emotional
-
'మిస్ యూ మై సన్'.. ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ తీవ్ర భావోద్వేగం!
ప్రముఖ తెలుగు లేడీ కమెడియన్, కితకితలు హీరోయిన్ గీతాసింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో గీతా సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సరిగ్గా రెండేళ్ల క్రితం చేతికి అందివచ్చిన కుమారుడిని కోల్పోయిన గీతాసింగ్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఫిబ్రవరి 18న తన కుమారుడి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించింది. తన కొడుకు తనతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంటూ.. మిస్ యూ రా అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. (ఇది చదవండి: కమెడియన్ గీతాసింగ్ ఇంట విషాదం)అయితే.. గీతాసింగ్ ఇప్పటివరకు అసలు పెళ్లే చేసుకోలేదు. తన సోదరుడి కుమారులను దత్తత తీసుకుని పోషిస్తున్నారు. వారిలో పెద్దబ్బాయి ఈ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇకపోతే కితకితలు, ఎవడిగోల వాడిది సినిమాలో గీతా సింగ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 50కి పైగా చిత్రాలు చేసింది. ప్రస్తుతం మాత్రం సినిమాలకు దూరంగా ఉంటోంది. View this post on Instagram A post shared by Geeta Singh (@kithakithalu_geetasingh) -
నందమూరి తారకరత్న వర్ధంతి.. పిల్లలతో కలిసి అలేఖ్యా రెడ్డి నివాళి (ఫొటోలు)
-
వీడియో: కన్నీళ్లను దిగమింగుకున్న ఆప్ నేత
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంపై ఆప్ నేత, ఆరోగ్య శాఖ మంత్రి(కాబోయే మాజీ) సౌరభ్ భరద్వాజ్ భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ గ్రాండ్ విక్టరీ కైవసం చేసుకోగా, అరవింద్ కేజ్రీవాల్ సహా ఆప్ దిగ్గజాలంతా ఈ ఎన్నికలో ఓడిన సంగతి తెలిసిందే. అయితే.. ఓటమిని అంగీకరిస్తున్నట్లు చెబుతూనే సౌరభ్ భదర్వాజ్ కన్నీళ్లను దిగమింగుకున్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భరద్వాజ్ బీజేపీ అభ్యర్థి షికా రాయ్ చేతిలో ఓడారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘ఆటలో గెలుపోటములు సహజమే. అలాగే రాజకీయాల్లో కూడా. నా.. పార్టీ ఓటమిని నేను అంగీకరిస్తున్నా. కానీ, కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే మాత్రం భరించలేకపోతున్నా’’ అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టబోయారాయన. అయితే వెంటనే పక్కకు వెళ్లి.. ఆ కన్నీళ్లను దిగమింగుకున్నారు.ఢిల్లీలో ఆప్ కోసం ప్రతీ కార్యకర్త కష్టపడ్డారని, వాళ్లను చూస్తే గర్వంగా ఉందని అన్నారాయన. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. Saurabh Bharadwaj of Aam Admi Party gets emotional when his cader visit him to console after losing in Delhi elections He couldn’t control from crying! He contested from Greater Kailash and lost by 3188 votes! Shika Rai won from this place!#saurabhbhardwaj #DelhiElection2025… pic.twitter.com/ktFqzvKUUg— North East West South (@prawasitv) February 10, 2025 గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి గత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో సౌరభ్ భరద్వాజ్ నెగ్గారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి.. బీజేపీ షికా రాయ్ చేతిలో మూడు వేల ఓట్ల ఆధిక్యంతో ఓడారు. షికా రాయ్కు 49,594 ఓట్లు పోలవ్వగా, భరద్వాజ్కు 46,406 ఓట్లు పడ్డాయి. అలాగే.. కాంగ్రెస్ అభ్యర్థి గర్విత్ సింఘ్వీకి 6,711 ఓట్లు పోలయ్యాయి. 2015 ఎన్నికల్లో బీజేపీ రాకేష్ కుమార్పై 14 వేల ఓట్లు, 2020 ఎన్నికల్లో 16 వేల ఓట్ల ఆధిక్యంతో భరద్వాజ్ గెలుపొందడం గమనార్హం. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో.. బీజేపీ 48 సీట్లు దక్కించుకుని అద్భుత విషయం సాధించింది. గత రెండు ఎన్నికల్లో 67, 62 సీట్లు సాధించిన ఆప్.. ఈసారి 22 స్థానాలకు పడిపోయింది. ఇక.. కాంగ్రెస్ జీరోకి పరిమితమైంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక.. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరే అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
ఆయనో స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్! మీనా పెళ్లిలో మాత్రం భావోద్వేగంతో..
సముద్రం సునామీగా ముంచెత్తి దాదాపు 6 వేల మందిని పొట్టనబెట్టుకుంది. అంతటి ప్రళయం నుంచి అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడినవాళ్లు కొందరే. అందులో రెండేళ్ల ఓ పసిప్రాణం కూడా ఉంది. పసికందుగా ఆమెను తన చేతుల్లోకి తీసుకున్న ఆ ఐఏఎస్ అధికారి.. ఇప్పుడు తండ్రి స్థానంలో ఆమెపై అక్షింతలు జల్లి దీవించి భావోద్వేగానికి లోనయ్యారు. హృదయాన్ని హత్తుకునే ఈ ఘటనలోకి వెళ్తే.. డిసెంబర్ 26, 2004 ముంచెత్తిన సునామీలో తమిళనాడుకు జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే. నాగపట్టణంలో సహాయక చర్యలు పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరున్న రాధాకృష్ణన్కు అప్పగించింది. అప్పుడు ఆయన తంజావూరు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో.. డిసెంబర్ 28వ తేదీన కీచన్కుప్పం ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్న బృందాలకు.. శిథిలాల కింద ఓ పసికందు ఏడుపులు వినిపించాయి. దాదాపు రెండేళ్ల వయసున్న చిన్నారిని సురక్షితంగా బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించారు. అదృష్టం కొద్దీ ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఆ సునామీ నుంచి బయటపడిన అతిచిన్న వయస్కురాలు కూడా ఆమెనే!. అయితే ఆమె తల్లిదండ్రులు ఏమయ్యారో తెలియదు. అలాంటప్పడు చిన్నారి సంరక్షణ బాధ్యతలు ఎలా? అని అధికారులు ఆలోచన చేశారు.ఈలోపు.. విషయం తెలిసిన అప్పటి జిల్లా కలెక్టర్ రాధాకృష్ణన్-కృతిక దంపతులు ముందుకు వచ్చారు. ఆ చిన్నారికి మీనా అని పేరు పెట్టి.. అన్నై సత్య ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించారు. అప్పటి నుంచి ఆమె సంరక్షణ మొత్తం ఆ జంటే చూసుకుంటూ వచ్చింది. ఈలోపు రాధాకృష్ణన్కు ట్రాన్స్ఫర్ అయ్యింది. అయితే మరో ప్రాంతానికి బదిలీ అయినప్పటికీ.. రాధాకృష్ణన్ జంట మీనా సంరక్షణ బాధ్యతను మరిచిపోలేదు. వీలు చిక్కినప్పుడల్లా ఆమె దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. అదే ఆశ్రమంలో సౌమ్య ఆమెకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది. అలా.. ఏళ్లు గడిచిపోయాయి. సాధారణంగా 18 ఏళ్లు నిండిన తర్వాత.. వాళ్లకు ఆశ్రమంలో కొనసాగడానికి వీలు ఉండదు. ఆశ్రమంలో సౌమ్య, మీనాలకు మాత్రమే ఈ ఇబ్బంది ఎదురైంది. విషయం తెలిసి.. రాధాకృష్ణన్ ముందుకొచ్చారు. మీనా, సౌమ్య బాధ్యతలకు దాతల సహకారం తీసుకున్నారు. అలా.. వాళ్లిద్దరూ ఉన్నత చదువులు పూర్తి చేసుకున్నారు. అలా వాళ్లిద్దరికీ తండ్రికాని తండ్రిగా మారిపోయారు.రెండేళ్ల కిందట.. సౌమ్య ఓ టెక్నీషియన్ను వివాహం చేసుకుంది. ఆ వివాహానికి సౌమ్య తరఫున పెద్దగా రాధాకృష్ణన్ హాజరై ఆశీర్వదించారు. కిందటి ఏడాది సౌమ్య ఓ బిడ్డకు జన్మనిస్తే.. ఇంటికి పిలిపించుకుని మరీ మనవరాలిని దీవించారు. ఇక మీనా వయసు ఇప్పుడు 23 ఏళ్లు. నర్సింగ్ పూర్తి చేసుకుంది. మీనాను వివాహం చేసుకునేందుకు మణిమరన్ అనే బ్యాంక్ ఉద్యోగి ముందుకు వచ్చాడు. విషయం తెలిసి రాధాకృష్ణన్ సంతోషించారు. ఫిబ్రవరి 2వ తేదీన నాగపట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మీనా-మణిమరన్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహ వేడుకకు సౌమ్య తన భర్త, కూతురితో హాజరైంది. ప్రస్తుతం రాధాకృష్ణన్ ప్రభుత్వంలో అదనపు చీఫ్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దత్త పుత్రిక వివాహానికి స్వయంగా హాజరై తండ్రి స్థానంలో ఉండి తన బాధ్యతను నిర్వర్తించారు. ఆశ్రమంలో సౌమ్య-మీనాలు గడిపిన రోజులను, వాళ్ల స్నేహాన్ని, ఆశ్రమ నిర్వహణకు సహకరించిన సూర్యకళను ఆయన గుర్తు చేసుకున్నారు. అన్నింటికి మించి.. 2018లో గాజా తుపాన్ సమీక్ష కోసం వెళ్లినప్పుడు మీనా తనను ‘‘నాన్నా..’’ అని పిలవడాన్ని గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఆ వివరాలను ఆయనే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం గమనార్హం. -
భూమనను పట్టుకొని ఏడ్చేసిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు
-
కుమార్తె స్నాతకోత్సవంపై భావోద్వేగ ట్వీట్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి
-
నా భర్త వల్లే ఇది సాధ్యమైంది.. ఈ ఫొటో ఆయన కోసమే! (ఫోటోలు)
-
లావణ్య మృతదేహానికి అంత్యక్రియలు
సీతంపేట: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మరణించిన సూరిశెట్టి లావణ్య మృతదేహానికి స్థానిక జగన్నాథపురం శ్మశానంలో ప్రభుత్వ లాంఛనాలతో శుక్రవారం అంత్యక్రియలు జరిగాయి. తెల్లవారు జామున 3 గంటలకు విశాఖ చేరిన మృతదేహాన్ని అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్లో సందర్శనార్థం ఉంచారు. లావణ్య భర్త, కుమార్తెలు, కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ తదితరులు లావణ్య మృతదేహం వద్ద నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. దహన సంస్కారాల నిమిత్తం ప్రభుత్వ సాయాన్ని అర్బన్ ఎమ్మార్వో రమేష్బాబు అందించారు. బోరున విలపించిన∙కుమార్తెలు : మృతదేహం విశాఖ చేరడానికి కొద్దిసేపటి ముందు లావణ్య మృతి చెందిన విషయం ఆమె కుమార్తెలకు తెలిపారు. దీంతో కుమార్తెలిద్దరూ షాక్కు గురయ్యారు. తల్లిని విడిచి ఎప్పుడు ఒక్క క్షణం ఉండలేని పిల్లలు, తల్లి ఇక లేదన్న విషయాన్ని తట్టుకోలేక తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తిరుపతి వెళ్లే ముందు అమ్మ చెప్పిన మాటలు గుర్తుచేసుకుని బోరున ఏడ్చేశారు. -
రద్దీలో వద్దనుకున్నా.. అంతలో దుర్ఘటన
మద్దిలపాలెం: రద్దీగా ఉండడంతో క్యూలోంచి బయట వెళ్లిపోదాం అనుకున్నంతలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో తన భార్య రజని ప్రాణాలు కోల్పోయిందని భర్త గుడ్ల లక్ష్మారెడ్డి భోరుమంటూ విలపించారు. అప్పటి వరకూ ఇద్దరం కలిసి క్యూలో జాగ్రత్తగా వెళ్తున్న సమయంలో రద్దీ అధికమవ్వడంతోపాటు గేట్లు తెరిచారని, దీంతో జనం ఒక్కసారిగా క్యూలో కదలడం పలువురి ప్రాణాలు పోవడానికి కారణమయిందని మద్దిలపాలేనికి చెందిన మృతురాలు రజని భర్త లక్ష్మారెడ్డి వాపోయారు. రెండు గంటల తర్వాత జాడ తెలిసింది ‘తొక్కిసలాటలో తప్పిపోయిన రజని కోసం వెతుకుతున్నా. ఎక్కడా జాడలేదు. దీంతో ఏం చేయాలో తెలియలేదు. నా చేతిలో ఫోన్కూడా రజనీ బ్యాగులో ఉండిపోయింది. దీంతో అక్కడే వున్న ఆటో డ్రైవర్ ఫోన్ ద్వారా కాల్ చేస్తున్న పనిచేయలేదు. ఏం జరిగిందో తెలియదు. రెండు గంటల తర్వాత ఆస్పత్రిలో చేర్పింపిచారని సమాచారం అందింది. ఆ ఆస్పత్రి ఎక్కడుందో తెలియక ఆటో ద్వారా అక్కడి చేరుకున్నా. వెళ్లి చూసే సరికి విగత జీవిగా పడి ఉంది’అంటూ బోరున విలపించారు. అమెరికా నుంచి హుటాహుటిన వచ్చిన హర్షవర్ధన్ రెడ్డి.. తల్లి భౌతికకాయాన్ని చూసి సొమ్మసిల్లిపోయాడు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రజనీ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నేడు అంత్యక్రియలు అమెరికా నుంచి మృతురాలి తమ్ముడు శనివారం విశాఖ వస్తున్నారు. అతను రాగానే అంత్యక్రియలు నిర్వహిస్తామని భర్త లక్ష్మారెడ్డి తెలిపారు. -
