Documentary film
-
ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. ఆడియన్స్ను కంటతడి పెట్టిస్తోన్న ఆ సీన్!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. ఏకంగా ఆస్కార్ అవార్డ్ను సొంతం చేసుకుని ప్రపంచమంతా తెలుగు సినిమావైపు చూసేలా చేసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ నటనతో అభిమానులను కట్టిపడేశారు. 2022లో మార్చి 25 విడుదలైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా హిట్ కొట్టిన ఈ చిత్రంలో అలియాభట్, ఓలివియా మోరిస్, అజయ్ దేవ్గణ్, సముద్రఖని, శ్రియ, అలీసన్ డూడీ, దివంగత నటుడు రే స్టీవెన్ సన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది.అయితే ఈ మూవీ జర్నీపై ఆర్ఆర్ఆర్ మేకర్స్ డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని 'ఆర్ఆర్ఆర్- బిహైండ్ అండ్ బియాండ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈనెలలోనే థియేటర్లలో విడుదల చేశారు. తాజాగా ఈ డాక్యుమెంటరీ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే నెట్ప్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే ఈ డాక్యుమెంటరీలోని ఓ సన్నివేశం ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్ను కొరడాతో కొట్టిన సీన్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇందులో ఎన్టీఆర్ను రామ్ చరణ్ కొరడాతో కొడతాడు. కానీ వెంటనే ఎక్కడ జూనియర్కు దెబ్బ తగిలిందేమోనని దగ్గరికి వచ్చిన గట్టిగా హత్తుకుంటాడు. దీనికి సంబంధించిన వీడియోను నెటిజన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ స్నేహంపై కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ ప్రాణ మిత్రులని పోస్టులు పెడుతున్నారు. I want to thank whoever decided to make this documentary about the making of the best movie ever. You must watch this! Every person in the entire world should watch this.#RRRBehindAndBeyond pic.twitter.com/W1zF7VZouu— Tarak Forever (@Charanlucky22) December 27, 2024 them pic.twitter.com/J6Gn3yu7OO— xy (@ssmbbakthudu) December 27, 2024 NTR ♥️ RC bonding 🥹🥹♥️#RRRBehindAndBeyond #RRRMovie#RRRBehindAndBeyondOnNetflix @AlwaysRamCharan @tarak9999 pic.twitter.com/PQKC0axFB7— Gopi tarak 9999 DevaraOnSep27th (@7799_gopi) December 27, 2024 -
వారం రోజుల్లోనే ఓటీటీకి ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ
దర్శకధీరుడు తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఈ మూవీకి సంబంధించిన డాక్యుమెంటరీ చిత్రం ఈనెల 20న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ అనే పేరుతో ఈ డాక్యుమెంటరీ చిత్రం తెరకెక్కించారు. ఆర్ఆర్ఆర్ మూవీ జర్నీ గురించి ఈ మూవీలో చూపించారు. తాజాగా ఈ డాక్యుమెంటరీ మూవీ ఓటీటీ రిలీజ్ తేదీని రివీల్ చేసింది చిత్రబృందం. ఈనెల 27 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.కాగా.. 2022లో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో టాలీవుడ్ పేరు వరల్డ్ వైడ్గా మార్మోగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది. మరోవైపు రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. ఆ మూవీ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాదిలో సెట్స్పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.Behind the scenes, beyond the legacy. Watch RRR: Behind and Beyond, an exclusive peek into the making of SS Rajamouli’s magnum opus on Netflix, out 27 December!#RRRBehindAndBeyondOnNetflix pic.twitter.com/Py9pyL7Nws— Netflix India South (@Netflix_INSouth) December 23, 2024 -
రాజమౌళి మూవీపై డాక్యుమెంటరీ.. విడుదలపై అధికారిక ప్రకటన!
దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీతో ఆస్కార్ వేదికపై సగర్వంగా తెలుగు సినిమాను నిలిపారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్ను సాధించింది. మన సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది.ఆర్ఆర్ఆర్ ఘనవిజయంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ అనే పేరుతో డాక్యుమెంటరీ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు దర్శకుడు రాజమౌళితో కూడిన పోస్టర్ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. అయితే రిలీజ్ తేదీని మాత్రం వెల్లడించలేదు.కాగా.. 2022లో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో టాలీవుడ్ పేరు వరల్డ్ వైడ్గా మార్మోగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది. మరోవైపు రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. ఆ మూవీ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాదిలో సెట్స్పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. View this post on Instagram A post shared by RRR Movie (@rrrmovie) -
వివరణ ఇవ్వాలి.. నయనతారకి హైకోర్టు నోటీసు
నటి నయనతార, ఆమె భర్త–దర్శకుడు విఘ్నేశ్ శివన్ లకు చెన్నై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే... నయనతార జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా ‘నయనతార: బియాండ్ద ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ రూపొందిన విషయం తెలిసిందే. నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 18 నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమ్ అవుతోంది. కాగా ఈ డాక్యుమెంటరీలో విజయ్ సేతుపతి, నయనతార జంటగా వండర్ బార్ ఫిలిమ్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ధనుష్ నిర్మించిన ‘నానుమ్ రౌడీదాన్ ’ చిత్రంలోని సన్నివేశాలను ఉపయోగించారు. అయితే ఇలా వినియోగించడానికి ధనుష్ అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ధనుష్ని విమర్శిస్తూ నయనతార ఒక లేఖను విడుదల చేశారు. అది సినీ వర్గాల్లో చర్చకి దారి తీసింది. ఇక తన అనుమతి లేకుండా ‘నానుమ్ రౌడీదాన్ ’లోని క్లిప్పింగ్ వాడినందుకు నష్టపరిహారంగా రూ. 10 కోట్లు కోరుతూ నయనతారపై చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నయనతార, విఘ్నేష్ శివన్ లకు నోటీసులు జారీ చేశారు. మరి... తదుపరి పరిణామాలేంటి? అనేది వేచి చూడాల్సిందే. – సాక్షి, తమిళ సినిమా -
నయనతార జీవితం పై నెట్ ప్లిక్స్ డాక్యుమెంటరీ ఫిలిం
-
ఓటీటీలో నయనతార రియల్ లైఫ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సీనియర్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఫ్యామిలీతో బిజీగా ఉంది. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్నను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. గతేడాది షారూఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటించిన నయన్.. ఆ తర్వాత వచ్చిన అన్నపూరణి సినిమా వివాదానికి దారితీసింది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా పిక్స్ షేర్ చేసి అభిమానులకు అప్డేట్స్ ఇస్తోంది. అయితే తాజా ఫోటోలు చూసి నయన్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ, సన్నబడటానికి లై పోసక్షన్ చేయించుకుందని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: నా బుగ్గల్లో ప్లాస్టిక్ ఏం లేదు!)అయితే గతంలో తన సినీ ప్రయాణంపై ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో తన కెరీర్, పెళ్లితో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఇందులో చూపించనున్నట్లు తెలిపింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకునన్న నయన్ జీవితంపై తెరకెక్కించిన డాక్యుమెంటరీని ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ సంస్థ వెల్లడించింది. నవంబర్ 18 నుంచి ఈ డాక్యుమెంటరీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్టర్ను విడుదల చేసింది. ఈ బయోపిక్కు నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే టైటిల్ ఖరారు చేశారు. Thirai-layum natchathiram, vaazhkailayum natchathiram ✨Watch Nayanthara: Beyond The Fairy Tale on 18 November, only on Netflix!#NayantharaOnNetflix pic.twitter.com/5m9UbBNZ6M— Netflix India South (@Netflix_INSouth) October 30, 2024 -
దర్శకధీరుడిపై డాక్యుమెంటరీ చిత్రం.. రామ్ చరణ్ పోస్ట్ వైరల్
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే కథ సిద్ధం కాగా.. షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తీయబోయే చిత్రం కావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తి నెలకొంది.అయితే ఇటీవల రాజమౌళి గురించి ఓ డాక్యుమెంటరీ చిత్రం వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ రూపొందించిన మోడరన్ మాస్టర్స్ పేరుతో ఈ డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. ఇందులో ఆయన డైరెక్షన్, ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాల కోసం చేసిన హార్డ్ వర్క్ను చూపించారు. మొత్తంగా రాజమౌళి జీవిత విశేషాలను డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకులను ముందుకు తీసుకొచ్చారు. తాజాగా ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్పై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. ఆయన కథ చెప్పేవిధానం, డెడికేషన్ అద్భుతమంటూ కొనియాడారు. ఇలాంటి డాక్యుమెంటరీ రూపొందించడం రాజమౌళికి దక్కిన సరైన గౌరవమని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీని అనుపమా చోప్రా సమర్పణలో అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఫిల్మీ కంపానియన్ సంయుక్తంగా నిర్మించారు. రాఘవ్ ఖన్నా దర్శకత్వం వహించగా.. తన్వీ అజింక్యా సహ దర్శకులుగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుచోంది. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
పాపం టాలీవుడ్ స్టార్ హీరోలు.. కలలో కూడా ఊహించి ఉండరు
కొన్నింటి గురించి మనం కలలో కూడా ఊహించం. అలాంటివి రియాలిటీలో జరిగినప్పుడు ఇదెక్కడి దరిద్రం బాబోయే అని మనలో మనమే తిట్టుకుంటాం. ఇప్పుడేం జరిగిందని అనుకుంటున్నారా! ప్రముఖ దర్శకుడు రాజమౌళి జీవితంపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. 'మోడ్రన్ మాస్టర్స్' పేరిట ఆగస్టు 2 న దీన్ని రిలీజ్ చేయనుంది. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా?)ఇక్కడివరకు బాగానే ఉంది. సోమవారం ఉదయం రిలీజ్ చేసిన ట్రైలర్కి పర్లేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. రాజమౌళి జీవితంలోని ఎవరికీ తెలియని విషయాల్ని ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, జేమ్స్ కామెరూన్ లాంటి సెలబ్రిటీలు షేర్ చేసుకోవడం బాగానే ఉంది. అయితే మెయిన్ ట్రైలర్ రిలీజ్ చేసిన కాసేపటి తర్వాత ప్రాంతీయ భాషల ట్రైలర్స్ కూడా రిలీజ్ చేశారు.తెలుగు ట్రైలర్ విషయానికొచ్చేసరికి ప్రధాన పాత్రధారి రాజమౌళి సహా డాక్యుమెంటరీలో కనిపించిన ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్లకు వేరే వాళ్లు ఎవరో డబ్బింగ్ చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఇన్నికోట్లు ఖర్చు పెట్టి తీశారు. ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి, తెలుగు వరకైనా సరే హీరోలతో డబ్బింగ్ చెప్పించి ఉంటే సరిపోయేది! పైపెచ్చు ఈ ట్రైలర్ చూస్తుంటే డిస్కవరీ ఛానెల్లోని డబ్బింగ్లా అనిపించింది.(ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి') -
రాజమౌళి ఓ పిచ్చోడు.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. జీవిత విశేషాలతో డాక్యుమెంటరీ తీశారు. దీన్ని 'మోడ్రన్ మాస్టర్స్' పేరుతో ఆగస్టు 2 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. కొన్నిరోజుల క్రితం ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పుడు డాక్యుమెంటరీ ఎలా ఉండబోతుందో చెప్పే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్తోపాటు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పడం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలో భారతీయుడు 2.. అంచనాలు తప్పడంతో మార్పులు)ఇది డాక్యుమెంటరీ కాబట్టి సినిమా స్టైల్లో ఉండదు. రాజమౌళి కెరీర్ ఎలా ఎప్పుడు ప్రారంభమైందనేది విజువల్స్ రూపంలో చూపిస్తారు. అలానే జక్కన్నతో పనిచేసిన అనుభవాన్ని ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ చెప్పడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. అయితే ఇది డాక్యుమెంటరీ కాబట్టి అందరికీ నచ్చకపోవచ్చు. రాజమౌళి లైఫ్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం దీన్ని చూడండి.(ఇదీ చదవండి: ఉపాసనపై టాలీవుడ్ కమెడియన్ ప్రశంసలు.. ఎందుకంటే?) -
డైరెక్టర్ రాజమౌళి జీవితంపై మూవీ.. ఓటీటీలో నేరుగా రిలీజ్
రాజమౌళి.. పాన్ ఇండియా లెవల్లో ఓ సెన్సేషన్. తెలుగులో సాధారణ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి.. 'ఆర్ఆర్ఆర్'తో ఆస్కార్ సాధించే రేంజ్ వరకు ఎదిగిపోయాడు. 'బాహుబలి'తో వరల్డ్ వైడ్ గుర్తింపు సంపాదించిన ఈ దర్శకుడు.. ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. కాబట్టి రావడానికి ఎంత లేదన్న మరో 3-4 ఏళ్లయినా పడుతుంది. మరోవైపు రాజమౌళి బయోపిక్ లాంటి డాక్యుమెంటరీ ఒకటి ఓటీటీలోకి వచ్చేయబోతుంది.(ఇదీ చదవండి: 'బేబి' డైరెక్టర్కి షాకింగ్ ఎక్స్పీరియెన్స్.. పాపం అలా అనేసరికి!)తెలుగు దర్శకుల్లో రాజమౌళి రూటు సెపరేటు. చేసిన ప్రతి సినిమాతో తన రేంజ్ పెంచుకోవడమే కాకుండా హిట్స్, బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. 'బాహుబలి'తో పాన్ ఇండియా మార్కెట్ షేక్ చేసిన ఇతడు.. వేల కోట్లు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూపించాడు. 'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ స్థాయిలో తన పేరు మార్మోగిపోయేలా చేశాడు. ఈ క్రమంలోనే ఇతడి జీవితంలో కొన్ని విషయాలతో 'మోడ్రన్ మాస్టర్స్' అనే డాక్యుమెంటరీ తీశారు.ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో ఆగస్టు 2 నుంచి ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో భాగంగా భారతీయ, అంతర్జాతీయ సినిమాపై రాజమౌళి ప్రభావం ఎలా ఉందనేది చూపించబోతున్నాడు. అలానే జక్కన్న గురించి హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్, జో రూసో, ప్రభాస్, రానా, జూ.ఎన్టీఆర్ తమ పాయింట్ ఆఫ్ వ్యూని చెబుతారు. అయితే ఇది బయోపిక్లా ఉంటుందా? కేవలం రాజమౌళి గురించి ఎలివేషన్స్ ఉంటాయా? అనేది చూడాలి.(ఇదీ చదవండి: పొరపాట్లు ఒప్పుకొన్న 'కల్కి' డైరెక్టర్.. ఆ మూడు విషయాల్లో!) -
Women of My Billion: కలిసి నడిచే గొంతులు
కన్యాకుమారి నుంచి శ్రీ నగర్ వరకూ 260 రోజుల పాటు 3,800 కిలోమీటర్లు దేశమంతా నడిచింది సృష్టి బక్షి. ఎందుకు? స్త్రీలపై జరిగే దురాగతాలపై చైతన్యం కలిగించడానికే కాదు స్త్రీల శక్తియుక్తులను వారికి గుర్తు చేయడానికి. ఆ సుదీర్ఘ ప్రయాణం ఇప్పుడు ‘విమెన్ ఆఫ్ మై బిలియన్’ పేరుతో అమెజాన్లో స్ట్రీమ్ అవుతోంది. నటి ప్రియాంకా చోప్రా నిర్మాత.తాను నడిచి చేరుకున్న ఊరిలో ఏదైనా స్కూల్లోగాని, పబ్లిక్ హాల్లో కాని మహిళలను పోగు చేస్తుంది సృష్టి బక్షి. ‘అందరూ కళ్లు మూసుకుని దీర్ఘంగా శ్వాస పీల్చి వదలండి’ అంటుంది. ‘ఇప్పుడు మీ కళ్ల ఎదురుగా మీ 11 ఏళ్ల వయసున్న మీ రూపాన్ని గుర్తు చేసుకోండి. ఆ 11 ఏళ్ల అమ్మాయిలో ఉండే విశ్వాసం, ఆనందం ఎన్ని విధాలుగా ధ్వంసమైందో గుర్తుకు తెచ్చుకోండి. ఆ అమ్మాయికి సారీ చెప్పండి. ఎందుకంటే ఆ విధ్వంసమంతా మీ అనుమతితోనే జరిగింది’ అంటుంది. చాలామంది ఆ మాటలకు ఏడుస్తారు. గడిచివచ్చిన జీవితాన్ని తలుచుకుని బాధలో మునిగిపోతారు. అప్పుడు సృష్టి బక్షి ఒక బోర్డు మీద స్త్రీ శరీర నిర్మాణం గీచి ‘ఇదిగో ఈ అవయవాల రీత్యా మీరు మగవారి కంటే భిన్నంగా పుట్టారు. ప్రకృతి ఈ అవయవాలను మీకు ఇస్తే సమాజం అదుపు, ఆంక్షలు, వివక్ష, కుటుంబ హింస, ఆర్థిక బానిసత్వం, ఇంటి పని... ఇన్ని ఇచ్చింది. మనం ఎందుకు మగవారితో సమానం కాము?’ అని ప్రశ్నిస్తుంది.మార్పు కోసంసృష్టి బక్షిది ముంబై. ఆమె హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో చదువుకుంది. హాంగ్కాంగ్లో మార్కెటింగ్లో పెద్ద సంస్థల్లో పని చేసింది. తండ్రి ఆర్మీలో పని చేయడం వల్ల ఆమెకు దేశం పట్ల ఒక ఉద్వేగం ఉండేది. అయితే తాను ప్రేమించే దేశంలో స్త్రీలపై జరిగే అన్యాయాలను చూసి చలించి పోయేది. ‘2017లో హాంకాంగ్లో సిటీ బస్ ఎక్కి ఇంటికి వెళుతున్నప్పుడు నా ఫోన్లో ఇండియాలో తల్లీ కూతుళ్లపై తండ్రి ఎదుటే అత్యాచారం చేసి చంపేశారన్న వార్త చదివాను. చాలా నిస్పృహ కలిగింది. నాలాంటి వాళ్లు సౌకర్యంగా పడక్కుర్చీలో కూచుని చింతించడం సరికాదని రంగంలో దిగాలని అనుకున్నాను. అలా నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, ఇండియా వచ్చి దేశంలోని స్త్రీలందరితో మాట్లాడాలని 2018 మే నెలలో పాదయాత్ర ప్రారంభించాను’ అని చెప్పింది సృష్టి.రోజూ వేలాది మంది‘ఉమెన్ ఆఫ్ మై బిలియన్’ పేరుతో సృష్టి బక్షి మే 2018లో కన్యాకుమారి నుంచి పాదయాత్ర ప్రారంభించింది. ఈ యాత్ర రికార్డు అయ్యేలా టీమ్ను ఏర్పాటు చేసుకుంది. 260 రోజుల పాటు దాదాపు 4 వేల కిలోమీటర్ల పాటు సాగే ఈ యాత్రకు కోటి రూపాయలు ఖర్చవుతాయి. 50 లక్షలను క్రౌడ్ ఫండింగ్ ద్వారా పోగు చేసింది. ‘ఈ యాత్రలో స్త్రీల కలలు, ఆకాంక్షలు, వారి హక్కులు, సంఘర్షణలు. విజయాలు వినదలుచుకున్నాను. వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకోవాలనుకున్నాను. నా సుదీర్ఘ యాత్రలో మన దేశంలో వరకట్నం ఇంకా పెద్ద సమస్యగా ఉందని అర్థమైంది. వరకట్నం స్త్రీలను మానసికంగా పురుషులతో సమానం అనుకోనివ్వడం లేదు. స్త్రీలను అసభ్యంగా తాకడం, హింసించడం, అణిచి పెట్టడం కొనసాగుతూనే ఉంది. ఒక దశలో నేను యాత్ర చేయలేననుకున్నాను. కాని ఆ మరుసటి రోజు నా మీటింగ్కు హాజరైన ఒక ఆశా వర్కర్– ‘‘రాత్రి నన్ను నా భర్త కొట్టాడు. నీ మాటలు విన్నాక ఇక ఇలాంటిది జరగనివ్వకూడదని నిశ్చయించుకున్నాను. నేను నా భర్తను నిలువరించడానికి నలుగురి సాయం తీసుకుంటాను’’ అని చెప్పింది. నా యాత్ర వల్ల జరుగుతున్న మేలు అర్థమయ్యాక కొనసాగాను’ అని తెలిపింది సృష్టి.డాక్యుమెంటరీ విడుదలసృష్టి చేసిన యాత్ర అంతా ‘విమెన్ ఆఫ్ మై బిలియన్’ పేరుతో డాక్యుమెంటరీగా రూపొందింది. మే 3 నుంచి అమెజాన్లో స్ట్రీమ్ అవుతోంది. ఈ డాక్యుమెంటరీ మీద మంచి రివ్యూలు వస్తున్నాయి. ‘ఎందరో స్త్రీలు. వారి జీవితానుభవాలను ఈ డాక్యుమెంటరీలో పంచుకున్నారు. వారు సమస్యలు వారి తెచ్చుకున్నవి కాదు. వారికి తెచ్చిపెట్టినవి. అందుకే నటి ప్రియాంకా చోప్రా నా డాక్యుమెంటరీని చూసి తాను నిర్మాతగా మారి విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. ఒక స్త్రీగా, ఆడపిల్ల తల్లిగా ఆమెకు స్త్రీల సాధికారత, ఆత్మగౌరవం గురించి అక్కర ఉంది. జెండర్ ఈక్వాలిటీ గురించి స్త్రీ, పురుషుల్లో చైతన్యం రావడానికి ఈ డాక్యుమెంటరీ ఉపయోగపడుతుందని ఆమె విశ్వసిస్తున్నారు’ అని తెలిపింది సృష్టి బక్షి. -
ఓటీటీకి రియల్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం ఓటీటీ వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ను సినీ ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సబ్ టైటిల్స్తోనే చూసేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రోజు రోజుకు కొత్త కొత్త కంటెంట్ను ఓటీటీలు అందిస్తున్నాయి. అదే సమయంలో క్రైమ్ థ్రిల్లర్ లాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తాజాగా కంటెంట్తోనే యధార్థ సంఘటనల ఆధారంగా సరికొత్త క్రైమ్ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. క్రైమ్ సీన్ బెర్లిన్: నైట్ లైఫ్ కిల్లర్ అనే పేరుతో బెర్లిన్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించారు. ఈ డాక్యుమెంటరీ సిరీస్ రహస్యమైన, విచిత్రమైన హత్యల కేసుల ఆధారంగా తెరకెక్కించారు. ఈ రియల్ క్రైమ్ కథకు జాన్ జాబీల్, కరోలిన్ షాపర్ దర్శకత్వం వహించారు. ఈ ఆసక్తికర డాక్యుమెంటరీ సిరీస్ త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే 2012లో జరిగిన చీకటి సంఘటనల గురించి అవగాహన కల్పించడానికి ఈ సిరీస్ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మేకర్స్. క్రైమ్ సీన్ బెర్లిన్: నైట్లైఫ్ కిల్లర్లో కేవలం మూడు సీజన్లు మాత్రమే ఉన్నాయి. ఈ సిరీస్లో రిక్ హబ్నర్, ట్రిస్టన్ బమ్, కార్నెలియా వెర్నర్ ప్రధాన పాత్రలు పోషించారు. -
Oscars 2024: ప్చ్.. ఉన్న ఒక్క ఆశ కూడా పోయింది..
