబడిగా కాక ఆధ్యాత్మిక త ఉట్టిపడే రీతిన నిర్మాణం చేపట్టారు దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన శిల్పుల సహకారంతో ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో అడుగడుగునా సంస్కృతి సాంప్రదాయం కనిపిస్తుంది.వైకాశన విధానంలో ఆలయ నిర్మాణంఇక్కడ శ్రీమత్ వైకాసన విధానంలో ఆలయ నిర్మాణం జరిగింది.. ఆలయం ప్రాంగణంలో మొగ ధారమ్మ ప్రధాన దేవత ఆలయం నిర్మించారు. కుడి ఎడమల వైపు దుర్గాలమ్మ ..నూకాలమ్మ అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేశారు.ఆలయంలో ఎటు చూసినా ఆధ్యాత్మికత తో పాటు శిల్పకళా సౌందర్యం కనిపిస్తుంది. మానవ జీవితంపై ప్రభావం చూపించే గ్రహాలు వాటి అధిపతుల శిల్పాలను కూడా ఇక్కడ పొందుపరిచారు. నవ గ్రహాలు . వాటి అధిపతుల తో పాటు భారతదేశంలోని మొత్తం 12 జీవనదుల దేవతల విగ్రహాలను కూడా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. శ్రావ్యమైన సంగీతానికి అద్దం పట్టే డోలు డమరుకం..వివిధ రకాల ఫలాలను కూడా శిల్ప కలలో పొందుపరిచారు. ముఖ్యంగా 16 నాలుగు స్తంభాలపై నాలుగు రకాల వృక్షాలను చిత్రీ కరించారు.ఇక్కడ స్తంభాలపై చెక్కిన శిల్పాలు ఒక్కో రకమైన ఆలోచన స్పూర్తింపజేస్తాయి. కేరళ కర్ణాటక తమిళనాడు ప్రాంతాల్లో మాదిరిగా ఆలయాలపై ఏనుగుల దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అందులో ఇక్కడ ఆలయం వద్ద వుండే పెంపుడు ఏనుగులు.. అడవి ఏనుగులు... రాజుల కోటల వద్ద ఉండే ఏనుగుల శిల్పాలు చిత్రీకరించారు.ఏనుగు తొండం పై మానవ జీవన విధానంఆలయ ప్రధాన ద్వారానికి అటు ఇటుగా కనిపించే రెండు ఏనుగు తొండాలు పై మానవ జీవన విధానంలో మార్పులు గోచరిస్తున్నాయి. రాతి యుగంలో మానవుడు.. ఆధునిక యుగంలో మానవుడు.. గ్రామాల్లో దశలవారీగా మారిన మానవ మనుగడ పనిముట్లు తదితర అంశాలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా పురాతన మానవ జీవితం అడవి సంపద అన్ని రకాల ప్రాణుల చిత్రాలను కూడా శిల్పాల్లో పొందుపరిచారు.ఆది దైవంగా విశ్వక్సేనుడుఆది దైవంగా గణేష్ విగ్రహానికి బదులు విశ్వక్సేనుడు విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది. ఆలయ ప్రకారం ప్రాకారం స్వస్తిక్.. కమలం... కలశం గోడలపై స్పష్టంగా కనిపిస్తాయి.సంతాన దేవతలు విగ్రహాలపై శ్రీకృష్ణుడు బ్రహ్మ జంటగా ఇక్కడ శిల్పాలను చిత్రీకరించారు. ధర్మార్థ కామ్య మోక్షాలకు ప్రతీక గా శేషశయన మూర్తి... దశావతారాలు వటపత్ర సాయి విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రధాన ఆలయం ఒకరకంగా కనిపిస్తే ఉప ఆలయాలు కోణార్క్ దేవాలయం తరహాలో రథచక్రాలతో కనిపిస్తున్నాయి.మహాలక్ష్మి దుర్గాదేవి సరస్వతి రూపాల్లో గ్రామదేవతలుఇక్కడ ప్రధాన దేవత మోగ ధారమ్మ ను మహాలక్ష్మి దేవిగా... దుర్గా దేవిని దుర్గి దేవిగా .. నూకాలమ్మను సరస్వతి దేవిగా పూజలు చేస్తుంటారు. ఇంత అందమైన ఆలయాన్ని సాగర తీరాన కొత్తగా నిర్మించడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ శిల్ప కళా సౌందర్యం తో పాటు ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది అని భక్తులు అంటున్నారు.ఆలయం చూసేందుకు వస్తున్న పాత తరం జనం..వాస్తవానికి మొగధారమ్మ పరిసర గ్రామాలకు గ్రామ దేవతగా కొనసాగారు. ఈ దశలో చిన్నతనంలో ఏమాత్రం మౌలిక సదుపాయాలు లేని స్థితిలో ఉన్న ఆలయం సమూలంగా మారడంతో చాలామంది భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాన్ని అత్యంత అద్భుతంగా నిర్మించిన వ్యక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ కొత్త శిల్ప సౌందర్యంతో ఆలయాన్ని చూసేందుకు పాతతరం జనం వస్తున్నారు ప్రధానంగా వృద్ధులు ఒక్కసారిగా ఆలయం మారిన తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.విశాఖ నుంచి ఋషికొండ వెళ్లే మార్గంలో సాగర్ నగర్ వద్ద ఉన్న ఈ ఆలయం పర్యాటకులను కూడా ఆకట్టుకుంటుంది. నిత్యం ప్రసాదంతో పాటు ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ఈ పురాతన గ్రామదేవత ఆలయం ఇప్పుడు ఈ ప్రాంతానికి మరింత ప్రాధాన్యత పెంచిందని ఈ వార్డు కార్పొరేటర్ లోడగల అప్పారావు పేర్కొన్నారు.ఆలయ దర్శన వేళలుఉదయం 5:30 నుంచి 10:30 సాయంత్రం 5:30 నుంచి 8 గంటల మధ్య అమ్మవార్ల దర్శనాలు లభిస్తున్నాయి.విశాఖ నుంచి భీమిలి వెళ్లే మార్గంలో సాగర్ నగర్ పక్కన ఈ ఆలయం ఉంటుంది. ఈ మార్గంలో 24 గంటలు వాహనాలతో పాటు బస్సులు అందుబాటులో ఉంటాయి.-రావులవలస రామచంద్ర రావు, సాక్షి -
ఏపీలో కళాకారులకు గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
-
దేశ సమైక్యతకు చిహ్నం ఆ భాష! జాతీయ భాషగా నీరాజనాలు అందుకుంటోంది
భాషతో బంధంజాతి నిర్మాణంలో భాష పాత్ర చాలా గొప్పది. అనేక విషయాలను అధ్యయనం చేయడం, విజ్ఞాన సాంకేతిక తదితర ఉన్నత రంగాల్లో ప్రావీణ్యత పొందడం ఒక భాష ద్వారానే సాధ్యపడుతుంది. ఒక వ్యక్తి సమగ్ర వికాసానికి భాష ఆయువుపట్టు. అదే భాష దేశాన్ని ఒకే తాటిపై నిలబడేలా, జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించినప్పుడు ఆ భాష ‘జాతీయ భాష’గా నీరాజనాలు అందుకుంటుంది. ఆ పాత్రను అక్షరాలా ‘హిందీ’ భాష నిర్వర్తించింది, నిర్వర్తిస్తోంది కూడా. భారత స్వాతంత్య్ర సమరంలో ప్రజలను జాగృత పరచడంలో క్రియాశీల పాత్ర పోషించి, ప్రపంచంలోనే అత్యధికులు మాట్లాడే రెండవ భాషగా వికసించిన భాష హిందీని కొందరు ఇంకా పరాయి భాషగా భావించడం దురదృష్టకరం. హిందీ ఒక భాష మాత్రమే కాదు, మన దేశ సమైక్యతా చిహ్నం కూడా! దేశంలో హిందీ మాట్లాడేవారు, అర్థం చేసుకునే వారు అధికంగా ఉండడం చేత కేంద్ర ప్రభుత్వము హిందీని అధికార భాషగా ప్రకటించింది. ప్రస్తుతం పదికి పైగా రాష్ట్రాలలో ప్రథమ భాషగా, మిగతా రాష్ట్రాల్లో ద్వితీయ భాషగా హిందీ ప్రచలనములో ఉన్నప్పటికీ, ఆంగ్ల భాషపై మోజుతో హిందీని నిర్లక్ష్యం చేస్తున్నారు. గాంధీజీ స్వయంగా దక్షిణ భారతదేశంలో ఈ భాష ప్రచార కార్యక్రమా నికి ‘దక్షిణ భారత హిందీ ప్రచార సభ’ స్థాపనతో శ్రీకారం చుట్టారు. ఆ మహాత్ముని ఆశయాలను అనుసరిస్తున్న మనం ఆయన విస్తరింపచేసిన భాషను తగిన విధంగా ఆదరించలేక పోవడం విచారకరం. వివిధ దేశాల్లో ఎన్నో విశ్వవిద్యాలయాల్లో హిందీని పాఠ్యాంశంగా బోధించడం గమనార్హం. కానీ, మన దేశంలో మాత్రం అంతగా హిందీకి ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. ‘త్రిభాషా సూత్రా’న్ని అనుసరించి మాతృ భాష ప్రథమ భాషగా ద్వితీయ భాషగా హిందీని, తృతీయ భాషగా ఆంగ్లం. పాఠశాల విద్యార్థులకు బోధించాలని కేంద్రం నిర్దేశించింది. కానీ కొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు లాంటి దక్షిణాది రాష్ట్రాలు ఈ సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నాయి. పరాయి భాషలు అవసరానికి ఎన్ని నేర్చుకున్నా, మన మాతృ భాష, అధికార భాషలను నిర్లక్ష్యం చేయరాదు. – భైతి దుర్గయ్య, హిందీ ఉపాధ్యాయుడు (చదవండి: మాట తప్పిన ఆత్రేయ! ముచ్చటపడ్డా.. ఆ కోరిక నెరవేరకుండానే..) -
కల్చరల్ కారిడార్ ఇన్ జీ20 కాన్ఫరెన్స్
-
సాంస్కృతిక ఏకీకరణతో సుస్థిరాభివృద్ధి
వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సాంస్కృతిక ఏకీకరణ ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటూనే, ప్రపంచంలోని భిన్న సంస్కృతులను కాపాడుకునే దిశగా జీ 20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశం కాశీ కల్చరల్ పాత్వేకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. కాశీలో మూడు రోజులపాటు జరిగిన జీ20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశాలు శనివారంతో ముగిశాయి. ప్రపంచంలోని వైవిధ్యమైన సంస్కృతి మనందరినీ కలుపుతుందని సమావేశంలోని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తన సహచర దేశాల మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ...అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే శక్తి సంస్కృతి, సంప్రదాయాలకే ఉందన్నారు. ‘కల్చర్ యునైట్స్ ఆల్’అని వ్యాఖ్యానించారు. భిన్న ప్రాంతాల్లో భిన్న సంస్కృతుల నిలయమైన భారతదేశం ‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’ప్రదర్శిస్తున్నట్లే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యత అన్ని దేశాలను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు, ఒకరినొకరు సంస్కృతి, సంప్రదాయాలను మరొకరు గౌరవించుకునేందుకు వీలవుతుందన్నారు. యావత్ మానవాళిని ఏకం చేసే విషయంలో సంస్కృతి కీలకపాత్ర పోషిస్తోందని, విలువలు, భాషలు, కళలు మొదలైనవి దేశాలు, ప్రజల మధ్య సత్సంబంధాలకు బాటలు వేస్తాయని మంత్రి కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి ఒకరోజు ముందు జరిగిన నాలుగో వర్కింగ్ గ్రూప్ సమావేశంలోనూ ఈ అంశాలపై మరింత విస్తృతమైన చర్చ జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశాల్లో చర్చించిన అంశాల ఆధారంగా ‘కాశీ కల్చరల్ పాత్వే’కు రూపకల్పన జరిగిందని ఆయన వెల్లడించారు. రోమ్ డిక్లరేషన్, బాలి డిక్లరేషన్లలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు అంశాలు, సభ్యుల అభిప్రాయాల ఆధారంగానే ‘కాశీ కల్చరల్ పాత్వే’ను రూపొందించినట్లు కిషన్ రెడ్డి వివరించారు. ‘కాశీ కల్చరల్ పాత్వే’లోని కొన్ని ముఖ్యాంశాలు సాంస్కృతిక ఆస్తులకు పునర్వైభవాన్ని కల్పించడం, వాటిని ఆయా దేశాలకు తిరిగి అప్పగించడం ద్వారా సామాజిక న్యాయంతోపాటు నైతిక విలువలకు పట్టం గట్టాలని నిర్ణయించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సంస్కృతి, సంప్రదాయాలకు ఉన్న శక్తి, సామర్థ్యాలను గుర్తెరిగి సరైన ప్రాధాన్యత కల్పించాలి. సంస్కృతికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తిస్తూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు సరైన పరిష్కారాలను కనుగొనడం. అన్ని సభ్యదేశాల మధ్య సమయానుగుణంగా చర్చలు జరుపుతూ.. అందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకెళ్లడం. ఈ సమావేశంలో పాల్గొన్న సాంస్కృతిక శాఖ మంత్రులు.. ఆయా దేశాలకు ప్రతినిధులుగానే కాకుండా.. ఆయా దేశాలలో సాంస్కృతిక సంరక్షకులుగా ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణకు ఏకతాటిపైకి వచ్చి పని చేయాలి. రోమ్, బాలి డిక్లరేషన్లు ఈ దిశగా వేసిన బలమైన పునాదుల ఆధారంగా మరింత స్పష్టమైన విధానాలతో ముందుకెళ్లాలి. -
సాంస్కృతిక సంబంధాల మెరుగుతోనే ఆర్థిక వృద్ధి
(వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) సాంస్కృతిక సంబంధాలు మెరుగుపడటం ద్వారా దేశాల మధ్య ఆర్థిక, దౌత్యపరమైన పురోభివృద్ధి సాధ్యమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి చెప్పారు. భారత్ నుంచి ఎన్నో విలువైన పురాతన విగ్రహాలు, వెలకట్టలేని అతి పురాతన విగ్రహాలు దేశం దాటి వెళ్లాయని, వాటిని తిరిగి భారత్కు తేవడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వారణాసిలో జరుగుతున్న జీ20 సాంస్కృతిక శాఖల మంత్రులు, అధికారుల సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 2014 ముందు ప్రభుత్వాలు విదేశాల నుంచి కేవలం 13 పురాతన విగ్రహాలను దేశానికి తిరిగి రప్పిస్తే, మోదీ అధికారంలోకి వచ్చాక దాదాపు 400 పురాతన విగ్రహాలను రప్పించి ఆయా రాష్ట్రాలకు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. జీ20 సభ్య దేశాలు, ఆహ్వనిత దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు ఈ సదస్సులో పాల్గొన్నాయని, అందరి సమ్మతితో శనివారం వారణాసి జీ20 డిక్లరేషన్ ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం అధికారుల స్థాయిలో జరిగిన చర్చల్లో సానుకూల స్పందన వచ్చిందన్నారు. విలేకరుల సమావేశంలో ఆ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖీ, ఆ శాఖ కార్యదర్శి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. యూత్ టూరిజం క్లబ్స్దే కీలకపాత్ర విద్యార్థుల్లో వివేకం పెంపొందించేందుకు యూత్ టూరిజం క్లబ్స్ కీలకపాత్ర పోషిస్తాయని కిషన్రెడ్డి అన్నారు. ‘సాంస్కృతిక విరాసత్ స్పర్ధ –2023’లో భాగంగా యువ టూరిజం క్లబ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత భవిష్యత్తు అంతా విద్యార్థులదేనని, అందుకు అధ్యాపకులు, ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో అందిస్తున్న కృషి ఎనలేనిదన్నారు. 99 శాతం విద్యపై దృష్టి పెడితే.. కనీసం ఒక్క శాతమైనా పాఠ్యేతర అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. స్పోర్ట్స్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్లో గానీ, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో గానీ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో సేవా తత్పరతతోపాటు దేశం పట్ల అవగాహన పెంచే లక్ష్యంతోనే ‘యువ టూరిజం క్లబ్స్’ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతీ ఇంట్లో కుటుంబసమేతంగా పర్యాటక క్షేత్రాలను సందర్శించాలంటే.. ఎక్కడకు వెళ్లాలో నిర్ణయించేది ఆ కుటుంబంలోని చిన్నారులు, విద్యార్థులేనని అన్నారు. అందుకే వారికి దేశంలోని, సమీపంలోని పర్యాటక క్షేత్రాలపై, ప్లాస్టిక్ రహిత పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. -
పర్యాటక శాఖతో ఎయిర్బీఎన్బీ ఎంవోయూ
న్యూఢిల్లీ: సాంస్కృతిక వారసత్వ పర్యాటక ప్రాంతాలకు మరింత ప్రాచుర్యం తెచ్చే దిశగా కేంద్ర టూరిజం శాఖతో ఎయిర్బీఎన్బీ జట్టు కట్టింది. తాము చేపట్టిన ’విజిట్ ఇండియా 2023’ కార్యక్రమంలో భాగంగా కేంద్రంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు సంస్థ తెలిపింది. భారతదేశ సుసంపన్న సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే దిశగా ఈ ఎంవోయూ కింద ’సోల్ ఆఫ్ ఇండియా’ పేరిట ప్రత్యేక మైక్రోసైట్ను ఆవిష్కరించనున్నట్లు వివరించింది. టూరిస్టులకు పెద్దగా తెలియని పర్యాటకప్రాంతాల్లో ఆతిథ్యం కలి్పంచేవారికి అవసరమైన తోడ్పా టు అందించడం, హోమ్స్టేలకు ప్రాచుర్యం కలి్పంచడం వంటి సేవలు అందించనుంది. విదేశీ పర్యాటకులను భారత్ వైపు ఆకర్షించేందుకు, స్థానికంగా ఉపాధి అవకాశాలు కలి్పంచేందుకు, అంతర్జాతీయ టూరిజం మ్యాప్లో భారత్ మరింత విశిష్ట స్థానం దక్కించుకునేందుకు ఈ ఎంవోయూ ఉపయోగపడగలదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. -
మన సంస్కృతితో యువత బంధం బలీయం: ప్రధాని
న్యూఢిల్లీ: మన దేశ అద్భుతమైన వారసత్వాన్ని పునరుజ్జీవింపజేయడం, గౌరవించడం కోసం కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా చేపట్టిన అనేక చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. ఘనమైన మన సాంస్కృతిక వారసత్వ సంపద మనకు గర్వకారణమన్నారు. తమ ప్రభుత్వం సాగించిన ప్రయత్నాల ఫలితంగానే మన యువతకు సంస్కృతితో బంధం బలపడిందని అన్నారు. శనివారం ఆయన ట్విట్టర్లో ‘9ఇయర్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ కల్చర్’పేరుతో హాష్ట్యాగ్ చేశారు. మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఆయన పలు ట్వీట్లు చేశారు. దేశ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు. -
ఆకట్టుకుంటున్న నీతా అంబానీ ఆర్ట్ ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
తండ్రిబాటలో నడిచి..చరిత్ర సృష్టించి.. జిన్పింగ్ ప్రస్థానమిదే..
