debt burden
-
రూ.లక్ష కోట్ల అప్పు!
సాక్షి, అమరావతి: సంపద సృష్టించి సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తానంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు తిలోదకాలిచ్చిన సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని రుణ భారంతో ముంచెత్తుతున్నారు. బడ్జెట్లోనూ, బడ్జెటేతర అప్పుల్లోనూ దూసుకుపోతున్నారు. ఆర్నెల్లలోనే రూ.లక్ష కోట్లకుపైగా అప్పుల దిశగా రాష్ట్రం పరుగులు తీస్తోంది. మరోవైపు గత ఏడాదితో పోల్చితే అమ్మకాల పన్ను ఆదాయంతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోయింది. ఈ ఆర్థిక ఏడాదిలో నవంబర్ వరకు రాబడులు, వ్యయాలకు సంబంధించి కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) వెల్లడించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. రాజధానికి రూ.52 వేల కోట్లు! టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడ్జెట్, బడ్జెటేతర అప్పులు ఏకంగా రూ.74,590 కోట్లకు చేరాయి. బడ్జెట్ అప్పులే నవంబర్ వరకు రూ.65,590 కోట్లకు చేరినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోపక్క ప్రభుత్వ గ్యారెంటీతో బడ్జెటేతర అప్పులు మరో రూ.9,000 కోట్లకు ఎగబాకాయి. ఇక రాజధాని పేరుతో ప్రపంచ బ్యాంకు, హడ్కో, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పు చేసేందుకు కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఈ మేరకు సీఆర్డీఏకు అనుమతిస్తూ మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది.అంటే సీఎం చంద్రబాబు ఆర్నెల్ల పాలనలో ఇప్పటికే చేసిన అప్పులు, చేయనున్న అప్పులు కలిపి మొత్తం రూ.1.05 లక్షల కోట్లకు చేరుకోనున్నాయి. అంతేకాకుండా ప్రాథమిక అంచనా మేరకు రాజధానికి రూ.52 వేల కోట్ల మేర నిధులు అవసరమని, ఇప్పటికే రూ.31 వేల కోట్లు సమీకరించినందున మిగతా నిధులు రూ.21 వేల కోట్లు కూడా సమీకరించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్డీఏకి ప్రభుత్వం నిర్దేశించింది. సంపద సృష్టి అంటే అప్పులు చేయడమే అనే రీతిలో చంద్రబాబు పాలన కొనసాగుతోందనేందుకు ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉండదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పథకాలు లేవు.. పన్నుల మోతలే సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకపోగా అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై పెనుభారం మోపారు. ఏ ఒక్క పథకం అమలు కాకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. అమ్మకం పన్ను ఆదాయం భారీగా తగ్గిపోవడమే దీనికి నిదర్శనం. కాగ్ గణాంకాల మేరకు గతేడాది నవంబర్తో పోల్చితే ఈ ఏడాది నవంబర్ నాటికి అమ్మకం పన్ను ఆదాయం రూ.1,043 కోట్లు తగ్గిపోయింది. స్టాంపులు, రిజి్రస్టేషన్ల ఆదాయం రూ.868 కోట్లు క్షీణించింది. మరోపక్క కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు రూ.12,510 కోట్లు తగ్గిపోయాయి. విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు సంబంధించి సామాజిక వ్యయం కూడా గత నవంబర్తో పోల్చితే తగ్గిపోయిందని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. మరోవైపు రెవెన్యూ లోటు రూ.9,742 కోట్లు అదనంగా పెరిగింది. -
గోల్డ్ బాండ్లకు చెక్..!
ఫిజికల్గా పసిడి కొనుగోలుకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ల పథకానికి తెరతీసింది. యూనిట్ల(ఒక గ్రాము)లో జారీ చేయడం ద్వారా నెమ్మదిగా రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. తద్వారా దిగుమతుల భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలు వేసింది. అయితే బంగారం ధర ప్రతీ ఏడాది రేసు గుర్రంలా పరుగు తీయడంతో బాండ్ల గడువు ముగిసేసరికి రుణ భారం భారీగా పెరిగిపోతూ వచ్చింది. వెరసి ఇకపై వీటికి ఫుల్స్టాప్ పెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాల అంచనా. వివరాలు చూద్దాం.. కేంద్ర ఆర్థిక శాఖ వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26) నుంచి సావరిన్ గోల్డ్ బాండ్ల(ఎస్జీబీలు) జారీని నిలిపివేసే అవకాశముంది. ప్రభుత్వ రుణాలను తగ్గించుకునే బాటలో ప్రభుత్వం ఎస్జీబీల జారీని నిలిపివేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఫిజికల్గా బంగారం దిగుమతులను తగ్గించుకునే యోచనతో ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా ఈ ఏడాది జూలైలో వెలువడిన బడ్జెట్లో రూ. 18,500 కోట్ల విలువైన ఎస్జీబీల జారీకి ప్రణాళికలు వేసింది. అయితే గతేడాది జారీ చేసిన రూ. 26,852 కోట్లతో పోలిస్తే అంచనాలను భారీగా తగ్గించింది. ఎస్జీబీల గడువు ముగిశాక ప్రభుత్వం బంగారం మార్కెట్ ధరకు అనుగుణంగా ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించవలసి ఉంటుంది. అంతేకాకుండా వీటిపై నిరంతరంగా వడ్డీని సైతం చెల్లిస్తుంది. ఫలితంగా ప్రభుత్వంపై అదనపు రుణభారానికి ఆస్కారం ఏర్పడుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం 2026–27కల్లా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో రుణ(డెట్) నిష్పత్తిని తగ్గించుకునే ప్రణాళికల్లో ఉంది. దీంతో ఇకపై ఎస్జీబీలను జారీ చేసే యోచనకు ప్రభుత్వం స్వస్తి పలకవచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 14.7 కోట్ల యూనిట్లు జారీ2015 మొదలు ఆర్బీఐ 67 ఎస్జీబీ పథకాల ద్వారా మొత్తం 14.7 కోట్ల యూనిట్లను జారీ చేసినట్లు అంచనా. అయితే పసిడి విలువ ఎప్పటికప్పుడు పరుగు తీస్తుండటంతో వీటి విలువ సైతం పెరుగుతూ వస్తోంది. ఉదాహరణకు 2016లో గ్రాము(యూనిట్)కు రూ. 3,007 ధరలో ఎస్జీబీలను విడుదల చేసింది. వీటి గడువు తీరేసరికి విలువ రూ. 4,781 జంప్చేసి రూ. 7,788కు చేరింది. అంటే 8 ఏళ్లలో 159% వృద్ధి. అంతేకాకుండా వార్షికంగా 2.5% వడ్డీ కూడా లభించింది. దీంతో ఆర్బీఐ 2017 మే నెలలో, 2020 మార్చిలో జారీ చేసిన ఎస్జీబీలను ముందుగానే చెల్లించేందుకు ఈ ఏడాది ఆగస్ట్లో నిర్ణయించింది. తద్వారా ప్రభు త్వ రుణభారాన్ని తగ్గించేందుకు సంకలి్పంచింది. మరోవైపు ప్రభుత్వం సైతం జూలై బడ్జెట్లో పసిడిపై దిగుమతుల సుంకాన్ని 15% నుంచి 6 శాతానికి భారీగా తగ్గించింది.ఎస్జీబీలంటే కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఎస్జీబీలను జారీ చేస్తుంది. ఒక గ్రాము బంగారాన్ని ఒక యూనిట్గా జారీ చేస్తుంది. అప్పటి మార్కెట్ ధర ఆధారంగా వీటిని కేటాయిస్తుంది. అంటే ఇది పేపర్ గోల్డ్. కాలపరిమితి 8 ఏళ్లుకాగా.. ఐదేళ్ల తదుపరి ఎప్పుడైనా వీటిని విక్రయించేందుకు వీలుంటుంది. అప్పటి బంగారం మార్కెట్ ధర ఆధారంగా మెచ్యూరిటీ విలువ ఉంటుంది. అంతేకాకుండా వీటిపై తొలి ఏడాది నుంచి 2.5 శాతం వార్షిక వడ్డీ అందుతుంది. ఈ బాండ్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ట్రేడవుతాయి. పసిడి మెరుపులు అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు నిరంతరం బలపడుతూనే ఉన్నాయి. భవిష్యత్లోనూ మరింత పెరిగే అవకాశముంది. ఇందుకు రాజకీయ, భౌగోళిక అనిశి్చతులు, ప్రభుత్వాల విధానాలు, యుద్ధ భయాలు వంటి అంశాలు కారణంకానున్నట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశీయంగా 2015లో ఎస్జీబీలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఫిజికల్గా పసిడి కొనుగోళ్లకు చెక్ పెట్టే యోచనతో రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు వీటిని తీసుకువచి్చంది. తద్వారా ఫిజికల్ గోల్డ్ నుంచి పేపర్ గోల్డ్కు ఇన్వెస్టర్లను మళ్లించే ప్రయత్నం చేసింది. తొలుత 8 ఏళ్ల కాలపరిమితితో వీటికి శ్రీకారం చుట్టింది. ఐదేళ్ల గడువు తదుపరి మార్కెట్ ధరలకు అనుగుణంగా రిడీమ్ చేసుకునేందుకు వీలు కల్పించింది. 2017–18లో వ్యక్తులు, కుటుంబాలకు ఒక ఆర్థిక సంవత్సరంలో 4 కేజీలవరకూ పెట్టుబడులకు అనుమతించింది. ట్రస్ట్లు, సంబంధిత సంస్థలు 20 కేజీలవరకూ ఇన్వెస్ట్ చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచి్చంది. 2015–16లో జారీ చేసిన బాండ్ల ముఖ విలువపై 2.75 శాతం, తదుపరి కాలంలో జారీ చేసిన బాండ్లపై 2.5 శాతం వడ్డీ చెల్లింపునకు తెరతీసింది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 21న రూ. 8,008 కోట్ల విలువైన ఎస్జీబీలను జారీ చేసింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఉచితాలు.. శాపాలు!
ఎన్నికలవేళ అధికార, ప్రతిపక్షనేతలు ‘ఉచితాలు’పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఓటర్లు కూడా దీర్ఘకాలికంగా ఆర్థిక వెసులుబాటు కోసం ఆలోచించకుండా ఈ ‘ఉచితాలు’వైపే మొగ్గుతున్నారు. దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నికలవేళ ఇచ్చిన హామీలు నేరవేర్చడానికి అప్పు చేయాల్సి వస్తోంది. పార్టీలకు అతీతంగా గతంలో కంటే మరింత మెరుగైన ‘ఉచిత’ పథకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మ్యానిఫెస్టో తయారు చేయించుకుని ప్రచారాలకు వెళ్తున్నారు. అధికారంలోకి వచ్చాక వాటికోసం తిరిగి అప్పు చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. విభిన్న పార్టీలకు చెంది వివిధ రాష్ట్రాల్లో పాగా వేసిన కొన్ని ప్రభుత్వాల ఆర్థిక స్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.హిమాచల్ప్రదేశ్హిమాచల్ప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికంగా అప్పు కలిగిన రాష్ట్రంగా నిలిచింది. దీనికి రూ.95,000 కోట్ల అప్పు ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. వచ్చే రెండు నెలలపాటు మంత్రులు తమ జీతాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. సరైన నిధులులేక ఎన్నికలవేళ ఇచ్చిన హామీలు నెరవేర్చడం సవాలుగా మారుతుందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.మధ్యప్రదేశ్బీజేపీ గతేడాది రాష్ట్రంలో గెలుపొందడానికి ప్రధాన కారణం ‘లడ్లీ బెహనా’ పథకం అని ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. ఈ పథకం ప్రకారం వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలలోపు ఉండి 21-65 ఏళ్లు ఉన్న రాష్ట్ర మహిళలకు నెలకు రూ.1,000 నేరుగా తమ బ్యాంకులో జమ చేస్తారు. దీని అమలుకు ఈ ఏడాది రూ.18,984 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు ఒక్కనెలలోనే ఈ రాష్ట్రం రూ.10,000 కోట్లు అప్పు చేసింది. గతేడాది మొత్తంగా రూ.76,230 కోట్లు అప్పు పోగైంది. గడిచిన బడ్జెట్ సెషన్లో తెలిపిన వివరాల ప్రకారం మొత్తం రాష్ట్ర అప్పులు రూ.4.18 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఏడాది ప్రభుత్వ పథకాలు, ఇతర కార్యకలాపాల కోసం అదనంగా రూ.94,431 కోట్లు అప్పు తీసుకోవాలని నిర్ణయించుకుంది. వ్యవసాయ మోటార్ల కొనుగోలు కోసం రాయితీ రూపంలో రూ.4,775 కోట్లు చెల్లించాల్సి ఉంది. 100 యూనిట్లలోపు విద్యుత్తు వాడితే రూ.100 చెల్లించి బిల్లు మాఫీ చేసుకునే పథకానికి రూ.3,500 కోట్లు వెచ్చించాలి. రైతులు వాడే కరెంటు కోసం రూ.6,290 కోట్లు అవసరం అవుతాయి. బాలికల కోసం చేపట్టిన ‘లడ్లీ లక్ష్మీ’ పథకం కోసం రూ.1,231 కోట్లు కావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, లోన్ల వడ్డీ చెల్లింపు కోసం రూ.1,17,945 కోట్లు అవసరం. ఈ ఏడాది రాష్ట్ర ద్రవ్యలోటు 4.1 శాతం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది.కర్ణాటకకర్ణాటకలో కాంగ్రెస్ గతేడాది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మార్చిలో బోస్టన్ కన్సల్టింగ్ సంస్థను నియమించుకుని అదనంగా రూ.55 వేలకోట్లు-రూ.60 వేలకోట్లు ఎలా సమకూర్చుకోవాలో సలహాలు ఇవ్వాలని కోరింది. ఎన్నికలవేళ ప్రభుత్వం ప్రకటించిన ఐదు గ్యారంటీల అమలు ప్రస్తుతం ఆర్థికభారంగా మారుతుంది. గతేడాది ఐదు గ్యారంటీలకు రూ.36 వేలకోట్లు కేటాయించారు. ఈసారి దీన్ని రూ.53,674 కోట్లకు పెంచారు. కేవలం ‘గృహలక్ష్మీ’ పథకానికి అందులో సగం కంటే ఎక్కువ అంటే రూ.28,608 కోట్లు కేటాయించారు. పథకాల అమలు, ప్రభుత్వ కార్యకలాపాలకు ఈ ఏడాది కర్ణాటక రూ.1,05,246 కోట్ల అప్పు చేయాల్సి ఉంటుంది.పంజాబ్ఆమ్ఆద్మీపార్టీ రాష్ట్రంలోని రైతులు, గృహావసరాల కోసం రూ.17,110 కోట్లతో విద్యుత్ను అందిస్తోంది. మార్చి 2024 వరకు రాష్ట్ర అప్పులు మొత్తం రూ.3,51,130 కోట్లు ఉన్నట్లు ఆర్బీఐ డేటా తెలిపింది. రాష్ట్ర ద్రవ్యలోటు 3.8 శాతంగా ఉంది.ఇదీ చదవండి: ఆన్లైన్లో క్లెయిమ్ స్టేటస్తెలంగాణకాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చాలంటే ఏటా అదనంగా రూ.20,378 కోట్లు అవసరం అవుతాయి. రైతు రుణమాఫీ కోసం రూ.15,470 కోట్లు కావాల్సి ఉంది. మహాలక్ష్మీ ఉచిత బస్సు పథకానికి రూ.3,083 కోట్లు అవసరం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు కోసం రూ.1,825 కోట్లు కావాలి. వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12,000 హామీ ఇంకా అమల్లోకి రాలేదు. ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల కోసం రూ.5 లక్షలు-రూ.6 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇంకా దీనిపై స్పష్టత రాలేదు. -
TS: భారమైన క్రెడిట్ కార్డు బిల్లు.. దంపతుల ఆత్మహత్య
సాక్షి,మేడ్చల్: జిల్లాలోని కీసర పోలీస్స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కీసర గ్రామానికి చెందిన సురేశ్ కుమార్ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల అప్పుల భారం ఎక్కువ కావడంతో దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పిల్లలను బంధువుల ఇంటికి పంపించి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి.. కిస్వా జువెల్లరీ దోపిడీ కేసు కొలిక్కి -
అప్పు ప్రమాదఘంటికలివే..