గతేడాది ఆర్ఆర్ఆర్ (బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు), ద ఎలిఫెంట్ విస్పరర్స్ ( బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింగా) సినిమాలకు ఆస్కార్ రావడంతో భారతీయుల హృదయాలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి. కానీ ఈసారి ఇండియా నుంచి ఏ సినిమా కూడా అకాడమీ అవార్డుల బరిలో లేకపోవడంతో అందరూ నిరాశ చెందారు. కొన్ని సినిమాలను నామినేట్ చేసినప్పటికీ ఫైనల్ లిస్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాయి. అయితే భారత సంతతికి చెందిన విదేశీవాసి సినిమా ఆస్కార్ బరిలో ఉండటంతో అందరూ కాస్త ఆసక్తి చూపించారు. టు కిల్ ఎ టైగర్.. ఢిల్లీకి చెందిన కెనడావాసి నిషా పహుజా.. టు కిల్ ఎ టైగర్ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కించింది. గతేడాది అక్టోబర్లో ఏ డిస్ట్రిబ్యూటర్ సాయం లేకుండా అమెరికాలోని కొన్ని థియేటర్లో విడుదల చేసింది. ఆస్కార్కు ఎప్పుడైతే నామినేట్ అయిందో అందరూ ఈ చిత్రంపై ఆసక్తి చూపించారు. దీంతో ఫిబ్రవరిలో రీరిలీజ్ చేయడం, నెట్ఫ్లిక్స్ ఓటీటీ హక్కులను కొనుక్కోవడం చకచకా జరిగిపోయాయి. ఇండియాలో మాత్రం థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలోనే వచ్చేసింది. ఆదివారం (మార్చి 10) నుంచి నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చింది. భారత్కు చెందిన ప్రియాంక చోప్రా, దేవ్ పటేల్, మిండీ కలింగ్, రూపీ కౌర్ ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఏ సినిమాకు వచ్చిందంటే? తాజాగా జరిగిన ఆస్కార్ వేడుకల్లో ఈ మూవీని వెనక్కు నెట్టి '20 డేస్ ఇన్ మరియుపోల్' ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా అకాడమీ అవార్డు ఎగరేసుకుపోయింది. ఈ సినిమాలో స్పెషల్ ఏముందంటారా? ఉక్రెయిన్- రష్యా మధ్య భీకర వార్ జరుగుతుంది. మారియుపోల్ నగరంలో చిక్కుకున్న ఉక్రెయిన్ జర్నలిస్టులు రష్యా దురాగతాలను ప్రపంచానికి చాటిచెప్పాలని ప్రయత్నిస్తారు. వారి పోరాటమే సినిమా కథ! చదవండి: 'ఓపెన్ హైమర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు -
ఆస్కార్కు ఒకరోజు ముందు ఓటీటీలోకి వచ్చేసిన మూవీ..
ఆస్కార్ వేడుకలకు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 96వ అకాడమీ అవార్డు సెలబ్రేషన్స్ జరగనున్నాయి. భారత్కు చెందిన అమ్మాయి నిషా పహుజా తెరకెక్కించిన టు కిల్ ఎ టైగర్ అనే చిత్రం డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది. ఆస్కార్ పురస్కారాల ప్రకటనకు ఒకరోజు ముందు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కథేంటంటే.. 13 ఏళ్ల వయసు చిన్నారి నిషాకు చదువు, ఆటలు తప్ప మరొకటి తెలియదు. అన్యం పుణ్యం తెలియని ఆ పల్లెటూరి అమాయకురాలిపై కీచకులు సామూహిక అత్యాచారానికి పాల్పడతారు. ఈ ఘటనతో పాప భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. కానీ తల్లిదండ్రులు ఏడుస్తూ కూర్చోలేదు. న్యాయం కోసం పోరాటం మొదలుపెడతారు. ఇది సినిమానే కాదు రియల్గానూ జరిగింది. 2017లో జార్ఖండ్లోని రాంచీలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. భారత సంతతికి చెందిన కెనడావాసి నిషా పహుజా అద్భుతంగా తెరకెక్కించింది. ఓటీటీలో.. ఈ సినిమా ఇప్పటికే టోర్నటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లోనూ సత్తా చాటింది. అమెరికాలో ఈ సినిమా థియేటర్లలో రిలీజవగా ఇండియాలో మాత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజైంది. నేషనల్ ఫిలిం బోర్డ్ ఆఫ్ కెనడా వెబ్సైట్లోనూ దీన్ని ఫ్రీగా చూసేయొచ్చు. మరింకెందుకు ఆలస్యం.. హృదయాన్ని మెలిపెట్టే ఈ సినిమానూ మీరూ చూసేయండి.. A real tale of courage, resilience and grit in the face of adversity- now an Academy Award nominee for Best Documentary Feature 🔥🙌 To Kill A Tiger, now streaming, only on Netflix!#ToKillATigerOnNetflix @ToKillATigerDoc #StandWithHer @NishaPahuja pic.twitter.com/eL4YBTRwLM — Netflix India (@NetflixIndia) March 10, 2024 చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన మూవీ.. కాకపోతే.. -
Dr Aparna Buzarbarua: విశ్రాంత సమయాన అవిశ్రాంత కృషి
‘అపర్ణ మేడం పాఠం ఒక్కసారి వింటే ప్రతి చెట్టు, ప్రతి పువ్వుతో స్నేహం చేయాలనిపిస్తుంది’ ‘అపర్ణ స్వరపరిచిన పాటలు వింటే అద్భుతం అనిపిస్తుంది’ ‘అపర్ణ వినిపించే వీణ స్వరాలు అపురూపం’ ‘అపర్ణ రాసిన పుస్తకాలు శాస్త్రీయ విషయాలను సైతం చాలా సులభంగా అర్థమయ్యేలా చెబుతాయి’... ఇలాంటి కామెంట్స్ అపర్ణ గురించి తరచుగా వినిపిస్తుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే డా. అపర్ణ బుజర్ బారువా బహుముఖ ప్రజ్ఞాశాలి. విశ్రాంత జీవితానికి కొత్త అర్థం ఇచ్చిన ప్రతిభావంతురాలు. కోల్కతాలో జరిగిన ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆమె తీసిన ‘దూలియ కల్చర్ ఆఫ్ వోల్డ్ కామ్రూప్’ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డ్ను అందుకుంది... సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టే అస్సాంలోని తేజ్పూర్లో పుట్టిపెరిగింది అపర్ణ. గువహటిలోని కాటన్ కాలేజీలో బాటనీ లెక్చరర్గా తన ఉద్యోగప్రస్థానాన్ని 1969లో ప్రారంభించిన అపర్ణ ఒకవైపు విద్యార్థులకు బాటనీ పాఠాలు బోధిస్తూనే మరోవైపు విద్యార్థిగా మ్యూజిక్ కాలేజీలో చేరి సంగీత పాఠాలు నేర్చుకునేది. సంగీత విద్యాపీuŠ‡ నుంచి సితార్లో విశారద్ డిగ్రీ పొందింది. ఎంతోమంది కవుల పాటలకు స్వరాలు సమకూర్చింది. ఆ పాటలు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమై ఆదరణ పొందాయి. వందపాటలకు పైగా స్వరాలు అందించిన అపర్ణ ఏఐఆర్ గువహటి ఫస్ట్ ఉమెన్ మ్యూజిక్ డైరెక్టర్గా అరుదైన ఘనతను దక్కించుకుంది. 2003లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హోదాలో పదవీ విరమణ చేసిన అపర్ణ ‘ఇది విశ్రాంతి సమయం’ అనుకోలేదు. ‘ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి చాలా సమయం దొరికింది’ అనుకుంది. తన సాంస్కృతిక మూలాలను వెదుక్కుంటూ వెళ్లింది. కొత్త సంగీత ధోరణులను అధ్యయనం చేసింది. సంస్కృతి, సాహిత్యం, శాస్త్రీయ రంగాలకు సంబంధించి ఎన్నో పుస్తకాలు రాసింది. గువహటిలోని గీతానగర్లో తన భర్త నాగేంద్రనాథ్ బుజర్ బారువా పేరు మీద చక్కటి లైబ్రరీ ఏర్పాటు చేసింది. కాలంతో పాటు నడుస్తూ షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు తీయడం నేర్చుకుంది. 26 నిమిషాల నిడివి ఉన్న ‘దూలియ కల్చర్ ఆఫ్ వోల్డ్ కామ్రూప్’ డాక్యుమెంటరీ అపర్ణకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చింది. ‘దూలియ సంస్కృతి గత, వర్తమానాలకు అద్దం పట్టేలా ఈ డాక్యుమెంటరీని రూపొందించాను. దూలియా లాంటి ప్రత్యేక సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది’ అంటుంది అపర్ణ. దూలియ అనేది పురాతన కళారూపం. దూలియ సంస్కృతి వైభవం గాయకుల పాటల్లో, ఆటల్లో, తోలుబొమ్మలాటలో కనిపిస్తుంది. గానం, నటన, హాస్యప్రదర్శన, డప్పులు వాయించడం... ఎన్నో కళల సమాహారంగా దూలియ సంస్కృతి ఉండేది. ఈ పురాతన కళారూపం గురించి ఊరూవాడా తిరిగి లోతైన పరిశోధన చేసింది అపర్ణ. తాను తెలుసుకున్న విషయాలకు డాక్యుమెంటరీ రూపాన్ని ఇచ్చింది. దూలియ సంస్కృతికి తన జీవితాన్ని అంకితం చేసిన డ్రమ్మర్, నటుడు మోహన్ చంద్ బర్మన్ కృషిని ఈ డాక్యుమెంటరీ హైలెట్ చేస్తుంది. దూలియ సంస్కృతిపై అపర్ణకు ఆసక్తి, అనురక్తి ఎలా పెరిగింది అనే విషయానికి వస్తే.... కొన్ని సంవత్సరాల క్రితం గువహటిలోని గీతానగర్ రాస్ ఫెస్టివల్లో కామ్రూపియా ప్రదర్శనను ప్రారంభించడానికి అపర్ణను ఆహ్వానించారు నిర్వాహకులు. ఈ ప్రదర్శను చూసి అపర్ణ మంత్రముగ్ధురాలైంది. ఈ ఆనందం ఒక కోణం అయితే కళాకారుల ఆర్థిక కష్టాలు తెలుసుకొని బాధ పడడం మరో కోణం. ఇక ఆరోజు నుంచి కామ్రూప్ కళాకారుల కోసం తన వంతుగా ఏదైనా చేయాలని తపించి పోయింది. ఈ గొప్ప కళారూపాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తే, సహాయం చేసే ద్వారాలు తెరుచుకుంటాయని నిర్ణయించుకొని తన నిర్మాణ, దర్శకత్వంలో డాక్యుమెంటరీ ప్రారంభించింది. ఏ లక్ష్యంతో అయితే ఈ డాక్యుమెంటరీ నిర్మాణానికి అపర్ణ పూనుకుందో అది నెరవేరే సమయం వేగవంతం అయింది. దూలియ సంస్కృతి గురించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ పురాతన కళారూపాన్ని తమ భుజాల మీద మోస్తున్న అరుదైన కళాకారులకు సహాయం అందడమే ఇక తరువాయి. ఏ పని మొదలుపెట్టినా ‘అంతా మంచే జరుగుతుంది’ అనుకోవడం అపర్ణ సెంటిమెంట్. కళాకారులకు సహాయం అందే విషయంలో కూడా ఆమె సెంటిమెంట్ నెరవేరాలని ఆశిద్దాం. నా వయసు జస్ట్ 78 ప్లస్ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డ్ను అందుకోవడానికి వేదికపైకి వచ్చినప్పుడు యాంకర్ నన్ను ఆశ్చర్యంగా చూసి ‘మీ వయసు ఎంత?’ అని అడిగారు. 78 ప్లస్ అని చెప్పగానే ‘మీరు నిజంగా ఈ తరానికి స్ఫూర్తి’ అన్నారు. ఇది విని ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. ఈ చప్పట్లను కూడా నాకు వచ్చిన అపురూపమైన అవార్డ్గానే భావిస్తున్నాను. మొదటి డాక్యుమెంటరీకే నాకు పెద్ద పేరు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. – డా.అపర్ణ బుజర్ బారువా -
ఆస్కార్ బరిలో మన డాక్యుమెంటరీ
జార్ఖండ్లో తన పదమూడేళ్ల కుమార్తెపై ముగ్గురు కుర్రాళ్లు దారుణంగా లైంగిక దాడి చేశారు. ఆమెను చంపడానికి చూశారు. ఆ అమ్మాయి కుంగిపోయింది. కాని తనకు జరిగిన అన్యాయంపై పోరాడాలనుకుంది. నిరుపేద గ్రామీణ తండ్రి అందుకు సిద్ధమయ్యాడు. ఊరు ఊరంతా వారికి వ్యతిరేకమైనా ఆ తండ్రీ కూతుళ్లు న్యాయం కోసం పోరాడారు. ‘బాధితులు పోరాడాల్సిందే’ననే పిలుపునిస్తూ ఈ ఉదంతాన్ని ‘టు కిల్ ఏ టైగర్’ పేరుతో డాక్యుమెంటరీగా తీసింది నిషా పహూజా. 2024 సంవత్సరానికి ఆస్కార్కు నామినేట్ అయ్యింది ‘టు కిల్ ఏ టైగర్’. ‘ఈసారి ఇటువైపు వస్తే నిన్ను చంపినా చంపుతాం’ అని నిషా పహూజాతో జార్ఖండ్లోని ఆ గ్రామస్తులు అన్నారు. ఆరేళ్ల క్రితం జార్ఖండ్లోని ఒక గ్రామంలో 13 ఏళ్ల అమ్మాయిపై ముగ్గురు యువకులు లైంగిక దాడి చేశారు. దారుణంగా కొట్టారు. ఆ ఘటన తర్వాత అమ్మాయి, అమ్మాయి తండ్రి న్యాయ పోరాటానికి సంకల్పించారు. అక్కడి నుంచి ఆ గ్రామవాసులు తండ్రీ కూతుళ్లపై ఎలాంటి వొత్తిడి తెచ్చారు, అయినా సరే న్యాయం కోసం ఆ తండ్రీకూతుళ్లు ఎలా నిలబడ్డారు అని తెలిపే సంక్షిప్త చిత్రమే నిషా పహూజా దర్శకత్వం వహించిన ‘టు కిల్ ఏ టైగర్’ డాక్యుమెంటరీ. గత సంవత్సరం మన దేశం నుంచి ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ డాక్యుమెంటరీ ఆస్కార్ పొందింది. రేపు మార్చి 10, 2024న జరగనున్న ఆస్కార్ వేడుకలో ‘టు కిల్ ఏ టైగర్’ కూడా గెలిస్తే అది చాలా పెద్ద విశేషమే అవుతుంది. బాధితులు పోరాడాల్సిందే ‘భారతదేశంలో ప్రతి 20 నిమిషాలకు ఒక రేప్ నమోదు అవుతోంది. నమోదు కానివి ఎన్ని ఉన్నాయో లెక్క తెలియదు. నేరం నమోదు అయ్యాక కూడా కేవలం 30 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతున్నాయి. లైంగిక దాడులను ఎదుర్కొన్నవారు న్యాయం కోసం పోరాడినప్పుడే పెత్తందారీ స్వభావ ప్రతిఫలాలైన లైంగికదాడులు తగ్గుతాయి’ అంటుంది నిషా పహూజా. చత్తీస్గఢ్లోని 13 ఏళ్ల అమ్మాయి (ఇప్పుడు 19 సంవత్సరాలు) న్యాయ పోరాటాన్ని నిషా 2022లో డాక్యుమెంటరీగా తీసింది. అత్యాచార ఘటన జరిగిందని గ్రామస్తులు అంగీకరించినా తమ ఊరి కుర్రాళ్లపై కేసు నడవడం ఇష్టపడటం లేదు. అంతేకాదు ఇలా తమ ఊరు పరువు బజారున పడటం కూడా ఇష్టపడటం లేదు. దాంతో డాక్యుమెంటరీ యూనిట్ని బెదిరించారు. బాలికపై జరిగిన అత్యాచారాన్ని ‘అదో ఆకతాయి చర్య’ అని కొందరు అంటే ‘ఆ ముగ్గురిలో ఎవరో ఒక కుర్రాణ్ణి అమ్మాయి పెళ్లి చేసుకుంటే సరి’ అని మరికొందరు భావిస్తున్నారు. కాని బాధితురాలు మాత్రం ‘చితికిపోయిన నా కలలను ఎవరు తిరిగి తెచ్చిస్తారు’ అని ప్రశ్నిస్తోంది. స్త్రీ సమస్యలే ఆమె ఇతివృత్తాలు 55 ఏళ్ల నిషా పహూజా తన నాలుగేళ్ల వయసులో ఢిల్లీ నుంచి కెనడా వలస వెళ్లింది. అక్కడే యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో ఆంగ్ల సాహిత్యం చదివింది. సీబీసీ (కెనడియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్)లో రీసెర్చర్గా పని చేసి జాన్ వాకర్, అలీ కజిమి వంటి కెనడియన్ ఫిల్మ్ మేకర్స్ వద్ద డాక్యుమెంటరీ నిర్మాణ మెళకువలు గ్రహించింది. ఆపై తనే సొంతంగా డాక్యుమెంటరీలు తీయడం మొదలు పెట్టింది. భారతదేశంతో సంబంధాలు తెంచుకోకుండా తరచూ వచ్చి వెళ్లే నిషా ఇక్కడి స్త్రీల సమస్యలకే ఎక్కువ డాక్యుమెంటరీ రూపం ఇచ్చింది. 2002లో ‘బాలీవుడ్ బౌండ్’ పేరిట డాక్యుమెంటరీ తీసింది. నలుగురు భారతీయ కెనడియన్ వ్యక్తులు ముంబై మహానగరానికి వచ్చి బాలీవుడ్లో తమ అదృష్టాన్ని ఎలా పరీక్షించుకున్నారనేది అందులో మూలాంశం. 2012లో నిషా తీసిన ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ డాక్యుమెంటరీ అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. మిస్ ఇండియా కావాలని కలలు కనే భారతీయ యువతుల సంఘర్షణాయుతమైన తతంగాన్ని చూపుతూ ఈ చిత్రం తెరకెక్కింది. ప్రతిష్ఠాత్మక ఎమ్మీ పురస్కారాల్లో ‘ఔట్స్టాండింగ్ కవరేజ్ ఆఫ్ ఎ కరెంట్ న్యూస్ స్టోరీ’ విభాగంలో పురస్కారం అందుకుంది. 2022లో నిషా తీసిన డాక్యుమెంటరీయే ‘టు కిల్ ఎ టైగర్’. 90 నిమిషాల ఈ డాక్యుమెంటరీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కెనడా టాప్–10 చిత్రంగా నిలిచింది. అనంతరం వివిధ వేదికలపై 19 పురస్కారాలు కైవసం చేసుకుంది. ఆస్కార్ గెలుచుకుంటే అదో విశిష్ట పురస్కారం అవుతుంది. -
ఓటీటీలో దూసుకెళ్తోన్న రియల్ క్రైమ్ థ్రిల్లర్.. ఆ టాలీవుడ్ మూవీని దాటేసి!
ప్రస్తుతం ఓటీటీల్లో సినిమాలు చూసేందుకు ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. కొత్త సినిమా వచ్చిందంటే చాలు ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి చూసేస్తున్నారు. ముఖ్యంగా హారర్, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. సాధారణ సినిమాలతో పోలిస్తే.. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన చిత్రాలపై ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తున్నారు. తెలుగులో ఇటీవల రిలీజైన దూత, ది విలేజ్ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్లకు మంచి స్పందన వచ్చింది. అయితే ఇటీవలే ఓ నిజ జీవిత కథ ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ చిత్రం 'కర్రీ అండ్ సైనైడ్' ఓటీటీలో రిలీజైంది. ఈ మూవీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. హత్యల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ మూవీ నెట్ఫ్లిక్స్లో దూసుకెళ్తోంది. డిసెంబర్ 22న స్ట్రీమింగ్కు వచ్చిన ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా టాప్-3లో నిలిచింది. టాలీవుడ్ హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ, షారుక్ ఖాన్ జవాన్ను, ఆక్వామన్ చిత్రాలను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 30 దేశాల్లో టాప్-10లో కొనసాగుతోంది. నిజ జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. 'కర్రీ అండ్ సైనైడ్: ద జూలీ జోసెఫ్ కేసు' డాక్యుమెంటరీకి జాతీయ అవార్డు విజేత క్రిస్టో టామీ దర్శకత్వం వహించారు. -
Tanuja Chandra: చీకటి వెలుగుల దారుల్లో...