చైనా అధినేత షీ జిన్పింగ్ 1953 జూన్ 15న శాన్షీ ప్రావిన్స్లో జన్మించారు. ఆయన తండ్రి షీ షీ ఝాంగ్షువాన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా, చైనా ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. జిన్పింగ్ బాల్యం ఎక్కువగా యావోడాంగ్ అనే పల్లెటూరిలో గడిచింది. తండ్రి ఆదేశాల మేరకు సాంస్కృతిక విప్లవ సమయంలో రైతులతో కలిసి సాధారణ జీవితం గడిపారు. వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నారు. ప్రాథమిక విద్య అనంతరం సింగువా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ అభ్యసించారు. 1974లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సభ్యుడిగా చేరారు. పార్టీ శాఖ కార్యదర్శిగా రాజకీయ జీవితం ఆరంభించారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1985లో ఫుజియాన్ ప్రావిన్స్లోని షియామెన్ నగర ఉప మేయర్గా ఎన్నికయ్యారు. 1979లో కే లింగ్లింగ్ను వివాహం చేసుకున్నారు. మనస్పర్థల కారణంగా కొద్ది కాలానికే ఆమె నుంచి విడిపోయారు. 1987లో ప్రముఖ జానపద గాయని పెంగ్ లియువాన్ను వివాహం చేసుకున్నారు. వారికి కుమార్తె షీ మింగ్జే ఉన్నారు. ఆమె అమెరికాలో చదువుకుంటున్నారు. జిన్పింగ్ 1999 నుంచి 2002 దాకా ఫుజియాన్ గవర్నర్గా, 2002 నుంమచి 2007 దాకా ఝెజియాంగ్ గవర్నర్గా వ్యవహరించారు. 2007లో కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్బ్యూరో స్టాండింగ్ కమిటీ(పీఎస్సీ)లో చేరారు. 2008 నుంచి 2013 దాకా చైనా ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. తొలిసారిగా 2012లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రధాన కార్యదర్శిగా, 2013లో చైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పొగడ్తలు, తెగడ్తలు... 1949 అక్టోబర్ 1న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆవిర్భవించింది. ఆ తర్వాత జన్మించిన తొలి సీపీసీ ప్రధాన కార్యదర్శి జిన్పింగే. పార్టీలో ఎన్నో సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారు. క్రమశిక్షణకు, అంతర్గతంగా ఐక్యతకు పెద్దపీట వేశారు. అవినీతిపై ఉక్కుపాదం మోపారు. సొంత పార్టీ మాజీ నేతలకు కూడా శిక్షలు విధించారు. ఇది చైనాలో ప్రశంసలందుకుంది. కానీ ఆయన విదేశాంగ విధానంపై భిన్న స్వరాలు వినిపించాయి. పదేళ్ల జిన్పింగ్ పాలనలో అమెరికాతో చైనా సంబంధాలు క్షీణించాయి. భారత్తో సరిహద్దు వివాదాలు పెచ్చరిల్లాయి. తైవాన్ విషయంలో జిన్పింగ్ దూకుడు విమర్శలపాలవుతోంది. హాంకాంగ్లో నేషనల్ సెక్యూరిటీ చట్టం విషయంలోనూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. కరోనా పుట్టుకకు చైనాయే కారణమన్న నిందను మోయాల్సి వచ్చింది. జీరో–కోవిడ్ పాలసీ వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ దిగజారుతోందన్న వాదనలున్నాయి. జిన్పింగ్ తయారీ రంగాన్ని ప్రోత్సహించారు. ఫలితంగా చైనా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదిగింది. -
అనువాదాలు అవసరమైన సామాజిక సందర్భాలు
సృజన సాహిత్యానికి ఉన్నట్లు అనువాదానికి ఒక సామాజిక సాంస్కృతిక సందర్భం ఉంటుందా? ఉంటుంది అనే చరిత్ర చెబుతున్నది. బౌద్ధ జైన మత సంస్కృతులను అభావం చేస్తూ ‘వర్ణాశ్రమ ధర్మ పరి రక్షణ’, ‘మను మార్గ వర్తన’ ప్రధానంగా గల వైదిక మత స్థాపన నాటి మత సాంస్కృతిక అవసరంగా ముందుకు వచ్చినపుడు తెలుగు సమాజానికి సంస్కృతం నుండి మహాభారత అనుసృజన అవసరమైంది. జాతీయోద్యమ నిర్మాణానికి భారతదేశపు భిన్న ప్రాంతాల, భాషల ప్రజా సమూహాల మధ్య ఐక్యతా భావాన్ని అభివృద్ధి చెయ్య వలసిన సందర్భం నుండి అనువాదం ప్రాధాన్యం లోకి వచ్చింది. దేశాల సరిహద్దులతో నిమిత్తం లేకుండా మానవ సమూహమంతా ఉన్నవాళ్లు, లేనివాళ్లు అని రెండు వర్గాలుగా విడిపోయివుందనీ, బ్రిటన్లోని పారిశ్రామికాభివృద్ధి నేపథ్యంలో పెట్టు బడిదారీ సమాజం అభివృద్ధి చెందిన విధానాన్ని గుర్తించి, కార్మికవర్గ అంతర్జాతీయ ఐక్యతను సంభావించిన మార్క్స్, ఎంగెల్స్ విశ్వమానవుల మధ్య సంభాషణకు తలుపులు తెరిస్తే సాహిత్య రంగంలో అది అనువాదాలకు దారితీసింది. 1917 రష్యా విప్లవ విజయం తరువాత భారత దేశంలోని కార్మిక కర్షక పోరాటాలకు స్ఫూర్తి ఇవ్వటానికి ‘అమ్మ’ (మాక్సిమ్ గోర్కీ) వంటి నవలలు తెలుగులోకి అనువాదం కావడం గమ నించవచ్చు. 1930వ దశకంలో ప్రారంభమై 1950ల వరకు సాగిన అభ్యుదయ సాహిత్యోద్యమం... ప్రపంచంలో భూస్వామ్య పెట్టుబడిదారీ ఆధిపత్యాల మీద జరిగిన తిరుగుబాట్ల చరిత్రను భిన్న దేశాల సాహిత్యం నుంచి అనువాదం చేసుకొన్నది. మరొక వైపు దేశంలోనే భిన్న ప్రాంతాలలో భూస్వామ్య పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలు వస్తువుగా వచ్చిన సాహిత్యాన్ని అనువాదం చేసుకొన్నది. మొత్తంగా ఇవన్నీ దేశం మీద జరుగుతున్న పీడితుల పోరాట చరిత్రకు నైతిక మద్దతు కూడగట్టడంలో కీలకపాత్ర పోషించాయి. అలాగే విప్లవోద్యమ అవసరాల నుండి చైనా విప్లవోద్యమం, లాటిన్ అమెరికా, ఆఫ్రికన్ దేశాలు, అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు సంబం ధించిన కథనాలు అనేకం తెలుగులోకి అనువాదం అయ్యాయి. ఈ రకమైన అనువాద చరిత్రను స్త్రీల కోణం నుండి అధ్యయనం చేయటం స్త్రీల సాహిత్య, సాంస్కృతిక చరిత్ర నిర్మాణం దృష్ట్యా అవసరం. ఇది రెండు రకాలుగా జరగాలి. ఒకటి: స్త్రీల జీవన సమస్యలను, సంఘర్షణలను చిత్రించిన సైద్ధాంతిక సృజన విమర్శన సాహిత్యాన్ని ఎంతగా తెలుగులోకి తెచ్చుకున్నాం? అందువల్ల తెలుగు సమాజ తాత్విక భావధార ఎంత పదునెక్కింది? అన్న ప్రశ్నలతో తరచి చూడటం. రెండు: అనువాదకులుగా తెలుగు స్త్రీల అభిరుచులు, ఆసక్తులు, చైతన్యం ఎటువంటివి? వారు చేసిన అనువాదాల సందర్భశుద్ధి ఎటువంటిది? వంటి ప్రశ్నలతో మదింపు చేయటం. ఇతర భాషలలోని స్త్రీల రచనలు, తెలుగులో స్త్రీలు చేసిన అనువాదాలు తెలుగు సమాజంలో మహిళా సమస్యల గురించిన అవగాహనను పదునెక్కించటంలో నిర్వహించిన పాత్రను ప్రత్యేకంగానూ, సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సందర్భాలకు అనువాదాల ద్వారా స్త్రీలు సమకూర్చిన శక్తిని మొత్తంగానూ అర్థం చేసుకొనటాన్ని ఉద్దేశించి ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ‘అనువాద సాహిత్యం – స్త్రీ సందర్భం’ అనే అంశంపై ఆరవ మహాసభను జూలై 9, 10 తేదీలలో గుంటూరులో నిర్వహించ తలపెట్టింది. ఈ సదస్సులో పాల్గొనవలసిందిగా అందరినీ ఆహ్వాని స్తున్నది. (క్లిక్: తరతరాలనూ రగిలించే కవి) - కాత్యాయనీ విద్మహే జాతీయ కార్యదర్శి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక -
వారసత్వ రక్షణ బాధ్యత ప్రజలపైనే
కడప కల్చరల్: ముందుతరం పెద్దలు అయాచితంగా మనకు ఎంతో గొప్ప వారసత్వ సంపదను అందించారు. వాటిని పరిక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యేటా ఏప్రిల్ 18న ప్రపంచ వ్యాప్తంగా వారసత్వ దినోత్సవాన్ని నిర్వహించకుంటూ వారసత్వ సంపద పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి జరుగుతోంది. వారసత్వ సంపద పరిస్థితి గురించి ప్రత్యేక కథనం. ప్రపంచంలోని ఘనమైన వారసత్వ సంపదలో మనజిల్లాలోని గండికోట కూడా ముందు వరుసలో నిలుస్తుంది. జిల్లాలోని సిద్దవటం కోట కూడా నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచి ఉంది. సిద్దవటం కోటలో బురుజులు, గోడ కూలుతున్నాయి. వాటికి కూడా తక్షణ మరమ్మతులు అవసరం. ప్రజలకు ఈ సంపదను రక్షించుకోవాల్సిన అవసరం, బాధ్యత గురించి వివరించాల్సిన బాధ్యత గల వారు పర్యాటకులను నిబంధనల పేరిట ఇబ్బందులు పెడుతుండడంతో క్రమంగా సందర్శకుల సంఖ్యతోపాటు ఆదాయం తగ్గుతోంది. -
అలరించిన నాట్యతోరణం
సాక్షి, మాదాపూర్(హైదరాబాద్): నాట్య తోరణం పేరిట ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మాదాపూర్లోని సీసీఆర్టీ (సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్) సెంటర్లో శనివారం అమ్రిత కల్చరల్ అధ్వర్యంలో దేశ సంస్కృతికి ప్రతిరూపంగా నాట్య తోరణం పేరిట పలు నృత్య ప్రదర్శనలను ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ , విదేశీ కామన్వెల్త్ ఆఫీస్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్, విశ్రాంత ఐఎఎస్ అధికారి, డాక్టర్ ఎస్ చెల్లప్ప, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఆంధ్రనాట్య విద్యాకోవిదులు ఆచార్య కళాకృష్ణ, కూచిపూడి, భరతనాట్య , విశారదుడు పసుమర్తి రామలింగశాస్త్రి, ఒడిస్సీ నాట్య విదుషీమణి నయనతార నందకుమార్, సీసీఆర్టీ ప్రత్యేక అధికారి తాడేపల్లి సత్యనారాయణ శర్మ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూచిపూడి, కథక్, ఒడిస్సా, భరతనాట్య ప్రదర్శనలు సందర్శకులను అలరించాయి. భార్గవి పగడాల(హైదరాబాద్) కూచిపూడి నృత్య ప్రదర్శన నయన మనోహరంగా సాగింది. మురమళ్ల సురేంద్రనాథ్చే కూచిపూడి నృత్య ప్రదర్శన, నిదగ కరునాథ్చే కథక్, అభయాకారం కృష్ణన్ భరతనాట్య ప్రదర్శన, బిజినచే మోహినియట్టం తదితర నృత్యప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అతిథులను ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజేష్ పగడాల గౌరవ పూర్వకంగా సత్కరించారు. భారతీయ నాట్యతోరణం దేశ సంస్కృతికి ప్రాణం ఆభరణంగా నిలుస్తుందదని పేర్కొన్నారు. దేశంలో శాస్త్రీయ నాట్య రంగాలలో కృషిచేసి ప్రతిభతో పేరు గడిస్తున్న యువ నాట్యాచార్యులకు వేదిక కల్పిస్తూ ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఇటువంటి ఉత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
కిమ్ కొత్త ఎత్తు.. ఇక కల్చరల్ వార్
పొరుగు దేశం దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కొత్త యుద్ధం చేయబోతున్నాడు. అణు ఆయుధాలు ఉపయోగించకుండా.. కొత్త చట్టాలతో సౌత్ కొరియా ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలనే ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. ఈ క్రమంలో కొరియా పాప్ కల్చర్పై త్వరలో సంపూర్ణ నిషేధం విధించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొరియన్ పాప్ కల్చర్ను ‘ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి’గా పోలుస్తూ ఈ మధ్య ఒక సమావేశంలో కిమ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ప్యోంగ్యాంగ్: ‘‘ఉత్తర కొరియా యువతపై పొరుగు దేశపు(దక్షిణ కొరియా) సంస్కృతి, సంప్రదాయాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి, అలాంటి జాడ్యాన్ని అంటగట్టుకునే ప్రయత్నం చేయొద్ద’’ని కిమ్ జోంగ్ ఉన్, అక్కడి యువతను హెచ్చరించినట్లు యోన్హప్ టీవీ ఛానెల్ స్టోరీ టెలికాస్ట్ చేసింది. ఇక ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ.. ‘పాప్ వేషధారణ, హెయిర్స్టైల్, ప్రవర్తన.. ప్రతీది ఉత్తర కొరియా సంస్కృతిని నాశనం చేస్తున్నవే’ అని కిమ్ వ్యాఖ్యానించినట్లు ది న్యూయార్క్ టైమ్స్ కూడా ఓ స్టోరీ ప్రచురించింది. ఎందుకీ మార్పు? ఒకప్పుడు కొరియన్ పాప్ కల్చర్ను కిమ్ కూడా ఆస్వాదించిన వాడే. 2018లో దక్షిణ కొరియాకు చెందిన రెడ్ వెల్వెట్, చో యాంగ్ పిల్ పాప్ బ్యాండ్లను పిలిపించుకుని తన రాజధాని ప్యోంగ్యాంగ్లో ప్రదర్శలు ఇప్పించుకున్నాడు. డెబ్భై ఏళ్ల కిమ్ ఫ్యామిలీ పాలనలో.. ఇలాంటి వేడుకలకు హాజరైన తొలి వ్యక్తి కూడా ఈ నియంతాధ్యక్షుడే. అయితే గత కొంతకాలంగా కొరియన్ కల్చర్ వల్ల అక్కడి యువతలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో యూత్ మీద పట్టును కోల్పోతాడేమో అనే ఉద్దేశంతోనే కిమ్ ఈ నిర్ణయానికి వచ్చి ఉంటాడని, అదే టైంలో కొరియన్ పాప్ మార్కెట్ను దెబ్బతీయొచ్చనే ఆలోచనలో ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. జుట్టు నుంచి మొదలు.. ఉత్తర కొరియాలో ఈమధ్య కొన్ని కొత్త చట్టాలకు అధికారిక ముద్ర వేశాడు కిమ్. వీటి ప్రకారం.. దేశంలో ఎవరూ జుట్టుకు రంగు వేయకూడదు. అంతేకాదు 215 రకాల హెయిర్ స్టైల్స్తో ఒక లిస్ట్ తయారు చేసి.. వాటిని మాత్రమే అనుసరించాలని ప్రజలకు సూచించారు. స్పైక్, ముల్లెట్ హెయిర్స్టైల్స్పై సంఘ వ్యతిరేక ముద్ర వేసి నిషేధించాడు. టైట్ జీన్స్, ప్రింటెడ్ టీషర్టులు వేయడం నిషేధం. ఒకవేళ టీ షర్టులు వేసినా వాటి మీద స్లోగన్లు ఉండకూదు. ముక్కు-పెదాలు కుట్టించుకోవడానికి వీల్లేదు. సౌత్ కొరియా సినిమాలు, సంగీతం, వీడియోలు.. బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శిస్తే కఠినంగా శిక్షిస్తారు. మరణశిక్షకు మార్పు నార్త్ కొరియాలో యాంటీ కె(కొరియా)పాప్ ఉద్యమానికి బీజం పోయినేడాది డిసెంబర్లోనే బీజం పడింది. ఆ టైంలో కిమ్ జోంగ్ ఉన్ ఓకొత్త చట్టం చేశాడు. దాని ప్రకారం.. దక్షిణ కొరియా సినిమాలు, వీడియోలు చూసినా, పాటలు విన్నా సరే (అది రహస్యంగా అయినా).. వాళ్లకు 15 ఏళ్లు కఠిన కారాగార శిక్ష అమలు చేస్తున్నారు. ఒకవేళ చిన్నపిల్లలు ఈ నేరానికి పాల్పడితే.. వాళ్ల తల్లిదండ్రులకు ఆ శిక్ష అమలు చేస్తారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో పదిహేనేళ్ల శిక్షను.. మరణ శిక్షగా మార్చాలనే ఆలోచనలో కిమ్ ఉన్నాడన్న విషయం డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా పార్టీ పత్రాల లీకేజీ వ్యవహారంతో వెలుగులోకి వచ్చింది. కొసమెరుపు: కొరియన్ పాప్ కల్చర్ కంటెంట్ ఉత్తర కొరియా ప్రజలకు నేరుగా చేరేది 30 శాతం మాత్రమే. అది కూడా ఉత్తర కొరియాలోనే కొందరు స్మగ్లర్లు వాటిని ప్రజలకు చేరవేస్తుంటారు. ఇక చైనా నుంచి ఫ్లాష్ లింకుల ద్వారా ఈ అక్రమ వ్యాపారం భారీ లెవల్లో జరుగుతుండడం విశేషం. చదవండి: కిమ్ పాలనలో ఆకలి రోదనలు -