డబ్బు.. మనిషిని ఆర్థికంగా ఎదిగేలా చేస్తుంది.. పతాలానికి తోసేస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే అప్పుల మూటలు కూడగట్టుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జీతం వస్తున్న వారు నిత్యం ఏదో రూపంలో అప్పులు తీసుకుంటారు. అప్పుల్లో కొన్ని మంచివి, మరికొన్ని చెడ్డవి ఉంటాయి. అప్పుచేసి ఆ సొమ్మును మరింత పెంచేలా ఎక్కడైనా పెట్టుబడిపెడితే అది మంచి అప్పు. అదే అప్పు విలాసాలకు వాడితే దాన్ని చెడు అప్పు అంటారు. తీసుకునే అప్పుపై సరైన అవగాహన లేకపోతే తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. చాలా మందికి వారు తీసుకున్న అప్పుతో మరింతో లోతుల్లోకి వెళుతున్నామని తెలియకపోవచ్చు. కానీ కొన్ని సంకేతాలను గుర్తించడం ద్వారా ఈ ప్రమాదాన్ని కొంత తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా వస్తువలు కొనాలంటే సరిపడా డబ్బు లేకుండా ఈజీ ఈఎంఐల బాట పడుతుంటారు. వ్యక్తిగత ఈఎంఐలు సులువే అనిపించినప్పటికీ, వీటివల్ల ఇతర ఖర్చులకు డబ్బు సరిపోదు. కిస్తీల విలువ నెలవారీ ఆదాయంలో 50శాతం కంటే తక్కువగా ఉండాలి. అనేక బ్యాంకులు వ్యక్తులు ఈ 50శాతం పరిమితి మించకుండా నిరోధించడానికి పరిమితులను కూడా విధించాయి. అయితే చాలా మంది ఈజీ ఈఎంఐలు, తగ్గింపులు, సేల్స్ ఆఫర్స్ ఆకర్షణకు లోనవుతారు. అనవసర ఖర్చులో మునిగిపోవడం వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. కనీస అవసరాలను తీర్చుకోవడానికి తరచు అప్పు తీసుకుంటే మాత్రం ఆర్థిక పరిస్థితి గురించి మరోసారి ఆలోచించుకోవాలి. అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు వంటి సాధారణ ఖర్చులను కవర్ చేయడానికి అప్పులు తీసుకోవడం వల్ల రుణఊబిలోకి కూరుకుపోయే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో దాదాపు అన్ని బ్యాంకులతోపాటు ఆన్లైన్ పేమెంట్ యాప్లు సైతం క్రెడిట్ కార్డ్లను ఆఫర్ చేస్తున్నాయి. అయితే చాలా మంది తమకున్న అప్పులు తీర్చడానికి క్రెడిట్కార్డులను తీసుకుంటుంటారు. కానీ అప్పులు తీర్చడానికి తిరిగి క్రెడిట్ కార్డ్ రూపంతో అధిక వడ్డీలకు అప్పుచేయడం దారుణం. దాంతో ఆ క్రెడిట్ కార్డ్ బకాయిలను సైతం తీర్చలేని పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. పరిస్థితి శ్రుతిమించితే తీసుకున్న అప్పులను రోల్ఓవర్ చేయాడానికి సైతం వెనుకాడరు. కానీ అలా చేస్తే భవిష్యత్తులో తిరిగి అప్పు పుట్టాలంటే చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం అని గ్రహించాలి. ఇదీ చదవండి: ఆగిపోతున్న సరకు రవాణా..! అప్పు తీసుకోడదా..? అంటే తీసుకోవాలి. కానీ అది మన ఆర్థిక పరిధిలో ఉండాలి. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. ప్రస్తుత జీతం ఆధారంగా అప్పు తీసుకోవడం మంచిదే కానీ, ఈఎంఐలను లెక్కించేటప్పుడు అన్ని కనీస అవసరాలుపోను జీతం సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. అంతకుమించి దాదాపు ఆరు నెలలకు సరిపడే అత్యవసర నిధిను ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
రుణభారాన్ని తగ్గించుకునేందుకే ప్రయత్నిస్తున్నాం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక స్థిరత్వం కోసం ద్రవ్య లోటును కట్టడి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భవిష్యత్ తరాలపై రుణాల భారం మోపకుండా చూసేందుకు తగు చర్యలు తీసుకుంటోందని ఆమె వివరించారు. కౌటిల్య ఆర్థిక సదస్సు 2023లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ప్రభుత్వ రుణభారాన్ని తగ్గించుకునేందుకు తోడ్పడే చర్యలన్నింటినీ పరిశీలిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ’దేశ స్థూల ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన అంశాలు, అలాగే ద్రవ్య నిర్వహణపరమైన బాధ్యతల గురించి, నేడు తీసుకునే నిర్ణయాల ప్రభావం భవిష్యత్ తరాలపై ఎలా ఉంటుందనే అంశం గురించి ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉంది. తదనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నాం’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే ప్రభుత్వ రుణభారం మరీ ఎక్కువగా లేకపోయినప్పటికీ, దాన్ని కూడా తగ్గించుకునే క్రమంలో మిగతా దేశాలు ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నాయనేది పరిశీలిస్తున్నట్లు ఆమె తెలిపారు. డిజిటల్ ఎకానమీ ద్వారా దేశీయంగా మరింత పారదర్శకత పెరుగుతోందని మంత్రి చెప్పారు. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తేవడంలో జన్ ధన్ ఖాతాలు కీలక సాధనాలుగా మారాయని వివరించారు. 2014లో ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు బోలెడన్ని సందేహాలు వ్యక్తమయ్యాయని, ఆ ఖాతాల్లో పైసా కూడా ఉండకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులకు నిర్వహణపరంగా భారమవుతాయనే విమర్శలు వచ్చాయని ఆమె చెప్పారు. అయితే, నేడు జన్ధన్ ఖాతాల్లో మొత్తం రూ. 2 లక్షల కోట్ల పైగా బ్యాలెన్స్ ఉందని మంత్రి తెలిపారు. కోవిడ్ పరిస్థితుల్లో నిరుపేదలు ఈ ఖాతాల ద్వారానే ప్రభుత్వం నుంచి నిధులు పొందగలిగారని వివరించారు. ‘ఉగ్ర’ ముప్పును కూడా పరిగణనలోకి తీసుకున్నాకే పెట్టుబడులు.. పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంతర్జాతీయంగా ఉగ్రవాద ముప్పు ప్రభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని వ్యాపారవర్గాలకు నిర్మలా సీతారామన్ సూచించారు. ఉగ్రవాదం ప్రస్తుతం యావత్ ప్రపంచంపైనా ప్రభావం చూపుతోందని, ఏ ఒక్క ప్రాంతమూ మినహాయింపుగా లేదని ఆమె పేర్కొన్నారు. వ్యాపారపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో భారీ స్థాయి రిస్కులు నెలకొన్నప్పుడు పెట్టుబడుల విషయంలో అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. -
ఐపీవోకి జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా
న్యూఢిల్లీ: రుణ భారాన్ని తగ్గించుకునేందుకు, విస్తరణ ప్రణాళికలను అమలు చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) రానుంది. దీని ద్వారా రూ. 2,800 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను (డీఆర్హెచ్పీ) నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఇప్పటికే జేఎస్డబ్ల్యూ గ్రూప్లో భాగమైన జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, జేఎస్డబ్ల్యూ స్టీల్.. స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయి ఉన్నాయి. దీంతో గ్రూప్ నుంచి జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా మూడో లిస్టెడ్ కంపెనీ కానుంది. కంపెనీకి వార్షికంగా 153.43 మిలియన్ టన్నుల కమోడిటీ కార్గో హ్యాండ్లింగ్ స్థాపిత సామర్థ్యం ఉంది. 2022 డిసెంబర్ 31 నాటికి సంస్థకు నికరంగా రూ. 2,875 కోట్ల రుణాలు ఉన్నాయి. 2022–23 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా రూ. 447 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
మోయలేని రుణ భారంతో... దేశాలే తలకిందులు
బెంగళూరు: మోయలేని రుణ భారం దెబ్బకు పలు వర్ధమాన దేశాల ఆర్థిక పరిస్థితి తలకిందులవుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వెలిబుచ్చారు. ఇది ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి కూడా ఇది ప్రమాద సంకేతమేనన్నారు. శుక్రవారం బెంగళూరులో మొదలైన జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల రెండు రోజుల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన వీడియో సందేశమిచ్చారు. మితిమీరిన అప్పులకు కరోనా కల్లోలం వంటివి శ్రీలంక దివాలా తీయడం, పాకిస్తాన్ కూడా అదే బాటన ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తిరిగి స్థిరత్వంతో కూడిన వృద్ధి బాట పట్టించడం, దానిపై విశ్వాసం పాదుగొల్పడం సంపన్న దేశాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల బాధ్యతేనని ఆయన హితవు పలికారు. ‘‘ఇదంత సులభం కాదు. కానీ నిర్మాణాత్మక ప్రయత్నం జరిగి తీరాలి. అయితే కాలానుగుణంగా సంస్కరించుకుని మారడంలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు వెనకబడటంతో వాటిపై విశ్వాసం సన్నగిల్లుతోంది. దీనిపైనా దృష్టి పెట్టాలి’’ అని అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పుల విపత్తునూ సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రపంచంలో పలుచోట్ల భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. ప్రపంచంలోని పలు దేశాల్లో కనీస సౌకర్యాలకూ నోచుకోక అలమటిస్తున్న దుర్బల ప్రజానీకాన్ని ఆదుకోవడంపై మరింత దృష్టి పెట్టాలన్నారు. ఆశాదీపంగా భారత్: కరోనా కల్లోలం దెబ్బ నుంచి కోలుకోవడానికి వర్ధమాన దేశాలు ఇంకా పోరాడుతూనే ఉన్న నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుత పనితీరు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని మోదీ ఆశాభావం వెలిబుచ్చారు. డిజిటల్ కరెన్సీలు, పేమెంట్లు, ప్రపంచ బ్యాంకు వంటి ఆర్థిక సంస్థల్లో సంస్కరణల ఆవశ్యకతతో పాటు కీలకమైన పర్యావరణ మార్పుల సమస్యను ఎదుర్కోవడంపై కూడా సదస్సులో చర్చించే అవకాశముంది. వ్యవసాయ కేటాయింపులు ఐదింతలు న్యూఢిల్లీ: దేశ వ్యవసాయ రంగ వార్షిక బడ్జెట్ కేటాయింపులు 2014తో పోలిస్తే ఐదింతలు పెరిగి రూ.1.25 లక్షల కోట్లకు చేరుకున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ప్రభుత్వం సాగు రంగం పురోగతిపై దృష్టి సారించి, వంటనూనెలు వంటి ఆహార వస్తువుల దిగుమతులను తగ్గించేందుకు కృషి చేస్తోందన్నారు. ‘వ్యవసాయం–సహకారరంగం’పై పోస్ట్–బడ్జెట్ వెబినార్లో ఆయన మాట్లాడారు. బడ్జెట్లో నిర్ణయాల సమర్థ అమలుకు సలహాల నిమిత్తం కేంద్రం ఈ వెబినార్లను నిర్వహిస్తోంది. -
ఆంధ్రా సిమెంట్స్ వైజాగ్ స్థలం విక్రయం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రా సిమెంట్స్కు చెందిన విశాఖపట్నం యూనిట్లో కార్యకలాపాలను కొనసాగించరాదని సాగర్ సిమెంట్స్ బోర్డు నిర్ణయించింది. నగర పరిధిలోకి ఈ యూనిట్ రావడమే కంపెనీ నిర్ణయానికి కారణం. విశాఖ యూని ట్ 107 ఎకరాల్లో విస్తరించింది. ఆంధ్రా సిమెంట్స్ వైజాగ్ యూనిట్ స్థలాన్ని విక్రయించే ప్రయత్నాలను చేస్తామని సాగర్ సిమెంట్స్ జేఎండీ శ్రీకాంత్ రెడ్డి ఇన్వెస్టర్లతో జరిగిన కాన్ఫరెన్స్ కాల్లో వెల్లడించారు. రుణ భారంతో ఉన్న ఆంధ్రా సిమెంట్స్ తాజాగా సాగర్ సిమెంట్స్ పరం అయిన సంగతి తెలిసిందే. డీల్ విలువ రూ.922 కోట్లు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అమరావతి బెంచ్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. జేపీ గ్రూప్నకు చెందిన ఆంధ్రా సిమెంట్స్కు గుంటూరు జిల్లా దాచేపల్లిలో క్లింకర్, సిమెంట్ ప్లాంటు, విశాఖపట్నం వద్ద గ్రైండింగ్ యూనిట్ ఉంది. -
వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి వాటా
న్యూఢిల్లీ: రుణ భారంతో సవాళ్లు ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా(వీఐఎల్)లో ప్రభుత్వం వాటా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. షేరు విలువ రూ. 10 లేదా ఆపై స్థిరత్వాన్ని సాధిస్తే వాటాను పొందనున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. వొడాఫోన్ ఐడియా బోర్డు రూ. 10 ముఖ విలువకే ప్రభుత్వానికి వాటాను ఆఫర్ చేసింది. ముఖ విలువకే షేర్లను పొందేందుకు సెబీ నిబంధనలు అనుమతిస్తాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. షేరు ధర రూ. 10 లేదా అపై స్థిరత్వాన్ని సాధించాక టెలికం శాఖ(డాట్) ఇందుకు గ్రీన్సిగ్నల్ ఇవ్వనున్నట్లు వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్ 19 నుంచి షేరు రూ. 10 దిగువనే కదులుతోంది. తాజాగా 0.5% నీరసించి రూ. 9.70 వద్ద ముగిసింది. జూలైలోనే...: వీఐఎల్లో ప్రభుత్వం వాటాను సొంతం చేసుకునేందుకు జూలైలోనే ఆర్థిక శాఖ ఆమోదించింది. రూ. 16,000 కోట్లమేర వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్పుచేసి ప్రభుత్వానికి కేటాయించేందుకు వీఐఎల్ ఇప్పటికే నిర్ణయించుకుంది. దీంతో కంపెనీలో ప్రభుత్వానికి 33 శాతం వాటా లభించనుంది. వెరసి వీఐఎల్లో ప్రమోటర్ల వాటా 74.99 శాతం నుంచి తగ్గి 50 శాతానికి పరిమితంకానుంది. ప్యాకేజీలో భాగంగా ఏజీఆర్ చెల్లింపులకు సంబంధించి వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్పు చేసేందుకు టెలికం కంపెనీలకు ప్రభుత్వం అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. కంపెనీకి జూన్ చివరికల్లా స్థూలంగా రూ. 1,99,080 కోట్ల రుణ భారముంది. -
కంపెనీల సమస్యాత్మక రుణాలు రూ.60 వేల కోట్లు అధికం!
ముంబై: ఉక్రెయిన్–రష్యా యుద్ధ సంక్షోభం కారణంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, రేట్ల విషయంలో మారనున్న ఆర్బీఐ కఠిన వైఖరి, బలహీన రూపాయి కారణంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలో సమస్యాత్మక రుణాలు (రిస్కీ డెట్) రూ.60,000 కోట్ల మేర పెరుగుతాయని ఇండియా రేటింగ్స్ తెలిపింది. కంపెనీల నిర్వహణ లాభంతో పోలిస్తే నికర రుణ భారం 5 రెట్లకు మించిన మొత్తాన్ని రిస్కీ డెట్గా పేర్కొంటారు. తాజా సంక్షోభం, అస్థిరతలతో ఈ తరహా రుణాలు 2022–23 ఆర్థిక సంవత్సరం చివరికి రూ.6.9 లక్షల కోట్లకు పెరుగుతాయని ఇండియా రేటింగ్స్ తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. వాస్తవానికి ఇవి రూ.6.3 లక్షల కోట్ల స్థాయిలోనే ఉండేవని తెలిపింది. 1,385 కంపెనీలను ఇండియా రేటింగ్స్ విశ్లేషించింది. యుద్ధ సంక్షోభం నేపథ్యంలో కంపెనీల ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గడానికితోడు.. పెరిగిపోయిన ద్రవ్యోల్బణంతో లాభాల మార్జిన్లు తగ్గిపోతాయని అంచనాకు వచ్చింది. రూపాయి బలహీనత వల్ల రుణాలపై వడ్డీ భారం ఒక శాతం మేర పెరుగుతుందని పేర్కొంది. కమోడిటీలను మడి సరుకులుగా వినియోగించుకునే కంపెనీల మార్జిన్లు 3 శాతం వరకు క్షీణిస్తాయని అంచనా వేసింది. -
బతుకు బాటలో కలిసి నడిచి.. కష్టంలోనూ ఒక్కటిగా
సాక్షి, శ్రీకాకుళం(పాలకొండ రూరల్): రెక్కల కష్టం నమ్ముకొని జీవించే కుమ్మరి దంపతుల కుటుంబం అప్పులు ఊబిలో కూరుకుపోయింది. కరోనా కష్ట సమయంలో తాము నమ్ముకున్న ఇటుక బట్టీ నడవక పోవటంతో దొరికిన చోటల్లా అప్పులు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. అయితే కోవిడ్ తగ్గుముఖం పట్టినా వారు చేసిన అప్పులు అలాగే ఉండిపోయాయి. ఇటుకల బట్టీ సక్రమంగా నడవకపోవటంతో అప్పు ఇచ్చినవారికి ముఖం చూపించలేని పరిస్థితి దాపురించింది. ఏమి చేయాలో పాలుపోక చావే శరణ్యమని భావించారు. గడ్డి నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడికట్టారు. బతుకు బాటలో కలిసి నడిచిన వారు కష్టంలోనూ ఒక్కటిగా తనువులు చాలించాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషాద ఘటనలో భర్త మరణించగా భార్య మృత్యువుతో పోరాడుతోంది. ఈ సంఘటన పాలకొండ మండలం చిన్నమంగళాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నాగవరపు రామారావు (47), తవిటమ్మ దంపతులు. వృత్తిరీత్యా కుమ్మరులు కావటంతో గ్రామ సమీపంలో ఇటుక బట్టీ నిర్వహిస్తున్నారు. కుమార్తెకు వివాహం చేయగా కుమారుడు గౌరితో కలసి ఉంటున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా ఇటుకల తయారీ పనులు నిలిచిపోవడంతో ఆర్థిక సమస్యలు వెంటాడాయి. ఇల్లు గడవడం భారంగా మారింది. దీంతో చేసేది లేక తెలిసిన వారివద్ద, దొరికినచోటల్లా అప్పులు చేసి కాలం నెట్టుకొచ్చారు. అయితే పనుల్లేక.. చేసిన అప్పులు తీర్చే దారిలేక లోలోన కుంగిపోయారు. చేసేది లేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం అందరితో కలివిడిగా ఉన్న వీరు ఆ రాత్రి గడ్డి నివారణకు వాడే మందును ఇంట్లోనే తాగేసి అపస్మారక స్థితికి చేరుకున్నారు. రాత్రి ఒంటిగంట సమయంలో కుమారుడు గౌరి నీరు తాగేందుకు ఇంట్లోకి వెళ్లగా తల్లిదండ్రులు స్పృహతప్పి పడిపోయి ఉండటాన్ని గుర్తించాడు. చదవండి: (విషాదం: బిడ్డ మరణాన్ని తట్టుకోలేక...) చుట్టపక్కల వారికి తెలియజేయటంతో వారు వచ్చి రామారావు, తవిటమ్మలను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే రామారావు మరణించగా తవిటమ్మ మృత్యువుతో పోరాడుతోంది. ఆమెను మెరుగైన వైద్యం కోసం వైద్యులు శ్రీకాకుళం రిఫర్ చేయగా ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న సీఐ జి.శంకరరావు, ఎస్సై సీహెచ్ ప్రసాద్లు మంగళవారం చిన్నమంగళాపురం వెళ్లి దర్యాప్తు చేపట్టారు. రామారావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కుమారుడు గౌరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తవిటమ్మ వద్ద వీడియో రూపంలో వాంగ్మూలం సేకరించగా అప్పులు బాధలే కారణమని ఆమె తెలిపినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అందరితో కలివిడిగా ఉండే దంపతులు తీసుకున్న నిర్ణయంతో చిన్నమంగళాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
బీమా నుంచి ఫ్యూచర్ గ్రూప్ ఔట్!
