Forex market
-
స్టాక్ మార్కెట్పై పన్నుల పిడుగు
రూపాయి: 83.72 ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ అటు ఇంట్రాడే, ఇటు ముగింపు రెండింటిలో చరిత్రాత్మక కనిష్టాలను చూసింది. ఇంట్రాడేలో 83.72 స్థాయిని తాకితే, చివరికి క్రితం ముగింపుతో పోలి్చతే 3 పైసలు నష్టంతో 83.69 వద్ద ముగిసింది. క్యాపిటల్ గెయిన్స్పై పన్ను రేట్ల పెంపు రూపాయి నష్టానికి కారణం. న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ స్టాక్ మార్కెట్ను మెప్పించలేకపోయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగ సమయంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెక్యూరిటీలపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్టీటీ), స్వల్పకాలిక మూలధన రాబడి(ఎస్టీసీజీ), ధీర్ఘ కాలిక మూలధన రాబడి(ఎల్టీసీజీ)లపై పన్నుల పెంపు ప్రతిపాదనలు ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశపరిచాయి.అయితే పన్ను మినహాయింపులు, కస్టమ్స్ సుంకం తగ్గింపు, ద్రవ్యోలోటు కట్టడికి చర్యల ప్రకటనలతో సూచీలు మళ్లీ పుంజుకొని స్వల్ప నష్టాలతో ముగిశాయి. రియలీ్ట, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రీయల్, ఫైనాన్సియల్ సరీ్వసెస్, మెటల్, కమోడిటీస్, టెలికం షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, సరీ్వసెస్, ఫార్మా, టెక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో తీవ్ర ఒడిదుడుకులు బడ్జెట్ రోజు ఉదయం స్టాక్ మార్కెట్ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 222 పాయింట్లు పెరిగి 80,725 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 24,569 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఎఫ్అండ్ఓ సెక్యూరిటీలపై ఎస్టీటీ, ఎల్టీసీజీ, ఎస్టీసీజీ పన్నుల పెంపు ప్రకటనలతో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ 1,278 పాయింట్లు క్షీణించి 79,224 పాయింట్ల వద్ద, నిఫ్టీ 235 పాయింట్లు కుప్పకూలి 24,074 పాయింట్ల వద్ద కనిష్టాలను తాకాయి.పన్ను మినహాయింపులు, కస్టమ్స్ సుంకం తగ్గింపు ప్రకటన తరువాత.., కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. దీంతో సూచీలు కనిష్టాల నుంచి రికవరీ అయ్యాయి. చివరికి సెన్సెక్స్ 73 పాయింట్లు నష్టపోయి 80,429 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 24,479 వద్ద ముగిసింది. ‘‘బడ్జెట్లో మూలధన వ్యయాలకు అధిక కేటాయింపులు ఉండొచ్చని ఆశించారు. స్వల్పకాలిక మూలధన లాభాలపై (ఎస్టీసీజీ) పన్ను 20 శాతానికి పెంచడం; దీర్ఘకాలిక మూలధన లాభాలపై (ఎల్టీసీజీ) పన్ను 12.5 శాతానికి పెంపు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెక్యూరిటీలపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్టీటీ)0.1%, 0.02 శాతం పెంపు అంశాలు స్టాక్ మార్కెట్కు కచి్చతంగా ప్రతికూల అంశాలు.స్వల్ప కాలం పాటు ఎదురయ్యే ప్రతికూలతలను ఎదుర్కొనేందుకు ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలి. గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన అధిక కేటాయింపు ప్రకటనలు మార్కెట్ నష్టాలు తగ్గించాయి’’ మెహ్తా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే తెలిపారు. ⇒ వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధి రూ.2.66 లక్షల కోట్లు కేటాయింపుతో పాటు ఉద్యోగ కల్పనలకు పెద్ధ పీట వేయడంతో కన్జూమర్, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించాయి. ఐటీసీ షేరు 5%, టాటా కన్జూమర్స్ ప్రొడెక్ట్స్, డాబర్ షేర్లు 3% పెరిగాయి. గోద్రేజ్ కన్జూమర్ ప్రోడెక్ట్స్, హెచ్యూఎల్, మారికో, బ్రిటానియా, కోల్గేట్, యూనిటెడ్ బేవరేజెస్, యూనిటెడ్ స్పిరిట్స్, బలరామ్పుర్ చినీ షేర్లు 2% నుంచి ఒకశాతం లాభపడ్డాయి. -
‘డాలర్’కు భారత్ అంటేనే ఇష్టం..!
నిరంతర వాణిజ్యం, కరెంట్ ఖాతా లోటు సమర్థంగా నిర్వహించడానికి ఐటీ రంగం కీలకంగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ ఐటీ ఎగుమతులు మందగిస్తే దేశ ఫారెక్స్ నిల్వలు తరిగి అది రూపాయి విలువపై ప్రభావం చూపనుంది. ఐటీ రంగం పెద్ద మొత్తంలో ఫారెక్స్ ఆదాయాన్ని తీసుకురావడమే కాదు.. ఇతర ఎగుమతి ఆధారిత రంగాలతో పోలిస్తే ఇందులో ఫారెక్స్ వ్యయాలు కూడా తక్కువ. ఐటీ కంపెనీల ఫారెక్స్ ఖర్చులు వాటి ఎగుమతి ఆదాయంలో సగం కంటే తక్కువ ఉంటుందని అంచనా. మరోవైపు కార్పొరేట్ రంగంలో అతిపెద్ద ఎగుమతిదారులుగా ఉన్న ఆయిల్ అండ్ గ్యాస్, మైనింగ్ కంపెనీల ఫారెక్స్ ఖర్చులు వాటి ఫారెక్స్ ఆదాయాలను మించిపోతాయి. ఇటీవల స్టాక్మార్కెట్లు బాగా పుంజుకోవడంతో విదేశీ సంస్థాగత పెట్టుబడులు భారీగా భారత్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా మార్కెట్ సూచీలు జీవితకాల గరిష్ఠాలను చేరుతున్నాయి. ప్రధానంగా అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఛైర్మన్ జెరొమ్పావెల్ కీలక వడ్డీరేట్లపై ఇటీవల చేసిన ప్రకటన మార్కెట్లకు దన్నుగా నిలుస్తోంది. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో ఎప్పటినుంచో అనిశ్చితి కొనసాగుతున్న ఐటీ స్టాక్లు భారీగా ర్యాలీ అవుతున్నాయి. ఐటీ కంపెనీలు అధికంగా డాలర్లలోనే వ్యాపారం సాగిస్తాయి. దాంతో భారత్లోని టాప్ కంపెనీల్లో ఎఫ్ఐఐలు అధికంగా పెట్టుబడి పెట్టడంతో దేశంలోని ఫారెక్స్ నిలువలు పెరిగినట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు. దేశంలోని విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు పెరిగాయి. ఈ నెల 15వ తేదీ కంటే ముందు వారానికి 9.11 బిలియన్ డాలర్లు(రూ.75 వేలకోట్లు) పెరుగుదలతో 615.97 బిలియన్ డాలర్లకు(రూ.51.2 లక్షల కోట్లు) ఫారెక్స్ నిల్వలు పెరిగాయని ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది. ఈ నెల 8వ తేదీ కంటే ముందు వారానికి ఫారెక్స్ నిల్వలు 2.82 బిలియన్ డాలర్లు(రూ.23 వేలకోట్లు) పుంజుకుని 606.86 బిలియన్ డాలర్లకు(రూ.50.5 లక్షల కోట్లు) చేరుకున్నాయి. విదేశీ కరెన్సీ నిల్వలు 8.35 బిలియన్ డాలర్లు(రూ.68 వేలకోట్లు) పెరిగి 545.05 బిలియన్ డాలర్ల(రూ.45 లక్షల కోట్లు) వద్దకు చేరాయి. బంగారం నిల్వలు 446 మిలియన్ డాలర్ల(రూ.3700 కోట్లు) పెరుగుదలతో 47.58 బిలియన్ డాలర్లు(రూ.4 లక్షల కోట్లు), స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 135 మిలియన్ డాలర్ల(రూ.1100 కోట్లు) నుంచి 18.32 బిలియన్ డాలర్లకు(రూ.1.5 లక్షల కోట్లు) పుంజుకున్నాయి. ఇదీ చదవండి: రాష్ట్రాలకు రూ.72,961 కోట్లు విడుదల.. ఎందుకంటే.. ఐఎంఎఫ్లో ఫారెక్స్ నిల్వలు 181 మిలియన్ డాలర్లు పెరిగి 5.02 బిలియన్ డాలర్లకు(రూ.41 వేల కోట్లు) చేరాయి. 2021 అక్టోబర్లో భారత ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ల డాలర్ల(రూ.53 లక్షల కోట్లు) ఆల్ టైం రికార్డు నెలకొల్పాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోతున్నపుడు ఆర్బీఐ బహిరంగ మార్కెట్లో డాలర్లను విక్రయిస్తూ రూపాయి విలువ మరింత పడిపోకుండా ఆదుకుంటుంది. -
ఫారెక్స్ ట్రేడింగ్పై ఆర్బీఐ హెచ్చరికలు
ముంబై: దేశీయంగా ఫారెక్స్లో లావాదేవీలు నిర్వహించేందుకు అధికారిక అనుమతులులేని సంస్థల జాబితాను ఆర్బీఐ తాజాగా విడుదల చేసింది. వీటిపట్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాల్సిందిగా హెచ్చరించింది. అక్టాఎఫ్ఎక్స్, అల్పారి, హాట్ఫారెక్స్, ఒలింప్ ట్రేడ్సహా మొత్తం 34 సంస్థలతో జాబితాను ప్రకటించింది. ఫారెక్స్లో లావాదేవీలు చేపట్టడం, ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ల నిర్వహణకు వీటికి అధికారిక అనుమతులులేవని తెలియజేసింది. అధీకృత వ్యక్తుల ద్వారా మాత్రమే విదేశీ మారక చట్ట(ఫెమా) నిబంధనల ప్రకారం అనుమతించిన కారణాలతో ఫారెక్స్ లావాదేవీలు చేపట్టవచ్చని వివరించింది. ఇలాకాకుండా అనధికారికంగా ఫారెక్స్ లావాదేవీలు చేపట్టిన వారు ఫెమా చట్టం ప్రకారం న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో ఫారెక్స్లో డీల్ చేసేందుకు అధీకృతంకాని సంస్థలతో తమ వెబ్సైట్లో అలర్ట్ లిస్ట్ను ఉంచేందుకు నిర్ణయించినట్లు ఆర్బీఐ తెలియజేసింది. జాబితాలో ఫారెక్స్4మనీ,ఈటోరో,ఎఫ్ఎక్స్సీఎం,ఎన్టీఎస్ ఫారెక్స్ ట్రేడింగ్,అర్బన్ ఫారెక్స్,ఎక్స్ఎమ్ తదితరాలున్నాయి. -
తిరోగమన బాటలో ఫారెక్స్ నిల్వలు.. భారీగా తగ్గుదల
ముంబై: భారత్ ఫారెక్స్ నిల్వలు తిరోగమన బాటన కొనసాగుతున్నాయి. ఆగస్టు 5వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోల్చిచూస్తే, 897 మిలియన్ డాలర్లు తగ్గి, 572.978 బిలియన్ డాలర్లకు చేరాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా గణాంకాలను వెల్లడించింది. ఫారెక్స్ మార్కెట్లో అవసరాలకు సంబంధించి డాలర్ల లభ్యత తగిన విధంగా ఉండేలా చూడ్డం, ఎగుమతులకన్నా, దిగుమతులు పెరుగుదల, రూపాయి విలువ స్థిరీకరణకు చర్యలు వంటి అంశాలు ఫారెక్స్ నిల్వల తగ్గుదలకు కారణం అవుతోంది. 2021 సెప్టెంబర్ 3తో ముగిసిన వారంలో ఫారెక్స్ చరిత్రాత్మక రికార్డు 642 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే అటు తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత నిల్వలు భారత్ దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. గణాంకాల ప్రకారం.. వేర్వేరు విభాగాల్లో... ► డాలర్ రూపంలో పేర్కొనే ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ) సమీక్షా వారంలో 1.611 బిలియన్ డాలర్లు తగ్గి 509.646 బిలియన్ డాలర్లకు చేరాయి. ► సిడి నిల్వల విలువ 671 మిలియన్ డాలర్లు పెరిగి 40.313 బిలియన్ డాలర్లకు ఎగసింది. ► ఐఎంఎఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ విలువ 46 మిలియన్ డాలర్లు పెరిగి 18.031 బిలియన్ డాలర్లకు చేరింది. ► ఐఎంఎఫ్ వద్ద నిల్వల స్థాయి 3 మిలియన్ డాలర్లు తగ్గి 4.987 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆర్బీఐ గవర్నర్ భరోసా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, దిగుమతులు, రుణ సేవల అవసరాలు, పోర్ట్ఫోలియో అవుట్ఫ్లోల కారణంగా డిమాండ్కు సంబంధించి ఫారెక్స్ మార్కెట్లో విదేశీ మారకపు సరఫరాలకు సంబంధించి వాస్తవంగా కొరత ఉందని అన్నారు. తగినంత విదేశీ మారక ద్రవ్య లభ్యత ఉండేలా సెంట్రల్ బ్యాంకు మార్కెట్కు అమెరికా డాలర్లను సరఫరా చేస్తోందని చెప్పారు. ‘‘మూలధన ప్రవాహం బలంగా ఉన్నప్పుడు మనం ఫారెక్స్ నిల్వలను భారీగా కూడబెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ప్రయోజనాన్ని పొందుతున్నాం. వర్షం పడుతున్నప్పుడు ఉపయోగించేందుకు మీరు గొడుగును కొనుగోలు చేస్తారు’’ అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. -
ఆర్బీఐ కీలక చర్యలు: రూపాయికి బూస్ట్
సాక్షి, ముంబై: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రోజుకో రికార్డు కనిష్టానికి జారిపోతుండటంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) స్పందించింది. ఈసీబీ రూటులో రుణ పరిమితిని రెట్టింపు చేయడంతో సహా విదేశీ మారకపు ప్రవాహాన్ని పెంచేందుకు నిబంధనలను మరింత సరళీకృతం చేసింది. ఈ మేరకు ఆర్బీఐ బుధవారం ఒక ప్రకటన జారీ చేసింది. అస్థిరతను తగ్గించడానికి, గ్లోబల్ స్పిల్ఓవర్లను తగ్గించేందుకు, డెట్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు కొన్ని నిబంధనలను సడలించింది. మొత్తం స్థూల ఆర్థిక, ఆర్థిక స్థిరత్వాన్ని భరోసా ఇచ్చేలా ఫారెక్స్ ఇన్ఫ్లోలను పెంచడానికి ఐదుచర్యలను చేపట్టాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ తెలిపింది. అలాగే ఫారెక్స్ మార్కెట్లో లిక్విడిటీ పరిస్థితులను నిరంతరం, నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. క్రమబద్ధమైన మార్కెట్ పనితీరును నిర్ధారించే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నామని ఆర్బీఐ పేర్కొంది. ► విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్ డిపాజిట్లు FCNR(B), NRE టర్మ్ డిపాజిట్లపై క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్), స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) నుంచి మినహాయింపు ► విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్(బీ) ఎన్ఆర్ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు. ఈ సడలింపు అక్టోబర్ 31, 2022 వరకు అందుబాటులో ఉంటుంది. ► రుణంలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు పెట్టుబడులు. ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లలో మూడు మార్గాల ద్వారా ఎఫ్పీఐలు పెట్టుబడి పెట్టవచ్చు. ఎఫ్పీఐ పెట్టుబడులను ప్రోత్సహించేలా అక్టోబర్ 2015లో ప్రవేశపెట్టిన మధ్యస్థ-కాల ఫ్రేమ్వర్క్ (ఎంటీఎఫ్); (బి) మార్చి 2019లో ప్రవేశపెట్టిన వాలంటరీ రిటెన్షన్ రూట్ (వీఆర్ఆర్); (సి) ఏప్రిల్ 2020లో ఎఫ్ఏఆర్ నిబంధనల్లో మార్పులు చేసింది. ► అధీకృత డీలర్ కేటగిరీ I (AD కేటగిరీ-I) బ్యాంకుల ద్వారా విదేశీ కరెన్సీ రుణాలు ► బాహ్య వాణిజ్య రుణాలు(ECBs):ఆటోమేటిక్ ఈసీబీ మార్గంలో, అర్హత కలిగిన రుణగ్రహీతలు ఆర్బీఐని సంప్రదించకుండానే ఆర్థిక సంవత్సానికి తీసుకునే పరిమితిని 750 మిలియన్ల డాలర్ల నుంచి 1.5 బిలియన్ డాలర్లకు పెంచింది. అలాగే ఆల్ ఇన్ కాస్ట్ సీలింగ్ కూడా 100 బేసిస్ పాయింట్లకు పెంచింది. రుణ గ్రహీత పెట్టుబడి గ్రేడ్ రేటింగ్కు లోబడి ఇది ఉంటుంది. -
రూపాయి ‘బాహుబలి’
ముంబై: డాలర్తో రూపాయి మరికొంత బలపడింది. గురువారం ఫారెక్స్ మార్కెట్లో క్రితం రోజుతో పోలిస్తే 29 పైసలు లాభంతో 74.42 వద్ద ముగిసింది. ఈ ఏడాది నవంబర్ 24 తర్వాత రూపాయి తిరిగి గరిష్ట స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. ఏడాది చివర్లో బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ల విక్రయాలను చేపట్టడం రూపాయికి బలాన్నిచ్చింది. స్థానికంగా కమోడిటీ ధరలు తక్కువగా ఉండడం, ఆసియా కరెన్సీలు సైతం బలంగా ఉండడం సానుకూల సెంటిమెంట్కు దారితీసినట్టు ట్రేడర్లు పేర్కొన్నారు. ‘‘రానున్న రోజుల్లో విదేశీ పెట్టుబడులు మెరుగ్గా ఉంటాయన్న అంచనాలు, ఎగుమతిదారులు ఏడాది చివర్లో అమ్మకాలు చేపట్టడంతో డాలర్ నెల గరిష్టానికి చేరింది. సెంట్రల్ బ్యాంకు జోక్యం చేసుకోకుండా వేచి చూసే ధోరణితోనే ఉంది. చదవండి:2022 జనవరి 1 నుంచి పెరిగే, తగ్గే వస్తువుల జాబితా ఇదే..! -
బలపడుతున్న రూపాయి.. ఈ నెలలో ఇదే అత్యధికం
ముంబై: రూపాయి పరుగు ఆగడం లేదు. వరుసగా తొమ్మిదో రోజూ లాభపడింది. డాలర్ మారకంలో మంగళవారం 35 పైసలు బలపడి 74.66 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు రూపాయికి నెల రోజుల గరిష్ట స్థాయి. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 74.95 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 74.60 వద్ద గరిష్టాన్ని అందుకుంది. ఒమిక్రాన్ ఆందోళనలు, క్రూడాయిల్ ధరల రికవరీతో ఒక దశలో 74.95 కనిష్టాన్నీ నమోదు చేసింది. గడిచిన తొమ్మిది సెషన్లో రూపాయి మొత్తం 162 పైసలు బలపడింది. ‘‘అంతర్జాతీయంగా డాలర్ కరెన్సీ స్తబ్ధుగా ట్రేడ్ అవుతోంది. ఇటీవల ఫారెక్స్ ట్రేడర్లలో రిస్క్ తీసుకొనే సామర్థ్యం పెరిగింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లోని సానుకూలతలను రూపాయి అందిపుచ్చుకుంది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దిలీప్ పార్మర్ తెలిపారు. చదవండి:100 ట్రిలియన్ డాలర్లకి చేరుకోనున్న ప్రపంచ ఎకానమీ -
USA : ద్రవ్యోల్బణం ఆందోళనలు ?.. పడిపోతున్న రూపాయి విలువ !