చాలా దారుణం.. టీటీడీ ఘటనపై వంగా గీత ఎమోషనల్
-
మనిషి మనిషికో ఇంటిమసీ అవసరం
అంజలి, కార్తీక్లకు పెళ్లయి మూడేళ్లవుతోంది. అంజలికి ప్రయాణాలంటే ఇష్టం. అడ్వంచర్ ట్రిప్స్ అంటే ప్రాణం. ఎప్పటికప్పడు కొత్త హాబీలను ప్రయత్నిస్తుంటుంది. కార్తీకేమో ఒక పరిశోధకుడు. మెదడుకు పదునుపెట్టే పుస్తకాలు చదవడం, సమకాలీన అంశాలపై లోతుగా చర్చించడం చాలా ఇష్టం. కార్తీక్ తనతో సంతోషంగా లేడని అంజలికి అనిపించేది. అంజలి తన ఆలోచనలను అర్థం చేసుకోవడంలో ఆసక్తి చూపడం లేదని కార్తీక్కు అనిపించేది. కానీ ఆ విషయం ఒకరికొకరు చెప్పుకోలేక మథనపడుతున్నారు. రవి సాఫ్ట్వేర్ ఇంజినీర్, మీరా స్కూల్ టీచర్. రవి తన ప్రేమను ముద్దులు, హగ్గులు, బెడ్ టైమ్లో వ్యక్తీకరించేవాడు. మీరా రోజువారీ విషయాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ ఉండేది. కానీ రవి తన మాటలు వినడంలేదని అనిపించేది. రవేమో మీరా తనను పట్టించుకోవడంలేదని భావించేవాడు. దీంతో ఇద్దరి మధ్య ఆత్మీయతానురాగాలు దూరమవుతున్నాయి. తరచూ గొడవలు పడుతున్నారు. ఇలాంటి సమస్య మీకూ ఎదురై ఉండవచ్చు. మీరూ మీ భాగస్వామి బాగానే ఉంటున్నా, ఏదో దూరం పెరుగుతోందని అనిపించవచ్చు. అందుకు కారణమేంటో తెలియక ఆందోళన పడుతూ ఉండవచ్చు. అందుకు ప్రధాన కారణం సాన్నిహిత్యం (intimacy) గురించి అవగాహన లేకపోవడమేనని చెప్పవచ్చు. శారీరక సాన్నిహిత్యం ఉంటే అన్నీ సర్దుకుంటాయని చాలామంది అనుకుంటారు. కానీ అంతకుమించి అవసరమైన సాన్నిహిత్యాలు కూడా ఉన్నాయి. వాటిని గుర్తించకపోవడం లేదా పరిష్కరించకపోవడం సమస్యలకు దారితీస్తుంది. దంపతులు పరస్పరం వారి అవసరాలను అర్థం చేసుకుని, సాన్నిహిత్య రకాల మధ్య సమతౌల్యాన్ని కలిగి ఉంటే, సంబంధం మరింత గాఢంగా ఉంటుంది. సమస్యలు తీవ్రమైనప్పుడు ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ సహాయం తీసుకోవడం అవసరం. 1. భావోద్వేగ సాన్నిహిత్యంబంధానికి, అనుబంధానికి మూలస్తంభం emotional intimacy ఇద్దరి మధ్య భావాలు, అనుభవాలను నిరభ్యంతరంగా పంచుకునే స్వేచ్ఛ ఉన్నప్పుడు భావోద్వేగ సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అయితే, ఒక వ్యక్తి ఎమోషనల్గా దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు మరో వ్యక్తి దూరంగా ఉంటే అది అసంతృప్తికి, ఒంటరితనానికి దారితీస్తుంది. మీరా సమస్య అదే. రవి తనతో ఎమోషనల్గా కనెక్ట్ కావడంలేదని బాధపడుతోంది. 2. శారీరక సాన్నిహిత్యంPhysical intimacy అంటే కౌగిలింతలు, ముద్దులు, లైంగిక సంబంధాల వంటివి. దీనికి ఎంత ప్రాధాన్యం ఇస్తారనేది వారి వారి స్థాయిల్లో ఉంటుంది. ఒకరికి శారీరక సాన్నిహిత్యం అవసరం ఎక్కువగా ఉంటే, మరొకరికి దాని ప్రాముఖ్యత తక్కువగా ఉండవచ్చు. అప్పుడు ఇద్దరి మధ్యా దూరం ఏర్పడుతుంది. ఉదాహరణకు రవికి ఫిజికల్ ఇంటిమసీ ముఖ్యమైతే, మీరాకు ఎమోషనల్ ఇంటిమసీ అవసరం. వారిద్దరి మధ్య దూరానికి అదే కారణం. 3. మేధో సాన్నిహిత్యంఆలోచనలు, అభిప్రాయాలు, లోతైన చర్చల ద్వారా ఏర్పడేదే intellectual intimacy ఇద్దరు వ్యక్తులు తమ అభిప్రాయాలను పంచుకుంటూ మానసికంగా కలిసి ఉంటే, వారి సంబంధం మరింత బలపడుతుంది. కానీ, ఒకరు మేధోపరమైన చర్చల పట్ల ఆసక్తి చూపితే, మరొకరు ప్రాక్టికల్ విషయాలకే ప్రాధాన్యం ఇస్తే, అది అసంతృప్తికి దారితీస్తుంది. అంజలి, కార్తీక్ల మధ్య సమస్య ఇదే. 4. అనుభవైక సాన్నిహిత్యంఒకే విధమైన అనుభవాలను పంచుకోవడం ద్వారాexperiential intimacy ఏర్పడుతుంది. ఉదాహరణకు, కలిసి ప్రయాణం చేయడం, వంట చేయడం లేదా ఇతర హాబీలను పంచుకోవడం. ఇది బంధంలో టీమ్వర్క్ను పెంపొందిస్తుంది. కానీ, ఒక వ్యక్తి బహుళ అనుభవాలకు ప్రాధాన్యమిచ్చి.. మరొకరు వ్యక్తిగత సమయాన్ని కోరుకుంటే సమస్యలు వస్తాయి.5. ఆధ్యాత్మిక సాన్నిహిత్యంకొందరికి మతపరమైన లేదాspiritual intimacy చాలా ముఖ్యమైనది. కలిసి ప్రార్థనలు చేయడం, ధ్యానం చేయడం లేదా జీవితంపై చర్చలు చేయడం ఈ బంధాన్ని బలపరుస్తాయి. అయితే, ఆధ్యాత్మిక లక్ష్యాల్లో భిన్నత్వముంటే సమస్యలు తలెత్తుతాయి. ఉదాహరణకు.. పరమ భక్తురాలికి నాస్తికుడు భర్తగా ఉంటే ఎలా ఉంటుందో మీరే ఊహించండి. 6. ఆర్థిక సాన్నిహిత్యండబ్బు సంబంధిత విషయాల్లో పారదర్శకత, పరస్పర నమ్మకం కలిగి ఉండటమే financial intimacy. ఒకరు ఆదా చేయడంలో ఆసక్తి చూపుతుండగా, మరొకరు ఖర్చుల పట్ల ఆసక్తి చూపితే అది విభేదాలకు దారితీస్తుంది. -
Sai Pallavi: నాకంటే ఎక్కువే ప్రేమిస్తున్నాడు.. ఎమోషనలైన హీరోయిన్ (ఫోటోలు)
-
తాళికట్టి.. తలంబ్రాలు పోసి.. భార్యను ముద్దాడి (ఫొటోలు)
-
షణ్ముఖ్ జస్వంత్ ' లీల వినోదం' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
శోభిత పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సమంత.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫొటోలు)
-
మేనల్లుడిని చూసి కన్నీరు పెట్టుకున్న సురేఖ..
-
భార్య బిడ్డలను హత్తుకొని బన్నీ ఎమోషనల్
-
మా ధైర్యం జగనన్నే..ప్రేమ్కుమార్ కుటుంబ సభ్యులు
-
కన్నీళ్లు పెట్టుకున్న మనోజ్...
-
వీడు మాములోడు కాదు.... ఖతర్నాక్!’ ఇదొక ఎమోషనల్ క్రైం స్టోరీ
ఓ ప్రొఫెషనల్ కిల్లర్ చేయని హత్యకు పోలీసుల నుంచి తప్పించుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో స్పైడర్మ్యాన్ మాదిరి జంప్ చేసి రైలెక్కుతాడు. ఆ రైల్లో ‘బేసిక్గానే బ్యాడ్ జాతకం’ ఉన్న ఓ వ్యక్తి పరిచయం అవుతాడు. ఇంటి నుంచి చిన్నప్పుడే పారిపోయిన ఆ వ్యక్తి.. తిరిగి కుటుంబాన్ని కలుసుకునే ఎగ్జైట్మెంట్లో ఉంటాడు. ఇంతలో బుల్లెట్ ప్రాణం ఆ వ్యక్తి తీసేస్తుంది. దీంతో అసలు పార్థు బదులు ‘అతడు’ బాసర్లపూడికి వెళ్లాల్సి వస్తుంది. ఇదో సినిమా కథ.. కానీ, ఇక్కడ నిజజీవితంలో కొడుకు కాని కొడుకు ఒకడు ఓ కుటుంబాన్ని మోసం చేయాలనుకున్న తీరు గురించి తెలిస్తే.. మీరు కూడా ‘వీడు మాములోడు కాదు.. ఖతర్నాక్’ అనుకోవడం ఖాయం!.ఊరు: యూపీ ఘజియాబాద్ స్థలం: ఖోడా పోలీస్ స్టేషన్.. తేదీ నవంబర్ 21, టైం.. సరిగ్గా తెలియదు.మూడు పదుల వయసులో ఉన్న ఓ వ్యక్తి పీఎస్కు వచ్చాడు. తనను చిన్నప్పుడే ఎవరో ఎత్తుకెళ్లారని.. కన్నవాళ్లకు దూరమై ఇన్నాళ్లు నరకయాతన అనుభవించానని.. వాళ్ల కోసం ఎక్కడెక్కడో తిరిగానని.. తన కుటుంబాన్ని ఎలాగైనా వెతికిపెట్టమని పోలీసులను బతిమిలాడాడు. ఆ కన్నీళ్లకు పోలీసులు జాలిపడ్డారు. బట్టలు, చెప్పులు కొనిచ్చి.. తిండి పెట్టి స్టేషన్లోనే ఉండనిచ్చారు. ఈలోపు అతనిచ్చిన సమాచారంతో మీడియాలో, సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చారు. ఆ ప్రయత్నం ఫలించి చివరకు ఓ కుటుంబం అతడి కోసం స్టేషన్కు వచ్చింది.అది 1993 సంవత్సరం.. తేదీ సెప్టెంబర్ 08సమయం: పిల్లలు బడుల నుంచి ఇళ్లకు వెళ్లే టైంస్కూల్ నుంచి షాహిబాబాద్(ఢిల్లీ)లోని ఇంటికి తన సోదరితో బయల్దేరిన ఏడేళ్ల రాజును.. ఎవరో బలవంతంగా తమ వాహనంలో ఎత్తుకెళ్లారు. ఆ చిన్నారి పరుగున వచ్చి అన్నను ఎవరో ఎత్తుకెళ్లారని ఇంట్లో విషయం చెప్పింది. ఆందోళనతో ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఊరంతా జల్లెడ పట్టారు. లాభం లేకపోయింది. అయితే అటు కిడ్నాపర్ల నుంచి ఎలాంటి డిమాండ్ లేకపోవడం.. పోలీసులు ఆ బాలుడి ఆచూకీ కనిపెట్టడంలో విఫలం కావడంతో ఇన్నేళ్లుగా ఆ కేసు ఓ మిస్టరీగానే ఉండిపోయింది.చివరకు.. ఇన్నేళ్ల తర్వాత తానే ఆ రాజునంటూ ఓ వ్యక్తి వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. తనను రాజస్థాన్కు తీసుకెళ్లి హింసించారని, ఓ ఇంట్లో బంధించి పనులు చేయించుకున్నారని, ఆ ఇంట్లో ఓ పాప తనకు ధైర్యం చెబుతూ వచ్చిందని, ఎలాగోలా తప్పించుకుని ఊరు దాటానని, ఇన్నేళ్లు ఏవేవో పనులు చేసుకుంటూ ఎక్కడెక్కడో తిరిగానని.. కన్నీళ్లతో చెప్పాడు రాజు. హనుమాన్ దయవల్లే తాను బతికి బట్టకట్టానని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పాడు. ఆ మాటలతో చలించిపోయిన వాళ్ల అమ్మ.. అతన్ని అక్కున చేర్చుకుంది. ఇన్నేళ్ల తర్వాత కొడుకు తిరిగి వచ్చాడన్న ఆనందంలో అంతా మునిగిపోయారు. అక్కడి మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా ఈ ఎమోషనల్ రీయూనియన్ మీద వరుసబెట్టి కథనాలు ఇచ్చింది. ఇక్కడితో కథ సుఖాంతం అయ్యిందనుకునేరు!.ఇంటికి చేరుకున్నవాడు తిన్నగా ఉంటే ఫర్వాలేదు. కానీ, ఆస్తుల గురించి, ఇంట్లో దాచిన బంగారం.. డబ్బు గురించి పదే పదే ఆరా తీయడం మొదలుపెట్టాడట. దీంతో వారం తిరగకముందే ఆ కుటుంబం మళ్లీ ఘజియాబాద్ పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. అనుమానాల నడుమ.. డీఎన్ఏ టెస్ట్ నిర్వహిస్తే అతను వాళ్ల కొడుకే కాదని తేలింది. దీంతో పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యింది. తమ స్టైల్ ఇంటరాగేషన్ చేసి నిజాలు కక్కించారు.రాజస్థాన్కు చెందిన రాజు అలియాస్ భీమ్ అలియాస్ ఇంద్రరాజ్ అలియాస్.. చిన్నప్పటి నుంచే దొంగతనం అలవర్చుకున్నాడు. బంధువుల ఇళ్లను సైతం వదల్లేదు. దీంతో వాళ్ల శాపనార్థాలు భరించలేక ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఊరూరా తిరుగుతూ చోరీలు చేస్తూ పోయాడు. ఈ క్రమంలో.. అతనికో ఆలోచన వచ్చింది.తన ఐడెంటిటీని మార్చుకుంటూ ఊర్లు తిరగసాగాడు. తన తల్లి చనిపోయిందని, తాను అనాథనంటూ పని కావాలంటూ.. ఎమోషనల్ డ్రామాలు ఆడేవాడు. దీంతో కరిగిపోయి వాళ్లు అతన్ని చేరదీసేవారు. అయితే చెప్పాపెట్టకుండా ఏదో ఒక రాత్రి.. ఆ ఇంట్లోని నగదు, బంగారంతో ఉడాయించేవాడు. అలా.. ఇప్పటిదాకా 9 కుటుంబాలను అతను మోసం చేసినట్లు ఘజియాబాద్ పోలీసులు నిర్ధారించారు.ఈ క్రమంలో.. ఘజియాబాద్లో ఓ ధనికుల కుటుంబంలో పిల్లాడు.. చిన్నవయసులోనే ఇంట్లోంచి పారిపోయాడని తెలుసుకున్నాడు. పోలీసులనే ఏమార్చి ఆ ఇంటికి కన్నం వేయాలనుకున్నాడు. కానీ, చివరకు అడ్డంగా దొరికిపోయి ఊచలు లెక్కిస్తున్నాడు ఈ కొడుకు కాని కొడుకు.गाजियाबाद में 30 साल पहले अगवा हुआ बेटा लौटा था घर, वो निकला धोखेबाज, इस तरह का अपराध कई बार कर चुका है; परिवारों को बताया कि वो उनका लापता परिजन है#Ghaziabad #Police #GhaziabadPolice #kidnapped #lostrelative @ghaziabadpolice #imposter #Jantv_BM #jantvdigital #jantvreel pic.twitter.com/gcnPLT77lU— JAN TV (@JANTV2012) December 7, 2024 Video Credits: JAN TV -
ఊరు కాదిది... నా కుటుంబం!