న్యూఢిల్లీ: రుణ భారంతో సతమతమవుతున్న రిటైల్ రంగ దిగ్గజం ఫ్యూచర్ గ్రూప్ తాజాగా బీమా రంగం నుంచి బయటపడే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. సమయానుగుణంగా భాగస్వామ్య సంస్థ(జేవీ) ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో తమకు గల వాటాను విక్రయించాలని భావిస్తోంది. ఈ జేవీలో ప్రస్తుతం ఫ్యూచర్ గ్రూప్నకు 49.91 శాతం వాటా ఉంది. దీనిలో 25 శాతం వాటాను జేవీలో మరో భాగస్వామి నెదర్లాండ్స్కు చెందిన జనరాలి పార్టిసిపేషన్స్కు విక్రయించనున్నట్లు ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. దాదాపు రూ. 1,253 కోట్ల విలువలో నగదు రూపేణా వాటాను విక్రయించనున్నట్లు తెలియజేసింది. -
యస్ బ్యాంక్.. 80 % జూమ్
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 266 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే లాభం ఏకంగా 80 శాతం ఎగిసింది. మొండిబాకీలకు ప్రొవిజనింగ్ గణనీయంగా తగ్గడం ఇందుకు తోడ్పడింది. నికర వడ్డీ మార్జిన్ 0.25 శాతం వృద్ధి చెంది 2.4 శాతానికి పెరిగినప్పటికీ .. రుణ వృద్ధి అంతంత మాత్రంగానే ఉండటంతో కీలకమైన నికర వడ్డీ ఆదాయం 31 శాతం క్షీణించి రూ. 1,764 కోట్లకు పరిమితమైంది. సమీక్షాకాలంలో రుణ వృద్ధి 4 శాతంగా నమోదైంది. క్యూ3లో ప్రొవిజనింగ్ రూ. 2,089 కోట్ల నుంచి ఏకంగా 82 శాతం తగ్గింది. రూ. 375 కోట్లకు పరిమితమైనట్లు బ్యాంకు ఎండీ, సీఈవో ప్రశాంత్ కుమార్ తెలిపారు. భారీ విలువ రుణాలను తగ్గించుకోవడంతో పాటు కార్పొరేట్లు రుణాల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి గైడెన్స్ను 10 శాతానికి కుదించుకున్నట్లు ఆయన వివరించారు. గతంలో ఇది 15 శాతంగా ఉండవచ్చని అంచనా వేశారు. -
ప్రభుత్వం చేతికి వొడాఐడియా!
న్యూఢిల్లీ: రుణ భారంతో సతమతమవుతున్న మొబైల్ సేవల టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి 35.8 శాతం వాటా లభించనుంది. ఇందుకు వీలుగా సుమారు రూ. 16,000 కోట్ల వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. ఈ ప్రణాళికలు అమలైతే వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా నిలవనుంది. తాజాగా నిర్వహించిన సమావేశంలో స్పెక్ట్రమ్ వేలం వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై చెల్లించవలసిన వడ్డీని ఈక్విటీగా మార్పు చేసేందుకు బోర్డు నిర్ణయించినట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఈ వడ్డీల ప్రస్తుత నికర విలువ(ఎన్పీవీ) రూ. 16,000 కోట్లుగా అంచనా వేసింది. ఈ అంశాలను టెలికం శాఖ(డాట్) ఖాయం చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ప్యాకేజీ ఎఫెక్ట్ కొంతకాలంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న టెలికం రంగానికి మేలు చేసే యోచనతో గతేడాది కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా టెలికం కంపెనీలు స్పెక్ట్రమ్ వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై చెల్లించవలసిన నాలుగేళ్ల కాలపు వడ్డీ వాయిదాలను ఎన్పీవీ ఆధారంగా ఈక్విటీకింద మార్పు చేసేందుకు అనుమతించింది. ప్రస్తుతం కంపెనీ సుమారు రూ. 1.95 లక్షల కోట్ల రుణ భారంతో సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిలో వాయిదాపడిన స్పెక్ట్రమ్ బకాయిలు రూ. 1,08,610 కోట్లు, ఏజీఆర్ బకాయిలు రూ. 63,400 కోట్లు ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంది. ఇక బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల రుణాలు రూ. 22,700 కోట్లుగా నమోదయ్యాయి. రూ. 10 విలువలో ఈక్విటీ కేటాయింపులకు పరిగణనలోకి తీసుకున్న 2021 ఆగస్ట్ 14కల్లా షేరు సగటు ధర కనీస విలువకంటే తక్కువగా ఉన్నట్లు వొడాఫోన్ ఐడియా ఈ సందర్భంగా వెల్లడించింది. ప్రభుత్వానికి షేరుకి రూ. 10 చొప్పున కనీస విలువలో ఈక్విటీని జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు డాట్ తుదిగా ధరను ఖరారు చేయవలసి ఉన్నట్లు పేర్కొంది. ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్లను జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ఈక్విటీ కేటాయింపుతో కంపెనీ ప్రమోటర్లుసహా వాటాదారులందరిపైనా ప్రభావముంటుందని వివరించింది. వెరసి తాజా ఈక్విటీ జారీతో కంపెనీలో ప్రభుత్వానికి 35.8% వాటా లభించనున్నట్లు అంచనా వేసింది. ప్రమోటర్లలో వొడాఫోన్ గ్రూప్ 28.5%, ఆదిత్య బిర్లా గ్రూప్ 17.8 శాతం చొప్పున వాటాలను కలిగి ఉంటాయని తెలియజేసింది. ప్రభుత్వ వాటా ఇలా.. ప్రభుత్వం తమ ప్రణాళికలకు అనుగుణంగా ఈ రుణాలలో ఎంతమేర కావాలనుకుంటే అంతవరకూ ఈక్విటీకి బదులుగా ప్రిఫరెన్స్ షేర్లుగా కూడా మార్చుకునే వీలున్నట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఇవి ఆప్షనల్గా, లేదా కచ్చితంగా మార్పిడి లేదా రీడీమబుల్గా ఎంచుకునే సౌలభ్యమున్నట్లు వెల్లడించింది. ఎస్యూయూటీఐ ద్వారా లేదా ప్రభుత్వం తరఫున ఏ ఇతర ట్రస్టీ ద్వారా అయినా ప్రభుత్వం వీటిని హోల్డ్ చేసే వీలున్నట్లు కంపెనీ వివరించింది. షేరు భారీ పతనం... ప్రభుత్వానికి వాటా జారీ వార్తల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో బీఎస్ఈలో ఈ షేరు ఇంట్రాడేలో 23 శాతంవరకూ దిగజారింది. రూ. 11.50 వద్ద కనిష్టానికి చేరింది. తదుపరి స్వల్పంగా కోలుకుని 20.5 శాతం నష్టంతో రూ. 11.80 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈలోనూ 21 శాతం పతనమై రూ. 11.75 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాప్(విలువ)లో రూ. 8,764 కోట్లు ఆవిరైంది. రూ. 33,908 కోట్లకు పరిమితమైంది. టాటా టెలీలోనూ వాటా.. వడ్డీ చెల్లింపులకు బదులుగా ఈక్విటీ జారీ న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉపశమన ప్యాకేజీలో భాగంగా టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించింది. వొడాఫోన్ ఐడియా బాటలో ఏజీఆర్ బకాయిలపై వడ్డీని ఈక్విటీగా మార్పు చేయడం ద్వారా ప్రభుత్వానికి కేటాయించనుంది. దీంతో టాటా టెలిలో ప్రభుత్వానికి 9.5 శాతం వాటా దక్కనున్నట్లు అంచనా. వడ్డీని షేర్లుగా జారీ చేసేందుకు వొడాఫోన్ ఐడియా నిర్ణయించిన వెనువెంటనే టాటా టెలి సైతం ఇదే బాటలో పయనించడం గమనార్హం! కాగా.. ఎన్పీవీ ప్రకారం దాదాపు రూ. 850 కోట్ల వడ్డీని ఈక్విటీగా కేటాయించనున్నట్లు తెలియజేసింది. బోర్డుకి చెందిన అత్యున్నత కమిటీ ఏజీఆర్ బకాయిలపై వడ్డీని పూర్తిగా ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించింది. షేర్ల జారీకి పరిగణించే 2021 ఆగస్ట్ 14కల్లా డాట్ మార్గదర్శకాల ప్రకారం సగటు షేరు ధర రూ. 41.50గా మదింపు చేసినట్లు తెలియజేసింది. అయితే ఇందుకు తుదిగా డాట్ అనుమతించవలసి ఉన్నట్లు పేర్కొంది. 2021 సెప్టెంబర్కల్లా కంపెనీలో ప్రమోటర్ల వాటా 74.36 శాతంగా నమోదైంది. మిగిలిన వాటా పబ్లిక్ వద్ద ఉంది. షేరు జూమ్... ప్రభుత్వానికి వాటా జారీ వార్తలతో టాటా టెలి కౌంటర్కు డిమాండ్ పుట్టింది. బీఎస్ఈలో ఈ షేరు 5 శాతం జంప్చేసి రూ. 291 వద్ద ముగిసింది. కంపెనీ ఏజీఆర్ బకాయిలు రూ. 16,798 కోట్లుకాగా.. వీటిలో ఇప్పటికే రూ. 4,197 కోట్లు చెల్లించింది. కాగా.. గత వారం మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ వడ్డీ చెల్లింపులకు బదులుగా ఈక్విటీ జారీ అవకాశాన్ని వినియోగించుకోబోమని స్పష్టం చేసిన విషయం విదితమే. -
సంచలనంగా మారిన రామకృష్ణ సెల్ఫీ వీడియో
-
ఏ భర్తకూడా వినకూడని మాటలు విన్నాను..
సాక్షి, ఖమ్మం: పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మీ సేవ నిర్వాహకుడు రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీవీడియో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వీడియోలో రామకృష్ణ తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవేంద్రరావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. వనమా రాఘవా తనను మానసికంగా వేధించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. వనమా అరాచకాలను చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఏ భర్తకూడా వినకూడని మాటలను రాఘవ అన్నారని ఆవేదన చెందాడు. రాజకీయ, ఆర్థిక బలంతో రాఘవ.. పబ్బం గడుపుకోవాలని చూశారని విమర్శించాడు. తాను చనిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు అందుకే.. వారితో పాటు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. తన సోదరుడు, అక్క కూడా ఇబ్బందిపెట్టారన్నారు. వనమా.. నా భార్యను హైదరాబాద్ తీసుకొస్తేనే నా సమస్యను పరిష్కారిస్తానని నీచంగా మాట్లాడాడు. వీరివల్ల మానసికంగా కృంగిపోయి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలిపాడు. కాగా, ప్రస్తుతం ఈ ఘటనపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. బీజేపీ నాయకులు వనమా ఇంటిని ముట్టడించారు. తక్షణం రాఘవను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: కుటుంబం ఆత్మహత్య కేసు.. సూసైడ్ నోట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడి పేరు? -
గతేడాదే కూతురు పెళ్లి.. అప్పు తీర్చలేక
సాక్షి, బల్మూర్(మహబూబ్నగర్): వ్యవసాయంతో పాటు కూతురు పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేక ఓ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్కు చెందిన ఏడుపుల లక్ష్మయ్య (45) శివారులో పదెకరాలు కౌలుకు తీసుకుని వివిధ పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య లక్ష్మమ్మతో పాటు కూతురు, కుమారుడు ఉన్నారు. రెండేళ్లుగా సరైన దిగుబడి లేదు. గతేడాదే కూతురు పెళ్లి చేశాడు. సుమారు రూ.5 లక్షల వరకు అప్పులు చేయగా ఎలా తీర్చాలోనని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు వెంటనే అచ్చంపేట ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి అక్కడే మృతి చెందాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ రాజు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: అర్జంటుగా దుస్తులు మార్చుకుంటానని స్నేహితురాలి గదికి వెళ్లి -
తనయుడిని హత్య చేసి దంపతుల ఆత్మహత్య
తిరువొత్తియూరు: అప్పుల బాధ కారణంగా కుమారుడిని హత్య చేసి భార్య, భర్త ఇద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్త చాకలిపేటలో సంచలనం కలిగించింది. విల్లుపురం జిల్లాకు చెందిన శివాజీ (45), అతని భార్య వనిత (32). వీరికి వెట్రివేల్ (10) అనే కుమారుడు ఉన్నాడు. శివాజీ చాకలిపేటలో వెంకటేశం వీధిలో అద్దె ఇంటిలో నివాసం ఉంటూ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో పని చేస్తున్నారు. ఇతను కుటుంబ ఖర్చుల కోసం పలువురి వద్ద అప్పు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అందరూ భోజనం చేసి పడుకున్నారు. బుధవారం ఉదయం చాలా సమయం అయినప్పటికీ శివాజీ కుటుంబ సభ్యులు బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు వెళ్లి చూశారు. ఆ సమయంలో శివాజి, వనిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కొత్తచాకలిపేట ఇన్స్పెక్టర్ చిదంబర భారతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సృహ తప్పి పడి వున్న బాలుడిని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మరో ఘటనలో సహకార సంఘం కార్యదర్శి ఆత్మహత్య పుదుకోట్టై జిల్లా కీరానూరుకు చెందిన నీలకంఠన్ (52). కీరనూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకులో కార్యదర్శిగా పని చేస్తున్నా డు. ఇతను నగలపై రుణాలు ఇవ్వడంలో 1.08 కోట్లు మోసం చేసినట్లు గుర్తించారు. అధికారులు నీలకంఠను అతనికి సహాయపడిన బ్యాంకు సూపర్వైజర్ శక్తివేల్ను తాత్కాలికంగా పని నుంచి తొలగించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న ఈ క్రమంలో కీరనూరులో నివాసం వుంటున్న నీలకంఠన్ ఇంటిలో బుధవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చదవండి: Punjab: ఫోన్ సంభాషణల ఆధారంగా విడాకులు మంజూరు చేయడం కుదరదు! -
వేర్వేరు కుటుంబాలకు చెందిన ఆరుగురు బలవన్మరణం
సాక్షి, చెన్నై(తమిళనాడు): అప్పుల భారంతో వేర్వేరు చోట్ల రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. సోమవారం వెలుగు చూసిన ఈ ఘటనల వివరాలు... తంజావూరు జిల్లా రెడ్డియార్ పాళయానికి చెందిన రాజ (38) రియల్ ఎస్టేట్ వ్యాపారి. భార్య కనకదుర్గా(33), కుమారుడు శ్రీవత్సన్ (11) ఉన్నారు. రెండేళ్లుగా వ్యాపారం దెబ్బతినడంతో అప్పులు పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఆదివారం రాత్రి కుమారుడిని హతమార్చి, దంపతులు ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాణిపేటలో మరో కుటుంబం రాణిపేట జిల్లా కావేరిపాక్కం సుబ్బమ్మాల్ మొదలియార్వీధికి చెందిన రామలింగం(66) ఆరోగ్య శాఖలో స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. ఓ ప్రైవేటు కళాశాలలో పార్ట్టైం తమిళ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. భార్య అనురాధా(57), కుమారులు విష్ణు(25), భరత్(22) ఉన్నారు. విష్ణుకు వివాహం కావడంతో బెంగళూరులో ఉంటున్నాడు. భరత్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. రామలింగం చేపల చెరువు కోసం చేసిన అప్పులు పెరిగిపోవడం.. ఇచ్చిన వారి నుంచి వేధింపులు అధికం కావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆదివారం రాత్రి రామలింగం, అనురాధా, భరత్ వేర్వేరు గదుల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
టాటా గూటికి మహారాజా!!