కథలు ఆకాశం నుంచి నేలకు దిగి రావు. ఈ నేలలో అనేక కథలు దాగున్నాయి. వాటి జాడలు వెదుక్కుంటూ వెళ్లడమే సృజనకారుల పని. బంధువులను వెదుక్కుంటూ ఉత్తర్ప్రదేశ్లోని మారుమూల గ్రామాలకు వెళ్లిన రైటర్, డైరెక్టర్ తనూజ చంద్ర తనకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకుంది. మహిళలు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలపై డాక్యుమెంటరీలు తీయాలని నిర్ణయించుకుంది... తనూజ చంద్ర తల్లి కామ్నా చంద్ర రైటర్, సోదరుడు విక్రమ్ చంద్ర రైటర్, సోదరి అనుపమ చోప్రా ఫిల్మ్ క్రిటిక్. రెండు ముక్కల్లో చెప్పుకోవాలంటే ఇంటి నిండా సృజనాత్మక వాతావరణం కొలువై ఉండేది. టీవీ సిరీస్ జమీన్ ఆస్మాన్(1996)తో డైరెక్టర్గా వినోదరంగంలోకి అడుగుపెట్టింది తనూజ. మహేష్భట్ ‘జఖ్మ్’ సినిమాకు స్క్రీన్ప్లే రాసి మంచి పేరు తెచ్చుకుంది. సంజయ్ దత్, కాజోల్ జంటగా నటించిన ‘దుష్మన్’ సినిమాతో బాలీవుడ్లో డైరెక్టర్గా తొలి అడుగు వేసింది. ‘నేను కమర్షియల్ డైరెక్టర్ని మాత్రమే’ అనే ధోరణిలో కాకుండా మహిళల జీవితానికి సంబంధించిన సమస్త కోణాలను సినిమా, ఓటీటీ మాధ్యమాలపై ఆవిష్కరిస్తోంది తనూజ. ‘ఊహాల్లో నుంచి మహిళలకు సంబంధించిన కథలను అల్లడం కంటే వారి దగ్గరకు వెళ్లి మాట్లాడితే నిజమైన కథలు వస్తాయి’ అంటున్న తనూజ స్క్రిప్ట్ మేకింగ్ కోసం రైటింగ్ రూమ్కు మాత్రమే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఎంతోమంది మహిళలతో మాట్లాడింది. ఆ క్రమంలో తనకు ఏదైనా ఆలోచన వస్తే అది స్క్రిప్ట్గా రూపొందుతుంది. వెండితెరపై రాణిస్తున్న వారు షార్ట్ ఫిల్మ్స్పై పెద్దగా దృష్టి పెట్టరు. తనూజకు మాత్రం ఎలాంటి పట్టింపులు లేవు. పెద్ద డైరెక్టర్గా పేరు వచ్చిన తరువాత కూడా రొమాంటిక్ డ్రామా షార్ట్ ఫిల్మ్ ‘సిల్వత్’ తీసింది. ‘ఏ మాన్సూన్ డేట్’ అనే షార్ట్ ఫిల్మ్కు కూడా విశ్లేషకుల నుంచి ప్రశంసలు లభించాయి. అయిదు సంవత్సరాల క్రితం ఉత్తర్ప్రదేశ్లోని లహ్ర అనే గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లింది తనూజ. అక్కడ తనకు ఇద్దరు మేనత్తలు ఉన్నారు. ఇద్దరూ భర్తను కోల్పోయి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఆంటీ రాధ సరదా మనిషి. శాంతస్వభావి. ఎంత పెద్ద కష్టానికైనా అడ్జస్టైపోతుంది. సుధా ఆంటీ మాత్రం రాధ ఆంటీకి పూర్తి భిన్నం. ఒకరకంగా చెప్పాలంటే ఫైర్బ్రాండ్. చాలా స్క్రిక్ట్. పర్ఫెక్షన్కు ప్రాధాన్యత ఇస్తుంది. ఎక్కడ తేడా వచ్చినా గొడవకు దిగుతుంది. ఒకరి వయసు 93. మరొకరి వయసు 83. వేరు వేరు ప్రపంచాలకు చెందిన ఇద్దరికీ తమ మనస్తత్వాల మూలంగా ఎప్పుడూ గొడవలు రాలేదు. వీరి జీవితాన్ని గురించి లోతుగా తెలుసుకున్న తరువాత ‘ఆంటీ సుధా ఆంటీ రాధ’కు శ్రీకారం చుట్టింది తనూజ. నలభై ఎనిమిది నిమిషాల ఈ డాక్యుమెంటరీలో హాయిగా నవ్వుకునే సన్నివేశాలే కాదు కంట తడి పెట్టించే సన్నివేశాలు కూడా ఉన్నాయి. ‘సాధారణ ప్రజలు అనే మాట వింటుంటాం. అయితే వారి జీవితాలలోకి తొంగి చూస్తే అసాధారణ సన్నివేశాలు, సాహసాలు కనిపిస్తాయి’ అంటున్న తనూజకు ఇది తొలి డాక్యుమెంటరీ ఫిల్మ్. కట్ చేస్తే... ‘వెడ్డింగ్.కాన్’ అనే సరికొత్త డాక్యుమెంటరీ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది తనూజ. పెళ్లి చేసుకుంటానని ఎంతోమంది మహిళలకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు కాజేశాడు ప్రజిత్. రకరకాల మారుపేర్లతో మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా మోసాలకు పాల్పడేవాడు. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, పశ్చిమబెంగాల్...మొదలైన రాష్ట్రాల్లో ఎంతోమంది మహిళలను మోసం చేశాడు. థానేలోని ధోకాలీ ప్రాంతానికి చెందిన ఒక బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో ప్రజిత్ మోసం వెలుగులోకి వచ్చింది. థానే పోలీసులు ప్రజిత్ను అరెస్ట్ చేశారు. ‘వెడ్డింగ్.కాన్’ డాక్యుమెంటరీ ప్రజిత్లాంటి ఎంతోమంది మోసగాళ్ల మోసాలకు అద్దం పడుతుంది. ‘మ్యాట్రిమోనియల్ మోసాల ద్వారా నష్టపోయిన మహిళలు ఎందరో ఉన్నారు. అయితే చాలామంది పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడానికి ఇష్టపడడం లేదు. దీనికి కారణం తాము తప్పు చేశాం అనే భావన. నలుగురు నవ్వుతారేమో అనుకోవడం. ఇది నన్ను చాలా బాధ పెట్టింది’ అంటుంది తనూజ చంద్ర. అయితే ‘వెడ్డింగ్.కాన్’ బాధిత మహిళలకు ధైర్యాన్ని ఇస్తుంది, న్యాయం కోసం పోరాటం చేసే స్ఫూర్తిని అందిస్తుంది అనడంలో సందేహం లేదు. గమనాన్ని మార్చింది బంధువులను వెదుక్కుంటూ ఉత్తర్ప్రదేశ్లోని మారుమూల గ్రామాలకు వెళ్లినప్పుడు సాధారణ జీవితాల్లోని అసాధారణ దృశ్యాలు కనిపించాయి. ఎంతో మంది మహిళలతో మాట్లాడిన తరువాత...మహిళల గురించి ఓటీటీ మాధ్యమం ద్వారా సీరియస్గా చెప్పాల్సిన కథలు ఎన్నో ఉన్నాయి అనిపించింది. ఆంటీ సుధా ఆంటి రాధ నా గమనాన్ని మార్చింది అని చెప్పవచ్చు. – తనూజ చంద్ర, రైటర్, డైరెక్టర్ -
తాగే నీళ్లలో, తినే అన్నంలో సైనైడ్.. సీరియల్ కిల్లర్ రియల్ స్టోరీ!
సినిమాల్లో కొన్ని భయంకరమైన హత్యలను చూపిస్తుంటారు. అవి చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మరీ ఇంత దారుణంగా ఉన్నారేంట్రా.. బాబూ అనిపించకమానదు. కానీ కొన్ని రియల్ సంఘటనలు అంతకన్నా దారుణంగా ఉంటాయి. నవ్వుతూనే ఒంట్లో కత్తి దింపుతారు. నమ్మిస్తూనే గొంతు కోస్తారు. ప్రేమిస్తూనే సైనైడ్ పెట్టి చంపేస్తారు. అలాంటి ఓ నిజ జీవిత కథ ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ చిత్రం 'కర్రీ అండ్ సైనైడ్'. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో నేటి (డిసెంబర్ 22) నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్కు ఆధారమైన నిజ సంఘటనలపై ఈ ప్రత్యేక కథనం.. ఇంటి పెద్దతో హత్యలు మొదలు జూలీ జోసెఫ్ది కేరళ కోజికోడ్లోని కూడతాయి గ్రామం. ఈమె పద్నాలుగేళ్లలో ఆరు హత్యలు చేసింది. వాళ్లంతా తన సొంత ఇంటిసభ్యులే కావడం గమనార్హం! 2002లో జూలీ అత్తయ్య అన్నమ్మ థామస్ గ్లాసు నీళ్లు తాగి చనిపోయింది. దీన్ని వైద్యులు గుండెపోటు అని తేల్చారు. ఆరేళ్ల తర్వాత 2008లో జూలీ మామయ్య టామ్ థామస్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మూడేళ్ల తర్వాత.. 2011లో జూలీ భర్త రాయ్ థామస్ కడుపు నిండా భోజనం చేశాక బాత్రూమ్లో విగతజీవిగా కనిపించాడు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అందరినీ నమ్మించింది. అనుమానించినందుకు అతడ్నీ చంపేసింది కానీ అన్నమ్మ సోదరుడు మాథ్యూ మాత్రం ఏదో జరుగుతోందని అనుమానించాడు. అది కనిపెట్టేలోపే అతడిని కూడా మట్టుపెట్టింది జూలీ. 2014లో విస్కీలో విషం కలిపి చంపింది. రెండేళ్ల తర్వాత.. 2016లో తన భర్త దగ్గరి బంధువైన షాజు జచారయ్య భార్య, ఏడాదిన్నర బిడ్డను సైతం చంపేసింది. ఆ తర్వాత షాజు జచారయ్యను రెండో పెళ్లి చేసుకుంది జూలీ. అయితే అన్నయ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఏదో జరుగుతోందని అమెరికాలో ఉన్న రాయ్ థామస్ సోదరుడు రోజో అనుమానించాడు. అటు ఆస్తి బదలాయింపు విషయంలో జూలీ అక్రమాలకు పాల్పడటం.. తర్వాత మరిన్ని మరణాలు సంభవించడంతో రోజో అనుమానం బలపడింది. నమ్మలేని నిజాలు వెలుగులోకి.. అతడి ఫిర్యాదు మేరకు కేరళ క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. జూలీ తన భర్త తినే అన్నంలో సైనైడ్ పెట్టి చంపిందని తేలింది. అంతేకాదు మిగతా ఐదుగురినీ సైనైడ్ సాయంతోనే హత్య చేసిందని తేలింది. ఆస్తి తనకు దక్కాలన్న అత్యాశతోనే అందరి ప్రాణాలు పొట్టనపెట్టుకుంది. ఎట్టకేలకు ఆమెను దోషిగా తేల్చిన పోలీసులు 2019 అక్టోబర్లో అరెస్ట్ చేశారు. ఆమెకు సైనైడ్ సరఫరా చేసిన ఎమ్ఎస్. మాథ్యూ, ప్రాజీ కుమార్లపైనా చర్యలు తీసుకున్నారు. ఈ కేసు ఆధారంగా సీరియల్.. అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసు ఆధారంగా 'కూడతయి' అనే మలయాళ సీరియల్ వచ్చింది. అలాగే 'డెత్, లైస్ అండ్ సైనైడ్' పేరిట ఓ పాడ్క్యాస్ట్ కూడా రిలీజైంది. 'క్రైమ్ పెట్రోల్ సతర్క్' రెండో సీజన్లో 100-102 ఎపిసోడ్ల మధ్యలో ఈ కేసును కళ్లకు కట్టినట్లు చూపించారు. 'దహాద్' వెబ్ సిరీస్ కూడా ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని తీసినట్లు కనిపిస్తుంది. జూలీని అమ్మ అని పిలవడానికి ఇష్టపడని కుమారుడు ఇకపోతే 'కర్రీ అండ్ సైనైడ్: ద జూలీ జోసెఫ్ కేసు' డాక్యుమెంటరీకి జాతీయ అవార్డు విజేత క్రిస్టో టామీ దర్శకత్వం వహించాడు. షాలిని ఉషాదేవి రచయితగా పని చేసింది. ఈ సిరీస్లో హత్యలు జరిగిన ప్రదేశాన్ని సరిగా చూపించకపోవడంతో సహజత్వాన్ని కోల్పోయినట్లు కనిపిస్తుంది. రాయ్ థామస్ సోదరుడు రోజో, సోదరి రెంజీ థామస్ డాక్యుమెంటరీలో భాగమై తమ అనుభవాలు చెప్పారు. అలాగే జూలీ పెద్ద కుమారుడు సైతం ఈ సినిమాలో ఉన్నాడు. అతడు జూలీని తన తల్లిగా సంభోదించడానికి ఇష్టపడలేదు. ఆమెను ఆ మహిళ లేదా జూలీ అనే ప్రస్తావిస్తూ మాట్లాడాడు. చదవండి: త్రిష, చిరంజీవిపై కేసు.. పబ్లిసిటీ స్టంట్ అంటూ కోర్టు ఫైర్! -
'ది ఎలిఫెంట్ విస్పరర్స్' వివాదం.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బొమ్మన్ !
ఆర్ఆర్ఆర్తో పాటు ఆస్కార్ పొందిన డాక్యుమెంటరీ చిత్రం ది ఎలిఫెంట్ విస్పరర్స్. తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఏనుగులను సంరక్షించే గిరిజన దంపతుల జీవనం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఆ దంపతులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే దీన్ని తెరకెక్కించిన కార్తికి గోంజాల్వెస్ తీరు పట్ల ఇటీవలే ఈ దంపతులు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటిస్తే ఇల్లు, వాహనం, బెల్లీ మనవరాలు చదువుకు కావాల్సిన సాయంతోపాటు కలెక్షన్స్లోనూ వాటా ఇస్తామని కార్తికి చెప్పిందని బొమ్మన్, బెల్లీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన దంపతులు తమకు డబ్బులు ఇవ్వకుండా దర్శకురాలు మోసం చేసిందని వాపోయారు. అంతే కాకుండా తాము ఖర్చు పెట్టిన కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. (ఇది చదవండి: ఉద్యోగులకు బంపరాఫర్..సెలవుతో పాటు ఏకంగా టికెట్స్ కూడా!) ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అయితే ఇప్పటికే గిరిజన దంపతులు దర్శకురాలికి రూ.2 కోట్ల చెల్లించాలంటూ లీగల్ నోటీస్ పంపినట్లు తెలిసింది. ఆస్కార్ వచ్చిన తర్వాత దేశ ప్రధాని, తమిళనాడు ముఖ్యమంత్రి నుంచి ఆమె పురస్కారాలు అందుకున్నారని.. తమకు మాత్రం మొండిచేయి చూపించారంటూ లీగల్ నోటీసులో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంలో బొమ్మన్, బెల్లీ యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రూ.2 కోట్ల లీగల్ నోటీసు గురించి తమకు తెలియదని బొమ్మన్ చెప్పినట్లు వెల్లడిస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. బొమ్మన్ దంపతులు చేసిన ఆరోపణలపై పూర్తిగా యూ టర్న్ తీసుకున్నట్లు సమాచారం. ఓ మీడియా ప్రతినిధితో బొమ్మన్ మాట్లాడుతూ..' మా డిమాండ్లు నెరవేరితే కేసును వెనక్కి తీసుకుంటానని నేను చెప్పలేదు. అక్కడ ఏమి జరిగిందో నాకు ఏమి తెలియదు. లీగల్ నోటీసులు పంపినట్లు నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. కార్తీకి నాతో బాగా మాట్లాడారు. అంతే కాకుండా సహాయం చేస్తానని కూడా చెప్పారు. కేసు విషయంలో నేనేం చేస్తా. ఆమె మాకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. నాకు ఉద్యోగం ఇప్పిస్తే చాలు." అని అన్నారు. ఇప్పటికే దీనిపై వివాదం తలెత్తగా.. బొమ్మన్ కామెంట్స్తో సీన్ కాస్తా రివర్స్ అయింది. (ఇది చదవండి: మమ్మల్ని నమ్మించి మోసం చేసింది.. దర్శకురాలిపై తీవ్ర ఆరోపణలు!) అసలు కథేంటంటే.. తమిళనాడులోని ముదుమలై రిజర్వ్ ఫారెస్ట్లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్ దంపతుల నిజజీవిత ఆధారంగా తెరకెక్కించిన షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విష్పరర్స్. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు. వాటిని ఆదరించిన ఈ దంపతులనే ప్రధాన పాత్రలుగా కథ రూపొందించారు. నిర్మాత గునీత్ మోగ్న ఆధ్వర్యంలో.. దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ ఈ కథను తెరకెక్కించారు. -
మమ్మల్ని నమ్మించి మోసం చేసింది.. దర్శకురాలిపై తీవ్ర ఆరోపణలు!