రాయ్రంగ్పూర్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్వేగభరితమయ్యారు. తను పుట్టిన ఒడిశా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లా ఉపర్బేడ గ్రామాన్ని శుక్రవారం ఆమె సందర్శించి, అక్కడి గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు. ఉపర్బేడ గ్రామాన్ని కేవలం ఒక ప్రదేశంగా తానెన్నడూ భావించలేదని, అదొక కుటుంబమని తన మూలాలను గుర్తు చేసుకుంటూ ఉద్వేగంతో అన్నారు. బమన్ఘటి సబ్ డివిజన్లోని ఉపర్బేడలోని సంతాలి కుటుంబంలో ముర్ము 1958 జూన్ 20న జన్మించారు. 2022 జూలై భారత ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక ఈ గ్రామానికి రావడం ఇదే మొదటిసారి. గ్రామానికి చేరుకున్న వెంటనే ఆమె తను చదువుకున్న ఉపర్బేడ అప్పర్ ప్రైమరీ స్కూలుకు వెళ్లారు. రాష్ట్రపతి రాకను పురస్కరించుకుని ఆ పాఠశాలతోపాటు యావత్తు గ్రామాన్ని అందంగా మార్చారు. గ్రామస్తులు, స్కూలు టీచర్లు, విద్యార్థులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. తను పుట్టిన ఇంటికి వెళ్లే దారిలో సంతాలి మహిళలు ఆమెకు గిరిజన సంప్రదాయ వస్త్రధారణతో జానపద నృత్యం చేస్తూ పాటలు పాడుతూ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ముర్ము కూడా వారితో కాలు కదిపారు. గ్రామ దేవతకు పూజలు చేశారు. నేనిప్పటికీ ఇక్కడి విద్యార్థినే...స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ముర్ము విద్యార్థులతో ముచ్చటించారు. ‘‘నాకిప్పుడు 66 ఏళ్లు. అయినా మా స్కూల్లో చిన్న విద్యార్థిననే అనుకుంటున్నా. అప్పట్లో మట్టిగోడలుండేవి. మా ఏడో తరగతిలో ఉండగా స్కాలర్షిప్ పరీక్ష కోసం మదన్ మోహన్ సార్ వాళ్లింటికి తీసుకెళ్లారు. తన సొంత పిల్లలతోపాటు నన్ను కూడా పరీక్షకు ప్రిపేర్ చేశారు. ఈ గ్రామం, ఈ స్కూలు నాకు అందించిన అభిమానం మరువలేనిది’’ అంటూ ఉప్పొంగిపోయారు. తోటి వాళ్లు, ఉపాధ్యాయులు కూడా బయటి వ్యక్తిగా కాక, తనను సొంత కుటుంబసభ్యురాలిగా చూసుకునేవారన్నారు. ‘ఆ రోజుల్లో లాంతరు వెలుగులో చదువుకునేదాన్ని. ఆ లాంతరు గ్లాస్ పగిలిపోయి ఉండేది. చదువుకోవడానికి ఇబ్బందయ్యేది. సిరా పెన్నుతో రాయడం కష్టంగా ఉండేది. ఇంకుతో బట్టలు పాడయ్యేవి’’ అని గుర్తు చేసుకున్నారు. గురువులకు వందనం తనకు విద్య నేర్పిన గురువులను రాష్ట్రపతి ఘనంగా సన్మానించారు. స్కూల్ హెడ్మాస్టర్ బిశేశ్వర్ మహంత, క్లాస్ టీచర్ బాసుదేశ్ బెహెరె, 4, 5 తరగతుల్లో ఉండగా క్లాస్టీచర్ బసంత కుమార్ గిరిలను సన్మానించారు. ఉపర్బేడ అప్పర్ ప్రైమరీ స్కూల్లోని సుమారు 200 మందికి స్కూల్ బ్యాగులు, చాకెట్లు, టిఫిన్ బాక్సులు అందజేశారు. కష్టపడి చదువుకుని, ఉన్నతస్థానాలకు ఎదగాలని వారిని కోరారు. -
మూడు ముళ్లూ పడగానే శోభిత ఎమోషనల్, నాగ్ భావోద్వేగ సందేశం
వివాహం అనేది ప్రతీఅమ్మాయికి ఒక అందమైన అనుభూతి. బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రో ఛ్చారణల మధ్య మెడలో పవిత్రమైన మూడు ముళ్లూ పడే సందర్భంకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తారు. ఈ క్షణాల్లో భావోద్వేగాన్ని అదుపుచేసుకోవడం చాలా కష్టం. అక్కినేని వారి ఇంట పెళ్లి సందడిలో ఇలాంటి దృశ్యాలు నెట్టింట హాట్ టాపిక్గా నిలిచాయి.సోషల్ మీడియాలో శోభిత ధూళిపాళ, నాగచైతన్య మూడుముళ్ల వేడుకకు సంబంధించిన ఫోటోలు తెగ సందడి చేస్తున్నాయి. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో (డిసెంబర్ 4, 2024న) అంగరంగ వైభవంగా ముగిసాయి. ఈ సందర్భంగా నాగ చైతన్య , తన మెడలో మంగళసూత్రాన్ని కడుతున్న సందర్భంలో శోభిత ఎమోషనల్ అయింది. మంగళసూత్రాలను తనివితీరా చూసుకుంటూ ఆనందంతో కళ్లనీళ్లు పెట్టుకుంది. ఈ దృశ్యాలు అభిమానులను హత్తుకున్నాయి. <Watching Sobhita and Chay begin this beautiful chapter together has been a special and emotional moment for me. 🌸💫 Congratulations to my beloved Chay, and welcome to the family dear Sobhita—you’ve already brought so much happiness into our lives. 💐 This celebration holds… pic.twitter.com/oBy83Q9qNm— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 4, 2024మంగళ సూత్ర ధారణ సందర్భంగా ముత్తయిదువలు ఈలలు వేస్తూ, తెగ అల్లరి చేశారు. ఇది చూస్తూ అలాగే నాగ చైతన్య తండ్రి, నాగార్జున మురిపెంగా నవ్వుకున్నారు. . నాగార్జునతో పాటు వెంకటేష్ దగ్గుబాటి, దగ్గుబాటి సురేష్ బాబుతోపాటు ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న చైతన్య సోదరుడు అఖిల్ అక్కినేని కూడా ఈలలతో తెగ ఎంజాయ్ చేసిన దృశ్యాలు ఆకట్టు కుంటున్నాయి. అలాగే చే శోభిత పెళ్లిపై ఒక ప్రకటన చేశారు నాగార్జున. ట్విటర్లో ఒక భావోద్వేగ సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. "ఈ రోజు మాపై కురిపించిన అమితమైనఆశీర్వాదాలకు, ప్రేమకు కృతజ్ఞతలు. శోభిత-చే కలిసి ఈ అందమైన అధ్యాయాన్ని ప్రారంభించడం ఒక ప్రత్యేకమైన , భావోద్వేగ క్షణం. నా ప్రియమైన చేకి అభినందనలు, డియర్ శోభిత- మా కుటుంబంలోకి స్వాగతం. నువ్వు ఇప్పటికే మా జీవితాల్లో ఎనలేని సంతోషాన్ని నింపావు" అంటూ ట్వీట్ చేయడం విశేషం. పసుపు బట్టల్లో , శోభిత , చే పెళ్లి కళ్ల ఉట్టిపడేలా కనిపిస్తున్న ఫోటోలు వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. -
సెకండ్ హ్యాండ్ అంటున్నారు.. బాధపడుతున్న సమంత..
-
దయచేసి నా భర్తను హాస్పిటల్ లో చూపించండి.. ఇంటూరి రవికిరణ్ భార్య ఎమోషనల్..
-
నాన్న కూచులు
వెనకటి తరంలో పిల్లలకు తండ్రి దగ్గర అంత చనువుండేది కాదు. వారికి ఏం కావాలన్నా అమ్మతో రికమెండ్ చేయించుకోవాల్సిందే. నాన్న వస్తున్నాడంటే ఎక్కడి ఆటలు అక్కడ ఆపేసి వచ్చి పుస్తకాలు ముందరేసుకుని చదువుతున్నట్టు యాక్షన్ చేసేవాళ్లు. అయితే ఆ తరం మారిపోయింది. ఇప్పుడు పిల్లలు అమ్మ కన్నా నాన్నతోనే ఎక్కువ చనువుగా ఉంటున్నారు. తమకు కావలసిన వాటిని నాన్నతోనే అమ్మకు రికమెండ్ చేయించుకుంటున్నారు. మీ పిల్లలు కూడా అలాగే చేస్తుంటారా?నాన్నలుప్రాక్టికల్చాలా విషయాలలో అమ్మలకన్నా నాన్నలు ఎక్కువ ప్రాక్టికల్గా ఉంటారు.ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. చిన్నారుల చిన్ని జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యలు, సవాళ్లనుప్రాక్టికల్గా ఏ విధంగా చూడాలో వివరిస్తూనే, వాటిని అధిగమించేందుకు సాయం చేస్తారు. అంతేకాదు, దేనినైనా రెండు వైపుల నుంచి ఏ విధంగా ఆలోచించాలో తండ్రులే పిల్లలకు నేర్పుతారు. నాన్న దగ్గరుంటే నిశ్చింతపిల్లలకు ఏమైనా సమస్య అంటే తోటి పిల్లల నుంచి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ‘మా నాన్నతో చెబుతా’ అని వారికి వార్నింగిస్తుంటారు. ఎందుకంటే వాళ్ల దృష్టిలో నాన్నే హీరో. సర్వశక్తిమంతుడు. నాన్నకు చెబితే ఏ పని అయినా తేలిగ్గా అయిపోతుందని, దానికి తిరుగుండదని వాళ్ల భావన. అందుకే నాన్న వాళ్లకొక నిశ్చింత.ఆటలు... పాటలుచాలామంది నాన్నలు ... పిల్లలతో ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ చాలా సరదాగా ఉంటారు. కొత్త కొత్త ఇండోర్, ఔట్డోర్ గేమ్స్ ఆడడంలో మెలకువలు చెప్పి సాయం చేస్తుంటారు. అమ్మలతో పోల్చితే ఆటల విషయంలో ఆంక్షలు తక్కువ. తమని ఒంటరిగా పంపడానికి భయపడుతుంటే స్కూల్లో టీచర్లు ప్లాన్ చేసే టూర్లకు, ఎక్స్కర్షన్లకు అమ్మలకు నచ్చజెప్పి ఒప్పించి మరీ వాళ్లకు కావలసినంత పాకెట్ మనీ ఇచ్చి సాగనంపుతారు. ఆంక్షలు తక్కువఅమ్మతో పోల్చితే నాన్న దగ్గర ఆంక్షలు తక్కువ... ఉదాహరణకు అబ్బబ్బా.. ఆ షూస్ విప్పకుండా అలా లోపలికి వచ్చేస్తావెందుకు... ఛీ.. యూనిఫారమంతా ఇంకు పూసేసుకున్నావు... దీనిని బాగు చేసేదెలా? తీసుకెళ్లిన ఫుడ్డంతా బుద్ధిగా తినకపోయావో.... ఇంకేం లేదు.. ఈ ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వస్తే ఊరుకోను... ఇటువంటి ఆంక్షలు నాన్నల దగ్గర ఉండవు.నాన్నంటే ఓ సాహసంపిల్లలకు నాన్నంటే నిజంగా ఓ అడ్వెంచర్. గోడలెక్కడం, చెట్లెక్కడం, గంతులు పెట్టడం... సైకిల్ మీద సవారీలు, కారు, బైకు డ్రైవింగ్ నేర్పించడం... ఇలా కొత్తగా ఏదైనా చెయ్యడం... లాంటివాటికి నో చెప్పక సై అంటారు. తండ్రితో తీపి జ్ఞాపకాలుసెలవులొస్తే బయటికి తీసుకెళ్లడం, ఆటలు ఆడించడం, సినిమాలకు, జూలకి తీసుకెళ్లడం, కోరిన చోటుకు తీసుకెళ్లి దిగబెట్టి రావడం... ఇలాంటి జ్ఞాపకాలెన్నో తండ్రులతో బిడ్డలకు ముడిపడి ఉంటాయి. అందువల్ల నాన్నంటే వాళ్లకు చాలా ఇష్టం.