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్.. దశాబ్దాల క్రితం తాను నెలకొల్పిన విమానయాన సంస్థను తిరిగి దక్కించుకోవడానికి చేరువలో ఉంది. రుణభారంలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ ఎయిరిండియాను కొనుగోలు చేసే క్రమంలో అత్యధికంగా కోట్ చేసిన బిడ్డర్గా టాటా గ్రూప్ నిలి్చనట్లు సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సారథ్యంలో ఎయిరిండియా విక్రయంపై ఏర్పాటైన మంత్రుల కమిటీ (ఏఐఎస్ఏఎం) ఈ బిడ్పై ఆమోదముద్ర వేయాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిరిండియా కొనుగోలుకు సంబంధించి ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ స్పైస్జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్, టాటా గ్రూప్ దాఖలు చేసిన ఆర్థిక బిడ్లను డిజిన్వెస్ట్మెంట్పై ఏర్పాటైన కార్యదర్శుల కీలక బృందం బుధవారం పరిశీలించిందని వారు వివరించారు. నిర్దేశించిన రిజర్వ్ ధరతో పోల్చి చూసినప్పుడు టాటా గ్రూప్ అత్యధికంగా కోట్ చేసిన సంస్థగా నిలి్చందని పేర్కొన్నారు. ఇక ఈ ప్రతిపాదనను ఎయిరిండియా ప్రైవేటీకరణపై ఏర్పాటైన మంత్రుల కమిటీ ముందు ఉంచనున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. అయితే, ఇటు ఆర్థిక శాఖ అటు టాటా సన్స్ దీనిపై స్పందించేందుకు నిరాకరించాయి. ఏఐఎస్ఏఎంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. మరోవైపు, ఎయిరిండియా ఆర్థిక బిడ్లను ప్రభుత్వం ఆమోదించేసిందంటూ వచి్చన వార్తలను పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే తోసిపుచ్చారు. ‘ఎయిరిండియా డిజిన్వెస్ట్మెంట్ అంశంలో ఆర్థిక బిడ్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందంటూ మీడియాలో వస్తున్న వార్తలు సరి కావు. ఈ విషయంలో ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు మీడియాకు తెలియజేస్తాం’ అని ట్వీట్ చేశారు. టాటా గ్రూప్నకు ఇప్పటికే ఎయిర్ఏíÙయా ఇండియాలో మెజారిటీ వాటాలు ఉన్నాయి. ఇక, సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి విస్తారా అనే జాయింట్ వెంచర్ నిర్వహిస్తోంది. 2017 నుంచి అమ్మకానికి ప్రయత్నాలు.. ఇండియన్ ఎయిర్లైన్స్ను విలీనం చేసుకున్నాక 2007 నుంచి ఎయిరిండియా నష్టాల్లోనే కొనసాగుతోంది. భారీ రుణభారంలో కూరుకుపోయిన ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు 2017 నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పట్లో కంపెనీని కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో.. కేంద్రం గతేడాది అక్టోబర్లో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) నిబంధనలను సడలించింది. 2020 జనవరిలో దీపం జారీ చేసిన ఈవోఐ ప్రకారం 2019 మార్చి 31 నాటికి ఎయిరిండియా రుణం రూ. 60,074 కోట్లుగా ఉంది. ఇందులో దాదాపు రూ. 23,286.5 కోట్ల భారాన్ని కొత్త ఇన్వెస్టరు తీసుకోవాల్సి ఉంటుంది. మిగతాది ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ (ఏఐఏహెచ్ఎల్) పేరిట ఏర్పాటు చేసే స్పెషల్ పర్పస్ వెహికల్కి బదలాయిస్తారు. బిడ్డింగ్లో గెలుపొందిన సంస్థకు దేశీ ఎయిర్పోర్టుల్లో 4,400 దేశీ, 1,800 అంతర్జాతీయ సర్వీసుల విమానాల ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్లు లభిస్తాయి. అలాగే విదేశీ ఎయిర్పోర్టుల్లో 900 పైచిలుకు స్లాట్లు దక్కుతాయి. అలాగే చౌక విమాన సేవల సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో 100 శాతం, దేశీయంగా ప్రధాన విమానాశ్రయాల్లో కార్గో, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించే ఏఐఎస్ఏటీఎస్లో 50 శాతం వాటాలు లభిస్తాయి. 1932లో మహారాజా ప్రస్థానం ప్రారంభం... మహారాజా మస్కట్తో ఎంతో ప్రాచుర్యం పొందిన ఎయిరిండియా ప్రస్థానం .. 1932లో టాటా ఎయిర్లైన్స్ గా ప్రారంభమైంది. జహంగీర్ రతన్జీ దాదాభాయ్ (జేఆర్డీ) దీన్ని నెలకొల్పారు. తొలినాళ్లలో దీన్ని బాంబే, కరాచీ మధ్య పోస్టల్ సర్వీసులకు ఉపయోగించారు. ఆ తర్వాత ప్రయాణికులకు విమాన సరీ్వసులను ప్రారంభించాక కంపెనీ చాలా వేగంగా ప్రాచుర్యంలోకి వచి్చంది. సం స్థ ప్రకటనల్లో అప్పటి ప్రముఖ బాలీవుడ్ నటీమణులు దర్శనమిచ్చేవారు. విమానంలో ప్రయాణించే వారికి ఖరీ దైన షాంపేన్, ప్రసిద్ధ చిత్రకారుడు శాల్వడోర్ డాలీ గీసిన చిత్రాలతో రూపొందించిన పోర్సెలీన్ యాష్ట్రేలు వంటి విలాసాలు అందుబాటులో ఉండేవి. 1946లో టాటా సన్స్ ఏవియేషన్ విభాగం ఎయిరిండియాగా లిస్టయ్యింది. 1948లో యూరప్కు విమాన సేవలతో ఎయిరిండియా ఇంటర్నేషనల్ ఏర్పాటైంది. దేశీయంగా ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యానికి ఈ ఇంటర్నేషనల్ సరీ్వసే నాం ది. అప్పట్లో ఈ సంస్థలో ప్రభుత్వానికి 49 శాతం, టాటాలకు 25 శాతం, మిగతా వాటా పబ్లిక్ దగ్గర ఉండేది. 1953లో ఎయిరిండియాను కేంద్రం జాతీయం చేసింది. 1990లు, 2000ల దాకా ఎయిరిండియా ఆధిపత్యం కొ నసాగినా ఆ తర్వాత ప్రైవేట్ సంస్థలు కూడా రంగంలోకి దిగడం మొదలయ్యాక క్రమంగా ప్రాభవం తగ్గడం మొదలైంది. -
భారత్ విదేశీ రుణ భారం 570 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారత్ విదేశీ రుణ భారం 2021 మార్చి నాటికి వార్షికంగా 2.1 శాతం పెరిగి 570 బిలియన్ డాలర్లకు చేరిందని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రకటన ప్రకారం 2020 మార్చి ముగిసే నాటికి భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో విదేశీ రుణ భారం 20.6 శాతం ఉంటే, 2021 మార్చి నాటికి ఈ విలువ 21.1 శాతానికి చేరింది. ఒక్క సావరిన్ డెట్ వార్షికంగా 6.2 శాతం పెరిగి 107.2 బిలియన్ డాలర్లకు చేరింది. నాన్ సావరిన్ రుణాలు 1.2 శాతం పెరిగి 462.8 బిలియన్ డాలర్లకు ఎగసింది. నాన్ సావరిన్ డెట్లో వాణిజ్య రుణాలు, ఎన్ఆర్ఐ డిపాజిట్లు, స్వల్ప కాలిక వాణిజ్య రుణ అకౌంట్ వెయిటేజ్ 95 శాతం కావడం గమనార్హం. ఎన్ఆర్ఐ డిపాజిట్లు వార్షికంగా 8.7 శాతం పెరిగి 141.9 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య రుణాల విలువ 0.4 శాతం తగ్గి 197 బిలియన్ డాలర్లకు చేరింది. స్వల్పకాలిక వాణిజ్య రుణ అకౌంట్ 4.1 శాతం తగ్గి 97.3 బిలియన్ డాలర్లకు చేరింది. 2021 మార్చి నాటికి దీర్ఘకాలిక రుణం (ఏడాది దాటి వాస్తవ మెచ్యూరిటీ ఉన్నవి) 468.9 బిలియన్ డాలర్లు. వార్షికంగా ఈ విభాగంతో 17.3 బిలియన్ డాలర్లు పెరిగింది. -
కరస్పాండెంట్ దంపతులను కాటేసిన అప్పులు
కోవెలకుంట్ల(కర్నూలు జిల్లా): అప్పులు తీర్చే మార్గం కానరాక కోవెలకుంట్ల పట్టణంలోని లైఫ్ఎనర్జీ స్కూల్ కరస్పాండెంట్ దంపతులు సుబ్రమణ్యం(34), రోహిణి(28) ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. పట్టణానికి చెందిన రాధాకృష్ణమూర్తి స్థానిక వాసవీ బొమ్మిడాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేసి ఎనిమిది సంవత్సరాల క్రితం పదవీ విరమణ పొందారు. ఈయన కుమారుడు సుబ్రమణ్యం ఇదే కళాశాలలో కొంతకాలం కాంట్రాక్ట్ బేసిక్పై కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేశాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టణంలో 2017 నుంచి సొంతంగా ప్రైవేట్ పాఠశాల నడుపుతున్నాడు. ఈ క్రమంలో ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ. 2.50 కోట్ల అప్పులు చేశాడు. కరోనాతో ఏడాదిన్నర కాలంగా పాఠశాల సక్రమంగా నడవకపోవడంతో అప్పులు చెల్లించలేకపోయాడు. అప్పుదారులు ఒత్తిడి తీసుకురావడంతో మనస్తాపం చెందిన భార్యాభర్తలు ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి భార్య స్వగ్రామమైన ఆత్మకూరుకు బయలుదేరారు. అప్పుదారుల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మార్గమధ్యలో వాట్సాప్ స్టేటస్ పెట్టి మొబైల్ ఫోన్స్ స్విచ్ఆఫ్ చేసుకున్నారు. ఆత్మకూరు దగ్గర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. అటుగా వెళుతున్న వ్యక్తులు గమనించి ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ సుబ్రమణ్యం మృతి చెందాడు. రోహిణికి ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మృతి చెందింది. విషయం తెలియడంతో మృతుని తండ్రి, బంధువులు హుటాహుటినా ఆత్మకూరుకు బయలుదేరి వెళ్లారు. -
భర్త చేసిన పనికి భార్య పుస్తెల తాడు తీసిచ్చింది.. చివరకు..
సాక్షి, నిజామాబాద్: రుణ దాత అప్పు చెల్లించాలని ఒత్తిడి చేయగా భార్య మెడలోంచి పుస్తెల తాడు తీసిచ్చింది. అవమానం భరించలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన నవతే నాగరాజు గంజ్లో గుమాస్తాగా పనిస్తాడు. వ్యాపారం నిమిత్తం శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర రూ. లక్ష 20 వేలు అప్పుగా తీసుకున్నాడు. లాక్డౌన్ కారణంగా వ్యాపారం సరిగా నడవకపోవడంతో నష్టాల పాలయ్యాడు. అప్పు ఇచ్చిన శ్రీనివాస్ డబ్బులు చెల్లించాలంటూ నాగరాజ్ను ఒత్తిడికి గురిచేస్తూ.. పలుసార్లు ఇంటికి వెళ్లి నిలదీశాడు. నాగరాజు బైక్ను కూడా లాక్కొని వెళ్లాడు. బుధవారం శ్రీనివాస్ మరొకరితో కలిసి డబ్బులు చెల్లించాలని నాగరాజును ఇంటి వద్ద నిలదీశాడు. దీంతో నాగరాజు భార్య అఖిల తన భర్తను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తన మెడలోని బంగారు గొలుసు పుస్తెల తాడును తీసి శ్రీనివాస్కు ఇచ్చింది. అతను పూస్తెలతాడును తీసుకెళ్లాడు. దీంతో నాగరాజు తీవ్ర మనస్తాపం చెంది బెడ్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎంతకూ తలుపు తీయకపోవడంతో భార్య అఖిల ఇంటి యజమానిని తీసుకువచ్చి తలుపులు పగులగొట్టించింది. నాగరాజు ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించాడు. ఆగ్రహం చెందిన మృతుని బంధువులు అప్పుల పేరిట వేధించిన నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మూడో టౌన్ పోలీస్స్టేషన్ ఎదుట కొద్దిసేపు బైఠాయించారు. ఫిర్యాదు మేరకు నిందితుడు శ్రీనివాస్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సంతోష్కుమార్ తెలిపారు. -
జార్ఖండ్: హేమంత్ సొరేన్ ముందున్న సవాళ్లు
రాంచీ: జార్ఖండ్లోని అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడటంతో.. అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వానికి పెనుసవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. నిరుద్యోగం, పేదరికం, పెట్రేగుతున్న మావోయిస్టు కార్యకలాపాలు, వేధిస్తున్న ఆహార కొరత, రాష్ట్రం పేరిట ఇప్పటికే ఉన్న రుణభారంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపే బాధ్యత కాబోయే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్పై ఉంది. దేశవ్యాప్తంగా ఆసక్తిరేపిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీల కూటమి మెజారిటీ సాధించడంతో ఈ నెల 27న ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పెను సవాళ్లతో సతమతం అవుతున్న జార్ఖండ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి, ప్రజల అంచనాలను అందుకుంటారా అనేది వేచిచూడాల్సి ఉంది. రూ. 85 వేల కోట్ల రుణభారం: జార్ఖండ్ ప్రభుత్వంపై ఇప్పటికే రూ. 85 వేల కోట్ల రుణభారం ఉంది. గతంలో రఘుబర్దాస్ ప్రభుత్వం కొలువుదీరక(2014) ముందు రూ. 37,593 కొట్ల అప్పు ఉండేది. అయితే రఘుబర్దాస్ ప్రభుత్వం హయాంలో అదికాస్త గణనీయంగా పెరిగింది. దీంతో రుణభారం తగ్గించే పని హేమంత్ సొరేన్ భుజ స్కంధాలపై పడింది. కాగా రాష్ట్రంలోని రైతులు సుమారు రూ. 6వేల కోట్లకు పైగా రుణం తీసుకున్నారు. కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం రైతుల పేరిట ఉన్న రుణాన్ని మాఫీ చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ పేరు తప్పిస్తారా? దేశంలో పేద రాష్ట్రంగా ముద్ర పడిపోయిన 'బిహార్'.. ఆ ట్యాగ్ను 2000 సంవత్సరం నుంచి తొలగించుకొంది. తరువాత నుంచి ఛత్తీస్గఢ్ 'పేద రాష్ట్రం'గా కొనసాగుతుంది. పేదరికం నుంచి కాస్త మెరుగుపడుతున్నా.. బీద రాష్ట్రానికి ఏమాత్రం తీసిపోని జార్ఖండ్ రాష్ట్ర జనాభాలో 36.96 శాతం మంది ఇప్పటికీ దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. జార్ఖండ్కు ఉన్న 'బీద' రాష్ట్రమనే పేరును తప్పించడం కూడా హేమంత్ సొరేన్ ముందున్న సవాలు. ఆహార కొరత: ఆకలి చావుల కారణంగా జార్ఖండ్ రాష్ట్రం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. 2017లో ఇదే రాష్ట్రంలోని సిమ్దేగా జిల్లాలో సంతోషి అనే 11 ఏళ్ల అమ్మాయి ఆకలితో మరణించడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జార్ఖండ్కు ప్రతియేటా సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు అవసరమవుతాయి. కానీ అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. దీంతో 10 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఖాళీని పూరించడం హేమంత్ సొరేన్ ముందున్న మరో సవాలు. మావోయిస్టుల కట్టడి, శాంతి భద్రతలు: మావోయిస్టు ప్రభావిత రాష్ట్రమైన జార్ఖండ్లో ఇప్పటికే మావోయిస్టులను అదుపు చేస్తున్నా.. ఇంకా 13 మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉన్నాయి. అందులో ఖుంతి, లాతేహర్, రాంచీ, గుమ్లా, గిరిదిహ్, పలాము, గర్హ్వా, సిమ్దేగా, డుమ్కా, లోహర్దగా, బోకారో, ఛత్రా జిల్లాలు ఉన్నాయి. వీటిని మావోయిస్టు రహితంగా మలచడం హేమంత్ సోరెన్కు కత్తి మీద సామే. మూకదాడులతో రాష్ట్రానికి మచ్చ: పెరుగుతున్న మూకదాడుల కారణంగా జార్ఖండ్ రాష్ట్రం అపకీర్తిని మూట కట్టుకుంది. ఇక ఆ మచ్చను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిరుద్యోగ సమస్యను అధిగమిస్తారా? దేశంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న ఐదు రాష్ట్రాలలో జార్ఖండ్ ఒకటి. జార్ఖండ్ రాష్ట్రంలో ప్రతి అయిదుగురిలో ఒకరు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ డెవలప్మెంట్ నివేదిక ప్రకారం, రాష్ట్రంలో 46 శాతానికి పైగా పోస్టుగ్రాడ్యుయేట్లు, 49 శాతానికి పైగా గ్రాడ్యుయేట్లు ఎటువంటి ఉపాధి లేకుండా ఖాళీగా రోడ్ల మీద తిరుగుతున్నారు. 2018-19లో నిర్వహించిన ఎకనమిక్ సర్వే ప్రకారం, సుమారు లక్షమందికి పైగా యువతకు ప్రభుత్వం ఉపాధి పథకాల కింద శిక్షణ ఇచ్చినా.. ప్రతి పదిమంది యువతలో ఎనిమిది మంది ఉద్యోగం కోసం వెతుకులాటలో ఉన్నారు. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అయిన తరువాత నిరుద్యోగం అనే కష్టతరమైన సవాలును ఎదుర్కొని రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. వాగ్దానాలను నిలబెట్టుకుంటారా? 'రాష్ట్రంలో నిరుద్యోగమనేది దీర్ఘకాలిక వ్యాధి, మహమ్మారిలా వ్యాపించి మితిమీరుతుంది' అని హేమంత్ తన ఫేసుబుక్లో చెప్పుకొచ్చారు. 'దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం రేటు 7.2 శాతం ఉండగా, జార్ఖండ్ రాష్ట్రంలో మాత్రం 9.4 శాతంగా ఉంది. రఘుబర్దాస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి కల్పన పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిందని, సుమారు నాలుగు లక్షలకు పైగా నిరుద్యోగులు అధికారికంగా నమోదైనట్లు పేర్కొన్నారు. ఒకవేళ తమ ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే.. వంద శాతం నిరుద్యోగ యువతకు రాష్ట్రంలోనే ఉపాధి కల్పిస్తామని వాగ్దానం చేశారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి లభించేవరకూ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. -
'అప్పులు చేయడం ఆపితే భారం తగ్గుతుంది'
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడం ఆపితే ప్రజలపై భారం తగ్గుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వెంటనే బెల్ట్ షాపులు, పర్మిట్ రూల్స్, హైవేలపై మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అడ్డగోలుగా అప్పులు చేయడంతో రాష్ట్రం పై భారం పడుతుందని విమర్శించారు. ప్రభుత్వం చేసిన అప్పులను ప్రజలపై మద్య రూపంలో రుద్దుతుంది. మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులను మద్యం ద్వారా వచ్చే ఆదాయం వల్ల కేసీఆర్ పాలన చెయ్యాలని చూస్తున్నారు. సామాన్యుల నుంచి మద్యం పై ఏడాదికి దాదాపు 25వేల కోట్లు రాబడి వస్తుందని ఆయన తెలిపారు. సామాన్య ప్రజలను మద్యానికి బానిసగా చేసేందుకు విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్నాయి.ఇప్పటికైనా మద్యంపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తామని భట్టి హెచ్చరించారు. -
ఆర్కామ్ ఆస్తుల రేసులో ఎయిర్టెల్, జియో
న్యూఢిల్లీ: రుణభారంతో దివాలా పరిష్కార ప్రక్రియ ఎదుర్కొంటున్న టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) అసెట్స్ను కొనుగోలు చేసేందుకు 11 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. పోటీ కంపెనీలైన భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో కూడా వీటిలో ఉన్నాయి. ‘ మూడు సంస్థల (ఆర్కామ్, రిలయన్స్ టెలికం, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్) అసెట్స్ను కొనుగోలు చేసేందుకు మొత్తం 11 బిడ్స్ వచ్చాయి. వీటిలో వర్డే క్యాపిటల్, యూవీ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ మొదలైన సంస్థల బిడ్స్ కూడా ఉన్నాయి‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్కామ్ డేటా సెంటర్, ఆప్టికల్ ఫైబర్ వ్యాపారాన్ని కచ్చితంగా కొనుగోలు చేస్తుందని భావించిన ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ సంస్థ.. అసలు బిడ్ దాఖలు చేయలేదని వివరించాయి. బిడ్లను సోమవారమే ఖరారు చేయాల్సి ఉన్నప్పటికీ.. రుణదాతల కమిటీ (సీవోసీ) దీన్ని శుక్రవారానికి వాయిదా వేసినట్లు పేర్కొన్నాయి. ఆర్కామ్ సెక్యూర్డ్ రుణాలు దాదాపు రూ. 33,000 కోట్ల మేర ఉండగా.. దాదాపు రూ. 49,000 కోట్ల బాకీలు రావాల్సి ఉందని రుణదాతలు ఆగస్టులో క్లెయిమ్ చేశారు. బాకీల చెల్లింపు కోసం అసెట్స్ను విక్రయించేందుకు గతంలో కూడా ఆర్కామ్ ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. స్పెక్ట్రం చార్జీలు, లైసెన్సు ఫీజుల బాకీల కోసం ప్రొవిజనింగ్ చేయడంతో జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ. 30,142 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అటు కంపెనీ చైర్మన్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా చేసినప్పటికీ.. రుణదాతలు ఆమోదముద్ర వేయలేదు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు (ఎన్సీఎల్టీ) ఆర్కామ్ వ్యవహారం చేరింది. ఎన్సీఎల్టీ ఆదేశాల ప్రకారం పరిష్కార నిపుణుడు (ఆర్పీ) 2020 జనవరి 10లోగా దీన్ని పరిష్కరించాల్సి ఉంటుంది. స్టాక్ .. అప్పర్ సర్క్యూట్.. బిడ్డింగ్ వార్తలతో సోమవారం ఆర్కామ్ షేర్లు అప్పర్ సర్క్యూట్ను తాకాయి. ఆరు శాతం ఎగిశాయి. బీఎస్ఈలో ఆర్కామ్ షేరు 69 పైసలు పెరిగి రూ. 4.55 వద్ద ముగిసింది. -
కాఫీ కింగ్ విషాదాంతం వెనుక..