'ది ఎలిఫెంట్ విస్పరర్స్' పేరు వినగానే గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వేదికపై ఈ పేరు మార్మోగిపోయింది. డాక్యుమెంటరీ చిత్రం అయినప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకుంది. ఈ ఏడాది జరిగిన 95 ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్లో భారత్ నుంచి ఆర్ఆర్ఆర్ మూవీ నాటునాటు సాంగ్కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్తో పాటు బెస్ట్ షార్ట్ ఫిలిం కేటగిరీలో ఆస్కార్ను కైవసం చేసుకుంది 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'. దిక్కులేని ఏనుగులను ఆదరించి.. వాటిని చూసుకునే ఓ దంపతుల ఇతివృత్తంగా తెరకెక్కించారు ది ఎలిఫెంట్ విస్పరర్స్. (ఇది చదవండి: తమన్నా చేయి పట్టుకున్న అభిమాని.. హీరోయిన్ ఏం చేసిందంటే? ) డాక్యుమెంటరీలో అద్భుతంగా నటించి ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకున్న గిరిజన జంట బొమ్మన్, బెల్లీ. అయితే తాజాగా ఈ జంట దర్శకుడు కార్తికి గోన్సాల్వేస్, చిత్ర నిర్మాణ సంస్థ సిఖ్యా ఎంటర్టైన్మెంట్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆగస్ట్ 4న ప్రముఖ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బొమ్మన్, బెల్లీ దంపతులు నిర్మాతలు వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' చిత్రీకరణ సమయంలో ఈ జంట.. దర్శకురాలు కార్తికి గోన్సాల్వ్స్తో స్నేహపూర్వక బంధాన్ని కొనసాగించారు. దీంతో బొమ్మన్, బెల్లీ సినిమా కోసం వివాహ సన్నివేశం కోసం లక్ష రూపాయలు తాము భరించామని తెలిపారు. ఆ డబ్బులను ఇప్పటివరకు తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. తన మనవరాలి చదువు కోసం దాచుకున్న రూ. 1 లక్ష ఖర్చు చేసినట్లు బెల్లీ వెల్లడించారు. డబ్బు తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చిన కార్తికి గోంజాల్వెస్ ఆ తర్వాత స్పందించలేదని వాపోయారు. ఆమెను కలిసేందుకు ప్రయత్నించగా ఎలాంటి స్పందన లేదన్నారు. తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదన్నారు. ఆస్కార్ను తాకడానికి ఒప్పుకోలేదు 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తర్వాత సన్మాన కార్యక్రమంలో బొమ్మన్, బెల్లీ దంపతులు కనీసం అవార్డ్ తాకేందుకు అనుమతించలేదని అన్నారు. ముంబై తిరిగి నీలగిరి రావడానికి కనీసం డబ్బులు కుడా ఇవ్వలేదని వాపోయారు. ఆర్థిక సహాయం కోసం ఆమెను సంప్రదించగా నిరాకరించిందని తెలిపారు. తమకు రెమ్యునరేషన్ కేవలం రూ. 60 మాత్రమే చెల్లించారని తెలిపారు. స్పందించని మేకర్స్ గిరిజన దంపతుల ఆరోపణలపై సిఖ్యా ఎంటర్టైన్మెంట్ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఉద్దేశంపై ఒక ప్రకటన విడుదల చేసింది. ఏనుగుల సంరక్షణపై అవగాహన పెంచడం, బొమ్మన్, బెల్లీతో సహా అటవీ శాఖల కృషిని గుర్తించడం తమ ప్రాథమిక లక్ష్యమని తెలిపింది. అంతే ఈ దంపతులు లేవనెత్తిన ఆరోపణలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. (ఇది చదవండి: ఆస్కార్ అంటే ఏంటో తెలియదు: ది ఎలిఫెంట్ విస్పరర్స్ నటి) అసలు కథేంటంటే.. తమిళనాడులోని ముదుమలై రిజర్వ్ ఫారెస్ట్లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్ దంపతుల నిజజీవిత ఆధారంగా తెరకెక్కించిన షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విష్పరర్స్. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు. వాటిని ఆదరించిన ఈ దంపతులనే ప్రధాన పాత్రలుగా కథ రూపొందించారు. నిర్మాత గునీత్ మోగ్న ఆధ్వర్యంలో.. దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ ఈ కథను తెరకెక్కించారు. ఆస్కార్ అంటే ఏంటో తెలియదు: బెల్లీ గతంలో ఆస్కార్ రావడం పట్ల బెల్లీ మాట్లాడుతూ.. 'ఏనుగులు అంటే మాకు పిల్లలతో సమానం. తల్లిని కోల్పోయిన పిల్లలకు సేవ చేయడాన్ని గొప్పగా భావిస్తాం. అలాంటి చాలా గున్న ఏనుగులను చేరదీశాం. వాటిని మా సొంత పిల్లల్లా చూసుకుంటాం. ఇది మా రక్తంలోనే ఉంది. మా పూర్వీకులు కూడా ఇదే పని చేసేవారు. కానీ నాకు ఆస్కార్ అంటే ఏంటో తెలియదు. అయినా అభినందనలు రావడం చాలా సంతోషంగా ఉంది.' అని అన్నారు. -
ధోనీని కలిసిన ఎలిఫెంట్ విస్పర్స్ చిత్రబృందం
-
ఆస్కార్ గెలిచిన వీరులతో ఎంఎస్ ధోని
ఐపీఎల్ 2023 సీజన్లో ధోని నేతృత్వంలోని సీఎస్కే ఐదోసారి టైటిల్ కొల్లగొట్టేందుకు ఉవ్విళ్లూరుతుంది. ప్రస్తుతం 11 మ్యాచ్ల్లో ఆరు విజయాలతో 13 పాయింట్లతో ఉన్న ధోని సేన రెండో స్థానంలో కొనసాగుతుంది. కాగా ఇవాళ(బుధవారం) ఢిల్లీ క్యాపిటల్స్తో సీఎస్కే తలపడనుంది. ఇక బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారతీయ చిత్రం 'ఎలిఫెంట్ విస్పరర్స్(Elephant Whisperers)' ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీలో కనిపించిన బొమన్, బెల్లీలను, దర్శకురాలు కార్తికి గోన్సాల్వెస్ను ఎంఎస్ ధోని బుధవారం ప్రత్యేకంగా కలుసుకున్నాడు. ఈ సందర్భంగా సీఎస్కే జెర్సీలను వారికి గిఫ్ట్గా బహుకరించాడు. ఇక్కడ విశేషమేంటంటే ధోని జెర్సీ నెంబర్ అయిన '7'తో వారి పేర్లను ముద్రించి కానుకగా అందించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Tudumm 🎬 Special occasion with very special people 💛🐘#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/AippVaY6IO — Chennai Super Kings (@ChennaiIPL) May 10, 2023 Roars of appreciation to the team that won our hearts! 👏 So good to host Bomman, Bellie and filmmaker Kartiki Gonsalves! 🐘#WhistlePodu #Yellove 🦁💛 — Chennai Super Kings (@ChennaiIPL) May 10, 2023 చదవండి: ODI WC 2023: హైదరాబాద్లో టీమిండియా-పాక్ మ్యాచ్! -
ఓటీటీలో రిలీజవుతున్న ఆహా 'గోదారి'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుత సినీరంగంలో ఓటీటీ హవా నడుస్తోంది. తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఆహా మరో కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తోంది. గోదారి పేరుతో తెరకెక్కిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ఈనెల 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో గోదావరి నదీ అందాలను, విశేషాలను ప్రేక్షకులకు వివరించేలా స్వాతి దివాకర్ దర్శకత్వంలో డాక్యుమెంటరీని రూపొందించారు. దర్శకుడు దివాకర్ మాట్లాడుతూ.. 'ఆహా ఓటీటీ ద్వారా ఈ గోదారి డాక్యుమెంటరీని ప్రేక్షకులకు చూపించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇంతకుముందెన్నడూ చూడని గోదారి అందాలను ఈ డాక్యుమెంటరీలో చిత్రీకరించాం. గోదావరి నదీ విశిష్ణత, దాని చుట్టూ కోట్ల మంది ప్రజలు అవలంబించే సంస్కృతీ, సంప్రదాయాలు కళ్లకు కట్టినట్టు ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నాం.' అని అన్నారు. ఈ ఆహా గోదారి డాక్యుమెంటరీ ఆహా ఓటీటీలో మైలురాయిగా నిలవనుంది. ఇలాంటి డాక్యుమెంటరీలతో మన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాచీన కట్టడాల గురించి ప్రేక్షకులకు వివరించే అవకాశం ఉంటుందని ఆహా యాజమాన్యం తెలిపింది. త్రింబకేశ్వర్లో తన ప్రయాణాన్ని ప్రారంభించి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ చివరికి అంతర్వేది దగ్గర సాగరంలో కలుస్తుంది మన గోదారి. తన ప్రవాహ ప్రయాణంలో వివిధ రకాల ప్రాంతాలు, మనుషులు, యాసలు, భాషలు, పుణ్యక్షేత్రాలను పలకరిస్తూ, పరవశిస్తూ వారి జీవితాల్లో ముఖ్య భూమిక పోషిస్తోందని -
మావటీల జీవితాల్లో వెలుగు తెచ్చారు
‘నాకు అడివింటే చాలా భయం’ అంటుంది బెల్లి. ఆస్కార్ వచ్చిన ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ లో మావటి బొమ్మన్ భార్య ఆమె. భర్తతో కలిసి రఘు అనే పిల్ల ఏనుగును ఆమె సాకుతుంది. దాంతోపాటు ‘అమ్ము’ అనే ఇంకో పిల్ల ఏనుగు బాగోగులను బెల్లి చూస్తుంది. బొమ్మన్ ప్రభుత్వ ఉద్యోగి. బెల్లి కాదు. అయినా సరే భర్త డ్యూటీలో ఆమె భాగం పంచుకుంది. భర్తతో పాటే పసి ఏనుగులను చూసుకుంది. ‘నా భర్తను పులి చంపింది. అప్పటి నుంచి అడివంటే భయం. బొమ్మన్ను చేసుకున్నాక కొంచెం భయం పోయింది. పిల్ల ఏనుగుల బాగోగుల్లో పడ్డాక, వాటి వెంట తిరుగుతుంటే అడివంటే భయం పోయింది’ అంటుంది బెల్లి. నీలగిరి (ఊటీ) అడవుల్లో ఉండే ఎలిఫెంట్ క్యాంపుల్లో ఏనుగుల సంరక్షణ మావటీలు చూస్తారు. వీళ్లంతా దాదాపు ఆ ప్రాంత గిరిజనులే. ఏనుగులను చూసుకోవడం మగవారి పనే. అయితే బొమ్మన్ చూసేది పిల్ల ఏనుగులను కనుక వాటి అమాయకత్వానికి ముగ్ధురాలై అమ్ము కూడా వాటితో అనుబంధం పెంచుకుంటుంది. ఆమెకు రఘు, అమ్ము ఎంత మాలిమి అంటే డాక్యుమెంటరీలో అమ్మును పిలిచి ‘ఏయ్... నా ఒడిలో కాదు. పక్కన పడుకో. లేకుంటే దెబ్బలు పడతాయి’ అనంటే ఆ ఏనుగు ఆమె పక్కన మెల్లగా ఒత్తిగిలి పడుకోవడం ముచ్చట గొలుపుతుంది. అమ్ముకు బెల్లి రెండు జడలు వేసి నవ్వుకుంటూ ఉన్నప్పుడు ఈ డాక్యుమెంటరీ ముగుస్తుంది. అయితే బొమ్మన్ వల్ల, అమ్ము వల్ల, ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన కార్తికి వల్ల దేశంలో ఇప్పుడు ఏనుగుల సంరక్షణ గురించి చర్చలు జరుగుతున్నాయి. తమిళనాడు సి.ఎం స్టాలిన్ వెంటనే స్పందించి బొమ్మన్, బెల్లిలను పిలిచి చెరొక లక్ష డబ్బు ఇచ్చి సన్మానం చేశారు. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న 91 మంది మావటీలకు కూడా మనిషికో లక్ష ఇవ్వనున్నారు. వీరి నివాసాల కోసం 9 కోట్లు మంజూరయ్యాయి. అలాగే ఏనుగుల క్యాంపుల కోసం 13 కోట్లు మంజూరయ్యాయి. ప్రేమ, ఆదరణల వల్ల ఎప్పుడూ మంచే జరుగుతుంది. బొమ్మన్, బెల్లిలతో అది మరోసారి రుజువయ్యింది. -
ఆస్కార్ గెలిచిన రోజే ఏనుగులు మిస్సింగ్.. షాక్లో చిత్రబృందం
లాస్ ఎంజిల్స్లో జరిగిన ఆస్కార్ అవార్డు గెలిచిన డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'. పూర్తిగా ఇండియాలో నిర్మించిన డాక్యుమెంటరీకి తొలి ఆస్కార్ దక్కడం విశేషం. వీరికి ఈ అవార్డు రావడానికి కారణం రఘు, అమ్ము అనే అనాథ ఏనుగు పిల్లలు. ఆ ఏనుగు పిల్లను చేరదీసిన ఆదివాసి దంపతులు బొమ్మన్, బెల్లి. కరెంటు తీగలు తగిలి తల్లి ఏనుగులు మరణించడంతో బొమ్మన్, బెల్లిలు రఘుని, అమ్ముని సాకుతారు. మనుషులకు అడవి జంతువులకు మధ్య ఉండే అనుబంధాన్ని ఈ డాక్యుమెంటరీలో ఎంతో అద్భుతంగా చూపించారు. అయితే అవార్డ్ ప్రదానోత్సవం రోజునే విచిత్ర సంఘటన జరిగింది. ఒకవైపు అవార్డ్ వచ్చిందన్న ఆనందంలో ఉంటే.. మరోవైపు ఆ డాక్యుమెంటరీలో నటించిన ఏనుగులు అదృశ్యమయ్యాయనే వార్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డాక్యుమెంటరీలో రఘు, అమ్ము అనే రెండు ఏనుగులు అదృశ్యమైనట్లు బొమ్మన్ వెల్లడించారు. కొంతమంది తాగుబోతులు ఏనుగులను తరమడంతో ఆదివారం రెండు ఏనుగులు కృష్ణగిరి అరణ్యంలోకి వెళ్లిపోయాయని ఆయన చెప్పారు. ఆ ఏనుగుల కోసం బొమ్మన్ ప్రస్తుతం వెతుకడం ప్రారంభించారు. బొమ్మన్ మాట్లాడుతూ..'మద్యం మత్తులో ఉన్న కొంత మంది వ్యక్తులను తరమడంతో ఏనుగులు అడవిలోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం నేను కృష్ణగిరి ఫారెస్ట్లో వెతుకుతున్నా. అవి రెండూ కలిసే ఉన్నాయా.. విడిపోయాయా అనే విషయంలో నాకు క్లారిటీ లేదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వాటి ఆచూకీ కనిపెట్టడానికి ప్రయత్నిస్తా. ఒకవేళ అవి నాకు కనిపించకపోతే ఫారెస్ట్ రేంజర్కు ఫిర్యాదు చేసి నేను నా సొంతూరికి వెళ్తా.' అని అన్నారు. -
అంబారీ ఎక్కి ఆస్కార్ వచ్చింది.. తొలిసారి భారత డాక్యుమెంటరీకి..
‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ నిడివి 39 నిమిషాలు. రెండు ఏనుగు పిల్లలు, నీలగరి అడవుల్లో ఉండే ‘కట్టు నాయకర్’ అనే తెగకు చెందిన ఆదివాసీ భార్యాభర్తలు ఈ డాక్యుమెంటరీలో కనిపిస్తారు. ఆ భార్యాభర్తల పేర్లు బొమ్మన్, బెల్లి. ఏనుగు పిల్లల్లో ఒకదాని పేరు రఘు, మరోదాని పేరు అమ్ము. కరెంటు తీగలు తగిలి తల్లి ఏనుగులు మరణించడంతో బొమ్మన్, బెల్లిలు రఘుని, అమ్ముని సాకుతారు. అయితే డాక్యుమెంటరీలో ఎక్కువ భాగం రఘతో బొమ్మన్, బెల్లిలకు ఉండే అనుబంధం చూపుతుంది. అయితే నేపథ్యంలో అందమైన అడవులు, వాగులు, ఆదివాసీల క్రతువులు ఇవన్నీ దర్శకురాలు కార్తికి చూపడంతో డాక్యుమెంటరీకి ఒక సంపూర్ణత్వం వచ్చింది. బొమ్మన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగి. ఇప్పుడు రఘు, అమ్ములను అటవీ శాఖ వారు ‘ముడుమలై టైగర్ రిజర్వ్’కు మార్చారు. దాంతో రఘుతో ఆ దంపతుల బంధం తెగింది. విఘ్నాలు తొలగిపోయాయి. పూర్తిగా ఇండియాలో నిర్మితమైన డాక్యుమెంటరీకి తొలి ఆస్కార్ అందింది. ఇది స్త్రీల ద్వారా జరిగింది. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు దర్శకత్వం వహించింది కార్తికి గోంజాల్వేజ్. నిర్మించింది గునీత్ మోంగా. వీరికి ఈ అవార్డు రావడానికి కారణం రఘు అనే అనాథ ఏనుగు పిల్ల. ఆ ఏనుగు పిల్లను సాకిన ఆదివాసి దంపతులు. మనుషులకు అడవి జంతువులకు మధ్య ఉండే అనుబంధం ఈ డాక్యుమెంటరీలో ఎంతో అద్భుతంగా వ్యక్తమైంది. అందుకే అంబారీ ఎక్కి వచ్చినట్టుగా మనకు ఆస్కార్ ఘనంగా దక్కింది. ఏనుగులు– మావటీలు మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నారు. కాని వారి మధ్య ఉన్నది ఒక రకమైన ప్రొఫెషనల్ స్నేహం. కాని కొన్ని సందర్భాలలో అనాథలైన ఏనుగు పిల్లలను కాపాడే పని ఆదివాసీలు తీసుకుంటారు. వారిది పెంచిన మమకారం. ఆ మమకారమే ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కథాంశం. దర్శకురాలు కార్తికీది ఊటి. అక్కడే పుట్టి పెరిగింది. ఊటీకి అరగంట ప్రయాణ దూరంలో ‘తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్’ ఉంది. అక్కడ ఏనుగులను సంరక్షిస్తుంటారు. కార్తికి గోంజాల్వేజ్ చిన్నప్పటి నుంచి ఆ క్యాంప్కు వెళ్లి ఏనుగులను చూసేది. ఆ తర్వాత ఆమె పెరిగి పెద్దదయ్యి ఫొటోగ్రాఫర్గా మారినా, కెమెరా ఉమన్గా తనకున్న వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీ మీద ఇష్టం వల్ల యానిమల్ ప్లానెట్, డిస్కవరీ చానల్స్లో పని చేసినా ఎప్పుడూ తన ప్రాంత ఏనుగుల మీద ఏదైనా ఫిల్మ్ చేయాలని అనిపించలేదు. కాని 2017లో అందుకు బీజం పడింది. అతడు – ఆ ఏనుగు పిల్ల కార్తికి గోంజాల్వేజ్ 2017లో బెంగళూరు నుంచి కారులో ఊటీకి వెళుతోంది. ఊటీ చేరుకుంటూ ఉండగా ఒక మనిషి చిన్న ఏనుగు పిల్లను నడిపించుకుంటూ వెళుతూ ఆమె కంట పడ్డాడు. కార్తికి వెంటనే కారు ఆపి ఈ మనిషి ఈ ఏనుగు పిల్లను ఎక్కడకు తీసుకువెళుతున్నాడు అని వెంబడించింది. వారిద్దరూ దగ్గరిలోని ఏటికి వెళ్లారు. ఆ మనిషి ఆ ఏనుగు పిల్లకు చంటిపిల్లలకు మల్లే స్నానం చేయించాడు. దానితో ఎన్నో కబుర్లు చెప్పాడు. ‘అరె.. ఈ బంధం భలే ఉందే’ అనిపించింది కార్తికికి. అతణ్ణి పలకరించింది. పేరు బొమ్మన్. ఆ ఏనుగు పిల్ల పేరు రఘు. ఆ ఏనుగు పిల్ల ఇటీవలే అనాథ అయ్యింది. పంటలను కాపాడుకోవడానికి పెట్టిన కరెంటు తీగల బారిన పడి రఘు తల్లి మరణించింది. అనాథ అయిన రఘు తల్లి వియోగంతో కృశించి చావుకు దగ్గరగా ఉండగా బొమ్మన్కు కనిపించాడు. దానిని ఇంటికి తీసుకెళ్లాడు. బొమ్మన్ భార్య బెల్లి రఘుకు తల్లిలా మారింది. ఆ ముగ్గురు ఒక కుటుంబం అయ్యారు. ఇలాంటి అనుబంధాలు చూపితే మనిషి, జంతువు కలిసి మెలిసి మనుగడ సాగించాల్సిన అవసరాన్ని చూపినట్టు అవుతుందని కార్తికి అనుకుంది. వెంటనే డాక్యుమెంటరీ నిర్మించడానికి నెట్ఫ్లిక్స్ను సంప్రదించింది. నెట్ఫ్లిక్స్ తన కో ప్రొడ్యూసర్గా నిర్మాత మోంగాను సంప్రదించింది. అలా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ నిర్మాణం మొదలైంది. ఢిల్లీకి చెందిన గునీత్ దాదాపు పదేళ్లుగా అంతర్జాతీయ దృష్టి పడే సినిమాల నిర్మాణంలో భాగస్వామి అవుతోంది. ఆమె నిర్మాణ భాగస్వామి అయిన ‘కవి’ (2010) బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్లో ఆస్కార్ నామినేషన్ పొందగా, ‘పిరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ (2018) బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్గా ఆస్కార్ అవార్డ్ పొందింది. అయితే ‘పిరియడ్’కు పని చేసిన సాంకేతిక నిపుణులు భారతీయులు కారు. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ను తీయాలనుకుంటున్న కార్తికితో పని చేయడం వల్ల ఈసారి పూర్తి భారతీయ నిర్మాణంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించవచ్చని గునీత్ భావించింది. అలా వీరిద్దరు కలిసి పూర్తి చేసిన ఈ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 8, 2022న విడుదలైంది. ఇది డాక్యుమెంటరీ వేవ్ ‘ఇప్పుడు ఇండియాలో నడుస్తున్నది డాక్యుమెంటరీ వేవ్. ఫీచర్ ఫిల్మ్స్లో కన్నా డాక్యుమెంటరీలో భారతీయ దర్శక నిర్మాతలు వినూత్నమైన కథాంశాలను చెబుతున్నారు’ అంటుంది గునీత్. కార్తికి మాట్లాడుతూ– ‘ఏనుగులు ఎంత తెలివైనవో ఎంత భావోద్వేగంతో బంధంతో ఉంటాయో నా డాక్యుమెంటరీలో చూపించాను. ఇక మీదటైనా అవి వేరు మనం వేరు అనుకోకపోతే చాలు’ అంది. ‘నేను తీసే ఫిల్మ్స్ ఇకపై కూడా ఇలాంటి కథాంశాలతో ఉంటాయి’ అన్నారు. చదవండి: ఊర నాటు.. ఆస్కార్ హిట్టు.. దేశం మురిసిన వేళ.. తెలుగు స్క్రీన్ ఆనందించిన వేళ -
Oscars 2023: ప్చ్.. ఆస్కార్ మిస్ చేసుకున్న భారతీయ చిత్రం ఇదే!