నాన్న... నవ్వురస భరితంచాలామంది తండ్రులు పిల్లలతో హాయిగా జోకులు వేస్తుంటారు. లేదంటే చిన్న చిన్న కామెడీ సీన్లు కూడా సృష్టిస్తుంటారు. ఏం చేసినా, పిల్లలు హాయిగా నవ్వుకునేలా చేస్తారు. గంభీరంగా ఉన్న ఇంటి వాతావరణాన్ని తమ జోకులు, కామెడీ సీన్లతో తేలిగ్గా మార్చేసి, నవ్వుల పువ్వులు విసురుతారు. రోల్ మోడల్స్పిల్లలందరికీ నాన్నలే వాళ్ల రోల్ మోడల్. జీవితంలో ఎదురయే సమస్యలు, సవాళ్లను తట్టుకుని దృఢంగా ఎదిగే నాన్నలు తమను తాము రోల్మోడల్స్గా మలచుకుంటారు. పిల్లలతో గాఢానుబంధాన్ని ఏర్పరుచుకుంటూనే, బాధ్యతలను సక్రమంగా ఎలా నెరవేర్చుకోవాలో పిల్లలకు నేర్పకనే నేర్పుతారు. ఇక్కడ మనం నాన్న గురించి ఎన్నో విషయాలు చెప్పుకున్నాం... అలా అని అందరి నాన్నలూ అలా ఉండకపోవచ్చు. ఉండాలనీ ఏం లేదు. కాకపోతే పూర్వం కన్నా పరిస్థితులలో మార్పులు వచ్చాయి. ఇప్పటికాలం పిల్లలు నాన్నలతో ఫ్రీగా ఉంటున్నారు. నాన్నలు కూడా గాంభీర్యాన్ని విడిచిపెట్టేశారు. నాన్నలతో గాఢమైన బంధం ఉండే కూతుళ్లు ఎందరో ఉన్నారు. అలాగే అమ్మలను రోల్మోడల్స్లా తీసుకునే కొడుకులూ ఉన్నారు. తండ్రి వస్తుంటే... చేస్తున్న చిలిపి పనులు ఆపేసి తటాలున తలుపు చాటున దాక్కునే పిల్లలు ఇప్పుడు దాదాపు ఎక్కడా కనిపించట్లేదు. తండ్రులు కూడా పిల్లలకేసి ఉరిమి చూడటం లేదు. పిల్లల అల్లరిని ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేమతో ్రపోత్సహిస్తున్నారుభారతీయ యోగాకు పెద్దపీట అమెరికా వ్యాప్తంగా దాదాపు 6,000 భారతీయ రెస్టారెంట్లు ఉన్నాయి. గత ఏడాది ఇవి అమెరికా సంయుక్త దేశాల రెస్టారెంట్ మార్కెట్లో దాదాపు 1 శాతం వాటాను ఆక్రమించడం విశేషం. ఇక మిషెలిన్ గైడ్ రెస్టారెంట్లలో భారతీయ రుచులను కోరుకుంటున్న వారు మూడు శాతంపైనే ఉన్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.భారతీయ యోగా... యోగులు, రుషులు మనకందించిన అపూర్వ విజ్ఞానమిది. ఇప్పుడీ విజ్ఞానం విదేశీయులను విస్మయపరుస్తోంది. మానసిక, శారీరక ఆరోగ్యాల సాధనకు దీన్ని మించిన సాధనం లేదని పాశ్చాత్యులు భావిస్తున్నారు. 2023 నాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న మొత్తం యోగా స్టూడియోల సంఖ్య 36,000 పైమాటే!అమెరికాలో లాయర్లో 1.3 శాతం మంది, జర్నలిస్టుల్లో దాదాపు మూడుశాతం మంది భారతీయ సంతతికి చెందినవారే.డాలర్లు కురిపిస్తున్న ఇండియన్ సినిమాలు2015 నుంచి 2023 మధ్య వివిధ బాషలకు చెందిన 96 భారతీయ సినిమాలు అమెరికాలో విడుదలయ్యాయి. నార్త్కరోలినాప్రాంతంలో ఇండియన్ సినిమాకు మంచి మార్కెట్ ఉంది. ఈ కారణంగానే ఇక్కడ విడుదలైన ఒక్కో సినిమా దాదాపు ఒక మిలియన్ డాలర్లకు తక్కువ వసూళ్లను రాబట్టలేదు. మొత్తంగా చూస్తే వీటివిలువ 340 మిలియన్ల అమెరికన్ డాలర్లుస్పెల్ బీ లోనూ మన కూనలదే హవాస్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో భారతీయ సంతతి విద్యార్థుల హవా కొనసాగుతోంది. ఆ ఏడాది విజేత బృహత్ సోమ సహా భారతీయ సంతతి విద్యార్థులు ఈ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. ఈ పోటీల్లో 2000 నుంచి 2023 వరకూ మొత్తం 34 మంది విజేతలుగా నిలవగా వారిలో 28 మంది మన విద్యార్థులే కావడం మనందరికీ గర్వకారణం. -
యువతపై కృత్రిమ మేధ ప్రభావం!
అమెరికాలో ఓ యువకుని జీవితంలో అలాంటి ఘటనే జరిగింది. తన కొడుకు ఆత్మహత్యకు ఏఐ చాట్బాట్ కారణమంటూ ఫ్లోరిడాలో ఓ తల్లి కోర్టుకెక్కారు. తన 14 ఏళ్ల కొడుకు చాట్బాట్తో మానసికంగా అనుబంధాన్ని ఏర్పరుచుకున్నాడని, దాన్నుంచి భావోద్వేగపూరితమైన మెసేజ్ వచ్చిన కాసేపటికే ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఆరోపించారు. కృత్రిమ మేధ యాప్లతో పొంచి ఉన్న కొత్తతరహా పెను ప్రమాదాలు, ఆయా యాప్లపై ఇంకా సరైన నియంత్రణ లేకపోవడాన్ని ఈ అంశం మరోసారి తెరపైకి తీసుకొచి్చంది. పట్టభద్రుడైన థెరపిస్ట్లా ప్రభావం చూపింది: తల్లి 14 ఏళ్ల సెవెల్ సెట్జర్ తరచుగా ‘క్యారెక్టర్.ఏఐ’అనే చాట్బాట్ యాప్ను ఉపయోగిస్తున్నాడు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’పాత్ర డేనెరిస్ టార్గేరియన్ను పోలిన పాత్రను సృష్టించుకుని సంభాషిస్తున్నాడు. చాట్బాట్తో వర్చువల్ సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడు. క్యారెక్టర్.ఏఐ చాట్బాట్ టీనేజర్ అయిన తన కొడుకును లక్ష్యంగా చేసుకుందని, అతను ఆత్మహత్య ఆలోచనలను వ్యక్తం చేసిన తర్వాత ఆ యాప్ అదేపనిగా ఆత్మహత్య అంశాన్ని లేవనెత్తి పిల్లాడు ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొలి్పందని అతని తల్లి అమెరికాలోని ఓర్లాండోలో ఫిర్యాదుచేశారు. చాట్బాట్ తన పిల్లాడిపై ఒక పట్టభద్రుడైన థెరపిస్ట్గా తీవ్ర ప్రభావం చూపించిందని ఆమె ఆరోపించారు. చనిపోవడానికి ముందు ఏఐతో జరిగిన చివరి సంభాషణలో సెవెల్ చాట్బాట్ను ప్రేమిస్తున్నానని, ‘మీ ఇంటికి వస్తాను’అని చెప్పాడని దావాలో పేర్కొన్నారు. తన కుమారుడి మరణంలో క్యారెక్టర్.ఏఐ చాట్బాట్ ప్రమేయం ఉందని తల్లి మేగన్ గార్సియా ఆరోపించారు. మరణం, నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా మానసిక క్షోభను కలిగించినందుకు నిర్దిష్ట నష్టపరిహారాన్ని కోరుతూ గార్సియా దావా వేశారు. గూగుల్పై దావా ఈ దావాలో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆగస్టులో క్యారెక్టర్.ఏఐలో గూగుల్ భారీ స్థాయిలో వాటాలను కొనుగోలుచేసింది. గూగుల్ ఆగమనంతో ఈ యాప్ అంకురసంస్థ మార్కెట్ విలువ ఏకంగా 2.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయిఏత క్యారెక్టర్.ఏఐ అభివృద్ధిలో తమ ప్రత్యక్ష ప్రమేయం లేదని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే తమ యాప్ వినియోగదారుల్లో ఒకరిని కోల్పోవడం హృదయవిదారక విషయమని సంస్థ తన ‘ఎక్స్’ఖాతాలో ఒక ప్రకటన చేసింది. సెవెల్ కుటుంబానికి సంతాపం తెలిపింది. ‘కృత్రిమ మేధ అనేది నిజమైన వ్యక్తి కాదు. ఈ విషయాన్ని వినియోగదారులకు మరోసారి స్పష్టంగా గుర్తుచేస్తున్నాం. ఈ మేరకు డిస్క్లైమర్ను సవరిస్తున్నాం. భద్రతను పెంచడానికి అదనపు ఫీచర్లను జోడిస్తాం’అని సంస్థ తెలిపింది. అయితే చాట్బాట్ కారణంగా వ్యక్తి మరణం అమెరికాలో పెద్ద చర్చను లేవనెత్తింది. ఇలాంటి కృత్రిమమేథ కారణంగా ఎవరికైనా హాని జరిగితే దానికి బాధ్యులు ఎవరు?. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అన్న చర్చ మొదలైంది. ఇతర నియంత్రణ చట్టాల వంటి సెక్షన్ 230 అనేది కృత్రిమ మేథకు వర్తిస్తుందా అనే అంశమూ డిజిటల్ నిపుణుల చర్చల్లో ప్రస్తావనకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మాటలు రావట్లేదు.. ఆయన మృతిపై 'దేవర' నటి ఎమోషనల్ (ఫొటోలు)
-
Disha Patani: నా జీవితంలో ఆనందాన్ని నింపావ్.. కల్కి హీరోయిన్ ఎమోషనల్ (ఫోటోలు)
-
జైలు జీవితంపై సిసోడియా భావోద్వేగ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:లిక్కర్స్కామ్ కేసులో జైలులో ఉన్నప్పటి అనుభవాలను ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్సిసోడియా పార్టీ నేతలతో పంచుకున్నారు. ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం(సెప్టెంబర్22) జరిగిన ‘జనతాకీ అదాలత్’ కార్యక్రమంలో పాల్గొన్న సిసోడియా తన జైలు అనుభవాలు వెల్లడించారు.‘జైలులో ఉన్నపుడు అనేక బెదిరింపులు వచ్చాయి. జైలులోనే చంపేస్తామన్నారు. కేజ్రీవాల్ మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చారని నాకు చెప్పారు. మీరు కూడా కేజ్రీవాల్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని కోరారు. అలా చెబితే మీరు కేసు నుంచి బయటపడొచ్చన్నారు. పార్టీ మారీ బీజేపీలో చేరాలని సూచించారు.జైలులో ఉన్న సమయంలో ఎన్ఫోర్స్మెంట్డైరెక్టరేట్(ఈడీ) నా బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేసింది. కొడుకు స్కూల్ ఫీజు కట్టేందుకు కూడా అడుక్కోవాల్సి వచ్చింది. ఎన్ని చేసినా లక్ష్మణున్ని రాముడి నుంచి ఏ రావణుడు వేరు చేయలేడు. కేజ్రీవాల్ నా రాజకీయ గురువు’అని సిసోడియా అన్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీష్సిసోడియా ఏకంగా ఏడాదిన్నరపాటు తీహార్జైలులో ఉన్నారు. ఇటీవలే ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు. ఇదే కేసులో నిందితులు కేజ్రీవాల్, కల్వకుంట్ల కవితకు కూడా సుప్రీంకోర్టులోనే ఇటీవలే బెయిల్ మంజూరైంది. ఇదీ చదవండి..ప్రధాని మోదీ నాపై కుట్ర పన్నారు: కేజ్రీవాల్ -
16 ఏళ్లయింది.. ఎన్టీఆర్ కోసం తెగ ఆరాటపడ్డ యాంకర్.. ఇన్నాళ్లకు! (ఫొటోలు)
-
పూజా కన్నన్ పెళ్లిలో సాయిపల్లవి ఎమోషనల్ మూమెంట్స్ (ఫోటోలు)
-
Deepthi Sunaina: కన్నీళ్లు పెట్టుకున్న బిగ్బాస్ బ్యూటీ.. అయినా.. (ఫోటోలు)
-
ఐఫోన్ కోసం బ్లాక్మెయిల్.. ఆ తల్లి కళ్లలో నీళ్లు తిరిగే ఉంటాయి!