తెరుచుకోనున్న మ్యూజియాలు
న్యూఢిల్లీ: వీక్ ఎండ్ వస్తే చాలు జనాలు సినిమాలకు, జూపార్కలకు, మ్యూజియంకి వెళ్లేవారు. ముఖ్యంగా పురాతన వస్తువులను చూడటానికి పిల్లలు ఎక్కువ ఆసక్తి చూపేవారు. అలాంటిది కోవిడ్-19 కారణంగా గత కొన్ని నెలలుగా ఇళ్లకే పరితమైపోయారు. మ్యూజియంలలో పురాతణ వస్తువులను చూసి ఆనందించాలనుకునే వారు ఎప్పుడు ఇవి తిరిగి ప్రారంభం అవుతాయా అని ఆశగా ఎదురుచూస్తునన్నారు, అలాంటి వారికి కేంద్రం ప్రభుత్వం శుభవార్తచెప్పింది. ఈ నెల 10వ తేదీ నుంచి మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు, ఎగ్జిబిషన్లను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుతిచ్చింది. కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించడానికి గురువారం ప్రామాణిక మార్గదర్శకాలను జారీ చేసింది. నవంబర్ 10 నుంచి కేంద్ర సాస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు, ఎగ్జిబిషన్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రం, నగర, స్థానిక చట్టాల నియమ నిబంధనలను అనుసరించి మిగతా వారు కూడా వీటిని పునః ప్రారంభించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వీటిని సందర్శించడానికి వచ్చేవారు తప్పనిసరిగా మాస్క ధరించి రావాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ప్రవేశ ద్వారం దగ్గర ముందుగా టెంపరేచర్ చెక్ చేసి, శానిటైజ్ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తారు. కరోనా విజుృంభిచడంతో కేంద్రం మార్చి నుంచి లాక్డౌన్ విధించింది. ఈ కారణంగా అన్నింటితో పాటు మ్యూజియంలు కూడా మూత పడ్డాయి. ఏడు నెలల తర్వాత వీటిని తిరిగి ప్రారంభించే అవకాశం దక్కింది. -
ప్రోత్సహిస్తూ.. పోరాడుతూ.. మున్ముందుకు..
అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఆవిర్భవించిన సందర్భానికి ఒక బలమైన సాహిత్య నేపథ్యం ఉంది. ఆ నేపథ్యానికి ఆధునిక తాత్విక పునాది ఉంది. నూతన ప్రాపంచ దృక్పథం ఉంది. అందువల్లనే అరసం అనేక విజయాలు సాధించగలిగింది. ప్రజల పక్షాన, ప్రజాకంటక పాలకులను ప్రశ్నించే పక్షాన గళమెత్తుతోంది. ప్రశ్నించే శక్తుల్ని ప్రోత్సహిస్తోంది. స్వయంగా నిలదీస్తోంది. 82 ఏళ్ళనాటి మాట. ‘‘గత సాహితి ఆవేశం ఉన్మాదం లాంటిది. ఫలితం మాత్రం ఇంకొకరిది. కాని మన సాహిత్య ఉద్దేశం వేరు. మన గీటురాయి మీద సాహిత్యానికి మెరుగుపెట్టాలి. ఉన్నత భావాలు, స్వతంత్ర ఆలోచనలు, సౌందర్యారాధన, ఆత్మవికాసం జీవిత యదార్థ ఘటనలు, అందులో ఉంటాయి. అవే మనలో ఉత్తేజాన్ని సంఘర్షణల్ని, ఆదర్శాల్ని సృష్టిస్తాయి. అవి నిద్రపుచ్చడానికి ప్రయత్నించకూడదు. అధిక నిద్ర మృత్యువుతో సమానం కదా?’’ మనుషులపట్ల ప్రేమ, జాతి పట్ల బాధ్యత, రచనల్లో నిబద్ధత ఉన్న ఒక మహా రచయిత సమకాలీన రచయితలకు చేసిన కర్తవ్య బోధ ఇది. సర్వకాలాలకూ వర్తించే అక్షర సత్యాలు ఇవి. 1936 ఏప్రిల్ 9, 10 తేదీల్లో లక్నోలో ఒక మహా సభ జరిగింది. ప్రగతి లేఖక్ సంఘ్ (అభ్యుదయ రచయితల సంఘం) తొలి మహాసభ అది. ఆ సభకు అధ్యక్షులు సుప్రసిద్ధ హిందీ రచయిత ప్రేమ్చంద్. ఆ అధ్యక్ష ప్రసంగంలోని అంశాలే పైన పేర్కొన్నవి. యుద్ధోన్మాదానికి, ఫాసిజానికీ వ్యతిరేకంగా అంతర్జాతీయంగా ఏర్పడిన ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్తో అరసం సంబంధాలు పెట్టుకుంది. అవే అంశాలపై పనిచేస్తున్న కమ్యూనిస్టులు ఈ రచయితల సంఘానికి మద్దతుగా నిలిచారు. దాని ప్రభావం తెలుగు నాటకూడా పడింది. అప్పటికే శ్రీశ్రీ మరోప్రపంచపు మహాప్రస్థాన సింహ గర్జనలు ప్రారంభం అయ్యాయి. సంప్రదాయ సాహిత్య సంకెళ్ళు, భావకవిత్వ పరిష్వంగనలను జగన్నాథ రథచక్రాలు పటాపంచలు చేశాయి, చెల్లాచెదురు చేశాయి. అంతకు ముందు వీరేశలింగం, గిడుగు, గురజాడల సంఘసంస్కరణ ఉద్యమం, వాడుకభాషా ఉద్యమం, ఆధునిక సాహిత్య ఉద్యమాలు నూతన ఆలోచనాధోరణులకు బాటలు వేశాయి. ఆంధ్రలో అభ్యుదయ సాహిత్యం పురుడుపోసుకోవడానికి అవి దోహదపడ్డాయి. అభ్యుదయ సాహిత్యం సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలన్నింటినీ ప్రభావితం చేసింది. ఉద్యమ రూపం ధరించింది. ‘‘ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం’’గా సంస్థాగత రూపం తీసుకొంది. 1943 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో గుంటూరు జిల్లా తెనాలిలో ప్రథమ మహాసభలు జరిగాయి. ఉపన్యాసాలకే పరిమితం కాకుండా అరసం కార్మికవర్గ అస్తిత్వాన్ని బలంగా ఆవిష్కరించింది. అణగారిన వర్గాల వాణి అయింది. స్వాతంత్య్రోద్యమంలోనే గాక జమీందారీ వ్యతిరేక పోరాటాలకు, నిజాం నిరంకుశ పాలనకు, వ్యతిరేకంగా జరిగిన రైతాంగ సాయుధ పోరాటాలకు ఉద్యమ గేయం అయింది. నిషేధాలు నిర్బంధాలకు గురైంది. తిరగబడింది. తిప్పికొట్టింది. బలహీనపడింది. తిరిగి నిలదొక్కుకుంది. ఇది 75 ఏళ్ల ‘‘అరసం ఘనమైన గతం’’. ఆత్మగౌరవాన్ని పిడికిలెత్తి చాటుకుంటున్న వారి సొంత గొంతుకలే అస్తిత్వవాదాలు అయ్యాయి. స్త్రీవాదం, దళితవాదం వంటి ఉద్యమాల పరిణామాన్ని అరసం నిండుమనస్సుతో ఆహ్వానించింది. తొలినాళ్లలో అందర్నీ తోసిరాజన్న అస్తిత్వవాదులు అభ్యుదయ రచయితలు తమ సహజ మిత్రులని విశ్వసిస్తున్నారు. ప్రజాస్వామ్యం ముసుగులో భావప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టేందుకు ఐక్యఉద్యమాల అనివార్యతను అంగీకరిస్తున్నారు. అందుకోసం సోదర సాహితీ సంస్థలకు అరసం స్నేహ హస్తాన్ని అందిస్తోంది. తిరిగి మరో బలమైన సాహిత్య సాంస్కృతిక ఉద్యమ అవసరాన్ని ఎలుగెత్తి చాటుతోంది. ఒక దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం 18వ రాష్ట్ర మహాసభలు గుంటూరులో డిసెంబర్ 8, 9 తేదీలలో జరగనున్నాయి. ఆ వేదిక నుండే వజ్రోత్సవాలు జరుగుతాయి. ఇవి కేవలం ‘అరసం’ మహాసభలే కాదు, తెలుగువారి సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలు. కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ వ్యాసకర్త, సీనియర్ పాత్రికేయుడు మొబైల్ : 94911 28554 -
నృత్యాంజలి సేవలు ప్రశంసనీయం
కాకినాడ కల్చరల్ : నాట్యరంగానికి నృత్యాంజలి కళానిలయం చేస్తున్న సేవలు ప్రశంసనీయమని జయలక్ష్మి కో- ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ రాయవరపు సీతారామాంజనేయులు అన్నారు. స్థానిక సూర్యకళామందిర్లో నృత్యాంజలి కళానిలయం ఆధ్వర్యంలో ‘పద ఝురి–2017’ నాట్య కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముందుగా నటరాజ విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి శాస్త్రీయ, జానపద నాట్య పోటీల్లో విద్యాంజలి నికేతన్ (కాకినాడ), లలిత కళానికేతన్ ( అన్నవరం), మంజీర నృత్యాలయం(కాకినాడ), భగవత్ నృత్యాలయం (విజయనగరం) వారే కాకుండా పలువురు పాల్గొన్నారు. టి. సౌమ్య, బి.వాణిశ్రీ, నటరాజ రామకృష్ణ న్యాయ నిర్ణేతలుగా వ్యహరించారు. తదుపరి నాట్యాచార్యులు డాక్టర్ కృష్ణకుమార్, డాక్టర్ పసుమర్తి శ్రీనివాసశర్మ, డాక్టర్ వేదాంతం వెంకట దుర్గా భవానిలను ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సభలో నృత్యాంజలి కళానిలయం వ్యవస్థాపకుడు హరి లోకేష్ శర్మ మాట్లాడుతూ నాట్య రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తమవంతు కృషి చేస్తున్నామన్నారు. నర్తకీమణులు వి.మోహన్ సత్య, రమణ కుమారి, మధుస్మిత, శర్వాణి, సౌమ్యలకు ‘నృత్యవతంస’ పురస్కారాలను అందజేశారు. నాట్యాచార్య వీఎన్ వరప్రసాద్, శ్రీరామ్ భగవ్ గురుస్వామి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే కూచిపూడి నృత్యం : సబ్ జూనియర్స్ విభాగం ఎన్.నికిత (ప్రథమ), దీపిక (ద్వితీయ). జూనియర్స్ విభాగం ఆరది (ప్రథమ), వర్షిత (ద్వితీయ). సీనియర్స్ విభాగం జి. మేఘన (ప్రథమ), వి.శ్రీను (ద్వితీయ) స్థానాల్లో నిలిచారు. భరత నాట్యం : సబ్ జూనియర్స్ విభాగంలో డి. దివ్య హాసిని (ప్రథమ), గాయిత్రి ఆశ్రిత (ద్వితీయ), జూనియర్స్ విభాగంలో కె. సంజన (ప్రథమ), నాగశ్రీ (ద్వితీయ), సీనియర్స్ విభాగంలో పి.ప్రసజ్ఞ (ప్రథమ), సిరిజా రెడ్డి (ద్వితీయ) బహుమతులు గెలుచుకున్నారు. జానపద నృత్యం : సబ్ జూనియర్స్ విభాగంలో కె.సంస్కృతి (ప్రథమ), వినీల (ద్వితీయ), జూనియర్స్ విభాగంలో జ్ఞాపిక (ప్రథమ), సీనియర్స్ విభాగంలో భ్రమరాంబిక (ప్రథమ) బహుమతులు పొందారు. శాస్త్రీయ నృత్యం : గ్రూపు విభాగం రోషిని గ్రూపు (ప్రథమ), అన్నవరం గ్రూపు (ద్వితీయ) బహుమతులు గెలుచుకున్నారు. జానపద నృత్యం : గ్రూపు విభాగంలో మౌనిక గ్రూపు ప్రథమ బహుమతి, అక్షయ గ్రూపు ద్వితీయ బహుమతి పొందారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. -
సమాజ హితంకోరేదే సాహిత్యం
విజయవాడ కల్చరల్ : సమాజ హితంకోరేది సాహిత్యమని రాష్ట్ర శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ వివరించారు. అనంతపురానికి చెందిన విమలా శాంతి సాహిత్య సాంఘిక సాంస్కృతిక సేవాసమితి దుర్గాపురంలోని ఘంటసాల వేంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో విమలశాంతి సాహిత్య పురస్కార ప్రదానోత్సవ సభను బుధవారం నిర్వహించింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మండలి మాట్లాడుతూ కవి క్రాంతి దర్శిని, సమాజంలో నిత్యం జరుగుతున్న మార్పులను çగమనించాలన్నారు. కవి సమాజంలో వాస్తవ జీవితాన్ని తమ సాహిత్యంలో ప్రతిబింబించాలన్నారు. అనంతపురం జిల్లా భౌతికంగా వెనుకపడినా శాంతినారాయణ లాంటి సాహితీవేత్తలవల్ల మిగితా ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కవులు నోట్లరద్దు అంశంగా తమ కలాలకు పదను పెడుతున్నారని వివరించారు. పురస్కారాల నిర్వాహకులు విమలా శాంతి సాహిత్య సాంఘీక సాంస్కృతిక సేవా సమితి నిర్వాహకులు శాంతి నారాయణ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా శాంతి రజనీకాంత్ స్మారక కవితా పురస్కారలను కథ, కవిత అంశంగా విశేషకృషి చేసిన వారికి పురస్కారాలు అందిస్తున్నామన్నారు. 2016 సంవత్సరానికి గానూ డాక్టర్ ప్రసాదమూర్తి రచించిన పూలండోయ్పూలు, బాలసుధాకర్ రచించిన ఎగరాల్సిన సమయం కవితా సంపుటులకు పురస్కారం అందిస్తున్నామన్నారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ డీ.విజయభాస్కర్ మాట్లాడుతూ కళాకారులు, కవులు, ప్రాచీన కళలలు అభివృద్ధిచేయటానికి సాంస్కృతిక శాఖ కృషిచేస్తుందని వివరించారు, కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ప్రసాదమూర్తి బాలసుధాకర్ మౌళీలకు పురస్కారాలను అందించారు. కవితా సంపుటిల పరిచయాన్ని ఆచార్య రాచపాలెం చంద్రశేఖర రెడ్డి, జీ.లక్ష్మీ నరసయ్యలు చేశారు, కార్యక్రమంలో ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు మంజులూరి కృష్ణమూర్తి,ప్రజాసాహితి సంపాదకులు కొత్తపల్లి రవిబాబు,కవులు మందారపు హైమావతి,లబండ్ల మాధవరావు తదితరులు ప్రసంగించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా మద్దాలి సాయిచంద్రిక పలుకూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించింది. -