అమెరికాలో అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.2 శాతంగా నమోదయ్యింది. గడచిన 31 సంవత్సరాల్లో ఈ స్థాయి అధిక ద్రవ్యోల్బణం నమోదుకాలేదు. ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందన్న భయాలూ ఉన్నాయి. నవంబర్లో 6.8 శాతం వరకూ ద్రవ్యోల్బణం నమోదవుతుందన్న అంచనాలు, దీనితో ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0.25 శాతం) పెంపు తప్పదన్న విశ్లేషణలు, ఇదే జరిగితే భారత్సహా వర్థమాన దేశాల నుంచి, ఈక్విటీ వంటి రిస్కీ అసెట్స్ నుంచి డాలర్ల రూపంలోని విదేశీ నిధులు భారీగా వెనక్కు వెళ్లి డాలర్ ఇండెక్స్ బలోపేతం అవుతుందన్న అభిప్రాయాలు రూపాయి సెంటిమెంట్ను బలహీనపరుస్తున్నట్లు నిపుణుల అంచనా. ఇక్కడ అవే భయాలు ! ఇక దేశీయంగా చూసినా కమోడిటీ ధరల తీవ్రత భయాలు ఒకపక్క కొనసాగుతున్నాయి. దీనికితోడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును వరుసగా తొమ్మిదవ ద్వైమాసిక సమావేశాల్లోనూ యథాతథంగా (4 శాతం) కొనసాగిస్తూ సరళతర ఆర్థిక విధానం కొనసాగించడం దేశంలోనూ ద్రవ్యోల్బణం భయాలకు ఆజ్యం పోస్తోంది. ఈ అంశంసహా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్, అధిక వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) భయాలూ రూపాయికి ప్రతికూలంగా ఉన్నాయి. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపా యి విలువ నష్టాల్లో 75.70వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ భారీ లాభాల్లో 96.40 వద్ద ట్రేడవుతోంది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). రూపాయికి తగ్గిన ‘విదేశీ నిధుల’ బలం డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం మరో 18 పైసలు కోల్పోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 75.78 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్ల బలహీన ధోరణి, విదేశీ నిధులు వెనక్కు మళ్లడం, ద్రవ్యోల్బణం భయాలు రూపాయి బలహీనతకు ప్రధాన కారణం. రూపాయి గడచిన 16 నెలల కాలంలో ఇంత కనిష్ట స్థాయిని (22 జూన్ 2020లో 75.78) చూడ్డం ఇదే తొలిసారి. 75.65 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒక దశలో 75.85 స్థాయినీ చూసింది. మూడు వారాల నుంచి రూపాయి బలహీనపడుతోంది. తాజా సమీక్షా వారం (6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య) 0.88 శాతం అంటే 66 పైసలు క్షీణించింది. చదవండి: బ్యాంకింగ్ లిక్విడిటీలో తీవ్ర ఒడిదుడుకులు! -
రెండోరోజూ బుల్ సందడి
ముంబై: స్టాక్ మార్కెట్లో రెండోరోజూ బుల్ సందడి చేసింది. ఇంధన, ఐటీ, ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లు బ్యాంకింగ్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 446 పాయింట్లు పెరిగి 59,745 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 131 పాయింట్లు లాభపడి 17,822 వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితులు, బాండ్, ఫారెక్స్ మార్కెట్లలో అస్థిరతలను విస్మరిస్తూ కొనుగోళ్లకే కట్టుబడ్డారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఇంధన షేర్లకు, డాలర్ మారకంలో రూపాయి క్షీణత ఐటీ షేర్లకు కలిసొచ్చింది. అయితే ఫార్మా, మెటల్, ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.చిన్న, మధ్య తరహా షేర్లలో ఓ మోస్తారు కొనుగోళ్లు జరగడంతో బీఎస్ఈ స్మాల్క్యాప్, మిడ్క్యాప్ ఇండెక్స్లు అర శాతం లాభపడ్డాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో 10 షేర్లు నష్టాన్ని చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1915 కోట్ల షేర్లను అమ్మగా.., దేశీయ ఇన్వెస్టర్లు రూ.1868 కోట్ల షేర్లను కొన్నారు. క్రూడాయిల్ ధరల ప్రభావంతో ఆసియా మార్కెట్లు బలహీనంగా ముగిశాయి. టెక్నాలజీ షేర్లు రికవరీతో యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఇంట్రాడే గరిష్టాల వద్ద ముగింపు... దేశీయ స్టాక్ మార్కెట్ ఉదయం మిశ్రమంగా మొదలైంది. సెన్సెక్స్ 21 పాయింట్ల స్వల్ప లాభంతో 59,320 వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 17,661 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ప్రపంచ మార్కెట్లోని ప్రతికూలతలతో సూచీలు ఆరంభంలో తడబడ్డాయి. అయితే దేశీయ మార్కెట్లో నెలకొన్న సానుకూలతలో వెంటనే కోలుకున్నాయి. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్లో సేవల రంగ నెమ్మదించినా.., గణాంకాలు ఆర్థికవేత్తల అంచనాలను అందుకోవడం మార్కెట్ వర్గాలకు ఉత్సాహాన్నిచ్చింది. యూరప్ మార్కెట్ల స్వల్ప లాభాల ప్రారంభంతో కొనుగోళ్లు మరింత ఊపందుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 479 పాయింట్లు ఎగసి 59,778 వద్ద, నిఫ్టీ 142 పాయింట్లు ర్యాలీ చేసి 17,833 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదుచేశాయి. మిడ్సెషన్లోనూ స్థిరమైన కొనుగోళ్లు జరగడంతో సూచీలు దాదాపు ఇంట్రాడే గరిష్టాల వద్ద ముగిశాయి. రెండు రోజుల్లో రూ.5.17 లక్షల కోట్లు... స్టాక్ సూచీలు వరుస లాభాలతో దూసుకెళ్లడంతో స్టాక్ మార్కెట్లో రెండో రోజుల్లో రూ.5.17 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.265 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరినట్లైంది. ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్ 980 పాయింట్లు, నిఫ్టీ 290 పాయింట్లు పెరిగింది. ప్రభుత్వానికి పీఎస్యూల డివిడెండ్లు ఓఎన్జీసీ, కోల్ ఇండియా చెల్లింపులు న్యూఢిల్లీ: ప్రమోటర్గా కేంద్ర ప్రభుత్వం ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజాలు ఓఎన్జీసీ, కోల్ ఇండియా నుంచి తాజాగా డివిడెండ్లను అందుకుంది. కోల్ ఇండియా రూ. 1,426 కోట్లు, ఓఎన్జీసీ రూ. 1,406 కోట్లు చొప్పున ప్రభుత్వానికి చెల్లించినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్వీట్ చేశారు. దీంతో ఈ ఏడాది (2021–22)లో సీపీఎస్ఈల నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వం డివిడెండ్ల రూపేణా రూ. 4,576 కోట్లు సమకూర్చుకున్నట్లు తెలియజేశారు. మరోవైపు ఇదే సమయంలో ప్రభుత్వ సంస్థల(సీపీఎస్ఈలు)లో వాటాల విక్రయం ద్వారా రూ. 9,110 కోట్లను సమీకరించినట్లు పేర్కొన్నారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ►దాదాపు రూ.300 కోట్ల ఆర్డర్లను దక్కించుకోవడంతో హెచ్ఎఫ్సీఎల్ షేరు 5% ఎగసి అప్పర్ సర్క్యూట్ వద్ద లాక్ అయ్యింది. షేరు రూ.79 స్థాయి వద్ద స్థిరపడింది. ►కేంద్రం స్పెక్ట్రం వినియోగ ఛార్జీలను తగ్గించడంతో టెలికాం షేర్లు లాభాల మోత మోగించాయి. ఈ రంగానికి చెందిన ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, టాటా టెలీ సర్వీసెస్ తదితర కంపెనీల షేర్లు ఐదు శాతం నుంచి 2% లాభపడ్డాయి. ►ఇంధన షేర్లలో ర్యాలీ భాగంగా రిలయన్స్ షేరు రాణించింది. బీఎస్ఈ ఇంట్రాడేలో రెండు శాతానికి పైగా ఎగసి రూ.2612 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. చివరికి 2% లాభంతో రూ.2609 వద్ద స్థిరపింది. ►చెల్లింపుల్లో విఫలం కావడంతో పాటు నిర్వహణ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆర్బీఐ బోర్డును రద్దు చేయడంతో శ్రేయీ ఇన్ఫ్రా షేర్లు ఐదుశాతం నష్టపోయి లోయర్ సర్క్యూట్ను తాకాయి. -
మళ్లీ లాభాల్లోకి మార్కెట్
ముంబై: నాలుగు రోజుల నష్టాల ముగింపు తర్వాత స్టాక్ మార్కెట్ మళ్లీ లాభాల పట్టాలెక్కింది. కార్పొరేట్ల రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మెప్పించవచ్చనే ఆశలతో సోమవారం స్టాక్ సూచీలు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. మెటల్, ఆర్థిక, ఐటీ, ఇంధన రంగాల షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 534 పాయింట్లు పెరిగి 59,299 వద్ద నిలిచింది. నిఫ్టీ 159 పాయింట్లు ర్యాలీ చేసి 17,691 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లలోని ప్రతికూలతలు, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణతలు సూచీల ర్యాలీని అడ్డుకోలేకపోయాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల పర్వం కొనసాగింది. గతవారంలో పతనాన్ని చూసిన మెటల్ షేర్లకు అధిక డిమాండ్ లభించింది. ప్రైవేటీకరణ ఆశలతో ప్రభుత్వ కంపెనీల షేర్లు పెరిగాయి. ఫార్మాస్యూటికల్స్, స్పెషాలిటీ కెమికల్ కౌంటర్లకు కొనుగోళ్లతో కళకళలాడాయి. క్యూ2 ఆర్థిక ఫలితాల సీజన్ను ప్రారంభించనున్న ఐటీ షేర్లలో కన్సాలిడేషన్ చోటు చేసుకుంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. దీంతో బీఎస్ఈ స్మాల్క్యాప్, మిడ్క్యాప్ ఇండెక్స్లు రెండు శాతం లాభపడ్డాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఆరు షేర్లు మాత్రమే నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.860 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.228 కోట్ల షేర్లను కొన్నారు. చైనా ఎవర్గ్రాండే గ్రూప్ రుణ సంక్షోభం, ద్రవ్యోల్బణ ఆందోళనలతో అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 19 పైసలు బలహీనపడి 74.31 వద్ద స్థిరపడింది. సూచీల భారీ ర్యాలీతో స్టాక్ మార్కెట్లో ఒక్క రోజులో రూ.3.17 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మార్కె ట్ విలువ రూ.266.77 లక్షల కోట్లకు చేరింది. ‘‘వారం రోజుల స్థిరీకరణ తర్వాత స్టాక్ మార్కెట్ బౌన్స్బ్యాక్ అయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్(జూలై–సెప్టెంబర్)ఫలితాలను అక్టోబర్ 8న దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ బోణీ చేయనుంది. తొలి దశతో పోలిస్తే ఆర్థిక వ్యవస్థపై మలి దశ కోవిడ్ ప్రభావం తక్కువగా ఉన్నందున క్యూ2లో కార్పొరేట్లు మెరుగైన ఆర్థిక గణాంకాలు ప్రకటించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే పండుగ సీజన్లో డిమాండ్ మరింత ఊపందుకోవచ్చనే ఆశలు నెలకొన్నాయి. ఈ పరిణామాలు స్టాక్ సూచీల బౌన్స్ బ్యాక్కు కారణమయ్యాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా... ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నా.., దేశీయ మార్కెట్ ఉదయం లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 377 పాయింట్ల లాభంతో 59 వేలపై 59,143 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 17600 పైన 17,616 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. వరుస నాలుగురోజు మార్కెట్ పతనంతో దిగివచ్చిన షేర్లను కొనుగోళ్లు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. తొలి సెషన్లో సెన్సెక్స్ 782 పాయింట్లు ఎగసి 59,548 వద్ద, నిఫ్టీ 219 పాయింట్లు ర్యాలీ చేసి 17,751 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. ఆసియా మార్కెట్ల నష్టాల ముగింపు, యూరప్ మార్కెట్ల బలహీన ప్రారంభంతో సూచీలు కొంతమేర లాభాల్ని కోల్పోయాయి. మిగిలిన లాభాల్ని చివరి వరకు నిలుపుకోవడంలో సూచీలు సఫలమయ్యాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ►కోవిడ్ ఔషధ తయారీ అనుమతులు లభించడంతో దివీస్ ల్యాబ్స్ షేరు ఎనిమిది శాతం లాభపడి రూ.5221 వద్ద ముగిసింది. ►ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ వార్తలతో ఎన్టీపీసీ షేరు ర్యాలీ కొనసాగుతోంది. ఇంట్రాడేలో 6.5% ఎగసింది. చివరికి 4% లాభంతో రూ.146 వద్ద స్థిరపడింది. ►వ్యాపార రికవరీ ఆశలతో టాటా మోటార్స్ షేరు 3% పెరిగి రూ.342 వద్ద నిలిచింది. ►ఇన్వెస్కో–గోయెంకా పంచాయితీ బొంబై హైకోర్టుకు చేరిన నేపథ్యంలో జీ ఎంటర్టైన్ మెంట్ 2% పెరిగి రూ.301 వద్ద ముగిసింది. -
రూపాయి.. అధరహో
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం 53 పైసలు బలపడి 73.69 స్థాయికి చేరింది. గడచిన 10 వారాల్లో రూపాయి ఇంత స్థాయిలను చూడ్డం (జూన్ 16 తర్వాత) ఇదే తొలిసారి. సరళతర ఆర్థిక విధానాలనే అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ కొనసాగిస్తుందన్న అంచనాలు, ఈక్విటీ మార్కెట్ల బులిష్ వైఖరి వంటి అంశాలు రూపాయి భారీగా బలపడ్డానికి కారణమని నిపుణుల అంచనా. ఫారెన్ బ్యాంకుల డాలర్ అమ్మకాలు, దేశంలోకి విదేశీ నిధులు భారీగా వస్తాయన్న అంచనాలు కూడా రూపాయి బలోపేతానికి కారణం. రూపాయి గురువారం ముగింపు 74.22. దీనితో పోల్చితే శుక్రవారం ట్రేడింగ్లో లాభాలతో 74.17 వద్ద ప్రారంభమైంది. వారంలో రూపాయి 70 పైసలు బలపడింది. ఈ వార్త రాస్తున్న శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 73.78 వద్ద ట్రేడవుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ 93పైన ట్రేడవుతోంది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). చదవండి : వడ్డీ రేట్ల పెంపు దిశగా అమెరికా -
4 నెలల గరిష్టానికి రూపాయి
ముంబై, సాక్షి: వారాంతాన ఒడిదొడుకులకు లోనైన దేశీ కరెన్సీ హుషారుగా ప్రారంభమైంది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 19 పైసలు పుంజుకుని 72.93 వద్ద ప్రారంభమైంది. డాలరుతో మారకంలో తదుపరి 72.90 వరకూ బలపడింది. ఇది నాలుగు నెలల గరిష్టంకాగా.. ఒక దశలో 73.03 వరకూ బలహీనపడింది కూడా. గత వారం పలు దేశాల కరెన్సీ మార్కెట్లకు సెలవుకావడంతో స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య 73.12 వద్ద ముగిసింది. ఇటీవల ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 32 నెలల కనిష్టం 90 దిగువకు చేరిన విషయం విదితమే. ఇంతక్రితం 2018 ఏప్రిల్లో మాత్రమే డాలరు ఇండెక్స్ ఈ స్థాయిలో కదిలినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. (2020: ఎఫ్పీఐల పెట్టుబడుల స్పీడ్) వ్యాక్సిన్ల ఎఫెక్ట్ కోవిడ్-19 కట్టడికి వీలుగా వారాంతాన ప్రభుత్వం ఒకేసారి రెండు వ్యాక్సిన్లకు ఆమోదముద్ర వేయడంతో దేశీ కరెన్సీకి జోష్ వచ్చినట్లు ఫారెక్స్ నిపుణులు తెలియజేశారు. దీంతో ఆర్థిక వ్యవస్థ వేగవంత రికవరీని సాధించగలదన్న అంచనాలు పెరిగినట్లు తెలియజేశారు. దీనికితోడు అక్టోబర్ 1 నుంచీ చూస్తే దేశీ స్టాక్స్లో విదేశీ పోర్ట్ఫోలియో సుమారు 20 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయడం రూపాయికి ప్రోత్సాహాన్నిస్తున్నట్లు పేర్కొన్నారు. నవంబర్లో దేశీ ఈక్విటీలలో ఎఫ్పీఐలు గత 12 ఏళ్లలోలేని విధంగా 8.1 బిలియన్ డాలర్లను పెట్టుబడులకు తరలించిన విషయం విదితమే. మరోపక్క డిసెంబర్లో రికార్డ్ స్థాయి జీఎస్టీ వసూళ్లు, కరెంట్ ఖాతా మిగులు వంటి అంశాలు సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. -
రెండో రోజూ రూపాయి పరుగు
ముంబై, సాక్షి: వరుసగా రెండో రోజు దేశీ కరెన్సీ జోరు చూపుతోంది. ప్రస్తుతం డాలరుతో మారకంలో 25 పైసలు బలపడి 73.06 వద్ద ట్రేడవుతోంది. ఇది రెండున్నర నెలల గరిష్టంకాగా.. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో తొలుత 15 పైసలు పుంజుకుని 73.16 వద్ద ప్రారంభమైంది. తదుపరి ఒక దశలో 73.05 వరకూ బలపడింది. బుధవారం సైతం డాలరుతో మారకంలో రూపాయి 11 పైసలు లాభపడి 73.31 వద్ద స్థిరపడింది. చదవండి: (2020: ఎఫ్పీఐల పెట్టుబడుల స్పీడ్) కారణాలేవిటంటే.. ఇటీవల కొద్ది రోజులుగా డాలరు ఇండెక్స్ బలహీనపడుతోంది. తాజాగా ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో 90 దిగువకు చేరింది. 89.64 వద్ద 32 నెలల కనిష్టాన్ని తాకింది. ఇంతక్రితం 2018 ఏప్రిల్లో మాత్రమే డాలరు ఇండెక్స్ ఈ స్థాయిలో కదిలినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు ఆసియా దేశాల కరెన్సీలు పుంజుకోవడం సెంటిమెంటు బలపడేందుకు దోహదం చేసినట్లు తెలియజేశాయి. ప్రధానంగా చైనా తయారీ రంగం జోరందుకోవడంతో డాలరుతో మారకంలో యువాన్ 6.54ను తాకింది. దేశీ ఎఫెక్ట్ సెప్టెంబర్కల్లా కరెంట్ ఖాతా 15.5 బిలియన్ డాలర్ల మిగులుకు చేరినట్లు ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. అంతేకాకుండా దేశీ ఈక్విటీ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల వెల్లువెత్తడం వంటి అంశాలు రూపాయికి ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. దేశీ ఈక్విటీ మార్కెట్లో గత 12 ఏళ్లలోలేని విధంగా ఎఫ్పీఐలు నవంబర్లో 8 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయగా.. డిసెంబర్లోనూ 5 బిలియన్ డాలర్లకుపైగా పంప్చేసిన సంగతి తెలిసిందే. ఈ బాటలో 2020లో ఇప్పటివరకూ 22.6 బిలయన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
రూపాయి డీలా.. ఎందుకు ఇలా?