లాస్ ఏంజెల్స్: ఈ ఏడాది ఆస్కార్ బరిలో నిలిచిన భారత డాక్యుమెంటరీ చిత్రానికి నిరాశ ఎదురైంది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం కేటగిరిలో నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ (All That Breathes) అస్కార్ను దక్కించుకోలేకపోయింది. ఈ విభాగంలో అమెరికాకి చెందిన ‘నావాల్నీ’ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలింను అవార్డ్ వరించింది. ఆల్ దట్ బ్రీత్స్ని షానక్ సేన్ దర్శకత్వం వహించారు. ఈ కేటగిరిలో ఇతర నామినీల విషయానికొస్తే.. ఆల్ ది బ్యూటీ అండ్ ది బ్లడ్షెడ్, ఫైర్ ఆఫ్ లవ్, ఎ హౌస్ మేడ్ ఆఫ్ స్ప్లింటర్స్ చిత్రాలు ఉన్నాయి. ‘ఆల్ దట్ బ్రీత్’స్ ఈ విభాగంలో నామినేట్ చేసిన రెండవ భారతీయ చిత్రం. గత సంవత్సరం రింటు థామస్, సుష్మిత్ ఘోష్ రాసిన రైటింగ్ విత్ ఫైర్, ఆస్కార్స్లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్గా ఎంపికైంది. ఆల్ దట్ బ్రీత్స్.. ఢిల్లీలో బర్డ్ క్లినిక్ నడుపుతున్న సౌద్, నదీమ్ అనే ఇద్దరు సోదరుల కథ ఇది. ఈ డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్ సర్క్యూట్లో సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్తో పాటు అనేక అవార్డులను గెలుచుకుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు. -
తెలిసిన వ్యక్తే అని వెెళ్తే.. లైంగిక దాడి చేశాడు: నటి
హాలీవుడ్ నటి బ్రూక్ షీల్డ్స్ అమెరికన్ మోడల్. ఆమె పలు డాక్యుమెంటరీ చిత్రాల్లో నటించింది. అయితే తాజాగా విడుదలైన డాక్యుమెంటరీలో తన కెరీర్లో ఎదురైన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇటీవల విడుదలైన కొత్త డాక్యుమెంటరీ 'ప్రెట్టీ బేబీ'లో ఆమెపై జరిగిన లైంగిక దాడి సంఘటనను వివరించారు. అయితే నటిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. కానీ ఆమె ఆ వ్యక్తిని అంతకుముందే కలిసినట్లు చెప్పింది. గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు తెలిసిన వ్యక్తేనని వివరించింది. చిన్న వయసులోనే మోడల్గా ఫేమస్ అయిన బ్రూక్ షీల్డ్స్ ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో చదివారు. బ్రూక్ షీల్డ్స్కు తెలిసిన వ్యక్తి టాక్సీ పిలుస్తానని చెప్పి హోటల్కు తీసుకెళ్లాడని పేర్కొంది. ఆ తర్వాత తనపై లైంగిక దాడి చేశాడని తెలిపింది. ఆ తర్వాత బాత్రూమ్కు వెళ్లి అదృశ్యమయ్యాడని ఆమె చెప్పింది. అయితే ఇప్పటి వరకు ఈ సంఘటన గురించి ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదని వెల్లడించింది. బ్రూక్ షీల్డ్ మాట్లాడుతూ.. ' ఆ సమయంలో నేను అతనిపై ఫైట్ చేయలేకపోయా. పూర్తిగా స్తంభించిపోయా. కేవలం 'నో' అని మాత్రమే అరిచా. ఆ సమయంలో కేవలం ప్రాణాలతో బయటపడితే చాలు అనుకున్నా.' అని వివరించింది. ఈ సంఘటన తర్వాత తన స్నేహితుడు, సెక్యూరిటీ హెడ్ గావిన్ డి బెకర్కు ఫోన్ చేసినట్లు గుర్తుచేసుకుంది. కాగా.. సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం ప్రదర్శించబడిన కొత్త డాక్యుమెంటరీ "ప్రెట్టీ బేబీ'ని ప్రదర్శించారు. . -
‘వన్స్ అపాన్ ఏ విలేజ్’రివ్యూ
పర్యావరణ ప్రేమికులకు ప్రీతిపాత్రమైన ఫిల్మ్ ఫెస్టివల్ ఆల్ లివింగ్ థింగ్స్ ఎన్విరాన్మెంటల్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఎఎల్టీఇఎఫ్ఎఫ్). రెండు సంవత్సరాల క్రితం ఈ ఫెస్టివల్కు శ్రీకారం చుట్టారు. తాజా ఫిల్మ్ఫెస్టివల్లో దేశవిదేశాలకు చెందిన 55 చిత్రాలను దిల్లీ, ముంబై, బెంగళూరులాంటి ప్రధాన నగరాలలో ప్రదర్శిస్తున్నారు. ప్రకృతి సౌందర్యాన్ని వెండితెర మీదికి తీసుకురావడంతో పాటు వర్తమానానికి సంబంధించి పర్యావరణ సంక్షోభం గురించి ఆలోచన రేకెత్తించడం ఈ చిత్రోత్సవం ఉద్దేశం. ఇందులో ఏక్ థా గావ్/వన్స్ అపాన్ ఏ విలేజ్ ఫీచర్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రదర్శించబడుతుంది. ఆ ఊళ్లో... శ్రిష్ఠి లఖేర తొలి ఫీచర్ డాక్యుమెంటరీ... ఏక్ థా గావ్/వన్స్ అపాన్ ఏ విలేజ్. ఈ డాక్యుమెంటరీ సియోల్ ఎకో ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఆడియన్స్ ఛాయిస్ అవార్డ్’ గెలుచుకుంది. కేరళలో జరిగిన ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘స్పెషల్ జ్యూరీ’ అవార్డ్ గెలుచుకుంది. ఈ చిత్రం విషయానికి వస్తే...హిమాలయ పర్వతప్రాంతంలోని ఒక పురాతన గ్రామం సెమ్ల. ఒకప్పుడు ఎన్నో కుటుంబాలతో కళకళలాడిన ఈ ఊరు చిన్నబోయింది. నోరు మూగబోయింది. ఎటుచూసినా విషాద నిశ్శబ్దమే. దీనికి కారణం ఈ ఊళ్లోని వాళ్లు బతుకుదెరువు కోసం పట్నం బాట పట్టడం. కేవలం అయిదుగురు మాత్రమే ఈ ఊళ్లో ఉంటున్నారు! ఆ అయిదుగురిలో 80 సంవత్సరాల లీలాదేవి, 19 సంవత్సరాల గోలు ఉన్నారు. అయిన వాళ్లందరూ పట్నంలో బతుకుతుంటే ఊళ్లో లీలాదేవి ఒంటరిదైపోతుంది. వృద్ధాప్య సమస్యలు, ఒంటరితనంతో ఆమె బాధపడుతుంటుంది. పట్నంలో ఉంటున్న కుమార్తె రమ్మంటున్నా తాను వెళ్లదు. ఎందుకంటే ఊరిని విడిచి వెళితే అమ్మను విడిచి వెళ్లినట్లుగా ఉంటుంది తనకు! శ్రిష్ఠి లఖేర నిజానికి ఇది ఒక్క ఊరి కథ కాదు మన దేశంలోని ఎన్నో ఊళ్ల కథ. బతుకుదెరువు నుంచి పిల్లల చదువుల వరకు రకరకాల కారణాలతో ప్రజలు సొంత ఊళ్లు విడిచి వెళుతున్నారు. దీంతో ఆ ఊళ్లు జనసంచారం లేక పాడుబడ్డ ఊళ్లుగా మారుతున్నాయి. అరవై నిమిషాల ఈ చిత్రం భావోద్వేగ ప్రయాణం. జ్ఞాపకాల సమాహారం. శ్రిష్టి తల్లిదండ్రుల స్వగ్రామం సెమ్ల. లాక్డౌన్ సమయంలో తల్లిదండ్రులతో కలిసి చాలారోజులు ఈ గ్రామంలోనే ఉంది శ్రిష్ఠి. లీల దీనస్థితిని చూసిన తరువాత, మాట్లాడిన తరువాత చిత్రం తీయాలనే ఆలోచన వచ్చింది. -
AKA: గీతాచిత్రలహరి
బాలీవుడ్ అనే మహా సముద్రంలో ప్రతి అల అరుదైన అనుభవాలు, జ్ఞాపకాలను మోసుకు వస్తుంది. వాటిని అందుకునే వారు అరుదుగా ఉంటారు. ఈ అరుదైన కోవకు చెందిన రైటర్, ఎడిటర్, డైరెక్టర్ గీతికా నారంగ్ అబ్బాసి కేరళలో జరిగిన ‘ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ఫిల్మ్ ఫెస్టివల్’లో బెస్ట్ లాంగ్ డాక్యుమెంటరీ అవార్డ్ గెలుచుకుంది... నార్త్ దిల్లీలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన గీతికా నారంగ్ అబ్బాసికి బాల్యంలో ఏకైక వినోద మాధ్యమం సినిమా. కాస్త చమత్కారంగా చెప్పాలంటే, ఆమె బాల్యజీవితంలో బాల్య జ్ఞాపకాల కంటే బాలీవుడ్ సినిమాలే ఎక్కువ! తండ్రి నారంగ్ అబ్బాసి బిమల్రాయ్, గురుదత్, రాజ్కపూర్ల గురించి చెప్పడమే కాదు వారి సినిమాలు చూపించేవాడు. చిన్నప్పుడు గీతికకు ఇష్టమైన కథానాయకుడు రాజ్కపూర్. గీతిక మాటల్లో చెప్పాలంటే రాజ్కపూర్ తన హావభావాలతో గ్రేట్ చార్లి చాప్లిన్ను తనకు పరిచయం చేశాడు. చార్లి చాప్లిన్ సినిమాలు చూసి... ‘ఈయన రాజ్కపూర్ను బాగా కాపీ కొడుతున్నాడు’ అని అమాయకంగా అనుకునే రోజులవి! దిల్లీలోని హిందూ కాలేజి నుంచి ఆంగ్ల సాహిత్యంలో పట్టా పుచ్చుకుంది గీతిక. ఆ తరువాత ఎడ్వర్టైజింగ్లో పీజి చేసింది. అయితే ఆ చదువేమి తనకు అంత ఆసక్తికరంగా అనిపించలేదు. ఒక సాయంత్రం కాఫీ సేవిస్తూ... ‘నాట్ మై కప్ ఆఫ్ టీ’ అనుకుంది ప్రకటనల రంగం గురించి. దిల్లీలోని ఒక ఫిల్మ్ప్రొడక్షన్ కంపెనీలో చేరడంతో ఫిల్మ్ మేకింగ్పై తనకు అవగాహన ఏర్పడింది. కొన్ని డాక్యుమెంటరీలకు సహాయకురాలిగా పనిచేసింది. ‘హాలీవుడ్తో పోల్చితే మన దగ్గర డాక్యుమెంటరీల సంఖ్య చాలా తక్కువ. ఎందుకు ఇలా!’ అనుకునేది చాలాసార్లు. ఆ లోటును తనవంతుగా భర్తీ చేయడానికి అన్నట్లుగా తొలిసారిగా ‘గుడ్నైట్’ పేరుతో మొదటి సారిగా షార్ట్ డాక్యుమెంటరీ తీసింది. నాన్న తనకు సినిమాలకు సంబంధించిన విశేషాలు చెబుతుండేవాడు. ఉదా: ఫలానా సినిమాలో నృత్య బృందంలో కనిపించే అమ్మాయి ఆ తరువాత పెద్ద హీరోయిన్ అయింది...ఈ సినిమా పేరు చెప్పగానే ఆ హీరో నటవిశ్వరూపం గుర్తుకువస్తుందిగానీ, నిజానికి ఆ సినిమా కథ వేరొక హీరో కోసం తయారు చేసింది. ఆ హీరోకి నచ్చకపోవడంతో ఈ హీరోకి అవకాశం వచ్చి ఎక్కడికో తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో గీతికకు అనిపించింది ఏమిటంటే... ‘మన సినిమాల పైనే వివిధ కోణాల్లో డాక్యుమెంటరీలు తీస్తే ఎలా ఉంటుంది? చెప్పడానికి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి కదా!’ విడుదలకు నోచుకోని ‘అమీర్ సల్మాన్ షారుఖ్’ ఫీచర్ ఫిల్మ్ నుంచి ‘అచ్చం ఫలానా హీరోలాగే ఉంటాను’ అని మురిసిపోయే జూనియర్ ఆర్టిస్ట్ల వరకు ఎన్నో విషయాలను తన డాక్యుమెంటరీలలోకి తీసుకువచ్చింది గీతిక. ఫిరోజ్ ఖాన్ను ‘మిమ్మల్ని చూసీ చూడగానే ప్రేక్షకులు నవ్వితే మీ స్పందన ఏమిటి?’ అని అడిగిందట. ‘ఆర్టిస్ట్లో హీరోయే కాదు జోకర్ కూడా ఉంటాడు’ అని హాయిగా నవ్వాడట ఫిరోజ్. ఇలా హాయిగా నవ్వే వాళ్లతో పాటు ‘అది నిన్నటి అభిప్రాయం మాత్రమే. ఈరోజు నా అభిప్రాయం మార్చుకున్నాను’ అని ఏ అభిప్రాయం మీద నిలకడలేని నటులతో చిత్రమైన అనుభవాలు ఎదుర్కొవలసి వచ్చింది గీతిక. నాటి ‘గుడ్నైట్’ నుంచి నేటి ‘ఏ.కె.ఏ’ వరకు రైటర్, ఎడిటర్, డైరెక్టర్గా గీతిక ఎన్నో విషయాలు నేర్చుకుంది. తనను తాను మెరుగుపరుచుకుంది. ఇటీవల కేరళలో జరిగిన ‘ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’లో గీతిక నారంగ్ తీసిన ‘ఏ.కె.ఏ’ డాక్యుమెంటరీకి మంచి స్పందన లభించడమే కాదు ‘బెస్ట్ లాంగ్ డాక్యుమెంటరీ అవార్డ్’ను గెలుచుకుంది. బాలీవుడ్ కథానాయకులు దేవానంద్, అమితాబ్ బచ్చన్, షారుక్ఖాన్లను పోలి ఉండే ముగ్గురు వ్యక్తులపై తీసిన డాక్యుమెంటరీ ఇది. మిమిక్రీ నుంచి స్టార్డమ్ వరకు చిత్రరంగానికి సంబంధించి అన్ని కోణాలు ఇందులో కనిపిస్తాయి. ‘నా డాక్యుమెంటరీల లక్ష్యం నవ్వించడం కాదు, సీరియస్గా ఆలోచింపజేయడం’ అంటుంది గీతికా నారంగ్. అలా అని నవ్వకుండా ఉండలేము, అలా అని సీరియస్గా ఆలోచించకుండా ఉండలేము. అదే కదా ఆమె డాక్యుమెంటరీల ప్రత్యేకత! -
బాలికల నెత్తిన బరువు
‘నో వాటర్ ల్యాండ్’ ఇది త్వరలో రాబోతున్న డాక్యుమెంటరీ. మహారాష్ట్రలో నీళ్లు లేని ప్రాంతాలలో బాలికల జీవితం నీళ్లు మోయడంలోనే ఎలా గడిచిపోతున్నదో ఈ డాక్యుమెంటరీ తెలియచేయనుంది. యు.కెలోని స్వచ్ఛంద సంస్థ ‘వెల్స్ ఆన్ వీల్స్’ స్థాపకుడు షాజ్ మెమొన్ దీనిని నిర్మిస్తుండగా అవార్డ్ విన్నింగ్ దర్శకుడు సౌమిత్రా సింగ్ దర్శకత్వం వహించాడు. నీళ్లు బాలికల బాల్యాన్ని మన దేశంలోని చాలా చోట్లఎలా ధ్వంసం చేస్తున్నాయో ఈ డాక్యుమెంటరీ కళ్లకు కట్టనుంది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో దందిచి బరి అనే చిన్న గ్రామం ఉంది. దానికి ‘భార్యలు పారిపోయే ఊరు’ అనే పేరు ఉంది. ఆ ఊరికి కోడళ్లుగా వచ్చిన వారు రెండో రోజున, మూడో రోజున పుట్టింటికి పారిపోతారు. దానికి కారణం ఆ ఊళ్లో నీళ్లు ఉండవు. దూరం వెళ్లి తేవాలి. మిట్టలు పల్లాలు ఎక్కి దిగాలి. గంటల తరబడి నీరు ఊరే వరకు ఆగాలి. ఆ తర్వాత మోయాలి. ఇవన్నీ చేయడం కంటే భర్త లేకుండా బతకడం మేలు అని ఆ ఊరి భార్యలు పారిపోతుంటారు. ఇప్పుడైతే ఆ ఊరికి పిల్లనిచ్చేవారు లేరు. నాసిక్ జిల్లాలో నీటి సమస్య అంత తీవ్రం దీని పొరుగునే ఉన్న మరో జిల్లా థానేలో దింగన్మల్ అనే గ్రామం ఉంది. దీనికి ‘బహు భార్యల ఊరు’ అనే పేరు ఉంది. ఎందుకంటే అక్కడ ఒక్క మగాడు ఇద్దరు లేక ముగ్గురిని వివాహం చేసుకుంటాడు. ఒకరు వంట చేసేందుకు, ఒకరు నీళ్లు మోసేందుకు. ఎందుకంటే ఆ ఊరి నుంచి నీరు తెచ్చుకోవడానికి రోజులో ఆరు గంటలు వెచ్చించాలి. అంతసేపు నీళ్లకే పోతే వంటా గింటా జరిగే చాన్సు లేదు. అందుకని ‘నీటి భార్యలు’ ఇక్కడ ప్రతి ఇంటా ఉంటారు. పెద్ద భార్యే వెతికి ‘నీటి భార్య’ను తెస్తుంది. భర్త తనకు పోషించే శక్తి లేకపోయినా ఇద్దరిని కట్టుకోవాల్సిందే. లేకుంటే బతకడం కష్టం. పెద్దలకే ఇన్ని కష్టాలు ఉంటే మరి ఆడపిల్లల పరిస్థితి ఏమిటి? మహారాష్ట్రలో నీటి కరువు ఉన్న అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య బాధిస్తున్నది బాలికలనే. భర్త సంపాదించడానికి వెళ్లాలి కాబట్టి కొడుకులు బాగా చదువుకోవాలి కాబట్టి నీటి బాధ్యత వారికి ఉండవు. తల్లి కాని కుమార్తెగాని నీరు మోయాలి. ‘బడికి వెళ్లి చదువుకోవాలనే మా కలలు కల్లలే అవుతున్నాయి’ అని అక్కడి ఆడపిల్లలు అంటారు. స్కూళ్లలో పేర్లు నమోదు చేసుకున్నా వీరు రోజూ స్కూలుకి వెళ్లడం సాధ్యం కాదు. అరగంట దూరంలో ఉండే బావి నుంచి ఒక బిందెను మోసుకు వస్తారు. అలా నాలుగు బిందెలు తేవాలంటే రెండు గంటల సమయం గడిచిపోతుంది. ఆరు బిందెలకు మూడు గంటలు. నిత్య నరకం 7 సంవత్సరాల బాలికల నుంచి 18 సంవత్సరాల యువతుల వరకు ఈ నీటి మోతకు బానిసలుగా మార్చబడతారు. తల్లిదండ్రులకు వేరే మార్గం కూడా ఉండదు. ముఖ్యంగా వేసవిలో బాలికల కష్టాలు చెప్పనలవి కావు. ‘తల మీద మోయడం వల్ల తల దిమ్ముగా ఉంటుంది. భుజాలు నొప్పి పెడతాయి. ఛాతీలో బరువు. కాళ్లు లాగుతాయి’ అని ఇక్కడి ఆడపిల్లలు చెబుతారు. వేసవిలో ఈ ప్రాంతంలో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ‘ఆ ఎండలో వెళ్లి నీళ్లు తేవాలంటే చాలాసార్లు ఆడపిల్లలు స్పృహ తప్పి పడిపోతుంటారు. హాస్పిటల్లో చేరిస్తే అదో ఖర్చు’ అని తల్లిదండ్రులు వాపోతుంటారు. ఏ సంవత్సరం తీసుకున్నా కనీసం 2000 మంది ఆడపిల్లలు మహారాష్ట్రలో నీళ్లు లేని జిల్లాల్లో స్కూళ్లకు నాగా పెడుతుంటారు. వీరి చదువు ఇలా ఒడిదుడుకుల్లో పడటం వీరి భవిష్యత్తుగా పెద్ద విఘాతంగా మారుతోంది. డాక్యుమెంటరీ అయితే తను ఒక్కడే ఈ పని చేస్తే నీటి సమస్య తీరదు. దేశంలో ఎక్కడెక్కడ నీళ్ల వల్ల ఆడపిల్లలు చదువుకు దూరం అవుతున్నారో ఆ ప్రాంతాలన్నిటినీ గుర్తించి తరుణోపాయాలు ఆలోచించాలని పిలుపునిస్తాడు షాజ్. అందుకే ‘నో వాటర్ ల్యాండ్’ అనే డాక్యుమెంటరీ నిర్మించాడు. దీనికి గతంలో నసీరుద్దీన్ షాతో షార్ట్ ఫిల్మ్ తీసి అవార్డు పొందిన సౌమిత్రా సింగ్ దర్శకత్వం వహించాడు. త్వరలో ఈ డాక్యుమెంటరీ ప్రేక్షకుల ముందుకు రానుంది. l వెల్స్ ఆన్ వీల్స్ యు.కెలో డెంటల్ రంగంలో పని చేస్తున్న వ్యాపారవేత్త షాజ్ మెమెన్ మహారాష్ట్రలో బాలికల నీటి కష్టాలను తగ్గించి వారిని చదువుకు దగ్గర చేర్చాలని నిశ్చయించుకున్నాను. ‘నాకు కూతురు పుట్టాక హటాత్తుగా నాకు ఈ విషయం గుర్తుకు వచ్చింది. నా కూతురు ఉదయాన్నే లేచి నీళ్లకోసం కష్టపడాల్సిన పని లేదు. నేరుగా స్కూల్కి వెళ్లిపోయేంత నీటి సౌకర్యం ఇక్కడ ఉంది. కాని భారత్లో అలా కాదు. ఆడపిల్లలు నీటి బరువు కింద నలిగిపోతున్నాడు. వారి కోసం ‘వెల్స్ ఆన్ వీల్స్’ అనే సంస్థను స్థాపించాను’ అంటాడు షాజ్ మెమెన్. ఇతను నేల మీద దొర్లించుకుంటూ (లాక్కుంటూ) వచ్చే నీళ్ల డ్రమ్ముల సరఫరా మహారాష్ట్రలో మొదలెట్టాడు. ఒక్కో డ్రమ్ములో 45 లీటర్ల నీళ్లు పడతాయి. హై క్వాలిటీ ప్లాస్టిక్ డ్రమ్ములు కనుక (అవి 7000 కిలోమీటర్ల దూరం లాగినా పాడు కావు) వీటిని సులువుగా లాక్కుంటూ రావచ్చు. మూడు బిందెల నీళ్లు ఈ ఒక్క డ్రమ్ములో పడతాయి కనుక మూడు ట్రిప్పుల కాలం మిగిలి ఆడపిల్లలు ఇప్పుడు స్కూళ్లకు వెళుతున్నారు. నాసిక్లోని ఐదు ఊళ్లలో వెల్స్ ఆన్ వీల్స్ పేరుతో నీళ్ల డ్రమ్ముల సరఫరా జరిగింది. -
‘కాళీ’ పోస్టర్పై తీవ్ర వివాదం.. అమ్మవారి పాత్రధారి సిగరెట్ తాగుతూ...