పిల్లలు కోరింది కాదని అనకుండా ఇచ్చే తల్లిదండ్రులను చాలామందినే చూస్తుంటాం. కానీ, తమ తల్లిదండ్రుల స్తోమతను బట్టి నడుచుకునే పిల్లలే ఈరోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తున్నారు. అయితే.. ఇక్కడో పుత్రరత్నం గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. రెక్కలు ముక్కలు చేసుకుని రోజంతా కష్టపడి తనని పోషిస్తుందన్న సోయి మరిచి.. కన్నతల్లిని ఐఫోన్ కోసం బ్లాక్మెయిల్ చేశాడా ఘనుడు.ఐఫోన్ కోసం మూడు రోజులపాటు అన్నం తినకుండా తల్లిని బ్లాక్మెయిల్ చేశాడు ఆ కొడుకు. దీంతో కన్నపేగు తల్లడిల్లిపోయింది. గుడి ముందు పూలు అమ్ముకుని జీవన సాగించే ఆమె.. కూడబెట్టిన డబ్బునంతా కొడుకు చేతిలో పెట్టింది. అయితే డబ్బు కొడుకు చేతికి ఇస్తే.. దారి తప్పే అవకాశం ఉందని ఆమె భయపడింది. కొడుకు కూడా వెళ్లి ఫోన్ షోరూంలో ఐఫోన్ కొనిచ్చింది. ఆ టైంలో వీడియో రికార్డు చేశారు అక్కడే ఉన్న సిబ్బంది. అయితే, ఆ కొడుకు కళ్లలో ఆనందం కంటే.. తన భావోద్వేగాన్ని అణుచుకుంటూ కన్నీళ్లను దిగమింగుకోవడం వీడియోలో హైలైట్ అయ్యింది. ఎంతైనా తల్లి మనసు కదా.. అలాగే ఉంటుందిలేండి!. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు ఖచ్చితంగా తెలియనప్పటికీ.. వీడియో వైరల్ కావడంతో నెట్టింట చర్చ నడుస్తోంది. మరి ఈ ఘటనపై మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం చెప్పేయండి.This nithalla boy stopped eating food and was demanding iPhone from her mother.His mother finally relented and gave him money to buy iPhone. She sells flowers outside a mandir.Too much love will always destroy children. Parents should know where to draw the line.This is… pic.twitter.com/govTiTKRAF— Incognito (@Incognito_qfs) August 18, 2024 -
నిత్యా మీనన్ ఎమోషనల్.. ఈ నేషనల్ అవార్డ్ మా నలుగురిది (ఫొటోలు)
-
భార్యతో టీ తాగుతూ.. మనీష్ సిసోడియా ఎమోషనల్
-
అంతటి నొప్పిని ఎలా తట్టుకుందో.. కంటతడి పెట్టిస్తున్న కీర్తి సురేష్ మాటలు
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తన స్నేహితురాలిని గుర్తు చేసుకుని చాలా ఎమోషనల్ అయింది. ఈమేరకు సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ చేసింది. ఇటీవల బ్రెయిన్ ట్యూమర్తో మరణించిన తన బెస్ట్ ఫ్రెండ్ మనీషా గురించి కీర్తి పలు విషయాలను పంచుకుంది. తన స్నేహితురాలితో ఉన్న బంధాన్ని సుదీర్ఘ పోస్ట్తో తెలిపింది. ఆసుపత్రిలో మనీషాను చూసినప్పుడు ఎలా ఏడ్చిందో గుర్తుచేసుకుంది. అలా తన స్నేహితురాలి గురించి షేర్ చేసిన పోస్టు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.కీర్తి సురేష్ ప్రాణ స్నేహితురాలు మనీషా కొద్దిరోజుల క్రితమే బ్రెయిన్ ట్యూమర్తో చనిపోయింది. ఇదే విషయాన్ని ఆమె పుట్టినరోజు సందర్భంగా కీర్తి ఇలా గుర్తు చేసుకుంది. ' కొన్ని వారాలుగా నేను చాలా బాధను అనుభవిస్తున్నాను. నా చిన్ననాటి స్నేహితురాలు మనీషా ఇంత త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లుతుందని అనుకోలేదు. ఈ సంఘటన నమ్మశక్యంగా లేదు. 21 ఏళ్ల వయసులో తీవ్రమైన బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న ఆమె గత నెల వరకు దాదాపు 8 ఏళ్ల పాటు పోరాడింది. గతేడాది నవంబర్లో ఆమెకు మూడో సర్జరీ జరిగింది. అంతటి బాధను తట్టుకునే శక్తి ఆమెకు ఎలా వచ్చిందో.. అలాంటి సంకల్ప శక్తి ఉన్నవారిని నేను ఇప్పటి వరకు చూడలేదు. కానీ ఒక్కోసారి నొప్పిని భరించలేకపోతున్నానంటూ ఆ బాధను తట్టుకుంటూనే కన్నీళ్లు పెట్టుకునేది. ఆ సమయంలో ఆసుపత్రి కారిడార్ వద్ద నేను కూడా ఏడ్చేశాను. కన్నీటితో నిండిన ఆ సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఈ ప్రపంచాన్ని వదిలేసి పోయింది. ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు నేను చివరిసారిగా కలిశాను. చిన్నవయసులోనే ప్రాణాలు కోల్పోయిన నా స్నేహితురాలు భవిష్యత్పై ఎన్నో కలలు కనేది. బతాకాలనే ఆశతో నా మనీషా చివరి శ్వాస వరకు పోరాడింది. కానీ దేవుడు దయ చూపలేదు. ఆమె దూరమై సరిగ్గా నెలరోజులు అవుతుంది. తన గురించి ఆలోచించకుండా ఒక్కరోజు కూడా గడవడం లేదు. మనీషా లేకుండానే తన పుట్టినరోజు జరుపుకోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.' అని తన ప్రాణస్నేహితురాలి మరణం గురించి కీర్తి చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
‘నువ్వెక్కడున్నా నా మనసంతా నీ చుట్టే’.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం! (ఫొటోలు)
-
నీతా అంబానీ ప్రసంగం: తండ్రీ కూతుళ్ల భావోద్వేగం
బిలియనీర్ ముఖేష్ అంబానీ, నీతా దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ , రాధికా మర్చంట్ వివాహవేడుకలు ఘనంగా ముగిసాయి. ప్రతీ వేడుకను ఘనంగా నిర్వహించడం మాత్రమే కాదు, దేశ విదేశాలనుంచి వచ్చిన అతిథులెవ్వరికీ ఏలోటూ లేకుండా చాలా శ్రద్ధ వహించి, శభాష్ అనిపించుకున్నారు నీతా అంబానీ. పెళ్లిలో అత్యంత కీలకమైందీ, ప్రతీ గుండెను ఆర్ద్రం చేసే సన్నివేశంలో కూడా నీతా తన పెద్దరికాన్ని చాటుకున్నారు. రాధిక కన్యాదానం సమయంలో నీతా ఉద్వేగ ప్రసంగం నెట్టింట వైరల్గా మారింది.Nita Ambani explains the broader significance of Kanyadaan as a union where two families come together, one gaining a son and the other a daughter. Speaking just before the Kanyadaan ceremony during Anant and Radhika's wedding, Mrs. Ambani underscores the importance of daughters… pic.twitter.com/URjchATLTf— Filmfare (@filmfare) July 16, 2024కొత్తకోడలు రాధిక మర్చంట్ను తన కోడలిగా ఆనందంతో కుటుంబంలోకి స్వాగతించడమే కాకుండా, రాధిక తల్లిదండ్రులు వీరేన్ మర్చంట్ , శైలా మర్చంట్లకు ఆమె భరోసా ఇచ్చిన తీరు విశేషంగా నిలిచింది. ‘‘కూతుర్ని ఇవ్వడం అంత తేలిక కాదు. తమ గుండెల్లో దాచుకుని పెంచుకున్న కూతుర్ని మెట్టింటికి పంపడం, ఆ భారాన్ని భరించడం కష్టం. నేనూ ఒక కూతురిని, ఒక కూతురికి తల్లిని , అత్తగారిని. రాధికను మా కూతురిలా చూసుకుంటాం. ఆడపిల్లలే పెద్ద వరం. మన ఆడపిల్లలు మన ఇంటిని స్వర్గంగా మారుస్తారు. మీరు మీ కుమార్తెను మాకు ఇవ్వడం కాదు, మరో కొడుకును, కొత్త కుటుంబాన్ని పొందారంటూ వారికి ధైర్యం చెప్పారు. అలాగే మీకు అనంత్ ఏంతో, మాకు రాధిక కూడా అంతే’’ అంటూ రాధిక పేరెంట్స్ను ఊరడించారు. ఈ సందర్భంగా హిందూ వివాహ ఆచారాల్లో కన్యాదానం అంటే ఏమిటో, అమ్మాయిని లక్ష్మితో సమానంగా భావిస్తారంటూ కుమార్తె ప్రాముఖ్యత ఏంటో ప్రపంచ అతిథుల ముందు నీతా అంబానీ వివరించారు. దీంతో నూతన వధువు రాధిక, ఆమె తల్లితండ్రులతోపాటు అక్కడున్న వారంతా భావోద్వేగానికి లోనయ్యారు. నీతా అంబానీ వాగ్దానం‘‘ముఖేష్, నేను మా కుమార్తెగా, అనంత్ సహచరిగా, ఇషా, ఆనంద్,, శ్లోక, ఆకాష్ మాదిరిగానే రాధికను కూడా గుండెల్లో పెట్టుకుని ప్రేమిస్తాం, రక్షిస్తామని వాగ్దానం చేస్తున్నాం. పృథ్వీ, ఆదియా, కృష్ణ, వేదాలకు మంచి అత్త, పిన్ని దొరికింది. నా ప్రియమైన రాధికను హృదయపూర్వకంగా మా ఇంట్లో అతి పిన్న వయస్కురాలిగా శ్రీమతి రాధిక అనంత్ అంబానీగా స్వాగతిస్తున్నాం’’ అంటూ చోటీ బహూను అందరి కరతాళ ధ్వనుల మధ్య అంబానీ కుటుంబంలోకి ఆమెను ఆహ్వానించారు. జామ్ నగర్లో అనంత్ అంబానీ-రాధికకు ఘనంగా ఆహ్వానం పలుకుతున్న వీడియో నెట్టింట్ సందడి చేస్తోంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) కాగా జూలై 12న అనంత్ అంబానీ తన చిరకాల ప్రేయసి రాధికా మర్చంట్తో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో 3 రోజుల పాటు వివాహ వేడుకలన్నీ అట్టహాసంగా జరిగాయి. అనంతరం అనంత్, రాధిక దంపతులకు శుభప్రదమైన ఆశీర్వాద కార్యక్రమం మంగళ్ ఉత్సవ్ లేదా గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు ఈ గ్రాండ్ వెడ్డింగ్కు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు, దేశ విదేశాలకు చెందిన క్రీడా, రాజకీయ, వ్యాపార దిగ్గజాలు హాజరయ్యారు. -
బాలిక ఆచూకీ ఆలస్యం కావడంతో బాలిక తల్లిదండ్రుల ఆవేదన
-
నా బాయ్ఫ్రెండ్ మోసం చేశాడు!
తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన నటి నివేద పేతురాజ్. తమిళంలో తిరునాళ్ కూత్తు చిత్రంతో కథానాయకగా పరిచయమైన ఈమె ఆ తర్వాత టిక్ టిక్ టిక్, సంఘతమిళన్ వంటి పలు చిత్రాల్లో నటించారు. అలా విజయ్ సేతుపతి, విజయ్ ఆంటోని వంటి హీరోల సరసన నటించినా ఇప్పటికీ స్టార్ ఇమేజ్ కోసం పోరాడుతూనే ఉన్నారు. అలాగే తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో వెబ్ సిరీస్లలో నటిస్తున్నారు. ఈమె నటించిన పరువు అనే వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తమిళంలో కొత్త చిత్రాలకు కమిట్ అయినట్టు చెబుతున్న నివేద పేతురాజ్ ఇటీవల కారులో వెళుతూ ఒక ట్రాఫిక్ పోలీస్తో గొడవ పడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే అది తాను నటిస్తున్న వెబ్ సిరీస్ ప్రమోషన్లో ఒక భాగం అని ఆ తర్వాత తెలిసింది. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో ఇలా పేర్కొన్నారు. తన నెగెటివ్ ఆలోచనలన్నీ వాస్తవ రూపం దాల్చుతున్నాయని చెప్పారు. ఒకరోజు తన బాయ్ఫ్రెండ్ తన మోసం చేశాడని ఊహించుకున్నానన్నారు. ఆ తర్వాత అదే విధంగా జరిగిందన్నారు .తన బాయ్ఫ్రెండ్ మరెవరినో తీసుకుని వెళ్లిపోయాడని చెప్పారు. లేకపోతే ప్రస్తుతం తాను వాడుతున్న కారు నుంచి భవిష్యత్తులో కొనుక్కు పోయే కారు వరకు తన నెగటివ్ ఆలోచనలలేనని నటి నివేద పేతురాజు పేర్కొన్నారు. కాగా ఈ 32 ఏళ్ల పరువాలగుమ్మలో మంచి నటినే కాకుండా బైక్ రేసర్ క్రీడాకారిణి కూడా ఉన్నారన్నది గమనార్హం. -
‘ఆనాటి సిగ్గరే..నేటి లెజెండ్!’ బుమ్రాపై పొరుగింటి ఆంటీ భావోద్వేగ పోస్ట్ వైరల్
ఉత్కంఠభరితంగా బార్బడోస్లో జరిగిన మ్యాచ్లో టీ-20 ప్రపంచ కప్ను టీమిండియా దక్కించుకుంది. దీంతో టీమిండియా ఆటగాళ్లపై అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధానంగా సూర్యకుమార్యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ హీరోలుగా నిలిచారు. అయితే జస్ప్రీత్ బుమ్రా తల్లి సన్నిహితురాలు, పొలిటికల్ జర్నలిస్టు చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఒకటి వైరల్గా మారింది.ప్రపంచ కప్ ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన ప్రదర్శనకు స్టార్ క్రికెటర్పై నా హీరో అంటూ తన ప్రేమను అభిమానాన్ని చాటుకున్నారు బుమ్రా తల్లి దల్జీత్కి బెస్ట్ ఫ్రెండ్ దీపాల్ త్రివేది. ‘‘ నాకున్న క్రికెట్ పరిజ్ఞానం శూన్యం.. విరాట్ కోహ్లీ అనుహ్క భర్తగా తెలుసు. అతని డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించినప్పుడు నాకు నచ్చుతుంది. ఒకప్పుడు సిగ్గరి.. ఇప్పుడు లెజెండ్' అంటూ బుమ్రాపై సుదీర్ఘ భావోద్వేగ పోస్ట్ పెట్టారు దీపాల్ త్రివేది. ఇందులో బుమ్రాతో తనకున్న అనుబంధాన్ని, అతడి పడ్డ కష్టాలను వివరంగా రాసుకొచ్చారు. అంతేకాదు బుమ్రా పుట్టినపుడు తొలుత చేతుల్లోకి తీసుకున్నఅదృష్టవంతురాల్ని తానే అంటూ సంతోషాన్ని ప్రకటించారు. అప్పుడే పుట్టిన బిడ్డను తాకడం అదే మొదటిసారి. అప్పటికే కుమార్తె ఉన్నప్పటికీ అది పెద్దగా గుర్తులేదు. బిడ్డ సన్నగా, బలహీనంగా ఉన్నాడు .. ఆ క్షణాలు ఇప్పటికీ గుర్తు అన్నారామె.My cricket knowledge is Zero. I know Virat Kohli as Anushka's husband. He is so pleasant and I like when he tries to dance. But this (long) post is about my hero. One day in December 1993, when my salary was less than Rs 800 a month, my best friend and next door neighbour… pic.twitter.com/uvWQmmAwwN— Deepal.Trivedi #Vo! (@DeepalTrevedie) June 30, 2024అలాగే చిన్నప్పటినుంచీ బుమ్రా పట్టుదల, సంకల్పం గురించి వివరించారు. నిజంగా మా స్టోరీ బాలీవుడ్ సినిమా కంటే తక్కువేమీకాదు. బుమ్రా తండ్రి జస్బీర్ సింగ్ మరణించిన తరువాత తల్లి రోజుకు కనీసం 16-18 గంటలు పనిచేస్తూ చాలా కష్టపడేది. పొరుగువారిగా, కష్టాలు, నష్టాలు అన్నీ పంచుకున్నాం. ఒక చిన్న ప్లాస్టిక్బాల్తో బుమ్రా ఎపుడూ క్రికెట్ ఆడుతూ ఉండేవాడనీ, తనకు మాత్రం దల్జీత్ ఇల్లు స్వర్గధామం లాంటిదని తెలిపారు. ఒకసారి తన ఇంక్రిమెంట్ డబ్బులతో బుమ్రాకు విండ్చీటర్ (జాకెట్) కొనిచ్చిన ఏకైక బహుమతిని కూడా దీపాల్ గుర్తు చేసుకున్నారు. జస్ప్రీత్ బుమ్రాకు గర్వమనేదే లేదు. వినయం ఏమాత్రం తగ్గలేదు. అతడ్ని చూసి ప్రతీ భారతీయుడు గర్వపడాలి. అతని నుండి నేర్చుకోవాలంటూ బుమ్రాపై ప్రశంసలు కురిపించారు. -
కొడుకు గౌతమ్ తొలి స్టేజీ ఫెర్ఫార్మెన్స్.. మహేశ్ బాబు భార్య ఎమోషనల్ (ఫొటోలు)
-
కరీంనగర్ నేలను తాకి ప్రణమిల్లిన బండి సంజయ్
-
ప్రమాణస్వీకారానికి రాలేకపోతున్నా
-
దాతల సాయంతో గెలుపు.. కాంగ్రెస్ అభ్యర్థి భావోద్వేగం
అహ్మదాబాద్: లోక్సభ ఎన్నికల ఫలితాలు కొందరికి విజయాన్ని మరికొందరికి అపజయాన్ని మిగిల్చాయి. అయితే విజయం కొందరిని అంతులేని ఆనందాన్ని ఇవ్వడంతో పాటు భావోద్వేగానికి గురిచేస్తుంది. ఇందుకు గుజరాత్ బనస్కాంతా నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి గెనిబెన్ థాకూర్ గెలుపే నిదర్శనం.తాను గెలిచినట్లు తెలియగానే థాకూర్ కౌంటింగ్ సెంటర్ వద్ద తీవ్ర భావోద్వేగానికి గురై ఒక్కసారిగా ఆమె తనవారిని పట్టుకుని ఏడ్చేశారు. ఇందుకు కారణం లేకపోలేదు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హవా నడిచిన గుజరాత్లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే కావడం ఒకటి. ఇదే కాకుండా ఈమె తన ఎన్నికల ప్రచారానికి కావాల్సిన నిధులను క్రౌడ్ సోర్సింగ్ ద్వారా దాతల నుంచి సేకరించం మరొకటి. ఏది ఏమైనా కొందరికి ఎన్నికల్లో గెలుపు సాధారణమే అయినప్పటికీ గెనిబెన్ లాంటి వాళ్లకు మాత్రం విజయం అసాధారణమనే చెప్పొచ్చు. Geniben Thakor of Congress won historic seat in Banaskantha, Gujarat. She had to crowdsource funds to contest.Such stories needs to be cherished. pic.twitter.com/MvZtlxtmqK— Nehr_who? (@Nher_who) June 4, 2024 -
KKR Wins IPL ‘హ్యాపీ నా పప్పా’: అటు పెద్దోడు, ఇటు చిన్నోడు : తండ్రీ కూతుళ్ల ఎమోషనల్ వీడియో
ఐపీఎల్-2024 టైటిల్ను కోల్కతా నైట్ రైడర్స్ జట్టు చేజిక్కించుకుంది. 10 ఏళ్ల తర్వాత ట్రోఫీని గెల్చుకోడంతో కేకేఆర్ కో-ఫౌండర్ షారుఖ్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా మైదానంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన విజువల్స్నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.An emotional moment between #ShahRukhKhan and #SuhanaKhan after marvelous victory of #KKRpic.twitter.com/yO6nBBgvo1— Suhana Khan (@SuhanaKhanClub) May 26, 2024ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించిన షారుఖ్ ప్యామిలీ, పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టైటిల్ను అందుకున్న ఆనంద క్షణాల్లో మునిగి తేలాయి. ఈ సందర్భంగా షారుఖ్ ముద్దుల తనయ సుహానా ఖాన్ పరుగున వచ్చి ‘‘మీరు సంతోషంగా ఉన్నారా’’అడిగింది. దీంతో సూపర్ స్టార్ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ తండ్రీ- కూతుళ్ల ఆనంద క్షణాలు అటు ఫ్యాన్స్ను, ఇటు నెటిజనులు సంతోషంలో ముంచేశాయి.Suhana asking Shah “Are you happy” and the way AbRam and Aryan came to hug their papa @iamsrk … I can’t help my tears 😭💜pic.twitter.com/VjCxU5Nwsz— Samina ✨ (@SRKsSamina_) May 26, 2024ఆ తరువాత కాసేపటికే షారుఖ్ చిన్న కుమారుడు అబ్రామ్, తండ్రీ-కూతురు ద్వయం పరస్వరం గట్టిగా కౌగిలించుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతలోనే పెద్ద కుమారుడు ఆర్యన్, హగ్గింగ్ ఫెస్ట్లో చేరి పోవడం విశేషం. అంతేకాదు చివరి పరుగుతో వెంకేటేష్ అయ్యర్ విజయాన్ని అందించడంతో బాలీవుడ్ రొమాన్స్ కింగ్ తన భార్య గౌరీ నుదిటిపై ముద్దు పెట్టుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దీంతో ,ఇద్దరూ ఆనంద క్షణాల్లో మునిగి తేలిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. కాగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కేకేఆర్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ జట్టు కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కోల్కతా ఈ టార్గెట్ను కేవలం 10.3 ఓవర్లలోనే ముగించి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. వెంకటేష్ అయ్యర్ విన్నింగ్ షాట్తో 2012, 2014 తర్వాత ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అత్యధిక సార్లు ట్రోఫీని గెలిచిన జట్టుగా కోల్కతా నిలిచింది. దీంతో షారుఖ్ ఖాన్ ఎమోషనల్ అయ్యాడు. -
సీఎం జగన్ గెలుపు ధీమా.. కింగ్ ఆఫ్ ఏపీ అంటూ అభిమానం (ఫొటోలు)
-
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్ (ఫోటోలు)
-
సోనియా గాంధీ భావోద్వేగ సందేశం.. వీడియో వైరల్
ఢిల్లీ: ఈ రోజు మూడోదశ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ తరుణంలో సోనియా గాంధీ ఓటర్లకు ఉద్వేగభరితమైన సందేశాన్ని వినిపించారు. దీనికి సంబంధించిన వీడియో కాంగ్రెస్ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో తెగ వైరల్ అవుతోంది.మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి.. నిరుద్యోగం, మహిళలపై నేరాలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలపై వివక్ష తారాస్థాయికి చేరింది. ఇవన్నీ ప్రధాని మోదీ, బీజేపీ నుంచి ఉత్పన్నమయ్యాయి. మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోంది. పేదలు వెనుకబడి ఉండటం నాలో వేదనను నింపుతోందని వీడియోలో సోనియా గాంధీ వెల్లడించారు.ఈ రోజు నేను మరోసారి మీ మద్దతును కోరుతున్నాను. కాంగ్రెస్ హామీల ప్రధాన ఉద్దేశ్యం దేశాన్ని ఏకం చేయడం. భారతదేశంలోని పేదలు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు, వెనుకబడిన వర్గాల కోసం పని చేయడం కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది.మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. అబద్ధపు ప్రతిపాదకులను తిరస్కరించండి. అందరికీ ఉజ్వలమైన, సమానమైన భవిష్యత్తు కోసం కాంగ్రెస్కు ఓటు వేయండి. హ్యాండ్ బటన్ను నొక్కండి. అందరి సహకారంతో మరింత ఐక్యమైన భారతదేశాన్ని నిర్మిస్తాం అని సోనియాగాంధీ వీడియోలో భావోద్వేగమైన ప్రసంగం చేశారు.My dear brothers and sisters,Youth unemployment, crimes against women, and discrimination against Dalits, Adivasis, and minorities have reached unprecedented levels. These challenges stem from the ‘niyat’ and ‘niti’ of PM Modi and the BJP which aim for power rejecting… pic.twitter.com/4npHwd8DNW— Congress (@INCIndia) May 7, 2024 -
మంత్రి ఆదిమూలపు సురేష్ ఎమోషనల్
-
ప్రచార సభలో ప్రధాని మోదీ భావోద్వేగం..కారణమిదే
భోపాల్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. శుక్రవారం(ఏప్రిల్ 19) ఒకేరోజు ఆయన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో సుడిగాలి ప్రచారం చేశారు. మధ్యప్రదేశ్లోని దమోహ్ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా ఓ యువకుడు ప్రదర్శించిన చిత్రాన్ని చూసి మోదీ ఉద్వేగానికి గురయ్యారు. సభలో ప్రధాని మాట్లాడుతుండగా ఆ యువకుడు మోదీ, ఆయన మాతృమూర్తి హీరాబెన్ ఉన్న చిత్రాన్ని ప్రదర్శించాడు. ఇది గమనించిన ప్రధాని మాటలు రాక ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపేశారు. అనంతరం చిత్రాన్నిపెన్సిల్తో గీసి తీసుకువచ్చిన యువకుడిని అభినందించారు. ఫొటో వెనుక అతడి పేరు, చిరునామా రాసివ్వాలని యువకుడిని కోరారు. #WATCH via ANI Multimedia | 'Emotional' PM Modi stops his speech as he notices portrait of his mother in Madhya Pradesh's Damohhttps://t.co/SHKTxQj0kC — ANI (@ANI) April 19, 2024 ఇదీ చదవండి.. రాహుల్గాంధీకి అమిత్ షా కౌంటర్ -
సీఎం జగన్ కు ఓటమి లేదు...
-
సీఎం జగన్ దాడిపై బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎమోషనల్..
-
మీ కళ్లు చల్లబడ్డాయా.. ముసలవ్వ ఎమోషనల్ వీడియో..
-
నాతో అభ్యర్థుల ప్రకటన..కన్నీళ్లు పెట్టుకున్న నందిగాం సురేష్
-
అభిమాని తీవ్ర భావోద్వేగం.. ఐకాన్ స్టార్ చేసిన పనికి ఫిదా!
టాలీవుడ్ హీరోలకు క్రేజ్ మామూలుగా ఉండదు. జూనియర్, రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్, మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోల ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా రిలీజ్ రోజైతే హడావుడి అంతా ఇంతా కాదు. అది మన హీరోలకు ఉన్న క్రేజ్. చాలా మంది టాలీవుడ్ హీరోలకు డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. తాజాగా ఓ అభిమాని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను కలిశారు. అభిమాన హీరోను కలిసిన వేళ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బన్నీని పట్టుకుని బోరున విలపించాడు. దీంతో ఏడుస్తున్న అభిమానిని అల్లు అర్జున్ ఓదార్చాడు. కన్నీళ్లు పెట్టుకుంటున్న అభిమానికి బన్నీ ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో తెగ వైరలవుతోంది. ఎంతైనా ఒక అభిమానిని దగ్గరికీ తీసుకుని స్టార్ హీరో సముదాయించడాన్ని నెటిజన్స్ అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. A heartfelt moment captured! ❤️ Witness the touching moment as a diehard fan meets his idol @alluarjun for the first time. Emotions overflow as comforting words and a handshake create memories to last a lifetime.#AlluArjun pic.twitter.com/RS4NalS3kq — All India Allu Arjun Fans & Welfare Association (@AIAFAOnline) March 15, 2024 -
ఎన్నో త్యాగాలు.. ఏమీ లేని స్థాయి నుంచి.. తల్లి గురించి శ్రీముఖి ఎమోషనల్ (ఫోటోలు)
-
100th Test: అశ్విన్, జానీ బెయిర్ స్టో ఎమోషనల్ మూమెంట్స్.. పడిక్కల్ కూడా (ఫొటోలు)
-
కార్యకర్త చేసిన పనికి ప్రధాని మోదీ ఎమోషనల్
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం చెన్నై పర్యటనలో తనకు ఎయిర్పోర్టులో స్వాగతం పలికిన ఓ బీజేపీ కార్యకర్తపై ప్రశంసలు కురింపించారు. చెన్నై ఎయిర్పోర్టులో మోదీకి ఓ బీజేపీ కార్యకర్త స్వాగతం పలికారు. అయితే తన భార్య ఇద్దరు కవల పిల్లలు జన్మనించిందని అయినా వారిని చూడకుండా ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు వచ్చినట్లు స్వయంగా మోదీకే తెలియజేయటం విశేషం. అటువంటి అంకితభావం ఉన్న కార్యకర్త చేసిన పనికి తాను ఎమోషనల్ అయినట్లు మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. ప్రస్తుతం మోదీ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. மிகவும் சிறப்பு வாய்ந்த சந்திப்பு! சென்னை விமான நிலையத்தில், நமது கட்சி நிர்வாகிகளில் ஒருவரான திரு அஸ்வந்த் பிஜய் அவர்கள் என்னை வரவேற்க காத்திருந்தார். சற்றுமுன் தான், அவரது மனைவி இரட்டைக் குழந்தைகளைப் பெற்றெடுத்துள்ளார் என்றும், ஆனால் அவர் இன்னும் அவர்களை சந்திக்கவில்லை… pic.twitter.com/bufqjbe9wo — Narendra Modi (@narendramodi) March 4, 2024 ‘చైన్నై ఎయిర్పోర్టులో నాకు స్వాగతం పలకడానికి వచ్చిన బీజేపీ కార్యకర్త అశ్వంత్ పిజై చాలా ప్రత్యేకంగా అనిపించారు. అతను తన భార్య ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచిందని చెప్పారు. అయినా వారిని ఇంకా కలవలేదన్నారు. వారిని కలవకుండా నాకు స్వాగతం పలకడానికి ఎయిర్పోర్టుకు వచ్చానని తెలిపారు. నేను ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఆశీర్వాదాలు తెలియజేశాను’ అని సదరు కార్యకర్తపై ప్రశంసలు కురిపించారు. ‘అభిమానం, అంకితభావంతో కూడిన అశ్వంత్ పిజై వంటి బీజేపీ కార్యకర్తను చూడటం చాలా ఆనందంగా ఉంది. కార్యకర్తలు చూపించే ప్రేమ, అనురాగం నన్ను భావోద్వేగానికి గురిచేశాయి’ అని ప్రధాని మోదీ అన్నారు. చదవండి: కర్ణాటక అసెంబ్లీలో పాక్ నినాదాలు నిజమే! -
రామ్లల్లా ముందు పిల్లాడిలా ఏడ్చిన ఎమ్మెల్యే!