సాక్షి, న్యూఢిల్లీ : కాఫీకి కార్పొరేట్ హంగులద్ది కోట్లకు పడగలెత్తిన కేఫ్ కాఫీ డే (సీసీడీ) వ్యవస్దాపకుడు వీజీ సిద్ధార్ధ విషాదాంతం కార్పొరేట్ భారతాన్ని కలవరపరుస్తోంది. వేల కోట్ల టర్నోవర్తో పాటు కాఫీ తోటలు, భూములు, ఇతర వ్యాపారాలతో విస్తరించిన సీసీడీ సామ్రాజ్యాధినేత సిద్ధార్థ తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది అందరి మదినీ తొలిచేస్తోంది. అప్పులకు మించిన ఆస్తులున్నాయని యాజమాన్యం చెబుతుంటే డేరింగ్ ఎంట్రప్రెన్యూర్గా ఎదిగిన సిద్ధార్థ బలవన్మరణానికి పాల్పడటం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2019 మార్చి నాటికి సీసీడీ రుణభారం ఏకంగా రూ 6,547 కోట్లకు ఎగబాకిందని 2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంస్థ వెల్లడించిన అన్ఆడిటెడ్ ఆర్థిక ఫలితాలు వెల్లడించాయి. రుణభారం తగ్గించుకునేందుకు ఐటీ సంస్థ మైండ్ట్రీలో తనకున్న వాటాలను రూ 3269 కోట్లకు విక్రయించి ఆ నిధులన్నింటినీ పూర్తిగా రుణాలు తీర్చేందుకు వెచ్చించారు. ఈ ఒప్పందానికి సంబంధించి తమకు రూ 300 కోట్లకు పైగా పన్ను చెల్లించాల్సి ఉండగా తమకు కేవలం రూ 46 కోట్లే చెల్లించారని ఆదాయ పన్ను శాఖ సీసీడీపై దాడులు చేపట్టింది. ఇక సిద్ధార్థ కుటుంబానికి సీసీడీ పేరెంట్ కంపెనీ కాఫీడే ఎంటర్ప్రైజెస్(సీడీఈ)లో 53.43శాతం వాటా ఉంది. దీనిలో 75శాతం వాటాలు తనఖా కింద ఉన్నాయి. వ్యక్తిగతంగా సిద్ధార్థకు సీడీఈలో ఉన్న 32.75 శాతం వాటాలో దాదాపు 70శాతం షేర్లు తనఖాలోనే ఉన్నాయి. అప్పులు పెరిగి.. వాటా కరిగి.. రుణభారంతో సతమతం కావడం, ముసురుతున్న సవాళ్లతో సీడీఈ మార్కెట్ షేర్ పతనం సిద్ధార్థ ధీమా సడలిపోయేందుకు సంకేతమైంది. మార్చిలో రూ.3,500 కోట్లుగా ఉన్న సీడీఈ ప్రమోటర్ల వాటా విలువ మైండ్ట్రీ విక్రయ ప్రక్రియ ముగిసిన తర్వాత రూ.2,600 కోట్లకు పతనమైంది. కంపెనీ షేర్లు క్రమంగా నేలచూపులు చూడటంతో తనఖాలో ఉన్న సింహభాగం షేర్ల విలువ సైతం దిగజారింది. దీంతో ఉన్న అప్పులకు తోడు తనఖాలో ఉన్న షేర్లకు భద్రతగా మరికొన్ని నిధులు, ఆస్తులను హామీగా చూపాల్సిన పరిస్థితి నెలకొంది. మైండ్ట్రీలో వాటాలు విక్రయించినా అప్పులు కొలిక్కిరావడం, తనఖాలో ఉన్న షేర్ల విలువ తగ్గడంతో మరికొన్ని ఆస్తులను కుదువపెట్టాల్సిన పరిస్థతి సిద్ధార్ధపై ఒత్తిడి పెంచింది. కళ్లముందు లాభాలున్నా.. సీడీఈ ఏటా వెల్లడిస్తున్న ఆర్థిక ఫలితాల్లో నికర లాభం, మొత్తం రాబడి ఆకర్షణీయంగానే ఉన్నా పెరుగుతున్న అప్పులు, మార్కెట్లో ఎదురవుతున్న పోటీ సిద్ధార్ధను ఉక్కిరిబిక్కిరి చేసింది. కంపెనీ బోర్డు, ఉద్యోగులకు సిద్ధార్ధ రాసినట్టు చెబుతున్న లేఖలో తనను షేర్ల బైబ్యాక్పై ఓ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఒత్తిడి చేస్తోందని ప్రస్తావించారు. సిద్ధార్ధపై ఒత్తిడి తీసుకువచ్చిన పీఈ సంస్ధ ఎవరనేది ఇంకా వెల్లడికాలేదు. -
అంబానీ మరో కీలక నిర్ణయం : షేర్లు ఢమాల్
సాక్షి,ముంబై: అప్పుల ఊబిలో చిక్కుకున్న రిలయన్స్ గ్రూపు ఛైర్మన్ అనిల్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుతెలుస్తోంది. ముంబైలోని అతి విలాసవంతమైన భవన సముదాయాన్ని విక్రయించడమో లేదా అద్దెకివ్వడమో చేయాలని యోచిస్తున్నారట. తద్వారా కొన్ని అప్పులు తీర్చాలని భావిస్తున్నారు. ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవేలో 7లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రిలయన్స్ గ్రూప్నకు చెందిన శాంటాక్రూజ్ ప్రధాన కార్యాలయాన్ని విక్రయించడానికి లేదా దీర్ఘకాలిక లీజ్కివ్వడానికి యోచిస్తున్నారు అనిల్ అంబానీ. ఈ మేరకు గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థల గ్రూపు సంస్థ బ్లాక్స్టోన్ , యుఎస్ ఆధారిత ఫండ్తో చర్చలు జరుపుతున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. తద్వారా 1,500-2,000 కోట్ల రూపాయల సమకూర్చకోనుందని ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. మరోవైపు ఈ భవనం కూడా చట్టపరమైన వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో ఈ లావాదేవీకోసం ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జెఎల్ఎల్ను కూడా నియమించుకుంది. అంతేకాదు ప్రస్తుతం ఖాళీగా ఉన్న దక్షిణ ముంబైలోని తన బల్లార్డ్ ఎస్టేట్ కార్యాలయానికి తిరిగి వెళ్లాలని కూడా అంబానీ ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో అడాగ్ గ్రూపు షేర్లు భారీగా నష్టపోతున్నాయి. కాగా 2008లో 42 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 6వ ధనవంతుడైన అనిల్ అంబానీ కూడా గత నెలలో బిలియనీర్ క్లబ్ నుంచి కిందికి జారుకున్నారు. మార్చి 2018 నాటికి రిలయన్స్ గ్రూప్ కంపెనీల మొత్తం రుణం రూ.1.7 లక్షల కోట్లకు పైగా ఉంది. 11 సంవత్సరాలలో, అంబానీ మొత్తం వ్యాపార సామ్రాజ్యం ఈక్విటీ విలువ 3,651 కోట్ల రూపాయలకు (23 523 మిలియన్లు) కుప్పకూలింది. 2005 లో రిలయన్స్ సామ్రాజ్యాన్ని అన్నదమ్ములు (అన్న ముకేశ్ అంబానీ) తమలో తాము విభజించుకోవాలని నిర్ణయించుకున్న తరువాత అనిల్ అంబానీకి ఈ కార్యాలయం లభించింది. -
జెట్ ఎయిర్వేస్ దివాలా ప్రక్రియ ప్రారంభం
న్యూఢిల్లీ: రుణభారంతో కుదేలైన జెట్ ఎయిర్వేస్పై దివాలా ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కంపెనీకి రుణాలిచ్చిన 26 సంస్థల తరపున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)లో జెట్ ఎయిర్వేస్పై దివాలా ప్రక్రియ కోసం పిటీషన్ దాఖలు చేసింది.ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనం ఈ పిటీషన్ను ఈ నెల 20న స్వీకరించింది. 2016 నాటి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ చట్టం ప్రకారం తమ కంపెనీపై కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్(సీఐఆర్పీ) ఆరంభమైందని జెట్ ఎయిర్వేస్ పేర్కొంది. దివాలా ప్రక్రియ ప్రారంభమవడంతో తమ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ అధికారాలన్నీ సస్పెండ్ అవుతాయని, ఇంటెరిమ్ రిజల్యూషన్ ప్రొఫెషనల్(ఐఆర్పీ) బోర్డ్ అధికారాలు నిర్వహిస్తారని వివరించింది. రెండు వారాల పురోగతి నివేదిక భారత్లో దివాలా ప్రక్రియకు చేరిన తొలి విమానయాన సంస్థగా జెట్ ఎయిర్వేస్ నిలిచింది. ఐఆర్పీగా నియమితులైన ఆశీష్ చౌచారియా 90 రోజుల్లో రిజల్యూషన్ ప్రణాళికను అందజేయాలని ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనం ఆదేశించింది. సాధారణంగా రిజల్యూషన్ ప్రణాళికకు 180 రోజుల గడువు ఇస్తారు. అయితే జాతీయ ప్రాముఖ్యత గల అంశం కాబట్టి త్వరితంగా దీనిని ఒక కొలిక్కి తెచ్చే ఉద్దేశంతో 90 రోజుల గడువునే నిర్దేశించారు. జెట్ ఎయిర్వేస్ దివాలాపై తదుపరి విచారణ వచ్చే నెల 5న జరగనున్నది. అదే తేదీన రెండు వారాల పురోగతి నివేదికను ఐఆర్పీ సమర్పించాలని కూడా ముంబై ధర్మాసనం ఆదేశించింది. బ్యాంక్లు, ఇతర ఆర్థిక సంస్థలకు జెట్ ఎయిర్వేస్ కంపెనీ రూ.8,000 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులకు, ఇతర రుణదాతలకు, వెండార్లకు కలిపి మొత్తం వేల కోట్ల లోనే బకాయిలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి ఈ కంపెనీ కార్యకలాపాలు నిలిపేసింది. -
అప్పుల భారంతో అన్నదాతల ఆత్మహత్య
లింగపాలెం/రెంటచింతల (మాచర్ల)/బెళుగప్ప/శ్రీరంగరాజపురం: అప్పుల భారంతో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు రైతులు, మరో ఇద్దరు కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడగా, సాగుభూమిని ఆన్లైన్లో నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఇంకో రైతు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. వివరాలివి. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలంలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన రైతు బోయ పాండురంగ (32)కు 10 ఎకరాల పొలం ఉంది. అదే గ్రామంలో మరో 3 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని ఎనిమిదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. 13 ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తుండగా, తీవ్ర వర్షాభావం కారణంగా నాలుగేళ్ల నుంచి నష్టాల పాలయ్యారు. దీనికి తోడు తన పొలంలో బోరు వేయించడానికి రూ.లక్ష వరకు ఆ గ్రామానికి చెందిన వారినుంచి అప్పు చేశారు. బోర్లలో చుక్కనీరు కూడా రాకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. పంట పెట్టుబడి కోసం బయట వ్యక్తులతో చేసిన అప్పుల మొత్తం రూ 3.70 లక్షలకు చేరింది. అప్పులు తీర్చే దారిలేక పాండురంగ శనివారం తన పొలంలోనే వేప చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. తండ్రి హనుమంతప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ప్రస్తుతం నిండు గర్భిణి. పాండురంగ మృతి స్థానికులను కలచివేసింది. ఇద్దరు కౌలు రైతుల బలవన్మరణం అప్పుల భారంతో ఇద్దరు కౌలు రైతులు శనివారం ఆత్మహత్యకు ఒడిగట్టారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా నరసన్నపాలెంకు చెందిన కౌలు రైతు కొమ్ము నాగరాజు (38) ఆరేళ్లుగా గ్రామంలోని కూరపాటి లక్ష్మికి చెందిన 6 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని నాటు పొగాకు సాగు చేస్తున్నారు. పెట్టుబడులు పెరగడం, ఆశించిన దిగుబడులు రాకపోవడంతో నాగరాజు అప్పుల పాలయ్యారు. పంట రుణం కోసం బంగారాన్ని కూడా బ్యాంకులో తాకట్టు పెట్టడంతో భార్యాభర్తల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో మనోవేదనకు గురైన నాగరాజు శనివారం పురుగు మందు తాగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చింతలపూడిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే నాగరాజు మృతిచెందారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ధర్మాజీగూడెం ఎస్సై రాజేష్ కేసు నమోదు చేశారు. ఇదిలావుంటే.. గుంటూరు జిల్లా మంచికల్లు గ్రామానికి చెందిన మల్లెం సాంబయ్య (62) తనకున్న 30 సెంట్ల పొలంతో పాటు మరో 20 ఎకరాలను కౌలుకు తీసుకుని తన కుమారులు నరసింహరావు, రమేష్తో కలిసి ఏటా వరి సాగు చేస్తున్నారు. సాగు కలిసి రాకపోవడంతో రూ.12 లక్షల వరకు అప్పులు పేరుకుపోయాయి. గత రబీలో పైరు ఆశాజనకంగా ఉన్న సమయంలో కాలువలకు సాగునీటి విడుదల నిలిచిపోయింది. కళ్లముందే పంట నిలువునా ఎండిపోయింది. పంట దెబ్బతినడం, అప్పులు కొండలా పేరుకుపోవడంతో మనోవ్యథకు గురైన సాంబయ్య శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందును తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బావులు ఎండిపోవడంతో.. అప్పులు పేరుకుపోవడం, గొట్టపు బావులు ఎండిపోవడంతో చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం మూలూరు గ్రామానికి చెందిన వెంకటేశులరెడ్డి (56) శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంకటేశులరెడ్డికి నాలుగు ఎకరాల పొలం ఉండటంతో వరి, వేరుశనగ పంటలు సాగు చేస్తున్నాడు. పొలంలో గొట్టపు బావులు వేసేందుకు 7 సంవత్సరాల క్రితం సుమారు రూ.4 లక్షలు అప్పు చేశాడు. రెండేళ్ల క్రితం బ్యాంకులో రూ.2.70 లక్షల పంట రుణం తీసుకున్నాడు. వర్షాభావంతో 6 నెలల క్రితం బోర్లు ఎండిపోవడంతో పంటలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో అప్పు ఎలా తీర్చాలో అర్థంకాని వెంకటేశులురెడ్డి మనస్తాపానికి గురై శనివారం గ్రామం సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. భూమి వివరాలను ఆన్లైన్ చేయకపోవడంతో.. వంగర: సాగులో ఉన్న భూమి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయమని పదే పదే వేడుకున్నా ఫలితం లేకపోవడంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం వెలుగు కార్యాలయంలో శనివారం ఈ ఘటన జరిగింది. సంగాం గ్రామానికి చెందిన బోను లక్ష్మీనారాయణమ్మ పేరుతో ఉన్న సాగు భూమిని ఆన్లైన్లో నమోదు చేయాలని ఆమె కుమారుడు మధు 40 రోజులుగా వీఆర్వో చుట్టూ తిరుగుతున్నారు. ఫలితం లేకపోవడంతో వెలుగు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డెప్యూటీ తహసీల్దార్ బి.గోవిందరావు వద్దకు కుటుంబ సభ్యులంతా వెళ్లి బైఠాయించారు. తమ సమస్యను పట్టించుకోలేదంటూ అసహనానికి గురైన మధు టిన్నుతో తెచ్చిన పెట్రోల్ను ఒంటిపై పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. డీటీ గోవిందరావుతోపాటు అక్కడ ఉన్న వారు అడ్డుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. భూములను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ బండారు రామారావు హామీ ఇచ్చారు. -
నారాయణరెడ్డిని అప్పులు మింగేశాయి
బోర్లు వేసి చీనీ, వేరుశనగ సాగు చేసి అప్పుల పాలైన రైతు నారాయణరెడ్డి(51) ఆత్మహత్య చేసుకొని ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు ఆయన కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం అందలేదు. నారాయణరెడ్డిది అనంతపురం జిల్లా శింగనమల మండలం జలాలపురం గ్రామం. అప్పుల బాధతో 2017 సెప్టెంబరు 16న ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అతనికి 11 ఎకరాల భూమి ఉంది. భార్య రమాదేవి పేరు మీద 7.50 ఎకరాలు, కుమారుడు అనిల్కుమార్రెడ్డి పేరు మీద 4 ఎకరాల భూమి ఉంది. బోరులో నీళ్లు తగ్గిపోవడంతో పొలంలోని చీనీ చెట్లను 2009లో కొట్టేశారు. అప్పట్నుంచీ వర్షాధారంగా వేరుశనగ సాగు చేస్తున్నారు. తదనంతరం అప్పు చేసి నాలుగు బోర్లు వేయిస్తే రూ. 1.6 లక్షలు ఖర్చయింది కానీ నీళ్లు పడలేదు. ఆ తర్వాత ప్రతి ఏటా అప్పుచేయడం, వేరుశనగ వేయటం. పంట సరిగ్గా రాక ప్రతి ఏటా అప్పు పెరగడం. చివరకు అప్పు రూ. 4 లక్షల చేరింది. అప్పల బాధ భరించలేక నారాయణరెడ్డి 2017 సెప్టెంబర్ 16న ఆత్మహత్య చేసుకున్నారు. అతనికి భార్య రమాదేవి, కుమారుడు అనిల్కుమార్రెడ్డి ఉన్నారు. కుమారైకు వివాహం చేశారు. అనిల్కుమార్రెడ్డి అనంతపురంలో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ‘పరిహారం నేటికీ అందలేదు. పెట్టుబడి లేక భూములు బీడు పెట్టుకున్నాం..’ అన్నారు రమాదేవి. – మునెప్ప, సాక్షి, శింగనమల -
గోయల్.. ‘జెట్’ దిగెన్!