యువజనోత్సహం
ఆకట్టుకున్న సాంస్కృతిక పోటీలు కర్నూలు(హాస్పిటల్): జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సి.క్యాంపులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు ఆహుతులను ఉర్రూతలూగించాయి. డివిజనల్ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారితో ఈ పోటీలు నిర్వహించారు. పోటీలను లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య ప్రారంభించారు. అనంతరం ఇటీవలే మరణించిన గాయకులు మంగళం పల్లి బాల మురళీకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పత్తి ఓబులయ్య మాట్లాడుతూ జిల్లా స్థాయి విజేతలు ప్రావీణ్యతను ఇంకా మెరుగుపరచుకోవాలని సూచించారు. ఇందుకుగాను తమ సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పోటీల అనంతరం సాయంత్రం బహుమతుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సెట్కూరు సీఈఓ మస్తాన్వలి, మేనేజర్ పీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన వారు కూచిపూడి నృత్యం 1. ఎస్. మానస, 2, అర్చన, 3. శాంభవి జానపద నృత్యం 1. లక్ష్మి, అనూష గ్రూప్, 2. స్వప్న, జితేష్ గ్రూప్ భరతనాట్యం 1. రాధ వక్తృత్వ పోటీలు 1. సుస్మితారెడ్డి సంప్రదాయ సంగీతం(హిందుస్తానీ) 1. కె. యశ్వంతి, 2. ఎన్. మునివన్నూరమ్మ కర్ణాటక సంగీతం 1.జీఎం చంద్ర లిఖిత క్లాసికల్ ఇన్స్టుమెంట్స్ 1. ఎం. ముని సాయిరామ్(డోలి), 1. ఎం. తిరుమల(తబల), 2. బి. జి. నాగవీణకుమార్(తబల), 1. ఎం. డోనాల్డ్ డిక్(గిటార్), 1. వై. వెంకటేష్ బాబు(వీణ), 1. అశ్వత్ కుమార్(హార్మోనియం) ఫోక్ సాంగ్ గ్రూప్ 1. రాజ్కుమార్ అండ్ గ్రూప్, ప్రభుత్వ శారద సంగీత కళాశాల, కర్నూలు ఏకపాత్రభినయం 1. సుశాంత్ ఫిలిప్స్ అండ్ గ్రూప్, సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాల, కర్నూలు. -
అందరికి పర్యాటకం..
– అదే ఈ ఏడాది మన నినాదం – ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో వక్తలు – ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సంరక్షించుకోవడం అందరి బాధ్యతని కేంద్ర పురావస్తుశాఖ కర్నూలు రీజియన్ పరిరక్షకులు కృష్ణచైతన్య అన్నారు. మంగళవారం ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు నగరంలోని లలిత కళాసమితిలో ఘనంగా జరిగాయి. ఏకో టూరిజం, అగ్రీ టూరిజం, హెల్త్ టూరిజం, కల్చరల్ టూరిజం, టెంపుల్ టూరిజం అవకాశాలను, విశిష్టతలను ఈ సందర్భంగా వ్యక్తలు వివరించారు. ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ... ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురష్కరించుకొని ఈ ఏడాది నినాదం అందరికీ పర్యాటకం పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు వివరించారు. జిల్లా పర్యాటక సంస్థ డీవీఎం సుదర్శన్రావు మాట్లాడుతూ...రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పర్యాటక ప్రాంతాలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందని వివరించారు. జిల్లా పర్యాటక అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు పంపుతున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఉస్మానియా, కేవీఆర్, టౌన్ మోడల్, హజీర కళాశాలల విద్యార్థులకు పోస్టర్ పెయింటింగ్, క్విజ్ పోటీలు, పేపర్ ప్రజెంటేషన్, ఫొటోగ్రఫీ వంటి వాటిపై పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు కిష్టన్న, నగర ప్రముఖులు చంద్రశేఖర్ కల్కూర, మద్దయ్య, రచయిత సంఘం నేత వేణుగోపాల్ రావు, ప్రోగ్రామ్ కో ఆర్డీనేటర్ ఆదిశేషులు తదితరులు పాల్గొన్నారు. -
జానపద జాతర
-
జానపద జాతర
-
ఇస్కాన్ పోటీలకు స్పందన
సాగర్నగర్ శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను పురస్కరించుకొని ఇస్కాన్ విశాఖనగర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఇస్కాన్ సాగర్నగర్ ప్రాంగణంలో విద్యార్థులకు నిర్వహించిన సాంస్కృతిక పోటీలకు విశేష స్పందన లభించింది. ఇస్కాన్ మాతాజీ నితాయి సేవిని పర్యవేక్షిణలో నిర్వహించిన పోటీల్లో నగర నలుమూలల నుంచి విచ్చేసిన ఆయా పాఠశాల విద్యార్థునీ, విద్యార్థులు ఎంతో ఉత్సహంతో పాల్గొన్నారు. ఈ పోటీలను ఇస్కాన్ నగరశాఖ అధ్యక్షుడు సాంబాదాస్ ప్రభుజీ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1999 నుంచి విశాఖలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను క్రమం తప్పకుండా ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఏటా నగర పాఠశాల విద్యార్థులను వివిధ కళారంగాల్లో ప్రోత్సహించేందుకు పెయింటింగ్, సాంస్కృతిక,నృత్యకార్యక్రమాలు, వ్యాసరచన పోటీలు, ఇతర సామాజిక అంశాలపై పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు ప్రొత్సాహకాలతోపాటు బహుమతులు అందజేస్తున్నట్టు తెలిపారు. ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన పోటీల్లో కృష్ణా టెస్ట్కు 1200మంది విద్యార్థులు, పాట్మేకింగ్ 1370మంది, వ్యాసరచన పోటీలకు 560మంది, పోస్టర్ మేకింగ్ 450, పెన్సిల్ స్కెటింగ్కు 350మంది, గీతా శ్లోక పోటీలకు 540మంది విద్యార్థులు, చిత్రలేఖనంలోను కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పోటీల్లో నెగ్గిన విజేతలకు ఈనెల 25న ఇస్కాన్ హారేకష్ణ ప్రాంగణంలో కృష్ణాష్టమి రోజున ప్రముఖల ద్వారా బహుమతులు, ప్రశంసపత్రాలను అందజేయడం జరగుతోందన్నారు. -
భళారే జానపదం
ఏలూరు(ఆర్ఆర్పేట) : ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, రూపకాలు ఆహూతులను అలరించాయి. జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఏలూరు వైఎంహెచ్ఏ హాలులో జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు అనంతపురానికి చెందిన కళాకారులు తరలి వచ్చి తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. ప్రేక్షకుల చేత భళారే అనిపించారు. కృష్ణాజిల్లా శ్రీకాకుళానికి చెందిన కళాకారులు, నగరానికి చెందిన నాట్యాచార్యులు డి.హేమసుందర్, గండికోట రాజేష్ శిష్య బృందం ప్రదర్శించిన నృత్యాలు అబ్బురపరిచాయి. తాడేపల్లి గూడెం, జంగారెడ్డిగూడెంలకు చెందిన కళాకారులు ఇచ్చిన బుర్రకథ, కోలాటం, పల్లెసుద్దులు ప్రదర్శనలు ప్రేక్షకుల కరతాళధ్వనులు అందుకున్నాయి. దూబచర్లకు చెందిన కళాకారులు ప్రదర్శించిన కంజరి కథ, తాడేపల్లిగూడెంకు చెందిన కళాకారుల బుడబుక్కల వేషధారణల ప్రదర్శన అద్భుతంగా సాగాయి. పాలకొల్లుకు చెందిన కళాకారుల గరగాట ప్రదర్శన అలరించింది. అనంతరం కళాకారులను జిల్లా జానపద కళాకారుల సంఘం సత్కరించింది. కార్యక్రమంలో జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాడు అప్పలనాయుడు, జిల్లా గౌరవాధ్యక్షుడు బుద్ధాల వెంకట రామారావు, జిల్లా అధ్యక్షుడు దువ్వి రామారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి డి.హేమ సుందర్, ప్రముఖ శిల్పి దేవికా రాణి ఉడయార్, చప్పిడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
భళారే జానపదం
ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, రూపకాలు ఆహూతులను అలరించాయి. జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఏలూరు వైఎంహెచ్ఏ హాలులో జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు అనంతపురానికి చెందిన కళాకారులు తరలి వచ్చి తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. ప్రేక్షకుల చేత భళారే అనిపించారు. కృష్ణాజిల్లా శ్రీకాకుళానికి చెందిన కళాకారులు, నగరానికి చెందిన నాట్యాచార్యులు డి.హేమసుందర్, గండికోట రాజేష్ శిష్య బృందం ప్రదర్శించిన నృత్యాలు అబ్బురపరిచాయి. తాడేపల్లి గూడెం, జంగారెడ్డిగూడెంలకు చెందిన కళాకారులు ఇచ్చిన బుర్రకథ, కోలాటం, పల్లెసుద్దులు ప్రదర్శనలు ప్రేక్షకుల కరతాళధ్వనులు అందుకున్నాయి. దూబచర్లకు చెందిన కళాకారులు ప్రదర్శించిన కంజరి కథ, తాడేపల్లిగూడెంకు చెందిన కళాకారుల బుడబుక్కల వేషధారణల ప్రదర్శన అద్భుతంగా సాగాయి. పాలకొల్లుకు చెందిన కళాకారుల గరగాట ప్రదర్శన అలరించింది. అనంతరం కళాకారులను జిల్లా జానపద కళాకారుల సంఘం సత్కరించింది. కార్యక్రమంలో జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాడు అప్పలనాయుడు, జిల్లా గౌరవాధ్యక్షుడు బుద్ధాల వెంకట రామారావు, జిల్లా అధ్యక్షుడు దువ్వి రామారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి డి.హేమ సుందర్, ప్రముఖ శిల్పి దేవికా రాణి ఉడయార్, చప్పిడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. – ఏలూరు(ఆర్ఆర్పేట) -
21న సాహిత్య అకాడమీ సదస్సు
విశాఖ–కల్చరల్ : సాహిత్య అకాడమీ, మొజాయిక్ సాహిత్య సంస్థ సంయుక్త నిర్వహణలో ఈనెల 21న ‘తెలుగు సాహిత్యం అనువాదం, ధోరణలు–నైపుణ్యాలు’ అంశంపై సదస్సు ఏర్పాటు చేసినట్లు ప్రముఖ కవి, సాహిత్య విమర్శకుడు రామతీర్థ తెలిపారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ఆ రోజు ఉదయం పది గంటల నుంచి జరిగే ఈ సదస్సుకు సాహితీప్రియులంతా ఆహ్వానితులేనని పేర్కొన్నారు. సాహిత్య అకాడమీ ప్రాంతీయ కార్యదర్శి ఎస్.పి.మహాలింగేశ్వర్, దక్షిణ ప్రాంతీయ కార్యదర్శి డాక్టర్ ఎన్.గోపి, ప్రముఖ తెలుగు రచయిత, అనువాదకులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొంటారని చెప్పారు. బహుభాషా కోవిదుడు ఎల్.ఆర్.స్వామి కీలక ఉపన్యసాన్ని అందిస్తారని పేర్కొన్నారు. ఉదయం డాక్టర్ ఏ.శేషారత్నం(హిందీ) అధ్యక్షతన మహీధర్రాశాస్త్రి(ఒడియా), అబ్దుల్ వాహేద్(ఉర్దూ) అనువాదాలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం కవియిత్రి జగద్ధాత్రి(తెలుగు నుంచి ఇంగ్లిష్) అధ్యక్షతన రామతీర్థ(బెంగాలీ), శాఖమూరు రాంగోపాల్(కన్నడ), మాటూరి శ్రీనివాస్(ఇంగ్లిష్ నుంచి తెలుగు) అనువాదాల పత్ర సమర్పణలు చేస్తారని తెలిపారు. డాక్టర్ చాగంటి తులసి ప్రసంగం అనంతరం చింతకింద శ్రీనివాసరావు కథపై చర్చాగోష్టి ఉంటుందన్నారు. -
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
నల్లగొండ కల్చరల్/నల్లగొండ రూరల్ : స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముందుగా సెయింట్ ఆల్ఫోన్సిస్ హైస్కూల్కు చెందిన 400 మంది విద్యార్థులు భారతదేశంలోని అన్ని రంగాల అభివృద్ధి, సంస్కృతి, సంప్రదాయాలను తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాలను తెలిపేలా నృత్యాన్ని ప్రదర్శించారు. నల్లగొండ కేంద్రీయ పాఠశాల విద్యార్థులు కృష్ణా పుష్కర కథ, ఇతర నదుల పుష్కరాల వివరాల రూపకాన్ని, నారాయణ హైస్కూల్ విద్యార్థులు స్వచ్ఛభారత్, మిషన్ కాకతీయ అంశాలను, ఎస్ఎస్ హైస్కూల్ ఆఫ్ లెర్నింగ్ విద్యార్థులు హరితహారం, మిషన్ కాకతీయ అంశాలపై రూపొందించిన పాటలకు నృత్యాలను ప్రదర్శించారు. చివరగా శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు తెలంగాణ పండుగలైన బతుకమ్మ, బోనాలపై ప్రదర్శన ఇచ్చారు. పటిష్ట బందోబస్తు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తిలకించేందుకు పోలీస్ పరేడ్ గ్రౌండ్లోకి వచ్చిపోయే వారిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రధాన ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్స్ను ఏర్పాటు చేశారు. మంత్రి జగదీశ్రెడ్డి, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ ప్రకాశ్రెడ్డిలు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనలను తిలకించారు. -