అయోధ్యలో కొలువైన రామ్లల్లాను యూపీలోని గోసాయిగంజ్ సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే అభయ్ సింగ్ దర్శించుకున్నారు. ఈ సమయంలో ఆయన చిన్నపిల్లాడిలా కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో అభయ్ సింగ్ బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ వేశారు. పార్టీకి దూరమైన అనంతరం అయోధ్యకు వచ్చిన ఆయన బాలరాముని ముందు సాష్టాంగపడి భావోద్వేగానికి గురయ్యారు. అయోధ్యలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘గత జనవరి 22వ తేదీన జరిగిన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు రావాలనుకున్నామని, అయితే తమకు ఆహ్వానం అందలేదన్నారు. దీంతో తమను రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి తీసుకెళ్లాలని అసెంబ్లీ స్పీకర్ను ఎస్పీ ఎమ్మెల్యేలంతా కోరారని తెలిపారు. అయితే సమాజ్వాదీ పార్టీ మినహా అన్ని పార్టీల ఎమ్మెల్యేలను అయోధ్యకు తీసుకువెళ్లారని’ ఆయన ఆరోపించారు. తాజాగా రామ్లల్లాను దర్శించుకున్న ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో శ్రీరాముని చిత్రాలను షేర్ చేశారు. ఇటీవలి పరిణామాలను చూస్తుంటే అభయ్ సింగ్ కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
సామాన్యులు అసెంబ్లీలో అడుగుపెట్టడానికి సరిపోరా..?
డబ్బులతో పాలిటిక్స్ చేయనంటూ ఉపన్యాసాలిచ్చే జనసేనాని.. రూటు మార్చేశారు.. విలువలను తుంగలో తొక్కేసి డబ్బున్న వారికే టికెట్లు అంటూ తన బాసు చంద్రబాబు అనుసరిస్తోన్న ఓటుకు నోటు సిద్ధాంతాన్ని గుర్తు చేస్తున్నారు.. రాజకీయాల్లో రానున్న కాలంలో డబ్బులు ఖర్చు పెట్టాల్సిందేనంటూ ఇటీవల భీమవరంలో నేతలతో జరిగిన సమావేశంలో తన వ్యాఖ్యలు పచ్చి నిజాలేనని నిరూపిస్తూ.. జనసేన జగ్గంపేట ఇన్చార్జి పాటంశెట్టి సూర్యచంద్రకు పవన్ పెద్దషాకే ఇచ్చారు. తన లాంటి సామాన్యులు అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి సరిపోరా అంటూ జనసేన జగ్గంపేట ఇన్చార్జి పాటంశెట్టి సూర్యచంద్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, జనసేన సంయుక్తంగా పలు నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనలో భాగంగా జగ్గంపేట ఎమ్మెల్యే టికెట్ టీడీపీకి ప్రకటించారు. 2019 నుంచి జనసేనలో తిరుగుతూ నియోజకవర్గంలోని పార్టీ బలోపేతానికి కృషి చేసిన తనకు టిక్కెట్టు కేటాయించపోవడం తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు. సామాన్యుడిగా పుట్టి రబ్బరు చెప్పులు వేసుకనే తాను ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించడం తగదేమోనన్నారు. తనలా సామాన్యుడిగా పుట్టి ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించే యువతకు తన జీవితం గుణపాఠం కావాలన్నారు. తనకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదంటూ ఆయన ఆమరణ నిరాహార దీక్కుదిగారు. -
ఆయనే మళ్లీ పుట్టాడు.. నిఖిల్ ఎమోషనల్ పోస్ట్!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తండ్రిగా ప్రమోషన్ పొందారు. ఆయన భార్య పల్లవి బుధవారం ఉదయం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నిఖిల్, డాక్టర్ పల్లవి 2020లో పెద్దల సమక్షంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. కొడుకు పుట్టిన సందర్భంగా హీరో నిఖిల్ ఎమోషనలయ్యారు. తన తండ్రి మళ్లీ తిరిగి వచ్చాడంటూ పోస్ట్ చేశారు. నిఖిల్ తన ఇన్స్టాలో రాస్తూ..'ఏడాది క్రితమే మా నాన్న మిస్సయ్యాను. ఇప్పుడు మా కుటుంబంలోకి మగ బిడ్డ అడుగుపెట్టారు. ఆయనే మళ్లీ తిరిగి వచ్చాడని అనుకుంటున్నా. మాకు అబ్బాయి జన్మించినందుకు చాలా సంతోషంగా ఉంది.' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మా కుటుంబంలోకి తన తండ్రే మళ్లీ తిరిగి వచ్చాడంటూ ఎమోషనలయ్యారు నిఖిల్. ఇక నిఖిల్ సినీ కెరీర్ విషయాకొస్తే.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘హ్యాపీ డేస్’ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు. కార్తికేయ, స్వామిరారా సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. కార్తికేయ 2తో పాన్ ఇండియా స్టార్గా మారాడు. ప్రస్తుతం మరో పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. . చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) View this post on Instagram A post shared by CelebrityNews (@industrycelebritynews) -
'నా బలగం అందరు చూశారు.. ఒక్క ఆయన తప్ప': వేణు ఎమోషనల్ పోస్ట్!
బలగం సినిమాతో అందరినీ ఏడిపించిన డైరెక్టర్ వేణు యెల్దండి. జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న వేణు ఆ తర్వాత నటుడిగా, కమెడియన్గా రాణించారు. గతేడాది తెలంగాణ పల్లె నేపథ్యంలో బలగం సినిమాను తెరకెక్కించారు. ఎవరూ ఊహించని విధంగా బ్లాక్బస్టర్గా నిలిచింది. అప్పటివరకు కమెడియన్గా తెలిసిన వేణులో ఇంతమంచి దర్శకుడు ఉన్నాడన్న విషయం తెలిసింది. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ ప్రధాన పాత్రలో కనిపించారు. అయితే తాజాగా వేణు యెల్దండి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నేను తీసిన బలగం సినిమాను అందరు చూశారు.. ఒక్క మానాన్న తప్ప.. మిస్ యూ నాన్న' అంటూ పోస్ట్ చేశారు. దాదాపు 24 ఏళ్ల క్రితమే వేణు తండ్రి మరణించగా.. ఆయనను తలుచుకుని వేణు ఎమోషనలయ్యారు. అంతే కాకుండా తన తండ్రి ఫోటోను షేర్ చేశారు. Naa BALAGAM Cinema andaru choosaaru.. Maa nanna tappa🥲 MISS YOU NAAINA🙏 Late 06/02/2000#father pic.twitter.com/U831rWKRgS — Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) February 8, 2024 -
నాకు జీవితాన్ని ఇచ్చిన జగన్ కోసం జీవితాంతం నిలబడతా..!
-
మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ వీడియో
-
ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు: మెగాస్టార్ ఎమోషనల్
టాలీవుడ్ మెగాస్టార్కు మరో అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించింది. ఇప్పటికే అవార్డుల రారాజుగా నిలిచిన మెగాస్టార్కు మరో అత్యున్నతమైన ఘనతను సొంతం చేసుకున్నారు. సినీ ప్రియులు, అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్న చిరును పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకున్నారు. నటుడిగా 1978లో కెరీర్ ప్రారంభించిన ఆయన అలుపెరగకుండా సినిమాలు చేశారు. అందులో భాగంగానే ఆయన ఎన్నో అవార్డులను కూడా సాధించారు. మెగాస్టార్కు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటిచండంపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మెగాస్టార్ మాట్లాడుతూ..'కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది. ఈ సమయంలో నాకు ఏం మాట్లాడాలో కూడా మాటలు రావడం లేదు. మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబ సభ్యుల అండ దండలు, నీడలా నాతో నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగా నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నా.' అంటూ భావోద్వేగానికి గురయ్యారు. వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ.. 'నాకు దక్కిన ఈ గౌరవం మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతల కు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను. నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తిమేరకు ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరం అయినప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. మీరు నా పై చూపిస్తున్నకొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తుంది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది. నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు' అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇది చూసిన అభిమానులు మెగాస్టార్కు అభినందనలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. -
భావోద్వేగంలో ఉమా భారతి, సాధ్వి రితంభర
నాటి రామమందిర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ఉమాభారతి, సాధ్వి రితంభర అయోధ్యలో భాద్వేగానికి లోనయ్యారు. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన బీజేపీ నాయకురాలు ఉమాభారతి, సాధ్వి రితంభర భావోద్వేగంతో ఒకరినొకరు కావలించుకున్నారు. నాటి అయోధ్య ఉద్యమ పోరాటాలను గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘ఈ సమయంలో మాటలు లేవు.. భావాలు మాత్రమే కదలాడుతున్నాయి’ అని అన్నారు. పరమ శక్తి పీఠం వ్యవస్థాపకురాలు సాధ్వి రితంభర మాట్లాడుతూ ‘ప్రాణ ప్రతిష్ఠ’ శుభ ఘడియ ఇది.. యావత్ దేశం, యావత్ ప్రపంచం శోభాయమానంగా మారింది. కరసేవకుల త్యాగం అర్థవంతమైంది. రామ్లల్లా మనల్ని అనుగ్రహించేందుకు వచ్చాడు’ అని అన్నారు. ఇది కూడా చదవండి: మారిషస్ నుంచి డెన్మార్క్ ... అంతా రామమయం! #WATCH | Ayodhya, UP: On Ram Temple 'pran pratishtha', Sadhvi Ritambhara, Founder of Param Shakti Peeth and Vatsalyagram, says, " This is the happy hour of 'pran pratishtha', whole Country and the whole world have been decorated...kar sevaks' sacrifices have become… pic.twitter.com/vLp6ORtabZ — ANI (@ANI) January 21, 2024 -
బాల్యాన్ని గుర్తు చేసుకుని ఏడ్చేసిన పీఎం మోదీ..
-
PM Modi Emotional Video: బాల్యాన్ని గుర్తు చేసుకుని ప్రధాని భావోద్వేగం
సోలాపూర్: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ భావోద్వేగానికి గురయ్యారు. లబ్ధిదారులకు పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద ఇళ్లు అందజేస్తూ తన బాల్యాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. మహారాష్ట్రలోని సోలాపూర్లో 90 వేల మంది నిరుపేదలకు పీఎం ఆవాస్(అర్బన్) కింద ఇళ్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘లబ్ధిదారులకు అందజేసిన ఇళ్లను చూసినపుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. చిన్నతనంలో నాకు ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం ఉంటే బాగుండనిపించింది. అయితే ఇప్పుడు ఇంత మంది లబ్ధిదారుల ఇంటి కల నిజమయినందుకు సంతృప్తిగా ఉంది. వాళ్ల ఆశీర్వాదాలే నాకు పెద్ద ఆస్తి’ అని చెమర్చిన కళ్లతో మోదీ చెప్పారు. అణగారిన వర్గాల అభ్యన్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెపపడానికి ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వడమే ఒక ఉదాహరణ అన్నారు. మోదీ గ్యారెంటీ అంటే ఇచ్చిన గ్యారెంటీని పూర్తి చేయడమే అని చెప్పారు. పీఎం అర్బన్ స్కీమ్ కింద సోలాపూర్లో చేపట్టిన రాయ్ హౌసింగ్ సొసైటీ ప్రాజెక్టు అతిపెద్ద ప్రాజెక్టని మోదీ తెలిపారు. 90 వేల ఇళ్లు పొందిన లబ్ధిదారుల్లో శానిటరీ సిబ్బంది, వీధి వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు ఎక్కువగా ఉండటం గమనార్హం. #WATCH | PM Modi gets emotional as he talks about houses completed under PMAY-Urban scheme in Maharashtra, to be handed over to beneficiaries like handloom workers, vendors, power loom workers, rag pickers, Bidi workers, drivers, among others. PM is addressing an event in… pic.twitter.com/KlBnL50ms5 — ANI (@ANI) January 19, 2024 ఇదీచదవండి.. దశాబ్దాల కల నెరవేరుతోంది.. మోదీ -
హీరో అయితేనేం.. ఆ కూతురికి నాన్నేగా!