ముంబై: కొన్ని నెలలుగా కొనసాగుతున్న జెట్ ఎయిర్వేస్ సంక్షోభానికి పరిష్కారం దొరికింది. తీవ్ర నిధుల కొరత, రుణ భారం సమస్యలను ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్కు బ్యాంకులు తక్షణమే రూ.1,500 కోట్ల మేర నిధులను అందించనున్నాయి. జెట్ ఎయిర్వేస్ చైర్మన్ పదవి నుంచి, కంపెనీ బోర్డు నుంచి నరేష్ గోయల్, ఆయన సతీమణి అనితాగోయల్ తప్పుకున్నారు. ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కమిటీ రూపొందించిన పరిష్కార ప్రణాళికలో భాగమే ఇది. ఈ ప్రణాళికకు సోమవారం అత్యవసరంగా సమావేశమైన జెట్ ఎయిర్వేస్ బోర్డు ఆమోదం తెలిపింది. మధ్యంతర నిధుల సాయం పొందడమే ఈ సమావేశం ప్రధాన ఎజెండాగా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా జెట్ ఎయిర్వేస్కు చెందిన 80కు పైగా విమానాలు సర్వీసులు నడపలేని పరిస్థితుల్లో నిలిచిపోయిన విషయం విదితమే. నరేష్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్, ఎతిహాద్ ఎయిర్వేస్ పీజేఎస్సీ నామినీ డైరెక్టర్ కెవిన్ నైట్ జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి వైదొలిగారు. కంపెనీలో ఎతిహాద్కు 24 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే. డెట్ ఇనుస్ట్రుమెంట్ల జారీ ద్వారా బ్యాంకులు రూ.1,500 కోట్లు అందించనున్నాయి. జెట్ ఎయిర్వేస్ బ్యాంకులకు రూ.8,000 కోట్లకు పైగా రుణాలను చెల్లించాల్సి ఉంది. దీంతో 11.4 కోట్ల షేర్లను బ్యాంకులకు జారీ చేయడం ద్వారా రుణాన్ని ఈక్విటీగా కంపెనీ మార్చనున్నది. దీంతో బ్యాంకులకు సంస్థలో నియంత్రిత వాటా 51 శాతం లభిస్తుంది. ప్రమోటర్ నరేష్ గోయల్ వాటా ప్రస్తుతమున్న 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గుతుంది. అలాగే, అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్ వాటా 24 శాతం నుంచి 12 శాతానికి తగ్గుతుంది. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, పర్యవేక్షణకు మధ్యంతర మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తూ కూడా జెట్ ఎయిర్వేస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. మెకెన్సీ అండ్ కో సహకారంతో బోర్డు డైరెక్టర్ల పర్యవేక్షణ కింద ఈ కమిటీ పనిచేస్తుంది. ప్రమోటర్లకు చెందిన ఇద్దరు నామినీలు, ఎతిహాద్ ఎయిర్వేస్ తరఫున ఒక నామినీ జెట్ ఎయిర్వేస్ బోర్డులో కొనసాగుతారని జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ఉద్యోగుల్లో ఆందోళన మరోవైపు జనవరి నుంచి ఉద్యోగులకు జెట్ ఎయిర్వేస్ వేతనాలను చెల్లించడం లేదు. డిసెంబర్ నెలకు సంబంధించి కూడా కేవలం 12.5 శాతం వేతనాలనే చెల్లించింది. దీంతో పైలట్లు, ఇంజనీర్లు, ఇతర కీలక విధుల్లోని ఉద్యోగులు ఇతర విమానయాన సంస్థల్లో ఉపాధి వెతుక్కుంటున్న పరిస్థితి ఉంది. ‘‘మాకు కూడా ఆర్థిక బాధ్యతలు ఉన్నాయి. ఎయిర్లైన్ ఒక్కసారిగా కుప్పకూలితే ఏమవుతుందన్న భయం ఉంది. మా బకాయిలు మార్చి 31 నాటికి చెల్లించాలి. అలాగే, మా కంపెనీకి సంబంధించి రోడ్మ్యాప్ సిద్ధం కావాలి’’ అని నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ ఆసిమ్ వలైని పేర్కొన్నారు. విషాద దినం: అజయ్సింగ్ దేశ విమానయాన రంగానికి ఇదొక విషాద దినంగా స్పైస్జెట్ చీఫ్ అజయ్సింగ్ వ్యాఖ్యానించారు. నరేష్ గోయల్, ఆయన సతీమణి అనితా గోయల్ జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి తప్పుకోవాల్సి రావడంతో అజయ్సింగ్ ఇలా స్పందించారు. ప్రపంచస్థాయి ఎయిర్లైన్ సంస్థను ప్రారంభించి నరేష్ గోయల్, అనితా గోయల్ భారత్ గర్వపడేలా చేశారని పేర్కొన్నారు. విమానయాన సంస్థలను పోటీ పడలేకుండా చేస్తున్న నిర్మాణాత్మక సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెట్టేందుకు విధాన నిర్ణేతలకు ఇదొక మేల్కొలుపుగా అభివర్ణించారు. వీటిని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. షేరు పరుగు... గోయల్ వైదొలగిన వార్తలతో జెట్ షేరు 17 శాతానికి పైగా పెరిగింది. బీఎస్ఈలో చివరికి 12.69 శాతం లాభంతో రూ.254.50 వద్ద స్థిరపడింది. బ్యాంకుల నిర్ణయం పట్ల జైట్లీ సంతోషం న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్కు సంబంధించి ప్రభుత్వరంగ బ్యాంకులు తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకులు స్వప్రయోజనాలతోపాటు, ప్రజా ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకున్నట్టు చెప్పారు. ‘‘మరిన్ని విమానాలు, ఎయిర్లైన్స్ భారత్కు అవసరం. లేదంటే చార్జీలు పెరిగిపోతాయి. జెట్ ఎయిర్వేస్ సంస్థ కార్యకలాపాలు కొనసాగే విధంగా బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. అప్పుడే అవి తమ బకాయిలను వసూలు చేసుకోగలవు. ఈ నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నా’’ అని జైట్లీ పేర్కొన్నారు. మే నాటికి కొనుగోలుదారుల ఖరారు ఎస్బీఐ చైర్మన్ రజనీష్ జెట్ ఎయిర్వేస్కు సంబంధించి కొనుగోలుదారులు లేదా పెట్టుబడిదారులను మే చివరి నాటికి ఖరారు చేస్తామని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ పేర్కొన్నారు. ప్రమోటర్ అయిన నరేష్ గోయల్ సైతం త్వరలో జరిగే బిడ్డింగ్లో పాల్గొనేందుకు అర్హులేనని చెప్పారు. బ్యాంకులు ఇచ్చిన రుణాలను ఈక్విటీగా మార్చడం వల్ల జెట్ ఎయిర్వేస్లో... ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకులకు 51 శాతం వాటా ఉండనుంటే, నరేష్ గోయల్ వాటా ప్రస్తుత 50 శాతం నుంచి 25 శాతానికి దిగొస్తుంది. అలాగే, అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్ వాటా 24 శాతం నుంచి 12 శాతానికి తగ్గుతుంది. జెట్ ఎయిర్వేస్ విక్రయానికి సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియను జూన్ నాటికి పూర్తి చేయాలన్నది ప్రణాళిక. అయితే, మే 31 నాటికే ఇది ముగుస్తుందన్న ఆశాభావాన్ని రజనీష్ కుమార్ వ్యక్తం చేశారు. ‘‘ఎవరు రావాలన్నా జెట్ ద్వారాలు తెరిచే ఉంటాయి. ఏప్రిల్ 9 నాటికి ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 30 నాటికి బిడ్డింగ్ ముగుస్తుంది. మే నాటికి ఇన్వెస్టర్ను ఖరారు చేస్తాం’’ అని రజనీష్ కుమార్ తెలిపారు. ఫైనాన్షియల్ ఇన్వెస్టర్ లేదా ఎయిర్లైన్.. నరేష్ గోయల్ అయినా లేదా ఎతిహాద్ అయినా ఇన్వెస్ట్ చేయవచ్చన్నారు. బిడ్డింగ్కు ఎవరికీ నిషేధం లేదని స్పష్టం చేశారు. జెట్ ఎయిర్వేస్ను కాపాడడమే: గోయల్ జెట్లో పనిచేసే 22,000 మంది ఉద్యోగుల కుటుంబ ప్రయోజనాల కంటే తనకు ఏదీ పెద్ద త్యాగం కాదని కంపెనీ చైర్మన్, బోర్డు నుంచి తప్పుకున్న నరేష్ గోయల్ వ్యాఖ్యానించారు. 25 ఏళ్లుగా సేవలు అందిస్తున్న జెట్ ఎయిర్వేస్ను స్థాపించినది నరేష్ గోయల్. 1992 నుంచి కంపెనీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ‘‘నా కుటుంబంలోని 22,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యల కోసమే జెట్ఎయిర్వేస్ బోర్డు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. నా కుటుంబం నాతో, నా వెనుకనే ఉన్నది. మీరు కూడా నా నిర్ణయానికి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నా’’ అని చెప్పారు. కొత్త అధ్యాయం ఇప్పుడే మొదలు జెట్ బోర్డు నుంచి తప్పుకున్న నేపథ్యంలో తమ ప్రయాణం ముగిసిపోలేదని, నూతన అధ్యాయం ఇప్పుడే మొదలైందన్నారు గోయల్. రుణ పునర్నిర్మాణ ప్రణాళిక ఆమోదంతో జెట్ బలమైన, స్థిరమైన ఆర్థిక మూలాలపై నిలబడుతుందన్న ఆశాభావాన్ని 22,000 మంది ఉద్యో గులకు రాసిన లేఖలో గోయల్ వ్యక్తం చేశారు. సంస్థకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందన్నారు. -
మాల్దీవులకు భారత్ 10వేల కోట్ల సాయం
న్యూఢిల్లీ: చైనా రుణ భారం నుంచి విముక్తి కల్పించేందుకు మాల్దీవులకు భారత్ సాయం అందించనుంది. దీంతోపాటు దెబ్బతిన్న సంబంధాలను తిరిగి బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్న మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్తో సోమవారం భారత ప్రధాని నరేంద్రమోదీ చర్చలు జరిపారు. అధ్యక్షుడు యమీన్ హయాంలో చైనా నుంచి తీసుకున్న రుణ భారం నుంచి బయటపడేందుకు వీలుగా మాల్దీవులకు రూ.10వేల కోట్ల రుణ సాయం అందజేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ సందర్భంగా రెండు దేశాల నేతలు నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశారు. హిందూమహా సముద్ర ప్రాంతంలో భద్రతను మరింత పెంచేందుకు సహకరించుకోవాలని ఇద్దరు నేతలు అంగీకరించారు. -
ఎయిర్ ఇండియా ‘ఎస్పీవీ’!