ఏయూలో నేటి నుంచి సాంస్కృతిక పోటీలు
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో బుధవారం నుంచి రెండు రోజులపాటు సాంస్కృతిక పోటీలను నిర్వహిస్తున్నట్లు విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య పి.హరి ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు.10వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఏయూ కామర్స్ మేనేజ్మెంట్ విభాగంలో వక్తృత్వం, వాదం–ప్రతివాదం పోటీలను, ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో లలిత సంగీతం, బృందగాన పోటీలు, 11వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి ఏయూ అసెంబ్లీ మందిరంలో శాస్త్రీయ, బృంద నృత్యాలు, మూకాభినయం పోటీలు నిర్వహిస్తారు. ఇప్పటికే తమ పేర్లు నమోదు చేసుకున్నవారు నిర్ణీత తేదీలలో పోటీలకు హాజరుకావాలన్నారు. కృష్ణా పుష్కరాలు, స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. -
ఏయూలో నేటి నుంచి సాంస్కృతిక పోటీలు
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో బుధవారం నుంచి రెండు రోజులపాటు సాంస్కృతిక పోటీలను నిర్వహిస్తున్నట్లు విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య పి.హరి ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు.10వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఏయూ కామర్స్ మేనేజ్మెంట్ విభాగంలో వక్తృత్వం, వాదం–ప్రతివాదం పోటీలను, ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో లలిత సంగీతం, బృందగాన పోటీలు, 11వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి ఏయూ అసెంబ్లీ మందిరంలో శాస్త్రీయ, బృంద నృత్యాలు, మూకాభినయం పోటీలు నిర్వహిస్తారు. ఇప్పటికే తమ పేర్లు నమోదు చేసుకున్నవారు నిర్ణీత తేదీలలో పోటీలకు హాజరుకావాలన్నారు. కృష్ణా పుష్కరాలు, స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. -
మండే భాస్వరం!
టోగో పశ్చిమ ఆఫ్రికాలోని చిన్న దేశం టోగో. ‘టోగో’ అంటే ఎవ్ భాషలో ‘నీటి మీద ఉన్న ఇల్లు’ అని అర్థం. ఈ దేశానికి పశ్చిమాన ఘనా, తూర్పులో బెనిన్, ఉత్తరాన బర్కిన ఫాసో దేశాలు ఉన్నాయి. పదకొండు, పదహారవ శతాబ్దాల మధ్యలో రకరకాల తెగల ప్రజలు టోగో భూభాగంలోకి ప్రవేశించారు. 18వ శతాబ్దంలో బానిసల కొనుగోలు వ్యాపారానికి టోగో అతి పెద్ద వ్యాపార కేంద్రంగా ఉండేది. 1884లో టోగోల్యాండ్ను తన అధీనంలోకి తెచ్చుకుంది జర్మనీ. ఎన్నో తెగల ప్రజలు నివసించే టోగోలో జనాభా పరంగా ‘ఎవ్’ తెగ ఆధిక్యత ఎక్కువ. దేశంలో 70 శాతం మందికి వ్యవసాయమే ప్రధాన ఆధారం. జర్మనీ అధీనంలో ఉన్న టోగోల్యాండ్ ను ఫ్రెంచ్, బ్రిటిష్ దళాలు 1914లో ఆక్రమించుకున్నాయి. మూడింట ఒక వంతు బ్రిటిష్ వారి అధీనంలో, రెండు వంతులు ఫ్రాన్సు అధీనంలో ఉండిపోయింది టోగోల్యాండ్. ఫ్రాన్సు నుంచి 1960లో స్వాతంత్య్రం పొందింది టోగోల్యాండ్. పరిపాలన పరంగా టోగోను 5 విభాగాలుగా విభజించారు. 1. సవనెస్ 2. కర 3. సెంట్రల్ 4. ప్లెటక్స్ 5. మారిటైమ్. ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందిన టోగోల్యాండ్కు తొలి అధ్యక్షుడు సిల్వెనస్ ఒలింపియో. 1963లో జరిగిన సైనిక తిరుగుబాటులో సిల్వెనస్ హత్యకు గురయ్యాడు. సాయుధ దళాల నాయకుడిగా గాసింబే అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో దేశంలో నియంతృత్వ పాలన మొదలైంది. రాజకీయ పార్టీలన్నీ నిషేధించబడ్డాయి. మూడు దశాబ్దాలకు పైగా తన నియంతృత్వంతో టోగోను పాలించాడు గాసింబే. ఈ నియంత మరణించిన తరువాత కొడుకు ఫారే గాసింబే దేశ అధ్యక్ష పదవిని చేపట్టాడు. రాజకీయ పార్టీల మీద ఉన్న నిషేధాన్ని తొలగించడం, ప్రజాస్వామ్య అనుకూల రాజ్యాంగాన్ని ఆమోదించడంలాంటి చర్యలు చేపట్టినా... దేశంలో నియంతృత్వం మాత్రం పోలేదు. మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో టోగో నియంతృత్వ పాలకులపై అంతర్జాతీయంగా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీలతో టోగోకు బలమైన చారిత్రక, సాంస్కృతిక బంధాలు ఉన్నాయి. సాంస్కృతిక, చారిత్రక విలువల మాట ఎలా ఉన్నా... రాజకీయ అశాంతి కారణంగా అభివృద్ధికి దూరంగా జరిగి... ఆఫ్రికాలోని ఒక పేదదేశంగా మాత్రమే ఉండిపోయింది టోగో. టాప్ 10 1. టోగోలో ఎన్నో చిన్న సరస్సులు ఉన్నాయి. వీటిలో పెద్ద సరస్సు పేరు టోగో. 2. జాతీయ జెండాలోని పచ్చటి భాగాలు ఆశ, వ్యవసాయానికి ప్రతీకలు. 3. {ఫెంచ్ అధీనంలోని ‘టోగోల్యాండ్’ 1960లో ‘టోగో’గా మారింది. 4. దేశం నుంచి ఎగుమతి అయ్యే ప్రధాన ఉత్పత్తులు ఫాస్ఫేట్, కోకో, పత్తి. 5. రాజధాని లోమ్లో పెద్ద వూడూ మార్కెట్ ఉంది. 6. ఫాస్ఫేట్ ఉత్పత్తిలో టోగో ప్రపంచంలో నాలుగవ స్థానంలో ఉంది. 7. దేశంలో ప్రసిద్ధ ఆట ఫుట్బాల్. 8. యునెటైడ్ నేషన్స్, ఆఫ్రికన్ యూనియన్. ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికా... మొదలైన వాటిలో టోగోకు సభ్యత్వం ఉంది. 9. అధికార భాష ఫ్రెంచ్తో పాటు ఎవ్, మిన, డగోంబ... మొదలైన ఆఫ్రికన్ భాషలు కూడా దేశంలో మాట్లాడతారు. 10. పశ్చిమ ఆఫ్రికాలోని ఇతర దేశాలతో పోల్చితే టోగో పర్యాటకరంగంలో ముందంజలో ఉంది. -
నాట్య సంబరం
-
‘కళ’ తప్పించారు
పుష్కర కల్చరల్ (కొవ్వూరు) : సంబరాలు జరుగుతుంటే వాటికి సాంస్కృతిక తళుకులు మరింత వన్నె తెస్తాయి. అలాంటి సాంస్కృతిక కళారూపాల జాడ కొవ్వూరు పట్టణంలో కనిపించడం లేదు. అసలు గోదావరి పుష్కరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఎందుకు అనుకున్నారో ఏమో ఈ విషయంలో చాలా చిన్న చూపు చూశారు. పట్టణానికి అనువుగా ఉండే ప్రాంతంలో కళారూపాలను ప్రదర్శించాలి. ఇలాంటి వాటి కోసం నిర్ధేశించిన ఒక స్థలాన్ని స్థానిక టీడీపీ నేత అనుయాయులకు అప్పగించడానికి ఊరికి దూరంగా పుష్కరనగర్ వద్ద ఒక వేదిక, ఇందిరమ్మ కాలనీ వద్ద మరో కళావేదిక ఏర్పాటు చేశారు. పుష్కర ఆరంభం నుంచి పుష్కరాల ముగింపు వరకు షెడ్యూల్లో 50 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు అట్టహాసంగా ప్రకటించారు. అయితే జరుగుతున్న కార్యక్రమాలకు ముందుగా షెడ్యూల్లో ప్రకటించిన వాటికి పొంతనే లేదు. జాతీయ, రాష్ట్రస్థాయిలో ప్రాచుర్యం పొందిన కళాకారుల కళారూపాలను ఏర్పాటు చేసినట్టు సాంస్కృతిక శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ స్థారుు అధికారి ముందుగా పేర్కొన్నారు. తీరా స్థానికంగా కొందరు కళాకారులతో కళారూపాలు ప్రదర్శిస్తూ మమ అనిపిస్తున్నారు. దీంతో ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న తీరును సంబంధిత అధికారి వద్ద ‘సాక్షి’ ప్రశ్నించగా నేను కో-ఆర్డినేటర్ను మాత్రమేనని అంతా ఉన్నతాధికారులే చూసుకుంటారని చెప్పారు. సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులు సదరు ఏడీ స్థాయి అధికారిని అడిగితే కార్యక్రమాల ఏర్పాట్లను మీరే చూసుకోవాలంటూ చెప్పారు. పుష్కరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలపై అధికారులకు ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి తెలుస్తోంది. అధికారులు ఇప్పుడైనా శ్రద్ధ చూపితే భక్తులు మంచి కళారూపాలు చూడగలుగుతారు. -
చిన్నారుల నృత్యాభిషేకం
-
రేపు బైరాన్పల్లికి సాంస్కృతిక సైన్యం శౌర్యయాత్ర
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా మద్దూరు మండలం బైరాన్పల్లి గ్రామానికి 14న(శనివారం) సాంస్కృతిక సైన్యం శౌర్యయాత్ర తలపెట్టినట్లు తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధి పాశం యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో ప్రజల ఆలోచనల మీద, సంస్కృతిపైన ఉన్న ఆధిపత్యాన్ని ఎదురించడానికి ప్రగతిశీల, ప్రజాస్వామ్య కవులు, ర చయితలు, కళాకారులు సాంస్కృతిక ఉద్యమం నిర్మించాలని ఈ నెల 7న జరిగిన సమావేశం తీర్మానించిందని పేర్కొన్నారు. ప్రజాకళాకారులు గద్దర్, గోరటి వెంకన్న, విమలక్క, సుద్దాల అశోక్తేజ, జయరాజ్, మాదాల రవి తదితరులు సమావేశమై తీసుకున్న నిర్ణయంలో భాగంగా శనివారం సాయంత్రం నాలుగు గంటలకు బైరాన్పల్లి అమరులకు సబ్బండ కళల నివాళి అర్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 21వ తేదీన ఇదే జిల్లాలోని దేవరుప్పుల మండలం కడవెండిలో తెలంగాణ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్యకు నివాళి అర్పించనున్నట్లు తెలిపారు. -
మహాసభల్లో సీపీఎం ‘జనజాతర’
సాక్షి, హైదరాబాద్: వామపక్ష భావజాలం కలి గిన సాంస్కృతిక, ప్రజా కళాబృందాలను ఒకే వేదికపైకి తీసుకురావాలని సీపీఎం నిర్ణయిం చింది. తెలంగాణలో ప్రజా సంస్కృతికి అద్దం పట్టే కళారూపాలను ‘జనజాతర’ పేరిట నిజాం కాలేజీ మైదానంలో ప్రదర్శించే యోచనతో ఉంది. సీపీఎం తెలంగాణ తొలి మహాసభలు మార్చి 1-4 తేదీల మధ్య హైదరాబాద్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజారంగంలో పని చేస్తున్న కళాబృందాలతో రెండురోజుల పాటు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. సమాజంలోని వామపక్ష శక్తులు, అభిమానులు, మద్దతుదారులను రాజకీయంగా ఒకవేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే.. తెలంగాణలోని వామపక్ష సాం స్కృతిక బృందాలు, వ్యక్తులను కూడా ఒకచోటకు తీసుకురానుంది. తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించి, సిద్ధాంతపరంగా, ఇతరత్రా కారణాల వల్ల పలు వామపక్షశక్తులు దూరాన్ని పాటిస్తున్నాయి. ప్రజా గాయకులు గద్దర్, విమలక్క, జయరాజ్ వంటి వారిని కూడా ఆహ్వానించి, తమ తమ సాంస్కృతిక సంస్థల పేరుమీదే ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయాలనే ప్రతిపాదనలను సిద్ధం చేసింది. -
క్రీడా సంబరం
పుట్టపర్తి అర్బన్ : పుట్టపర్తిలోని హిల్వ్యూ స్టేడియంలో ఆదివారం సత్యసాయి 31 వ క్రీడా సాంస్కృతిక సమేళనం ఉత్కంఠభరితంగా జరిగింది. ప్రతి ఏడాది ఆనవాయితీగా నిర్వహించే క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్, నాగానంద, చక్రవర్తి, శ్రీనివాసన్, ఎస్వి గిరి, టీకేకే భగవత్, కార్యదర్శి ప్రసాదరావు, కళాశాలల వైస్ ప్రిన్సిపాల్ కేబీఆర్ వర్మ తదితరులు ఆధ్వర్యంలో సత్యసాయి విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు క్రీడాజ్యోతిని వెలిగించారు. ముఖ్య అతిథిగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు అనంతపురం, ముద్దనహళ్లి, బృందావనం, ప్రశాంతినిలయం, వైట్ఫీల్డ్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు సత్యసాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా క్రీడాప్రాంగణానికి తీసుకొచ్చారు. వేలాది మంది విద్యార్థుల నడుమ క్రీడా సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వివిధ రంగుల యూనిఫాంలతో విద్యార్థులు మార్చ్ఫాస్ట్ ఆకట్టుకుంది. లయ బద్దంగా బ్రాస్బ్యాండ్ వాయించారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం శాంతి చిహ్నంగా తెల్లటి పావురాన్ని, వివిధ రంగుల బెలూన్లను ఎగురవేశారు. చైనీస్ డ్రాగన్ డ్యాన్సు ఆకట్టుకుంది. ఫ్రీఫాల్ఇన్ కాయిన్, బైక్ రేస్, అగ్నికీలల్లో బైకులు నడుపుతూ చూపరులను గగుర్పాటకు గురిచేశారు. అనంతరం విద్యార్థినులు జిమ్నాస్టిక్స్ విన్యాసాలు నిర్వహించారు. ఈక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యూరు. వేలాది మందితో స్టేడియం కిటకిటలాడింది. సాయంత్రం 4 గంటల నుంచి మరి కొంత మంది విద్యార్థులు పలు విన్యాసాలతో పాటు,స్కేటింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి డెరైక్టర్ డాక్టర్ ఓలేటి చౌదరి, టీవీఎస్ అధినేత శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. -