ముంబై: ఆర్థిక రికవరీ సంకేతాలు బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో దేశీ కరెన్సీ మార్చికల్లా జోరందుకోగలదని రీసెర్చ్ సంస్థ నోమురా హోల్డింగ్స్ అంచనా వేసింది. వెరసి డాలరుతో మారకంలో రూపాయి తిరిగి కోవిడ్-19కు ముందు స్థాయి 72కు చేరుకోగలదని అభిప్రాయపడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూపాయి 72 స్థాయిలో ట్రేడయ్యింది. ఇందుకు 2004 తదుపరి కరెంట్ ఖాతాలోటు నుంచి బయటపడటంతోపాటు మిగులుదిశగా పయనించడాన్ని ప్రస్తావించింది. ఇటీవల చమురు ధరలు పతనంకావడం, బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్ పరిస్థితులు మెరుగుపడటం రూపాయికి బలాన్నివ్వగలవని పేర్కొంది. నేలచూపులో.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహాయ ప్యాకేజీ ప్రకటన, పసిడి, ముడిచమురు ధరల పెరుగుదల నేపథ్యంలో తాజాగా దేశీ కరెన్సీ వెనకడుగు వేస్తోంది. ప్రస్తుతం ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో 33 పైసలు (0.4 శాతం) కోల్పోయి 74.70ను తాకింది. ఇది రెండు నెలల కనిష్టం కాగా.. తొలుత 7 పైసలు తక్కువగా 74.44 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. తదుపరి మరింత క్షీణించింది. బుధవారం కన్సాలిడేషన్ బాటలో సాగిన రూపాయి 74.37 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఇప్పటివరకూ రూపాయి 4.2 శాతం నష్టపోవడం గమనార్హం! -
రూపాయికీ బైడెన్ ‘జో’ష్
ముంబై: డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ 46వ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టనున్న వార్తలతో డాలరు ఇండెక్స్ నీరసిస్తోంది. తాజాగా ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు రెండు నెలల కనిష్టానికి చేరింది. దీంతో వరుసగా మూడో రోజు దేశీ కరెన్సీ పుంజుకుంది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో తొలుత 74 దిగువన 73.96 వద్ద ప్రారంభమైంది. తదుపరి ఒక దశలో రూపాయి 73.84 దిగువకు బలపడింది. ప్రస్తుతం 17 పైసల లాభంతో 74.03 వద్ద ట్రేడవుతోంది. వారాంతాన రూపాయి 18 పైసలు జమ చేసుకుని 74.20 వద్ద ముగిసింది. బ్యాంకుల సపోర్ట్ జో బైడెన్ విజయంతో ప్రపంచవ్యాప్తంగా తిరిగి వాణిజ్యం ఊపందుకునే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీనికితోడు ఇప్పటికే అమెరికన్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ సరళతర మానిటరీ విధానాలకు సిద్ధమని ప్రకటించింది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 190 బిలియన్ డాలర్ల అదనపు సహాయాన్ని ప్రకటించింది. దీంతో బాండ్ల కొనుగోలు ద్వారా అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీ దాదాపు 900 బిలియన్ పౌండ్లకు చేరనున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ అంశాల కారణంగా వాణిజ్య ఆధారిత కరెన్సీల కొనుగోలుకి ట్రేడర్లు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలహీనపడినట్లు తెలియజేశారు. ప్రధానంగా చైనీస్ యువాన్ 28 నెలల గరిష్టాన్ని తాకగా.. న్యూజిలాండ్ డాలరు 19 నెలల గరిష్టానికి చేరింది. కాగా.. దేశీ స్టాక్ మార్కెట్లో ఇటీవల విదేశీ పెట్టుబడులు వెల్తువెత్తుతున్నాయి. దీంతో రూపాయి బలపడుతున్నట్లు ఫారెక్స్ వర్గాలు వివరించాయి. ఈ నెల తొలి 5 రోజుల్లో నగదు విభాగంలో ఎఫ్ పీఐలు రూ. 8,381 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. -
రెండో రోజూ రూపాయి పరుగు
ముంబై: ఈ వారం మొదట్లో సాంకేతికంగా కీలకమైన 75 సమీపానికి నీరసించిన దేశీ కరెన్సీ వరుసగా రెండో రోజు కోలుకుంది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో తొలుత 40 పైసలు(0.5 శాతం) జంప్ చేసి 73.98ను తాకింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 74 దిగువకు బలపడింది. తొలుత ఒక దశలో 51 పైసలు పుంజుకుని 73.87 వరకూ పురోగమించింది. అయితే ప్రస్తుతం కాస్త వెనకడుగు వేసింది. 19 పైసల లాభంతో 74.19 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో మారకంలో గురువారం రూపాయి 40 పైసలు లాభపడి 74.38 వద్ద ముగిసింది. కేంద్ర బ్యాంకుల సపోర్ట్ అవసరమైతే ఆర్థిక వ్యవస్థకు దన్నుగా మరిన్ని మానిటరీ చర్యలను చేపట్టేందుకు సిద్ధమంటూ తాజా పాలసీ సమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలిచ్చింది. మరోపక్క బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తాజా సమీక్షలో స్టిములస్ ను 190 బిలియన్ డాలర్ల మేరపెంచుతూ నిర్ణయించింది. దీంతో బాండ్ల కొనుగోలు ద్వారా అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీ దాదాపు 900 బిలియన్ పౌండ్లకు చేరనున్నట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. అమెరికా ప్రెసిడెంట్ రేసులో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ముందంజలో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ అంశాల కారణంగా ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల కారణంగా రూపాయి సైతం బలపడినట్లు ఫారెక్స్ వర్గాలు వివరించాయి. గురువారం నగదు విభాగంలో ఎఫ్ పీఐలు రూ. 5,368 కోట్ల పెట్టుబడులను కుమ్మరించడం గమనార్హం. -
కొనసాగుతున్న రూపాయి పతనం
గత వారం సాంకేతికంగా కీలకమైన 74 ఎగువకు క్షీణించిన దేశీ కరెన్సీ మరోసారి డీలాపడింది. ప్రస్తుతం ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో 37 పైసలు(0.4 శాతం) కోల్పోయి 74.78ను తాకింది. ఇది రెండు నెలల కనిష్టంకాగా.. మంగళవారం రూపాయి కన్సాలిడేషన్ బాటలో ఫ్లాట్గా ముగిసింది. దేశీ ఈక్విటీ మార్కెట్ హైజంప్ చేసినప్పటికీ అక్కడక్కడే అన్నట్లుగా 74.41 వద్ద ముగిసింది. యూఎస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 94 దిగువకు బలపడింది. మరోపక్క అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ అంశాల నేపథ్యంలో ఇటీవల రూపాయి బలహీనపడినట్లు ఫారెక్స్ వర్గాలు తెలియజేశాయి. సమీక్షలో భాగంగా ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించే వీలున్నప్పటికీ.. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా చర్యలు ప్రకటించవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అభిప్రాయపడింది. రూపాయి సమీప భవిష్యత్లో 75.20- 74.20 మధ్య ప్రతికూల ధోరణిలో కదిలే వీలున్నట్లు అంచనా వేసింది. -
మళ్లీ రూపాయి పతనం
సెకండ్ వేవ్లో భాగంగా పలు యూరోపియన్ దేశాలతోపాటు.. యూఎస్లోనూ కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో దేశీ కరెన్సీకి సైతం ఆ సెగ తగులుతోంది. దీంతో వరుసగా రెండో రోజు డాలరుతో మారకంలో రూపాయి పతన బాటలో సాగుతోంది. ప్రస్తుతం ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 30 పైసలు(0.4 శాతం) కోల్పోయి 74.40ను తాకింది. ఆగస్ట్ 27 తదుపరి ఇది కనిష్టంకాగా.. గురువారం రూపాయి సాంకేతికంగా కీలకమైన 74 ఎగువకు చేరిన విషయం విదితమే. గురువారం డాలరుతో మారకంలో రూపాయి 23 పైసలు క్షీణించి 74.10 వద్ద ముగిసింది. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్లకు సెలవుకాగా.. యూఎస్ కాంగ్రెస్లో ప్యాకేజీకి ఆమోదముద్ర పడకపోవడంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడుతూ వస్తోంది. ఇది రూపాయిని దెబ్బతీస్తున్నట్లు ఫారెక్స్ వర్గాలు తెలియజేశాయి. ఇదీ ప్రభావం కరోనా వైరస్ కట్టడికి వీలుగా బ్రిటన్ బాటలో తాజాగా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాలలోనూ ఆంక్షలు విధిస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీకి దెబ్బతగలనున్న అంచనాలు బలపడుతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చన్న ఆందోళనలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లు, ముడిచమురు ధరలు పతన బాటలో సాగుతుంటే.. సంక్షోభ సమయాల్లో పెట్టుబడులను ఆకట్టుకునే పసిడి మెరుస్తోంది. దీనికితోడు ఈ వారంలో అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుండటం, అధ్యక్ష ఎన్నికలు వంటి అంశాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా.. సమీపకాలంలో రూపాయికి 74.95 వద్ద గట్టి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని ఐఎఫ్ఏ గ్లోబల్ సీఈవో అభిషేక్ గోయెంకా అంచనా వేశారు. ఇదేవిధంగా 73.65 వద్ద సపోర్ట్ లభించవచ్చని అభిప్రాయపడ్డారు. -
రూపాయి బోర్లా- 74 ఎగువకు
సెకండ్ వేవ్లో భాగంగా పలు యూరోపియన్ దేశాలతోపాటు.. యూఎస్లోనూ కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో దేశీ కరెన్సీకి సైతం ఆ సెగ తగులుతోంది. తాజాగా డాలరుతో మారకంలో సాంకేతికంగా కీలకమైన 74 ఎగువకు చేరింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 17 పైసలు కోల్పోయి 74.05ను తాకింది. ఆగస్ట్ 27 తదుపరి ఇది కనిష్టంకాగా.. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో ఇటీవల డాలరు బలపడుతూ వస్తున్న విషయం విదితమే. తాజాగా డాలరు 0.3 శాతం పుంజుకుని 93.41ను తాకింది. ఇది రూపాయిని దెబ్బతీసినట్లు ఫారెక్స్ వర్గాలు తెలియజేశాయి. బుధవారం డాలరుతో మారకంలో రూపాయి 73.88 వద్ద ముగిసింది. ఇతర అంశాలూ.. కోవిడ్-19 భయాలతో స్టాక్ మార్కెట్లు పతనంకావడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు వంటి అంశాలు సెంటిమెంటును బలహీనపరచినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా వైరస్ కట్టడికి వీలుగా బ్రిటన్ బాటలో తాజాగా జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాలలోనూ ఆంక్షలు విధిస్తుండటంతో ఆర్థిక వ్యవస్థ రికవరీకి దెబ్బతగిలనున్న అంచనాలు బలపడుతున్నాయి. దీనికితోడు ఆర్థిక వ్యవస్థకు దన్నుగా మరో భారీ ప్యాకేజీని ప్రకటించే అంశంలో యూఎస్ కాంగ్రెస్ విఫలంకావడం ఇన్వెస్టర్లను నిరాశపరచినట్లు తెలియజేశారు. కాగా.. సమీపకాలంలో రూపాయి 73.40- 74.05 మధ్య ప్రతికూలంగా కదలవచ్చని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. -
75 స్థాయి దిగువకు రూపాయి
డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం 75స్థాయి దిగువకు చేరుకుంది. నేడు ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 43పైసలు బలపడి 75స్థాయి దిగువున 74.58 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. ఆర్బీఐ బ్యాంక్ డాలర్ కొనుగోళ్లను క్రమంగా తగ్గించుకోవచ్చనే అంచనాలతో పాటు ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ క్షీణించడం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ తగ్గుదల తదితర అంశాలు రూపాయి బలపడేందుకు కారణమైనట్లు ఫారిన్ విశ్లేషకులు భావిస్తున్నారు. నేటి ఉదయం గంటలకు 11:30ని.లకు డాలర్ మారకంలో రూపాయి విలువ నిన్నటి ముగింపు(75.01)తో పోలిస్తే 32పైసలు బలపడి 74.69 వద్ద ట్రేడ్ అవుతోంది. రానున్న రోజుల్లో రూపాయి అధిక స్థాయిలో ఒడిదుడుకుల ట్రేడింగ్కు లోనయ్యే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ అంచనా వేస్తుంది. నేడు 74.70-74.50 పరిధిని పరీక్షించే అవకాశం ఉందని బ్రోకరేజ్ తెలిపింది. (3 నెలల గరిష్టానికి రూపాయి) ఒక్కరోజే 50పైసలు బలపడిన రూపాయి నిన్న ఒక్కరోజే రూపాయి విలువ 50పైసల మేర బలపడింది. కోవిడ్-19 వ్యాక్సిన్పై ఆశలు, దేశీయ ఈక్విటీ మార్కెట్ల లాభాల ముగింపు, ఆయా దేశాల కరెన్సీలు బలపడటంతో ఆరు కరెన్సీ విలువల్లో డాలర్ విలువ క్షీణించడం తదితర కారణాలతో నిన్నరోజు రూపాయి విలువ 50 పైసలు బలపడి 75.01 స్థాయి వదర్ద స్థిరపడింది. తద్వారా ఏప్రిల్ 23 తదుపరి ఒకే రోజులో అత్యధిక లాభాల్ని ఆర్జించగలిగింది. -
3 నెలల గరిష్టానికి రూపాయి
డాలరుతో మారకంలో ఇటీవల బలహీనపడుతూ వస్తున్న దేశీ కరెన్సీ నేటి ట్రేడింగ్లో ఒక్కసారిగా పుంజుకుంది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 9 పైసలు బలపడి 75.51 వద్ద ప్రారంభమైంది. తదుపరి ఈక్విటీ మార్కెట్లు జోరందుకోవడం, దేశీ స్టాక్స్లో ఎఫ్పీఐల పెట్టుబడులు వంటి అంశాలు రూపాయికి జోష్నివ్వడంతో భారీగా లాభపడింది. డాలరుతో మారకంలో 59 పైసలు(0.8 శాతం) జంప్చేసి 75.01కు చేరింది. వెరసి ఏప్రిల్ 23 తదుపరి ఒకే రోజు అత్యధికంగా బలపడింది. ఒక దశలో 74.96 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. తద్వారా మార్చి 27నాటి 75 స్థాయికి చేరింది. బుధవారం డాలరుతో మారకంలో రూపాయి 75.60 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 97కు నీరసించడం కూడా రూపాయిపై సానుకూల ప్రభావం చూపినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. గత నెలలో యూరోజోన్, యూకేల తయారీ రంగం అంచనాలను మించిన వార్తలతో డాలరుతో మారకంలో యూరోతోపాటు.. యూకే పౌండ్ పుంజుకున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. -
80 స్థాయికి రూపాయి విలువ!
డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ బలహీనతలు కొనసాగే వీలున్నట్లు ఫారెక్స్ నిపుణులు వెంకట్ త్యాగరాజన్ తాజాగా పేర్కొన్నారు. ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)లో ఫారెక్స్ హెడ్ బాధ్యతల నుంచి రిటైర్ అయిన వెంకట్ ఇందుకు పలు అంశాలు కారణంకానున్నట్లు చెబుతున్నారు. కోవిడ్-19 ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడనున్న నేపథ్యంలో రూపాయి నీరసించనున్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో సమీప భవిష్యత్లో డాలరుతో మారకంలో రూపాయి విలువ 80 స్థాయికి వెనకడుగు వేయవచ్చని అభిప్రాయపడ్డారు. కోవిడ్-19 కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ నాలుగు దశాబ్దాల తదుపరి ఈ ఏడాది క్షీణతను చవిచూడనున్నట్లు అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇతర అంశాలు రూపాయి మారకపు విలువపై జీడీపీ మందగమనానికితోడు ఇతర కారణాలు సైతం ప్రభావం చూపవచ్చని వెంకట్ వివరించారు. 26ఏళ్లుగా కరెన్సీ మార్కెట్లో ట్రేడింగ్ నిర్వహించిన వెంకట్ ఆర్ఐఎల్ ఫారెక్స్ హెడ్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ ట్రెజరీను ఆర్ఐఎల్ నిర్వహించే విషయం విదితమే. రూపాయి మారకపు విలువపై ఆర్థిక వృద్ధి, కరెంట్ ఖాతా, బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్ వంటి అంశాలు ప్రభావం చూపుతుంటాయి. అంతేకాకుండా ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు కదలికలు సైతం రూపాయిని ప్రభావితం చేస్తాయని ఫారెక్స్ వర్గాలు తెలియజేశాయి. ఈ ఏడాది డీలా ఈ ఏడాది ఆసియా కరెన్సీలలోకెల్లా రూపాయి అత్యంత బలహీనపడినప్పటికీ ఇటీవల దేశీ స్టాక్స్లో విదేశీ పెట్టుబడులు ప్రవహిస్తుండటంతో కొంతమేర బలాన్ని సంతరించుకుంది. దీనికితోడు రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్లో విదేశీ దిగ్గజాలు భారీ పెట్టుబడులకు దిగడం అనుకూలిస్తున్నట్లు ఫారెక్స్ నిపుణులు పేర్కొన్నారు. గ్లోబల్ ఫండ్స్ 4.5 బిలియన్ డాలర్లను ఈ క్వార్టర్లో స్టాక్స్ కొనుగోలుకి వినియోగించినట్లు నిపుణులు తెలియజేశారు. ఇటీవల ఆర్ఐఎల్ చేపట్టిన రైట్స్ ఇష్యూ, కొటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్లో వాటా కొనుగోలు తదితరాలకు ఈ పెట్టుబడులు ప్రవహించినట్లు పేర్కొన్నారు. మరోపక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐలు) మార్గంలో 15 బిలియన్ డాలర్లకుపైగా నిధులు రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్లోకి ప్రవహించినట్లు వివరించారు. 6 శాతం డౌన్ డాలరుతో మారకంలో రూపాయి విలువ 2020లో ఇప్పటివరకూ సుమారు 6 శాతం క్షీణించింది. ఇతర ఆసియా దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయే అత్యధికంగా నీరసించింది. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎన్బీఎఫ్సీలుసహా ఫైనాన్షియల్ రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆర్థిక వృద్ధి బలహీనపడుతున్న తరుణంలో కఠిన పరపతి విధానాలకు వీలుండదని వెంకట్ పేర్కొన్నారు. కొన్ని సందర్భాలలో కరెన్సీ విలువ వెనకడుగు వేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరవచ్చని తెలియజేశారు. ఇటీవల ఫిచ్, మూడీస్ ఇన్వెస్టర్స్ తదితర దిగ్గజాలు దేశ సావరిన్ రేటింగ్ ఔట్లుక్ను డౌన్గ్రేడ్ చేశాయి. వ్యవస్థలో రుణాల స్థాయి అధికంగా ఉండటంతోపాటు.. ప్రయివేట్ రంగంలో రుణ చెల్లింపులు భారంగా మారుతున్నాయని.. దీంతో బ్యాంకింగ్ రంగం ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్లు వెంకట్ వివరించారు. డాలరుతో మారకంలో రూపాయి ఏప్రిల్లో 76.90 వద్ద చరిత్రాత్మక కనిష్టాన్ని తాకగా.. కొద్ది రోజులుగా 75 స్థాయిలో ట్రేడవుతోంది. -
ఆరంభలాభాల్ని కోల్పోయిన రూపాయి
డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం ఆరంభ లాభాన్ని కోల్పోయింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు 3నెలల గరిష్టానికి చేరుకోవడం ఇందుకు కారణమైనట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో నేడు ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ నిన్నటి ముగింపు(75.36)తో పోలిస్తే 33పైసల లాభంతో 75.03 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. ఉదయం గం.11:30ని.లకు ఉదయం లాభాల్ని కోల్పోయి 14పైసలు బలపడి 75.22 వద్ద ట్రేడ్ అవుతోంది. ‘‘ ప్రపంచ, దేశీయ ఈక్విటీలకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండటంతో రూపాయి భారీగా బలపడింది. కరోనా కట్టడిలో భాగంగా దేశీయ ఆర్థిక వ్యవస్థను క్రమంగా అన్లాక్ చేయడం కూడా రూపాయికి కలిసొచ్చింది. చైనాతో జనవరిలో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉపసంహరిచుకోలేదు.’’ రిలిగేర్ బ్రోకింగ్ సంస్థ కరెన్సీ రీసెర్చ్పర్సన్ సుగంధ్ సచ్వేద్ తెలిపారు. మన మార్కెట్ ఇప్పుడు ప్రపంచమార్కెట్ ర్యాలీకి అనుగుణంగా రాణిస్తుందని ఆయనన్నారు. రూపాయి ప్రస్తుత క్షీణత రానున్న రోజుల్లో మరింత బలపేందుకు సహాయపడుతుందుని సచ్దేవ్ అంటున్నారు. ప్రస్తుతానికి స్వల్పకాలిక దృష్ట్యా రూపాయి బలంగా ఉందని తొందర్లోనే 74.80మార్కుకు చేరుకుంటుందని సచ్దేవ్ అంచనా వేస్తున్నారు. -
రూపాయి... ఎనిమిది నెలల కనిష్టానికి పతనం
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ భారీగా పడిపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ గురువారం 26 పైసలు పతనమై 71.81 వద్ద ముగిసింది. గడచిన ఎనిమిది నెలల కాలంలో (డిసెంబర్ 14న 71.90) రూపాయి ఈ స్థాయికి బలహీనపడ్డం ఇదే తొలిసారి. ఈక్విటీ మార్కెట్ భారీ పతనం, బయటకు వెళుతున్న విదేశీ నిధులు దీనికి కారణం. చైనా కరెన్సీ యువాన్ పతనం, వర్థమాన మార్కెట్ కరెన్సీల తీవ్ర ఒడిదుడుకులకు కారణమైంది. బలహీనధోరణిలో 71.65 వద్ద ప్రారంభమైన రూపాయి, ఒక దశలో 71.97ను కూడా చూసింది. అంతర్జాతీయంగా పటిష్టంగా ఉన్న క్రూడ్ ధరలు సైతం రూపాయి సెంటిమెంట్ను బలహీనపరుస్తోంది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు క్రూడ్ ధరల భారీ పతనం, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సంకేతాల వంటి అంశాలతో రూపాయి క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. రూపాయి మరింత బలోపేతం కావడానికి ఈ నిరోధం కీలకం. అయితే ఇక్కడ నుంచి రూపాయి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది. అయితే దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, డాలర్, క్రూడ్ ధరల పటిష్టత వంటి అంశాలు రూపాయికి ప్రతికూలంగా మారుతున్నాయి. -
రూపాయి ఒకేరోజు లాభం 39 పైసలు
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం ఒకేరోజు 39 పైసలు లాభపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 68.50 వద్ద ముగిసింది. రూపాయికి ఇది గట్టి నిరోధ స్థాయి. 68.50 స్థాయిని కోల్పోయిన వెంటనే రూపాయి గతంలో వేగంగా మరింత క్షీణించింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే క్రూడ్ ధరల భారీ పతనం, ఎన్నికల అనంతరం మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాల నేపథ్యంలో రూపాయి రెండు నెలల క్రితం 68 స్థాయినీ చూసింది. అయితే అటు తర్వాత ఇటీవలి అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, ఈక్విటీ మార్కెట్ల పతనం, డాలర్ బలోపేతం, క్రూడ్ ధరలు తిరిగి ఆందోళనకర స్థాయికి చేరుతుండడం వంటి అంశాలు రూపాయికి ప్రతికూలంగా మారాయి. తాజా పరిణామాలు తక్షణం రూపాయి సెంటిమెంట్ను బలపరిచినా, క్రూడ్ ధరల పెరుగుదల, డాలర్ పటిష్టస్థాయి, అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక అనిశ్చితులు దీర్ఘకాలంలో రూపాయి విలువను ఆందోళనకు గురిచేసేవే అని నిపుణుల అంచనా. అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు బలపడ్డం, క్రూడ్ ఆయిల్ ధరల తక్షణ ఉపశమనం, శుక్రవారం కేంద్ర బడ్జెట్ అంశాలు తక్షణ రూపాయి బలోపేతం నేపథ్యం. -
రూపాయికీ ‘ఎగ్జిట్’ బూస్ట్!
ముంబై: మోదీ ప్రభుత్వమే మళ్లీ కొలువుదీరనుందంటూ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రూపాయి మారకపు విలువకూ బలాన్ని ఇచ్చాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఒకేరోజు 49 పైసలు బలపడింది. 69.74 వద్ద ముగిసింది. రూపాయి ఒకేరోజు భారీ స్థాయిలో బలపడ్డం రెండు నెలల తర్వాత (మార్చి 18న 57 పైసలు పెరిగింది) ఇదే తొలిసారి. ట్రేడింగ్ మొదట్లో 70.36 వద్ద ప్రారంభమైన రూపాయి, అటు తర్వాత 69.44 స్థాయినీ చూసింది. చివరకు రెండు వారాల గరిష్టస్థాయి 69.74 వద్ద ముగిసింది. శుక్రవారం రూపాయి విలువ ముగింపు 70.23. సోమవారం ఈక్విటీ మార్కెట్ల పరుగు రూపాయి సెంటిమెంట్నూ పటిష్టస్థాయిలో బలపరిచిందని నిపుణుల విశ్లేషణ. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే క్రూడ్ ధరల భారీ పతనం, ఎన్నికల అనంతరం మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాల నేపథ్యంలో రూపాయి రెండు నెలల క్రితం 68 స్థాయినీ చూసింది. అయితే ఇటీవలి అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, ఈక్విటీ మార్కెట్ల పతనం, డాలర్ బలోపేతం, క్రూడ్ ధరలు తిరిగి ఆందోళనకర స్థాయికి చేరుతుండడం వంటి అంశాలు రూపాయికి ప్రతికూలంగా మారాయి. తాజా ఎగ్జిట్పోల్స్ ఫలితాలు తక్షణం రూపాయి సెంటిమెంట్ను బలపరిచినా, క్రూడ్ ధరల పెరుగుదల, డాలర్ పటిష్టస్థాయి దీర్ఘకాలంలో రూపాయి విలువను ఆందోళనకు గురిచేసేవే అని నిపుణుల అంచనా. -
ఒకేరోజు రూపాయి 59 పైసలు పతనం!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు భారీగా 59 పైసలు నష్టపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 70.51 వద్ద ముగిసింది. ఇది రెండు నెలల కనిష్టం. దేశీయ ఈక్విటీ మార్కెట్ల బలహీనత, దేశం నుంచి బయటకు వెళుతున్న విదేశీ నిధులు, క్రూడ్ ధరల పటిష్ట స్థాయి వంటి అంశాలు రూపాయి సెంటిమెంట్ను పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. అమెరికా వృద్ధి సంకేతాలు, డాలర్ పటిష్టం వంటి అంశాలూ రూపాయికి బలహీనమవుతున్నాయి. రూపాయి బలహీనతలో 70.16 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో రూపాయి 70.53ను కూడా తాకింది. ఇదే పరిస్థితి కొనసాగితే తిరిగి రూపాయి సమీప పక్షం రోజుల్లోనే 72ను చూసే అవకాశం ఉందని విశ్లేషణ. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే క్రూడ్ ధరల పతనం భారీ పతనం, ఎన్నికల అనంతరం మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాల నేపథ్యంలో రూపాయి రెండు నెలల క్రితం 68 స్థాయినీ చూసింది. అయితే తాజా అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, ఈక్విటీ మార్కెట్ల పతనం, డాలర్ బలోపేతం, క్రూడ్ ధరల పటిష్ట స్థాయి వంటి అంశాలు రూపాయికి ప్రతికూలంగా మారుతున్నాయి. -
‘సెలవుల వారం’ అప్రమత్తత
ముంబై: ఫారెక్స్ మార్కెట్లో ట్రేడర్లు పూర్తి అప్రమత్తత పాటిస్తున్నారు. ఈ వారంలో రెండు రోజులు సెలవు దినాలు (17వ తేదీ బుధవారం మహవీర్ జయంతి , 19వ తేదీ శుక్రవారం గుడ్ఫ్రైడే) కావడం దీనికి కారణం. అంతర్జాతీయంగా అప్రమత్తత పాటించడానికి వీలుగా ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్లకోసం డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం 25పైసలు తగ్గి, 69.42 వద్ద ముగిసింది. సోమవారం ట్రేడింగ్లో 69.07 వద్ద ప్రారంభమైన రూపాయి ఒక దశలో 69.46ను కూడా చూసింది. శుక్రవారం రూపాయి ముగింపు 69.17. 74.39 గరిష్ట నుంచి... అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి దాదాపు 20 డాలర్లకుపైగా పెరగడంతో అటు తర్వాత రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. రెండు నెలల క్రితం 72–70 మధ్య కదలాడింది. అయితే కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టేది మోదీనేనన్న అంచనాలు, స్థిరంగా దేశంలోకి వస్తున్న విదేశీ నిధులు, ఈ నేపథ్యంలో ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి గత రెండు నెలలుగా సానుకూలమవుతోంది. అయితే క్రూడ్ ధరల కత్తి ఇప్పటికీ వేలాడుతున్న విషయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, రూపాయి మరీ పడిపోయే పరిస్థితి ఏదీ ప్రస్తుతానికి లేదని నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతం ఇది 68.50–70 శ్రేణి వద్ద స్థిరీకరణ పొందుతోందని వారు పేర్కొంటున్నారు. -
రూపాయి75 పైసలు డౌన్!
ముంబై: నాలుగు ట్రేడింగ్ సెషన్ల నుంచీ వరుసగా లాభాల బాటన పయనిస్తూ వచ్చిన రూపాయి మళ్లీ నష్టాల బాట పట్టింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో బుధవారం ఒకేరోజు డాలర్ మారకంలో 75పైసలు నష్టపోయి, 70.18 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఆరు దేశాల కరెన్సీలపై డాలర్ బలహీనత, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు, బలహీన వస్తు సేవల పన్ను వసూళ్లు రూపాయి సెంటిమెంట్పై ప్రభావం చూపాయి. మంగళవారం రూపాయి 34 పైసలు లాభంతో 69.43 వద్ద ముగిసింది. అయితే బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 69.60 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 70.23ను సైతం తాకింది. తగ్గిన క్రూడ్ ధరలే ప్రస్తుతం రూపాయి సెంటిమెంట్ కొంత బలంగా ఉండడానికి కారణం. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో... క్రమంగా కోలుకుంటూ వస్తోంది. -
తొలి రోజు రూపాయికి బలం
ముంబై: కొత్త సంవత్సరం తొలి రోజున రూపాయి తన బలాన్ని చూపించింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో పోలిస్తే 34 పైసలు లాభపడి 69.43 వద్ద క్లోజయింది. అంతకుముందు రెండు రోజుల్లో రూపాయి లాభపడిన విషయం తెలిసిందే. మొత్తంమీద మూడు రోజుల్లో రూపాయి 92 పైసలు రికవరీ అయింది. ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం, స్టాక్ మార్కెట్ల ర్యాలీ కలిసొచ్చాయి. ఎగుమతిదారులు, బ్యాంకులు డాలర్లను విక్రయించడం రూపాయి బలపడటానికి కారణమని ట్రేడర్లు తెలిపారు. ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం తొలుత 69.63 వద్ద ప్రారంభమైన రూపాయి ఆ తర్వాత మరింత బలపడింది. గత సంవత్సరం చివరి రోజు రూపాయి 18 పైసల లాభంతో ముగింపు పలికిన విషయం గమనార్హం. గత సంవత్సరంలో మొత్తం మీద రూపాయి 9.23 శాతం విలువను కోల్పోయింది. 2017 చివరికి రూపాయి డాలర్తో 63.87వద్ద ఉండటం గమనార్హం. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో... క్రమంగా కోలుకుంటూ వస్తోంది. -
53 పైసలు పతనమైన రూపాయి
ముంబై: డాలర్తో పోలిస్తే రూపాయి మంగళవారం 53 పైసలు నష్టపోయింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆకస్మికంగా రాజీనామా చేయడం, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీయడంతో డాలర్తో రూపాయి మారకంపై ప్రతికూల ప్రభావం పడింది. సోమవారం డాలర్తో రూపాయి విలువ 71.32 వద్ద ముగిసింది. దీంతో పోలిస్తే మంగళవారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 110 పైనల నష్టంతో 72.42 వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఒక దశలో కోలుకుని 71.67ను తాకింది. చివరకు 53 పైసల నష్టంతో 71.85 వద్ద ముగిసింది. 110 పైసల భారీ నష్టంతో ట్రేడింగ్ను ఆరంభించినప్పటికీ, స్టాక్ సూచీలు నష్టాల నుంచి లాభాల్లో ముగియడం, చివర్లో ప్రభుత్వ రంగ బ్యాంక్లు డాలర్లను విక్రయించడంతో రూపాయి నష్టాలు ఒకింత రికవరీ అయ్యాయి. -
ఆర్థిక అనిశ్చితి నీడన రూపాయి!
ముంబై: రికవరీ అవుతోందనుకున్న రూపాయి... మళ్లీ పతన బాట పట్టింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం రూపాయి విలువ డాలర్ మారకంలో 50 పైసలు పడి 71.32 వద్ద ముగిసింది. దేశీయంగా, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి అంశాల ప్రభావం రూపాయిపై పడుతోంది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అటు తర్వాత క్రమంగా కోలుకుంటూ, ఈ నెల ప్రారంభంలో దాదాపు 69.50 వరకూ రికవరీ అయ్యింది. క్రూడ్ ధరలు తగ్గడం, దేశంలోకి తాజాగా వచ్చిన విదేశీ నిధులు దీనికి కారణం. అయితే ఈ స్థాయిలో రూపాయి నిలబడలేక బలహీన ధోరణిలోకి జారింది. ఇందుకు ప్రధాన కారణాలను చూస్తే...అధ్యక్షుల సమావేశంతో ముగిసిపోయిందను కున్న అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం భయాలు తిరిగి (చైనాకు చెందిన టెలికం దిగ్గజం హువావే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మెంగ్ వాంజూ కెనడాలో అరెస్ట్తో) ప్రారంభం కావడం. తగ్గాయనుకున్న క్రూడ్ ధరలు (ఒపెక్, రష్యా చమురు కోతల నిర్ణయంతో) తిరిగి పెరుగుతాయన్న ఆందోళనలు దీనితో కరెంట్ అకౌంట్ లోటుపై హెచ్చరికలు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీని ఇస్తుందన్న అంచనాలు. నేడు మరింత డౌన్? పలు బలహీన అంశాల నేపథ్యంలో రూపాయి సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 71.28 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 71.44కు పడిపోయింది. ఈక్విటీ మార్కెట్ల భారీ పతనమూ రూపాయి సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఈ వార్తరాసే సమయం రాత్రి 8.30 గంటలకు అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో రూపాయి విలువ బలహీనంగా 72.50 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం రూపాయి మరింత బలహీనపడే అవకాశాలు ఉన్నాయన్న విశ్లేషనలూ ఉన్నాయి. ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలకు ఉర్జిత్ పటేల్ రాజీనామా ఇందుకు ప్రధాన కారణమయ్యే అవకాశం ఉండగా, ఐదు రాష్ట్రాల ఎన్నికలు బిజేపీకి వ్యతిరేకంగా ఉంటే, పతనం మరింత వేగంగా ఉండవచ్చు. రూపాయి మళ్లీ 75వైపు పయనించే అవకాశం ఉందని కొన్ని సంస్థలు విశ్లేషణలు చేస్తున్న విషయం గమనార్హం. -
రూపాయి భారీ పతనం!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం ఒక్కసారిగా వెనక్కు జారింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 88 పైసలు తగ్గి 70.46కు పడిపోయింది. గడచిన మూడు నెలల్లో ఒకరోజు రూపాయి ఇంత భారీ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. ఇటీవల గరిష్ట స్థాయిల నుంచి 30 డాలర్లు దిగివచ్చిన క్రూడ్ ధరలు తిరిగి పెరిగే అవకాశాలు (క్రూడ్ ఉత్పత్తి కోతలకు రష్యా, సౌదీ అరేబియా నిర్ణయం) ఉన్నాయన్న అంచనాలు, ప్రధాన కరెన్సీలతో డాలర్ బలోపేతం వంటివి రికవరీ బాటన ఉన్న రూపాయి సెంటిమెంట్ను బలహీనపరిచాయి. శుక్రవారంనాడు వెలువడిన జీడీపీ గణాంకాల ప్రకారం– వినియోగం, వ్యవసాయ రంగాలు బలహీనంగా ఉండటమూ రూపాయికి ప్రతికూలమైంది. ఇక ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు సంబంధించి ద్రవ్యలోటు అంచనాలను దాటిపోవడం ఇక్కడ గమనార్హం. ఆయా అంశాలు ఫారెక్స్ డీలర్లు, దిగుమతిదారులు డాలర్ డిమాండ్ను పెంచాయి. గత శుక్రవారంతో పోల్చితే 69.86 వద్ద నష్టంతో రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. చివరకు నాలుగు నెలల గరిష్ట స్థాయిల నుంచి కిందకు పడింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. -
రూపాయి రయ్ రయ్
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ రికవరీ కొనసాగుతోంది. శుక్రవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఒకేరోజు 27 పైసలు లాభపడి 69.58 వద్ద ముగిసింది. క్రూడ్ ఆయిల్ ధరలు గరిష్టం నుంచి దాదాపు 30 డాలర్లు పతనం కావడం రూపాయి వేగవంతమైన రికవరీకి దారితీస్తోంది. దీంతోపాటు దేశంలోకి తాజా విదేశీ మూలధన నిధుల రాక కూడా రూపాయి సెంటిమెంట్ను బలపరుస్తోంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 5 బిలియన్ డాలర్లు వెనక్కు తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు, నవంబర్లో భారత్ ఈక్విటీల్లో 558 మిలియన్ డాలర్ల తాజా పెట్టుబడులు పెట్టారు. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అటు తర్వాత వేగంగా కోలుకుంటూ వచ్చింది. -
రూపాయి రికవరీ బాట
ముంబై: డాలర్తో రూపాయి మారకం విలువ మూడు వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. బుధవారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో 41 పైసలు లాభపడి 73.16 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో 73.09 వరకు కూడా రికవరీ అయింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు చల్లబడడం రూపాయి విలువ రికవరీకి కారణమైనట్టు ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. ఇరాన్పై నవంబర్ 4 నుంచి అమెరికా ఆంక్షలు అమల్లోకి రానుండడం కారణంగా, చమురు సరఫరాలో లోటు ఏర్పడితే దాన్ని తాము భర్తీ చేస్తామని సౌదీ అరేబియా ప్రకటించడం ధరలు తగ్గటానికి కారణమైంది. ఈ ప్రకటనతో బ్రెంట్ చమురు బ్యారెల్ 76 డాలర్లకు దిగొచ్చింది. చమురు ధరలు తగ్గడంతో విదేశీ నిధులు తరలిపోవడంపై ఆందోళనలు కొంత తగ్గాయి. అదే సమయంలో బ్యాంకులు, ఆయిల్ కంపెనీలు డాలర్లను విక్రయించడం కూడా రూపాయి బలపడడానికి దారితీసింది. మంగళవారం రూపా యి 73.57 వద్ద క్లోజయిన విషయం తెలిసిందే. -
రూపాయి... ఒకే రోజు 55 పైసలు లాభం
ముంబై: ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం ఒకేరోజు 55 పైసలు లాభపడింది. గడచిన మూడు వారాల్లో ఒకేరోజు రూపాయి ఇంత ఎక్కువగా రికవరీ అవ్వడం ఇదే తొలిసారి. వరుసగా ఆరు రోజులు ఏ రోజుకారోజు కొత్త రికార్డులతో పతనం బాట పట్టిన రూపాయి ఈ నెల 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు తర్వాత 10,11,12 తేదీల్లో వరుసగా 18, 09, 55 పైసలు చొప్పున మొత్తం 82 పైసలు బలపడింది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు గరిష్ట స్థాయిల నుంచి దాదాపు ఐదు డాలర్లు తగ్గడం, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల వాతావరణం దీనికి ప్రధాన కారణాలు. మరోవైపు రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి అటు కేంద్రం ఇటు ఆ ర్బీఐ కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాయి. విదేశీ మారకం నిధుల ఆకర్షణ, మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడటంపై కేంద్రం దృష్టి సారించింది. శుక్రవారం ప్రారంభంతోటే రూపాయి పటిష్టంగా 73.84 వద్ద ప్రారంభమైంది. (గురువారం ముగింపు 74.12) అటు తర్వాత 73.52 స్థాయి వరకూ బలపడింది. దిగుమతిదారులు, బ్యాంకర్లు డాలర్లను భారీగా అమ్మారు. -
జారుడు బల్లపైనే రూపాయి..