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు సంబంధించిన కీలకం కాని ఆస్తులను, రుణ భారాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కంపెనీ(స్పెషల్ పర్పస్ వెహికల్–ఎస్పీవీ) బదలాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎయిర్ ఇండియా పునర్వ్యస్థీకరణలో భాగంగా ఈ ఎస్పీవీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లుగా ప్రభుత్వ ఉన్నతాధికారొకరు పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా వాటా విక్రయం విఫలం కావడంతో ఎయిర్ ఇండియాను గట్టెక్కించే యత్నాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. దాంట్లో భాగంగానే ఎస్పీవీ ఏర్పాటు విషయమై కసరత్తు చేస్తోంది. కాగా గత ఏడాది మార్చి నాటికి ఎయిర్ ఇండియా రుణ భారం రూ.48,000 కోట్లకు మించిపోయింది. -
ప్రభుత్వ రుణం @ రూ.76.94 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రుణ భారం 2017–18 జనవరి–మార్చి త్రైమాసికం అంతక్రితం త్రైమాసికంతో పోల్చితే (అక్టోబర్–డిసెంబర్) 1.7% పెరిగింది. మొత్తంగా రూ.76.94 లక్షల కోట్లకు చేరింది. 2017 డిసెంబర్తో ముగిసిన కాలానికి ఈ విలువ రూ.75.66 లక్షల కోట్లు (రూ.75,66,215 కోట్లు). రుణ నిర్వహణపై విడుదల చేసిన త్రైమాసిక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. మొత్తం రుణంలో పబ్లిక్ డెట్ 88.7%గా ఉంటే, ‘పబ్లిక్ అకౌంట్’ వాటా 11.3%. పబ్లిక్ డెట్లో మార్కెట్ రుణాలు, స్పెషల్ బేరర్ బాండ్లు, ట్రెజరీ బిల్స్, స్పెషల్ లోన్స్, ఆర్బీఐ జారీ చేసే బాండ్లు ఉంటాయి. చెల్లించాల్సిన అంతర్జాతీయ రుణం దీనిలో ఉంటుంది. స్టేట్ ప్రావిడెంట్ ఫండ్స్, చిన్న పొదుపులతోపాటు డిపాజిట్ల రూపం లో తీసుకున్న డబ్బు పునఃచెల్లింపులకు సంబంధించి మొత్తాలను పబ్లిక్ అకౌంట్గా వ్యవహరిస్తారు. -
ఎయిరిండియాకు నిధుల కష్టాలు
న్యూఢిల్లీ: భారీ రుణభారంతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియా... కొన్నాళ్లుగా నిధుల కొరతతో తీవ్రంగా సతమతమవుతోంది. రిపేర్లకు, స్పేర్ పార్టులు కొనేందుకు కూడా డబ్బులు లేక పలు విమానాలను నిరుపయోగంగా పక్కన పడేసింది. పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి (పీఏసీ) పౌర విమానయాన శాఖ తెలియజేసిన వివరాల ప్రకారం.. ఎయిరిండియాలో ప్రతి నెలా రూ. 200– 250 కోట్ల మేర నగదు లోటు ఉంటోంది. నిర్వహణకు తగినన్ని నిధులు లేకపోవడం వల్ల ఎయిరిండియా విమానాలకు విడి భాగాలు కూడా కొనలేకపోతోందని, దీంతో కంపెనీకి చెందిన అనేక విమానాలు నిరుపయోగంగా మూలన పడి ఉంటున్నాయని పౌర విమానయాన శాఖ.. పీఏసీకి తెలిపింది. కొన్ని విమానాల లీజును పునరుద్ధరించినప్పటికీ.. నిర్దిష్ట షరతులను పూర్తి చేయాల్సి ఉన్నందున వాటిని కూడా సంస్థ నడపలేకపోతోందని వివరించింది. నిర్వహణ వ్యయాల్లో మెయింటెనెన్స్ ఖర్చుల వాటా 12 శాతానికి పెరిగి రూ. 2,500 కోట్ల స్థాయిలో ఉంటోందని పేర్కొంది.దాదాపు రూ. 48,876 కోట్ల రుణభారం ఉన్న ఎయిరిండియాను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆర్థిక కష్టాల నుంచి బయటపడే దిశగా... ప్రాపర్టీల విక్రయం ద్వారా నిధులు సమీకరించుకునేందుకు ఉద్దేశించిన టర్న్ అరౌండ్ ప్రణాళికను 2011 నుంచి అమలు చేస్తున్నప్పటికీ సంస్థకు అవసరమైన నిధులు సమకూరడం లేదు. దీని ప్రకారం ఏటా రూ.500 కోట్ల సమీకరించుకునే అవకాశం ఉన్నప్పటికీ... టైటిల్ డీడ్స్లో లోపాలు, లీజుకిచ్చిన ప్రాపర్టీని అమ్ముకోవడానికి లేదంటూ పట్టణాభివృద్ధి శాఖ అడ్డం పడటం మొదలైన వాటి కారణంగా ఇప్పటిదాకా కేవలం రూ.725 కోట్లు మాత్రమే సమకూర్చుకోగలిగింది. అమ్మకానికి నిబంధనల సడలింపు.. కఠిన నిబంధనల పేరిట ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు ఏ సంస్థా ముందుకు రాకపోతుండటంతో ప్రభుత్వం కొన్ని షరతులను సడలించింది. ఎయిరిండియాను కొనుక్కున్న సంస్థ... హోల్డింగ్ కంపెనీ కింద దాన్ని నిర్వహించే వెసులుబాటునివ్వాలని నిర్ణయించింది. ఒకవేళ ఇప్పటికే కొనుగోలు కంపెనీకి ఇతర ఎయిర్లైన్ బ్రాండ్ ఉన్న పక్షంలో రెండింటినీ సమన్వయం చేసుకునే వెసులుబాటు కూడా కల్పించనుంది. ‘ఉదాహరణకు కొనుగోలుదారుకు ఇప్పటికే ఎ, బి అనే ఎయిర్లైన్స్ బ్రాండ్స్ ఉంటే... ఆ రెండింటితో పాటు ఎయిరిండియాను కూడా ఒకే హోల్డింగ్ కంపెనీ కిందికి చేర్చవచ్చు. అయితే, మూడేళ్లు గడిచే దాకా మిగతా బ్రాండ్స్తో ఎయిరిండియాను విలీనం చేయడానికి ఉండదు’ అని సంబంధిత వర్గాలు వివరించాయి. ప్రస్తుతం ఉన్న షరతుల ప్రకారం ఎయిరిండియాలో ప్రభుత్వ వాటాలు కొనసాగినంత కాలం కొనుగోలుదారు దాన్ని ప్రత్యేకంగానే కొనసాగించాల్సి ఉంటుంది. భారీ మార్పులు చేయడానికి గానీ తమ గ్రూప్లోని ఇతర వ్యాపారాల్లో దీన్ని విలీనం చేయడానికి గానీ లేదు. గతంలో ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు టాటా సన్స్ తదితర సంస్థలు ఆసక్తి కనపర్చినప్పటికీ.. ఇలాంటి నిబంధనల కారణంగా వెనక్కి తగ్గాయి. అసలు బిడ్డర్లే కరువవడంతో పునరాలోచనలో పడిన ప్రభుత్వం నిబంధనలను పునఃసమీక్షించింది. అంతర్జాతీయంగా ఏవియేషన్ రంగంలో కొనుగోళ్లు, విలీనాల డీల్స్కి సంబంధించి హోల్డింగ్ కంపెనీ విధానం సర్వసాధారణంగానే అమలవుతోంది. ఉదాహరణకు 2005లో జర్మనీకి చెందిన లుఫ్తాన్సా సంస్థ.. స్విట్జర్లాండ్కి చెందిన స్విస్ను కొనుగోలు చేసినప్పుడు ఎయిర్ట్రస్ట్ అనే హోల్డింగ్ కంపెనీని పెట్టి, స్విస్ షేర్లను కొనుగోలు చేసింది. ఇప్పటికీ స్విస్ సర్వీసులు ప్రత్యేక బ్రాండ్గానే కొనసాగుతున్నాయి. -
అప్పుల బాధతో ఆగిన రైతు గుండె
రాప్తాడు: వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని ఆందోళనకు గురైన రైతు గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. రాప్తాడు మండలం పాలవాయి గ్రామానికి చెందిన రైతు హనుమంతు నాయక్ (67)కు నాలుగు ఎకరాల పొలం ఉంది. నాలుగైదేళ్లుగా వేరుశనగ సాగుచేసినా పంట చేతికందలేదు. వ్యవసాయ పెట్టుబడులతోపాటు ఇద్దరు కూతుళ్లు, కుమారుల వివాహాల కోసం బయటి వ్యక్తులతో అప్పులు చేశాడు. ఇటీవల పొలంలో నాలుగు బోర్లు వేయించి అరకొర నీటితోనే టమాట, బెండ, అనుము పంటలు సాగు చేసినా ఆశించినస్థాయిలో దిగుబడులు రాలేదు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో పంటలు ఎండుముఖం పట్టాయి. ఎలాగైనా పంటను కాపాడుకోవాలని మరో బోరు వేయించినా నీరు పడలేదు. ఈ క్రమంలో అప్పులు రూ.8లక్షలకు చేరుకున్నాయి. పెరిగిన రుణదాతల ఒత్తిళ్లు వరుస పంట నష్టాలతో కుదేలైన హనుమంతునాయక్కు రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. శనివారం రాత్రి కూడా రుణదాతలు ఇంటి దగ్గరకు వచ్చి అప్పు తీర్చాలని పట్టుబట్టారు. నాలుగైదు రోజుల్లో అప్పు తీర్చేస్తానని చెప్పి వారిని పంపించేశాడు. మానసిక వేదనకు గురైన రైతు ఆ పూట అన్నం కూడా తినకుండా అలాగే పడుకున్నాడు. అప్పులపై చర్చిస్తూ కుప్పకూలిపోయాడు వ్యవసాయం కలసిరాకపోవడం, అప్పులు పెరిగిపోవడంపై భార్య దస్లీబాయితో హనుమంతునాయక్ ఆదివారం మధ్యాహ్నం చర్చించాడు. తర్వాత భోజనం తినకుండానే ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. గ్రామస్తులతో అప్పుల విషయమై చర్చిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి అప్పులబాధ తట్టుకోలేక గుండెపోటుకు గురై రైతు హనుమంతునాయక్ మృతిచెందిన విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పాలవాయి గ్రామాన్ని సందర్శించారు. మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. రుణదాతల నుండి ఒత్తిళ్లు అధికం కావడంతోనే హనుమంతు నాయక్ మృతి చెందాడన్నారు. మృతుని కుటుంబానికి వెంటనే ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బోయ రామాంజినేయులు, యూత్ మండల కన్వీనర్ చిట్రెడ్డి సత్య నారాయణరెడ్డి, నాయకులు రామచంద్రారెడ్డి, పోతన్న, పాలవాయి పుల్లయ్య, మురళినాయక్, గొవింద నాయక్ పాల్గొన్నారు. -
రూ.66.61 లక్షల కోట్లకు కేంద్ర రుణ భారం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రుణ భారం 2017 డిసెంబర్ ముగింపు నాటికి రూ.66.61 లక్షల కోట్లకు పెరి గింది. ప్రభుత్వ రుణ భారం (పబ్లిక్ అకౌంట్ కింద ఉన్న రుణాలను మినహాయిస్తే) ఈ ఆర్థిక సం వత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.65.80 లక్షల కోట్లుగా ఉంది. దీంతో పోలిస్తే డిసెంబర్ త్రైమాసికం లో రుణ భారం 1.22% పెరిగింది. ఈ గణాంకాలను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ‘‘2017–18 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.1,64,000 కోట్ల మేర డేటెడ్ సెక్యూరిటీలు (నిర్ణీత కాలంలో తిరిగి చెల్లించాల్సినవి) విడుదల చేసింది. రెండో త్రైమాసికంలో విడుదల చేసిన రూ.1,89,000 కోట్ల కంటే తక్కువే. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన డేటెడ్ సెక్యూరిటీల మొత్తం విలువ రూ.5,21,000 కోట్లు’’ అని ఆర్థిక శాఖ తెలిపింది. -
ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంతో తెలుసా..?
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్పై గత ఏడాది మార్చి నాటికి రూ.2,16,027 కోట్ల మేర అప్పుల భారం ఉన్నట్లు ఆర్థికశాఖ సహాయ మంత్రి పొన్.రాధాకృష్ణ రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి మంగళవారం అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ ఈ వివరాలు వెల్లడించారు. అప్పులపై 2017–18 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ కింద రూ.14,738 కోట్లు చెల్లించాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసిందని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం రూపొందించిన ద్రవ్య సూచిక ప్రకారం రాష్ట్ర స్థూల ఆదాయంలో అప్పుల నిష్పత్తి 2017–18 ఆర్థిక సంవత్సరానికి 25.09% ఉంటుందని అంచనా వేయగా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 28.11%కు చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేసిందన్నారు. రాష్ట్ర ప్రజల తలసరి అప్పు ఎంత ఉందో చెప్పడానికి అధికారిక గణాంకాలు ఏవీ అందుబాటులో లేవన్నారు. ఫార్మా డీ గ్రాడ్యుయేట్ల ఉద్యోగాల కోసం పలు చర్యలు ఫార్మా డీ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాల కల్పన కోసం ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆరేళ్ల ఫార్మా డీ కోర్సు పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ ఆరోగ్య విభాగం, ప్రైవేట్ ఆస్పత్రులలో తమ అర్హతకు తగిన ఉద్యోగాలు రాక మానసిక క్షోభకు గురవుతున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ దృష్టికి తెచ్చారు. సీనియర్ ఫార్మసిస్ట్, చీఫ్ ఫార్మసిస్ట్, డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఫార్మసిస్ట్ లాంటి ఉద్యోగాలకు అర్హుల జాబితాలో ఫార్మా డీ గ్రాడ్యుయేట్లను కూడా చేర్చినట్లు మంత్రి తన జవాబులో వివరించారు. ఫార్మసిస్ట్ పోస్టుకు ఫార్మా డీను విద్యార్హతగా నిర్ధారిస్తూ నియామక నిబంధనలు సవరించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) లేఖలు రాసిందన్నారు. ఫార్మా డీ గ్రాడ్యుయేట్లు ఫార్మసీ కళాశాలల్లో బోధన నిర్వహించేందుకు కూడా అర్హులేనని చెప్పారు. ఇంకా మదింపు దశలోనే ప్రపంచ బ్యాంకు రుణం రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి రూ.3,324 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణం ఇంకా పరిశీలన దశలో ఉన్నట్లు కేంద్ర మంత్రి రాధాకృష్ణ తెలిపారు. విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ... ఈ ప్రాజెక్టుపై ప్రపంచబ్యాంకు బృందం మదింపు చేస్తోందని, ఇది ఇంకా ప్రాథమిక అంచనాలు, అధ్యయనాల దశలోనే ఉందని తెలిపారు. మదింపు, సంప్రదింపులు పూర్తయిన తర్వాతనే రుణానికి ప్రపంచబ్యాంకు ఆమోద ముద్ర వేస్తుందన్నారు. ఈ సందర్భంగా అమరావతి కేపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఉన్నతాధికారి ఒకరు ఈ ప్రాజెక్ట్కు రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంక్ ఆమోదం తెలిపినట్లుగా మీడియా ప్రతినిధులకు చేసిన ప్రకటనను విజయసాయిరెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. గత పార్లమెంట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనకు విరుద్ధంగా తాము ఏమీ మాట్లాడలేదంటూ ఆ ఉన్నతాధికారి వివరణ ఇచ్చారని తెలిపారు. -
అక్కడ పోస్టుమార్టం..ఇక్కడ పాప జననం
మోర్తాడ్(బాల్కొండ) : నవ మాసాలు తన మాతృ గర్భంలో పెరిగిన శిశువు ఈ రోజే బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అప్పుడే పుట్టిన చిన్నారి ఇంకా కనుపాపను తెరువలేదు. ఆడ పిల్ల జన్మించడంతో తమ ఇంటికి మహాలక్ష్మి నడచి వచ్చిందనే సంతోషించాలో లేక ఆ చిన్నారి తండ్రి అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినందుకు దుఃఖించాలో తెలియని అయోమయ పరిస్థితి ఆ కుటుంబానిది. బుధవారం సాయంత్రం గుమ్మిర్యాల్, తాళ్లరాంపూర్ల మధ్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన వడ్లూరి జాన్సన్(30) మృత దేహానికి గురువారం ఆర్మూర్లోని ఆసుపత్రిలో పోస్టుమార్టం జరుగుతుంది. అదే సమయంలో జాన్సన్ భార్య సలోనికి పురిటి నొప్పులు ఆగిపోవడంతో ఆర్మూర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు ప్రసవం చేశారు. జాన్సన్ మృత దేహానికి ఒక వైపు పోస్టుమార్టం జరుగుతుండగానే మరో వైపు ఆపరేషన్ ద్వారా అతని భార్యకు వైద్యులు ప్రసవం చేశారు. ఒకే రోజు ఒకే సమయంలో ఒకే పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఎవరికి ఏమి వివరించాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గల్ఫ్ మోసాలతో విసిగిపోయిన జాన్సన్ ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని ఆయన భార్య సలోనికి తెలిపే ధైర్యం ఎవరికీ లేకుండా పోయింది. జాన్సన్ మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృత దేహాన్ని ఆర్మూర్ నుంచి గుమ్మిర్యాల్కు తరలించి ఖననం చేశారు. జాన్సన్ భార్య సలోనికి ఆపరేషన్ చేయడంతో ఆమెకు ఈ విషయం వివరించకుండా జాన్సన్ వస్తాడనే నమ్మకాన్ని కలిగిస్తూనే ఉన్నారు. జాన్సన్ ఆత్మహత్య కారణంగా రెండు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది. -
టెలికం వృద్ధికి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడం
టెలికం మంత్రి మనోజ్ సిన్హా న్యూఢిల్లీ: టెలికం రంగ వృద్ధి కోసం ఎలాంటి కఠిన నిర్ణయాలైనా తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సంకోచించదని టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. తీవ్రమైన రుణ భారంతో సతమతమౌతోన్న టెలికం పరిశ్రమ ఆర్థిక ఇబ్బందుల పరిష్కారానికి సంబంధించి ఏర్పాటు చేసిన అంతర మంత్రిత్వ శాఖ బృందం (ఐఎంజీ) తన నివేదిక రెండు వారాల్లోగా సమర్పించే అవకాశముందని చెప్పారు. ఈయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. ‘అన్ని అంశాలకు సంబంధించిన సమాచారం మా వద్ద ఉంది. కేవలం ఒక వైపు అభిప్రాయాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేం. ఐఎంజీ నివేదిక కోసం వేచి చూస్తున్నాం. దేశంలో టెలికం పరిశ్రమకి సంబంధించిన విజయగాథ ఉంది. దీన్ని అలాగే కొనసాగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం’ అని వివరించారు. అంతర మంత్రిత్వ శాఖ బృందం సిఫార్సులపై వేగంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా టెలికం రంగ రుణం భారం రూ.4.6 లక్షల కోట్లను తాకిన విషయం తెలిసిందే. ఇక రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికం కంపెనీల ఆదాయం, లాభదాయకతపై తీవ్రమైన ఒత్తిడి నెలకొని ఉంది. -
ఎయిరిండియాను అమ్మినా.. ఎవరూ కొనరు!