విశ్వగురువు భారత్
విజయవాడ కల్చరల్ ప్రపంచానికి భారతదేశం విశ్వగురువని ఆకాశవాణి హైదరాబాద్ సంచాలకులు వి.ఉదయశంకర్ అన్నారు. కామకోటి నగర్లోని శ్రవణ సదనంలో శృతిలయ నివాస్ శనివారం నిర్వహించిన త్యాగ రాజస్వామి ఆరాధనోత్సవాలు, నగర సంకీర్తనా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ భారతదేశం సంగీత, సాహిత్య, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచానికే మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. గురువును మించిన దైవం లేదని, గురువును సేవించడం ద్వారా విద్యార్థికి చదువుకు తగిన సార్థకత చేకూరుతుందని తెలిపారు. చదువులతోపాటు మనిషి మేధస్సును పెంచే ఇతర లలిత కళలను నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. విష్ణు భొట్ల శ్రీరామమమూర్తి కుటుంబసభ్యులు కామ కోటినగర్లోని ఉత్సవాల వేదిక వద్దనుంచి పలువీధుల్లో స్వామివారి విగ్రహాలతో త్యాగరాజస్వామి కీర్తలను ఆలపిస్తూ నగర సంకీర్తన నిర్వహించారు. అనంతరం విష్ణుభొట్లసోదరీ మణుల శిష్యబృందం ఉమాసాహితీ, లాస్యప్రియ, రుషిజ్ఞ, కృష్ణస్నేహ, రాజ్యలక్ష్మి లహరి పలు సంప్రదాయ కీర్తనలను ఆలపించారు. చివరిగా హైదరాబాద్ ఆకాశవాణి సంచాలకులు ఉదయశంకర్ పలు సంప్రదాయ కీర్తనలను ఆలపించారు. విష్ణు భొట్ల కృష్ణవేణి, బి.వి.ఎస్.ప్రసాద్ సహకరించారు. భక్తి శ్రద్ధలతో త్యాగరాజ స్వామి నగర సంకీర్తన విజయవాడ కల్చరల్ : ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, సంగీత సన్మండలి సంయుక్త నిర్వహణలో సంగీత కళాశాలలో శనివారం నిర్వహించిన నగర సంకీర్తనా, ఊంఛవృత్తి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో సాగింది. నాదోపాసకుడు, త్యాగబ్రహ్మ త్యాగరాజస్వామిని పల్లకీలో ఆవాహన చేసి సంగీత కళాకారులు నగరంలోని పలు ప్రాంతాల్లో గానం చేస్తూ నగర సంకీర్తన నిర్వహించారు. సన్మండలి కార్యదర్శి మోదుమూడి సుధాకర్, అంజనా సుధాకర్, సంగీత కళాకారుడు పోకూరి గౌరీనాధ్, గాయత్రీ గౌరీనాధ్, చారుమతి పల్లవి, సన్మండలి అధ్యక్షుడు పెమ్మరాజు సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మల్లాది అరవింద్ కార్తీక్, శివానంద యశస్వి సంప్రదాయ కీర్తనతో సంగీత కార్యర్రమాలు ప్రారంభమయ్యాయి. మృదంగంపై శివానంద యశస్వి, వయోలిన్పై బి.వి.దుర్గాభవానీ సహకరించారు. ఓరుగంటి వనజ, బి.వి .వెష్ణవి, వాగ్దేవి గాత్రయుగళం ఆకట్టుకుంది. ఆకాశవాణి హైదరాబాద్ సంచాలకులు వి.ఉదయశంకర్ -
తెలంగాణ కళలకు ప్రోత్సాహం: రసమయి
హైదరాబాద్: తెలంగాణ కళలకు ప్రభుత్వం ప్రోత్సాహమిస్తుందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ తెలిపారు. రాష్ట్ర యువజనోత్సవాలు ముగింపు కార్యక్రమం శనివారం హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పారామంలో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రసమయి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి విభాగం ఏర్పడిన తర్వాత 500 మంది కళాకారులకు ఉపాధి లభించిందని తెలిపారు. ఆకలి కేకలు, ఆర్తనాదాల నుంచి తెలంగాణ పాటలు, కళలు పుట్టుకొచ్చాయని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక విభాగం డిప్యూటి డెరైక్టర్ ఉష, వివేకానంద ఇనిస్టిట్యూట్ ప్రతినిధి గోదానంద స్వామి పాల్గొన్నారు. -
వరంగల్, అమరావతిలకు మహర్దశ
వారసత్వ నగరాలుగా ఎంపిక జాబితాలో 12 నగరాలు రూ.500 కోట్లతో పునరుత్తేజం కేంద్ర మంత్రి వెంకయ్య వెల్లడి న్యూఢిల్లీ: పురాతన నగరాలను పరిరక్షించడంతోపాటు వాటికి పునరుత్తేజం కల్పించడానికి కేంద్రం నడుం బిగించింది. వారసత్వ నగరాల అభివృద్ధి కోసం వచ్చే ఏడాది నుంచి కొత్త ప్రాజెక్టును తీసుకొస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. దీనికి రూ.500 కోట్ల వ్యయం చేయనున్నట్లు శనివారమిక్కడ ఓ కార్యక్రమంలో చెప్పారు. ‘జాతీయ వారసత్వ నగరాభివృద్ధి యోజన’ పేరుతో తెస్తున్న ఈ ప్రాజెక్టును తొలుత దేశంలోని 12 నగరాల్లో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ వారసత్వ నగరాల జాబితాలో తెలంగాణ నుంచి వరంగల్, ఆంధ్రప్రదేశ్ నుంచి అమరావతితోపాటు అమృత్సర్, వారణాసి, గయ, పూరి, అజ్మీర్, వేలాంగణి, మథుర, కాంచీపురం, ద్వారకా, బదామి ఉన్నాయి. సాంస్కృతికపరంగా, ధార్మికపరంగా ఘనమైన వైవిధ్య వారసత్వానికి ప్రతీకగా నిలిచిన నగరాలను ఈ ప్రాజెక్టుకు ఎంపికచేసినట్లు వెంకయ్య చెప్పారు. రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ జాబితాలోకి మరిన్ని నగరాలను చేరుస్తామని పేర్కొన్నారు. ఈ నగరాల్లో వారసత్వ, పర్యాటక రంగాలకు ప్రోత్సాహకం కల్పిస్తామని తెలిపారు. మన ఘనమైన వారసత్వాన్ని పరిరక్షించడంతోపాటు, మన పూర్వీకుల ఘనతను వచ్చే తరాలకు అందించడమే తమ ధ్యేయమన్నారు. వచ్చే ఏడాదిలో ప్రారంభించనున్న ఈ ప్రాజెక్టు మొదటి దశ మూడు నుంచి ఐదేళ్ల వ్యవధితో ఉంటుందని మంత్రి చెప్పారు. దీనికి ఆయా నగరాలు సమగ్ర నివేదిక సమర్పించాల్సి ఉంటుందని, నిధులన్నింటినీ కేంద్రమే ఇస్తుందని వివరించారు. ఇందులో పౌరుల భాగస్వామ్యం కీలకం కాబట్టి ప్రైవేటు భాగస్వామ్యానికీ అవకాశం కల్పిస్తామన్నారు. -
దుర్గమ్మా.. దర్శనం భారమేనమ్మా..
రాష్ర్టంలోనే అతిపెద్ద ఉత్సవాలు.. రూ.4కోట్ల అంచనా వ్యయం.. లక్షల్లో వచ్చే భక్తులు.. అయినా, కానరాని సౌకర్యాలు.. మందకొడిగా పనులు.. ఇదీ ప్రస్తుతం దుర్గగుడిపై జరుగుతున్న దసరా ఉత్సవ ఏర్పాట్ల పరిస్థితి. ఉత్సవాలకు ఇంకా ఐదు రోజులే సమయం ఉన్నా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. కొన్ని పనులు అసంపూర్ణంగానే ఉన్నాయి. కెనాల్రోడ్డు నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్ల నుంచి సాంస్కతిక వేదిక వరకు ఏదీ పూర్తికాలేదు. స్నానఘాట్లలో నదీ ప్రవాహం భయపెడుతున్నా.. పటిష్టమైన రక్షణ చర్యలు శూన్యమనే చెప్పాలి. ఏటా ఇందే తంతు జరుగుతున్న ఆలయ అధికారుల్లో కనీస మార్పు రావట్లేదు. ఏర్పాట్లపై మూడు నెలల ముందుగానే రెవెన్యూ, పోలీసు, దేవాదాయ అధికారులు సమాలోచన చేసి ఉంటే భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు అమ్మవారి మూలధనం వృథా కాకుండా అరికట్టగలిగే వారని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అడుగడుగునా వెక్కిరిస్తున్న దసరా ఉత్సవ ఏర్పాట్లను ఒకసారి పరిశీలిస్తే.. - విజయవాడ మహామండపం వద్ద పనులు పూర్తయ్యేదెన్నడో.. మహామండపం కింది అంతస్తులో ప్రసాదాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండగా.. ఇంతవరకు ఆ పనులు పూర్తికాలేదు. మరోవైపు మహామండపం ప్రాంగణమంతా చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయింది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు కొండ దిగేందుకు మహామండపంవైపు క్యూలైన్తో పాటు మల్లేశ్వరాలయం పాతమెట్లను వినియోగిస్తున్నారు. దీంతో మహామండపం నుంచి కిందకు దిగే భక్తులకు కష్టాలు తప్పేలా లేదు. ఐదు కిలోమీటర్లు నడవాల్సిందే.. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈసారి కూడా కెనాల్రోడ్డు నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్లోనే రావాలి. అమ్మవారి సన్నిధిలో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన మహామండపం ఈ ఏడాది పూర్తికానుందని ముందు నుంచే ఆలయ అధికారులు చెబుతున్నా.. పనులు ఇంకా పూర్తికాకపోవడంతో క్యూలైన్లు సిద్ధంచేశారు. ఏటా మాదిరిగానే ఈసారి కూడా దర్శనానికి సుమారు ఐదు కిలోమీటర్లు నడవాలి. ఇంకా హడావుడి పనులేనా.. ఉత్సవాలకు ఇంకా ఐదు రోజుల సమయం ఉండగా, అధికారులు ఇప్పటికిప్పుడు హడావుడి పనులు చేపట్టారు. ఉత్సవాలు ముంచుకొస్తున్న తరుణంలో పనులు వేగవంతం చేస్తున్నారని, ముందుగా ప్రారంభిస్తే ఈపాటికి పూర్తయ్యేవని భక్తులు చెబుతున్నారు. స్నానఘాట్లలో చర్యలు శూన్యం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తొలుత కృష్ణానదిలో పుణ్య స్నానమాచరిస్తారు. ఈసారి కృష్ణానదికి వరద పోటు కారణంగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. సీతమ్మ వారి పాదాలు, కనకదుర్గాఘాట్, భవానీపురం పున్నమీ ఘాట్లలో జల్లు స్నానాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నదిలోకి ఎవరూ దిగకుండా పటిష్టమైన బారికేటింగ్ను ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా జరుగుతున్న పనులు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. సాంస్కృతిక వేదిక ఎక్కడ? ఉత్సవాల్లో అమ్మవారికి నీరాజనాలు అర్పించేందుకు కళాకారులు పరితపిస్తుంటారు. ఇందుకోసం సాంస్కృతిక ప్రదర్శనలకు మహామండపం పక్కనే, పాత మెట్లమార్గం వద్ద వేదిక ఏర్పాటుచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇంతవరకు పనులు ప్రారంభంకాలేదు. ఇక్కడ కళావేదిక ఏర్పాటుచేయడం ద్వారా ప్రదర్శనలను తిలకించే అవకాశం లేదని పలువురు భక్తులు పేర్కొంటున్నారు. మహామండపం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటుచేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. మల్లేశ్వరాలయం మాటేమిటీ? దుర్గగుడిలో రూ.4 కోట్ల అంచనాతో ఉత్సవాలు నిర్వహిస్తుండగా, ఆలయ ప్రాంగణంలోని మల్లేశ్వరాలయం కనీసం రంగులు వేసే భాగ్యానికి కూడా నోచుకోలేదు. ఐదేళ్లుగా ఈ ఆలయానికి రంగులు వేయకపోవడంతో గోపురం వెలిసిపోరుు కనిపిస్తోంది. -
మన సంస్కృతిని భావితరాలకు అందించాలి
పల్లారుగూడ (సంగెం) : రోజురోజుకూ కనుమరుగవుతున్న సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. సంగెం మండలంలోని పల్లారుగూడ శివారు మహారాజ్తండాలో గురువారం సంగెం జెడ్పీటీసీ సభ్యురాలు గుగులోత్ వీరమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన తీజ్ ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యూరు. ఈ సందర్భంగా రాజయ్యను గిరిజనులు డప్పుచప్పుళ్లతో ఘనంగా స్వాగతించి సన్మానించారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ తీజ్ ఉత్సవంలో పాల్గొనడం తన అదృష్టమన్నారు. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా... గత పాలకులు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం రాగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ వారి ఆకాంక్షలను నెరవేరుస్తూ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. 500 జనాభా ఉన్న తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతోపాటు 18 ఏళ్లు నిండిన గిరిజన యువతుల వివాహానికి కళ్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.50 వేల ఇవ్వనున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. గిరిజనులు, మైనార్టీలు, దళితుల అభివృద్ధికి రూ.వేల కోట్లు కేటారుుంచారన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవించే దళిత, గిరిజన కుటుంబాలకు 3 ఎకరాల భూమిని ఇస్తామన్నారు. 65 ఏళ్లు నిండిన వృద్ధులు, వితంతువులకు నెలకు వెయ్యి చొప్పున, వికలాంగులకు రూ.1,500 చొప్పున దసరా నుంచి పింఛన్లు ఇవ్వనున్నట్లు పునరుద్ఘాటించారు. ఐదేళ్లలో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలు రుపొందించుకుందామన్నారు. గంగదేవిపల్లిలాగ దేశంలో పేరు వచ్చేలా రాజకీయూలకతీతంగా... పోటీతత్వంతో గ్రామాభివృద్ధికి కృషిచేయూలన్నారు. కాగా, మైదాన ప్రాంతానికి ప్రత్యేక ఐటీడీఏను ఏర్పాటు చేయాలని రాజయ్యను పలువురు గిరిజనులు కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, స్వామి నాయక్, వర్ధన్నపేట ఎంపీపీ మార్నెని రవీంద ర్రావు, లలితాయాదవ్, భరత్కుమార్రెడ్డి, మదన్కుమార్, సాగర్రెడ్డి, గోపీసింగ్, శంకర్రావు, దేవ్సింగ్, వీరన్న, యాదగిరిరావు. రాజు, సంపత్, సదానందం పాల్గొన్నారు. -
మనయాత్రలో మంచి మిత్రులు..