న్యూఢిల్లీ: ‘కాళీ’ అనే డాక్యుమెంటరీ పోస్టర్ తీవ్ర వివాదానికి దారితీసింది. కెనడాలోని ఆగాఖాన్ మ్యూజియంలో ఈ పోస్టర్ను ప్రదర్శించారు. కాళీ మాత పాత్రధారి సిగరెట్ తాగుతూ, లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్(ఎల్జీబీటీ)ని సూచించే ఏడు రంగుల జెండాను ప్రదర్శిస్తూ పోస్టర్లో కనిపిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డాక్యుమెంటరీ దర్శకురాలు లీనా మణిమేఖలై దీనిపై సోమవారం స్పందించారు. ‘‘నేను బతికున్నంతకాలం నిర్భయంగా గొంతు వినిపిస్తూనే ఉంటా. అందుకు నా జీవితాన్నే మూల్యంగా చెల్లించాల్సి వచ్చినా సిద్ధమే. డాక్యుమెంటరీ చూస్తే పోస్టర్ వెనుక ఉద్దేశం అర్థమవుతుంది’’ అన్నారు. తమిళనాడుకు చెందిన ఆమె టొరంటోలో ఉంటున్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసిన మణిమేఖలైపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశామని ‘గో మహాసభ’ వెల్లడించింది. పోస్టర్పై కెనడాలోని హిందూ సమాజం నుంచి ఫిర్యాదులందాయని ఒట్టావాలోని ఇండియన్ హైకమిషన్ తెలియజేసింది. డాక్యుమెంటరీలో ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే అంశాలుంటే తొలగించాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది. -
కన్నీటి వ్యధపై లఘుచిత్ర కథ
కాశీబుగ్గ: మారుమూల గెడ్డ.. అందులో నురగలు కక్కుతూ పలువురు మృతిచెందడం.. అటువైపుగా వెళ్లిన వారంతా ఆ దృశ్యాన్ని చూసి ఆందోళన చెందడం.. అయితే ఇదంతా వాస్తవం కాదు. జిల్లా పోలీసు శాఖ నిర్వహిస్తున్న షార్ట్ఫిల్మ్ పోటీలకు కొంతమంది ఉపాధ్యాయులు కలిసి నటించిన దృశ్యరూపకం. నాటుసారా వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తూ ఈ లఘుచిత్రం రూపొందిస్తున్నారు. పలాస మండలం సరియాపల్లి గెడ్డ వద్ద సన్నివేశం చిత్రీకరిస్తుండగా ‘సాక్షి’ క్లిక్మనిపించింది. -
Oscar Nomination 2022: ఆస్కార్ బరిలో దళిత మహిళా జర్నలిస్టులు
‘రైటింగ్ విత్ ఫైర్’.... ఆస్కార్ 2022 బరిలోమన దేశం నుంచి షార్ట్ లిస్ట్ అయిన బెస్ట్ డాక్యుమెంటరీ మూవీ. అందరూ దళిత మహిళా జర్నలిస్టులు నడుపుతున్న ‘ఖబర్ లెహరియా’ న్యూస్పేపర్ (వీక్లీ) గురించి, దాని డిజిటల్ వార్తల గురించి తయారు చేసిన డాక్యుమెంటరీ ఇది. 25 మంది దళిత మహిళా జర్నలిస్టులు ఉత్తర ప్రదేశ్, బుందేల్ఖండ్, మధ్యప్రదేశ్లలో గ్రామీణ వార్తలను స్త్రీ దృక్కోణంలో అందించడమే ఇక్కడున్న విశేషం. ఆస్కార్ సాధించే సత్తా ఈ డాక్యుమెంటరీకి ఉంది అని భావిస్తున్నారు. ‘మా ప్రాంతంలో దళిత మహిళలు జర్నలిజం గురించి ఆలోచించడం చాలా పెద్ద విషయం. అసలు ఆ పని తాము కూడా చేయొచ్చని వాళ్లు అనుకోరు. కాని ఈ ఇరవై ఏళ్లలో వారిలోని ఆ న్యూనతను చాలా వరకు తీసేశాం’ అంటారు ‘ఖబర్ లహరియా’ మహిళా జర్నలిస్టులు. 2002లో ‘ఖబర్ లహరియా’ వారపత్రిక చిత్రకూట్ (బుందేల్ ఖండ్)లో మొదలైంది. అప్పుడు 6 మంది దళిత మహిళా జర్నలిస్టులు పని చేయడం మొదలెట్టారు. ఇవాళ 25 మంది పని చేస్తున్నారు. ఆ ఆరు మంది ఈ 25 మందిగా ఎలా మారారో... హిందీ, భోజ్పురి, బుందేలి, అవధి భాషల్లో వారపత్రికను ఎలా నడిపారో, ఆ తర్వాత సెల్ఫోన్లను కెమెరాలుగా వాడుతూ డిజిటల్ మీడియాలోకి తమ వార్తలను ఎలా అందించసాగారో ఇదంతా అద్భుతంగా చెప్పిన డాక్యుమెంటరీ ‘రైటింగ్ విత్ ఫైర్’. దర్శకురాలు రింతు థామస్ మరో దర్శకుడు సుస్మిత్ ఘోష్తో కలిసి ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించింది. వచ్చే మార్చి 27న లాస్ ఏంజలిస్లో జరిగే ఆస్కార్ వేడుకలో పోటీకి నిలవడానికి ఈ డాక్యుమెంటరీ అడుగు దూరంలో ఉంది. 2022 సంవత్సరానికి ఆస్కార్ కమిటీ అధికారికంగా ప్రకటించిన డాక్యుమెంటరీల షార్ట్లిస్ట్లోని 15 చిత్రాలలో ‘రైటింగ్ విత్ ఫైర్’ ఒకటిగా ఎంపికైంది. ఈ షార్ట్లిస్ట్ కోసం ప్రపంచ దేశాల నుంచి 138 డాక్యుమెంటరీలు పోటీ పడ్డాయి. వాటి నుంచి 15 షార్ట్లిస్ట్లోకి వచ్చాయి. ఈ 15 నుంచి మూడో నాలుగో అంతిమ నామినేషన్స్గా నిలవడానికి జనవరి 27 నుంచి ఓటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న అంతిమ నామినేషన్స్ ప్రకటిస్తారు. ఆ నామినేషన్స్లో ‘రైటింగ్ విత్ ఫైర్’ ఉంటే ఆస్కార్ వేడుకలో అదృష్టం పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ‘లగాన్’, ‘స్లమ్డాగ్ మిలియనీర్’ చిత్రాల తర్వాత ఆస్కార్ వేడుకలో భారతీయుల పేర్లు వినిపించలేదు. ఈసారి ఫైనల్ నామినేషన్స్కు వెళుతుందని భావించిన తమిళ చిత్రం, భారతదేశ అఫీషియల్ ఎంట్రీ ‘కూడంగళ్’ షార్ట్లిస్ట్లో నిలువలేదు. కాని ‘రైటింగ్ విత్ ఫైర్’ డాక్యుమెంటరీ విభాగంలో నిలిచి ఆశలు రేపుతోంది. ఈ డాక్యుమెంటరీ దేని గురించి? ఢిల్లీలో ఉన్న ‘నిరంతర్‘ అనే ఎన్జిఓ ఉత్తర ప్రదేశ్లోని చిత్రకూట్ నుంచి ప్రయోగాత్మకంగా మొదలెట్టిన వారపత్రిక ‘ఖబర్ లహరియా’. పెద్దగా చదువు రాకపోయినా, జర్నలిజం తెలియకపోయినా దళిత మహిళలు తమ ప్రాంత వార్తలను ఎలా చూస్తారో, వాళ్లు చూసిన పద్ధతిలో అచ్చు వేసి పాఠకుల వద్దకు తీసుకువెళ్లడం ఈ పత్రిక ఉద్దేశం. అంతే కాదు... జర్నలిజంకు దూరంగా ఉన్న దళిత మహిళలు కూడా సమర్థంగా వార్తా పత్రికలను నడపగలరని చూపడమూ ఉద్దేశమే. ‘మాలో చాలామంది ఎలిమెంటరీ స్థాయి చదువు కూడా చదువుకోలేదు. ఇంగ్లిష్ అసలు రాదు. అయినా సరే పత్రికలో పని చేయడానికి రంగంలో దిగాం’ అంటుంది మీరా. ఈమె చీఫ్ రిపోర్టర్. ఈమె దృష్టికోణం నుంచే ‘రైటింగ్ విత్ ఫైర్’ డాక్యుమెంటరీ ఉంటుంది. బుందేలి, అవధి వంటి స్థానిక భాషలలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్... ఈ మూడు రాష్ట్రాలలో ఈ పత్రికను అందేలా ఈ దళిత మహిళలు కార్యాచరణ చేశారు. ఈ పత్రిక అచ్చు పని, డిస్ట్రిబ్యూషన్, సర్క్యులేషన్ అంతా మహిళల బాధ్యతే. సవాళ్లు ఎన్నో... దళిత మహిళలు రిపోర్టర్లుగా మారడం ఒక విశేషం అయితే అంటరానితనం ఉన్న ప్రాంతాలలో కూడా వీరు దూసుకుపోవాల్సి రావడం మరో విశేషం. ‘చాలాచోట్ల మొదటగా కులం అడుగుతారు. నేను ఆ ప్రశ్న వేసిన వారి కులం అడుగుతాను. వారు ఏ కులం చెప్తే నేను కూడా ఆ కులమే అంటాను. పని జరగాలి కదా’ అని నవ్వుతుంది ఒక రిపోర్టర్. ‘ఖబర్ లహరియా’ ఎంత జనంలోకి వెళ్లిందంటే చీఫ్ రిపోర్టర్ మీరా భర్త ఒకరోజు ఇంటికి వచ్చి ఆమె మీద ఇంతెత్తున ఎగిరాడు. ‘నువ్వు బతకనిచ్చేలా లేవు’ అన్నాడు. దానికి కారణం ఆమె ఊళ్లోని గూండాల గురించి పత్రికలో రాయడమే. ‘ఇంకో సందర్భంలో అయితే స్త్రీలు పని మానేస్తారు. కాని నా వెనుక పత్రిక ఉందన్న ధైర్యం ఉంది. అందుకే నా భర్తతో నేనేం తప్పు చేయలేదు అని గట్టిగా వాదించాను’ అంటుంది మీరా. ఈ పత్రికకు పని చేస్తున్న దళిత మహిళా రిపోర్టర్లు ముఖ్యంగా పోలీసుల జులుం పైనా, దళితులపైన జరిగే దాష్టికాల పైనా, స్త్రీలపై పురుషుల పీడన పైన వార్తలు రాస్తుంటారు. ‘భయం వేయదా’ అని అడిగితే ‘భయంగానే ఉంటుంది. కాని అంతలోనే ధైర్యం చేస్తాం’ అంటారు వాళ్లు. సెల్ఫోన్లే కెమెరాలుగా పదిహేనేళ్ల పాటు ప్రింట్ ఎడిషన్ని నడిపిన ఈ మహిళలు మారిన కాలానికి తగినట్టుగా తాము మారాలని నిశ్చయించుకున్నారు. వార్తలను విజువల్ మీడియాగా జనానికి చూపాలనుకున్నారు. ‘మా అందరికీ ఫోన్లు ఎలా వాడాలో తెలియదు. కాని మారిన పరిస్థితులకు తగినట్టుగా మనం మారకపోతే ఆగిపోతాం’ అంటారు వాళ్లు. అందుకే సెల్ఫోన్ను కెమెరాగా ఎలా వాడాలో తెలుసుకున్నారు. వార్తలను ఫోన్లో బంధించి యూ ట్యూబ్లో బులెటిన్గా విడుదల చేయసాగారు. వారి యూ ట్యూబ్ చానల్కు ఐదున్నర లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ‘రైటింగ్ విత్ ఫైర్’కు ఆస్కార్ వస్తే ఈ దళిత మహిళలు ప్రపంచం అంతా చుట్టడం గ్యారంటీ. డాక్యుమెంటరీలోని ఓ దృశ్యం -
240 రోజులు.. కన్యాకుమారి- కశ్మీర్ వరకు 4000 కి.మీ..
‘అర్ధరాత్రి ఏంఖర్మ... పట్టపగలు కూడా ఆడపిల్ల స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి మనదేశంలో ఉంది’ అనే మాటను తన చిన్నప్పటి నుంచి వింటూనే ఉంది శ్రిష్టి బక్షి. ఆ మాటలు విన్నప్పుడల్లా ఒక రకమైన అసంతృప్తి, కోపం. ‘మనదేశంలో ఒంటరిగా ప్రయాణం చేసే అవకాశం ఆడపిల్లలకు లేదా!’ అనే నిరాశ ఆమెలో కమ్ముకుంటున్న సమయంలో ఒకరోజు.... శ్రిష్టి ఏదో ఊరు వెళ్లి తిరిగి ఇంటికి వస్తోంది. అప్పటికి బాగా చీకటి పడింది. ఆ రాత్రి హైవే 91లో ఒక మహిళ తన కూతురు తో కలిసి ధైర్యంగా నడుచుకుంటూ వెళుతున్న దృశ్యం ఆమె కంటపడింది. మన దేశం గురించి సానుకూల దృక్పథం నింపిన ఆ దృశ్యం తనలో ఒక ఆలోచన మెరిపించింది. పాదయాత్ర తో దేశాన్ని చుట్టి రావాలని! ‘ఊహాలు బానే ఉన్నాయి గానీ కల ఫలిస్తుందా?’ అనుకునేలోపే ‘శభాష్’ అంటూ భుజం తట్టాడు భర్త. ‘ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు వెంటనే చేసేయాలి’ అని ప్రోత్సహించాడు. ఇక నాన్న ‘నేను ఉన్నాను కదమ్మా’ అంటూ రూట్మ్యాప్ గీసిచ్చాడు. శ్రిష్టి పాదయాత్ర గురించి తెలిసి సన్నిహితులు, మిత్రులు ‘మేము సైతం..’ అంటూ ముందుకొచ్చారు. ఒంటరిగా మొదలుపెడదామనుకున్న పాదయాత్రలో పదకొండు మంది కలిశారు. అలా పన్నెండు మందితో పాదయాత్రకు అంకురార్పణ జరిగింది. మహిళా బృందాలతో శ్రిష్టి తొలి అడుగు తమిళనాడు నుంచి మొదలైంది. వీళ్లు అలా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు పొలంలో పనిచేసుకుంటున్న ఓ మహిళ వచ్చి ఆసక్తిగా వివరం అడిగింది. విన్న తరువాత ఆమె పరుగున వెనక్కి వెళ్లి బుట్ట నిండా పండ్లు ఇచ్చి ‘మీరు మా బిడ్డల భవిష్యత్ కోసం నడుస్తున్నారు. మీకు అంతా మంచే జరగాలి’ అని ఆశీర్వదించింది. ఈ సంఘటనతో శ్రిష్టి బృందం ఉత్సాహం రెట్టింపు అయింది. ఒక ఊళ్లో యాసిడ్ దాడి బాధితురాలిని కలిశారు. ‘దురదృష్టకర సంఘటన జరిగింది. అలాగని ఏడుస్తూ జీవితాన్ని చీకటి చేసుకుంటూ కూర్చోలేను కదా! నా జీవితాన్ని నేనే కొత్తగా నిర్మించుకోవాలి అనుకున్నాను’ అంటున్నప్పుడు అవి వ్యక్తిత్వవికాసానికి మేలైన పాఠంలా అనిపించాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా పాదయాత్ర సాగింది. రకరకాల సమస్యల గురించి తెలుసుకొని ‘మీకు తోచిన పరిష్కారాన్ని సూచించండి’ అని అడిగినప్పుడు ‘గవర్నమెంటోళ్ల వల్లే ఏమి కావడం లేదు. మనమెంతమ్మా’ అనే ప్రతికూల ఆలోచనలే మొదట వినిపించేవి. ‘అందరూ ప్రభుత్వం వైపు వేలెత్తి చూపే వాళ్లే. ఆ వేలు మన వైపు కూడా తిరగాలి. అప్పుడు మనలో కూడా మార్పును ఆహ్వానించగల స్పృహ ఏర్పడుతుంది’ అంటారు శ్రిష్టి. ‘మన ఇండియాలో ఎన్నో ఇండియాలు ఉన్నాయి’ అంటున్న శ్రిష్టి బక్షి బృందం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కి.మీ పాదయాత్ర చేసింది. 240 రోజులు పట్టింది. తాము నడిచే దారిలో కలెక్టర్ నుంచి కార్మిక, కర్షకవర్గాల వరకు అందరినీ కలిసేవారు. స్వయంసహాయక బృందాలతో సమావేశం అయ్యేవారు. తమ దగ్గర ఉన్న స్టడీమెటీరియల్ను షేర్ చేసేవారు. వర్క్షాప్లు నిర్వహించేవారు. మహిళా సాధికారతకు డిజిటల్ అక్షరాస్యత అనేది కీలకం అనే విషయాన్ని గుర్తు చేస్తూ రాయడం, చదవడం రానివారికి కూడా ఇంటర్నెట్ను యాక్సెస్ చేసే విషయంలో శిక్షణ ఇచ్చారు. ఎవ్రీ డే హీరోస్ను ఎంతోమందిని కలిసారు. శ్రిష్టి బక్షి బృందం చేసిన పాదయాత్రపై అజితేష్ శర్మ రూపొందించిన ‘ఉమెన్ ఆఫ్ మై బిలియన్’ డాక్యుమెంటరి ఫీచర్ ఫిల్మ్ మెల్బోర్న్ ఫిల్మ్ఫెస్టివల్–2021కు ఎంపికైంది. పాత్ బ్రేకింగ్ డాక్యుమెంటరీ ఫిల్మ్గా ప్రశంసలు అందుకుంటోంది. ఈ పాదయాత్ర ఒక సందేశాన్ని మోసుకెళుతుంది.. స్త్రీ వంటింటికే పరిమితం కాదు ఒంటరిగా ఈ ప్రపంచాన్ని చుట్టిరాగలదు అని. ఈ పాదయాత్ర ఒక పలకరింపు అవుతుంది...‘మీ సమస్యలు ఏమిటి?’ అని స్త్రీలను అడుగుతుంది. వాటిని రికార్డ్ చేస్తుంది. ఈ పాదయాత్రలో అడుగడుగునా జీవితం అనే బడి ఉంది. ఆ బడి నుంచి ఒక పరిష్కార పాఠాన్ని వెంట తీసుకొస్తుంది. పదిమందికి పరిచయం చేస్తుంది. -
తెలుగు ఘనతకు దృశ్య సాక్ష్యం
రేపు అంటే జూన్ 25 రాత్రి 8 గంటలకు ప్రతిష్టాత్మక డిస్కవరీ చానెల్లో ‘లిఫ్టింగ్ ఏ రివర్’ డాక్యుమెంటరీ టెలికాస్ట్ కానుంది. తెలుగువారి ఘనతకు సాక్ష్యంగా నిలిచిన ‘కాళేశ్వరం ప్రాజెక్ట్’ మహా నిర్మాణ ఉత్కృష్టతను దేశానికే కాదు ప్రపంచానికీ తెలియచేయనున్న డాక్యుమెంటరీ ఇది. దీని దర్శకుడు తెలుగువాడైన కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స. గతంలో ‘ఇన్సైడ్ తిరుమల’ డాక్యుమెంటరీ తీసి 52 దేశాల్లో ప్రసారం చేసిన రాజేంద్ర డాక్యుమెంటరీ ఫిల్మ్మేకర్గా తెలుగువారి ఘనతను చూపుతూ తన ఘనతనూ నిరూపించుకుంటున్నారు. ఆయన పరిచయం. ఫిక్షన్లో కల్పన ఉంటుంది. నాన్ ఫిక్షన్లో వాస్తవాల ఆధారం ఉంటుంది. వాస్తవాలను నిరూపించడం, సాక్ష్యాధారాలతో నిక్షిప్తం చేయడం ఉంటుంది. నాన్ ఫిక్షన్ విభాగానికి వచ్చే డాక్యుమెంటరీ ఫిల్మ్మేకర్ ఒక విధంగా చరిత్రకారుడి పని చేస్తాడు. వర్తమానాన్ని చరిత్ర కోసం, చరిత్రను వర్తమానం కోసం అన్వేషిస్తాడు. కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స అలాంటి అన్వేషకుడు. ఆయన అన్వేషణ తెలుగువారి కోసం, తెలుగువారి తరఫున సాగడం తెలుగువారికి మేలు చేస్తోంది. లిఫ్టింగ్ ఏ రివర్ ‘జటిలమైన విషయాలను సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పడమే అసలైన కష్టం’ అంటారు 52 సంవత్సరాల రాజేంద్ర శ్రీవత్స. ఢిల్లీ నుంచి టెలిఫోన్ ద్వారా ‘లిఫ్టింగ్ ఏ రివర్’ డాక్యుమెంటరీ గురించి ఇంటర్వ్యూ ఇస్తూ ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప నిర్మాణం. ఈ స్థాయిలో ప్రాజెక్టులు కొన్ని ఉండొచ్చు. కాని అవన్నీ ఒకేచోట నిర్మితమయ్యాయి. కాళేశ్వరం పథకం అలాంటిది కాదు. అది మల్టీ లొకేషన్ ప్రాజెక్ట్. సాగునీటి కోసం తాగు నీటి కోసం సాగిన ఈ నిర్మాణం గురించి తెలుగువారే కాదు ప్రపంచమంతా తెలుసుకోవాలని ఈ డాక్యుమెంటరీ తీశాను. ఒక గంట దీని నిడివి’ అంటారు రాజేంద్ర. రెండేళ్ల కృషి ‘నేను ఢిల్లీలో ఉంటాను. 2017లో ఒక డాక్యుమెంటరీ పని మీద హైదరాబాద్ వచ్చినప్పుడు న్యూస్పేపర్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చదివాను. అరె... నేను తెలంగాణావాణ్ణి. పైగా మీడియాలో ఉన్నాను. నాకే దీని గొప్పతనం పూర్తిగా తెలియకపోతే సామాన్యుడికి ఏం తెలుస్తుంది. ఈ మొత్తం నిర్మాణాన్ని ఫాలో అవుతూ డాక్యుమెంటరీ తీద్దాం అనుకున్నాను’ అంటారు రాజేంద్ర. అనుకున్నదే తడవు తన సంస్థ పల్స్ మీడియా తరఫున డాక్యుమెంటరీ నిర్మాణ పనుల్లో దిగారాయన. ‘రెండేళ్ల పాటు ప్రాజెక్ట్ పనులను ఫాలో అవుతూ ఇంజనీర్లను కలుస్తూ ఇంటర్వ్యూలు చేస్తూ ఇమేజ్ లు కాప్చర్ చేస్తూ వందల గంటల ఫుటేజ్ తీశాం. పోస్ట్ ప్రొడక్షన్ ఇంకో సంవత్సరం పట్టింది. తీసిన ఫుటేజ్ మొత్తం చూడటానికే 3 నెలలు పట్టింది. నేను తప్పక పాటించిన విషయం ఏమిటంటే అంతా ఆన్ లొకేషన్గా ఉండేలా చూడటం. యాక్చువల్ సౌండ్ను ప్రేక్షకులకు వినిపించడం. ఈ డాక్యుమెంటరీ చూసినవారు ప్రాజెక్ట్లో తిరిగిన భావనకు లోనవుతారు. సౌండ్ రికార్డిస్ట్ పి.డి.