♦ కంపెనీ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది... ♦ అయినా, డిజిన్వెస్ట్మెంట్ ప్రసక్తే లేదు... ♦ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలు న్యూఢిల్లీ: పీకల్లోతు నష్టాలు, భారీ రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న ఎయిరిండియాను ప్రభుత్వం అమ్ముదామనుకున్నా కొనేవారు ఎవరూ ఉండరని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటమే దీనికి కారణమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎయిరిండియాలో వాటాను విక్రయించే(డిజిన్వెస్ట్మెంట్) అవకాశాలేవీ లేవన్నారు. సంస్థను గట్టెక్కించడం కోసం ఎల్లకాలం పన్ను చెల్లింపుదారుల సొమ్ము(ప్రభుత్వ నిధులు)ను వెచ్చించడం కూడా సాధ్యం కాదని స్పష్టం చేశారు. 2007లో ఇండియన్ ఎయిర్లైన్స్ విలీనం తర్వాత నుంచి ఎయిరిండియా పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ప్రస్తుతం సంస్థ మొత్తం రుణ భారం రూ.50,000 కోట్లుగా అంచనా. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎయిరిండియాకు రూ.30,000 కోట్ల మేర సహాయ ప్యాకేజీని అందించారు. ఇతరుల మాదిరిగా తాను ఎయిరిండియాను నిందించేపని చేయబోనని.. అయితే, కంపెనీ టర్న్అరౌండ్ లక్ష్యాలు సాకారం కావాలంటే నిర్వహణ విషయంలో మరింత సమర్థవంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అశోక్ గజపతి పేర్కొన్నారు. కాగా, దేశీ విమానయాన రంగంలో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం వచ్చే నాలుగేళ్లలో ఎయిరిండియా కొత్తగా 100 విమానాలను సమకూర్చుకోవాలని భావిస్తోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటనా ఇంకా వెలువడనప్పటికీ.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.6-8 కోట్ల మేర నిర్వహణ లాభాలను నమోదు చేసినట్లు సమాచారం. అయితే, నికర నష్టం మాత్రం రూ.2,636 కోట్లుగా అంచనా. 2014-15 ఏడాది నష్టం రూ.5,859 కోట్లతో పోలిస్తే ఇది 60 శాతం తగ్గడం గమనార్హం. ఎయిరిండియాకు మళ్లీ ఆర్థికంగా మంచి రోజులు వస్తాయన్న పూర్తి విశ్వాసం ఉందని మంత్రి పేర్కొన్నారు. టారిఫ్లపై పరిమితులేవీ ఉండవు... ఎయిర్లైన్ కంపెనీలు ఇష్టానుసారంగా టారిఫ్లు పెంచేస్తున్నాయన్న ప్రయాణికుల ఫిర్యాదుల నేపథ్యంలో... టిక్కెట్ చార్జీలపై ప్రభుత్వం పరిమితులు విధించనుందన్న వార్తలను మంత్రి అశోక్ గజపతి రాజు కొట్టిపారేశారు. కంపెనీల మధ్య పోటీ పెరిగితే టిక్కెట్ రేట్ల పెరుగుదల సమస్యకు అడ్డుకట్టపడుతుందన్నారు. ‘టారిఫ్లను నియంత్రించడం వ్యాపారపరంగా మంచిది కాదు. ప్రాంతీయంగా మరిన్ని పట్టణాలకు విమానయాన సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ విధమైన నియంత్రణ చర్యలు దెబ్బతీస్తాయి. లాభదాయకంకాని రూట్లలో విమాన సర్వీసులను నడిపేందుకు ఎయిర్లైన్ సంస్థలు ముందుకొచ్చే పరిస్థితి ఉండదు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే, ప్రయాణికుల సమస్యలు, ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేదిశగా తగిన యంత్రాంగాన్ని త్వరలోనే తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ఆర్థిక మంత్రి జైట్లీతో భేటీ... కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో అశోక్ గజపతి రాజు గురువారం సమావేశమయ్యారు. పౌరవిమానయాన పాలసీ ముసాయిదాకు ఆమోదంపై త్వరలో కేబినెట్ నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. విమానయాన రంగాన్ని పటిష్టం చేయడంపై జైట్లీతో చర్చించినట్లు సమావేశం అనంతరం అశోక్ గజపతి ట్వీట్ చేశారు. ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీకి నిధుల కోసం అన్ని రకాల విమాన టికెట్లపై 2 శాతం పన్ను, ఎయిర్లైన్స్కు పన్ను రాయితీలు ఇతరత్రా పలు ప్రతిపాదనలు పాలసీలో ఉన్నాయి. -
వాటాల విక్రయ దిశగా ల్యాంకో పవర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్ వ్యాపార విభాగానికి సంబంధించి రుణ భారం తగ్గించుకునే దిశగా వ్యూహాత్మక ఇన్వెస్టరు వేటలో ఉన్న ల్యాంకో గ్రూప్ తాజాగా అయిదు సంస్థలను షార్ట్లిస్ట్ చేసినట్లు సమాచారం. విద్యుత్ వ్యాపారంలోకి కొత్త ఇన్వెస్టరు సుమారు రూ. 700-800 కోట్ల ఈక్విటీని సమకూర్చవచ్చని అంచనా. ఐసీఐసీఐ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర రుణదాతలతో డీల్ విషయంలో ల్యాంకో గ్రూప్ త్వరలో భేటీ కావొచ్చని తెలుస్తోంది. దాదాపు 8,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో ఆరు థర్మల్ పవర్ ప్లాంట్లున్న ల్యాంకో విద్యుత్ వ్యాపార విభాగం విలువ దాదాపు రూ. 45,000 కోట్ల మేర ఉంటుంది. ఇప్పటికే విద్యుత్ వ్యాపార విభాగంలో ఇన్వెస్ట్ చేసేందుకు పిరమల్ క్యాపిటల్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం ల్యాంకో ఇన్ఫ్రా ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. కాగా, గురువారం బీఎస్ఈలో ల్యాంకో ఇన్ఫ్రా షేరు 2.73% పెరిగి రూ. 4.52 వద్ద ముగిసింది. -
రూ. 13,600 కోట్ల రుణాల పునర్వ్యవస్థీకరణ
ఆంధ్రాబ్యాంకు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంకు డిసెంబర్ ఆఖరు నాటికి రూ. 13,643.51 కోట్ల మేర రుణభారం ఉన్న 190 ఖాతాలను పునర్వ్యవస్థీకరించింది. వీటిలో చాలా మటుకు ఖాతాదారులు రూ.25 కోట్ల పైగా రుణాలు పొందినట్లు ఆర్థిక పనితీరు నివేదికలో బ్యాంకు గురువారం వెల్లడించింది. రూ. 1 కోటి మించి.. రూ. 25 కోట్ల కన్నా తక్కువ రుణాలు ఉన్న ఖాతాల సంఖ్య 48 ఉన్నాయని, వీటి మొత్తం విలువ రూ. 378 కోట్లుగా ఉంటుందని బ్యాంకు తెలిపింది. రూ. 1 కోటి కన్నా తక్కువ రుణ భారం ఉన్న ఖాతాలు 53 ఉన్నాయని, వీటి మొత్తం విలువ రూ. 19.51 కోట్లని పేర్కొంది. డిసెంబర్ త్రైమాసికంలో దాదాపు రూ. 691 కోట్ల మేర రుణాలు నిరర్థకంగా (ఎన్పీఏ) మారాయని బ్యాంకు తెలిపింది. విలువ, పరిమాణంపరంగా పరిశ్రమలకిచ్చిన రుణాలు అత్యధికంగా (90 ఖాతాలు.. రూ. 12,368 కోట్లు) పునర్వ్యవస్థీకరించినట్లు ఆంధ్రా బ్యాంకు తెలిపింది. ఆ తర్వాత లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలు (61 ఖాతాలు, రూ. 1,097 కోట్లు), వ్యవసాయ రుణాలు (24 ఖాతాలు, రూ. 177 కోట్లు) ఉన్నాయి. భారీగా పెరిగిపోయిన మొండి బకాయిలకు కేటాయింపుల కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో ఆంధ్రా బ్యాంకు నికర లాభం ఏకంగా 83 శాతం క్షీణించి రూ. 34 కోట్లకు పడిపోయింది. -
అప్పుల బాధ తాళలేక..
అప్పుల భారం మరో అన్నదాతను బలితీసుకుంది. వికారాబాద్ మండలం గొట్టి ముక్కల గ్రామంలో బోయి లక్ష్మయ్య (58) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల భాధతో మనస్తాపం చెంది.. ఆదివారం ఉదయం ఇంట్లో దూలానికి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వేసిన పంట ఎండిపోవడంతో.. అప్పులు తీర్చే మార్గం కనపడక పోవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. సుమారు రూ.4లక్షల మేర అప్పు ఉన్నట్లు తెలిసింది. -
మహిళా రైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు మండలం ఆరెపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శంకరమ్మ(40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పు పెరిగి పోవడంతో వాటిని తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అప్పుల బాధతోమరో అన్నదాత ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన మల్యాల మండలంలోని మానాలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. మానాలకు చెందిన రైతు జంగిపెల్లి లక్ష్మణ్ (50) అప్పులు చేసి పంటలు వేశాడు. పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు మిగిలాయి. దీంతో అప్పులు ఎలా తీర్చాలో అనే దిగులుతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని చనిపోయాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. -
అప్పుల బాధ తాళలేక...
అప్పుల బాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్నగర్ జిల్లా వెల్దండ మండలం అజిల్లాపూర్లో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన బంగారి ఎల్లయ్య 47 తనకున్న ఏడు ఎకరాల భూమిలో పత్తిపంట సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సాగు కోసం కొత్తగా అప్పు తెచ్చి రెండు బోర్లు వేశాడు.. కానీ వాటిలో నీళ్లు పడకపోవడంతో.. పంట ఎండిపోయింది. దీంతో మనస్తాపం చెందిన ఎల్లయ్య పంట చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సుమారూ రూ. 5 లక్షల వరకు అప్పులు ఉండటంతోటే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. -
పొలంలోనే ప్రాణాలు తీసుకున్న రైతు
నల్లగొండ జిల్లా దిండి మండలం గోనకల్ గ్రామంలో ఓ రైతు అప్పుల బాధ ఎక్కువై పొలంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. గంగిరెడ్డి(45) అనే రైతుకు మూడెకరాల పొలం ఉంది. మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశాడు. అయితే, సాగు పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం, చేసిన అప్పులు రూ.4 లక్షలకు చేరుకోవడంతో మనస్తాపం చెందాడు. శుక్రవారం రాత్రి పొలంలో పురుగుల ముందు తాగి ప్రాణలు కోల్పోయాడు. -
అవంచలో రైతు ఆత్మహత్య
అప్పుల బాదతాళలేక ఓ రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామంలో బుధవారం జరిగింది. అవంచ గ్రామానికి చెందిన కుమ్మరి భాస్కర్ (38) పంట సాగుకోసం రెండు లక్షల రూపాయలు అప్పు చేశాడు. అప్పుల బాధ తాళలేక బుధవారం ఉదయం తన పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి ఇద్దరు కూతళ్లు ఉన్నారు. పెద్దకూతరు పూజితకు పెళ్ళి చేశాడు. రెండో కుమార్తె అశ్విని పదో తరగతి చదువుతోంది. పండగ పూట ఇంటి పెద్ద చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. -
రైతు ఆత్మహత్య
పంట ఎండిపోవడంతో గుండె చెదిరిన రైతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా అవనిగడ్డ శివారు కొత్తపేటకు చెందిన రైతు అప్పికట్ల నరసింహారావు (44)కు మాచవరం సమీపంలో ఒకటిన్నర ఎకరాలు భూమి ఉంది. ఈ ఏడాది సాగుకు నీరందక పోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. నాలుగు రోజులుగా సాగునీటి కోసం ప్రతిరోజూ పొలానికి వెళ్లి.. నీరు అందక నిరశగా ఇంటికి రావడం చేస్తున్నాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని కుటుంబసభ్యులు హుటాహుటిన అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ నరసింహారావు బుధవారం మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
పొగాకు రైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం బండపురంలో బుధవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సొంటి లక్ష్మణస్వామి(50) పొగాకు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి ఉన్న రెండున్నర ఎకరాల భూమిలోంచి పోలవరం కాలువ వెళ్లడంతో.. రెండెకరాల భూమి నష్టపోయాడు. దీంతో వ్యవసాయానికి దూరమై అప్పులు తీర్చే దారికనపడక మనోవేదనకు గురయ్యాడు. భూమికి చెందిన డబ్బు రావడంతో బ్యాంకులో ఉన్న రుణాన్ని తీర్చేశాడు. కాని బయట ప్రైవేటు వ్యక్తుల దగ్గర తెచ్చిన రూ. 5 లక్షల అప్పు తీర్చే దారి కనపడక పోవడంతో..బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. -
కౌలు రైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక కౌలు రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కారంచేడు మండలం కేశవరప్పాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన చిరుమాల ఏలియా (45) నాలుగేళ్లుగా ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని పొగాకు, పత్తి సాగు చేస్తున్నాడు. మూడేళ్ల నుంచి వ్యవసాయం కోసం చేసిన అప్పు రూ.3 లక్షలకు తోడు వడ్డీలు పెరిగి రూ.4 లక్షలు అయ్యాయి. అప్పులు తీరే మార్గం తెలియక శనివారం ఇంటి నుంచి పొలానికి వెళ్లిన ఏలియా అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలియా ఇంటికి రాకపోవడంతో ఎక్కడికెళ్లాడో తెలియక కుటుంబ సభ్యులు వెతకగా.. మంగళవారం గ్రామానికి చెందిన పగడాల చెంచుపున్నయ్య పత్తి చెట్ల మధ్యలో పడి ఉన్న ఏలియా మృతదేహాన్ని గుర్తించాడు. వెంటనే సమాచారం కుటుంబసభ్యులకు తెలియజేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
కౌలు రైతు బలవన్మరణం
పంటలు సరిగా పండకపోవటంతో ఆవేదనకు గురైన రైతన్న పురుగు మందు తాగాడు. కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలంలో కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన భూక్యా మత్యా(32)కు ఎకరం పొలం ఉంది. మరికొంత భూమిని కౌలుకు తీసుకుని ఐదేళ్లుగా వరి, పత్తి సాగు చేస్తున్నాడు. కుటుంబపోషణ, పంట సాగు నిమిత్తం రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. ఈ ఏడాది పంటల పరిస్థితి ఆశాజనకంగా లేకపోవటంతో మంగళవారం వేకువజామున పొలంలోనే పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. అతనికి భార్య జములమ్మ, ఇద్దరు పిల్లలున్నారు. -
ఒక్కో భారతీయుడిపై రూ.44,095 అప్పు
న్యూఢిల్లీ: దేశంలో గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కొక్కరి తలపై రుణ భారం రూ.2,966 పెరిగి రూ.44,095కు చేరింది. విదేశీ, అంతర్గత, ఇతర రుణాలన్నీ కలిపి భారం ఈ స్థాయికి చేరింది. వృద్ధి రేటును మెరుగుపరచడం కోసం ప్రభుత్వం చేసిన అధిక అభివృద్ధి వ్యయం కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో భారతీయుడిపై రుణ భారంరూ.3,000 చొప్పున పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 2013-14లో తలసరి రుణ భారం రూ.41,129 కోట్లుగా ఉంది. కాగా 2015 ఏడాదికి ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ రుణ గణాంకాల ప్రకారం 20 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అధిక విదేశీ రుణాలున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మార్చినాటికి మొత్తం భారత రుణ భారం రూ.68.95 లక్షల కోట్లు. -
వేదాంతలో కెయిర్న్ ఇండియా విలీనం!
న్యూఢిల్లీ: నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న కెయిర్న్ ఇండియాను విలీనం చేసుకోవాలని వేదాంత ఇండియా యోచిస్తోంది. తద్వారా భారీ రుణ భారాన్ని తగ్గించుకోవచ్చని భావిస్తోంది. ఈ డీల్తో వేదాంత స్థూల రుణ భారం సుమారు రూ. 37,636 కోట్ల మేర తగ్గవచ్చని అంచనా. కెయిర్న్ వద్ద ఉన్న రూ. 16,870 కోట్లు, దాంతో పాటు ఏటా కంపెనీకి వచ్చే రూ. 14,000 కోట్ల మేర నిధులు దీనికి తోడ్పడగలవని వేదాంత యోచిస్తోంది. విలీనానికి సంబంధించి డీల్ పూర్తిగా షేర్ల రూపంలో ఉండనుంది. కెయిర్న్ఇండియా షేర్హోల్డర్లకు వేదాంత (గతంలో సెసా స్టెరిలైట్) షేర్లు లభించనున్నాయి. ఇరు కంపెనీల బోర్డులు విలీన ప్రతిపాదనను త్వరలో పరిశీలించనున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికల్లా డీల్ పూర్తి కావొచ్చని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2011లో వేదాంత 8.67 బిలియన్ డాలర్లు వెచ్చించి కెయిర్న్ ఇండియాలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. ఈ ఏడాది మార్చి 31 దాకా గణాంకాల ప్రకారం వివిధ వ్యాపార విభాగాల ద్వారా కెయిర్న్ ఇండియాలో వేదాంతకు 59.9 శాతం వాటాలు ఉన్నాయి. విలీనానికి శ్రీకారం చుట్టే దిశగా వేదాంత ఇటీవలే.. గ్రూప్లో భాగమైన ట్విన్ స్టార్ మారిషస్ హోల్డింగ్స్ నుంచి సుమారు 5 శాతం వాటాలు కొనుగోలు చేసింది. విలీన ప్రతిపాదనపై స్పందించేందుకు నిరాకరించిన వేదాంత వర్గాలు.. కార్పొరేట్ స్వరూపాన్ని సరళతరం చేసే యోచనలో కంపెనీ ఉన్నట్లు వివరించాయి. -
సర్కారు రుణానికి ‘విభజన’ దెబ్బ!
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ రుణ సమీకరణపై విభజన ప్రభావం కొంత మేర పడింది. గతంలో సెక్యూరిటీ బాండ్లను విక్రయించి సేకరించిన రుణాలపై రాష్ట్ర ప్రభుత్వం తక్కువ వడ్డీ చెల్లించేది. కానీ రాష్ట్ర విభజన ప్రకటన మరుసటి రోజు సేకరించిన రుణంపై ఎక్కువ శాతం వడ్డీ పడింది. సెక్యూరిటీ బాండ్లను జాతీయ బ్యాంకులు కొనుగోలు చేసి ఆ మేరకు రుణాలు ఇస్తుంటాయి. ఆ రుణాలపై ప్రభుత్వం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలా సేకరించిన రుణంపై 7.57 శాతం నుంచి 8.22 శాతం మధ్య వడ్డీ చెల్లించేది. మిగతా రాష్ర్ట ప్రభుత్వాలు చెల్లించే వడ్డీ కన్నా మనరాష్ట్ర ప్రభుత్వమే తక్కువ వడ్డీ చెల్లించే ది. అయితే గతనెల 31న రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణంపై... మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మనమే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి రావడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ సుస్థిరత ఆధారంగా వడ్డీ శాతం హెచ్చు తగ్గులుంటాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు రాజకీయ అస్థిరత నెలకొన్న సందర్భాల్లో ప్రభుత్వం చేసే రుణాలపై ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాజకీయ స్థిరత్వం ఉంటే తక్కువ వడ్డీకి రుణం లభిస్తుందని ఆ అధికారి పేర్కొన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర విభజన ప్రకటనతో రాష్ట్రంలోని పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని, అటు రాజకీయంగాను ఇటు ఆర్థికపరంగాను వ్యత్యాసాలు వస్తాయనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం విక్రయించే సెక్యూరిటీ బాండ్లను జాతీయ బ్యాంకులు అధిక వడ్డీకిగానీ కొనుగోలు చేయడం లేదని ఉన్నతాధికారి ఒకరు విశ్లేషించారు. ఎంత తేడా..! గతనెల 31న రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్ల రుణం సేకరణకు సెక్యూరిటీ బాండ్లను విక్రయించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 9.48 శాతం వడ్డీకిగానీ వాటిని కొనుగోలు చేసేందుకు బ్యాంకులు ముందుకురాలేదు. చివరికి ఆ వెయ్యి కోట్ల రూపాయల రుణానికి రాష్ట్ర ప్రభుత్వం 9.46 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. అదేరోజు హర్యానా ప్రభుత్వం రూ.500 కోట్ల రుణానికి సెక్యూరిటీ బాండ్లను విక్రయించగా 9.05 శాతం వడ్డీ పడింది. అలాగే పంజాబ్, రాజస్థాన్ ప్రభుత్వాలు రూ.500 కోట్ల చొప్పున రుణ సేకరణకు బాండ్లను విక్రయించగా 9.05 శాతం వడ్డీ పడింది. తమిళనాడు ప్రభుత్వం రూ.400 కోట్ల రుణం సేకరించగా 9.10 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. అంటే అన్ని రాష్ట్రాల కంటే మనరాష్ట్రమే అధిక వడ్డీ చెల్లించాల్సి వచ్చిందన్నమాట! మన రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్లో రూ.1000 కోట్ల రుణానికి సెక్యూరిటీ బాండ్లను విక్రయించగా కేవలం 8.22 శాతం వడ్డీయే పడింది. అలాగే మే నెలలో మరో వెయ్యి కోట్ల రూపాయల రుణాన్ని సేకరించిన సమయంలో 7.57 శాతం వడ్డీయే చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా 9.46 శాతం వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి రావడం రాష్ట్ర విభజన ప్రభావమేనని, ఇక ముందు కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.