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ మరింత పతనమవుతోంది. ఈ పతనంలో ఏ రోజుకారోజు కొత్త రికార్డులను నమోదు చేస్తోంది కూడా. వారం ప్రారంభం రోజునే ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ గత శుక్రవారంతో పోలిస్తే 30 పైసలు పతనమై, 74.06 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 74.10కి సైతం పడిపోయింది. నిజానికి రెండు నెలల కిందట అసలు రూపాయి 74 స్థాయికి వస్తుందని ఎవరూ కల లో కూడా అనుకోలేదు. ఈ ఏడాది ఆగస్టు రెండో వారం వరకూ 68–69 స్థాయిని మించని రూపాయి... ఆగస్టు రెండో వారంలో మాత్రం తొలి సారిగా 70 స్థాయికి చేరింది. ఆ తరువాతి నుంచీ పెరుగుతూనే ఉంది. ఏ రోజుకారోజు కొత్త రికార్డు స్థాయికి పడిపోతూనే ఉంది. గత శుక్రవారం ముగింపు 73.76 కాగా... సోమవారం ప్రారంభంతోనే గ్యాప్డౌన్తో 14 పైసలు మైనస్తో 73.90 వద్ద ప్రారంభమైంది. ఒకదశలో 73.76కి చేరింది. కానీ అక్కడ నిలబడలేకపోయింది. చివరకు 74ను కూడా దాటేసి కొత్త రికార్డు స్థాయిలకు జారిపోయింది. ఇవీ... ప్రధాన కారణాలు: అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం వృద్ధి బాటలో పయనిస్తోంది. చాలా దృఢంగా ఉంది. ఆ నేపథ్యంలో ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేట్లు పెంచుతోంది. ఫలితంగా దీనితో బాండ్లపై వచ్చే ఈల్డ్స్ (రాబడి) ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. ఈ ప్రయోజనాన్ని పొందటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాలర్ పెట్టుబడులు అమెరికాకు తిరిగి వెళ్లిపోతున్నాయి. అందులో భాగంగానే మన మార్కెట్ల నుంచి కూడా విదేశీ పెట్టుబడులు తరలి వెళుతున్నాయి. అవి రూపాయి పతనానికి కారణంగా నిలుస్తున్నాయి. ♦ దీనికితోడు అక్టోబర్ 5 పాలసీ సమీక్ష సందర్భంగా రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) రేట్లు కనీసం పావుశాతమయినా పెంచకపోవడంతో ఇక్కడ వచ్చే రాబడి పెరిగే అవకాశం లేదన్నది రూఢీ అయిపోయింది. ఇది రూపాయి పతన ధోరణిని మరింత తీవ్రం చేసింది. ♦ ఇక డాలర్ ఇండెక్స్ పటిష్ట ధోరణితో పాటు మన దేశం ప్రధానంగా దిగుమతి చేసుకునే బ్రెంట్ క్రూడ్ ధరలు ఎగస్తున్నాయి. దీనితో దేశీయంగా వాణిజ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యోల్బణం పెరుగుతాయన్న భయాలు నెలకొన్నాయి. ఇవి రూపాయిని పతన దిశగా తోస్తున్నాయి. ♦ రూపాయి వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్ల నుంచీ ఏ రోజుకారోజు కొత్త రికార్డులను నమోదుచేసుకుంటోంది. కేంద్రం, ఆర్బీఐ పలు చర్యలు తీసుకున్నా తగిన ప్రయోజనం కనిపించడం లేదు. నిజానికి ఆర్బీఐ రేటు పెంపు లేదని తెలిసిన వెంటనే రూపాయి శుక్రవారం 74.23కు పడిపోయింది. అయితే భయపడాల్సిన పనిలేదని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించటంతో కొంత కోలుకుని 73.76 వద్ద ముగిసింది. కానీ సోమవారం మళ్లీ పతనం బాట పట్టింది. -
మార్కెట్కు ఆర్బీఐ షాక్
అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఆర్బీఐ కీలక రేట్లలో యథాతథ స్థితిని కొనసాగించడం స్టాక్ మార్కెట్కు షాక్నిచ్చింది. పైగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని, అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వృద్ధి, ద్రవ్యోల్బణంపై వీటి ప్రభావం తీవ్ర స్థాయిలోనే ఉండనున్నదని ఆర్బీఐ హెచ్చరించడం మరింత కలవరపరిచింది. కీలక రేట్లను పెంచకపోవడంతో డాలర్తో రూపాయి మారకం 74 మార్క్ను దాటింది. ప్రపంచ మార్కెట్ల పతనం కూడా ప్రభావం చూపడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్కు భారీ నష్టాలు వచ్చాయి. రేట్ల ప్రకటన వరకూ ఒక స్థాయి నష్టాల్లో కదలాడిన స్టాక్ మార్కెట్, ప్రకటన అనంతరం భారీగా నష్టపోయింది. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 35వేల పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,400 పాయింట్ల దిగువకు పడిపోయాయి. స్టాక్ సూచీలు నష్టపోవడం ఇది వరుసగా మూడోరోజు. బీఎస్ఈ సెన్సెక్స్792 పాయింట్లు (2.25 శాతం) నష్టపోయి 34,377 పాయింట్ల వద్ద, ఎన్ ఎస్ఈ నిఫ్టీ 283 పాయింట్లు (2.67 శాతం) పతనమై 10,316 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్కు ఇది ఐదు నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఇంట్రాడేలో సెన్సెక్స్ 967 పాయింట్లు, నిప్టీ 336 పాయింట్ల వరకూ నష్టపోయాయి. వారం వారీ చూస్తే... రెండేళ్లలో భారీ నష్టాలిప్పుడే ఈ వారంలో స్టాక్ సూచీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1,850 పాయింట్లు (5.1 శాతం), నిఫ్టీ 614 పాయింట్లు (5.50 శాతం) చొప్పున క్షీణించాయి. ఒక్క వారంలో స్టాక్ సూచీలు ఈ స్థాయిలో నష్టపోవడం రెండేళ్లలో ఇదే మొదటిసారి. వరుసగా ఐదో వారమూ స్టాక్ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. కాగా ఈ ఏడాది ఆగస్టు 28న స్టాక్ సూచీలు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. అప్పటి నుంచి చూస్తే, సెన్సెక్స్ 4,600 పాయింట్లు, నిఫ్టీ 1,400 పాయింట్లు చొప్పున క్షీణించాయి. ఈ ఏడాది సెన్సెక్స్ సాధించిన లాభాలన్నీ దాదాపు హరించుకుపోయాయి. సెన్సెక్స్ మరో 68 పాయింట్లు పతనమైతే, నెగిటివ్ జోన్లోకి జారిపోతుందని విశ్లేషకులంటున్నారు. రోజంతా నష్టాలే... సెన్సెక్స్ స్వల్ప లాభాల్లో ఆరంభమైనప్పటికీ, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. రోజంతా నష్టాల్లోనే ట్రేడయింది.ఆర్బీఐ పాలసీ ప్రకటన అనంతరం అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇంట్రాడేలో 967 పాయింట్లు నష్టపోయి 34,202 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. విపత్కర పరిస్థితుల్లో ఆదుకునే షేర్లుగా పేరుగాంచిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ ద్వయం.. షేర్లు కూడా పతనమవడంతో సెన్సెక్స్కు భారీ నష్టాలు తప్పలేదు. రూపాయి మరింత బలహీనపడటం వల్ల ద్రవ్యలోటు భయాలు మరింతగా ఎగిశాయని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. తదుపరి మద్దతు 10,100 పాయింట్లు...? ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ఓవర్ సోల్డ్ పొజిషన్లు ఉన్నందున సాంకేతికంగా రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకునే అవకాశాలున్నాయని రెలిగేర్ బ్రోకింగ్ ప్రెసిడెంట్, జయంత్ మాంగ్లిక్ అంచనా వేశారు. మొత్తం మీద చూస్తే... సెంటిమెంట్ బేరిష్గానే ఉందని, పెరిగినప్పుడల్లా అమ్మేయాలనే వ్యూహాన్ని ట్రేడర్లు అనుసరించాలని, షేర్ల ఎంపికలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. మరోవైపు నిఫ్టీ కీలకమైన 10,400–10,350 మద్దతు స్థాయిలను కోల్పోయిందని, తదుపరి మద్దతు స్థాయి 10,100 పాయింట్లని కొంతమంది నిపుణులు పేర్కొన్నారు. ఆశ్చర్యపరిచిన ఆర్బీఐ ‘పాలసీ’ డాలర్తో రూపాయి మారకం ప్రతి రోజూ జీవిత కాల కనిష్ట స్థాయిలకు చేరుతోంది. ఈ నేపథ్యంలో తన పాలసీలో కీలక రేట్లను ఆర్బీఐ తప్పక సవరిస్తుందనే అంచనాలు సర్వత్రా నెలకొన్నాయి. రెపో రేటు పెంచటం, బ్యాంకులకు మరింత నగదు అందుబాటులో ఉండేలా క్యాష్ రిజర్వ్ రేషియోను (సీఆర్ఆర్) తగ్గించటం వంటివి చేస్తుందనే అంచనాలున్నాయి. దీనికి భిన్నంగా ఆర్బీఐ రేట్ల విషయమై యథాతథ స్థితిని కొనసాగించింది. దీంతో రూపాయి తొలిసారిగా 74 మార్క్ను దాటేసింది. ఇంట్రాడేలో 65 పైసల నష్టంతో 74.23 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత కోలుకుని గురువారం నాటి ముగింపుతో పోల్చితే 18 పైసల నష్టంతో 73.76 వద్ద ముగిసింది. మరోవైపు రేట్లపై నిర్ణయానికి ప్రస్తుతం అనుసరిస్తున్న తటస్థ విధానాన్ని విడనాడి డేటాను బట్టి అనుగుణ్యమైన నిర్ణయాలు తీసుకునే విధానాన్ని అనుసరించనున్నామని ఆర్బీఐ వెల్లడించడం కూడా స్టాక్ మార్కెట్ను ఆశ్చర్యానికి గురిచేసింది. అధఃపాతాళానికి ఆయిల్ షేర్లు ఆయిల్ షేర్ల నష్టాలు శుక్రవారం కూడా కొనసాగాయి. భారం తగ్గించామని, ఆయిల్ కంపెనీలు కూడా లీటర్కు రూ.1 భారం భరించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురు వారం సూచించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ధరలను నిర్ణస్తున్నాయి. జైట్లీ తాజా వ్యాఖ్యలతో ఇంధన ధరలపై మళ్లీ ప్రభుత్వ నియంత్రణ వస్తుందనే ఆందోళనలతో ఈ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు పలు రేటింగ్ సంస్థలు ఈ షేర్ల రేటింగ్లను తగ్గించాయి. హెచ్పీసీఎల్ 25 శాతం పతనమై రూ.165 వద్ద, బీపీసీఎల్ 21 శాతం తగ్గి రూ.265 వద్ద, ఐఓసీ 17 శాతం నష్టపోయి రూ.118 వద్ద, ఓఎన్జీసీ 16 శాతం పడిపోయి రూ.147 వద్ద, గెయిల్ 10 శాతం పతనమై రూ.331 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో ఈ షేర్లన్నీ తాజాగా ఏడాది కనిష్ట స్థాయిలను కూడా తాకాయి. కాగా లీటర్కు రూ.1 తగ్గించడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ కంపెనీల నికర లాభం రూ.4,500 కోట్లు, స్థూల లాభం రూ.9,000 కోట్ల మేర తగ్గుతుందని అంచనా. కానీ జైట్లీ వ్యాఖ్యలతో ఆయిల్ కంపెనీల మార్కెట్ క్యాప్ గడిచిన రెండు రోజుల్లో రూ.2 లక్షల కోట్ల వరకూ ఆవిరై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొండ నాలుకకు మందేస్తే, ఉన్న నాలుక కూడా ఊడిపోయిందన్నట్లుగా జైట్లీ వ్యాఖ్యల కారణంగా ఆయిల్ కంపెనీల మార్కెట్ క్యాప్ భారీగా పతనమైందని వారు పేర్కొన్నారు. 4 రోజుల్లో రూ.8 లక్షల కోట్లు ఆవిరి సెన్సెక్స్ భారీ పతనంతో ఇన్వెస్టర్ల సంపద రూ.3.79 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం క్యాపిటలైజేషన్ శుక్రవారం నాటికి రూ.136.61 లక్షల కోట్లకు పడిపోయింది. ఇది దాదాపు సంవత్సరం కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఈ సోమవారం నుంచి మొత్తం నాలుగు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.8 లక్షల కోట్లు హరించుకుపోయింది. -
74ను దాటిన రూపాయి!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ మూడు రోజుల నుంచీ ఏ రోజుకారోజు కొత్త కనిష్ట స్థాయిలకు జారిపోతోంది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ శుక్రవారం ఒకదశలో 74.23కు జారింది. అయితే కొంత రికవరీతో 73.76 వద్ద ముగిసింది. బుధవారం ముగింపుతో పోలిస్తే ఇది 18 పైసలు పతనం. ఈ రెండు ముగింపులూ చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు కావడం గమనార్హం. గురువారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఒక దశలో 73.81 స్థాయికి పతనమైనా... తర్వాత కొంత కోలుకుని 73.58 వద్ద ముగిసింది. ఇవి రెండూ గురువారానికి చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు. సోమవారం నుంచీ వరుసగా జరిగిన నాలుగు (మంగళవారం 2వ తేదీ గాంధీజీ జయంతి సందర్భంగా మార్కెట్ సెలవు) ట్రేడింగ్ సెషన్లలో రూపాయి 128 పైసలు కోల్పోయింది. ఏడాది ప్రారంభం నుంచీ దాదాపు 17% పడింది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల పెంపు, దేశం నుంచి వెళ్లిపోతున్న విదేశీ పెట్టుబడులు, దీనితో కరెంట్ అకౌంట్ లోటు భయాల వంటివి రూపాయి భారీ పతనానికి దారితీస్తున్నాయి. రూపాయి పతనం అడ్డుకట్టకు కేంద్రం, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు ఎటువంటి ఫలితాలనూ ఇవ్వడం లేదు. ఆర్బీఐ పాలసీ కూడా నష్టానికి కారణమే! రూపాయి శుక్రవారం 74 దిగువకు పడిపోడానికి ఆర్బీఐ పాలసీ విధానమూ కారణమయ్యింది. వివరాల్లోకి వెళితే, అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ తన వడ్డీరేట్లను (వడ్డీ రేట్ల శ్రేణి 2–2.25 శాతం) పెంచుతూ వస్తోంది. దీనితో ఈ బాండ్ల రేట్లు తగ్గుతూ, దీనిపై వచ్చే ఈల్డ్స్ (వడ్డీ) పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఈల్డ్స్ నుంచి ప్రయోజనం పొందడానికి దేశంలోని విదేశీ పెట్టుబడులు మార్కెట్ నుంచి వెనక్కు వెళ్లడం ప్రారంభించాయి. దీనికి అడ్డుకట్ట వేయడానికి దేశంలోనూ రేటు పెంపు తప్పదని నిపుణులు విశ్లేషించారు. దీనికి భిన్నంగా రేటు యథాతథ స్థితి కొనసాగించడంతో దేశీయ కరెన్సీ సెంటిమెంట్ ఒక్కసారిగా దెబ్బతింది. డాలర్లకు డిమాండ్ తీవ్రమవడంతో రూపాయి కుదేలయ్యింది. -
రూపాయి... 74కు చేరువలో!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ పతనం కొనసాగుతోంది. గురువారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఒక దశలో 73.81 స్థాయికి పతనమైనా... ఆ తర్వాత కొంత కోలుకుని 73.58 వద్ద ముగిసింది. ఇది బుధవారం ముగింపుతో పోలిస్తే 24 పైసలు ఎక్కువ. గురువారం ఇంట్రాడే, ముగింపు విలువలు రెండూ రూపాయికి చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు కావడం గమనార్హం. సోమవారం నుంచీ వరుసగా జరిగిన మూడు (మంగళవారం 2వ తేదీ గాంధీజీ జయంతి సందర్భంగా మార్కెట్ సెలవు) ట్రేడింగ్ సెషన్లలో రూపాయి 110 పైసలు (1.51 శాతం) కోల్పోయింది. ఏడాది ప్రారంభం నుంచీ 16 శాతం పడింది. బుధవారం మొదటిసారి రూపాయి 73 దిగువకు పడింది. 73.34 వద్ద ముగిసిన రూపాయి ఒకదశలో 73.42ను చూసి, రెండు అంశాల్లోనూ కొత్త రికార్డు స్థాయిలకు పడింది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల పెంపు, దేశం నుంచి వెళ్లిపోతున్న విదేశీ పెట్టుబడులు, దీనితో కరెంట్ అకౌంట్ లోటు భయాల వంటివి రూపాయి భారీ పతనానికి దారితీస్తున్నాయి. మరోవంక రూపాయి జారిపోకుండా నిరోధించడానికి కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకుంటున్న చర్యలు ఎటువంటి ఫలితాలనూ ఇవ్వడం లేదు. -
రూపాయి రికవరీ.. 72.18 వద్ద ముగింపు..