టూర్ గైఢ్స్ ఎల్లలను చెరిపేసి అనుబంధాలకు వారిధిలా, కొత్త ప్రదేశాల సందర్శనకు సారధిలా, చారిత్రక నిర్మాణాల అవగాహనకు విజ్ఞాన గనిలా, సాంస్కృతిక వైభవాన్ని పర్యాటకులకు తెలిపే సంపదలా.. వీటన్నింటినీ మించి యాత్రలో మనకు దిశానిర్దేశం చేసే మంచి మిత్రులుగా విభిన్నరకాల పాత్రలను పోషిస్తున్నవారు టూర్ గైడ్స్! పర్యటనలో చిక్కులను తొలగించి మార్గాన్ని సుగమం చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలోని డర్బన్ నుంచి ఒక కుటుంబం తమ మూలాలను వెతుక్కుంటూ మనదేశానికి వచ్చింది. వాళ్ల పూర్వీకులలో ఒకరు 1905లో అనకాపల్లికి 40 కి.మీ దూరంలో ఉన్న జంపన అనే కుగ్రామం నుంచి దక్షిణాఫ్రికా వెళ్లి, అక్కడే స్థిరపడ్డారట. తమ మూలాలు భారత్లో ఉన్నాయనే విషయం వందేళ్ల తర్వాత వారి మనమలకు ఒక పేపర్ కటింగ్ ద్వారా తెలిసి, జంపన అనే ఊరు తెలుసుకోవడానికి మనదేశం వచ్చారు. ఆ ఊళ్లోనూ, చుట్టుపక్కల ఊళ్లలోనూ వీరికి సంబంధించిన కుటుంబీకులను కలుసుకొని, ఆ ఉద్వేగంలో కన్నీటి పర్యంతమయ్యారు. ‘హృదయాన్ని కదలించిన ఆ సంఘటన నాకూ కంట నీరు తెప్పించింది’ అంటూ గుర్తుచేసుకున్నారు టూర్ గైడ్ సుబ్రహ్మణ్యం. ఇలాంటి అనుభవాలు ఉన్న గైడ్స్ మన దేశంలో 2,500 మంది అధికారికంగా ఉన్నారు. అయితే, తెలుగు రాష్ట్రాలలో వీరి సంఖ్య ఎనిమిదే! ఇరు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు చెందిన వీరు ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్నారు. నిరంతర పరిశోధన... ప్రభుత్వ ఉద్యోగంలో చేరగానే పనిలేకపోయినా నెలసరి జీతం వచ్చేస్తుంది అనుకునేవారికి నప్పనిది ఈ గైడ్ ప్రొఫెషన్. పర్యటనలో ఉన్నా, ఇంట్లో ఉన్నా.. వీరి ఆలోచనలెప్పుడూ పర్యాటకులకు చూపించబోయే సందర్శన స్థలాలమీదనే ఉంటుంది. చారిత్రక కట్టడాల చుట్టూతానే తిరుగుతుంటుంది. ఏ పర్యాటకుడు ఏ ప్రశ్న వేస్తాడో తెలియదు. దానికి తగిన సమాధానం ఇవ్వడానికి మాత్రం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. ‘రోజులో కనీసం 5-6 గంటలు పుస్తకాలు చదువుతూ, విషయాలు శోధిస్తూనే ఉంటాం’ అన్నారు మధు. ఇదే విషయంపై అరవపల్లి శ్రీను మాట్లాడుతూ- ‘విదేశీ పర్యాటకలకు ప్రతిది తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. వారిని గైడ్గా రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి వచ్చే ప్రశ్నల పరంపరకు సమాధానాలు చెబుతూనే ఉండాలి. అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం సరైన సమాధానాలు చెప్పకపోయినా వారు వెంటనే మరో గైడ్ను వెతుక్కుంటారు. అందుకే ఈ వృత్తి ఎప్పటికప్పుడు మాకు ఒక సవాల్గానే ఉంటుంది’ అని తెలిపారు. ‘ఒక విదేశీయుడు అంతరించిపోతున్న బట్టమేక పక్షి కోసం మన రాష్ట్రానికి వచ్చాడు. ఆ పక్షిని వెతకడానికి నాకు రెండు రోజులు పట్టింది. చివరకు నందికొట్కూరులో ఉందని తెలిసింది. అతన్ని తీసుకొని, ఆ పక్షి కోసం బయల్దేరాను. ముందుగా ఆ పక్షి గురించి వివరాలన్నీ తెలుసుకొని, అతనికి సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలిగాను’ అని తెలిపారు శ్రీనివాస్రెడ్డి. పనివేళలు ఉండవు... ఏ ఉద్యోగంలోనైనా పనివేళలు ఉంటా యి. కానీ రాత్రి పగలు, ఎండా వానలు ఏదీ పట్టని వృత్తి వీరిది. వచ్చిన సందర్శకులకు తమవంతు పరిజ్ఞానం అందించామా లేదా అనే విషయం ఒక్కటే మైండ్లో ఉంటుందని తెలిపిన ఈ యాత్రా మార్గదర్శకులు దాదాపు రెండు దశాబ్దాలుగా ఇదే వృత్తిలో ఉన్నారు. పదిహేనేళ్లు టూర్ గైడ్గా ఉన్న శ్రీను మాట్లాడుతూ-‘విదేశాల నుంచి ఫిషరీస్ అసోషియేషన్ గ్రూప్ ఒకటి సముద్ర జీవుల ఫొటోగ్రఫీ కోసం వచ్చింది. వారికి కాకినాడ నుంచి ఇచ్చాపురం వరకు కోస్తా తీర ప్రాంతంలోని ఫిషరీ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో పది రోజులపాటు నిద్రాహారాలు మాని, ఆయా ప్రాంతాలలో రెక్కీ నిర్వహించి వివరాలన్నీ సేకరించాను. పదిరోజుల పాటు ఆ బృందం ఇక్కడే ఉండి, తిరిగి వెళ్లేవరకు అన్నివేళలా అప్రమత్తంగా ఉన్నాను. వెళ్లేముందు వారి అభినందనలు అందు కున్నాను’ అని తెలిపారు. ప్రయాణం తర్వాతా కొనసాగే బంధం... నిన్నటికి ఈ రోజుకే అనుబంధాలలో ఎన్నో తేడాలు వచ్చేస్తున్న రోజులివి. ఒకసారి కలిస్తే వెంటనే మర్చిపోయే తీరికలేని రోజులు కూడా! ఇరవై ఏళ్లుగా టూర్గైడ్గా ఉన్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ- ‘పర్యటనలలో యాత్రికులలో ఒకరిగా కలిసిపోతాం. వారు తమ ఇళ్లకు, దేశాలకు వెళ్లాక కూడా మెయిల్స్, ఫోన్లు, ఇంటర్నెట్ చాటింగ్ల ద్వారా పలకరిస్తూనే ఉంటారు. కొందరు పదేసిసార్లు మన దేశానికి వస్తుంటారు. అప్పు డు మా పేరు చెప్పి, మేమే గైడ్గా కావాలని కోరుకుంటూ ఉంటారు’ అని ఆనందంగా తెలిపారు. అబద్దం చెబితే అంతే..! విధి నిర్వహణలో అబద్ధాలు, పొరపాట్లు చాలా సాధారణమనే విషయం మనందరికీ తెలిసిందే! కానీ, ఈ వృత్తిలో ఉన్నవారు మాత్రం అబద్ధాలకు, పొరపాట్లకు ఆమడదూరంలో ఉండాలంటున్నారు వీరు. ‘పర్యాటకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలియకపోతే ‘తెలుసుకొని చెబుతాం’ అని చెప్పాలి. అంతే తప్ప, తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. దాని వల్ల ఒక దేశ చరిత్ర ను విదేశీయుడు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అలాగే పంక్చువాలిటీనీ కచ్చితంగా పాటించాలి. ట్రావెల్ గ్రూప్లో ఉన్నవారిలో ఒకరో ఇద్దరో అసహనంగా ఉంటారు. ఏ చిన్న అసౌకర్యం కలిగినా కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. అసౌకర్యం నుంచి పర్యాటకుడిని ఎలా తప్పించాలో తెలుసుండా లి’ అంటూ తమ విధిలో కలిగే సాదకబాధకాలను ఒకరొకరుగా వివరించారు. ఇంటికి దూరం... ఉద్యోగంలో ఎన్నో సాదకబాధకాలు ఉన్నా ఇంటికి చేరుకోగానే అన్నీ మర్చిపోతారు. అలసట నుంచి విశ్రాంతి పొందుతారు. కానీ వీరి జీవనశైలి అందుకు భిన్నంగా ఉంటుంది. సంవత్సరంలో ఏడు నెలల పాటు వీరికి ప్రయాణంలోనే రోజులు గడచిపోతాయి. ఇదే విషయం టూర్ గైడ్ కరుణానిధి చెబుతూ- ‘పండగలు, పర్వదినాల సమయంలోనే విదేశీ పర్యాటకులతో టూర్స్ ఉంటాయి. దాంతో పండగ పూట ఇంట్లో ఉండం. విధిలో భాగంగా ఎన్నో చోట్ల తిరుగుతుంటాం కాబట్టి, కుటుంబసభ్యులతో మళ్లీ టూర్లకు వెళ్లడం కష్టమే! భోజనానికి, నిద్రకు వేళపాళలు ఉండవు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని ఆనందాలను త్యాగం చేస్తే తప్ప ఈ వృత్తిలో విజయం సాధించలేం’ అని తెలిపిన వీరే ‘ఈ వృత్తిలో ఎంత రిస్క్ ఉంటుందో అంత ఆసక్తి ఉంటుంది. కొత్త విషయాలు, చూడదగిన ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు.. జ్ఞానసముపార్జనకు వేదికలు అవుతాయి’ అని వివరించారు. అరుదైన గౌరవం... ‘రెండేళ్ల క్రితం టెక్స్టైల్ టూర్ పేరిట ఇంటర్నేషనల్ ఎవియేట్ కంపెనీ వాళ్లు న్యూయార్క్ నుంచి మన రాష్ట్రానికి ఐదు రోజుల పర్యటనకు వచ్చారు. పోచంపల్లి, పెడన... ప్రదేశాలను చూపుతూ, మన దగ్గర ఉన్న వస్త్రపరిశ్రమకు సంబంధించి వారికి పూర్తి సమాచారం అందించాను. వారు చాలా ఇంప్రెస్ అయ్యారు. న్యూయార్క్ టెక్స్టైల్ మ్యూజియంలో నాకు మెంబర్షిప్ ఇచ్చారు’అని వెంకటేశ్వర్లు ఆనందంగా తెలిపారు. ఒక ప్రాంతంలోని సంస్కృతీ సంప్రదాయాలు, చారిత్రక కట్టడాలను చూసి రావడంతోనే పర్యటన పూర్తవదు. మనసుతో దర్శించాలి, మైండ్తో మూలాలను అన్వేషించాలి. నిరంతర అన్వేషకులకు నిరంతర పరిశోధనతో మార్గం చూపే రహదారులు ఈ టూర్గైడ్లు. - నిర్మలారెడ్డి గైడ్స్ నియామకం ఇలా ప్రాంతం, రాష్ట్రం, స్మారక కట్టడాలకు సంబంధించి విడివిడిగా గైడ్స్ ఉంటారు. వీరిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (ఐఐటిటిఎమ్) రాతపరీక్ష, ఇంటర్వ్యూ, శిక్షణ ఆధారంగా నియమిస్తుంది. ట్రావెల్ గైడ్ పరీక్షకు కనీస వయోపరిమితి 20 నుంచి 65 సంవత్సరాలు. ఏదైనా అంశంలో డిగ్రీ స్థాయిలో పట్టభద్రులై ఉండాలి. ప్రాంతీయ భాషతో పాటు ఆంగ్లం, ఇతర విదేశీ భాషలలో ప్రావీణ్యం ఉండటం అవసరం. ఐఐటిటిఎమ్ క్యాంపస్లు గ్వాలియర్, భువనేశ్వర్, గోవా, న్యూ ఢిల్లీ మరియు నెల్లూరులలో ఉన్నాయి. గైడ్స్ ఆవశ్యకతను బట్టి ఐఐటిటిఎమ్ ప్రవేశపరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. టూరిస్ట్ గైడ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గైడ్ ఫీ ప్రకారం పర్యటనల ఆధారంగా జీతభత్యాలు ఉంటాయి. మరిన్ని వివరాలకు guidesadmission@gmail.comకి మీ సందేహాలను తెలియజేసి, సమాధానాలను పొందవచ్చు. ఇండియా టూరిజమ్ పర్యాటక భవన్ వారి ఫోన్ నెం. 040-23409199 -
రివేరా ఫ్యాషన్ షో అదుర్స్
వేలూరు, న్యూస్లైన్ : వేలూరు వీఐటీ యూనివర్సిటీలోని రివేరా-2014 అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గురువారం రాత్రి విద్యార్థుల ఫ్యాషన్షో జరిగింది. ఈ పోటీల్లో 400 యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రకరకాల దుస్తులు ధరించి పాల్గొన్నారు. విద్యార్థుల కేరింతల నడుమ జరిగిన ఈ పోటీల్లో చెన్నై ఎన్ఐఎఫ్టీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందిన విద్యార్థులకు నగుదు బహుమతితో పాటు సర్టిఫికెట్లును వీఐటీ యూనివర్సిటీ చాన్సలర్ విశ్వనాథన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఎస్వో 2009 సర్టిఫికెట్లు పొందిన ఈ అంతర్జాతీయ రివేరా సాంస్కృతిక కార్యక్రమాలు నాలుగు రోజుల పాటు జరుగుతాయన్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం సుమారు 24 వేల విద్యార్థులు ఈ పోటీల్లో కలుసుకోవడం అభినందనీయమన్నారు. ఈ పోటీల్లో వివిధ దేశాలకు, యూనివర్శిటీలకు చెందిన విద్యార్థులు ప్యాషన్ షోలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ పోటీలు ఈనెల 9వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. వివిధ పోటీలు నిర్వహించి సుమారు *2 కోట్లు విలువ చేసే బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్, శేఖర్, జీవీ సెల్వం, వైస్ చాన్స్లర్ రాజు, త్రొ చాన్స్లర్ నారాయణన్, ప్రొఫెసర్లు, వివిధ యూనివర్సిటీ చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