వాల్సన్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ ప్రశాంత్ కారంత్, స్క్రిప్ట్ రైటర్ పూర్ణిమా రావు... వీరందరూ గొప్పగా పని చేయడం వల్ల ఇది సాధ్యమైంది’ అన్నారు రాజేంద్ర. ‘ఇంత గొప్ప నిర్మాణం అన్నిసార్లు సాధ్యం కాదు. దీనిని జీవితంలో ఒకసారి దొరికే అవకాశం అనుకుంటాను. అంతేకాదు శివుడి (కాళేశ్వరుడి) ఆజ్ఞతో ఈ పని జరిగి ఉండొచ్చనిపిస్తుంది’ అంటారు రాజేంద్ర. అంతర్జాతీయ చానెల్స్తో ‘2002లో నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ భారతదేశం నుంచి ప్రొడ్యూస్ అయ్యే కంటెంట్ను ప్రసారం చేయదలిచి డాక్యుమెంటరీ ఫిల్మ్మేకర్స్ ను ఆహ్వానించింది. ఎంతోమంది అప్లై చేశారు. ఇద్దర్ని మాత్రమే ఎంచుకున్నారు. వారిలో నేనొకణ్ణి’ అంటారు రాజేంద్ర. ‘అదృష్టవశాత్తు దేశంలో శాటిలైట్ చానల్స్ వృద్ధి, నా కెరీర్ ఒకేసారి మొదలయ్యాయి. నా కెరీర్ మొదట్లోనే నేషనల్ జియోగ్రాఫిక్, డిస్కవరీ చానల్స్తో పని చేయడం వల్ల నాణ్యతతో ఎలా డాక్యుమెంటరీలు తీయాలో నాకు తెలిసింది. నిజానికి ఆ చానల్సే నాకు పని నేర్పాయి. దూరదర్శన్ దగ్గరి నుంచి అల్ జజీరా వరకూ అన్ని చానెల్స్కు డాక్యుమెంటరీలు చేశాను.’ అంటారు రాజేంద్ర. తిరుమల ఖ్యాతి నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ కోసం రాజేంద్ర తీసిన ‘ఇన్సైడ్ తిరుమల తిరుపతి’ 60 నిమిషాల డాక్యుమెంటరీ విశేష జనాదరణ పొందింది. ‘రోజూ 80 వేల మంది నుంచి లక్ష మంది భక్తులు తిరుమలకు వస్తారు. కాని అంతమందిని ఎంతో గొప్పగా పర్యవేక్షిస్తారు. తిరుమల అంటే దర్శనం, ప్రసాదం మాత్రమే కాక ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది అని ఆ డాక్యుమెంటరీ తీశాను. తెలుగువారి ఈ ఘన పుణ్యక్షేత్రం గురించి 2017లో ప్రసారం అయినప్పుడు సాధారణ టిఆర్పి కొలమానాలు ఆ ప్రేక్షకాదరణను కొలవడానికి పనికి రాలేదు. ఆ డాక్యుమెంటరీ 52 దేశాలలో ప్రసారమయ్యి తెలుగు వారి పుణ్యక్షేత్ర ఘనతను చాటింది ’ అంటారు రాజేంద్ర. ఇది కాకుండా దూరదర్శన్ కోసం ఎన్నో సైన్స్ కార్యక్రమాలు చేశారు రాజేంద్ర. అలాగే ‘స్వర్ణదేవాలయం’ మూలాలను తెలియ చేసే డాక్యుమెంటరీ ‘సీక్రెట్స్ ఆఫ్ గోల్డెన్ టెంపుల్’, 2010 కాలంలో భారతదేశంలో ఊపందుకున్న సరొగసీ ధోరణిని డాక్యుమెంట్ చేస్తూ తీసిన ‘ఫైండింగ్ ఏ ఊంబ్’ రాజేంద్రకు చాలా పేరు తెచ్చాయి. సానుకూల దృక్పథం ‘దేశంలోగాని తెలుగు ప్రాంతాలలో గాని మంచి పనులు జరుగుతున్నాయి. కాని మనం చెడును మాట్లాడుకున్నట్టుగా మంచి మాట్లాడుకోము. ఉదాహరణకు దేశంలో సైన్స్ పురోగతి కోసం గొప్ప కృషి జరుగుతోంది. దానిని ప్రజలకు చెప్పడం లేదు. ప్రభుత్వాలు చేస్తున్న మంచి పనులు చెప్పడం లేదు. మంచి మాట్లాడుతూ ఉంటే మంచి పనుల కొనసాగింపు ఉంటుంది’ అని ముగించారు కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స. ‘లిఫ్టింగ్ ఏ రివర్’ ప్రసార సమయాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స తీసిన 60 నిమిషాల డాక్యుమెంటరీ ‘లిఫ్టింగ్ ఏ రివర్’ డిస్కవరి చానల్లో జూన్ 25 రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతోంది. 6 భాషలలో దీనిని చూడొచ్చు. అలాగే డిస్కవరీ సైన్స్ చానెల్లో జూన్ 28 రాత్రి 9 గంటలకు, డిస్కవరీ టర్బో చానల్లో జూన్ 29 రాత్రి 9.50కు ఇది ప్రసారం కానుంది. డిస్కవరీ ఓటిటి చానల్ ‘డిప్లస్’లో జూన్ 25 నుంచి వీక్షణకు ఉంటుంది. పక్కా హైదరాబాదీ కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స పుట్టింది పెరిగింది హైదరాబాద్లో. తండ్రి సుధాకర రావు ఆంధ్రప్రదేశ్ మైనింగ్ కార్పొరేషన్లో పని చేసేశారు. తల్లి శాంత. రాజేంద్ర నిజాం కాలేజ్లో డిగ్రీ చేసి తర్వాత ఢిల్లీ జె.ఎన్.యూలో పి.జి ఫిలాసఫీ చేయడానికి వెళ్లారు. ‘శ్రీధర్బాబు (మంథని ఎం.ఎల్.ఏ, మాజీ మంత్రి) నేనూ చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. ఢిల్లీలో అతను జెఎన్యూకు ‘లా’ చేయడానికి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను. నిజాం కాలేజీలో నువ్వు క్రియేటివ్గా పనులు చేసేవాడివి కదా... ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్లు అని అతడు ప్రోత్సహించేవాడు. అలా నేను ఫిల్మ్ మేకింగ్లోకి వచ్చాను’ అంటారు రాజేంద్ర. ‘నా భార్య మమతది వరంగల్. మా అబ్బాయ్ అమోఘ్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు’ అని తెలియచేశారు. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కలలో రాజకుమారి
తానొక రాజ కుమారిగా మారినట్టు కల కనే హక్కు ప్రతి అమ్మాయికీ ఉంటుంది. అయితే ఆ కల అందరికీ నిజం కాదు. నిజం కాదని అందరికీ తెలుసు. కాని కొందరు కలను నిజం చేసుకుంటారు. ముంబై వర్లీ సమీపంలో మురికివాడలో నివసించే 13 ఏళ్ల మలీషా ఖర్వా యూ ట్యూబ్లో ప్రియాంకా చోప్రా ర్యాంప్ వాక్ను చూసి తానొక మోడల్ని, డాన్సర్ని కావాలనుకుంది. అయితే ఆమె చాలా గట్టిగా అనుకుంది. విశ్వమంతా కుట్ర చేసి మరీ ఆమె కలను నిజం చేశాయి. ఇటీవల ఆమెపై నిర్మించిన డాక్యుమెంటరీ ‘లివ్ యువర్ ఫెయిరీటేల్’ విడుదలైన సందర్భంగా మలీషా పరిచయం. మలీషా ఖ్వారా వాళ్ల నాన్న చిన్న పిల్లల బర్త్డే పార్టీల్లో ‘జోకర్’ వేషం వేసుకుని వినోదం అందించి ఆ వచ్చే కొద్దిపాటి డబ్బుతో బతుకుతుంటాడు. ముంబైలో మురికివాడలో బతకడమే ఒక పెద్ద యుద్ధం అతనికి. అతని కుమార్తె 13 ఏళ్ల మలీషా మాత్రం ఆ జీవితంతో రాజీ పడదల్చుకోలేదు. ఒకసారి ఫోన్లో ఎవరో యూ ట్యూబ్లో ఆ అమ్మాయికి ప్రియాంకా చోప్రా ర్యాంప్వాక్ చూపించారు. ‘ఇలా నడవాలంటే ఏం చేయాలి’ అని అడిగింది మలీషా. ‘మోడల్ అవ్వాలి’ అని చెప్పారు ఎవరో. అప్పుడే నిశ్చయించుకుంది మోడల్ అవ్వాలని. ఆ తర్వాత డాన్సర్ కూడా అవ్వాలని. ఆ కలకు తోడు హాలీవుడ్ నటుడు రాబర్ట్ హాఫ్మేన్ ఒక మ్యూజిక్ వీడియో కోసం ఇండియా వచ్చి అందులో నటించడానికి కావలిసిన అమ్మాయి కోసం ముంబై మురికివాడల్లో తిరగసాగాడు. అప్పుడే మలీషా మరో కజిన్తో అతణ్ణి కలిసింది. హాఫ్మేన్ మలీషాను గమనించాడు కాని ఇంకా చిన్నపిల్ల... వీడియోకు పనికి రాదని అనుకున్నాడు. కాని మాటల్లో ‘నువ్వేం అవుదామనుకుంటున్నావు’ అని అడిగితే ‘నేను మోడల్ అవుదామనుకుంటున్నాను’ అని చాలా ఆత్మవిశ్వాసంతో మలీషా చెప్పిన తీరు హాఫ్మేన్కు నచ్చింది. ‘అయితే నీకు సాయం చేస్తాను. నీ పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజీ ఓపెన్ చేస్తాను’ అని ఆమె పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజీ ఓపెన్ చేశాడు. మలీషా ఫొటోలు అందులో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలలో మలీషా ముగ్ధత్వాన్ని, రూపాన్ని, నవ్వును ఇష్టపడిన నెటిజన్లు అతి త్వరలోనే దాదాపు లక్షన్నర ఫాలోయెర్స్గా మారారు. డాక్యుమెంటరీ డాక్యుమెంటరీ ఫిల్మ్మేకర్స్ జస్గురు, అర్సలా ఖురేషి కలిసి మలీషా మరో నలుగురు స్లమ్ పిల్లల మీద ‘లివ్ యువర్ ఫెయిరీటేల్’ డాక్యుమెంటరీ తీశారు. అనుకున్నది సాధించడానికి స్లమ్స్, పేదరికం, పరిమితులు అడ్డం కావని ఈ డాక్యుమెంటరీ చెబుతుంది. దీనిని మొన్న (ఏప్రిల్ 16) మలీషా అఫీషియల్ యూట్యూబ్ చానెల్లో విడుదల చేశారు. మలీషా గ్లామర్ రంగంలో భవిష్యత్తులో ఎన్నో వండర్స్ చేయనుంది. మనం వాటిని చూడనున్నాం. ఆల్ది బెస్ట్ మలీషా. కవర్ గర్ల్ అంతర్జాతీయ పత్రిక ‘పీకాక్ మేగజీన్’ మలీషాను అక్టోబర్ 2020న కవర్ పేజీ మీద వేసి ‘ద ప్రిన్సెస్ ఫ్రమ్ ది స్లమ్’ పేరుతో లోకానికి పరిచయం చేశాక మలీషాకు ఫొటోషూట్ల గిరాకీ అమాంతం పెరిగింది. పీకాక్ మేగజీన్ కోసం ఆ ఫొటోషూట్ నిర్వహించిన జంట షేన్–ఫాల్గుణి పీకాక్లు మలీషాతో ఫొటోషూట్ అనుభవాలను చెప్తూ ‘ఫొటోషూట్ వరకూ మలీషా ఎంత ఆంబీషియసో వింటూ వచ్చాం. కాని ఫొటోషూట్లో ఆ అమ్మాయి అంకితభావం చూశాక పెద్ద పెద్ద కలలు కనే యోగ్యత ఉందని అనుకున్నాం. ఆ అమ్మాయి చాలా శ్రద్ధగా పని చేసింది’ అన్నారు. – సాక్షి ఫ్యామిలీ -
ప్రతి మహిళా ఒక సోల్జర్
నేషనల్ జియోగ్రాఫిక్ వాళ్లు ఢిల్లీలో నిన్న ‘ఉమెన్ ఆఫ్ ఆనర్ : డెస్టినేషన్ ఆర్మీ’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ ను ప్రదర్శించారు. ఆ షో కి ఎన్.సి.సి. గర్ల్ కెడేట్స్, ఉమెన్ ఆఫీసర్స్ వచ్చారు. చీఫ్ గెస్ట్ లెఫ్టినెంట్ జనరల్ మాధురీ కణిట్కర్! షో అయ్యాక ‘‘హౌ ఈజ్ ది జోష్’’ అని అమ్మాయిల్ని అడిగారు. ‘‘ఓ..’’ అని నోటికి రెండు వైపులా చేతులు అడ్డుపెట్టి ఉత్సాహంగా అరిచారు అమ్మాయిలు. ‘‘మనలో ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోమ్ ఉంది. మల్టీ టాస్కింగ్ చేయగలం. ఆర్మీ మిమ్మల్ని ఉమన్గా కాదు, ఒక సోల్జర్ గా గుర్తిస్తుంది. అదే మనకు కావలసిన గుర్తింపు’’ అంటూ.. వాళ్ల జోష్ ను మరింతగా పెంచారు కణిట్కర్. మాధురీ కణిట్కర్ ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్నెంట్ జనరల్. ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలోని ఎన్.సి.సి. ఆడిటోరియంలో శుక్రవారంనాడు ఎన్.సి.సి. గర్ల్ కెడెట్లు, ఎన్.సి.సి. ఉమెన్ ఆఫీసర్స్ హాజరైన ఒక ప్రత్యేక కార్యక్రమానికి ఆమె ప్రత్యేక అతిథిగా వెళ్లారు. ఆ ప్రత్యేక కార్యక్రమం ఓ డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ వాళ్లు ఆర్మీలో చేరాలని అనుకుంటున్న అమ్మాయిల కోసం ఆ చిత్రాన్ని ప్రదర్శించారు. ‘ఉమెన్ ఆఫ్ ఆనర్ : డెస్టినేషన్ ఆర్మీ’ అనే ఆ చిత్రం చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. మహిళాశక్తికి ఒక పవర్ ప్రెజెంటేషన్లా ఉంది. గర్ల్ కెడెట్స్ లీనమైపోయి చూస్తున్నారు. అప్పటికప్పుడు ఆర్మీలో చేరిపోయి తమ సత్తా ఏంటో చూపించాలన్నంతగా వారిని ఆ చిత్రం బందీని చేసింది. మాధురీ కణిట్కర్ కూడా వాళ్లతో కూర్చొని ఆ డాక్యుమెంటరీని చూశారు. చిత్రం పూర్తవగానే గర్ల్ కెడెట్స్ అరుపులు, చప్పట్లు! ‘ఉమెన్ ఆఫ్ ఆనర్ : డెస్టినేషన్ ఆర్మీ’ స్క్రీనింగ్ కార్యక్రమంలో మాధురీ కణిట్కర్ అప్పుడు అడిగారు మాధరి.. ‘హవ్వీజ్ ద జోష్?’ అని! ‘సూపర్బ్గా ఉంది మేడమ్’ అన్నారు అమ్మాయిలు. ‘‘కానీ ఆర్మీలో ఉద్యోగం బెడ్ ఆఫ్ రోజెస్ కాదు’’ అన్నారు మాధురి. ఆ మాటకు కొంచెం నిరుత్సాహం. ‘‘అయితే ఆర్మీ మిమ్మల్ని ఒక శక్తిగా మలుస్తుంది’’ అని కూడా అన్నారు మాధురి. నిరుత్సాహం స్థానంలో మళ్లీ ఉత్సాహం! అప్పుడిక ఆమె భారత సైన్యంలో తన ప్రయాణం ఎలా ఆరంభమైందీ చెప్పడం మొదలు పెట్టారు. మాధురి ఆర్మీలోకి వచ్చేటప్పటికి మహిళా అధికారులు సంప్రదాయ వస్త్రధారణ అయిన చీరలో కనిపించారు! క్రమంగా యూనిఫామ్లోకి మారిపోయారు. 37 ఏళ్లుగా ఆర్మీలో ఉన్నారు మాధురి. ఆర్మీలోని మెడికల్ విభాగంలో ఆఫీసర్ తను. లెఫ్ట్నెంట్గా చేరి లెఫ్ట్నెంట్ జనరల్ ర్యాంకుకు చేరుకున్నారు. ఆర్మీలో పైనుంచి మూడో ర్యాంకే లెఫ్టినెంట్ జనరల్. (మొదటి ర్యాంక్ ఫీల్డ్ మార్షరల్. రెండో ర్యాక్ జనరల్). ఆర్మీలో తన వైద్య సేవలకు అతి విశిష్ట సేవామెడల్, విశిష్ట సేవామెడల్ కూడా పొందారు. ∙∙ నేషనల్ జియోగ్రాఫిక్ షోకి ఆమె ఆర్మీ దుస్తుల్లోనే వచ్చారు మాధురీ కణిట్కర్. ‘‘ఆర్మీలో చేరాక మీరు స్త్రీనో, పురుషుడో కాదు. ఒక సోల్జర్ మాత్రమే. స్త్రీ అనే గుర్తింపు కన్నా, సోల్జర్ అనే గుర్తింపే మనకు ముఖ్యం. ఆర్మీలో చేరక ముందు కూడా మనం సోల్జరే. స్త్రీలో సహజంగానే సైనిక శక్తి ఉంటుంది కనుక’’ అని మాధురి చెప్పడం కెడెట్ గర్ల్స్కి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎన్.సి.సి.లో కొత్తగా జాయిన్ అయినవాళ్లే వాళ్లంతా. ‘‘సోల్జర్కి జెండర్ ఉండదు. అది మన మైండ్లో ఉంటుంది. మహిళల జెండర్ వారిలో పవర్ మాత్రమే’’ అని మాధురి చెప్పడం కూడా ఆ పిల్లల్ని బాగా ఆకట్టుకుంది. ఒక ఆర్మీ పర్సన్ మాటలు ఎంతలా పని చేస్తాయంటే.. అది ఆర్మీ గొప్పతనమే అనాలి. ఆర్మీలో చేరిన ప్రతి వ్యక్తినీ అలా తీర్చిదిద్దుతుంది ఆర్మీ. సమాజంలో స్ఫూర్తిని నింపేలా. ‘‘అమ్మాయిలూ మీకొక మాట చెప్తాను వినండి. మనకు అదనంగా ఒక ‘ఎక్స్’ క్రోమోజోమ్ ఉంది. అది మన చేత మల్టీ టాస్కింగ్ చేయిస్తుంది. లక్ష్యం కోసం పరుగులు తీయిస్తుంది. కలల్ని నిజం చేసుకుని శక్తిని ఇస్తుంది. ఏ ఉద్యోగంలోనైనా మనకు ఛాలెంజింగ్ ఏమిటంటే.. ఇంటిని, ఆఫీస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడం. అది సాధ్యమైతే మనకు ఏదైనా సాధ్యమే. ఉద్యోగానికి ఇల్లు, ఇంటికి ఉద్యోగం అడ్డుపడవు. నన్నే చూడండి. నా భర్త కూడా ఆర్మీలోనే చేసేవారు. ఇద్దరం ఆర్మీలోనే ఉన్నా 24 ఏళ్ల పాటు ఒకేచోట లేము. కానీ ఆర్మీ మాకు సపోర్ట్గా ఉంది. ఇద్దరం ఒకచోట లేకున్నా ఇద్దరం ఆర్మీలోనే ఉన్నామన్న భావనను ఆర్మీనే మాకు కలిగించింది. మహిళలకు సురక్షితమైన ఉద్యోగరంగం ఆర్మీ అని చెప్పగలను’’ అని మాధురి తన అనుభవాలు కొన్ని చెప్పారు. ‘‘ఉమన్లో ఆర్మీ పవర్ ఉంది. ఆర్మీకి ఉమన్ పవర్ అవసరం ఉంది’’ అని చివర్లో మాధురీ కణిట్కర్ అన్నమాట.. అమ్మాయిలకు డాక్యుమెంటరీ ఎంత జోష్ని ఇచ్చిందో అంతే జోష్ను ఇచ్చి ఉండాలి. వారంతా నోటికి రెండు చేతులూ అడ్టుపెట్టుకుని కోరస్గా మళ్లొకసారి ‘ఓ’ అని ఉల్లాసంగా చప్పట్లు చరిచారు. -
మిషన్ ఫ్రంట్లైన్.. ఆర్మీలో రానా
విభిన్న కథలతో సినిమాలు చేస్తూ విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు దగ్గుబాటి రానా. గతేడాది ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు రానా. ప్రస్తుతం తను నటించిన రెండు చిత్రాలు విరాట పర్వం, అరణ్య విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అంతేగాక ఇప్పుడు పవన్ కల్యాణ్తో కలిసి అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరో వైపు రానా సినిమాలే కాకుండా ఓ డాక్యుమెంటరీని కూడా తెరకెక్కించాడు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ మీద డిస్కవరీ ప్లస్ ఒరిజినల్తో కలిసి మిషన్ ఫ్రంట్ లైన్ పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. చదవండి: ‘రానా – మిహికా.. ఆగస్ట్ 8, 2020’ భారత జవాన్ల జీవన శైలిని ప్రేక్షకుల కళ్ల ముందుకు తీసుకురానున్నఆలోచనతో ఈ డాక్యుమెంటరీ రూపొందించారు, మిషన్ ఫ్రంట్ లైన్ పేరుతో రూపొందిన ఈ డాక్యూమెంటరీలో రానా ఆర్మీ గెటప్లో ఆకట్టుకోనున్నాడు. దీనిని తెరకెక్కించేందుకు స్వయంగా బీఎస్ఎఫ్ సాయాన్ని తీసుకొని పలు శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేసుకొని చిత్రీకరించారు. ఈ డాక్యుమెంటరీ నేడు(జనవరి21) డిస్నీ ప్లస్ ఒరిజినల్లో విడుదలైంది. ఈ సందర్భంగా మిషన్ ఫ్రంట్లైన్లో భాగం అవ్వడం తనకు అమూల్యమైన అనుభవాన్ని ఇచ్చిందంటున్నాడు రానా. పౌరులు ఉండని హై-సెక్యూరిటీ జోన్లోకి ప్రవేశించడం నుంచి అక్కడ శిక్షణ తీసుకోవం మర్చిపోలేని అనూభూతినిచ్చిందన్నాడు. మిషన్ ఫ్రంట్లైన్ను డిస్నీ ప్లస్ ఒరిజినల్లో చూడాలని కోరాడు. ఈ మేరకు ట్విటర్లో చిన్న వీడియోను షేర్ చేశాడు. చదవండి: ‘అరణ్య’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరో సినిమాతో పోటీ! ఇంతకముందు కూడా రానా దేశ సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ జవాన్గా ఉండటం అంత సులభం కాదు అని పేర్కొన్న విషయం తెలిసిందే. ఆర్మీ జవాన్లతో కలిసి ఉన్న అనుభవాలను పంచుకుంటూ.. ఆర్మీ జవాన్లతో డ్యూటీ అత్యంత కష్టంగా ఉంటుంది. వారికి సెలవులు ఉండవు. బ్రేక్స్ ఉండవు. సరిగ్గా ఊపిరి పీల్చుకునేందకు కూడా వీలు ఉండదు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తిసారు. లేకుంటే దేశమే ప్రమాదంలోపడిపోతుంది. విధుల్లో భాగంగా ప్రతిరోజూ కసరత్తులు, కాల్పులు ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఆ హీరోల సాయంతో కఠిన శిక్షణ పొందాను. వాళ్లతో ప్రయాణం ఎంతో అమూల్యమైన అనూభూతినిచ్చింది. ఆ సమయంలో భారతదేశ గొప్పతనాన్ని అస్వాదించాను. వీళ్లను నేను కలవడం ను అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరు ఇండియన్ ఆర్మీని గౌరవించాలంటూ తెలిపాడు. Catch me as I rub shoulders with India's First Line of Defense on 'Mission Frontline', a Discovery+ Original, now streaming exclusively on @discoveryplusIN https://t.co/dLVtfVlP3X@BSF_India #DiscoveryPlusOriginals #MissionFrontline pic.twitter.com/xTz1bL9l9h — Rana Daggubati (@RanaDaggubati) January 21, 2021 -