ముంబై: కొత్త కనిష్ట స్థాయికి పడిపోతున్న రూపాయి బుధవారం కొంత కోలుకుంది. డాలర్తో దేశీ కరెన్సీ మారకం విలువ 51 పైసలు బలపడి 72.18 వద్ద ముగిసింది. రూపాయి మరీ పడిపోకుండా తగు చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ భరోసా కల్పించడం దీనికి తోడ్పడింది. మొదట్లో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ బుధవారం కూడా 72.91 స్థాయికి పడిపోయి కొత్త కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ వారాంతంలో ప్రధాని మోదీ ఆర్థిక వ్యవహారాల్ని సమీక్షిస్తారని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ ట్వీట్ చేయడం కొంత ఊతమిచ్చింది. పతనాన్ని అడ్డుకుంటాం..: డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ‘అసంబద్ధ స్థాయి’కి పడిపోకుండా ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ అన్ని చర్యలు తీసుకుంటాయని గర్గ్ స్పష్టం చేశారు. రూపాయి ఆల్టైమ్ కనిష్టానికి పతనం కావడం వెనుక హేతుబద్ధత లేదని, మార్కెట్ ఆపరేటర్ల ఓవర్రియాక్షన్ను ఇది ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. ట్విట్టర్లో ఈ మేరకు ఆయన పోస్ట్ చేశారు. క్రూడ్ ధరలు పెరుగుతుండటం, విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం తదితర అంశాల నడుమ రూపాయి క్షీణత కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. -
జారుడు బల్లపైకి మళ్లీ రూపాయి
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ మళ్లీ జారిపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గురువారం ఒకేరోజు 30 పైసలు పతనమయ్యింది. చివరకు 70.11 వద్ద ముగిసింది. అమెరికా వడ్డీరేట్ల పెంపు భయాలు, క్రూడ్ ధరలు పెరగవచ్చన్న ఆందోళనలు దీనికి కారణం. మంగళవారం రూపాయి విలువ 69.81 వద్ద ముగియగా, బక్రీద్ సందర్భంగా బుధవారం ఫారెక్స్ మార్కెట్ పనిచేయలేదు. గురువారం ట్రేడింగ్ ఒక దశలో రూపాయి 70.17ను సైతం తాకింది. రూపాయి గడచిన శుక్రవారం (17వ తేదీ) చరిత్రాత్మక కనిష్టం 70.15 వద్ద ముగిసిన సంForex marketగతి తెలిసిందే. శుక్రవారం ఒక దశలో 70.40 స్థాయినీ చూసింది. అటు తర్వాత జరిగిన రెండు ట్రేడింగ్ సెషన్లలో 34 పైసలు బలపడినా, ఆ స్థాయిలో నిలబడలేకపోవడం గమనార్హం. చైనా, భారత్సహా నాలుగు దేశాల మెటల్స్పై అమెరికా విధించిన ఆంక్షల అమలు దీనికి నేపథ్యం. దీనితో వాణిజ్యయుద్ధం భయాలు తిరిగి ప్రారంభమయ్యాయి. -
జీవితకాల కనిష్టం నుంచి రికవరీ..!
ముంబై: డాలర్ మారకంలో గడచిన శుక్రవారం జీవితకాల కనిష్ట స్థాయిని తాకిన భారత కరెన్సీ రూపాయి... సోమవారం కొంత లాభపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ సోమవారం 33 పైసలు బలపడి, 69.82 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభంతోనే లాభాల్లో 69.83 వద్ద మొదలయ్యింది. ఒక దశలో 69.59ని కూడా తాకింది. డాలర్ల భారీ అమ్మకాలు, దేశీయ ఈక్విటీ మార్కెట్ల పరుగు వంటి అంశాలు దీనికి కారణం. శుక్రవారం రూపాయి 70.15 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఒక దశలో చరిత్రాత్మక కనిష్టం 70.40 స్థాయినీ చూసింది. ఏడు వారాల్లో రూపాయి భారీగా లాభప డటం సోమవారమే తొలిసారి. రూపాయి బలపడ్డానికి కీలక కారణాలు చూస్తే... ♦ వాణిజ్య యుద్ధం ప్రభావం తగ్గించడానికి చైనా ప్రతినిధులు అమెరికాకు వస్తుండడం దేశీయ కరెన్సీపై సానుకూలత చూపింది. ♦ వాణిజ్యలోటు ఐదేళ్ల గరిష్ట స్థాయికి పెరిగినప్పటికీ, ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం, చమురు ధరలు గరిష్ట స్థాయిల నుంచి కొంత తగ్గడం కలిసి వస్తోంది. ♦ చమురు ధరలు తగ్గడం, కార్పొరేట్ ఫలితాలు బాగుండటంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ క్యాపిటల్ మార్కెట్లలో 8,500 కోట్లు పంప్ చేశారు. ♦ క్రాస్ కరెన్సీ ట్రేడింగ్లోనూ రూపాయి యూరో మారకంలో 70.80 నుంచి 79. 72 వద్దకు బలపడింది. జపాన్ యన్ విషయంలో 63.28 నుంచి 63.15కు చేరింది. ♦ ఈ వార్త రాస్తున్న సమయం రాత్రి 8.30 గంటలకు అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో రూపాయి డాలర్ మారకంలో 0.11 శాతం నష్టంతో 69.87 వద్ద ట్రేడవుతుండగా, ఆరు ప్రధాన కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ స్వల్ప నష్టాల్లో 95.86 వద్ద ట్రేడవుతోంది. -
శంషాబాద్లో వీజ్మన్ ఫారెక్స్ కేంద్రాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశీ కరెన్సీ క్రయవిక్రయాల్లో ఉన్న వీజ్మన్ ఫారెక్స్ శంషాబాద్ విమానాశ్రయంలో అయిదు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మూడేళ్లపాటు ఈ కౌంటర్లను కంపెనీ నిర్వహించనుంది. విదేశీ కరెన్సీ, ప్రీపెయిడ్ ఫారెన్ కరెన్సీ కార్డ్స్, ట్రావెలర్స్ చెక్కులు ఇక్కడ లభ్యమవుతాయని వీజ్మన్ ఎండీ బి.కార్తికేయన్ తెలిపారు. -
రూపాయి రివర్స్
ముంబై: డాలర్తో రూపాయి మారకం మళ్లీ నష్టాల బాట పట్టింది. ఇటీవల రికవరీతో రెండు వారాల గరిష్ట స్థాయికి చేరుకున్న దేశీ కరెన్సీ... బ్యాంకుల నుంచి, దిగుమతి దారుల నుంచి డాలర్లకు డిమాండ్ ఏర్పడడం కారణంగా బుధవారం ఫారెక్స్ మార్కెట్లో 17 పైసలు నష్టపోయింది. 68.62 వద్ద క్లోజ్ అయింది. అంతకుముందు రోజు రూపాయి 68.45 వద్ద క్లోజ్ అయిన విషయం తెలిసిందే. చమురు ధరలు కొన్ని నెలల కనిష్టానికి చేరినప్పటికీ రూపాయి విలువ క్షీణించడం గమనార్హం. ముఖ్యంగా అమెరికా ఆర్థిక రంగ భవిష్యత్తుపై ఫెడ్ చైర్మన్ జీరోమ్ పావెల్ వ్యాఖ్యలతో మరో రెండు సార్లు రేట్ల పెంపు ఉంటుందన్న మార్కెట్ అంచనాలకు జీవం పోసింది. దీంతో డాలర్ ఇండెక్స్ మరి కాస్త బలోపేతం అయింది -
రూపాయి.. జీవితకాల కనిష్టానికి!
ముంబై: డాలర్తో రూపాయి మారకం బుధవారం జీవిత కాల కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. రూపాయి పతనం కావడం ఇది వరుసగా రెండో రోజు. ఫారెక్స్ మార్కెట్లో బుధవారం డాలర్తో రూపాయి మారకం 68.74 వద్ద ముగిసింది. ఈ ముగింపుతో పోల్చితే గురువారం ఉదయం రూపాయి 6 పైసల నష్టంతో 68.80 వద్ద ఆరంభమైంది. అమ్మకాలు తీవ్రంగా ఉండటంతో ఇంట్రాడేలో 69.01 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 21 పైసల నష్టంతో 68.95 వద్ద ముగిసింది. రూపాయి మరీ పతనం కాకుండా, 69 స్థాయిలో ముగియకుండా ఆర్బీఐ జోక్యం చేసుకుందన్న సందేహాలు మార్కెట్లో నెలకొన్నాయి. గత రెండు రోజుల్లో రూపాయి మొత్తం 38 పైసలు నష్టపోయింది. అమెరికా డాలర్లకు డిమాండ్ వెల్లువెత్తడం, విదేశీ నిధులు తరలిపోతుండటంతో రూపాయి క్షీణిస్తోందని నిపుణులంటున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచడంతో మన రూపాయితో సహా పలు వర్థమాన దేశాల కరెన్సీలు పడిపోతున్నాయి. ఏప్రిల్ నుంచి పతనం... గత ఏడాది నల్లేరు మీద నడకలా సాగిన రూపాయి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పతనమవుతూనే ఉంది. గత నెల 28న జీవిత కాల గరిష్ట స్థాయి, 69.10ను తాకింది. ఇక ఈ నెల 2న జీవిత కాల కనిష్ట స్థాయి, 68.80 వద్ద ముగిసింది. ఆసియాలో అత్యంత అధ్వానంగా ఉన్న కరెన్సీల్లో మన రూపాయి కూడా ఒకటి. కరంట్ అకౌంట్ లోటు మరింత పైపైకి... ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో మన కరంట్ అకౌంట్ లోటు మరింతగా పెరుగుతుందనే ఆందోళనలు రేగుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడిప్పుడే రికవరీ బాట పడుతున్న మన ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ముడి చమురు ధరలు తీవ్రమైన ప్రభావాన్నే చూపించగలవన్న భయాలూ వ్యక్తమవుతున్నాయి. అమెరికా, ఇతర దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతుండడం కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావమే చూపుతోంది. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను ప్రభుత్వం పెంచడంతో ద్రవ్యోల్బణం ఎగుస్తుందని, దీంతో ఆర్బీఐ అంచనాల కంటే అధికంగానే వడ్డీరేట్లను పెంచగలదన్న భయాలు నెలకొన్నాయి. -
కనిష్టానికి జారి కోలుకున్న రూపాయి
ముంబై: డాలర్తో రూపాయి కాస్త బలపడింది. సోమవారం నాటి క్లోజింగ్ 68.80తో పోలిస్తే మంగళవారం ఫారెక్స్ మార్కెట్లో 23 పైసలు బలపడి 68.57 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 68.91 వరకు క్షీణించగా, ఆ తర్వాత నష్టాలను పూడ్చుకుని లాభా ల్లోకి ప్రవేశించింది. గతవారం జీవిత కాల కనిష్ట స్థాయి 69.10కి పడిపోయిన విషయం తెలిసిందే. ఎగుమతిదారులు, కార్పొరేట్లు తాజాగా డాలర్ల విక్రయానికి మొగ్గుచూపడం, అదే సమయంలో ఆర్బీఐ జోక్యం చేసుకుని డాలర్ల విక్రయాలు కొనసాగేలా చూడటం రూపాయి రికవరీకి దారితీసిందని ట్రేడర్లు పేర్కొన్నారు. మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ కూడా సానుకూల ప్రభావం చూపించింది. మొత్తం మీద ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పట్ల బుల్లిష్ ధోరణి కనిపించింది. రూపాయిపై ఆందోళన అక్కర్లేదు రూపాయి మారకం విలువ అంతకంతకూ క్షీణిస్తుండటంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. వాస్తవ మారక విలువ (ఆర్ఈఈఆర్)పరంగా చూస్తే రూపాయి మారకం విలువ ఇప్పటికీ ఇంకా అధిక స్థాయిలోనే ఉందని ఆయన చెప్పారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2013లో.. కేవలం మూడు నెలల వ్యవధిలోనే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 57 నుంచి 68కి పడిపోయిందని, ఈ విషయంలో ప్రభుత్వాల పనితీరును పోల్చి చూడటానికి లేదని విలేకరుల సమావేశంలో రాజీవ్ కుమార్ తెలిపారు. రూపాయి విషయంలో తగిన విధంగా స్పందించడంలో ప్రభుత్వం విఫలమవుతోందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు వివరణనిచ్చారు. మరోవైపు, ఐడీబీఐ బ్యాంకును ఎల్ఐసీ టేకోవర్ చేసే అంశంపై స్పందిస్తూ.. ఐడీబీఐ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎల్ఐసీ గణనీయంగా లాభపడగలదని రాజీవ్ కుమార్ చెప్పారు. ఐడీబీఐ బ్యాంక్ త్వరలోనే టర్నెరౌండ్ కాగలదన్నారు. జీడీపీపరంగా చూస్తే ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.5%గాను, వచ్చేసారి 8% స్థాయిలోనూ ఉండగలదని తెలిపారు. 2022 నాటికి స్థూలదేశీయోత్పత్తి వృద్ధి రేటు 8.5%కి చేరుతుందని రాజీవ్ కుమార్ చెప్పారు. -
మూడు నెలల కనిష్ట విలువకు రూపాయి
ముంబై: డాలర్తో రూపాయి వెలవెలబోయింది. ఒకే రోజు బుధవారం ఫారెక్స్ మార్కెట్లో 30 పైసలు పడిపోయి 65.17కు చేరింది. రూపాయికి ఇది మూడు నెలల కనిష్ట స్థాయి. ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జీరోమ్పావెల్ అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో బలంగా ఉంటుందని, ఈ ఏడాది కూడా వడ్డీ రేట్ల పెంపు కొనసాగుతుందంటూ చేసిన ప్రకటనతో డాలర్ బలం పుంజుకుంది. ఇంట్రాడేలో రూపాయి 65.32 వరకూ తగ్గింది. ఆ తర్వాత తిరిగి కాస్త కోలుకుని నికరంగా 30 పైసలు నష్టం (0.46 శాతం)తో 65.17 వద్ద క్లోజయింది. -
55 పైసలు క్షీణించిన రూపాయి
ముంబై: డాలర్తో రూపాయి మరోసారి చిన్నబోయింది. మంగళవారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ 55 పైసలు క్షీణించి 64.04కు చేరింది. ఇది రెండు వారాల కనిష్ట స్థాయి. దేశ వాణిజ్యలోటు (ఎగుమతులు, దిగుమతుల విలువలో వ్యత్యాసం) మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరడంతో రూపాయి అమ్మకాలు వెల్లువెత్తాయి. ఎనిమిది నెలల కాలంలో ఒక రోజు రూపాయి విలువ ఈ స్థాయిలో పడిపోవడం కూడా ఇదే. డిసెంబర్ నెలలో ఎగుమతులు 12.36 శాతం పెరిగి 27.03 బిలియన్ డాలర్లకు చేరగా, అదే సమయంలో దిగుమతులు గణనీయంగా పెరిగి 41.91 బిలియన్ డాలర్లకు చేరాయి. ఫలితంగా వాణిజ్య లోటు 14.88 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది అంతకుముందు ఏడాది ఇదే నెలలో ఉన్న గణాంకాలతో పోలిస్తే 41 శాతం అధికం. ఈ ప్రభావం ఫారెక్స్ మార్కెట్పై పడింది. ఉదయం ప్రారంభం నుంచే రూపాయి ప్రతికూలంగా ట్రేడ్ అయింది. అదే సమయంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రభుత్వం ద్రవ్యలోటు లక్ష్యానికి కట్టుబడి ఉండడం కష్టమన్న అంచనాలు, పెరుగుతున్న ముడి చమురు ధరలతో సమీప కాలంలో ఆర్బీఐ రేట్ల కోతకు అవకాశాల్లేవన్న అంచనాలు అనిశ్చితిని పెంచేశాయి. -
రెండున్నరేళ్ల గరిష్టానికి రూపాయి
ముంబై: ఫారెక్స్ మార్కెట్లో రూపాయి తన బలాన్ని ప్రదర్శిస్తోంది. డాలర్తో రూపాయి మారకం రెండున్నరేళ్ల గరిష్ట స్థాయిలకు చేరుకుంది. గురువారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో రూపాయి క్రితం ముగింపుతో పోలిస్తే 12 పైసలు లాభపడి 63.41వద్ద క్లోజయింది. క్రితం ముగింపు 63.53 కాగా, గురువారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 63.59 వద్ద ప్రారంభమై 63.62 కనిష్ట స్థాయిని నమోదు చేసింది. అక్కడి నుంచి పుంజుకుని 63.36 వరకు బలపడింది. చివరికి 63.41 వద్ద ముగిసింది. 2015 జూలై 15 తర్వాత రూపాయి తిరిగి ఈ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. ఆర్థిక రంగం పట్ల ఆశావాదం, నిధుల రాకపై అంచనాలు ర్యాలీకి జోష్నిచ్చాయి. -
రూపాయి అనూహ్య పతనం
♦ ఒకే రోజు 69 పైసలు డౌన్ ♦ 64.84 వద్ద ముగింపు ♦ ఒకే రోజు ఇంత స్థాయిలో పతనం ♦ 2016 జూలై 26 తర్వాత తొలిసారి ♦ అంతర్జాతీయ అనిశ్చితే కారణం ముంబై: డాలర్ మారకంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న భారత్ రూపాయికి ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఫారెక్స్ మార్కెట్లో గురువారం ఒకేరోజు 69 పైసలు (1.06 శాతం) బలహీనపడి 64.84 వద్ద ముగిసింది. 2017 ఏప్రిల్ 5 తరువాత రూపాయి ఈ స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి. ఒక దశలో రూపాయి 64.91 స్థాయికి సైతం పతనం అయ్యింది. అమెరికా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. రూపాయి ఒకే రోజు ఇంత దారుణ పతనం 10 నెలల్లో ఇదే తొలిసారి. 2016 జూలై 26న ఇలాంటి పతనం జరిగింది. డాలర్కు డిమాండ్... గత మూడు రోజులగా రూపాయి మారకం విలువ బలపడుతూ వస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ జరపడం కూడా రూపాయి అనూహ్య పతనానికి దారితీసింది. అమెరికా పరిణామాలు ఇటు ఫారెక్స్తో పాటు భారత్ స్టాక్ మార్కెట్పై సైతం ప్రభావం చూపింది. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో బ్యాంకర్లు, ఎగుమతిదారుల నుంచి డాలర్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. నిజానికి డాలర్ బలహీనపడుతుంటే, రూపాయి బలపడాల్సి ఉంటుంది. అయితే అమెరికా రాజకీయ పరిస్థితులు, తద్వారా ఆర్థిక సంక్షోభ భయాలు మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయన్న విశ్లేషణలు ఉన్నాయి. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్పై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జోక్యం, గత ఏడాది అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం అవకాశాలపై విచారణకు ప్రత్యేక కౌన్సిల్ వంటి అంశాలు ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై తద్వారా ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి మరింత పెరుగుతుందన్న భయాలు మార్కెట్లపై ప్రధానంగా ప్రభావం చూపుతున్నాయని ఫారెక్స్ డీలర్ ఒకరు తెలిపారు. కాగా కడపటి సమాచారం అందేసరికి అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 97.60 వద్ద ట్రేడవుతుండగా, రూపాయి 64.88 వద్ద ట్రేడవుతోంది. -
రూపాయ్ రయ్...రయ్..!