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ వివాహానికి సంబంధించిన వార్తలు సోషల్మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా వరుడు ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరే (Nupur Shikhare) జాగింగ్ చేసుకుంటూ పెళ్లి మండపానికి రావడం, అలాగే వధువు ఇరాఖన్ చాలా సాదాసీదా కనిపించడం తన మాజీ భార్యలు రీనాదత్తా, కిరణ్రావు సందడిగా కనిపించడం విశేషంగా నిలిచింది. తాజా మరో విషయం నెటిజనులను కూడా భావోద్వేగానికి గురిచేస్తోంది. ప్రతీ ఇంటికి ఆడబిడ్డ అంటే మురిపెం. అడిగింది కాదనకుండా అల్లారుముద్దుగా పెంచుకుంటారు. కానీ పెళ్లీడు వచ్చి ఒక అయ్యలో చేతిలో పెట్టి అత్తారింటికి పంపే క్రమంలో మాత్రం తన ప్రాణమే పోతున్నంత బాధపడతారు. ముఖ్యంగా తండ్రులు బరువెక్కిన గుండెలతో భావోద్వేగానికి గురవుతుంటారు. ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా అని ఓ సినీ కవి అన్నట్టు తాజాగా తన కుమార్తె పెళ్లిలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) కూడా కంటతడి పెట్టుకున్నారు.దీనికి సంబంధించిన వీడియో ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by B O L L Y W O O D (@filmyselfies.official) ఇప్పటికే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఇరా-నూపుర్ జంట బుధవారం ఉదయపూర్లో ఉంగరాలు మార్చుకుని మరో వివాహ వేడుకను జరుపుకున్నారు. ఈ సమయంలో పెళ్లికూతురు తండ్రి అమీర్ ఖాన్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. అమీర్ , తన మాజీ భార్య రీనా దత్తాతో కలిసి తన కన్నీళ్లను తుడుచుకుంటూ కనిపించారు. View this post on Instagram A post shared by B O L L Y W O O D (@filmyselfies.official) -
భావోద్వేగానికి గురైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
-
మీ రుణం తీర్చుకోలేనిది..మంత్రి భావోద్వేగం
-
విజయకాంత్ను తల్చుకుని ప్రధాని మోదీ భావోద్వేగం
చెన్నై: ప్రముఖ నటుడు, దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (డీఎండీకే) వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్ను తల్చుకుని దేశ ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం తిరుచిరాపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. అక్కడ కెప్టెన్ విజయకాంత్ ప్రస్తావన తెచ్చి మరీ నివాళులర్పించారు. ‘‘కొన్నిరోజుల కిందటే.. విజయకాంత్ గారిని మనం కోల్పోయాం. ఆయన సినీ ప్రపంచంలో మాత్రమే కెప్టెన్ కాదు.. రాజకీయ రంగంలో కూడా కెప్టెనే. సినిమాల ద్వారా అశేష ప్రజాభిమాన సంపాదించుకున్న విజయకాంత్.. ఒక నేతగా రాజకీయం కంటే దేశ ప్రయోజనమే ముఖ్యమనుకునేవారు.. అని ప్రధాని మోదీ విజయకాంత్ను కొనియాడారు. ఆయన మరణం తమిళ భూమికి.. దేశానికి తీరని లోటు అని పేర్కొంటూ.. విజయకాంత్ కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మోదీ. PM Modi’s heartfelt condolences to the family and admirers of his dear friend Captain Vijaykanth ❤️#VanakkamModi #Vijayakanth pic.twitter.com/31N8MPYCLx — இந்தா வாயின்கோ - Take That (@indhavaainko) January 2, 2024 తమిళనాడులో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. తొలుత... తిరుచిరాపల్లిలోని భారతిదశన్ యూనివర్సిటీలో స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారాయన. ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత త్రిచీ ఎయిర్ పోర్ట్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన టెర్మినల్ను ప్రారంభించారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ డిసెంబర్ 28వ తేదీన కన్నుమూశారు విజయకాంత్(71). ‘కెప్టెన్’ మృతిపట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ సమయంలో ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ సైతం సంతాపం ప్రకటించారు. తమిళ సినీ రంగంలోనే కాదు.. అక్కడి రాజకీయాల్లోనూ విజయకాంత్ తనదైన ముద్ర వేశారు. Extremely saddened by the passing away of Thiru Vijayakanth Ji. A legend of the Tamil film world, his charismatic performances captured the hearts of millions. As a political leader, he was deeply committed to public service, leaving a lasting impact on Tamil Nadu’s political… pic.twitter.com/di0ZUfUVWo — Narendra Modi (@narendramodi) December 28, 2023 -
రైతుబిడ్డకు గెలిచినా ఆనందం లేకుండా చేశారు: ప్రశాంత్ తండ్రి ఆవేదన
రైతుబిడ్డగా బిగ్బాస్ రియాలిటీ షో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. వంద రోజులకు పైగా సాగిన ఈ షోలో మరో కంటెస్టెంట్ అమర్దీప్ రన్నరప్గా నిలిచాడు. అయితే అంతవరకు బాగానే ఉన్న.. ప్రశాంత్ గెలిచి బయటికొచ్చాక జరిగిన పరిణామాలు తీవ్రమైన చర్చకు దారితీశాయి. అభిమానుల అత్యుత్సాహంతో కార్లతో పాటు ఆర్టీసీ బస్సులు అద్దాలు ధ్వంసం కావడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్పై కేసు నమోదు చేశారు. ట్రోఫీ గెలిచి ఇంటికి వెళ్లిన ప్రశాంత్ను అరెస్ట్ చేసి రిమాండ్కు కూడా తరలించారు. తాజాగా ఈ వివాదంపై ప్రశాంత్ తండ్రి సత్యనారాయణ మాట్లాడారు. తన కుమారుడిని అరెస్ట్ మాకు సంతోషం లేకుండా చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. నా భార్యకు ఆరోగ్యం బాగాలేదని.. కుమారుల అరెస్ట్తో ఏడుస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. (ఇది చదవండి: మరికొద్ది గంటల్లో సలార్ రిలీజ్.. సూపర్ సాంగ్ విడుదల!) అరెస్ట్పై ప్రశాంత్ తండ్రి మాట్లాడుతూ.. 'నా కొడుకు బిగ్బాస్ గెలిచిండని మురిసిపోయినా. ట్రోఫీ గెలిచిన ఐదు గంటలకే నాకు బాధగా అనిపించింది. మాకు ఇదంతా ఎందుకు? వ్యవసాయం చేసుకుంటే సరిపోయేదనిపించింది. మా ఊర్లో ఉంటేనే బాగుండు. లేని పోనివీ సృష్టించి వార్తలు రాస్తుర్రు. ప్రశాంత్ పక్కనే నేను కూడా ఉన్నా. నాకు వాంతులు కూడా అయ్యాయి. ఈ గొడవతో నా కొడుకుకు ఎలాంటి సంబంధం లేదు. అదే సెలబ్రిటీలు అయితే ఇలానే చేస్తారా?. మావాడు ఎక్కడికి పోలే. కానీ కొందరు కావాలనే పారిపోయిండని రాసిర్రు.'అని వాపోయారు. పోలీసులు తీరుపై సత్యనారాయణ మాట్లాడుతూ.. 'బుధవారం సాయంత్రం 6.30కు పోలీసులు వచ్చి ప్రశాంత్ను తీసుకెళ్లారు. మాది మారుమూల గ్రామం. బెయిల్ ఇలాంటి వన్నీ నాకు తెల్వదు. నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు. ఆమె ఏడుస్తూ కూర్చుంది. జ్వరం కూడా వచ్చింది. మమ్మల్ని లేని పోనీ ఇబ్బందులు, బాధలు పెట్టిండ్రు సార్. పరేషాన్ చేసిర్రు. బట్టలు మార్చుకుంటానంటే కూడా వినలేదు. ముందుగా మంచిగానే మాట్లాడిర్రు, ఒకాయన అయితే ప్రశాంత్ మెడల మీద చేతులపట్టి నూక్కొచ్చిర్రు. వారెంట్ కూడా ఇయ్యలేదు. దొంగతనం చేసినట్లు ప్రశాంత్ను తీసుకెళ్లారు. ప్రజలందరికీ నేను ఒక్కటే వేడుకుంటున్నా. నా కొడుకు దొంగ కాదు. బిగ్ బాస్కు పోతానంటే నేను పంపించినా. విన్నర్ అయినడు. కానీ ఆ సంతోషం మాకు లేకుండా పోయింది.' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (ఇది చదవండి: పల్లవి ప్రశాంత్ కేసు.. నలుగురు మైనర్లు అరెస్ట్!) -
మంచు మనోజ్ అలాంటి కామెంట్స్.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక!
ఈ ఏడాది పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో మంచు మనోజ్ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హోస్ట్గా ‘ఉస్తాద్–ర్యాంప్ ఆడిద్దాం’ పేరిట సరికొత్త టాక్ షో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్కు హాజరైన మనోజ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తన భార్య మౌనిక గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మనోజ్ మట్లాడుతూ..' ఏడేళ్ల గ్యాప్ తర్వాత.. ఏడడుగులు వేసి మళ్లీ ఇండస్ట్రీకి వస్తున్నా. ఆ గ్యాప్లో చాలా డిఫరెంట్ లైఫ్ను చూశా. అంతుకుముందు సినిమాలు చేసేటప్పుడు ఒక ఫ్యాషన్ ఉండేది. కానీ ఏడేళ్ల తర్వాత మీ ప్రేమ, బాధ్యతతోనే వచ్చా. నాకు ధైర్యమిచ్చింది ఫ్యాన్స్ ప్రేమనే. నేను మౌనికతో ప్రేమలో పడ్డాకే ఫ్యాన్స్ ప్రేమ విలువ తెలిసింది. నాకు మంచి టీం దొరికింది' అని అన్నారు. అయితే ఈ ఈవెంట్కు మంచు మనోజ్ భార్య భూమా మౌనిక కూడా హాజరయ్యారు. మౌనికతో ప్రేమలో పడ్డాకే తనకు ఫ్యాన్స్ విలువ తెలిసి వచ్చిందని మనోజ్ మాట్లాడారు. దీంతో వేదికపై మంచు మనోజ్ మాట్లాతుండగానే మౌనిక ఫుల్ ఎమోషనల్ అయింది. తన భర్త మాటలకు కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరలవుతోంది. -
నాకన్నా బర్రెలక్క బెటరంటున్నారు బాబు..!
-
41 మంది కార్మికులతో ప్రధాని మోదీ సంభాషణ
ఢిల్లీ: సిల్క్యారా సొరంగంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన 41 మంది కార్మికులతో ప్రధాని మోదీ ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా ప్రధానికి తమ అనుభవాలను కార్మికులు తెలియజేశారు. తొలిత బయపడ్డాం.. కానీ నమ్మకం కోల్పోలేదని కార్మికులు తెలిపారు. ప్రభుత్వం కాపాడుతుందనే భరోసా తమకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉన్న కార్మికులనే కాపాడారని గుర్తుచేశారు. సహాయక చర్యలు పూర్తైన తర్వాత ప్రధాని మోదీ కూలీలందరితో ఫోన్లో మాట్లాడి వారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. యోగా, మార్నింగ్ వాక్తోనే తమలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకున్నట్లు ఈ సందర్భంగా ఓ కూలీ ప్రధానికి తెలిపారు. మేం సొరంగంలో చిక్కుకుపోయినా చాలా ధైర్యంగా ఉన్నామని తెలిపారు. ఈ ప్రభుత్వం విదేశాల్లో ఉన్న భారతీయులనే కాపాడింది... దేశంలో ఉన్న మమ్మల్ని కచ్చితంగా కాపాడగలదన్న భరోసాతో ఆందోళన చెందలేదని వెల్లడించారు. ఈ 17 రోజులు మేమంతా కలిసిమెలిసి ఉన్నామని తెలిపిన కూలీలు.. యోగా, మార్నింగ్ వాక్ వంటివి చేసి మాలోని స్థైర్యాన్ని పెంచుకున్నామని ప్రధానితో అన్నారు. సొరంగంలో చిక్కుకోగానే మొదట 10-15 గంటలు భయపడ్డామని కూలీలు తెలిపారు. శ్వాసతీసుకోవడానికి కూడా ఇబ్బంది కలిగిందని తెలిపారు. కానీ అధికారులు తాము చిక్కుకున్న ప్రదేశాన్ని గుర్తించి ఓ పైపును పంపించారని వెల్లడించారు. దాని ద్వారా ఆహారం పంపించారని పేర్కొన్నారు. ఓ మైక్ను కూడా అమర్చడంతో కుటుంబ సభ్యులతో మాట్లాడగలిగామని ప్రధానితో చెప్పారు. మోదీ భావోద్వేగం.. ఉత్తరాఖండ్లో చిక్కుకున్న కార్మికులను వెలికితీసిన సాహసకృత్యాన్ని టెలివిజన్లో ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం రాత్రి కేబినెట్ భేటీ జరిగిన క్రమంలో మంత్రులతో కలిసి సిల్క్యారా సొరంగంలో కార్మికుల వెలికితీతను వీక్షించారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కేబినెట్ సమావేశం జరిగిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తెలిపారు. ఈ సందర్భంగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులు క్షేమంగా బయటపడటంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఒకానొక దశలో మోదీ భావోద్వేగానికి లోనయ్యారని వెల్లడించారు. నవంబర్ 12న ఉత్తకాశీలోని సిల్క్యారా సొరంగం కూలిన ఘటనలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకురావడానికి గత 17 రోజులుగా నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ పనులు జరిగాయి. అయితే.. ర్యాట్ హోల్ కార్మికుల సాహస చర్యల అనంతరం బాధిత కార్మికులు మంగళవారం క్షేమంగా బయటపడ్డారు. సొరంగం నుంచి బయటకు తీసుకురాగానే బాధిత కార్మికులను రిషికేశ్లోని ఏయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కార్మికులంతా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇదీ చదవండి: Uttarkashi Tunnel Collapse: ఆ 17 రోజులు ఎలా గడిచాయంటే.. -
ఏడ్చేసిన బాబు మోహన్..
-
రాహుల్ సిప్లిగుంజ్ తో లవ్..రతిక పేరెంట్స్ ఎమోషనల్ కామెంట్స్
-
కాంగ్రెస్ లో నాకు ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు: విష్ణు