నా లైఫ్లో మలుపులు లేవు
‘ప్రేమను పంచుదాం. కరోనాను కాదు’’ అంటోంది చిరంజీవి కుటుంబం. కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమాలను ప్లే కార్డుల రూపంలో తెలుపుతూ ఓ ఫొటోను షేర్ చేశారు. ‘’ఇంట్లో ఉందాం.. యుద్ధం చేస్తాం. క్రిమిని కాదు ప్రేమను పంచుతాం. కాలు కదపకుండా కరోనాను తరిమేస్తాం. భారతీయులం ఒక్కటై భారత్ను గెలిపిస్తాం’’ అంటూ చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్, ఉపాసన, సుష్మిత, అల్లు శిరీష్, నిహారిక, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్∙తేజ్, శ్రీజ, కళ్యాణ్ దేవ్ ప్లే కార్డుస్ పట్టుకున్నారు. ‘‘నా జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే ఆలోచన లేదు’’ అంటున్నారు చిరంజీవి. తన బయోపిక్ గురించి ఇటీవల ఓ సందర్భంలో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘సినిమా ఇండస్ట్రీలో నా ప్రయాణం చాలామంది యాక్టర్స్కు ప్రేరణగా నిలిచింది. ఇండస్ట్రీలో చిరంజీవిగా ఎదగాలని చాలామంది అనుకుంటుంటారు. ఇది నాకు చాలా సంతోషాన్నిస్తుంది. కానీ నా జర్నీని వెండితెరపై ఓ ఆసక్తికరమైన బయోపిక్గా తెరకెక్కించడానికి కావాల్సినన్ని మలుపులు నా జీవితంలో లేవని నాకనిపిస్తోంది. అయితే ప్రస్తుతం నా ఆటోబయోగ్రఫీ (పుస్తకం)కి చెందిన వర్క్ జరుగుతోంది. అలాగే నా వ్యక్తిగత జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఓ డాక్యుమెంటరీగా తీయాలనే ఆలోచనలో ఉన్నాం’’ అని పేర్కొన్నారు. ఆచార్యలో రామ్చరణ్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. రామ్చరణ్, నిరంజన్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్చరణ్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ప్రొఫెసర్గా మారిన మాజీ నక్సలైట్ పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని టాక్. చిరంజీవి శిష్యుడి పాత్రలో కనిపిస్తారట రామ్చరణ్. -
ఆస్కార్ బరిలో మోతీ భాగ్
ప్రస్తుత కాలంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ల సమస్యలేంటి? ఎందుకు వలస వెళ్లిపోతున్నారనే నేప థ్యంలో రూపొందిన డాక్యుమెంటరీ చిత్రం ‘మోతీ భాగ్’. ఉత్తరాఖండ్లో నివసించే విద్యుత్ అనే రైతు జీవితం ఆధారంగా దర్శకుడు నిర్మల్ చందర్ దండ్రియాల్ ఈ డాక్యుమెంటరీ రూపొందించారు. ఈ డాక్యుమెంటరీ చిత్రం ఆస్కార్కు నామినేట్ అయిందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఇటీవల ప్రకటించారు. ‘‘ఇలాంటి సినిమాలే యువతను తమ ప్రాంతాల్లోనే ఉండేలా ప్రేరణనిస్తాయి. వలసలు వెళ్లిపోవడాన్ని కూడా తగ్గిస్తాయి. ‘మోతీ భాగ్’ టీమ్కు కంగ్రాట్స్’ అని పేర్కొన్నారాయన. -
పాతికేళ్ల జీవితం
జియాఖాన్ జీవితకథపై బ్రిటిష్ నిర్మాత ఒకరు డాక్యుమెంటరీ తీయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. సహనటుడు సూరజ్ పంచోలీతో తెగిపోయిన బంధం ఆమెను మరణానికి చేరువ చేసింది. 2013లో జియా ఆత్మహత్య చేసుకున్నారు. పాతికేళ్ల వయసులో చనిపోయిన జియా జీవితంలో ఆమె బతికిన క్షణాలకన్నా, చావలేక బతికిన క్షణాలే ఎక్కువ కనుక బ్రిటిష్ నిర్మాత తీయబోయే జియా డాక్యుమెంటరీ ఆమె ఆత్మహత్య చుట్టూ తిరుగుతుందా, లేక ఆత్మహత్యను వదిలేసి తిరుగుతుందా అనేది కూడా స్పష్టం కావలసి ఉంది. న్యూయార్క్లో పుట్టి, లండన్లో పెరిగి, పాకిస్థాన్లో సమీప బంధువులున్న జియాఖాన్.. రామ్గోపాల్ వర్మ తీసిన ‘నిశ్శబ్ద్’ (2017) చిత్రంతో బాలీవుడ్లోకి ప్రవేశించారు. అందులో ఆమె అమితాబ్తో కలిసి నటించారు. తర్వాత ఘజనీ, హౌస్ఫుల్ చిత్రాలలో కనిపించారు. -
'ఆ డాక్యుమెంటరీ తీయడం నా కల'
ముంబయి : ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ సప్నా భవ్నాని 'సింధుస్థాన్' పేరుతో తీస్తున్న డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లోని 'సింధ్' రాష్ట్రానికి వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను ఆమె మంగళవారం కోరారు. 'ఇమ్రాన్ సార్ ! నేను సింధ్ పేరు మీద సింధుస్థాన్ అనే డాక్యుమెంటరీ తీస్తున్నాను. ఈ డాక్యుమెంటరీకి సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకునేందుకు సింధ్కు రావాలనుకున్నాను. అయితే రెండుసార్లు నా వీసా తిరస్కరణకు గురైంది. ఈ సినిమా చేయడం నా కల.. ఎలాగైనా ఈ డాక్యుమెంటరీని పూర్తి చేయడానికి మీరు సహృదయంతో ఆలోచించి నాకు అనుమతినిస్తారని ఆశిస్తున్నా’అని స్వప్నా భవ్నానీ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా ఆమె చేసిన ట్వీట్పై అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. సింధ్ చరిత్ర, సంసృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 'సింధుస్థాన్' డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంటుంది. -
ఆస్కార్ గెలిచిన భారతీయ చిత్రం..!
కోట్ల రూపాయల బడ్జెట్తో చిత్రాలు తీసే భారతీయ దర్శకనిర్మాతలకు.. కథను పట్టించుకోకుండా కేవలం కండల ప్రదర్శన.. దుమ్ము రేపే విన్యాసాలను నమ్ముకునే హీరోలకు భారీ షాక్ తగిలింది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలంటేనే అదోలా మొహం పెట్టే వారి దిమ్మతిరిగి పోయే విచిత్రం ఒకటి ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల కార్యక్రమలో చోటు చేసుకుంది. స్త్రీ జీవితంలో ప్రధాన పరిణామమైన రుతుచక్రం ఇతివృత్తంతో రూపొందిన ‘పీరియడ్ : ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ డాక్యూమెంటరీకి ఆస్కార్ అవార్డ్ లభించింది. ప్రముఖ నిర్మాత గునీత్ మోంగా భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న రుతుక్రమ సమస్యల నేపథ్యంలో నిర్మించిన డాక్యుమెంటరీ ఆస్కార్ను సొంతం చేసుకుంది. రేకా జెహ్తాబ్చి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పీరియడ్స్ సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలను.. వాటి పట్ల జనాలకున్న అపోహలను.. సమాజం తీరును ఈ డాక్యుమెంటరీలో చూపించారు. ఆస్కార్ అవార్డును అందుకున్న సందర్భంగా రేకా స్టేజ్పై ప్రసంగిస్తూ.. ‘ఓ మై గాడ్. మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్య గురించి నేను డాక్యుమెంటరీ తీస్తే దానికి ఆస్కార్ వచ్చింది. నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ‘మేము గెలిచాం. భూమ్మీద ఉన్న అమ్మాయిలందరు దేవతలు. ఇప్పుడు ఈ మాటని స్వర్గం కూడా వింటుంద’ని గునీత్ మోంగా ట్వీట్ చేశారు. WE WON!!! To every girl on this earth... know that you are a goddess... if heavens are listening... look MA we put @sikhya on the map ❤️ — Guneet Monga (@guneetm) February 25, 2019 అయితే ఇప్పటివరకు ఎన్నో భారతీయ చిత్రాలు ఆస్కార్కు నామినేట్ అయినప్పటికీ.. అవార్డుల విషయానికి వచ్చేసరికి నిరాశే మిగిలింది. అలాంటిది ఓ డాక్యుమెంటరీ.. అందునా స్త్రీ సమస్య ఇతివృత్తంగా తెరకెకిక్కన చిత్రం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును గెలిచి చరిత్ర సృష్టించింది. -
సూర్యలంకలో ‘బీ అలర్ట్’
గుంటూరు: సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ ఎస్పీ కేజీవీ సరిత ఆధ్వర్యంలో నూతనంగా రూపొందుతున్న ‘బీఅలర్ట్’ డాక్యుమెంటరీ షూటింగ్ మంగళవారం సూర్యలంక బీచ్లో దర్శకుడు, సీఐడీ ఎస్ఐ కొట్టె శ్రీహరి పర్యవేక్షణలో జరిగింది. యువత బీచ్లకు వెళ్ళి వ్యసనాలకు బానిసలుగా మారడం, పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం పై చిత్రీకరణ జరిగింది. సన్ని వేశాల్లో సీఐడీ ఎస్ఐ రామకోటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, నటీనటులు జెస్సీ హారిక, సాయినా«థ్ తదితరులు పాల్గొన్నారు. -
నాన్నకు హ్యాట్సాఫ్
బాలీవుyŠ సూపర్స్టార్ ధర్మేంద్ర అభిమానులకు ఆయన కుమారుడు సన్నీ డియోల్ ఓ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అదేంటంటే... ధర్మేంద్ర జీవితం ఆధారంగా ఓ డాక్యుమెంటరీని రూపొందించనున్నారు సన్నీ. పంజాబ్ నుంచి ముంబై వచ్చి సినిమాల్లో సూపర్ స్టార్గా ధర్మేంద్ర ఎలా ఎదిగారు? అనే విషయాల్ని ఇందులో ప్రస్తావించనున్నారట. అలాగే ధర్మేంద్ర జీవితం ఆధారంగా ఓ పుస్తకాన్ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఇందులో నటుడిగా ఆయన చేరుకున్న మైలు రాళ్లు, జ్ఞాపకాలు, ఆశ్చర్యకర సంఘటనలు షేర్ చేసుకుంటారట. ‘‘నాన్నగారి లైఫ్ గురించి తన ప్రతి అభిమానికి తెలియాలి. అందుకే ఈ డాక్యుమెంటరీ. మా టీమ్ అందరితో నాన్నగారు ప్రయాణిస్తారు. తన ప్రతి జ్ఞాపకాలను చూపిస్తారు. వాటిని షూట్ చేస్తాం. నాన్నగారితో పని చేసిన అందర్నీ ఇంటర్వ్యూ చేయనున్నాం. నాన్నగారి సుదీర్ఘ ప్రయాణం గ్రేట్. నాన్నగారికి హ్యాట్సాఫ్’’ అని పేర్కొన్నారు సన్నీ డియోల్. -
పాల్పై డాక్యుమెంటరీ
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ హాలీవుడ్ మూవీ సిరీస్ ద్వారా అందులో ఒక హీరో పాల్ వాకర్ సుపరిచితుడే. 2013లో జరిగిన కార్ యాక్సిడెంట్లో పాల్ మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ హీరో మీద ఓ డాక్యుమెంటరీ రూపొందించింది హాలీవుడ్ సంస్థ పారామౌంట్ పిక్చర్స్. ‘ఐ యామ్’ పేరుతో డాక్యుమెంటరీ సిరీస్ను రూపొందిస్తుంటుంది పారామౌంట్ సంస్థ. ఈ సిరీస్లో భాగంగానే పాల్ వాకర్పై కూడా ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. ఇందులో పాల్ బాల్యంలోని కొన్ని వీడియోలను చూపించనున్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులు, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్లో పాల్తో పాటు యాక్ట్ చేసిన యాక్టర్స్, డైరెక్టర్స్తో ఇంటర్వ్యూలను కూడా పొందుపరిచారట. దీనికి సంబంధించిన ట్రైలర్ను ఇటీవలే రిలీజ్ చేసింది పారామౌంట్. ఈ డాక్యుమెంటరీ ఆగస్ట్ 11న ప్రసారం కానుంది. -
ఎవరికీ తెలియని విషయాలతో...
శ్రీదేవి నాలుగేళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చింది. 13 ఏళ్ల వయసులో హీరోయిన్ అయింది. చైల్డ్ ఆర్టిస్ట్ టు హీరోయిన్.. ఆమె కెరీర్ 50 ఏళ్లు. ‘ఆల్ ఇండియా సూపర్ స్టార్’. హిందీ నిర్మాత బోనీ కపూర్ని పెళ్లి చేసుకున్నారు. ఇలాంటి విషయాలన్నీ అందరికీ తెలిసినవే. ఎవరికీ తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అలాంటి అరుదైన విషయాలతో బోనీ కపూర్ ఓ డాక్యుమెంటరీ తీయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. భార్య హఠాన్మరణాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారని, ఆమె మరణం గురించి పలువురు పలు రకాలుగా మాట్లాడుకోవడం ఆయన్ను మరింత బాధపెడుతోందని సన్నిహితులు అంటున్నారు. భార్య గురించి ఎవరికీ తెలియని విశేషాలతో ఆయన తీయనున్న డాక్యుమెంటరీలో శ్రీదేవి జీవితంలోని కీలక వ్యక్తులు తమ అభిప్రాయాలు పంచుకుంటారని సమాచారమ్. జగదేక సుందరి కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఒకటైన ‘మిస్టర్ ఇండియా’ దర్శకుడు శేఖర్ కపూర్ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించనున్నారట. కచ్చితంగా ఈ చిత్రం కోసం శ్రీదేవి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తారు. బోనీ నుంచి ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందో చూడాలి. -
అమరావతిపై డాక్యుమెంటరీ
సాక్షి, హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై డాక్యుమెంటరీ ఫిల్మ్ను రూపొందించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. అమరావతి సంస్కృతి, చరిత్రతోపాటు నిర్మాణ దృశ్యాలు, అభివృద్ధిని చిత్రీకరించనున్నారు. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ రూపకల్పన బాధ్యతలను నేషనల్ జియోగ్రఫిక్ చానల్కు అప్పగించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. సదరు చానల్ ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలిం చాయి. 44 నిమిషాల నిడివి ఉండే ఈ ఫిల్మ్ చిత్రీకరణకు రూ. 48 లక్షలు వ్యయం చేయనున్నారు. మూడు నాలుగేళ్లపాటు రోజుకు 60 షాట్స్ చిత్రీకరిస్తారు. డాక్యుమెంటరీపై యాజమాన్య హక్కు సీఆర్డీఏకు ఉంటుంది. అమరావతిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు దేశ విదేశాల్లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు. దీనిద్వారా పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించవచ్చని సీఆర్డీఏ అధికారులు భావిస్తున్నారు. -
కెమేరా వెనుక కొత్త అవతారం
కొన్నేళ్ళ క్రితం ‘కొత్త బంగారు లోకం’ చిత్రంలో హీరో వరుణ్ సందేశ్ సరసన మెరిసిన కథానాయిక శ్వేతాబసు ప్రసాద్ గుర్తుందిగా! తొలి చిత్రంతోనే అనూహ్యమైన గుర్తింపు సాధించిన ఈ యువ నటి ఆ తరువాత ఆశించిన మేరకు విజయాలు అందుకోక బాగా వెనుకబడ్డారు. ప్రత్యేక నృత్య గీతాల్లోనూ నర్తించారు. అయితే, ఇప్పుడీ నవతరం అమ్మాయి ఓ డాక్యుమెంటరీని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ‘రూట్స్’ అని పేరు పెట్టిన ఈ డాక్యుమెంటరీ చిత్రం భారతీయ శాస్త్రీయ సంగీతంపై తీసినది కావడం విశేషం. మూడేళ్ళు పట్టిన ఈ డాక్యుమెంటరీ కోసం చిత్రీకరణకు ముందు విస్తృతంగా పరిశోధన చేసినట్లు శ్వేతాబసు చెబుతున్నారు. ‘‘2011 మే నెలలో నాకు 20 ఏళ్ళ వయసులో ఈ డాక్యుమెంటరీ చిత్ర రూపకల్పన మొదలుపెట్టాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ మొత్తం ప్రయాణాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను’’ అని ఆమె అన్నారు. ఇటు కర్ణాటక సంగీతం, అటు హిందుస్థానీ సంగీతం - రెండూ ఇవాళ భారతీయ యువతరంలో ఏ మేరకు నిలిచాయన్న అంశం ఆధారంగా ఈ ‘రూట్స్’ తీశారు. ఇందులో విశాల్ భరద్వాజ్, ఏ.ఆర్. రెహమాన్, శుభా ముద్గల్, ఇమ్తియాజ్ అలీ, పండిట్ హరిప్రసాద్ చౌరసియా లాంటి సుప్రసిద్ధుల ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీని దేశవిదేశాల్లోని చలనచిత్రోత్సవాల్లోనే కాక, పాఠశాలలు, ఇతర విద్యా సంస్థల్లో సైతం ప్రదర్శించాలని భావిస్తున్నారు. మరి, ఈ ప్రయత్నంలోనైనా శ్వేతాబసు సక్సెస్ అవుతారా?