డాలర్ మారకంలో రూపాయి మారకం విలువ పటిష్టత కొనసాగుతోంది. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్లో ఒకేరోజు 24 పైసలు బలపడి, 64.28 వద్ద ముగిసింది. ఇది 20 నెలల గరిష్ట స్థాయి. ఈ ఏడాది డాలర్ మారకంలో 68.881కు చేరిన రూపాయి, గత నెల ప్రారంభం నుంచీ అప్రతిహతంగా, అంచనాలకు భిన్నంగా భారీగా బలపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడు రోజుల్లో డాలర్ మారకంలో రూపాయి 75పైసలు లాభపడింది. -
తగ్గిన రూపాయి
14 పైసల క్షీణతతో 65.44 వద్ద క్లోజింగ్ ముంబై: దిగుమతి సంస్థల నుంచి డాలర్లకు మళ్లీ డిమాండ్ నెలకొనడంతో బుధవారం రూపాయి మారకం విలువ 14 పైసలు క్షీణించింది. దాదాపు 17 నెలల గరిష్ట స్థాయి దగ్గర్నుంచి తిరోగమించి.. అమెరికా డాలర్తో పోలిస్తే 65.44 వద్ద ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిత ఆర్థిక వృద్ధి అజెండాపై అనిశ్చితి పెరిగిపోతున్న నేపథ్యంలో ఫారెక్స్ మార్కెట్ సెంటిమెంట్పై కూడా ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. దిగుమతి సంస్థలు, కార్పొరేట్ల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో రూపాయి క్షీణించినట్లు వివరించాయి. అయితే, డాలర్ స్వతహాగా బలహీనపడటం వల్ల రూపాయి పతనానికి కొంత మేర అడ్డుకట్ట పడిందని తెలిపాయి. అమెరికా మార్కెట్లలో అమ్మకాల ప్రభావంతో ఇటు దేశీ స్టాక్మార్కెట్లు కూడా బుధవారం క్షీణించాయి. బుధవారం ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సే్చంజ్ (ఫారెక్స్) మార్కెట్లో క్రిత ముగింపు 65.30తో పోలిస్తే బలహీనంగా 65.57 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. రోజంతా 65.37–65.58 శ్రేణిలో తిరుగాడింది. చివరికి 14 పైసల క్షీణతతో (0.21 శాతం) 65.44 వద్ద ముగిసింది. -
రూపాయి... 4 నెలల గరిష్టానికి
డాలర్తో 30 పైసలు వృద్ధి... 66.52కి చేరిక ముంబై: ఆర్బీఐ గవర్నర్గా ఉర్జిత్ పటేల్ శకం ప్రారంభమైన రోజే ఫారెక్స్ మార్కెట్లో రూపాయి కూడా ర్యాలీ జరిపింది. మంగళవారం ఒక్కరోజే డాలర్తో రూపాయి 30 పైసలు బలపడి నాలుగు నెలల గరిష్ట స్థాయి అయిన 66.52కి చేరుకుంది. గత శుక్రవారం డాలర్తో రూపాయి 66.82 వద్ద ముగిసింది. అమెరికాలో బలహీన ఉద్యోగ గణాంకాలు వెల్లడైన దరిమిలా ఫెడ్ వడ్డీ రేట్ల భయాందోళనలు తగ్గిపోవడం రూపాయి ర్యాలీకి దోహదపడింది. విదేశీ బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ల విక్రయాలు జరపడం సెంటిమెంట్ను బలపరిచింది. రూపాయి డాలర్తో లాభపడడం వరుసగా ఇది ఐదో రోజు కావడం గమనార్హం. ఈ ఏడాది మే 11న రూపాయి ముగింపు 66.56గా ఉండగా ఆ తర్వాత గరిష్ట స్థాయికి చేరుకోవడం మళ్లీ ఇదే. మూడు రోజుల విరామం తర్వాత మంగళవారం తెరుచుకున్న ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ 66.53 వద్ద ప్రారంభమైంది. ఆర్బీఐ 24వ గవర్నర్గా ఉర్జిత్ పటేల్ ఇన్నింగ్స్ ప్రారంభం కావడంతో సానుకూల సెంటిమెంట్ చోటు చేసుకుంది. ఇంట్రాడేలో ఒక దశలో 66.47 వరకూ వెళ్లిన రూపాయి చివరికి 66.52 వద్ద క్లోజ్ అయింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే 30 పైసలు (0.45శాతం) లాభపడింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో ర్యాలీకితోడు ఆసియా కరెన్సీలతోనూ డాలర్ బలహీనపడడం, విదేశీ నిధుల రాక రూపాయి బలపడడానికి కారణాలుగా ఓ ఫారెక్స్ డీలర్ వెల్లడించారు. -
28 పైసలు లాభపడ్డ రూపాయి
గత 3 ట్రేడింగ్ సెషన్లలో 48 పైసలు లాభం ముంబై: రూపాయి వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్లోనూ బలపడింది. విదేశీ నిధుల ప్రవాహం జోరుగా ఉండటంతో సోమవారం డాలర్తో రూపాయి మారకం 28 పైసలు లాభపడి 66.97 వద్ద ముగిసింది. ఇది మూడు వారాల గరిష్ట స్థాయి. ఫారెక్స్ మార్కెట్లో గత శుక్రవారం నాటి ముగింపు(67.25)తో పోల్చితే సోమవారం ట్రేడింగ్లో 66.95 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 66.85 గరిష్ట స్థాయిని తాకి చివరకు 66.97 వద్ద ముగిసింది. అమెరికా ఉద్యోగ గణాంకాలు బలహీనంగా ఉండటంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి లాభాలతో ప్రారంభమైందని వెరాసిటి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రమిత్ బ్రహ్మభట్ పేర్కొన్నారు. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి 48 పైసలు(0.72 శాతం) లాభపడింది. -
రూపాయి మళ్లీ 60 దిగువకు
ఆరు వారాల కనిష్టానికి పతనం 60.16 వద్ద ముగింపు ముంబై: ఇరాక్ సంక్షోభంతో చమురు ధరలు పెరుగుతుండటం దేశీ కరెన్సీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయిల్ కంపెనీల నుంచి డాలర్లకు డిమాండ్ ఎగియడం వల్ల రూపాయి మారకం విలువ అంతకంతకూ క్షీణిస్తోంది. సోమవారం మరో 39 పైసలు క్షీణించి 60 స్థాయి దిగువకి పడిపోయింది. ఆరు వారాల కనిష్టమైన 60.16 వద్ద ముగిసింది. అటు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం పెరగడం, ఇటు దేశీ స్టాక్మార్కెట్లు బలహీనంగా ఉండటం సైతం రూపాయిపై మరింత ఒత్తిడి పెంచాయి. ఇరాక్ సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు తొమ్మిది నెలల గరిష్టానికి ఎగియడంతో చమురు దిగుమతి సంస్థలు తదుపరి కొనుగోళ్ల కోసం తప్పనిసరిగా మరిన్ని డాలర్లను సమకూర్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. ఇది రూపాయి మారకంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వివరించారు. సోమవారం ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 59.77తో పోలిస్తే కాస్త బలహీనంగా 59.82 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒక దశలో 59.80కి పెరిగినా చివరికి 0.65 శాతం క్షీణించి 60.16 వద్ద క్లోజయ్యింది. గత శుక్రవారం కూడా దేశీ కరెన్సీ 52 పైసలు (0.88 శాతం) మేర పతనమైన సంగతి తెలిసిందే. భౌగోళికపరమైన రాజకీయ రిస్కులు, దేశీయంగా రుతుపవనాల ఆలస్యం, అంచనాలు మించి పెరిగిన ద్రవ్యోల్బణం .. అన్నీ కలగలిసి రూపాయికి ప్రతికూలంగా మారాయని కోటక్ సెక్యూరిటీస్ కరెన్సీ అనలిస్టు అనింద్య బెనర్జీ తెలిపారు. ఇరాక్ సంక్షోభం నేపథ్యంలో బలహీనంగా ట్రేడవుతున్న రూపాయి.. గడిచిన రెండు రోజుల్లో ఒకటిన్నర శాతం మేర తగ్గిందని వెరాసిటీ గ్రూప్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. డాలర్తో రూపాయి ట్రేడింగ్ శ్రేణి స్పాట్ మార్కెట్లో 59.70-60.80 మధ్య ఉండగలదని చెప్పారు. ఎకానమీకి సమస్య.. రూపాయి అకస్మాత్తుగా బలహీనపడటం, క్రూడ్ ధరలు ఎగుస్తుండటం వంటి పరిణామాలు .. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఎకానమీ, వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. దేశీ కరెన్సీ స్థిరపడితే గానీ పరిస్థితులు మళ్లీ చక్కబడకపోవచ్చని వారు చెప్పారు. అయితే, రూపాయి మారకం త్వరలోనే స్థిరపడగలదని, సెప్టెంబర్ క్వార్టర్లో సగటున 58.5గా ఉండొచ్చని జైఫిన్ రీసెర్చ్ చీఫ్ ఎకానమిస్టు దేబోపమ్ చౌదరి తెలిపారు. -
రూపాయికి 'క్యాడ్' జోష్..
ముంబై: స్టాక్ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలను తాకడం, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) భారీగా దిగిరావడంతో దేశీ కరెన్సీకి బలాన్నిచ్చింది. గురువారం డాలరుతో రూపాయి మారకం విలువ 64 పైసలు(1.04%) ఎగబాకి 61.11 వద్ద స్థిరపడింది. ఇది దాదాపు 3 నెలల గరిష్టస్థాయి (గతేడాది డిసెంబర్ 10న 61.04 వద్ద ముగింపు) కావడం గమనార్హం. గతేడాది నవంబర్ 18న రూపాయి 70 పైసలు ఎగబాకగా, మళ్లీ ఒకేరోజు ఇంత భారీగా పుంజుకోవడం ఇదే తొలిసారి. ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం డిసెంబర్ క్వార్టర్లో జీడీపీతో పోలిస్తే క్యాడ్ 0.9 శాతానికి(4.2 బిలియన్ డాలర్లు) కట్టడి కావడం తెలిసిందే. ప్రధానంగా ఎగుమతుల వృద్ధి బాట, బంగారం దిగుమతులు భారీగా తగ్గడం వంటివి క్యాడ్కు కళ్లెంపడటంతో ప్రధాన కారకాలుగా నిలిచాయి. దీంతో ప్రస్తుత 2013-14 పూర్తి ఏడాదికి క్యాడ్ 45 బిలియన్ డాలర్లలోపే(2.5 శాతం దిగువన) ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, గురువారం దేశీ ప్రధాన స్టాక్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కొత్త ఆల్టైమ్ గరిష్టస్థాయిల్లో ముగిశాయి. సెన్సెక్స్ అయితే ఇంట్రాడేలో చరిత్రాత్మక రికార్డును నమోదు చేసింది కూడా. మార్కెట్ పరుగుతో పాటు విదేశీ నిధుల ప్రవాహం కొనసాగుతుండటం; ఎగుమతిదారులు, కొన్ని బ్యాంకులు సైతం డాలర్ల విక్రయాల బాటపట్టడం కూడా రూపాయి బలపడేందుకు దోహదం చేసిందని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. గడిచిన ఎనిమిది సెషన్లలో(మార్చి 4 వరకూ) విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) దేశీ మార్కెట్లోకి ఏకంగా 80 కోట్ల డాలర్లను(దాదాపు రూ. 5,000 కోట్లు) కుమ్మరించడం విశేషం. నింగినంటిన సూచీలు... కొత్త రికార్డుల మోత పలు సానుకూల అంశాల నేపథ్యంలో దేశీ స్టాక్ సూచీలు మళ్లీ కదంతొక్కాయి. సెన్సెక్స్ 237 పాయింట్లు ఎగసి 21,514 వద్ద ముగిసింది. 72 పాయింట్లు జంప్ చేసిన నిఫ్టీ 6,401 వద్ద నిలిచింది. ఫలితంగా 2013 డిసెంబర్ 9న సెన్సెక్స్ సాధించిన ఇంట్రాడే గరిష్టం 21,484 పాయింట్లు పాతబడిపోగా, జనవరి 21న నమోదైన 21,374 పాయింట్ల రికార్డు ముగింపు మారిపోయింది. ఇక డిసెంబర్ 9న 6,364 వద్ద ముగిసిన నిఫ్టీ రికార్డు కూడా చెరిగిపోయింది. కాగా, అదే రోజు ఇంట్రాడేలో 6,415 పాయింట్లను తాకి సృష్టించిన నిఫ్టీ రికార్డు మాత్రమే మిగిలిపోయింది! ఎన్ని‘కల’ జోష్ సార్వత్రిక ఎన్నికల తరువాత ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం సంస్కరణలకు ప్రాధాన్యమిస్తుందన్న అంచనాలు కొద్ది రోజులుగా విదేశీ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహమిస్తున్నాయి. దీంతో వరుసగా 14 రోజుల్లో రూ. 6,000 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఐలు గురువారం ఒక్క రోజులోనే రూ. 1,273 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అయితే దేశీయ ఫండ్స్ యథావిధిగా రూ. 567 కోట్ల విలువైన అమ్మకాలను నిర్వహించాయి. ఇతర విశేషాలివీ.... గురువారం ట్రేడింగ్లో రియల్టీ ఇండెక్స్ 4% జంప్చేయగా, పవర్, ఆయిల్, మెటల్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ 2% స్థాయిలో పుంజుకున్నాయి. సెన్సెక్స్ దిగ్గజాలు హిందాల్కో, భెల్, ఐసీఐసీఐ, ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఎన్టీపీసీ, గెయిల్, సెసాస్టెరిలైట్, కోల్ ఇండియా, హీరో మోటో, బజాజ్ ఆటో, ఆర్ఐఎల్, మారుతీ, ఎల్అండ్టీ, యాక్సిస్ 4-2% మధ్య లాభపడ్డాయి. రియల్టీలో ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 12% దూసుకెళ్లగా, హెచ్డీఐఎల్, ఇండియాబుల్స్, డీఎల్ఎఫ్, యూనిటెక్, డీబీ, మహీంద్రా లైఫ్స్పేస్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 7-3 శాతం మధ్య ఎగబాకాయి. స్వీడిష్ మాతృ సంస్థ డీలిస్టింగ్ యోచనను వాయిదా వేయడంతో ఆస్ట్రాజెనెకా 9%పైగా పతనంకాగా, మెరిల్లించ్ 2.35 లక్షలను కొన్న నేపథ్యంలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ 5% పెరిగింది. గత 6 రోజుల్లో ఆస్ట్రాజెనెకా 50% ఎగసింది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు సైతం 1%పైగా బలపడ్డాయి. మిడ్ క్యాప్స్లో రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా, ఎస్ఆర్ఎఫ్ 20% దూసుకెళ్లగా, జైకార్ప్, రిలయన్స్ ఇన్ఫ్రా, జేపీ అసోసియేట్స్, ఎస్కేఎస్, జేకే సిమెంట్, ఓరియంట్ సిమెంట్, వీగార్డ్, జేబీ కెమ్, స్పైస్జెట్, ఈరోస్, బాంబే డయింగ్, ఐఎల్ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్ట్, కేఎస్కే ఎనర్జీ 12-6% మధ్య పురోగమించాయి. లాభాల ‘మూడ్’.. మూడు నెలల్లో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వంపై ఆశలు ఇన్వెస్టర్లలో జోష్ను నింపుతున్నాయి. మూడో క్వార్టర్ (అక్టోబర్-డిసెంబర్)లో కరెంట్ ఖాతా లోటు(క్యాడ్) భారీగా క్షీణించి 4.2 బిలియన్ డాలర్లకు పరిమితంకావడం సెంటిమెంట్కు ఊపునిచ్చింది. డాలరుతో రూపాయి విలువ 3 నెలల గరిష్టమైన 61.11 కు చేరడం ఇందుకు సహకరించింది. వరుసగా 3వ రోజూ మార్కెట్లు పుంజుకున్నాయి. 3 రోజుల్లో సెన్సెక్స్ 567 పాయింట్లు ఎగసింది. 3 నెలల తరువాత దేశీ స్టాక్ సూచీలు కొత్త గరిష్ట స్థాయిలను అందుకున్నాయి. గత ఆరు పర్యాయాల్లో ఎన్నికల ముందు నెలలో మార్కెట్లు ర్యాలీ చేయడం ఇది మూడోసారి! -
54 పైసలు తగ్గిన రూపాయి
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్వహిస్తున్న రెండు రోజుల సమావేశాలు మొదలైన నేపథ్యంలో డాలరుతో మారకంలో రూపాయి విలువ మళ్లీ తిరోగమించింది. గత రెండు వారాల్లోలేని విధంగా 54 పైసలు క్షీణించి 63.37కు చేరింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం 63.37 వద్ద ప్రారంభమైంది. గరిష్టంగా 62.95, కనిష్టంగా 63.64 మధ్య ఊగిసలాడింది. చివరికి క్రితం ముగింపు 62.83తో పోలిస్తే 54 పైసలు(0.86%) బలహీనపడి 63.37 వద్ద ముగిసింది. ఈ నెల 3 తరువాత ఇదే అత్యధిక క్షీణత కాగా, గత రెండు రోజుల్లో 67 పైసలు పుంజుకున్న విషయం విదితమే. -
రూపాయికి జోష్!