క్యాపిటల్ ఐక్యూ సంస్థ
-
వర్సిటీలో ‘యువ’ సవ్వడి
సాంస్కృతిక సమ్మేళనానికి సర్వం సిద్ధం 50 అంశాలలో పోటీలు విద్యార్థులకు ఆహ్వానం ఏయూ క్యాంపస్, న్యూస్లైన్ : అదొక ఉత్కృష్ట శిఖరం. జ్ఞాన ప్రదాయనిగా నిలిచే అక్షయ పాత్ర. యువతకు విద్యా రంగంతో పాటు క్రీడా, సాంస్కృతిక, సాహిత్య, సృజనాత్మక, సామాజిక సేవా రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించే కార్యక్రమం. ప్రతిభ ఉన్నవారికి పట్టం కట్టే వేదిక. అదే మన ఆంధ్ర విశ్వకళాపరిషత్. తన పేరులో ఉన్న కళలను నిత్యం విద్యార్థులకు పరిచయంచేస్తోంది. ఇందులో భాగంగానే మార్చి 8, 9 తేదీలలో రాష్ట్రస్థాయి సాంస్కృతిక యువ సమ్మేళన ఏయూ ఏక్మీ 2014కు రూపకల్పన చేసింది. 35 రోజుల పాటు 50 అంశాలలో యువత పోటీపడి ప్రతిభను చాటే అవకాశం కల్పించింది. రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది. కార్యక్రమాల వివరాలు : ఆరు విభాగాలలో 50 అంశాలలో ఈ పోటీలు జరగనున్నాయి. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ పోటీలు మార్చి 8 వరకు ప్రతి రోజూ నిర్వహిస్తారు. చివరి రెండు రోజులలో యువతను ఉర్రూతలూగించే సాంస్కృతిక సంబరం జరగనుంది. విద్యార్థులు వెంటనే పేర్లు నమోదు చేసుకుని ఆయా అంశాలలో పోటీకి దిగవచ్చు. సాంస్కృతిక విభాగం : లేజర్ షో, సోలో డ్యాన్స్, గ్రూప్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్, సింగింగ్, కరోకే, అంత్యాక్షరి, రాక్బ్యాండ్, ఫ్యాషన్ షో, కైట్ ఫ్లైయింగ్, స్పాట్ డ్యాన్సింగ్, సోలో మ్యూజిక్, డంబ్ చారడిస్. సృజనాత్మక రంగం : థీమ్ ఫొటోగ్రఫీ, కాన్సెప్ట్ రంగోళి, థీమ్ డ్రాయింగ్, బెస్ట్ విత్ వేస్ట్, ఫ్లవర్ డెకరేషన్, వెజిటబుల్ కార్వింగ్, పోస్టర్ మేకింగ్, క్లే మౌడలింగ్, పాట్ పెయింటింగ్, వర్సిటీపై డాక్యుమెంటరీ. లిటరరీ విభాగం : వ్యాసరచన, వక్తృత్వం, వాదం ప్రతివాదం, ఎక్స్టెంపోర్, స్పెల్ బీ, ఒరిజినల్ స్టోరీ రైటింగ్, క్విజ్, రికార్డెడ్ ఇంటర్వ్యూ. సామాజిక అంశాలు : సైక్లింగ్, స్లో రేసింగ్, క్యాంపస్, క్లీనింగ్, 2 కె రన్, మొక్కలు నాటడం. క్రీడలు : క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్, స్నూకర్, టెన్నీకాయిట్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, త్రోబాల్. ఫన్నీ గేమ్స్ : ఇంక్ ఏ ట్రి, టగ్ ఆఫ్ వార్, హల్లా బోల్, స్ట్రీట్ ఫుట్బాల్, లవ్ లెటర్ రైటింగ్, ఆర్మ్ వెస్ట్రిలింగ్, ట్రెజర్ హంట్, సైలాంతర్స్, లాన్ గేమింగ్, మూవీ ఆన్ ద గో, సెవెన్ స్టోన్స్, స్టెప్ ఏ స్టోన్. ఎవరు అర్హులు : ఆంధ్ర రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులంతా ఇందులో పాల్గొనేందుకు అర్హులే. అన్ని రంగాలలో ప్రోత్సాహం విద్యా, సాంస్కృతిక, మేధో, క్రీడా విభాగాలలో విద్యార్థులను సమున్నతంగా తీర్చిదిద్దేందుకు వర్సిటీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా విభిన్న అంశాలతో కల్చరల్ ఫెస్ట్ను నిర్వహిస్తున్నాం. - ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు, వీసీ. ఏయూ. ఎలా సంప్రదించాలి ఏయూ-ఏక్మీ సాంస్కృతిక యువజన ఉత్సవాలలో పాల్గొనాలనుకునే యువతరం 90303 03636, 93999 62023, 98496 13354 నంబర్లలో, www.AUACME.com వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఫెస్ట్ కార్యాలయంలో సైతం నేరుగా సంప్రదించవచ్చు. -
డబ్బింగ్ను అనుమతిస్తే తప్పేంటి ?
వేరే భాషల సినిమాల ద్వారా ఇతరుల సంస్కృతిని తెలుసుకోవచ్చు ‘డబ్బింగ్’పై చర్చా కార్యక్రమంలో అగ్ని శ్రీధర్ సాక్షి, బెంగళూరు : కన్నడ సినీ పరిశ్రమలోకి డబ్బింగ్ను అనుమతిస్తే తప్పేంటని న్యాయక్కాగి నావు సంస్థ వ్యవస్థాపకులు అగ్ని శ్రీధర్ ప్రశ్నించారు. కన్నడ సినీ పరిశ్రమలోకి డబ్బింగ్ను అనుమతించరాదంటూ శాండల్వుడ్ కళాకారులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, ఇతర సామాజిక సంస్థల ప్రతినిధులతో కలిసి ‘న్యాయక్కాగి నావు’ సంస్థ ఆధ్వర్యంలో శనివారమిక్కడ ‘డబ్బింగ్’పై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్ని శ్రీధర్ మాట్లాడుతూ...కన్నడ సినీ పరి శ్రమలోకి డబ్బింగ్ను అనుమతించడం ద్వారా కన్నడ భాష, సంస్కృతితో పా టు కళాకారులకు ఎటువంటి అన్యాయ ం జరగదని అన్నారు. మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారు తూ పోవాలని, ఇతర భాషలను కన్నడలోకి డబ్ చేయడం ద్వారా ఇతర రాష్ట్రాల సంస్కృతి గురించి తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నా రు. అంతేకాక ఇతర భాషలకు చెందిన సినిమాల్లో ఉపయోగించిన సరికొత్త టెక్నాలజీ, నటుల ప్రతిభను గురించి కూడా కర్ణాటక ప్రజలు తెలుసుకోవచ్చని చెప్పారు. అనంతరం సాహితీవేత్త ఇందూధర హున్నాపుర మాట్లాడుతూ... కళాకారులు, నటీనటులు సాంస్కృతిక రాయబారులుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. అ యితే కొంతమంది కళాకారులు మాత్ర ం గూండా ల్లా మాట్లాడడం, ప్రవర్తించ డం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశా రు. కన్నడ భాషపై ఎంతో మమకారాన్ని చూపుతున్నామని చెప్పుకునే శాండల్వుడ్ కళాకారుల్లో ఎంతమంది తమ తమ పిల్లలను కన్నడ మాధ్యమంలో చదివిస్తున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా డెరైక్టర్ సురేష్ డబ్బింగ్ను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. వినోదం అనేది పూర్తి స్థాయిలో వ్యాపారంగా మారిపోకూడదనే ఉద్దేశంతోనే డబ్బింగ్ను విరోధిస్తున్నామని చెప్పారు. డబ్బింగ్ను అడ్డం పెట్టుకొని కన్నడ సినీ పరిశ్రమలోకి ప్రవేశించాలని అనేక అంతర్జాతీయ సంస్థలు భావిస్తున్నాయని పేర్కొన్నారు. అదే కనుక జరిగితే శాండల్వుడ్ పరిశ్రమ పూర్తిగా దెబ్బతింటుందని చెప్పారు. చర్చా కార్యక్రమంలో రైతు నాయకుడు, ఎమ్మెల్యే కె.ఎస్.పుట్టణ్ణయ్య పాల్గొన్నారు. -
వి.కోట కావడిపట్నంలో వింత ఆచారం
-
సాగరతీరంలో సమైక్య ఘోష
సాక్షి, విశాఖపట్నం, న్యూస్లైన్ : సాగరతీరం శనివారం సాయంత్రం జై సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లిపోయింది. ఉద్యోగ సంఘాలు చేపట్టిన సాగరజల లక్ష గళ గర్జన కార్యక్రమం విజయవంతమైంది. సమైక్యాంధ్ర ధూం..ధాం అంటూ కుటుంబ సభ్యులతో సహా ఉద్యోగ సంఘాలు బీచ్రోడ్డులో చేపట్టిన నిరసన మిన్నంటింది. ఏపీ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, విశాఖ జిల్లా అధికారుల సంఘం, ఉద్యోగ/ఉపాధ్యాయ/కార్మిక/కర్షక సమైక్యాంధ్ర పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వేలాదిమంది తరలివచ్చారు. అల్లూరి సీతారామారాజు విగ్రహానికి పూలమాలు వేసిన అనంతరం వేలాది మంది ర్యాలీగా ఆర్కేబీచ్ వైపు బయల్దేరారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. రాజీనామా చేయని మంత్రుల తీరును దుయ్యబట్టారు. ర్యాలీలో గుడ్షెపర్డ్ స్కూల్ విద్యార్థులు 1000 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. అనంతరం బీచ్ రోడ్డులో కాళికామాత దేవాలయం వద్ద సభ నిర్వహించారు. వివిధ వర్గాల నాయకులు సంఘీభావంగా చేతులు కలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చిన్నారులు ఆటపాటలతో అలరించారు. దేశభక్తి గేయాలతో కార్యక్రమం ఆకట్టుకుంది. బాణసంచా, ఆకాశపు లాంతర్లతో బీచ్రోడ్డు మిరుమిట్లు గొలిపింది. ఫ్లాష్మ్యాబ్, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విడిపోతే వెనకబడిపోతాం... రాష్ట్రాన్ని విడగొట్టేందుకు పాలకులు చేస్తున్న కుట్రను తిప్పికొట్టాల్సిందేనని ఈ సభలో పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఏపీ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1990లో పీవీ నర్సింహరావు సంస్కరణలు చేపట్టిన సమయంలో రాష్ట్ర విభజన ప్రస్తావన వచ్చి ఉంటే నిర్దేశించిన నిష్పత్తిలో మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకునేవాళ్లమని అన్నారు. ఇటువంటి ఆలోచన లేకపోవడం వల్లనే హైదరాబాద్ను ఎంతో ఉన్నతంగా సీమాంధ్రులంతా రెక్కల కష్టంతో తీర్చిదిద్దామన్నారు. రాష్ట్రం విడిపోతే మళ్లీ అంతటి అభివృద్ధి సాధించలేమన్నారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ రాష్ట్రవిభజన కారణంగా రైతాంగం, విద్యార్థులు ఎంతో నష్టపోవాల్సివస్తుందన్నారు. ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు మాట్లాడుతూ అధికారులు హోదా మరిచి సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నారని అన్నారు. ఆర్టీసీ సీమాంధ్ర ఉద్యమకర్తలు పీపీఎం రాజు (ఈయూ), ఎంవీఆర్ మూర్తి (ఎన్ఎంయూ) మాట్లాడుతూ 13 జిల్లాల్లో 123 డిపోల్లో 70 వేల మంది ఉద్యోగులు రాత్రనక, పగలనక సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నామని అన్నారు. ఏపీఎన్జీవో జిల్లా సభ్యుడు గోపాలకృష్ణ ప్రసంగిస్తూ మంత్రుల వ్యవహారశైలిని ఎండగట్టారు. ఉద్యమనేత ఆడారి కిషోర్కుమార్ మాట్లాడుతూ ఫ్లై ఓవర్ నిర్మాణానికే ఆరేళ్లు పట్టిందంటే రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర అభివృద్ధికి ఎన్నేళ్లు పడుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదని అన్నారు. కార్యక్రమంలో వివిధ విభాగాల, ఉద్యోగ సంఘాల ఉద్యమకర్తలు వై.నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, గణపతి, యోగేశ్వరరావు, ఇమంది పైడిరాజు, ఎం.ఆదినారాయణ, జగన్నాథరావు, శ్యామసుందర్, వై.నర్సింహరావు, విజయప్రసాద్, శ్రీరామమూర్తి, చిట్టిరాజు, డికుమార్రావు, చంద్రశేఖర్, హరిప్రసాద్లు పాల్గొన్నారు.