ముంబై: రూపాయి వరుసగా నాలుగో రోజూ కదంతొక్కింది. సిరియా పై అమెరికా దాడుల భయాలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు కొద్దిగా శాంతించడం రూపాయికి బూస్ట్ ఇచ్చింది. డాలరుతో రూపాయి మారకం విలువ మంగళవారం ఏకంగా 140 పైసలు దూసుకెళ్లి 63.84 వద్ద స్థిరపడింది. గడచిన రెండు వారాల్లో ఇదే అత్యధిక పెరుగుదల కావడం గమనార్హం. ఆగస్టు 29న రూపాయి 225 పైసలు ఎగబాకింది. మళ్లీ ఈ స్థాయిలో పెరగడం ఇదే. కాగా, భారత్ ఎగుమతులు ఆగస్టులో దాదాపు 13 శాతం ఎగబాకడం, వాణిజ్యలోటు తగ్గుముఖం పట్టడం కూడా దేశీ కరెన్సీకి చేయూతనిచ్చినట్లు ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. రూపాయి ఆసరాతో దేశీ స్టాక్ మార్కెట్ కూడా వరుసగా నాలుగోరోజూ పరుగులు తీసింది. సెన్సెక్స్ మంగళవారం 700 పాయింట్లకు పైగా దూసుకెళ్లింది. దేశీ మార్కెట్లోకి విదేశీ నిధుల ప్రవాహం మళ్లీ జోరందుకుంటుందన్న అంచనాలతో అటు బ్యాంకులు, ఇటు ఎగుమతిదార్లు డాలర్ పొజిషన్లను తగ్గించుకోడంపై దృష్టిపెట్టినట్లు ఫారెక్స్ డీలర్లు చెబుతున్నారు. గడిచిన నాలుగు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి విలువ 379 పైసలు(5.6 శాతం) ఎగబాకడం గమనార్హం. -
మళ్లీ కళ తప్పిన రూపాయి
ముంబై: రెండు రోజుల రూపాయి ర్యాలీకి బ్రేక్ పడింది. డాలరుతో మారకంలో సోమవారం 30 పైసలు(0.46%) బలహీనపడి 66 వద్ద ముగిసింది. గత రెండు రోజుల్లో 310 పైసలు(4.5%) బలపడటం ద్వారా 68.80 నుంచి 65.70కు చేరిన సంగతి తెలిసిందే. కాగా, దిగుమతిదారుల నుంచి పెరిగిన డిమాండ్ నేపథ్యంలో ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 66.15 వద్ద బలహీనంగా మొదలైంది. ఒక దశలో 65.68కు బలపడినప్పటికీ, 66.30 వద్ద కనిష్ట స్థాయిని సైతం తాకింది. చివరికి 30 పైసలు క్షీణించి 66 వద్ద స్థిరపడింది. -
రూపాయి 85 పైసలు అప్
ముంబై: కరెన్సీ పతనానికి అడ్డుకట్ట వేస్తూ, వృద్ధికి ఊతమిచ్చేలా చర్యలు తీసుకుంటామంటూ ప్రధాని మన్మోహన్ సింగ్ భరోసా కల్పించడం.. రూపాయి కోలుకోవడానికి మరింత ఊతమిచ్చింది. డాలర్తో పోలిస్తే శుక్రవారం రూపాయి మారకం విలువ మరో 85 పైసలు పెరిగి 65.70 వద్ద ముగిసింది. అటు ఎగుమతిదారులు, కొన్ని బ్యాంకులు డాలర్లను విక్రయించడం కూడా దేశీ కరెన్సీ బలోపేతం కావడానికి తోడ్పడింది. రూపాయి ఒక్కసారిగా పతనం కావడం షాక్లాంటిదేనని, పెట్టుబడులపై ఆంక్షలు విధించడం కాకుండా ఇతరత్రా చర్యలతో కరెన్సీ మళ్లీ కోలుకునేలా చే స్తామని ప్రధాని చెప్పారు. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం రూపాయి ట్రేడింగ్ క్రితం ముగింపు 66.55తో పోలిస్తే కాస్త బలహీనంగా 67 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 67.43కి కూడా పడిపోయింది. అయితే, ఆ తర్వాత 1.28 శాతం కోలుకుని ఇంట్రాడేలో గరిష్టమైన 65.70 స్థాయి వద్ద ముగిసింది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) జోక్యం చేసుకోవడం, ప్రధాని మన్మోహన్సింగ్ ప్రసంగాలే రూపాయికి ఊతంగా నిలిచాయని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ సీఈవో అభిషేక్ గోయెంకా తెలిపారు. స్టాక్మార్కెట్లు లాభాల్లో ముగుస్తుండటమూ ఇందుకు దోహదపడ్డాయని వివరించారు. రూపాయి ట్రేడింగ్ శ్రేణి 65-66.50 మధ్య ఉండగలదని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఇండియా) సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. -
ఆర్బీఐ ‘డాలర్’ టానిక్...రూపీ నవ్వింది!
న్యూఢిల్లీ: అంపశయ్యపై అల్లాడుతున్న రూపాయికి రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఎట్టకేలకు కొంత జవసత్వాలు అందించింది. మూడు రోజుల క్రాష్కు అడ్డుకట్టపడింది. గురువారం ఒక్కరోజే డాలరుతో రూపాయి మారకం విలువ 225 పైసలు పుంజుకుంది. 66.55 వద్ద స్థిరపడింది. ప్రభుత్వరంగ చమురు రిఫైనర్ల నెలవారీ చెల్లింపుకోసం కొనుగోలు చేసే డాలర్లకోసం ఆర్బీఐ ప్రత్యేకంగా ఒక విండో(సదుపాయం) ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. నెలకు సగటున ప్రభుత్వరంగ చమురు కంపెనీలు(ఐఓసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్) 7.5 మిలియన్ టన్నుల క్రూడ్ను దిగుమతి చేసుకుంటున్నాయి. ఇందుకు 8.5 బిలియన్ డాలర్లను నెలకు చెల్లించాల్సి వస్తోంది. ఇంతభారీగా డాలర్ల కొనుగోలుతో ఆ కరెన్సీకి డిమాండ్ పెరిగి.. రూపాయి విలువ ఆవిరయ్యేలా చేస్తోంది. ఇప్పుడు నేరుగా ఆర్బీఐ ప్రత్యేక విండోద్వారా ఈ కంపెనీలకు అవసరమైన డాలర్లను అందించడం వల్ల స్పెక్యులేషన్కు కొంత అడ్డుకట్టపడే అవకాశం ఉంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ భారీ లాభాల్లో 66.90 వద్ద ప్రారంభమైంది. ఆతర్వాత మళ్లీ దిగుమతిదారుల నుంచి డాలర్ డిమాండ్ కారణంగా 67.92కు క్షీణించింది. అయితే, చివర్లో మళ్లీ భారీగా పుంజుకొని 3.27 శాతం లాభంతో 66.55 వద్ద స్థిరపడింది. దీనికి ఆర్బీఐ చర్యలు ఊతమిచ్చాయని ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా డాలరు బలపడటం, స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల తిరోగమనం కొనసాగినప్పటికీ రూపాయి లాభాలతో ముగియడం గమనార్హం. రూపాయి మరింత బలపడొచ్చన్న అంచనాలతో ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం కూడా దేశీ కరెన్సీకి బూస్ట్ ఇచ్చినట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి. బుధవారం రూపాయి చరిత్రలోనే అత్యంత ఘోరంగా 256 పైసలు కుప్పకూలి కొత్త ఆల్టైమ్ కనిష్టానికి(68.80) పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ జనవరి నుంచి ఇప్పటిదాకా రూపాయి విలువ 25 శాతం ఆవిరైంది. రూపాయిపై ఒత్తిడి తగ్గొచ్చు... స్పాట్ మార్కెట్లో డాలర్లకు అధిక డిమాండ్ ఉండే చమురు కంపెనీలకు ప్రత్యేక విండో ఏర్పాటు ద్వారా ఆర్బీఐ రూపాయిపై ఒత్తిడిని తగ్గించిందని ఇండియా ఫారెక్స్ అడ్వయిజర్స్ సీఈఓ అభిషేక్ గోయెంకా పేర్కొన్నారు. 2008లోనూ ఆర్బీఐ ఇలాంటి చర్యలు చేపట్టిందని, అయితే ఇది ఎంతకాలం కొనసాగుతుందనేది గమనించాల్సిన అంశమని చెప్పారు. 75ను తాకొచ్చు: బ్యాంక్ ఆఫ్ అమెరికా విదేశీ మారక(ఫారెక్స్) నిల్వలను పెంచేదిశగా ఆర్బీఐ మరిన్ని నిర్మాణాత్మక చర్యలను చేపట్టకపోతే రూపాయి ఇంకా అగాధంలోకి జారిపోవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్ (బీఓఎఫ్ఏ-ఎంల్) పేర్కొంది. ప్రస్తుత అలసత్వధోరణి ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరికల్లా రూపాయి విలువ 75కు పడిపోవచ్చని గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. విదేశీ పెట్టుబడులు దేశంలోకి వెల్లువెత్తేవిధంగా ఆర్బీఐ.. ప్రవాసీ(ఎన్ఆర్ఐ)/సావరీన్ బాం డ్ల జారీ ఇతరత్రా చర్యల చేపట్టాలని సూచించింది. -
రూపాయి.. చావుకేక!
దేశీ కరెన్సీ చావుకేక పెట్టింది. గత కొద్దిరోజులుగా పాతాళానికి దారులుతీసున్న రూపాయి.. చరిత్రలో ఎన్నడూఎరుగని రీతిలో కుప్పకూలింది. ఒక్కరోజే ఏకంగా 200 పైసలు పడిపోయి 66 దిగువకు జారిపోయింది. సరికొత్త ఆల్టైమ్ కనిష్టాలను నమోదుచేసి ప్రభుత్వం, ఆర్బీఐలకు ముచ్చెమటలు పోయిస్తోంది. ముంబై: లోక్సభ ఆమోదం పొందిన ఆహార భద్రత బిల్లు రూపాయికి మరిన్ని తూట్లు పొడిచింది. ఈ చట్టం అమలుతో ప్రభుత్వంపై సబ్సిడీ భారం భారీగా పెరిగిపోయి.. ద్రవ్యలోటు దూసుకెళ్తుందనే భయాలు దేశీ కరెన్సీని వణికించాయి. దీంతో మంగళవారం ఒకేరోజు 200 పైసలు పడిపోయి కనీవినీఎరుగని పతనాన్ని రూపాయి చవిచూసింది. క్రితం ముగింపు 64.30తో పోలిస్తే ఒకానొక దశలో 66.30ని కూడా తాకింది. చివరకు 194 పైసలు(3.02 శాతం) క్షీణించి 66.24 వద్ద ముగిసింది. ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం అన్నిచర్యలూ తీసుకుంటుందని ఆర్థిక మంత్రి పీ చిదంబరం ఇచ్చిన హామీకూడా ఎలాంటి సానుకూల ప్రభావం చూపలేదు. మరోపక్క, ఆహార భద్రత బిల్లు భయాలతో అటు స్టాక్ మార్కెట్ కూడా 600 పాయింట్ల మేర కుప్పకూలడం రూపాయిని ఛిన్నాభిన్నం చేసింది. విదేశీ పెట్టుబడుల తిరోగమనం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఎగబాకడం కూడా దేశీ కరెన్సీని దిగజార్చాయి. బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు యథేచ్ఛగా డిమాండ్ పెరిగిపోవడంతో రూపాయి విలువ హారతికర్పూరంలా ఆవిరైందని ఫారెక్స్ డీలర్లు వ్యాఖ్యానించారు.ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ 65 వద్ద బలహీనంగా ఆరంభమైంది. ఆతర్వాత పూర్తిగా నష్టాల్లోనే కొనసాగుతూ 66 స్థాయి దిగువకు పడిపోయింది. మంగళవారంనాటి ఇంట్రాడే, ముగింపులు రెండూ కొత్త ఆల్టైమ్ కనిష్టాలే కావడం గమనార్హం. సోమవారం కూడా దేశీ కరెన్సీ విలువ 110 పైసలు క్షీణించడం తెలిసిందే. కాగా, ఈ నెల 19న రూపాయి 148 పైసలు పడిపోయి దశాబ్దంలోనే అత్యంత ఘోరమైన పతనాన్ని నమోదు చేసింది. ఇప్పుడు చరిత్రలోనే కనీవినీఎరుగని రీతిలో ఒకేరోజు కుప్పకూలింది. 22న నమోదైన 65.56 స్థాయి ఇంట్రేడేలో ఇప్పటిదాకా ఆల్టైమ్ కనిష్టంగా ఉంది. చమురు దెబ్బ... బ్రెంట్ క్రూడ్ ధర అంతర్జాతీయంగా 113 డాలర్లకు ఎగబాకడంతో దిగుమతుల భారం పెరిగేందుకు దారితీస్తుందన్న ఆందోళనలు రూపాయికి మంటపెట్టాయని కోటక్ మహీంద్రా బ్యాంక్ ట్రెజరర్ మోహన్ షెనాయ్ వ్యాఖ్యానించారు. సిరియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో చమురుధరలకు రెక్కలొస్తున్నాయి. మరోపక్క, ఆహార భద్రత బిల్లుతో ద్రవ్యలోటు ఎగబాకనుండటం కూడా ఆర్థిక వ్యవస్థకు గుదిబండే. ఈ ఏడాది ద్రవ్యలోటు కట్టడి లక్ష్యాన్ని(4.8%) భారత్ రేటింగ్ను కట్ చేస్తామంటూ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. మరోపక్క, అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగైన రికవరీతో అక్కడి ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీలను ఉపసంహరించొచ్చన్న భయాలు కూడా రూపాయిని కొద్దిరోజులుగా వెంటాడుతున్నాయి. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత్ నుంచి తమ నిధులను వెనక్కి తరలించుకుపోతారన్న ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. ఇప్పటికే ఎఫ్ఐఐల అమ్మకాలు అటు డెట్, ఇటు స్టాక్ మార్కెట్లో జోరందు కుంటున్నాయి.67ను తాకొచ్చు...: చమురు దిగుమతిదారుల నుంచి భారీ డిమాండ్తో రూపాయి బలహీన ధోరణినే కొనసాగించొచ్చని అల్పరి ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈఓ ప్రమిత్ బ్రహ్మభట్ పేర్కొన్నారు. 65-67 స్థాయిలో ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ఇదిలాఉండగా.. బ్రిటిష్ పౌండ్తో రూపాయి విలువ కూడా కొత్త ఆల్టైమ్ కనిష్టానికి జారింది. క్రితం ముగింపు 100.12తో పోలిస్తే 268 పైసలు కుప్పకూలి 102.80 వద్ద స్థిరపడింది. -
పెట్టుబడుల ఊపునకు ఏం చేద్దాం..
ముంబై: రూపాయి భారీ పతనం, కరెంటు అకౌంటు లోటు పెరిగిపోతున్న నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించేందుకు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం..బ్యాంకర్లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో (ఎఫ్ఐఐ) వేర్వేరుగా సమావేశమయ్యారు. అంతకంతకూ పెరిగిపోతున్న కరెంటు ఖాతా లోటును భర్తీ చేసు కునే దిశగా విదేశీ పెట్టుబడులు పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వీటిలో చర్చించారు. ఈ సమావేశాలో పలు సూచనలు చర్చకు వచ్చినట్లు ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ టక్రూ వివరించారు. వీటి ఆధారంగా పెట్టుబడులకు ఊతమిచ్చేలా వచ్చే ఎనిమిది, పది రోజుల్లో కొన్ని చర్యలు ఉండగలవని టక్రూ పేర్కొన్నారు. -
రూపాయి 86 పైసలు డౌన్
ముంబై: దేశీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ప్రధాన కరెన్సీలతో రూపాయి మారకం విలువ రోజురోజుకూ కొత్త కనిష్ట స్థాయులకు పడిపోతోంది. బుధవారం డాలర్తో పోలిస్తే మరో ఆల్టైమ్ కనిష్టమైన 64.54 స్థాయిని తాకింది. అటు పౌండ్తో పోలిస్తే సెంచరీ కొట్టి 101.3 స్థాయిని తాకింది. కరెన్సీ క్షీణతకు అడ్డుకట్ట వేసే దిశగా బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య సరఫరాను పెంచేం దుకు ఆర్బీఐ మంగళవారం చర్యలు ప్రకటించినప్పటికీ ఫలితం కనిపించలేదు. దిగుమతిదారుల నుంచి డాలర్లకు భారీ డిమాండ్, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, వచ్చే నెల నుంచి అమెరికా ఉద్దీపన ప్యాకేజీలు ఉపసంహరించవచ్చన్న భయాలు రూపాయిపై ఒత్తిడి పెంచుతున్నాయి. బుధవారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి ట్రేడింగ్ క్రితం ముగింపు 63.25తో పోలిస్తే బలహీనంగా 63.45 వద్ద ట్రేడయ్యింది. ఒక దశలో గరిష్టంగా 63.10 స్థాయికి పెరిగినా.. ఆ తర్వాత ఇంట్రా డేలో జీవిత కాల కనిష్టం 64.54కి పడిపోయింది. చివరికి 86 పైసల (1.36%) నష్టంతో 64.11 వద్ద క్లోజయ్యింది. మొత్తం మీద అయిదు సెషన్లలో రూపాయి విలువ 292 పైసలు (4.77%) పతనమైంది. ఆర్బీఐ చర్యలెన్ని తీసుకుంటున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదని, రూపాయి బలహీనత కొనసాగుతూనే ఉందని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ సీఈవో అభిషేక్ గోయెంకా చెప్పారు. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు 64.40 స్థాయి దగ్గర ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా రిజర్వ్ బ్యాంక్ డాలర్లను విక్రయించి ఉంటుందని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఇండియా) సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. పౌండ్ ః100.5 .. బ్రిటిష్ పౌండుతో పోలిస్తే రూపాయి మారకం సెంచరీ దాటేసింది. ఇంట్రాడేలో ఆల్టైమ్ కనిష్టమైన 101.3కి పడిపోయి చివరికి 100.5 వద్ద ముగిసింది. పౌండుతో పోలిస్తే ఇంతస్థాయికి పడిపోవడం చరిత్రలోనే మొదటిసారి. ప్రస్తుతం రూపాయితో పోలిస్తే అత్యంత ఖరీదైన కరెన్సీల్లో పౌండు, యూరో, స్విస్ ఫ్రాంక్, అమెరికా డాలరు ఉన్నాయి. డాలర్తో పోలిస్తే మరో నెల రోజుల్లో కరెంటు ఖాతా లోటు, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులతో పాటు దేశీయ ఎకానమీ అస్తవ్యస్తంగా ఉండటం రూపాయిపై ఒత్తిడి పెంచుతోందని బ్యాంకింగ్ దిగ్గజం డాయిష్ బ్యాంక్ తెలిపింది. -
రూపాయి రికవరీ 42 పైసలు అప్, 60.88 వద్ద క్లోజ్
ముంబై: రూపాయికి మద్దతునిచ్చేందుకు ప్రభుత్వం తాజాగా మరిన్ని చర్యలు తీసుకోవచ్చన్న అంచనాలతో దేశీ కరెన్సీ మారకం విలువ గురువారం గణనీయంగా బలపడింది. డాలర్తో పోలిస్తే.. ఆల్టైం కనిష్ట ముగింపు స్థాయిల నుంచి కోలుకుని 42 పైసలు పెరుగుదలతో 60.88 వద్ద ముగిసింది. దేశీ స్టాక్ మార్కెట్లు మెరుగ్గా ఉండటం, అటు విదేశాల్లో డాలరు బలహీనపడటం, దీంతో పాటు ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం సైతం రూపాయి బలపడటానికి దోహదపడ్డాయి. ఈ వారాంతంలోగా రూపాయికి మద్దతుగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముందంటూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అరవింద్ మయారాం సూచనప్రాయంగా తెలపడం రూపాయికి కాస్త ఊతమిచ్చింది. దేశీ కరెన్సీ మంగళవారం ఇంట్రాడేలో ఆల్టైం కనిష్టమైన 61.80 స్థాయికి పతనమైన సంగతి తెలిసిందే. ప్రతి సోమవారం రూ.22 వేల కోట్ల బాండ్ల అమ్మకం ఇదిలా ఉండగా, రూపాయి క్షీణతకి అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఫారెక్స్ మార్కెట్లో హెచ్చుతగ్గులను కట్టడి చేసే దిశగా ప్రతి సోమవారం రూ. 22,000 కోట్ల మేర ప్రభుత్వ బాండ్లను విక్రయించాలని నిర్ణయించింది. వేలం వ్యవధి ఎంత ఉంటుందన్నది.. వేలం తేదికి ఒక రోజు ముందుగా ప్రకటించడం జరుగుతుందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ద్రవ్య లభ్యతను సమర్ధంగా నిర్వహించేందుకు ఈ క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ దోహదపడగలవని పేర్కొంది. డాలర్తో పోలిస్తే అంతకంతకూ క్షీణిస్తున్న రూపాయి మారకం విలువ మంగళవారం ఇంట్రాడేలో ఆల్టైం కనిష్టమైన 61.80ని తాకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రూపాయి పతనాన్ని నిలువరించే దిశగా.. ద్రవ్య సరఫరాను క ఠినతరం చేయడానికి, స్పెక్యులేషన్ కి అడ్డుకట్ట వేయడానికి ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంది.