Godavari waters
-
గోదారి గుండెల్లో కాలుష్యం గునపాలు
సాక్షి, అమరావతి: జీవ నది గోదావరికి మానవుడే శాపమయ్యాడు. అనేక రకాల వ్యర్థాలు, రసాయనాలను నదిలో కలిపేసి జలాలను కలుషితం చేసేస్తున్నాడు. దీంతో ఒకప్పుడు నదిలోకి దిగి దోసిటలో తీసుకొని తాగే నీరు ఇప్పుడు శుద్ధి చేయకుండా తాగకూడదన్న దశకు చేరుకుంది. గోదావరి జలాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందని, నీటిని శుద్ధి చేయకుండా నేరుగా తాగడం శ్రేయస్కరం కాదని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ), కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) హెచ్చరిస్తున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి గోదావరి జలాలపై అధ్యయనం చేయగా.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డర్స్ (బీఐఎస్) నిర్దేశించిన ప్రమాణాలకంటే అధికస్థాయిలో కాలుష్యం ఉన్నట్లు వెల్లడైంది. పశి్చమ కనుమల్లో మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ వద్ద పర్వత శ్రేణుల్లో జన్మించే గోదావరి ప్రధాన పాయ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మీదుగా 1,465 కిమీల దూరం ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. దారిలో పూర్ణ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, ప్రవర, మంజీర, మానేరు ప్రధాన ఉప నదులు కలుస్తాయి. గోదావరి నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో 3,12,812 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. దేశ భౌగోళిక విస్తీర్ణంలో గోదావరి బేసిన్ 9.5 శాతం. దేశంలో అతి పెద్ద నదుల్లో గోదావరి రెండో స్థానంలో ఉంది. ఇంత పెద్ద నదినీ మానవుడు కలుషితం చేసేస్తున్నట్లు వెల్లడైంది.పారిశ్రామిక వ్యర్థాలు, క్రిమిసంహారక మందుల వల్లేసీడబ్ల్యూసీ, సీపీసీబీ నివేదిక ప్రకారం.. గోదావరి బేసిన్లో భారీ ఎత్తున పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. సాగు భూమి విస్తీర్ణమూ ఎక్కువే. పారిశ్రామిక వ్యర్థాలను, వ్యర్థ జలాలను యథేచ్ఛగా గోదావరి, ఉప నదులు, వంకలు, వాగుల్లోకి వదిలేస్తున్నారు. పంటల సాగులో మోతాదుకు మించి రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వినియోగిస్తున్నారు. వర్షపు నీటితో ఈ ఎరువులు, మందులు గోదవరిలో కలిసిపోతున్నాయి. గోదావరి బేసిన్లో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని మురుగునీటిని శుద్ధి చేయకుండా యథేచ్ఛగా వదిలేస్తుండటం వల్ల కూడా నది కలుషితమవుతోంది. పశ్చిమ కనుమల్లో భారీ ఎత్తున అడవులను నరికివేస్తుండటం వల్ల భూమి కోతకు గురవుతోంది. అడ్డగోలుగా గనులను తవ్వేస్తుండటం వల్ల వర్షపు నీటి ద్వారా కాలుష్యం గోదావరికి చేరుతోంది. ఇలా మానవ తప్పిదాల వల్లే గోదావరి నది కాలుష్య కాసారంగా మారింది. నేరుగా తాగితే రోగాలు కొనితెచ్చుకోవడమే బీఐఎస్ ప్రమాణాల ప్రకారం తాగే నీటిలో ఫీకల్ కోలీఫామ్ (ప్రమాదకర బ్యాక్టీరియా) ఆనవాళ్లు ఉండకూడదు. కానీ.. గోదావరి జలాల్లో ఫీకల్ కోలీఫామ్ మిల్లీ లీటర్కు 4 నుంచి 7 వరకు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నవంబర్లో నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. ఇక టోటల్ కోలీఫామ్ (బ్యాక్టీరియా) లీటర్ నీటికి 50 లోపు ఉండొచ్చు. కానీ.. గోదావరి జలాల్లో లీటర్ నీటికి 93 నుంచి 120 బ్యాక్టీరియాలు ఉన్నట్లు తేలింది.బీఐఎస్ ప్రమాణాల ప్రకారం లీటర్ నీటిలో ఘనవ్యర్థాలు (టీడీఎస్) 0.5 గ్రాములు కలిసి ఉన్నప్పటికీ ఆ నీటిని తాగొచ్చు. కానీ.. గోదావరి జలాల్లో లీటర్ నీటిలో 8 గ్రాముల మేర ఘన వ్యర్థాలు ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. అందువల్ల గోదావరి జలాలను శుద్ధి చేయకుండా తాగితే కలరా, మలేరియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీఐఎస్ ప్రమాణాల మేరకు తాగు నీటికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాలు..1. పీహెచ్ (ఆమ్లత్వం) 6.5 నుంచి 8.5 శాతం లోపు 2. డీవో (డిజాల్వ్డ్ ఆక్సిజన్) లీటర్ నీటికి 6 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉండాలి 3. బీవోడీ (బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్) లీటర్ నీటికి 2 మిల్లీగ్రాముల లోపు ఉండొచ్చు 4. టోటల్ కోలీఫామ్ (బ్యాక్టీరియా) 100 మిల్లీలీటర్ల నీటికి 50 లోపు ఉండొచ్చు 5. ఫీకల్ కోలీఫామ్ (ప్రమాదకర బ్యాక్టీరియా) 100 మిల్లీలీటర్లకు ఒక్కటి కూడా ఉండకూడదు 6. టీడీఎస్ (టోటల్ డిజాల్్వడ్ సాలిడ్స్) లీటర్ నీటికి 500 మిల్లీగ్రాముల లోపు ఉండొచ్చు -
నదీజలం.. వృథా అధికం
సాక్షి, అమరావతి: ప్రస్తుత నీటి సంవత్సరంలో జూన్ ఒకటో తేదీ నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు గోదావరి, కృష్ణా, వంశధార నదుల నుంచి 5,021.58 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. రాష్ట్రంలో ఆయా నదీ పరీవాహక ప్రాంతాల(బేసిన్)లలో వినియోగించుకున్న, రిజర్వాయర్లలో నిల్వ ఉన్న నీటి కంటే నాలుగు రెట్లు అధికంగా కడలిలో కలిశాయి. నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిశాయి. కృష్ణా, గోదావరి, వంశధార బేసిన్ల పరిధిలోని రాష్ట్రాల్లోను విస్తారంగా వర్షాలు కురిశాయి. దాంతో ఈ నదులు వరద నీటితో పోటెత్తాయి. నీటి సంవత్సరం జూన్ 1న ప్రారంభమై... మే 31వ తేదీన ముగుస్తుంది. కేవలం ఆరు నెలల్లోనే 5,021.58 టీఎంసీలు వృథాగా సముద్రంలో కలవడం విశేషం.నదుల వారీగా నీటి వినియోగం.. సముద్రంలోకి వదిలిన జలాల వివరాలు...ప్రస్తుత నీటి సంవత్సరంలో జూన్ ఒకటో తేదీ నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు గోదావరి నుంచి ధవళేశ్వరం బ్యారేజీలోకి 4,266.53 టీఎంసీల ప్రవాహం రాగా... గోదావరి డెల్టాలో పంటల సాగుకు 136.28 టీఎంసీలు వినియోగించుకున్నారు. మిగులుగా ఉన్న 4,130.25 టీఎంసీలను సముద్రంలోకి వదిలేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గరిష్టంగా గోదావరి వరద జలాలను ఒడిసి పట్టి బంజరు భూములకు మళ్లించి సస్యశ్యామలం చేయడానికి అవకాశం ఉంటుంది.కృష్ణా నది నుంచి ప్రకాశం బ్యారేజీకి 1,006.36 టీఎంసీల ప్రవాహం వచ్చింది. కృష్ణా డెల్టాలో పంటల సాగుకు 136.64 టీఎంసీలు వినియోగించుకున్నారు. మిగులుగా ఉన్న 869.72 టీఎంసీలను బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేశారు. ఉమ్మడి రాష్ట్రానికి 75 శాతం లభ్యత ఆధారంగా 811 టీఎంసీల కృష్ణా జలాలను కేడబ్ల్యూడీటీ–1 (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–) కేటాయించింది. ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు అంతకంటే ఎక్కువ నీరు సముద్రంలో కలవడం గమనార్హం.వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 41.49 టీఎంసీలు వచ్చాయి. ఆయకట్టు పంటల సాగుకు 19.88 టీఎంసీలను వినియోగించుకున్నారు. మిగులుగా ఉన్న 21.61 టీఎంసీలను సముద్రంలోకి వదిలేశారు. గొట్టా బ్యారేజీ వద్ద 115 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన వంశధార ట్రిబ్యునల్... ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెరి సగం కేటాయించింది. వంశధార ట్రిబ్యునల్ అంచనా వేసిన దాని కంటే 73.51 టీఎంసీలు తక్కువగా వచ్చాయి. వంశధార స్టేజ్–2 ఫేజ్–2 ప్రాజెక్టు కింద వంశధార జలాలను పూర్తి స్థాయిలో ఒడిసి పట్టాలంటే నేరడి బ్యారేజ్ లేదా వంశధార ఎత్తిపోతల పథకం పూర్తి చేయాల్సి ఉంది. -
కడలి దిశగా కృష్ణమ్మ పరుగులు
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/తాడేపల్లి రూరల్/పోలవరం రూరల్: కృష్ణమ్మ కడలి వైపు కదలిపోతోంది. విజయవాడ వద్దనున్న ప్రకాశం బ్యారేజీల్లోకి గురువారం సాయంత్రం 6 గంటలకు 3,10,088 క్యూసెక్కులు చేరుతోంది. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. కృష్ణా డెల్టా కాలువలకు 13,768 క్యూసెక్కులను అధికారులు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 2,96,320 క్యూసెక్కులను 17 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువ నుంచి కృష్ణా నది, ఉప నది తుంగభద్రల్లో వరద కొనసాగుతోంది.ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ల నుంచి 2.08 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర డ్యామ్ నుంచి 60 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,54,761 క్యూసెక్కులు వస్తున్నాయి. ఇక్కడ 882.5 అడుగుల్లో 202.04 టీఎంసీలను నిల్వ చేస్తూ 3.72 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. బ్యాక్వాటర్ నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతికి 211 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 25 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు విడుదల చేశారు.నాగార్జున సాగర్లోకి 2,72,750 క్యూసెక్కులు చేరుతుండగా.. 586 అడుగుల్లో 300.32 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి 2.53 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 2.58 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 35.5 టీఎంసీలను నిల్వ చేస్తూ 2.46 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటి మట్టం 31.6 మీటర్లకు చేరింది. స్పిల్వే నుంచి దిగువకు 7.77 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది. భద్రాచలం వద్ద కూడా 37.50 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద స్థిరంగా కొనసాగుతోంది.గురువారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్లోకి 6,96,462 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 7,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్న అధికారులు.. మిగులుగా ఉన్న 6,88,962 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో అంటే జూన్ 1 నుంచి గురువారం ఉదయం వరకూ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 1800.71 టీఎంసీల గోదావరి జలాలు, ప్రకాశం బ్యారేజ్ నుంచి 14.94 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి.మిడతపాట్లు వేలేరుపాడు: గోదావరి వరదలో మునగకుండా ప్రాణాలు కాపాడుకునేందుకు మిడతలు ఇలా ఊత పుల్లల పైకి ఒకదాని వెనుక మరొకటి ఎక్కాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ము గ్రామంలో గురువారం కనిపించిన దృశ్యాలివి.. -
కాళేశ్వరం ఖర్చు రూ.93,872.07 కోట్లు ..
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా 215 టీఎంసీల గోదావరి జలాలను తరలించి రూ.19.63 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి, 18.82 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ జరపాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 98,570 ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి చేశారు. మొత్తం రూ.1,27,872.28 కోట్ల అంచనాతో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టగా, ఇప్పటివరకు రూ.93,872.07 కోట్లు ఖర్చు చేశారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) ద్వారా సమీకరించిన రూ.61,665.20 కోట్ల రుణాలతోపాటు రూ. 32,206.87 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులు అందులో ఉన్నాయి. కాళేశ్వరం కింద 18,64,970 ఎకరాల మిగులు ఆయకట్టును 2028–29 నాటికి అభివృద్ధి చేసేందుకు గత ప్రభు త్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. శుక్రవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ బృందం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించనుంది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ కాళేశ్వరం ప్రాజెక్టు పుట్టుపూర్వోత్తరాలపై మంత్రుల బృందానికి పవర్పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ఇవ్వనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎందుకు అర్ధంతరంగా విరమించుకున్నారు? ఆ ప్రాజెక్టుకు బదులుగా కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు నిర్మించాల్సి వచి్చంది? వ్యయం, ప్రతిపాదిత ఆయకట్టు, నిధుల సమీకరణ, విద్యుత్ అవసరాల విషయంలో రెండు ప్రాజెక్టుల మధ్య తేడాలేంటి? మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో తలెత్తిన లోపాలు, సమస్యలేంటి? వాటికి పరిష్కార మార్గాలేంటి? అన్న అంశాలతో నీటిపారుదల శాఖ పీపీటీని సిద్ధం చేసింది. వడ్డీ రూపంలో రూ.16,201.94 కోట్లు ఇప్పటివరకు తీసుకున్న రుణంలో అసలు రూ.4,696.33 కోట్లు మాత్రమే చెల్లించగా, గత ఐదేళ్లలో వడ్డీలు రూ.16,201.94 కోట్లు చెల్లించారు. అసలు, వడ్డీ కలిపి రూ.21,157.87 కోట్లు చెల్లించా రు. కాళేశ్వరం కార్పొరేషన్లో భాగమైనపాలమూరు–రంగారెడ్డికి రూ.10 వేల కోట్ల రుణం మంజూరు కాగా.. పవర్ఫైనాన్స్ కార్పొరేషన్రూ.7,721.51 కోట్లు విడుదల చేసింది. ఇంకో రూ.2,278.49 కోట్లు మంజూరు చేయాల్సి ఉంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులకు గత మూడేళ్లలో రూ.1,522.8 కోట్ల వడ్డీ చెల్లించగా, అసలు చెల్లింపులు ఇంకా మొదలుకాలేదు. 17.08 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ దిగువ మానేరు జలాశయం కింద ఎస్సారెస్పీ స్టేజ్–1కి సంబంధించిన పాత ఆయకట్టుతోపాటు ఎస్సారెస్పీ స్టేజ్–2, నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద పాత ఆయకట్టుకు 2023–24 ఖరీఫ్, రబీ సీజన్లలో కాళేశ్వరం ద్వారా సాగునీరు అందించారు. దీంతో మొత్తం 17,08,230 ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించినట్టు నీటిపారుదల శాఖ మంత్రులకు నివేదించనుంది. ♦ కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల ద్వారా 456 చెరువులను నింపగా, వాటి కింద 39,146 ఎకరాల ఆయకట్టు ఉంది. కాళేశ్వరం నీళ్లను ఎస్సారెస్పీ–1, 2, నిజాంసాగర్ కాల్వల ద్వారా 2,143 చెరువులకు తరలించగా, వాటి కింద మరో 1,67,050 ఎకరాల ఆయకట్టు ఉంది. ♦ 2020–21 రబీ నుంచి 2023–24 ఖరీఫ్ వరకు కుందెల్లి వాగు, హల్దివాగు, 66 చెక్డ్యామ్ల కింద ఉన్న మొత్తం 20,576 ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం జలాలను విడుదల చేశారు. -
అవసరం లేకపోయినా ఎత్తిపోయాలా!?
సాక్షి, అమరావతి: పట్టువదలని వక్రమార్కుడు (రామోజీ) ఎప్పటిలాగే మళ్లీ తన అభూత కల్పనలతో ఓ సత్యదూరమైన కథనాన్ని అల్లారు. ఈసారి ఆయన రాతల గాలి పట్టిసీమ గోదావరి జలాలపై మళ్లింది. ‘పట్టిసీమ నీరూ తేలేరా’ అంటూ శనివారం ‘ఈనాడు’లో పాఠకుల మీద తన పైత్యాన్ని రుద్దిన తీరుచూస్తే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిత్యం బురదజల్లడానికే ఈ తప్పుడు రాతలు అని మరోసారి తన మనస్సులో మాటను చెప్పకనే చెప్పుకున్నారు. నిజానికి.. పులిచింతల, పట్టిసీమ ఎత్తిపోతల జలాలను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుంటూ కృష్ణా డెల్టా చివరి ఆయకట్టుకూ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లందిస్తుంటే.. పది లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేసిన రైతుల కళ్లలో ఆనందాన్ని చూసి ఓర్చుకోలేని రామోజీ.. తన కథనంలోని ప్రతి అక్షరంలో జగన్పై అక్కసు వెళ్లగక్కారు తప్ప అందులో వీసమెత్తు నిజంలేదు. అప్పట్లో ఏనాడైనా సకాలంలో నీళ్లిచ్చారా? అసలు టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్న ఆ ఐదేళ్లలో ఏనాడూ కృష్ణా డెల్టాకు సకాలంలో నీళ్లందించిన దాఖలాల్లేవు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 2019 నుంచి ఏటా జూన్ మొదటి వారంలోనే నీళ్లందిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 7న కృష్ణా డెల్టాకు నీళ్లందిస్తే సకాలంలో నీళ్లందించలేదంటూ రామోజీ గగ్గోలు పెట్టారు. ప్రస్తుత సీజన్ ప్రారంభంలో పులిచింతలలో 38 టీఎంసీలు నిల్వ ఉండేవి. గోదావరిలో వరద ప్రవాహం ప్రారంభం కానంత వరకూ కృష్ణా డెల్టాకు పులిచింతల నుంచి 18 టీఎంసీలను విడుదల చేశారు. బేసిన్లో వర్షాలు కురవడం.. గోదావరిలో వరద ప్రారంభమవడంతో జూలై 21న పట్టిసీమ ఎత్తిపోతల పంపులు ఆన్చేసి.. పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి జలాలను తరలించి డెల్టాకు విడుదల చేశారు. జూలై ఆఖరు, ఆగస్టు ప్రథమార్థంలో తెలంగాణలో కురిసిన వర్షాలవల్ల మూసీ నుంచి పులిచింతలలోకి 19 టీఎంసీలు చేరాయి. సీజన్ ప్రారంభంలో పులిచింతల నుంచి కృష్ణా డెల్టాకు 18 టీఎంసీలను విడుదల చేయకపోతే.. మూసీ వరద నుంచి వచ్చిన 19 టీఎంసీలు కడలి పాలయ్యేవి. ఇది ప్రస్తుత ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనం. ప్రజాధనాన్ని వృథా చేయమంటారా? గోదావరి నుంచి ప్రకాశం బ్యారేజ్కి పట్టిసీమ ద్వారా ఒక టీఎంసీని ఎత్తిపోయాలంటే రూ.2.65 కోట్లు వ్యయమవుతుంది. అయినా.. పులిచింతల, పట్టిసీమ జలాలతో కృష్ణా డెల్టాలో ప్రతి ఎకరాకూ నీళ్లందించాలని విద్యుత్ ఛార్జీలు ఎంతైనా భరిస్తామని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ ఎత్తిపోతల నిర్వహణకు రూ.15.80 కోట్లను విడుదల చేశారు. మరోవైపు.. తెలంగాణలో, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కురవడంవల్ల ఉప నదులు, వాగులు, వంకల ద్వారా ప్రకాశం బ్యారేజ్కు వరద నీరు చేరింది. కృష్ణా డెల్టాలో మూడు దఫాలుగా భారీ వర్షాలు కురిసిన సందర్భాలలోనూ నీటి అవసరం తక్కువగా ఉంది. అలాంటి సందర్భాల్లోనూ పట్టిసీమ నుంచి నీటిని ఎత్తిపోసి ప్రకాశం బ్యారేజి గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేయడం ద్వారా ప్రజాధనాన్ని వృథా చేయాలా రామోజీ? పట్టిసీమ ద్వారా ఇప్పటిదాకా ఎత్తిపోసిన 54.35 టీఎంసీలను పులిచింతల నీటికి జతచేసి డెల్టాలో ఆయకట్టు చివరి భూములకు ప్రభుత్వం నీళ్లందించింది. డెల్టా ఎగువ ప్రాంతాల్లో పంట కోత దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో.. కాలువల ద్వారా నీటి సరఫరా మీద ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం పులిచింతలలో నిల్వ ఉన్న 13.61 టీఎంసీలను తాగునీరు, అత్యవసర సాగునీటి అవసరాలకే ఉపయోగిస్తారు. అదే చంద్రబాబు హయాంలో పట్టిసీమ ద్వారా పూర్తిస్థాయిలో నీటిని ఎత్తిపోసినా కృష్ణా డెల్టాలో ఏటా లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి, రైతులు నష్టపోయారు. అయినా రామోజీ పెన్ను ఏనాడూ పెగల్లేదు. దోపిడీని కప్పిపుచ్చుకునేందుకే రోతరాతలుఅంతకుముందు.. జలయజ్ఞం ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను కేవలం రూ.17,368 కోట్లతో పూర్తిచేస్తానంటూ 2014, జూలై 28న శ్వేతపత్రం ప్రకటించిన చంద్రబాబు.. ఐదేళ్లలో రూ.68,293.94 కోట్లు ఖర్చుచేసినా ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేకపోయారు. ధరల సర్దుబాటు (జీఓ–22), పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు (జీఓ–63)ల ద్వారా కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టి.. రాబట్టుకున్న కమీషన్లను చంద్రబాబు ముఠా పప్పుబెల్లాల్లా పంచుకుంది. అందులో రామోజీకి వాటా దక్కింది. నిజానికి.. నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తే పులిచింతలలో 45.77 టీఎంసీలు నిల్వచేసుకోవచ్చునని.. కృష్ణా డెల్టాకు అది వరమని అప్పట్లో సీఎం వైఎస్ జగన్ అనేకసార్లు చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. కమీషన్ల కోసం పట్టిసీమను చేపట్టారు. కృష్ణా, గోదావరి నదుల్లో దాదాపుగా ఒకేసారి వరద వస్తుంది. ప్రకాశం బ్యారేజ్ నిల్వ సామర్థ్యం 2.93 టీఎంసీలే. అలాంటప్పుడు గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా నీటిని తరలిస్తే.. ప్రకాశం బ్యారేజి గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేయాల్సిందే. పట్టిసీమకు పెట్టే వ్యయాన్ని పోలవరంపై పెట్టి పూర్తిచేస్తే.. గ్రావిటీపై కృష్ణా డెల్టాకు నీళ్లందించవచ్చునని కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ చెప్పారు. దీన్ని సాగునీటిరంగ నిపుణులు, అధికారులు అప్పుడూ, ఇప్పుడూ బలపరుస్తున్నారు. మరోవైపు.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే నిర్వాసితుల సమస్యను పరిష్కరించి 2019 నుంచి పులిచింతలలో 45.77 టీఎంసీలను నిల్వచేస్తున్నారు కాబట్టే.. ఏటా కృష్ణా డెల్టాకు సకాలంలో సమృద్ధిగా నీళ్లందించగలుగుతున్నారు. -
అనుసంధానం అడుగు పడేదెలా?
సాక్షి, అమరావతి: దేశంలో నదుల అనుసంధానానికి ట్రిబ్యునళ్ల అవార్డులే ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఒక నదిలో మిగులు జలాలను లభ్యత తక్కువగా ఉన్న మరో నదికి మళ్లించడానికి.. ఆ నదీ పరివాహక ప్రాంతం (బేసిన్)లో ఎగువన ఉన్న రాష్ట్రాలు అదనంగా నీటిని కేటాయించాలంటూ పట్టుబడుతున్నాయి. ఇందుకు గోదావరి, మహానది ట్రిబ్యునళ్ల అవార్డులను అస్త్రాలుగా చేసుకుంటున్నాయి.దీంతో నదుల అనుసంధానం సాధ్యం కావడంలేదు. ఇది సాకారం కావాలంటే న్యాయపరంగా అడ్డంకులను తొలగించుకోవడంతోపాటు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించాలి. ఇదే పెద్ద సవాల్. గోదావరి నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల మళ్లింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గోదావరి ట్రిబ్యునల్.. ఇందుకు బదులుగా కృష్ణా బేసిన్లో ఎగువన ఉన్న మహారాష్ట్రకు 14, కర్ణాటకకు 21, సాగర్ ఎగువన ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీల కృష్ణా జలాలను అదనంగా వాడుకొనే వెసులుబాటు కల్పించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలన ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచే కృష్ణా బేసిన్లో అదనపు నీటిని వాడుకునే అవకాశం కల్పించింది. ఈ నీటి వాడకానికి మహారాష్ట్ర, కర్ణాటక తొమ్మిదేళ్ల క్రితమే కసరత్తు ప్రారంభించాయి. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 45 టీఎంసీలను విభజనానంతరం రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను ఇటీవల బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కు కేంద్రం అప్పగించింది. గోదావరి – కావేరి అనుసంధానం తొలి దశలో 141 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనను ప్రాధాన్యతగా చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. అయితే, కృష్ణా నది మీదుగా ఈ అనుసంధానం చేపడుతున్నందున, కృష్ణా జలాల్లో తమకు అదనంగా కేటాయింపులు చేయాలని మహారాష్ట్ర, కర్ణాటక పట్టుబడుతున్నాయి. కావేరి బేసిన్కు గోదావరి జలాలను మళ్లిస్తున్న నేపథ్యంలో కావేరి జలాల్లో అదనపు కోటా ఇవ్వాలంటూ కర్ణాటక, కేరళ పట్టుబడుతున్నాయి. దీన్ని కృష్ణా, కావేరి బేసిన్లో దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వ్యతిరేకిస్తున్నాయి. దాంతో గోదావరి– కావేరి అనుసంధానంపై ఏకాభిప్రాయ సాధన సవాల్గా మారింది. ఇదొక్కటే కాదు.. ద్వీపకల్ప భారతదేశంలో ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించిన 15 అనుసంధానాలపై ఏకాభిప్రాయ సాధన సాధ్యమయ్యే అవకాశమే లేదని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
గోదావరి నికర జలాల్లో మిగులే లేదు
సాక్షి, హైదరాబాద్: గోదావరి నది నికర జలాల్లో మిగులు లేదని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తేల్చి న నేపథ్యంలో గోదావరి–కావేరి అనుసంధానాన్ని ఎలా చేపడతారని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్డబ్ల్యూడీఏ)ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీటిపారుదల శాఖల అధికారులు నిలదీశారు. గోదావరి బేసిన్లో రెండు రాష్ట్రాల్లో పూర్తయిన, నిర్మాణం , ప్రతిపాదన దశలో ఉన్న ప్రాజెక్టులకే 306 టీఎంసీల మేర నికర జలాల కొరత ఉందని సీడబ్ల్యూసీ తేల్చి న అంశాన్ని ఎత్తిచూపారు. ఈ నేపథ్యంలో గోదావరి జలాలను తరలిస్తే రాష్ట్రాల్లో ప్రాజెక్టుల ఆయకట్టు ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఎన్డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ స్పందిస్తూ.. గోదావరిలో నికర జలాల్లో మిగులు లేని మాట వాస్తవమేనని అంగీకరించారు. ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 141.26 టీఎంసీలను తరలించేలా గోదావరి–కావేరి అనుసంధానాన్ని చేపడతామని చెప్పడంతో ఛత్తీస్గఢ్ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మా కోటా నీటిని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ స్పందిస్తూ.. గోదావరి బేసిన్లోని అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని తేల్చిచెప్పారు. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ అధ్యక్షతన ఎన్డబ్ల్యూడీఏ 71వ పాలక మండలి సమావేశం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. సీడబ్ల్యూసీ చైర్మన్ కుశీ్వందరసింగ్ వోరా, తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, సీఈ రమేశ్, అంతర్రాష్ట్ర విభాగం డీడీ సుబ్రహ్మణ్య ప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనుసంధానానికి సిద్ధమన్న ఎన్డబ్ల్యూడీఏ గోదావరిలో ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 141.26 టీఎంసీ లను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్(కృష్ణా), సోమశిల (పెన్నా) మీదుగా గ్రాండ్ ఆనకట్ట(కావేరి)కి తరలించడానికి రూపొందించిన గోదావరి–కావేరి అనుసంధానం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను బేసిన్లోని అన్ని రాష్ట్రాలకు ఇచ్చామని ఎన్డబ్ల్యూడీఏ డీజీ భోపాల్సింగ్ చెప్పారు. ఇందులో తెలంగాణకు 45, ఏపీకి 44, తమిళనాడుకు 40, కర్ణాటకకు 9.9, పుదుచ్చేరికి 2.1 టీఎంసీలు ఇస్తామని పేర్కొన్నా రు. దీనిపై ఇప్పటికే నాలుగుసార్లు రాష్ట్రాలతో సంప్రదింపు లు జరిపామని.. అనుసంధానం పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఎన్డబ్ల్యూడీఏ డీజీ చెప్పడంతో ఏపీ, తెలంగా ణ, ఛత్తీస్గఢ్ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుసంధానానికి అంగీకరించమన్న ఛత్తీస్గఢ్ కోటా నీటిని వాడుకోవడానికి ప్రాజెక్టులు చేపడతున్నామని.. ఎట్టిపరిస్థితుల్లోనూ గోదావరి–కావేరి అనుసంధానానికి అంగీకరించబోమని ఛత్తీస్గఢ్ అధికారులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో మీరు ప్రాజెక్టులు కట్టేలోగా మహానది నుంచి గోదావరికి జలాలను తరలిస్తామని.. వాటిని కావేరికి తీసుకెళ్తామని ఛత్తీస్గఢ్ అధికారులకు ఎన్డబ్ల్యూడీఏ డీజీ సర్దిచెప్పబోగా ఏపీ, తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మహానది నుంచి గోదావరికి జలాలను తెల్చి నా సరే.. రెండు రాష్ట్రాల అవసరాలు తీర్చాకే కావేరికి గోదావరిని తరలించాలని తేల్చి చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రాజెక్టుల ఆయకట్టు ప్రయోజనాలకు విఘాతం కల్పించేలా చేపట్టే గోదావరి–కావేరి అనుసంధానానికి అంగీకరించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులన్నింటికీ అనుమతులు జారీ చేసిన తర్వాతే నదుల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని తెలంగాణ స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్ సమ్మతి తర్వాతే... అన్ని రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలను పరిష్కరించడంతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి రాతపూర్వక సమ్మ తి తీసుకున్న తర్వాతే అనుసంధానం ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్తామని ఎన్డబ్ల్యూడీఏ డీజీ భోపాల్ సింగ్ హామీ ఇచ్చారు. మరో మూడు నెలల్లో ఈ మేరకు చర్యలు తీసుకుంటామని, అనంతరం డిసెంబర్ నెలాఖరు నాటికి ప్రాజెక్టు డీపీఆర్ను ఖరారు చేసి సంబంధిత రాష్ట్రాలతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటామని స్పష్టం చేశారు. వచ్చే కేంద్ర బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించనున్నట్టు వెల్లడించారు. -
మల్కపేట రెండో పంపు వెట్రన్ సక్సెస్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ రెండో పంపు వెట్రన్ విజయవంతమైంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీలో భాగంగా సిరిసిల్ల శివారులోని మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర) జలాశయం బ్యాక్వాటర్ను సొరంగం ద్వారా 12.03 కిలోమీటర్ల దూరంలోని మల్కపేటకు మళ్లించారు. మల్కపేట వద్ద రూ.504 కోట్లతో మూడు టీఎంసీల నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్ను నిర్మించారు. ఈ రిజర్వాయర్లోకి 30 మెగావాట్ల పంపుతో సర్జిపూల్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోశారు. మే 23న మొదటి పంపు వెట్రన్ నిర్వహించారు. తాజాగా రెండో పంపు వెట్రన్ను శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.40 గంటలకు ప్రారంభించి 1.40 గంటల వరకు కొనసాగించారు. ట్రయల్రన్ విజయవంతమైనట్లు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ప్రకటించారు. రెండో పంపు ట్రయల్రన్ విజయవంతం కావడంతో మంత్రి కె.తారక రామారావు ఇంజనీర్లను అభినందించారు. దీంతో కాళేశ్వరం 9 ప్యాకేజీ తొలి దశ పూర్తయిందని అధికారు లు తెలిపారు. సిరిసిల్ల మధ్యమానేరు జలాశయం నీరు 12 కిలోమీటర్లు సొరంగం ద్వారా ప్రయాణించి ధర్మారం వద్ద నిర్మించిన సర్జిపూల్కు చేరాయి. ఆ నీటిని రెండో పంపు ద్వారా మల్కపేట రిజర్వాయర్లోకి ఎత్తిపోశారు. రాష్ట్ర ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, ట్రాన్స్కో డైరెక్టర్ సూర్యప్రకాశ్, 9వ ప్యాకేజీ ఎస్ఈ సుధాకర్రెడ్డి, ఈఈ జి.శ్రీనివాస్రెడ్డి, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, ఇంజనీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంబోత్సవానికి ఏర్పాట్లు మల్కపేట రిజర్వాయర్లోకి గోదావరి జలాలను ఎత్తిపోసే కాళేశ్వరం 9వ ప్యాకేజీలో రెండు పంపుల వెట్రన్ విజయవంతం కావడంతో ఈ పంపులను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 15 –20 రోజుల్లో కేసీఆర్ చేతుల మీదుగా 9వ ప్యాకేజీని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ఇటీవల ఎల్లారెడ్డిపేటలో ప్రకటించారు. దీంతో మధ్యమానేరు నుంచి ఏడాదిలో 120 రోజులపాటు 11.635 టీఎంసీల నీటిని రెండు మోటార్లతో ఎత్తిపోసి మల్కపేట రిజర్వాయర్ను నింపి.. అక్కడి నుంచి గంభీరావుపేట మండలం సింగసముద్రం మీదుగా బట్టల చెరువు, నర్మాల ఎగువమానేరు జలాశయానికి గోదావరి జలాలను చేర్చనున్నారు. ఈ క్రమంలో మధ్యలో ఉండే వివిధ గ్రామాల్లోని చెరువులు, కుంటలను నింపుతారు. ఈ పథకం కింద సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో 96,150 ఎకరాలకు సాగునీరు అందనుంది. వానాకాలంలో 12వేల ఎకరాలకు మల్కపేట రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించాలని భావిస్తున్నారు. 9 డి్రస్టిబ్యూటరీల ద్వారా పొలాలకు సాగునీరు అందించనున్నట్టు అధికారులు తెలిపారు. -
నిలకడగా వరద
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్టు/విజయపురిసౌత్/అచ్చంపేట: కృష్ణా, గోదావరి, వంశ ధార నదుల్లో వరద ప్రవాహం నిలకడగా కొనసాగు తోంది. ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి 3.22 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 14,44,414 క్యూసెక్కుల గోదావరి జలాలు, గొట్టా బ్యారేజ్ నుంచి 35,199 క్యూసెక్కుల వంశధార జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి నీటిమట్టం 15.18 అడుగు లకు చేరుకుంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరి కను కొనసాగిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,89,362 క్యూసెక్కులు చేరుతుండగా.. పోతిరెడ్డి పాడు హెడ్రెగ్యులేటర్ నుంచి 14 వేలు, హంద్రీ– నీవా నుంచి 1,688, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తరలిస్తున్నారు. ప్రాజెక్టులో 884.4 అడుగుల్లో 211.95 టీఎంసీలను నిల్వచేస్తూ మిగులు జలాలు 3,17,460 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సోమవారం శ్రీశైలంలోకి వచ్చే వరద మరింత పెరగనుంది. ► నాగార్జునసాగర్లోకి 3,13,500 క్యూసెక్కులు చేరుతోంది. ప్రధాన కేంద్రంలో 16 గేట్లను 5 అడుగులు, పది గేట్లను పది అడుగుల మేర ఎత్తి 2,60,316 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్లో 584.9 అడుగుల్లో 297.14 టీఎంసీలను నిల్వచేస్తున్నారు. ► అక్కడ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 3,87,093 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 169.55 అడుగుల్లో 37.72 టీఎంసీలను నిల్వచేస్తున్నారు. ► పులిచింతల నుంచి దిగువకు విడుదల చేస్తున్న వరదకు పాలేరు, మున్నేరు, కట్టలేరు వరద తోడవుతుండటంతో ప్రకాశం బ్యారేజ్లోకి 3,36,032 క్యూసెక్కులు వస్తోంది. మిగులుగా ఉన్న 3.22 లక్షల క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదావరిలో స్థిరంగా వరద గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగు తోంది. భద్రాచలం నుంచి పోలవరంలోకి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్లోకి 14,53,414 క్యూసెక్కులు చేరుతుండగా 14,44,414 క్యూసెక్కులను 165 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. వంశధారలో పెరిగిన వరద ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వంశధారలో వరద ఉధృతి పెరిగింది. ఆదివారం రాత్రి 7 గంటలకు గొట్టా బ్యారేజ్లోకి 36,925 క్యూసెక్కులు చేరుతుండగా.. మిగులుగా ఉన్న 35,199 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
ఉత్తరాంధ్రకు గోదావరి జలాభిషేకం
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రను గోదావరి జలాలతో అభిషేకిస్తూ అక్కడి భూములను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ 162.409 కి.మీ. నుంచి 63.20 టీఎంసీలను తరలించి 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మంది ప్రజల దాహార్తి తీర్చడంతోపాటు ఆ ప్రాంత పారిశ్రామిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.17,411.40 కోట్లు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ప్రాధాన్యతగా గుర్తించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తి చేయాలని జల వనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. తొలి దశ పనులను రూ.954.09 కోట్లతో రెండు ప్యాకేజీలుగా, రెండో దశ పనులను రూ.5,134 కోట్లతో రెండు ప్యాకేజీలుగా కాంట్రాక్టర్లకు అధికారులు అప్పగించారు. రెండో దశలో మిగతా నాలుగు ప్యాకేజీ పనులకు టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు. పనులకు శ్రీకారం ► తొలి దశలో పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి జలాలను తరలించేందుకు వీలుగా 18.90 కి.మీ. మేర కాలువ, రెండుచోట్ల ఎత్తిపోతలు, 3.15 టీఎంసీల సామర్థ్యంతో పెదపూడి రిజర్వాయర్, ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులను చేపట్టారు. ► రెండో దశలో పాపయ్యపల్లె ఎత్తిపోతలతోపాటు 121.62 కి.మీ. పొడవున కాలువ తవ్వకం, ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టారు. భూసేకరణకు సమాంతరంగా పనులు తొలి దశ పనులు చేపట్టడానికి 3,822 ఎకరాల భూమి అవసరం. రెండో దశ పనులు చేపట్టడానికి 12,214.36 ఎకరాలు వెరసి 16,036.36 ఎకరాల భూమిని సేకరించాలి. ఇందులో ప్రస్తుతం కాంట్రాక్టర్లకు అప్పగించిన పనులు చేపట్టడానికి వీలుగా భూసేకరణ చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లకు అధికారులు దిశానిర్దేశం చేశారు. -
కరువు నేల పరవశం!
సాక్షి, సిద్దిపేట/గజ్వేల్: కరువు నేల పరవశిస్తోంది. పడావు పడ్డ భూముల్లో సిరుల పంటలు పండుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా దశాబ్దాల తండ్లాటను కాళేశ్వరం ప్రాజెక్టు తీర్చింది. మేడిగడ్డ బ్యారేజీ నుంచి సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ దాకా గోదావరి జలాలు ఉరకలు వేస్తున్నాయి. మండుటెండల్లోనూ చెరువులు నిండుగా కనిపిస్తున్నాయి. వర్షం వస్తేనే పారే కూడవెల్లి, హల్దీ వాగులు ఇప్పుడు కొత్త నడక నేర్చుకున్నాయి. ఇన్నాళ్లూ వలసలు పోయిన రైతులు.. తిరిగి సొంతూళ్లకు చేరుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ నుంచి మల్లన్నసాగర్ మీదుగా కొండపోచమ్మ రిజర్వాయర్ వరకు గ్రామాల్లో ‘సాక్షి’ నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఇలాంటి విశేషాలెన్నో బయటపడ్డాయి. ఈ అంశాలతో ప్రత్యేక కథనం.. సిద్దిపేట జిల్లా బూర్గుపల్లిలో గోదావరి జలాల డిస్ట్రిబ్యూటరీ కెనాల్ గోదావరి పరుగులతో.. మేడిగడ్డ బ్యారేజీ నుంచి లిఫ్ట్ చేసిన గోదావరి జలాలు.. వివిధ బ్యారేజీలు, రిజర్వాయర్ల మీదుగా రంగనాయసాగర్కు, అక్కడి నుంచి మల్లన్నసాగర్ మీదుగా కొండపోచమ్మసాగర్కు చేరుతున్నాయి. రంగనాయకసాగర్ నుంచి మల్లన్నసాగర్కు నీటిని 2.2 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్, 16.2 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా తరలిస్తున్నారు. మల్లన్నసాగర్ నుంచి మెయిన్ కెనాల్ ద్వారా చెరువులను నింపుతున్నారు. దుబ్బాక కెనాల్ ద్వారా తొగుట, సిద్దిపేట అర్బన్, రూరల్ మండలాల పరిధిలోని 36 చెరువులకుగాను ఇప్పటికే 18 చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయి. మరో 18 చెరువులు మూడు, నాలుగు రోజుల్లో నిండనున్నాయి. ఇక 32 చెక్ డ్యాంలకు గాను రెండు పూర్తిగా నిండగా, మరో 30 వారం రోజుల్లో నిండే అవకాశముంది. ఈ చెరువులు, చెక్ డ్యాంల నుంచి చిన్నకాల్వల ద్వారా పంటలకు సాగు నీరు అందుతోంది. చెరువులు నిండుగా ఉండటంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. గతంలో ఎండకాలం మొదలవుతుందంటేనే బోర్లు,బావులు ఎండిపోయేవని.. ఇప్పుడు బాగా నీళ్లు ఉంటున్నాయని ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు పంటలతో.. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఒక పంట పండటమే కష్టంగా ఉండేదని.. ఇప్పుడు గోదావరి నీళ్లు రావడంతో రెండు పంటలను సాగు చేస్తున్నామని స్థానిక రైతులు చెప్తున్నారు. రంగనాయకసాగర్ నుంచి మల్లన్నసాగర్ మధ్య ఉన్న 11 (ఇమాంబాద్, గాడిచర్లపల్లి, చిన్నగుండవెల్లి, బూర్గుపల్లి, ఎన్సాన్పల్లి, వెంకటాపూర్, తడ్కపల్లి, బండారుపల్లి, ఘన్పూర్, ఎల్లారెడ్డిపేట, తుక్కాపూర్) గ్రామాల్లో 2019–20 యాసంగిలో 6,134 ఎకరాల్లో సాగు జరగగా.. ఈసారి 9,389.25 ఎకరాలు సాగైంది. గతంలో కంటే దిగుబడి సైతం పెరిగిందని రైతులు అంటున్నారు. కొండపోచమ్మ దారిలో.. మల్లన్నసాగర్ నుంచి 23 కిలోమీటర్ల దూరంలోని కొండపోచమ్మ సాగర్ వరకు కాల్వల ద్వారా గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఈ కాల్వ వెంట ప్రధానంగా మంగోల్, తిప్పారం, రాంచంద్రాపూర్, కొడకండ్ల, రిమ్మనగూడ, దాతర్పల్లి, కోనాపూర్, అక్కారం, శ్రీగిరిపల్లి, అంగడికిష్టాపూర్, పాతూరు, పాములపర్తి, మర్కూక్ గ్రామాలు ఉన్నాయి. కొడకండ్ల బ్రిడ్జి వద్ద ఆనకట్ట కట్టి నీటిని వదులుతున్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సాగుకు నీళ్లు అందిస్తున్నారు. కూడవెల్లి, హల్దీకి కొత్త కళ గోదావరి జలాల పుణ్యామాని సిద్దిపేట జిల్లాలోని కూడవెల్లి, హల్దీవాగులు మండువేసవిలోనూ పరవళ్లు తొక్కుతున్నాయి. కూడవెల్లి వాగు గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో 80 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. ఈ వాగుపై మర్కుక్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేట, జగదేవ్పూర్, ఇటిక్యాల, అలిరాజపేట, తీగుల్, గజ్వేల్ మండలం అక్కారం, కొడకండ్ల, బూర్గుపల్లి, రిమ్మనగూడ సింగాటం, అహ్మదీపూర్ గ్రామాల పరిధిలో చెక్డ్యామ్లు, రాచకట్ట రిజర్వాయర్ ఉన్నాయి. కొన్నేళ్లుగా ఈ వాగు పరిధిలో భూగర్భ జలాలు పడిపోయి పంటలు ఎండిపోతూ వచ్చాయి. గతేడాది వేసవిలో కొండపోచమ్మ సాగర్ కాల్వ నుంచి నీటిని విడుదల చేయడంతో వాగు జలకళ సంతరించుకుంది. పంటలకు కష్టం తప్పింది. అదే తరహాలో ఈసారి ఈ నెల 19న నీటిని విడుదల చేశారు. ►గజ్వేల్, వర్గల్, తూప్రాన్, రామాయంపేట మండలాల మీదుగా ప్రవహించి మంజీరా నదిలో కలిసే మరో ప్రధాన వాగు హల్దీ. దీనిపై ఖాన్ చెరువు వద్ద జలాశయాన్ని నిర్మించారు. వేలూరు పుష్పల వాగు వద్ద, అంబర్పేట, నాచారం, యావాపూర్, కిష్టాపూర్, ఇస్లాంపూర్, నాగులపల్లి, తూప్రాన్, నాచారం, వేలూరు, తున్కిఖాల్సా తదితర ప్రదేశాల్లో 20 వరకు చెక్డ్యాంలను నిర్మించారు. వర్గల్ మండలం అవుసులోనిపల్లి వద్ద ఉన్న కొండపోచమ్మసాగర్ కాల్వ నుంచి నీటిని విడుదల చేయడంతో.. హల్దీవాగు జలకళను సంతరించుకుంది. ఇసొంటి రోజు వస్తదనుకోలే.. నాకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. బోరు వేసుకొని వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేక బీడుగా వదిలేయాల్సి వచ్చింది. కొండపోచమ్మసాగర్ వచ్చాక మా బతుకు మారిపోయింది. పొలానికి కాల్వలతో నీళ్లు వస్తున్నయ్. ఎకరంలో స్వీట్కార్న్, మిగతా భూమిలో మిర్చి, టమాటా సాగు చేసిన. రూ.లక్షా 40 వేల దాకా ఆదాయం వస్తది. పంట మంచిగ పండితే బిడ్డ పెండ్లి చేయాలనుకుంటున్న. –దాసరి రాములు, రైతు గంగాపూర్, మర్కూక్ మండలం బోర్లలో నీళ్లు పెరుగుతున్నయ్ గతంలో ఎండాకాలం వస్తే బోర్లలో నీళ్లు ఉండేవి కాదు. కూరగాయలు పండించేవాళ్లం. నీళ్లు లేక తిప్పలయ్యేది. గత ఏడాది నుంచి ఆ బాధ పోయింది. బోర్లలో నీళ్లు పెరుగుతున్నయ్. నాకు ఆరున్నర ఎకరాల భూమి ఉంటే.. కాల్వ కోసం 3 ఎకరాలు తీసుకున్నరు. నా భూమి పోయినా నలుగురికి మంచి జరిగిందని అనుకున్నా. మిగిలిన భూమిలో బీన్స్,మిర్చి పంటలు సాగుచేస్తున్న. – అన్నెబోయిన కొండయ్య, రైతు,రామచంద్రాపూర్, జగదేవ్పూర్ మండలం ఇప్పుడు మొత్తం భూమి సాగు చేసుకుంటున్నా.. గతంలో ఎండాకాలంలో వ్యవసాయ బోరు పావు గంట నీళ్లు వస్తే.. మళ్లీ రెండు, మూడు గంటల పాటు నీళ్లు ఊరేదాకా బంద్ చేసేవాళ్లం. కాళేశ్వరం నీళ్లతో మా ఊరి చెరువు నింపుతుండటంతో భూగర్భ జలాలు పెరిగాయి. గతంలో రెండెకరాలకే నీళ్లు సరిపోయేవి కావు. ఇప్పుడు నాకున్న మొత్తం నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నా. దిగుబడి కూడా పెరిగింది. – శంకర్, ఎన్సాన్పల్లి ఎన్నడూ ఇట్లా నీళ్లు చూడలే.. నేను 50 ఏండ్ల నుంచి వ్యవసాయం చేస్తున్న.. ఎన్నడూ ఇట్లా నీళ్లు చూడలే. రెండేళ్ల నుంచి సాగునీటికి కరువే లేదు. మా భూమిలో ఉన్న బావి, బోరు ఎండకాలం వస్తుందనగానే ఎండిపోయేవి. కాలం కాకపోతే తిండి గింజలకూ ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడా బాధ తప్పింది. – చెత్తిరి బాలయ్య, ఎల్లారెడ్డిపేట -
‘బీజేపీ నేతలు అడ్డంపొడుగు మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్నారు’
గజ్వేల్: కాళేశ్వరం ద్వారా కొత్తగా ఒక ఎకరాకైనా నీరు పారిందా? అని కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటని, కళ్లముందు పచ్చటి పంటపొలాలు కనిపిస్తున్నా...కళ్లుండీ చూడలేని కబోదుల్లా మాట్లాడుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్లలోని కొండపోచమ్మసాగర్ కాల్వ ద్వారా కూడవెల్లి వాగు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని గండిచెరువుకు గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో తాగునీటికి కూడా కటకట ఉండేదన్నారు. ఇప్పడు సీఎం కేసీఆర్ సమృద్ధిగా తాగు, సాగు నీరు ఇస్తుంటే విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. మండుటెండల్లోనూ వాగులను పారిస్తున్న ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. నీళ్లు రావడం ఇష్టం లేక.. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల్లో అవినీతి జరిగిందని కొత్త పల్లవి అందుకున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు సైతం అడ్డంపొడుగు మాట్లాడుతూ ప్రజల్లో నవ్వుల పాలవుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత కరెంట్, పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలున్నాయా..? అంటూ ప్రశ్నించారు. రైతులకు సాగునీటితోపాటు ఎరువులు, కరెంట్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీజేపీ ప్రజలకు చేసిన ఒక్క మంచి పనేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎరువుల బస్తాలకోసం చెప్పుల లైన్లు... కాంగ్రెస్ పాలనలో ఎరువుల బస్తాల కోసం చెప్పులతో లైన్ కట్టాల్సిన పరిస్థితులను ప్రజలు మరచిపోతారా? అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. నేడు రిజర్వాయర్లకు దేవుళ్ల పేరు పెట్టుకుంటే కూడా తట్టుకోలేకపోతున్నారన్నారు. రైతులు ఆయిల్పామ్ సాగువైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం 30 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు సహకారాన్ని అందించడానికి ప్రభుత్వం వద్ద ప్రణాళిక సిద్ధంగా ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవరెడ్డి, రఘోత్తంరెడ్డి, జెడ్పీచైర్పర్సన్ రోజాశర్మ, నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిరామ్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ పాల్గొన్నారు. హుటాహుటిన ఫామ్హౌస్కు ఇదిలా ఉండగా మంత్రి హరీశ్రావు కొడకండ్ల కార్యక్రమంలో పాల్గొనే ముందే ఫామ్హౌస్లో నిర్వహించనున్న అత్యవసరభేటీకి హాజరుకావాలని సీఎం నుంచి పిలుపురావడంతో ఇక్కడ త్వరగా ముగించుకొని ఆయన హుటాహుటిన వెళ్లిపోయారు. వర్గల్లో హల్దీవాగులోకి నీటి విడుదల, సిద్దిపేటలో నిర్వహించాలనుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. -
Sitarama Lift Irrigation Project: అయ్యో .. ‘రామా’
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది వానాకాలానికల్లా సుమారు లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామన్న హామీ నీరుగారినట్లే కనబడుతోంది. పూర్తికాని భూసేకరణ, నిధుల లేమి, కొరవడిన ప్రభుత్వ పర్యవేక్షణ అన్నీ కలిసి ఆశలకు గండికొడుతున్నాయి. గోదావరి నీటిని ఎత్తిపోసేలా మూడు పంప్హౌస్లు సిద్ధం చేసినా, ఆయకట్టుకు నీరిచ్చే సత్తుపల్లి ట్రంక్ పనులు మాత్రం ముందుకు కదలడం లేదు. మూడు పంప్హౌస్లు సిద్ధమైనా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6.74 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా సీతారామను చేపట్టారు. మూడున్నరేళ్ల కింద మూడు పంప్హౌస్ల నిర్మాణాన్ని చేపట్టారు. రెండు పంప్హౌస్ల్లో ఆరు మోటార్లను గతేడాదే పూర్తి చేయగా, మూడో పంప్హౌస్లో 7 మోటార్ల బిగింపు ప్రక్రియ కూడా ఇటీవల పూర్తయింది. చిన్నచిన్న పనులు మాత్రమే మిగిలి ఉండగా.. విద్యుత్ సరఫరా చేస్తే నీటిని ఎత్తిపోసేందుకు పంప్హౌస్లు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ మూడు పంప్హౌస్ల పరిధిలో 114 కిలోమీటర్ల ప్రధాన కాల్వ ఉన్నా ఆయకట్టు మాత్రం లేదు. ఈ ప్రధాన కాల్వ పనులకు సంబంధించే రూ.450 కోట్ల మేర బిల్లులు ఏడాదిన్నరగా పెండింగ్లో ఉన్నాయి. వీటి విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక ప్రాజెక్టులో భాగంగా మూడో పంప్హౌస్ దిగువన 116 కిలోమీటర్ల పొడవునా సత్తుపల్లి ట్రంక్ కెనాల్ తవ్వాల్సి ఉంది. దీనిద్వారా సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలో 1.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరందించడంతో పాటు మరో 22 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలని నిర్ణయించారు. ఈ వానాకాలానికే సుమారు లక్ష ఎకరాలకు నీరివ్వాలని ఫిబ్రవరిలో జరిగిన సమీక్షలో స్పెషల్ సీఎస్ రజత్కుమార్ ఇంజనీర్లను ఆదేశించారు. అయితే ఇది జరిగి ఆరు నెలలు గడిచినా ఇంతవరకు భూసేకరణకు గానీ, జరిగిన పనులకు గానీ ఒక్క రూపాయి చెల్లించలేదు. ముందుకు సాగని పనులు కెనాల్ తవ్వేందుకు 1,650 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉండగా, ఇప్పటివరకు 500 ఎకరాలు సేకరించారు. ఇందుకోసం రూ.40 కోట్లు చెల్లించారు. మరో 214 ఎకరాలకు సంబంధించి ప్రభు త్వం నిర్ణయించిన ధరకంటే అధిక ధర పరిహారంగా చెల్లించాలని రైతులు కోర్టుకు వెళ్లడంతో సేకరణ ఆగిపోయింది. ఇక మిగతా భూమిలో కొంతమేర అవార్డు చేసినా, ప్రభుత్వం చెల్లించా ల్సిన రూ.60 కోట్ల విడుదలలో జాప్యం జరుగుతోంది. దీంతో కాల్వ పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటివరకు సేకరించిన భూమి, అటవీ శాఖ నుంచి బదలాయించిన 1,202 ఎకరాల భూమి పరిధిలోనే ప్రస్తుతం కాల్వ తవ్వకం జరుగుతోంది. వచ్చే ఏడాది జూన్ నాటికే..! 116 కిలోమీటర్ల కెనాల్ తవ్వకానికి 2.20 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టిపని చేయాల్సి ఉండగా, ఇంతవరకు 52 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే జరిగింది. సుమారు 25 కిలోమీటర్ల మేర కెనాల్ తవ్వకం పూర్తయినా, మిగతా పనుల పూర్తికి భూసేకరణ జరగకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. దీనికి తోడు తవ్విన పనులకు సంబంధిం చిన రూ.45 కోట్ల బిల్లులు ప్రభుత్వం ఆరు నెలలుగా పెండింగ్లో పెట్టింది. ఈ నిధుల విడుదలపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. ప్రధాన కాల్వ పరిధిలో పనిచేస్తున్న ఏజెన్సీలే ఇక్కడా పనిచేస్తుండగా.. నిధుల విడుదల లేకపోవడంతో సంస్థలు పనివేగాన్ని తగ్గించుకుంటున్నాయి. యంత్రాలను ఇతర ప్రాజెక్టుల పనులకు తరలిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఇతర ప్రాధాన్యత శాఖలకు నిధుల వెచ్చింపు ఎక్కువగా చేస్తుండటంతో వచ్చే ఏడాది జూన్ నాటికే ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. -
‘మల్లన్న’ చెంతకు గోదారి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతలు పథకంలో భాగంగా మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి భారీ సామర్థ్యంతో చేపడుతున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాలు ఎత్తిపోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ నెల 18 లేదా 20న వేదపండితుల పూజలు, ఆశీర్వచనాల మధ్య తుక్కాపూర్ పంప్హౌస్లోని మోటార్లను ఆన్ చేయడం ద్వారా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఎత్తిపోతలు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు ప్రభుత్వం ప్రాథమిక సమాచారం అందించింది. ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించింది. రంగనాయక్సాగర్ టు మల్లన్నసాగర్ రిజర్వాయర్ను ఈ ఏడాది జూన్ నాటికే సిద్ధంచేయాలని భావించినా కరోనా లాక్డౌన్, తొలకరి వర్షాల కారణంగా పనులు కాస్త ఆలస్యమయ్యాయి. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ చేసేలా పనులు పూర్తయిన నేపథ్యంలో, ఈ ఏడాది మొదట 10 టీఎంసీలు నిల్వ చేయనున్నారు. ఆ తర్వాత ఐదేసి టీఎంసీల చొప్పున నిల్వ పెంచనున్నారు. రంగనాయక్సాగర్లోని నీటిని తుక్కాపూర్ వద్ద నిర్మించిన పంప్హౌస్లోని 8 మోటార్ల ద్వారా మల్లన్నసాగర్కు తరలించేలా ఇప్పటికే పనులన్నీ మొదలయ్యాయి. ప్రస్తుతం రంగనాయక్సాగర్లో 3.5 టీఎంసీలకు గానూ 3 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. ఇక్కడి నిల్వలు ఖాళీ అయితే మిడ్మానేరు నుంచి నీటిని తరలిస్తూ మల్లన్నసాగర్ నింపనున్నారు. మిడ్మానేరులో ప్రస్తుతం 27.50 టీఎంసీలకు గానూ 25 టీఎంసీల మేర నిల్వలున్నాయి. అత్యంత ఎత్తున.. భారీ సామర్థ్యంతో.. ►కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఒడిసి పట్టుకొని రెండు సీజన్లలోనూ ఆయకట్టుకు నీటి లభ్యత పెంచే లక్ష్యంతో మొత్తం 141 టీఎంసీల సామర్థ్యంతో 18 రిజర్వాయర్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో అత్యంత భారీగా ఏకంగా 50 టీఎంసీల సామర్థ్యంతో, సముద్ర మట్టానికి 555 మీటర్ల ఎత్తున.. మల్లన్నసాగర్ రిజర్వాయర్ను రూ.6,805 కోట్లతో చేపట్టారు. ►ఈ రిజర్వాయర్ నిర్మాణానికి ఏకంగా 22.60 కిలోమీటర్ల పొడవైన కట్ట నిర్మాణం చేయాల్సి ఉండగా, కట్ట గరిష్ట ఎత్తు 58.5 మీటర్లుగా ఉంది. ►కట్ట నిర్మాణానికి 13.58 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టి పని, 2.77 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాల్సి ఉండగా ఇందులో ఇప్పటికే 96 శాతం పనులు పూర్తి చేశారు. ►ఈ రిజర్వాయర్ నుంచే కొండపోచమ్మ సాగర్, గంధమల, బస్వాపూర్లతో పా టు, సింగూరు, నిజాంసాగర్, ఎస్సారెస్పీ స్టేజ్–1 ఆయకట్టుకు నీళ్లు చేరనున్నాయి. ►మొత్తంగా ఈ రిజర్వాయర్పై ఆధారపడిన కొత్త ఆయకట్టు 8.33 లక్షల ఎకరాలు ఉండగా, స్థిరీకరణ ఆయకట్టు మరో 7.37 లక్షల ఎకరాలు ఉంది. ►ఈ ప్రాజెక్టుకు అవసరమైన 17,871 ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించారు. ►ఈ రిజర్వాయర్ నిర్మాణంతో రాంపూర్, బ్రాహ్మణబంజేరుపల్లి, లక్ష్యాపూర్, ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, పల్లెపహాడ్, సింగారం, ఎర్రవెల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతుండగా, 4,298 కుటుంబాలు ప్రభావితం అయ్యాయి. ►మట్టి పనుల్లో ఎక్కడా నాణ్యత లోపాలు తలెత్తకుండా ప్రతి రీచ్కు ఐదుగురు ఇంజనీర్లతో పర్యవేక్షణ ఉండేలా గజ్వేల్ కేంద్రంగా ప్రత్యేక క్వాలిటీ కంట్రోల్ డివిజన్ ఏర్పాటు చేశారు. -
రేడియల్ గేట్ల ద్వారా గోదావరి జలాలు
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్ట్ రేడియల్ గేట్ల ద్వారా గోదావరి జలాలు తొలిసారిగా దిగువకు చేరుతున్నాయి. స్పిల్వే క్లస్టర్ ఎత్తు 25.72 మీటర్లు కాగా.. నీటిమట్టం అంతకుమించి పెరగడంతో 10 రేడియల్ గేట్ల నుంచి నీరు దిగువకు ప్రవహిస్తోంది. ఈ ఏడాది ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం పనులు పూర్తిచేసి స్పిల్వే మీదుగా గోదావరి వరద నీటిని మళ్లించేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో కాఫర్డ్యామ్ ఎగువ భాగాన నీటిమట్టం రోజు రోజుకు పెరుగుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షం నీరు నదిలో కలుస్తుండటంతో స్పిల్వే క్లస్టర్ వద్ద నీటిమట్టం శుక్రవారం నాటికి 26.2 మీటర్ల ఎత్తుకు పెరిగింది. క్లస్టర్ లెవెల్ దాటడంతో రేడియల్ గేట్ల ద్వారా నీరు స్పిల్ చానల్లోకి చేరుతోంది. అక్కడి నుంచి పైలట్ చానల్ వద్ద మహానందీశ్వర స్వామి ఆలయం దిగువన గోదావరి సహజ ప్రవాహంలో కలుస్తోంది. -
దిగుబడులు వరించాయ్
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: రాష్ట్ర ధాన్యాగారంగా పేరొందిన ఉభయ గోదావరి జిల్లాల్లో రైతులు ఈ రబీలో సాగునీటి ఇబ్బందులను అధిగమించి మంచి దిగుబడులు సాధించారు. రెండో పంట విరగ పండటంతో రైతుల మోములో ఆనందం తొణికిసలాడుతోంది. పోలవరం ప్రాజెక్ట్లో భాగమైన కాఫర్ డ్యామ్ నిర్మాణం కోసం ఈ సారి అఖండ గోదావరి దిగువన రబీకి క్రాప్ హాలిడే ప్రకటించాలని అధికారులు ప్రతిపాదించారు. అయితే.. రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ ప్రతిపాదనలను పక్కన పెట్టించారు. కాఫర్ డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని.. అదే సందర్భంలో గోదావరి జిల్లాల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందించి తీరాలని ఆదేశించారు. గోదావరిలో సహజ ప్రవాహ జలాలు నిండుకున్నా ప్రతి ఎకరాకు సాగునీరివ్వాలనే ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలు చేశారు. ప్రణాళిక ఫలించి ఎకరాకు 48 నుంచి 50 బస్తాల (బస్తా 75 కిలోలు) దిగుబడి రావడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. విషమ పరీక్ష పెట్టినా.. రబీ ప్రారంభంలో అఖండ గోదావరిలో సహజ జలాలు నిండుకున్నాయి. మార్చి నెలాఖరు నాటికే సాగునీటి సరఫరా నిలిపివేయాలని నిర్ణయించారు. ఒక పక్క కాఫర్ డ్యామ్ నిర్మాణ అంశం, మరో పక్క తగ్గిన గోదావరి ఇన్ఫ్లోతో సాగు నీటిఎద్దడి ప్రభుత్వానికి తొలుత విషమ పరీక్ష పెట్టాయి. ముందస్తు ప్రణాళికతో స్వల్ప వ్యవధిలో చేతికొచ్చే వరి రకాలు సూచించి.. వెదజల్లు సాగు విధానాన్ని ప్రోత్సాహించారు. ఫలితంగా ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షన్నర హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో రైతులు వెదజల్లు పద్ధతికి ముందుకొచ్చారు. అనుకున్నట్టుగానే దిగుబడిలో కూడా సక్సెస్ అయ్యారు. గత రబీతో పోల్చుకుంటే ఈసారి దిగుబడి ఎకరాకు 75 కిలోలు అధికంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఇటీవల వ్యవసాయ శాఖ సమీక్షలో స్పష్టం చేశారు. రైతు పొలంలో ధాన్యం దిగుబడి శాతం లెక్కిస్తున్న వ్యవసాయ అధికారులు ఫలించిన ప్రణాళిక ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లోని తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు సాగునీరు సరఫరా అవుతుంది. మూడు డెల్టాల్లో రబీ వరికి కనీసం 94 టీఎంసీల నీరు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే, గోదావరి నదిలో సహజ జలాలు 46.21 టీఎంసీలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. దీంతో సీలేరు నుంచి 62.756 టీఎంసీలను గోదావరి నదిలోకి రప్పించి రబీ, తాగునీటి అవసరాల కోసం 98.216 టీఎంసీల నీటిపి విడుదల చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 20 వరకూ సాగునీరు విడుదల చేసి ప్రతి ఎకరాకు అందించారు. శివారు భూములకు సైతం నీరందడంతో రైతులంతా ఇబ్బందులు లేకుండా గట్టెక్కారు. ప్రభుత్వ కృషితో విజయవంతం ప్రభుత్వ కృషితో రబీ వరి సాగు విజయవంతమయ్యింది. నీటి ఎద్దడి తలెత్తిన సమయంలో సీలేరు నుంచి అదనపు జలాలు విడుదల చేయడంతో పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరు అందించగలిగాం. ప్రతి ఎకరాకు నీరిచ్చాం. తొలుత మార్చి నెలాఖరు నాటికి కాలువలను మూసివేయాలని నిర్ణయించినప్పటికీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నీటి విడుదల కాలాన్ని పొడిగించింది. సమష్టి కృషితో రబీని విజయవంతం చేయగలిగాం. – ఆర్.శ్రీరామకృష్ణ, ఎస్ఈ, ధవళేశ్వరం సర్కిల్ పంట దక్కుతుందనుకోలేదు ఈ ఏడాది దాళ్వా తొలి దశలోనే తీవ్ర నీటి ఎద్దడి తలెత్తింది. తడారిపోతున్న పొలాలను చూసి ఈ పంట దక్కదేమో అనుకున్నాం. శివారు భూముల్లోని రైతుల పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సకాలంలో స్పందించి సీలేరు జలాలు విడుదల చేసి మమ్మల్ని ఆదుకున్నారు. మద్దతు ధర కూడా దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో సంతోషంగా ఉంది. – నరాల నాగేశ్వరరావు, దుగ్గుదూరు, కాజులూరు మండలం నీరివ్వకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్లం మా గ్రామంలో ఈ పంటకు నీరు అందదేమోనని ఆందోళన పడ్డాం. వ్యవసాయ అధికారులు ముందునుంచీ హెచ్చరిస్తున్నా దేవుడి మీద భారం వేసి ముందుకెళ్లాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజంగానే మా పాలిట దేవుడిగా వరమిచ్చారు. సీలేరు నుంచి నీరు తీసుకుని వచ్చి మా పంటలను కాపాడారు. 50 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. –మావిరెడ్డి సుబ్బారావు, రైతు, చోడవరం, రామచంద్రపురం మండలం -
మా అవసరాలను తీర్చాకే.. కావేరికి గోదావరిని తరలించండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర అవసరాలు పూర్తిగా తీర్చాకనే గోదావరి జలాలను కావేరి(గ్రాండ్ ఆనకట్ట) నదికి మళ్లించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం.. గోదావరిలో మిగులు జలాలపై సంపూర్ణ హక్కు దిగువ రాష్ట్రమైన ఏపీదేనని గుర్తు చేసింది. గోదావరిలో 75 శాతం నీటిలభ్యత ఆధారంగా చూస్తే మిగులు జలాలే ఉండవని, అలాంటప్పుడు ఏ నీటిని కావేరికి మళ్లిస్తారని ప్రశ్నించింది. నదీ పరీవాహక ప్రాంతం(బేసిన్)లో ఎగువ రాష్ట్రాలకున్న కేటాయింపుల నుంచి కొంత వాటాను తీసుకుని.. వాటితో గోదావరి–పెన్నా–కావేరి అనుసంధానం చేపట్టాలని ప్రతిపాదించింది. ఈ అనుసంధానంలో ఇచ్చంపల్లి, జానంపేటతోపాటు పోలవరం నుంచి తరలించే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. కేంద్ర జల్శక్తి శాఖ సహాయమంత్రి రతన్లాల్ కటారియా అధ్యక్షతన సోమవారం జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్బ్ల్యూడీఏ) సర్వసభ్య సమావేశం వర్చువల్ విధానంలో జరిగింది. గోదావరి–పెన్నా–కావేరి అనుసంధానంపై వాటి బేసిన్ల పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, కేరళ జలవనరుల శాఖ అధికారులతో కేంద్రమంత్రి ఈ సందర్భంగా సంప్రదింపులు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. మా అవసరాలు తీర్చాకనే.. గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి నదుల అనుసంధానానికి ఎన్డబ్ల్యూడీఏ మూడు ప్రతిపాదనలు చేసింది. అవి.. 1.ఇచ్చంపల్లి(గోదావరి)–నాగార్జునసాగర్(కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరీ(గ్రాండ్ ఆనకట్ట), 2.అకినేపల్లి(గోదావరి)–నాగార్జునసాగర్(కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరి(గ్రాండ్ ఆనకట్ట) 3.జానంపేట(గోదావరి)–నాగార్జునసాగర్(కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరి(గ్రాండ్ ఆనకట్ట). గోదావరి నుంచి మొత్తం 247 టీఎంసీలను మళ్లించాలని ప్రతిపాదించింది. ఇందులో ఇచ్చంపల్లి, అకినేపల్లిల నుంచి ఎత్తిపోసే గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్కు 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీఎంసీలివ్వాలని ప్రతిపాదించింది. ఇక జానంపేట నుంచి ఎత్తిపోసే గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్కు 108, తెలంగాణకు 39, తమిళనాడుకు 83 టీఎంసీలివ్వాలంది. అయితే ఏపీలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర ప్రాంతం నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నాయని, అందువల్ల మా రాష్ట్ర అవసరాలు తీర్చాకనే ఇతర ప్రాంతాలకు గోదావరి జలాల్ని మళ్లించాలని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. బచావత్ ట్రిబ్యునల్ అంచనాల ప్రకారం 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చూస్తే గోదావరిలో మిగులు జలాలు లేనేలేవన్నారు. లేని మిగులు జలాలను కావేరికి ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నీటి లభ్యతపై స్పష్టమైన లెక్కలు తేల్చాలని సూచించారు. ప్రస్తుతం సముద్రంలో కలుస్తున్న జలాల్లో అధిక భాగం ఎగువ రాష్ట్రాలకున్న కేటాయింపుల్లో వినియోగించుకోనివేనన్నారు. ఈ నేపథ్యంలో ఎగువ రాష్ట్రాలకున్న కేటాయింపుల్లో నుంచి కొంత వాటాను తీసుకుని.. వాటితో గోదావరి–పెన్నా–కావేరి అనుసంధానాన్ని చేపట్టాలన్నారు. కాగా, పోలవరం ఎగువ నుంచి గోదావరి–కృష్ణా–బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్–పెన్నా–కావేరి అనుసంధానం ప్రతిపాదనను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నారాయణరెడ్డి సూచించారు. దీనివల్ల నదీ పరీవాహక ప్రాంతంలో దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించవచ్చునన్నారు. ఈ సూచనను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్డబ్ల్యూడీఏ, సీడబ్ల్యూసీ, కేంద్ర జల్ శక్తి శాఖ అధికారులను కేంద్రమంత్రి ఆదేశించారు. -
ఇక ఉత్తరాంధ్రలో గోదారి 'గలగల'
సాక్షి, అమరావతి: వెనుకబడిన ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇప్పటికే విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించిన ప్రభుత్వం.. సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను తరలించి.. సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చడం ద్వారా ఆ ప్రాంత సమగ్రాభివృద్ధికి బాటలు వేయాలని నిర్ణయించింది. పోలవరం ఎడమ కాలువ 162.409 కిలోమీటర్ల వద్ద నుంచి రోజుకు ఎనిమిదివేల క్యూసెక్కుల చొప్పున 90 రోజుల్లో 63.20 టీఎంసీల నీటిని తరలించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులు చేపట్టింది. తొలిదశలో రూ.2,022 కోట్లతో పనులు ప్రారంభించిన ప్రభుత్వం రెండోదశలో రూ.6,265 కోట్లతో రెండు ప్యాకేజీల కింద పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధం చేసింది. అనంతరం దశలవారీగా భూదేవి, వీరనారాయణపురం, తాడిపూడి, గాదిగెడ్డ రిజర్వాయర్లను పూర్తిచేయాలని నిర్ణయించింది. మొత్తం రూ.15,448 కోట్ల వ్యయమయ్యే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టడానికి ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కార్పొరేషన్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ, జాతీయ ఆర్థికసంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చి.. ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేయడానికి ప్రణాళిక రచించింది. మహానేత వైఎస్ మానసపుత్రిక ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఏటా సగటున మూడువేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. వాటిలో పోలవరం ఎడమ కాలువ నుంచి 63.20 టీఎంసీలను తరలించడం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ పథకానికి 2009 జనవరి 2న గ్రీన్సిగ్నల్ ఇచ్చి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. కానీ.. అంతలోనే మహానేత హఠాన్మరణంతో ఈ పథకం మరుగునపడింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ఇదీ.. ► పోలవరం ఎడమ కాలువలో 162.409 కిలోమీటర్ల వద్ద నుంచి 500 మీటర్ల లింకు కాలువ ద్వారా 1,300 క్యూసెక్కుల నీటిని తరలించి.. జామద్దులగూడెం, పెదపూడిల వద్ద రెండుదశల్లో ఎత్తిపోసి 3.16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే పెదపూడి రిజర్వాయర్కు తరలిస్తారు. ► ఎడమ కాలువ 162.409 కిలోమీటర్ల వద్ద నుంచి 23 కిలోమీటర్ల లింక్ కాలువ ద్వారా 6,700 క్యూసెక్కులు తరలిస్తారు. ► పాపాయపాలెం వద్ద ఎత్తిపోసి.. 106 కిలోమీటర్ల పొడవున తవ్వే లిఫ్ట్ కాలువ ద్వారా గాదిగెడ్డ రిజర్వాయర్కు సరఫరా చేస్తారు. ► లిఫ్ట్ కాలువ 102 కిలోమీటర్ల వద్ద నీటిని ఎత్తిపోసి కోటగండ్రేడు బ్రాంచ్ కాలువ ద్వారా శ్రీకాకుళం జిల్లాకు తరలిస్తారు. ► లిఫ్ట్ కెనాల్ 14 కిలోమీటర్ల వద్ద భూదేవి లిఫ్ట్ ద్వారా నీటిని ఎత్తిపోసి 6.2 టీఎంసీల సామర్థ్యంతో నిరి్మంచే భూదేవి రిజర్వాయర్, 48.50 కిలోమీటర్ల వద్ద నీటిని ఎత్తిపోసి 6.55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే వీరనారాయణపురం రిజర్వాయర్, 73 కిలోమీటర్ల వద్ద తాడిపూడి లిఫ్ట్ ద్వారా తరలించి 3.80 టీఎంసీల సామర్థ్యంతో నిరి్మంచే తాడిపూడి రిజర్వాయర్ నింపుతారు. ► తొలిదశలో 1.30 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి కాంట్రాక్టర్లకు అప్పగించిన లింక్ కెనాల్, జామద్దులగూడెం, పెదపూడి ఎత్తిపోతలు, పెదపూడి రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సీఎం వైఎస్ జగన్ జలవనరులశాఖకు దిశానిర్దేశం చేశారు. ► రెండోదశలో శ్రీకాకుళం జిల్లా వరకు నీటిని తరలించేలా 23 కి.మీ.ల లింక్ కెనాల్, 106 కి.మీ.ల లిఫ్ట్ కెనాల్, 60 కి.మీ.ల కోటగండ్రేడు బ్రాంచ్ కెనాల్ పనులు చేపట్టడానికి రూ.6,265 కోట్లు అవసరం. ఇందులో భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ పనులకు రూ.2,344 కోట్లను వెచి్చంచాల్సి ఉంటుంది. రూ.3,921 కోట్లతో లింక్ కెనాల్, లిఫ్ట్ కెనాల్, బ్రాంచ్ కెనాల్ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్ నోటిఫికేషన్ జారీచేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ► రెండోదశలో తొలి ప్యాకేజీకి రూ.2,539 కోట్లు, రెండో ప్యాకేజీకి రూ.1,382 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీచేస్తారు. ఈ పనులకు సమాంతరంగా భూదేవి, వీరనారాయణపురం, తాడిపూడి రిజర్వాయర్లు నిరి్మంచడంతోపాటు గాదిగెడ్డ రిజర్వాయర్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రచార బిల్లులు కూడా చెల్లించని టీడీపీ సర్కార్ 2019 ఎన్నికలకు ముందు ఓట్లకోసం టీడీపీ సర్కార్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలిదశను చేపడుతున్నట్లు ప్రకటించి 2018 నవంబర్ 15న శంకుస్థాపన చేసింది. ఆరోజున రూ.1,94,00,404 వెచ్చించి పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలతో ప్రచారం చేసుకుంది. కానీ తట్ట మట్టి కూడా ఎత్తలేదు. ప్రచార ప్రకటనల బిల్లులూ చెల్లించలేదు. ఆ బిల్లులను ఫిబ్రవరి 7న ప్రస్తుత ప్రభుత్వం చెల్లించింది. -
తగ్గుతున్న గోదావరి
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/సాక్షి ప్రతినిధి, ఏలూరు: గత రెండు రోజులుగా భారీ వరదతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి మంగళవారం రాత్రికి తగ్గుముఖం పట్టింది. బుధవారం సాయంత్రానికి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ధవళేశ్వరం బ్యారేజీలోకి వచ్చే వరద 17.75 లక్షల క్యూసెక్కుల కంటే తగ్గనుంది. అప్పుడు మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుంటామని అధికారవర్గాలు తెలిపాయి. బ్యారేజీ వద్ద మంగళవారం రాత్రి ఏడు గంటలకు 19.70 అడుగులకు నీటిమట్టం చేరడంతో 22,40,194 క్యూసెక్కులను సముద్రంలోకి విడిచిపెట్టారు. సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు 150.7 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు 702.07 టీఎంసీల గోదావరి జలాలు కడలి పాలయ్యాయి. ఎగువ ప్రాంతాల్లోనూ అన్నిచోట్లా వరద ఉధృతి తగ్గింది. భద్రాచలం వద్ద ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. తూర్పు గోదావరి జిల్లా పెదకందలపాలెంలో వరదనీటిలో పిల్లలను మోసుకెళ్తున్న దృశ్యం సహాయక చర్యలు ముమ్మరం ► వరద ప్రభావిత గ్రామాల్లో లాంచీలు, ఇంజన్ బోట్ల ద్వారా బాధితులకు పాలు, బియ్యం, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, కొవ్వొత్తులు, ఇతర నిత్యావసరాలను యుద్ధప్రాతిపదికన అందిస్తున్నారు. ► తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలోని నాలుగు విలీన మండలాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నాలుగు మండలాల్లో 16 గ్రామాలు పూర్తిగా నీటిలో చిక్కుకోగా 74 గ్రామాల చుట్టూ వరద నీరు చేరింది. దీంతో 3,846 కుటుంబాలకు చెందిన 11,036 మందిని 59 పునరావాస కేంద్రాలకు తరలించారు. గర్భిణులతోపాటు అత్యవసర వైద్యసేవలు అవసరమైన 149 మందిని చింతూరు ఏరియా ఆస్పత్రి, కూనవరం పీహెచ్సీలకు పంపారు. ► పశ్చిమగోదావరి జిల్లాలో 71 గ్రామాల్లో 10 వేల కుటుంబాలు వరద ప్రభావానికి గురయ్యాయని అధికారులు అంచనా వేశారు. వారి కోసం 26 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 5 వేల మందికి చోటు కల్పించారు. శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ► ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించారు. ► ముంపులో ఉన్న విలీన మండలాల్లో ప్రజలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్వయంగా సరుకులను మోస్తూ అందజేశారు. ► కమ్యూనికేషన్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా శాటిలైట్ ఫోన్లు వినియోగిస్తూ వైద్యులు, పారిశుధ్య సిబ్బంది పనిచేస్తున్నారు. ► ఉభయగోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు.. పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, ఎంపీ చింతా అనూరాధ, ఎమ్మెల్యేలు.. చిర్ల జగ్గరెడ్డి, పొన్నాడ సతీశ్కుమార్, తెల్లం బాలరాజు, అధికారులు పర్యటించారు. ► ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధితులను అన్ని విధాలా ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. శ్రీశైలంలోకి 3.63 లక్షల క్యూసెక్కులు కృష్ణా, తుంగభద్ర ఉరకలెత్తుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో వరద ప్రవాహం చేరుతోంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రాజెక్టులోకి 3,63,772 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఈ సీజన్లో వచ్చిన గరిష్ట వరద ప్రవాహం ఇదే కావడం గమనార్హం. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్ల నుంచి భారీ ఎత్తున వరదను దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రికి శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు చేరుకోనుంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 877.50 అడుగుల్లో 176 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. బుధవారం సాయంత్రం ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తడానికి అధికారులు నిర్ణయించారు. ► తుంగభద్ర డ్యామ్ నిండిపోవడంతో 20 గేట్లను ఎత్తి 77 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ► శ్రీశైలం నుంచి 42,378 క్యూసెక్కులు చేరుతుండటంతో నాగార్జునసాగర్లో నీటి నిల్వ 255.82 టీఎంసీలకు చేరుకుంది. ► మూసీ ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన వరద ప్రవాహంతో పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వ 13.32 టీఎంసీలకు చేరింది. ► ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీలోకి 1.13 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. కృష్ణా డెల్టాకు వదలగా మిగిలిన 1.05 లక్షల క్యూసెక్కులను బ్యారేజీ 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
అనుసంధానం పనులు ‘ఎస్పీవీ’కి
సాక్షి, అమరావతి: సముద్రం పాలయ్యే గోదావరి వరద జలాలను దుర్భిక్ష ప్రాంతాలకు తరలించేందుకు చేపట్టిన పోలవరం – బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్(బీసీఆర్) అనుసంధానం పనులను నాలుగేళ్లలో పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దీనికి నిధుల సేకరణ, పర్యవేక్షణకు ప్రత్యేక సంస్థ (స్పెషల్ పర్పస్ వెహికల్)ను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ(ఆసియా అభివృద్ది బ్యాంకు), జైకా (జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ), ఎఫ్ఎఫ్సీ (పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్), నాబార్డు (జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు) తదితరాల నుంచి ఎస్పీవీ ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు సమీకరించాలని నిర్ణయించారు. ఈ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించకుండా గోదావరి జలాలను దుర్భిక్ష ప్రాంతాలకు తరలించేందుకు మాత్రమే వెచ్చించనున్నారు. పనుల పర్యవేక్షణ బాధ్యత కూడా ఎస్పీవీకే అప్పగించనున్నారు. మార్చి లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. అనుసంధానం పనులను శరవేగంగా పూర్తి చేయడం ద్వారా రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలను సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి.. ధవళేశ్వరం నుంచి ఏటా సగటున 3,000 టీఎంసీల గోదావరి జలాలు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుని కృష్ణా బేసిన్లోని దుర్భిక్ష ప్రాంతాలకు మళ్లించాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చే బాధ్యతను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వ్యాప్కోస్కు అప్పగించారు. వ్యాప్కోస్ నివేదికపై ఈనెల 20న సమీక్షించిన సీఎం జగన్ తక్కువ వ్యయంతో గోదావరి వరద జలాలను గరిష్టంగా తరలించడంపై అధ్యయనం చేసి అంచనాలు (ఎస్టిమేట్లు) తయారు చేయాలని ఆదేశించారు. జలవనరుల శాఖ ద్వారా అంచనాలు ప్రభుత్వానికి చేరాక పరిశీలించి పనులు చేపట్టేందుకు పరిపాలనా అనుమతి మంజూరు చేయనున్నారు. అనంతరం పనులను ప్యాకేజీలుగా విభజించి జ్యుడీషియల్ ప్రివ్యూ ఆమోదంతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ‘ఈ–ఆక్షన్’ (రివర్స్ టెండరింగ్) ద్వారా తక్కువ ధరకు పనులు చేసేందుకు ముందుకొచ్చిన కాంట్రాక్టర్కు అప్పగిస్తారు. ఈ ప్రక్రియను మూడు నెలలలోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. -
జలదిగ్బంధంలో ఎడ్జెర్ల
మరిపెడ రూరల్: మబ్బు పట్టలేదు.. వర్షం కురవలేదు.. కానీ ఆ గ్రామం రాత్రికి రాత్రే జలమయమైంది. తెల్లవారేసరికి ఏ వీధిలో చూసినా సెలయేరులా నీటి ప్రవాహం కనిపిస్తోంది. ఇదీ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎడ్జెర్ల గ్రామంలోని పరిస్థితి. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఇటీవల ప్రభుత్వం ఎస్సారెస్పీ కాల్వల ద్వారా మండలానికి గోదావరి జలాలను విడుదల చేసింది. అయితే ఎడ్జెర్ల గ్రామ శివారులో ఉన్న పెద్ద చెరువును నింపేందుకు జేసీబీతో తాత్కాలికంగా ఓ కాల్వను తవ్వుతున్నారు. ఈ క్రమంలో కాల్వ సగం తవ్విన తర్వాత మధ్యలో ఓ రైతు తన పంట పొలం నుంచి కాల్వ తవ్వడానికి కుదరదని అడ్డుకున్నాడు. కాగా, ఇదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు శనివారం రాత్రి పది గంటల సమయంలో గ్రామ సమీపం నుంచి ప్రవహిస్తున్న ఎస్సారెస్పీ కాల్వకు గండి పెట్టి తాత్కాలికంగా తవ్విన కాల్వలోకి నీటిని వదిలారు. ఆ నీరంతా పల్లపు ప్రాంతంలోని గ్రామంలోకి చేరింది. వీధులు, ఇళ్లచుట్టూ నీరు చేరడంతో రాత్రంతా ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. గ్రామాన్ని నీరు ముంచెత్తడంతో సర్పంచ్ ఆదివారం స్థానిక రైతులతో కలసి వెళ్లి ఎస్సారెస్పీ కాల్వకు పెట్టిన గండిని పూడ్చారు. దీంతో గ్రామంలోకి నీటి ప్రవాహం ఆగిపోయింది. -
వాన వెల్లువ
సాక్షి, కాకినాడ/సాక్షి, హైదరాబాద్ /రాజమండ్రి/సీలేరు/విశాఖపట్నం/అమరావతి/బాపట్ల: కోస్తా జిల్లాల్లో పలుచోట్ల ఆదివారం విస్తారంగా వర్షాలు కురిశాయి. ఏజెన్సీలో కొండవాగులు పొంగుతుండటంతో మారుమూల గిరిజన గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సీలేరు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో డొంకరాయి రిజర్వాయర్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. బలిమెల రిజర్వాయర్లోకి ప్రవాహ జలాలు భారీగా వచ్చి చేరుతున్నాయి. మరోవైపు గోదావరిలో వరద ఉధృతి స్వల్పంగా పెరిగింది. ఇదిలావుంటే.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరోవైపు ఈనెల 31వ తేదీ నాటికి వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ పరిస్థితుల ప్రభావం వల్ల వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం తూర్పు గోదావరి జిల్లాలో సగటు వర్షపాతం 33.3 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఇదే జిల్లాలోని గోకవరంలో అత్యధికంగా 96 మిల్లీమీటర్లు, పి.గన్నవరం, సఖినేటిపల్లి మండలాల్లో అత్యల్పంగా 9 మిల్లీమీటర్ల చొప్పున నమోదైంది. సీలేరు నదికి భారీగా వరద రావడంతో డొంకరాయి డ్యామ్ నుంచి 12,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. చింతూరు మండలం తిమ్మిరిగూడెం వద్ద జల్లివారిగూడెం వాగు పొంగి రహదారి మీదుగా ప్రవహించడంతో చింతూరు, వీఆర్ పురం మండలాల నడుమ, చింతూరు మండలం ఏజీ కోడేరు, మల్లెతోట, ఉలుమూరు గ్రామాలకు ఆదివారం ఉదయం రాకపోకలు పాక్షికంగా నిలిచిపోయాయి. ఇదే మండలం కంసులూరు, గవళ్లకోట నడుమ సోకిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రెండో రోజైన ఆదివారం కూడా చదలవాడ పంచాయతీ పరిధిలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోపక్క ప్రత్తిపాడు, గొల్లప్రోలు మండలాల్లో సుద్దగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షాలకు కోనసీమలో పల్లపు ప్రాంతాలు జలమయ మయ్యాయి. విజయనగరం జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ జల్లులు పడుతూనే ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజి నుంచి సముద్రంలోకి విడుదలవుతున్న గోదావరి జలాలు రిజర్వాయర్లకు జలకళ నీరులేక వెలవెల బోయిన జోలాపుట్, బలిమెల, సీలేరు, డొంకరాయి రిజర్వాయర్లు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలకళ సంతరించుకున్నాయి. వర్షాల కారణంగా వీటిలోకి భారీగా ప్రవాహ జలాలు వచ్చి చేరుతుండటంతో జెన్కో అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,037 అడుగులు కాగా.. ఈ వర్షాలతో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. జెన్కో అధికారులు అప్రమత్తమై శనివారం అర్ధరాత్రి రెండు గేట్లు ఎత్తి 4,400 క్యూసెక్కుల నీటిని నేరుగా శబరి నదిలోకి విడుదల చేస్తున్నారు. అక్కడి జల విద్యుత్ కేంద్రంలోని ఏవీపీ డ్యాం పూర్తిగా నిండిపోవడంతో మరో రెండు గేట్లు ఎత్తి 4 వేల క్యూసెక్కుల నీటిని మోతుగూడెం రిజర్వాయర్లోకి పంపిస్తున్నారు. మోతుగూడెం జల విద్యుత్ కేంద్రంలోని రెండు యూనిట్లలో 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. బలిమెలకు 13 వేల క్యూసెక్కులు ఆంధ్రా–ఒడిశా సరిహద్దు జలవిద్యుత్ కేంద్రాలకు నీటిని విడుదల చేసే బలిమెల రిజర్వాయర్లోకి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ఇప్పటికి 13 వేల క్యూసెక్కుల నీరు రిజర్వాయర్లోకి వచ్చి చేరింది. జోలాపుట్ రిజర్వాయర్లోకి 7,800 క్యూసెక్కుల నీరు చేరింది. వర్షాలు కొనసాగితే మరో రెండు రోజుల్లో జోలాపుట్, బలిమెల రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవచ్చని జెన్కో వర్గాలు వెల్లడించాయి. గోదావరికి స్వల్ప వరద ఉధృతి ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజి వద్ద గోదావరి వరద ఉధృతి ఆదివారం స్వల్పంగా పెరిగింది. ఒకటి రెండు రోజుల్లో కాటన్ బ్యారేజి వద్ద నీటి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. వర్షాలు కురుస్తుండటంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టాలకు నీటి విడుదలను తగ్గించారు. ఆదివారం రాత్రి బ్యారేజి వద్ద గోదావరి నీటిమట్టం 10.70 అడుగులుగా నమోదైంది. బ్యారేజి నుంచి 69,003 క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సోమవారం నాటికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని హెడ్వర్క్స్ ఈఈ ఆర్.మోహనరావు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, వరదలను ఎదుర్కొనేందుకు ఇరిగేషన్ యంత్రాంగం సన్నద్ధంగా ఉందని చెప్పారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 2.73 మీటర్లు, భద్రాచలంలో 16.50 అడుగులు, కూనవరంలో 7.32 మీటర్లు, పోలవరంలో 6.15 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 13.88 మీటర్ల మేర గోదావరిలో నీటిమట్టాలు కొనసాగుతున్నాయి. జూరాల వైపు కృష్ణమ్మ పరుగు మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురవడం, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలను తలపిస్తుండటంతో దిగువ జూరాలకు నీటి విడుదల మొదలైంది. భారీగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి వరద ఉధృతి పెరుగుతోంది. శనివారం ప్రాజెక్టులోకి 22 వేల క్యూసెక్కుల ప్రవాహాలు రాగా, ఆదివారం సాయంత్రానికి 45వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం ఉదయానికే 129 టీఎంసీలకుగానూ 124 టీఎంసీలకు చేరింది. ఆదివారం అర్ధరాత్రికి లేక సోమవారం ఉదయానికి ఆల్మట్టి గేట్లు ఎత్తే వీలుందని సమాచారం. నారాయణపూర్ నుంచి ఇప్పటికే నీటి విడుదల మొదలైంది. వర్షాలకు కొట్టుకుపోయిన ఎండు చేపలు వర్షాలు మత్స్యకారులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. బాపట్ల మండలం సూర్యలంక సమీపంలోని ఫారెస్ట్ భూమిలో 20 రోజుల క్రితం వేటాడిన చేపలను ఎండబెట్టగా.. వర్షాల కురవడంతో అవన్నీ తడిసి కాలువల గుండా కొట్టుకుపోయి సముద్రంలో కలిశాయి. సుమారు రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లింది. వీటిని లారీలకు ఎక్కించి సొమ్ము చేసుకుందామనుకున్న మత్స్యకారుల ఆశలు అడియాశలయ్యాయి. ఇదిలావుంటే.. వర్షంతోపాటు అలల ఉధృతి పెరగటంతో సముద్రంలో లంగర్ వేసిన పడవలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. 31 నాటికి అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం తీరం దాటింది. మరోవైపు ఇక్కడే ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి నైరుతి వైపు వంగి ఉంది. దీనివల్ల ఈనెల 31 నాటికల్లా అల్పపీడనం ఏర్పడనుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కోస్తాంధ్రలో నైరుతి రుతు పవనాలు చురుకుదనం సంతరించుకున్నాయి. సోమవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న మూడు రోజులపాటు కోస్తాలో కొన్నిచోట్ల, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు లేదా వర్షం కురవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో తెలిపింది. రాయలసీమలో రుతుపవనాలు బలహీనంగా ఉండటంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. మరోవైపు పశ్చిమ దిశ నుంచి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. గడచిన 24 గంటల్లో వరరామచంద్రాపురంలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. కూనవరంలో 8, ప్రత్తిపాడు, వేలేరుపాడులో 6, కుకునూరు, పెద్దాపురంలో 5, పోలవరంలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. -
28న జల వివాదాలపై చర్చ
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఉత్పన్నమైన వివాదాలను పరిష్కరించుకోవడానికి రెండు ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఈ నెల 28న తొలి దశలో రెండు ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖరరావులు నిర్ణయం తీసుకుని మరోసారి భేటీ అయ్యి వివాదాలకు తెరదించాలని భావిస్తున్నారు. విశాఖ శ్రీ శారద పీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్రకు బాధ్యతల అప్పగింత కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ నెల 17న తెలంగాణ సీఎం కేసీఆర్ విజయవాడకు వచ్చారు. అదే రోజున తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. గోదావరి జలాల గరిష్ట వినియోగంతోపాటు నదీ జలాల వివాదాలను పరిష్కరించుకోవడం ద్వారా తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసుకునే అంశంపై ఇద్దరు సీఎంలూ చర్చించుకున్నారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సందర్భంలోనూ ఇదే అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఇద్దరు ముఖ్యమంత్రుల ఆదేశాల మేరకు జల వివాదాలతోపాటు విభజన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూలులోని 142 సంస్థల ఆస్తుల పంపకాలపై సమస్యలను పరిష్కరించుకోవడానికి తొలి దశలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమై చర్చించనున్నారు. కృష్ణా నీటి పంపకాలపై చర్చ కృష్ణా నదీ జలాల్లో 811 టీఎంసీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. విభజన నేపథ్యంలో ఏపీ 512, తెలంగాణ 299 టీఎంసీలు వినియోగించుకునేలా కేంద్రం తాత్కాలిక ఏర్పాటు చేసింది. అయితే కృష్ణా నదీ జలాలను నాలుగు నదీ పరీవాహక రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు.. జలాల పునఃపంపిణీకి నిరాకరించింది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ను ఆదేశించింది. కానీ ఇప్పటివరకూ విచారణ పూర్తి కాలేదు. ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావడం ద్వారా కేసులు ఉపసంహరించుకుని, వివాదాలను పరిష్కరించుకుందామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తూ వస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగాను కృష్ణా నీటిలో 14 టీఎంసీలు మహారాష్ట్ర, 21 టీఎంసీలు కర్ణాటక, మిగతా 45 టీఎంసీలు నాగార్జునసాగర్కు ఎగువన ఉమ్మడి ఏపీ అదనంగా వినియోగించుకోవచ్చునని గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు తరలిస్తుండటం వల్ల.. కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని తెలంగాణ సర్కార్ 2015 నుంచి ప్రతిపాదిస్తోంది. తెలంగాణ రాష్ట్రం 240 టీఎంసీలకుపైగా గోదావరి జలాలను కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి తరలిస్తోందని.. అందుకుగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని ఏపీ సర్కార్ కోరుతూ వస్తోంది. ఈ వివాదాలన్నిటిపై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య 28న చర్చ జరగనుంది. శ్రీశైలానికి గోదావరి నీటి తరలింపుపై చర్చలు రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శుల సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా మలి దఫా ఇరువురు ముఖ్యమంత్రులు సమావేశమై చర్చించనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి జలాలను తరలిస్తే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగలతో, ప్రకాశం జిల్లాకు వెలిగొండ ప్రాజెక్టుల ద్వారా సమృద్ధిగా నీళ్లు అందించొచ్చు. తెలంగాణలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా పాత పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకూ గోదావరి నీటిని తరలించొచ్చని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడుతున్నారు. శ్రీశైలాన్ని గోదావరి జలాలతో నింపితే అవసరాన్ని బట్టి నాగార్జునసాగర్కు తరలించి.. సాగర్ ఆయకట్టునూ కృష్ణా డెల్టానూ సస్యశ్యామలం చేయవచ్చునని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భావిస్తున్నారు. -
దసరాకు ముందే కాళేశ్వరం ఎత్తిపోతలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు వరప్రదాయినిగా భావిస్తున్న కాళేశ్వరం పథకం నుంచి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దసరా కంటే ముందే అధికారికంగా కాళేశ్వరం పంపులను ఆరంభించడం ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలను మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–6 పంప్హౌజ్లోని రెండు మోటార్ల ద్వారా గోదావరి నీటిని ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి మేడారం రిజర్వాయర్కు ఈ నెలాఖరుకల్లా తరలించాలని.. దసరా నాటికి ప్యాకేజీ–7 టన్నెల్ వ్యవస్థ, ప్యాకేజీ–8లో ఇప్పటికే సిద్ధమైన మరో రెండు మోటార్ల ద్వారా మేడారం నుంచి మిడ్మానేరుకు నీటిని తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లుగా ప్రభుత్వంలోని అత్యున్నత వర్గాల ద్వారా తెలిసింది. సిద్ధమైన పంపులు, మోటార్లు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్హౌజ్ పనులు వేగంగా సాగుతున్నా వర్షాలతో కొంత ఆటంకం కలుగుతోంది. గేట్లు, మోటార్లు అమర్చే ప్రక్రియ మొదలైనా అవి పూర్తయ్యేందుకు నవంబర్, డిసెంబర్ వరకు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఎగువ పనులు పూర్తి కాకున్నా ఎల్లంపల్లిలో చేరిన నీటిని దాని దిగువనున్న 3 ప్యాకేజీల ద్వారా మిడ్మానేరుకు తరలించేలా పనులు జరుగుతున్నాయి. ఎల్లంపల్లి 20 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి చేరుకోవడం, స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతుండటంతో ఈ నెలలోనే నీటిని ప్యాకే జీ–6 ద్వారా మేడారం రిజర్వాయర్కు తరలించేలా ప్రాజెక్టు అధికారులు చర్యలు చేప ట్టారు. ఎల్లంపల్లి దిగువన ఉన్న ప్యాకేజీ–6లో 124 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్లను సిద్ధం చేయాల్సి ఉండగా ఇప్పటికే రెండు సిద్ధమయ్యాయి. ఇందులో ఒక మోటార్కు శుక్రవారం డ్రై రన్ నిర్వహించగా అది విజయవంతమైంది. ఈనెల 5న రెండో మోటార్ డ్రై రన్ నిర్వహించనున్నారు. ఒక్కో మోటార్కు 3,200 క్యూసెక్కుల(రోజుకు) నీటిని తరలించే సామర్థ్యం ఉండగా గరిష్టంగా ఒక టీఎంసీ నీటిని తరలించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో పంపు డ్రైరన్ పూర్తి కాగానే ఈనెల 25 నాటికి ఎల్లంపల్లి నుంచి 0.78 టీఎంసీ సామర్థ్యం ఉన్న మేడారం రిజర్వాయర్కు నీటిని తరలించాలన్నది ప్రస్తుత లక్ష్యంగా నిర్ణయించారు. అక్టోబర్ రెండో వారం వరకు.. ఇక ప్యాకేజీ–7 పరిధిలో 11.24 కిలోమీటర్ల జంట టన్నెళ్ల నిర్మాణం చేయాల్సి ఉండగా ఇందులో అత్యంత క్లిష్టమైన పనులు ఇటీవలే పూర్తయ్యాయి. 5 మీటర్ల మేర హెడింగ్, బెంచింగ్ పనులు చేయడంతోపాటు, 8 కిలోమీటర్ల టన్నెల్ లైనింగ్ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఎడమ వైపు సొరంగంలో పని జరిగినంత వరకు లైనింగ్ పూర్తిచేసి అక్కడి నుంచి కుడి సొరంగంలోకి నీటిని మళ్లించడం, దీనికి తగ్గట్లుగా కుడి సొరంగ మార్గంలో లైనింగ్ పూర్తి చేస్తే ఒక టీఎంసీ నీటినైనా మళ్లించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ పనులు పూర్తయ్యేందుకు అక్టోబర్ రెండో వారం వరకు పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ప్యాకేజీ–8లో 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న బాహుబలి మోటార్ పంపులు 2 సిద్ధమయ్యాయి. ఇంకో మోటార్ను మరో 15 రోజుల్లో సిద్ధం చేయనున్నారు. దీని పరిధిలో ఉన్న గ్రావిటీ కెనాల్ పూర్తయితే మిడ్ మానేరుకు నీరు తరలించవచ్చు. దసరాకు ముందే ప్యాకేజీ–7 పూర్తి చేసి నీటిని మిడ్మానేరు తేవాలని నిర్ణయించారు. మిడ్మానేరుకు నీటి తరలించి.. అక్కడ కనీస మట్టాలకు నీరు చేరిన వెంటనే దిగువ ప్యాకేజీల ద్వారా మల్లన్నసాగర్ కాల్వలకు నీటిని తరలించే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దీనికి అనుగుణంగా నీటిపారుదల మంత్రి హరీశ్ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. -
శ్రీశైలానికి భారీగా వరద
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/హొసపేటె: నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తోండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు నిండటంతో భారీ ఎత్తున వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శుక్రవారం రాత్రి ఏడు గంటలకు శ్రీశైలం జలాశయంలోకి 1.76 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతోంది.. గురువారం సాయంత్రం 800.30 అడుగులుగా ఉన్న నీటి మట్టం శుక్రవారం సాయంత్రానికి 804.70 అడుగులకు చేరుకుంది. ఒక్క రోజులోనే 4.40 అడుగులు పెరగగా.. జలాశయంలోకి 2.2663 టీఎంసీల నీరు వచ్చి చేరగా 31.3963 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ఇది నిండాలంటే 185 టీఎంసీలు అవసరం. మహారాష్ట్ర, కర్ణాటకల సరిహద్దులో పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగువన జలాశయాలు నిండిపోయాయి. వరద ఇదే రీతిలో కనీసం 10 రోజులు కొనసాగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అంచనాల నేపథ్యంలో మరో పది పదిహేను రోజుల్లో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు.. కృష్ణా ప్రధాన ఉపనది అయిన తుంగభద్రలో కూడా వరద రోజు రోజుకూ పెరుగుతోంది. తుంగభద్ర జలాశయంలోకి 70,416 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 94.09 టీఎంసీలకు చేరింది. దీంతో 22 గేట్లు రెండు అడుగుల మేర తెరిచి 63,000 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారానికి ఈ వరద జలాలు సుంకేసుల బ్యారేజీకి చేరనున్నాయి. సుంకేసుల బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 1.2 టీఎంసీలే. 24 గంటల్లో బ్యారేజీ నిండుతుంది. దాంతో ఆదివారం సుంకేసుల నుంచి తుంగభద్ర వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తారు. ఈ జలాలు కృష్ణా ప్రవాహంతో కలిసి శ్రీశైలాన్ని చేరనున్నాయి. కృష్ణా మరో ప్రధాన ఉప నది బీమా. గతేడాది బీమా నది నుంచి తెలుగు రాష్ట్రాలకు భారీఎత్తున జలాలు వచ్చాయి. బీమా నదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టులో ప్రస్తుతం 72.78 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇంకా 16,197 క్యూసెక్కులు ఆ ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. ఇది నిండాలంటే మరో 44 టీఎంసీలు అవసరం. ఉజ్జయిని నిండితే బీమా ప్రవాహం కూడా కృష్ణా నదిలో కలిసి శ్రీశైలాన్ని చేరుతాయి. ఈ ఏడాది పుష్కలంగా నీటి లభ్యత? శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 875 అడుగులకు చేరుకుంటే ఎగువ నుంచి వచ్చే వరదను బట్టి.. దిగువకు అంటే నాగార్జునసాగర్కు విడుదల చేస్తారు. సాగర్లో ప్రస్తుతం 133.37 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగార్ నిండాలంటే.. 178.67 టీఎంసీలు అవసరం. పులిచింతల ప్రాజెక్టు నిండాలంటే 43 టీఎంసీలు కావాలి. తెలుగు గంగ ప్రాజెక్టు కింద వెలిగోడు, సోమశిల, కండలేరు, బ్రహ్మంసాగర్.. గాలేరు–నగరి పథకం కింద గండికోట, పైడిపలెం, వామికొండ, హంద్రీ–నీవా పథకం కింద కృష్ణగిరి, జీడిపల్లి, గొల్లపల్లి రిజర్వాయర్లు నిండాలంటే 215 టీఎంసీలు అవసరం. తెలంగాణలోని బీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్, కల్వకుర్తి, ఏలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులతో కలిపి మొత్తం 675 టీఎంసీల నీటి కొరత ఉంది. కేసీ కెనాల్ ఆయకట్టుకు 40 టీఎంసీలు అవసరం. మొత్తం మీద 715 టీఎంసీలు అవసరం. గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని రీతిలో జూలై మూడో వారానికే కృష్ణమ్మ శ్రీశైలాన్ని చేరడం, తుంగభద్ర జలాశయం గేట్లు ఎత్తేసిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నీటి లభ్యత ఈ ఏడాది ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గోదావరి జలాలు సముద్రంపాలు గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీకి శుక్రవారం 3,85,922 క్యూసెక్కుల ప్రవాహం రాగా 8,400 క్యూసెక్కులను డెల్టాకు విడుదల చేసి మిగతా 3,78,922 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. దాంతో 24 గంటల్లోనే 32.73 టీఎంసీలు కడలి పాలైనట్లు అయ్యింది. ఈ సీజన్లో ఇప్పటివరకూ 302.597 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ప్రకాశం బ్యారేజీకి గోదావరి జలాలు మొత్తం 10,301 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా కాలువలకు విడుదల చేస్తున్నారు. అలాగే, వంశధార నదిలో వరద తగ్గుముఖం పట్టింది. గొట్టా బ్యారేజీకి 4325 క్యూసెక్కులు రాగా.. 1220 క్యూసెక్కులను కాలువలకు విడుదల చేసి 3,105 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. నాగావళిలో వరద తగ్గడంతో తోటపల్లి బ్యారేజీ గేట్లును మూసివేశారు. నీటి నిల్వ గరిష్ఠ స్థాయికి చేరడంతో తోటపల్లి బ్యారేజీ నిండుకుండను తలపిస్తోంది. రాష్ట్రంలో అన్నీ నదులు జలకళతో కళకళలాడుతుంటే వర్షాభావం వల్ల పెన్నా నది మాత్రం వెలవెలబోతోంది. -
ఎల్లంపల్లిలో నీరు.. కాళేశ్వరం జోరు!
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో కాళేశ్వరం బ్యారేజీ, పంప్హౌజ్ల పనులకు ఆటంకాలు ఎదురవుతున్నా ఎల్లంపల్లి బ్యారేజీకి గోదావరి జలాలు పోటెత్తుతుండటంతో దిగువన పనులు ఊపందుకున్నాయి. వర్షాల వల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పనులు ఆలస్యమైనా ఎల్లంపల్లికి చేరుతున్న నీటిని ఎత్తిపోసేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. 20 టీఎంసీల సామర్థ్యం గల ఎల్లంపల్లిలో ఇప్పటికే 10 టీఎంసీల నిల్వలు ఉండగా.. ప్రవాహాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో సెప్టెంబర్ నుంచి కాళేశ్వరం లోని ప్యాకేజీ–6 మోటార్ల ద్వారా మేడారం రిజర్వాయర్కు, అటునుంచి ప్యాకేజీ–7, 8ల ద్వారా మిడ్ మానేరుకు నీరు తరలించేలా నీటి పారుదల శాఖ పనుల్లో వేగం పెంచింది. కౌంట్డౌన్ మొదలు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను పొలాలకు ఎత్తిపోసేందుకు కౌంట్డౌన్ మొదలైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్హౌజ్ పనులు వేగంగా సాగుతున్నా వర్షాలతో కొంత ఆటంకం కలుగుతోంది. గేట్లు, మోటార్లు అమర్చే ప్రక్రియ మొదలైనా అవి పూర్తయ్యేందుకు నవంబర్, డిసెంబర్ వరకు సమయం పట్టే అవకా శం ఉంది. దీంతో ఎగువ పనులు పూర్తి కాకున్నా ఎల్లంపల్లిలో చేరిన నీటిని దాని దిగువనున్న 3 ప్యాకేజీల ద్వారా మిడ్ మానేరుకు తరలించేలా పనులు జరుగుతున్నాయి. ఆగస్టు చివరి నాటికి ఎల్లంపల్లి 20 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి చేరుకుంటుందని అధికారుల అంచనా. సెప్టెంబర్లో మేడారం రిజర్వాయర్కు.. ఎల్లంపల్లి దిగువన ఉన్న ప్యాకేజీ–6లో 124 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్లను సిద్ధం చేయాల్సి ఉండగా ఇప్పటికే రెండు సిదమయ్యాయి. ఆగస్టు చివరికి మరొకటి పూర్తయ్యే అవకాశం ఉంది. ఒక్కో మోటార్కు 3,200 క్యూసెక్కుల(రోజుకు) నీటిని తరలించే సామర్థ్యం ఉండగా గరిష్టంగా ఒక టీఎంసీ నీటి ని తరలించేలా పనులు సాగుతున్నాయి. మోటార్లకు విద్యుత్ సరఫరా చేసే గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ ఇంకా సిద్ధం కావాల్సి ఉండటంతో డ్రై రన్ జరుగ లేదు. సబ్స్టేషన్ ఈ నెలాఖరుకు సిద్ధం కానుండటం తో ఆగస్టు 15కి డ్రై రన్ చేయాలని మంత్రి హరీశ్రావు గడువు విధించారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఎల్లంపల్లి నుంచి 1.5 టీఎంసీ సామర్థ్యం ఉన్న మేడారం రిజర్వాయర్కు నీటిని తరలించాలన్నది ప్రస్తుత లక్ష్యంగా నిర్ణయించారు. లైనింగ్ పూర్తయితే లైన్ క్లియర్ ప్యాకేజీ–7 పరిధిలో 11.24 కిలోమీటర్ల జంట టన్నెళ్ల నిర్మాణం చేయాల్సి ఉండగా ఇందులో 13 మీటర్ల పనే మిగిలింది. లైనింగ్ పనులు సెప్టెంబర్ చివరికి పూర్తయ్యే అవకాశం ఉంది. ప్యాకేజీ–8లో 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న బాహుబలి మోటార్ పంపులు 2 సిద్ధమయ్యాయి. ఇంకో మోటార్ను ఆగస్టు చివరికి సిద్ధం చేయనున్నారు. దీని పరిధిలో ఉన్న గ్రావి టీ కెనాల్ పూర్తయితే మిడ్ మానేరుకు నీరు తరలించవచ్చు. ఎల్లంపల్లి నుంచి ప్యాకేజీ–6 ద్వారా నీరు తరలించేందుకు ఇబ్బంది లేకున్నా ప్యాకేజీ– 7లో టన్నెల్ లైనింగ్ పనులు పూర్తయితేనే ప్యాకేజీ–8 ద్వారా మిడ్ మానేరుకు నీరు తరలించడం సులభమని ప్రాజెక్టు వర్గాలు చెబు తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ తొలివారంలో ఎల్లంపల్లి నుంచి నీటి ఎత్తిపోతల ఆరంభం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు ఆరంభం అవుతుందని చెబుతున్నాయి. -
మేమున్నది ఫిర్యాదులు తీసుకోవటానికేనా?
సాక్షి, అమరావతి: ‘అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపడుతున్నారంటూ పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటారు. వాటికి సంబంధించిన డీపీఆర్లు ఇవ్వాలని కోరితే మాత్రం స్పందించరు. కేవలం ఫిర్యాదులు స్వీకరించడానికే బోర్డు ఉందనుకుంటున్నారా?..’ అంటూ తెలుగు రాష్ట్రాలపై గోదావరి నదీ జలాల బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. డీపీఆర్లు ఇచ్చిన తర్వాతే అనుమతి లేని ప్రాజెక్టులపై చర్చిస్తామని స్పష్టం చేసింది. బోర్డు ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఇరు రాష్ట్రాలు వారం రోజుల్లోగా డీపీఆర్లు సమర్పిస్తామని హామీ ఇచ్చాయి. ఛైర్మన్ హెచ్కే సాహూ నేతృత్వంలో మంగళవారం హైదరాబాద్లోని జలసౌధలో గోదావరి బోర్డు సమావేశమైంది. పునర్విభజన చట్టం మేరకు గోదావరిపై ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే గోదావరి బోర్డు లేదా అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని, అయితే ఎలాంటి అనుమతి లేకుండానే కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తున్నారంటూ తెలుగు రాష్ట్రాలు బోర్డుకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. కొత్త ప్రాజెక్టులుగా ఎందుకు పరిగణించరు? రీ–ఇంజనీరింగ్ పేరుతో తెలంగాణ సర్కార్ ప్రాజెక్టులు చేపడుతూ వాటి సామర్థ్యాలను పెంచేస్తోందని ఆంధ్రప్రదేశ్ అధికారులు ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండానే కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతలను చేపట్టారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టుల సామర్థ్యం 33 టీఎంసీలైతే తాజాగా రీ–ఇంజనీరింగ్ పేరుతో సామర్థ్యాన్ని 70 టీఎంసీలకు పెంచారని వివరించారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాల కింద గతంలో 3.24 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే ఇప్పుడు 6.74 లక్షల ఎకరాలకు పెంచారని పేర్కొన్నారు. అప్పట్లో రెండు ఎత్తిపోతల పథకాల వ్యయం రూ.3,505 కోట్లయితే ఇప్పుడు సీతారామ ఎత్తిపోతల పథకం వ్యయమే రూ.13,384.80 కోట్లకు చేరుకున్నందున కొత్త ప్రాజెక్టుగా ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇటీవలే కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపినందున దాన్ని పాత ప్రాజెక్టుగా ఎందుకు పరిగణించాలని నిలదీశారు. అవి ఉమ్మడి హయాంలో ప్రాజెక్టులే ఆంధ్రప్రదేశ్ వాదనలపై తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులనే తమ అవసరాలకు అనుగుణంగా రీ–ఇంజనీరింగ్ చేశామన్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నంతో సహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై పలు ప్రాజెక్టులను చేపడుతోందని ఫిర్యాదు చేశారు. ఒక్కటైనా డీపీఆర్ ఇచ్చారా? ఇరు రాష్ట్రాల వాదనలను సావధానంగా విన్న బోర్డు ఛైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వాలని ఇరు రాష్ట్రాలను కోరుతున్నా ఇప్పటివరకూ ఒక్కటి కూడా ఇవ్వకపోవడాన్ని ప్రస్తావించారు. డీపీఆర్లు ఎప్పుడు ఇస్తే అప్పుడే వాటిపై చర్చిద్దామని స్పష్టం చేశారు. దీంతో వారం రోజుల్లోగా డీపీఆర్లు ఇస్తామని ఇరు రాష్ట్రాల అధికారులు బోర్డుకు హామీ ఇచ్చారు. డీపీఆర్లు అందాక మరోసారి సమావేశం కావాలని బోర్డు నిర్ణయించింది. గోదావరి బోర్డు భేటీలో నిర్ణయాలు – గోదావరి జలాల వినియోగం లెక్కలు తేల్చేందుకు ఇరు రాష్ట్రాల్లోనూ 120 ప్రాంతాల్లో టెలీమీటర్ల ఏర్పాటు. – తొలి విడతగా ఆంధ్రప్రదేశ్లోని ధవళేశ్వరం బ్యారేజీ, తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో 8 ప్రదేశాల్లో టెలీమీటర్ల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాల అంగీకారం. – గోదావరి ఉప నది ఇంద్రాంతిపై మధ్య కొలాబ్ ప్రాజెక్టు ద్వారా తమకు కేటాయించిన నీటిని వినియోగించుకుంటామన్న ఒడిశా సర్కార్ వినతికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంగీకారం. – మధ్య కొలాబ్ ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతి ఇచ్చేందుకు బోర్డు ఆమోదం. -
కొంత మోదం.. కొంత ఖేదం!
సాక్షి, హైదరాబాద్: గోదావరి నుంచి 60 టీఎంసీల నదీ జలాలను వినియోగించుకుంటూ చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకానికి అనేక ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. తొలిరెండు దశల్లో అనుకున్న రీతిలో నీళ్లివ్వగలిగినా.. మూడో దశకు మాత్రం అవాంతరాలు వస్తున్నాయి. దీంతో మూడో దశ కింద మరో ఏడాదికి కానీ నీళ్లివ్వలేని పరిస్థితి తలెత్తుతోంది. దేవాదుల ప్రాజెక్టు ద్వారా 6.21 లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చే లక్ష్యంతో ప్రభుత్వం మూడు దశలుగా విభజించి పనులు మొదలు పెట్టింది. రెండు దశల ద్వారా గతేడాది ఖరీఫ్లో గరిష్టంగా 7.93 టీఎంసీల నీటిని ఎత్తిపోసి 319 చెరువులను నింపారు. రబీలోనూ 3.5 టీఎంసీల నీటిని తరలించి తాగునీటి అవసరాలను తీర్చగలిగారు. ఈ ఏడాది ఖరీఫ్ నుంచి మరింత నీటిని ఎత్తిపోసి 395 చెరువులను నింపే లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నారు. అనేక అడ్డంకులు.. పనుల్లో జాప్యం.. దేవాదుల మూడో దశ పనులను 8 ప్యాకేజీలుగా విభజించి.. 2.41 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని నిర్ణయించారు. తొలుత ప్రతిపాదించిన 25 కిలోమీటర్ల టన్నెల్తో రామప్ప దేవాలయానికి ప్రమాదం పొంచి ఉందన్న కారణంతో.. టన్నెల్ ప్రతిపాదన పక్కనపెట్టి పైప్లైన్ వ్యవస్థ పనులను ప్రభుత్వం చేపట్టింది. ప్యాకేజీ–3లో భాగంగా రామప్ప నుంచి ధర్మసాగర్కు నీటిని తరలించాల్సి ఉంది. దీనికోసం ఆసియాలోనే అత్యంత పొడవైన 54 కి.మీ.ల మేర టన్నెల్ తవ్వాల్సి ఉంది. ఈ టన్నెల్ను సలివాగు చెరువు కింది నుంచి ప్రతిపాదించగా, 2011లో చెరువు కింది టన్నెల్ ప్రాంతం కుంగి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. దీంతో 16.93వ కి.మీ ప్రాంతంలో పనులు రెండేళ్లుగా ఆగిపోయాయి. ఇక్కడ ప్రస్తుతం అధునాతన పద్ధతుల్లో పనులు మొదలు పెట్టినా అవి మరో ఏడాదికి కానీ పూర్తయ్యే పరిస్థితి లేదు. మరోవైపు టన్నెల్ తొలి 7 కి.మీ. అటవీ మార్గంలో వెళ్తోంది. తవ్వకాలకు అటవీ అనుమతులు వచ్చినా.. ఇక్కడి భూమి పొరలు పూర్తిగా సున్నపురాయి, బొగ్గు నిక్షేపాలతో ఉండటంతో టన్నెల్ నిర్మాణం ముందుకు కదలడం లేదు. పనులు కొనసాగిస్తే టన్నెల్ కూలే ప్రమాదం నేపథ్యంలో ఇతర మార్గాన్వేషణ జరుగుతుండటంతో పనులు ఆలస్యం అవుతున్నాయి. టన్నెల్ 49వ కి.మీ. వద్ద పంప్హౌజ్ నిర్మాణం చేయాల్సి ఉండగా ఇక్కడి భూమి పొరలు అనుకూలంగా లేవు. దీంతో పంప్హౌజ్ పనులకు మరో ఏడాది ఆలస్యమయ్యే అవకాశం ఉంది. -
సంకల్ప బలం
‘గోదావరీ నదీజలాలు పుష్కలంగా ఇక్కడి ప్రజల కాళ్ల కిందినించి పారుతూ వెళ్లి వృథాగా సముద్రం పాలవుతుండగా, వీరు కరువుకాటకాలబారిన పడకుండా చూడడానికి.. వాటిని అలా వదిలివెయ్యడంలో తగిన ఔచిత్యం కనిపించడం లేదు’....అని ఆర్థ్ధర్ కాటన్ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ‘అయితే నువ్వు ఆనకట్ట కట్టి నీటిని నిల్వచేసి కొన్ని వేల ఎకరాలు సాగు కావడానికి కారణం కాగలవా ?’ అని జవాబు ప్రశ్నగా వచ్చింది. అంతే. ఆయన గుర్రం వేసుకుని అరణ్యాల వెంట తిరిగి గోదావరి ప్రవాహ ప్రాంతమంతా పరిశీలించి ప్రాజెక్ట్ ఎక్కడ కడితే పదికాలాల పాటు నిలబడుతుందన్నది సర్వేచేసి చివరకు కొండలమధ్యనున్న ధవళేశ్వరం వద్ద అయితే బాగుంటుందని ఎంపిక చేశారు. కాటన్ ఈ దేశంలో ఉన్నన్నాళ్లూ కష్టపడి ప్రాజెక్ట్ పూర్తిచేసి ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం కావడానికి కారణమయ్యాడు. ఒకదశలో ఆయన ఒక సంవత్సరంపాటు తీవ్రంగా అనారోగ్యం పాలయి, చివరకు ప్రాణాపాయంలో కూడా పడ్డాడు. కొద్దిగా కోలుకోగానే మళ్లీ వచ్చి ప్రాజెక్ట్ పని పూర్తి చేశాడు. అందులోంచి నీళ్లు రైతుల పొలాలకు పారుతుంటే చూసి పొంగిపోయాడు. ఎక్కడివాడు! ఈ దేశంవాడా! ఈ జిల్లావాడా! ఈ ధర్మం వాడా! ఒక్క లేఖ రాసినందుకు ప్రభుత్వం ‘నీవు చెయ్యగలవా ?’ అని.. ‘చెయ్యగలను’ అంటూ నిలబడడమే కాదు, ప్రాజెక్ట్ కట్టే సందర్భంలో వ్యక్తిగతంగానే కాదు, ఆరోగ్యపరంగానే కాదు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా అన్నింటినీ తట్టుకుని నిలబడ్డాడు. అంత గొప్ప ఆనకట్ట కట్టాడు. చరిత్రలోనే కాదు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండి పోయాడు. ఒక సంకల్పానికి నిలబడడం అంటే అదీ. -
45 టీఎంసీల కోటా పెంచాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లిస్తూ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటి వాటాను వచ్చే జూన్ వాటర్ ఇయర్ నుంచి అమలు చేయాలని పట్టుబట్టేందుకు తెలంగాణ సిద్ధమైంది. వాటాల విషయమై ఇప్పటికే కృష్ణా, గోదావరి బోర్డులు చేతులెత్తేయడం, బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై అయ్యేవరకు పాత విధానమే అమల్లో ఉంటుందని కేంద్రం సంకేతాలు పంపిన నేపథ్యంలో దీనిపై కేంద్రం వద్ద తాడోపేడో తేల్చుకోవాలని చూస్తోంది. బచావత్ అవార్డు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల జలాల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల నీరు కేటాయించారు. అయితే పరీవాహకం, ఆయకట్టు ఆధారంగా కేటాయింపులు కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఇదే బచావత్ అవార్డులో పేర్కొ న్న మేరకు, పోలవరానికి అధికారిక అనుమతులు రాగానే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని, ఈ లెక్కన తెలంగాణకు 45 టీఎంసీలు దక్కాలని, అలాగే పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగా పరిగణించి దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో మరో 45 టీఎంసీల వాటా ఇవ్వాల ని తెలంగాణ అంటోంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలకు 35 టీఎంసీలు దక్కుతాయని బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో స్పష్టంగా ఉండటంతో కర్ణాటక తన వాటా మేరకు 21 టీఎంసీల వినియోగం మొదలుపెట్టింది. అయితే తెలంగాణకు దక్కే వాటాల అంశం మాత్రం పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ అన్ని అంశాలను పేర్కొంటూ ఈ వాటర్ ఇయర్లో తెలంగాణకు 45 టీఎంసీల మేర కోటా పెంచాలని పట్టుబట్టనుంది. ఇవే అంశాలతో ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి ఒకట్రెండు రోజుల్లో కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిసింది. వాటర్ ఇయర్ ఆరంభానికి కేవలం 40 రోజుల గడువే ఉన్న నేపథ్యంలో ముందు నుంచే ఈ అంశంపై కేంద్రం నుంచి స్పష్టత తీసుకోవాలని కృత నిశ్చయంతో ఉంది. -
కాళేశ్వరం.. అన్ని వర్గాల ఆమోదం
కామారెడ్డి, చిట్యాల, నారాయణఖేడ్లలో ప్రజాభిప్రాయ సేకరణ అన్నిపార్టీల మద్దతు.. దివంగత సీఎం వైఎస్సార్ను గుర్తుచేసిన నేతలు సాక్షి, కామారెడ్డి/చిట్యాల/నారాయణఖేడ్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పర్యావరణ అనుమతుల కోసం నల్లగొండ జిల్లా చిట్యాల, కామారెడ్డి జిల్లాకేంద్రం, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ప్రజాభి ప్రాయ సేకరణ జరిగింది. బుధవారం జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రాజె క్టు నిర్మాణానికి మెజారిటీ ప్రజలు, అన్ని పార్టీల నాయకులు ఆమోదం తెలిపారు. చిట్యాలలో మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్.భాస్కర్రావు, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఈఈ పి.జవహర్, నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి, ఐబీ డీఈ సురేందర్రావు, వివిధ శాఖల అధికారులు, చిట్యాల మండలం సుంకేనేపల్లి, వెలిమినేడు, గుం డ్రాంపల్లి, గ్రామాలతోపాటు నార్కట్ పల్లి, రామన్నపేట మండలాల ప్రజలు, రైతులు పాల్గొన్నారు. జేసీ నారాయణరెడ్డి మాట్లాడుతూ మెజారిటీ ప్రజల ఆమోదం మేరకు ప్రాజెక్ట్ నిర్మాణం చేపడతామన్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను సాగునీరుగా వినియోగించుకు నేందుకు నిర్మించనున్న అద్భుత ప్రాజెక్టు కాళేశ్వరమన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు నిర్మా ణంతో వేలాది ఎకరాలకు సాగునీరు వస్తుం దని, నిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు. కామారెడ్డిలో: కామారెడ్డిలో ఐదు గంటలపాటు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ లో కలెక్టర్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్రెడ్డి, హన్మంత్సిండే, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, డీసీఎంఎస్ చైర్మన్ ముజీబుద్దీన్, జేసీ సత్తయ్య, కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ వేణు, ఈఈ శ్రీనివాస్, జిల్లాలోని ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ప్రాణహిత–చేవెళ్ల పథకంలో భాగంగా 22వ ప్యాకేజీకి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కామారెడ్డిలోనే శంకుస్థాపన చేశారని డీసీసీబీ మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, సీడీసీ చైర్మన్ ఇంద్రకరణ్రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు జమునా రాథోడ్ పేర్కొన్నారు. 75 మంది తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. దాదాపు అందరూ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయా లని, భూనిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. ప్రాజెక్టును నిర్మిస్తే మేలు జరుగు తుందని టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం నేతలు అభిప్రాయపడ్డారు. నారాయణఖేడ్లో నారాయణఖేడ్లో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, భూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, 400 మంది రైతులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్నసాగర్ నుంచి సింగూరు ప్రాజెక్టుకు నీటిని తరలించాలనే ప్రభుత్వ ప్రణాళికను ముక్త కంఠంతో స్వాగతించారు. వలసలకు మారుపేరుగా ఉన్న నారాయణఖేడ్ ప్రాం తానికి ఈ ప్రాజెక్టు వరప్రదాయనిగా నిలు స్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. డీపీఆర్ లేకుండా ప్రజాభిప్రాయాన్ని సేకరించడంపై కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం తప్పుపట్టాయి. -
కరువును తరిమేద్దాం: హరీశ్రావు
- గోదావరి జలాలతో తెలంగాణ పునీతం - ఇటు కాళేశ్వరం, అటు శ్రీరాంసాగర్ పునరుద్ధరణ సాక్షి, సిద్దిపేట: ‘తలాపున గోదావరి నది ఉన్నా.. తెలంగాణ ప్రజలు సాగునీటికి, తాగునీటికి అల్లాడి పోయారు. కరువుతో పల్లెలు వల్లకా డులయ్యాయి. ఇప్పుడు మన రాష్ట్రం మనకు వచ్చింది. గోదావరి నీళ్లు మన బీడు భూములకు మళ్లిద్దాం. కరువును తరిమేద్దాం’’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా లోని పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తెలంగాణలో సకాలంలో వర్షాలు పడకపోవడంతో వేసిన మొక్కజొన్న పంటలు మాడిపోతున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో కూడా కాళేశ్వరం వద్ద 220 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందన్నారు. ఇలా వృథాగా వెళ్తున్న నీటిని సద్వినియోగం చేసుకుంటే 22 లక్షల ఎకరాల భూములను సస్యశ్యామలం చేయవచ్చన్నారు. ఇందుకోసం ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు తోపాటు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టిందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సొరంగమార్గం ద్వారా కాల్వలు నిర్మించి రెండేళ్లలో సాగునీటిని అందించేందుకు పనులు ముమ్మరంగా జరుగుతు న్నాయన్నారు. వలసలు నిర్మూలించి పల్లెలకు పాత కళ తెచ్చేందుకు కుల వృత్తులను ప్రోత్స హిస్తూ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడు తోందన్నారు. గొల్లకురుమలకు సబ్సిడీ గొర్రెలు అందచేస్తున్నామని, దీంతో పల్లెల్లోనే సంపదను సృష్టించే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. సామూహిక గొర్రెల పాకలు ఏర్పాటు చేస్తాం.. కులవృత్తులను నమ్ముకొని జీవించే వారు కలసికట్టుగా ఉంటారని మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో సామూహిక గొర్రెల పాకలను ఏర్పాటు చేస్తామని, ఊరికి చెందిన గొర్రెల మందలన్నీ ఇక్కడే ఉంటాయని ఆయన చెప్పారు. ఈ మేరకు సిద్దిపేట రూరల్ మండలంలో ఆయన శనివారం గొర్రెల పాకను ప్రారంభించారు. రాష్ట్రంలోనే ఇది మొదటిదని, త్వరలో రాష్ట్రమంతటా ఇటువంటివి నిర్మిస్తామన్నారు. వర్షాలు సకాలంలో పడాలంటే పల్లెలు పచ్చగా ఉండాలని, అందుకోసం ప్రతీ ఒక్కరు హరిత ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. -
కరువు ప్రాంతాలకు కాళేశ్వరం నీళ్లు
2018లో యాదాద్రి జిల్లాకు గోదావరి జలాలు ► యుద్ధ ప్రాతిపదికన గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల పనులు ► కొత్త చట్టం ప్రకారం వేగంగా భూసేకరణ ► కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో హరీశ్రావు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు పీడిత ప్రాంతాలకు కాళేశ్వరం నీళ్లు మళ్లించే ధ్యేయం తో ప్రభుత్వం పనిచేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు వెల్లడించారు. అందుకే కరువు ప్రాంతమైన యాదాద్రి జిల్లాలో గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో ఉన్నట్లు తెలిపారు. 2018 జూలైలో కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు యాదాద్రిజిల్లాలో ప్రవహిస్తా యని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు అనుగు ణంగా అధికారులు నిర్మాణ, భూసేకరణ పనులు చేపట్టాలని సూచించారు. సోమవారం వివిధ జిల్లాల కలెక్టర్లతో మంత్రి హరీశ్రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులకు సంబం ధించి పలు కీలక సూచనలు చేశారు. పెద్దప ల్లి, మంచిర్యాల ప్రాంతాల్లో గతేడాది అమలు చేసిన’ టెయిల్ టు హెడ్’ విధానాన్ని మిగతా ప్రాంతాల్లోనూ అమలు చేయాలన్నారు. ఈ విధానం మధ్యప్రదేశ్లో విజయవంతమైంద ని, ఈ నేపథ్యంలో వీలైనన్ని ప్రాజెక్టుల ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీల పరిధిలో ఈ విధానాన్ని ప్రవేశ పెట్టాలని సూచించారు. సవరించిన 2016 భూసేకరణ చట్టం ప్రకారం సాగునీటి పథకాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ప్రతీ ప్రాజెక్టు కింద పూర్తి ఆయకట్టు లక్ష్యాల సాధనకు పకడ్బందీ గా ప్రణాళికలు రచించి అమలు చేయాలన్నా రు. మిడ్మానేరు, పులిచింతల తదితర ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన ఆర్అండ్ఆర్ కాలనీల్లో కనీస సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కాలనీలను గ్రామ పంచాయతీలుగా మార్చడానికి అవసరమైన చర్యలు తీసుకోవా లని సంబంధిత ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్లను, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జగిత్యాల జిల్లాలో గతేడాది అత్యధికంగా 4లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట పండిందని, ఇందుకు కృషి చేసిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను మంత్రి అభినందించారు. సీతారామ ప్రాజెక్టు ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులు వేగవం తం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. భక్త రామదాసు ప్రాజెక్టు నుంచి ఈ సంవత్సరం పూర్తి ఆయ కట్టుకు నీరివ్వాలని సూచించారు. నీటి విడుదలకు ఆదేశాలు.. సింగూరు, ఘనపురం, కడెం, నీల్వాయి, మత్తడివాగు, కొమురంభీమ్, గొల్లవాగు, నల్ల వాగు ప్రాజెక్టుల నుంచి ఖరీఫ్లో నీటి విడుదలకు అవసరమైన చర్యలు తీసుకో వాలని హరీశ్ సూచించారు. ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్, ఏఎంఆర్పీ, నిజాం సాగర్ తదితర ప్రాజెక్టుల పరిధిలో వెంటనే ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో రైతు అవగాహన సదస్సులు వెంటనే నిర్వహించాలని ఆదేశించారు. వివిధ ప్రాజెక్టుల డ్యామ్ల గేట్లను పటిష్టం చేయాలన్నారు. నిజాంసాగర్ కింద గత ఏడాది సమర్థంగా సాగు నీటి యాజ మాన్యం జరిగిందని, అదే స్ఫూర్తిని మిగతా ప్రాజెక్టుల్లోనూ కొనసాగించాలని కోరారు. వీడియో కాన్ఫరెన్సులో ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఈఎన్సీ మురళీధర్, విజయప్రకాశ్, ‘కాడా’ కమిషనర్ డాక్టర్ మల్సూర్, సీఈలు హరిరామ్, ఖగేందర్రావు, సుధాకర్, శ్యామసుందర్, సురేశ్, మధుసూదన్, అనిల్, సునీల్, భగవంతరావు తదితరులు పాల్గొన్నారు. కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన మంత్రి హరీశ్ తెలంగాణ జలవనరుల సమాచార వ్యవస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్ను మంత్రి హరీశ్రావు సోమవారం జలసౌ ధలో ప్రారంభించారు. ఇస్రో సాయంతో నీటి పారుదల శాఖ 55 ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు, కాల్వలు, పిల్ల కాల్వల వ్యస్థను డిజిటలైజ్ చేయగా, ఆ సమాచారాన్ని అంతా కమాండ్ కంట్రోల్ సెంటర్లో అందుబాటులో ఉంచారు. మొత్తంగా 22,784 కిలోమీటర్ల పొడవైన 8,177 కాల్వల వివరాలను ఇందులో పొందుపరిచారు. వీటితో పాటే 46 వేల చెరువుల సమాచారాన్ని పూర్తిగా ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. -
కృష్ణా, గోదావరి బోర్డులకు కొత్త చైర్మన్లు
- కృష్ణాకు ఎస్కే శ్రీవాత్సవ, గోదావరికి హెచ్కే సాహు - పూర్తి స్థాయి చైర్మన్లను నియమించిన కేంద్ర జల సంఘం సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల పంపకాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య వివాదాలు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో కేంద్ర జలసంఘం ఆ రెండు నదీ బోర్డులకు కొత్తగా పూర్తి స్థాయి చైర్మన్లను నియమించింది. కృష్ణాబోర్డుకు ఎస్కే శ్రీవాత్సవను, గోదావరి బోర్డుకు హెచ్కే సాహును చైర్మన్లుగా నియమించింది. ఈ మేరకు గురువారం కేంద్ర జల సంఘం చైర్మన్ నరేంద్ర కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్కే శ్రీవాత్సవ ప్రస్తుతం పుణేలో నేషనల్ వాటర్ అకాడమీ చీఫ్ ఇంజనీర్ స్థాయిలో ఉండగా.. తీస్తా బేసిన్ ఆర్గనైజేషన్(టీబీఓ) పశ్చిమబెంగాల్ శాఖలో హెచ్కే సాహు చీఫ్ ఇంజనీర్గా పని చేస్తున్నారు. వీరిద్దరు వచ్చే సోమవారం బాధ్యతలు స్వీకరిస్తారని బోర్డు వర్గాలు తెలిపాయి. -
గోదావరి జలాల వినియోగంపై అధ్యయనం
నిట్ డైరెక్టర్ జి.రామచంద్రారెడ్డి హన్మకొండ: గోదావరి జలాలపై వరంగల్లోని నిట్ అధ్యయనం చేసిందని నిట్ ఇన్ చార్జి డైరెక్టర్ జి.రామ చంద్రారెడ్డి అన్నారు. నిట్ సివిల్ విభాగం ఎంతో సాంకేతిక నైపుణ్యం కలిగి ఉందని, దీనిని ఇప్పటి వరకు ప్రభుత్వం వినియోగించుకోలేదన్నారు. కేంద్ర జలవనరుల మం త్రిత్వ శాఖ సలహాదారుడు, తెలంగాణకు చెందిన వెదిరె శ్రీరాం రచించిన ‘గోదావరి జలాల సమగ్ర వినియో గం–జాతీయ, తెలంగాణ రాష్ట్ర దృక్పథాలు’ పుస్తకంపై శనివారం వరంగల్లోని నిట్లో జరిగిన చర్చా కార్యక్ర మంలో ఆయన మాట్లాడారు. భూగర్భ జలాల పెంపున కు, నదుల్లో నీటి నిల్వలకు, నీటి ఎద్దడి నివారణకు వరంగల్ నిట్ విద్యార్థులు, అధ్యాపకులు అనేక పరిశో ధనలు చేశారని తెలిపారు. నీటిసాంద్రత పెంపుదల ప్రాజెక్ట్ రూపకల్పనకు నిట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం ఉపయెగిం చుకోవాలని కోరారు. వెదిరె శ్రీరాం రచించిన పుస్తకంలో పొందుపరిచిన అంశాలతో తెలం గాణ రాష్ట్రానికి నేషనల్ ప్రాజెక్ట్ హోదాను పొందే అవకాశంపై చర్చించారు. -
సవరణ అంచనాలకు ఆమోదం
రూ.13,445 కోట్లతో దేవాదుల, రూ.2,121 కోట్లతో తుపాకులగూడెం సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాల సమర్థ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని దేవాదుల, తుపాకులగూడెం, ఎస్సారెస్పీ స్టేజ్–2 ప్రాజెక్టుల్లో చేసిన మార్పులకు అనుగుణంగా అంచనా వ్యయాలను సవరిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో దేవాదుల అంచనాను రూ.9,427.73 కోట్ల నుంచి రూ.13,445.44 కోట్లకు సవరించారు. తొలుత ఈ ప్రాజెక్టు కింద గోదావరి నుంచి 38.16 టీఎంసీల నీటిని తీసుకుని వరంగల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లోని 6.21 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిర్ణీత ఆయకట్టుకు అందించేందుకు 38 టీఎంసీలు సరిపోవంటూ కేటాయింపులను 60 టీఎంసీలకు పెంచింది. ఆ స్థాయి నీటి నిల్వలకు సరిపోయేందుకు కొత్తగా రూ.3,170 కోట్లతో మల్కాపూర్ రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించింది. దాంతో పాటు మరిన్ని మార్పులు, చేర్పులు, పెరిగిన రేట్లతో అంచనా వ్యయం రూ.13,445.44 కోట్లకు చేరింది. ఇక కంతనపల్లి ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన తుపా కులగూడెం బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే ఓకే చెప్పింది. మారిన ప్రతిపా దనలతో తుపాకులగూడెం బ్యారేజీ అంచనాలను కొత్తగా రూ.2,121 కోట్లతో సిద్ధం చేశారు. అయితే కంతనపల్లి బ్యారేజీ నిర్మాణ విధివిధానాలను అనుసరించి 2012–13 స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్ల (ఎస్ఎస్ఆర్)తో నిర్మాణ పనులను చేస్తా మంటూ ఆ కాంట్రాక్టు సంస్థ ముందుకు రావడంతో.. వారికే అప్పగించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎస్సీరెస్పీ స్టేజ్–2లో జీవో 146 అమలు చేయడం, కొన్ని నిర్మా ణాలు అదనంగా చేరడంతో అంచనా వ్య యాన్ని రూ.1,220.41 కోట్లకు పెంచుతూ అనుమతులు మంజూరు చేశారు. -
‘కృష్ణా’ నీటిపై నేడే భేటీ
-
‘కృష్ణా’ నీటిపై నేడే భేటీ
- వాదనలతో సిద్ధమైన తెలంగాణ, ఏపీ - 103 టీఎంసీలు కోరుతున్న తెలంగాణ - ఇప్పటికే అదనంగా వాడారంటున్న ఏపీ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగంపై తేల్చుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సిద్ధమయ్యాయి. ఇరు రాష్ట్రాల నీటి అవసరాలను తేల్చేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బుధవారం కీలక భేటీ నిర్వహించనుంది. ఇందులో రెండు రాష్ట్రా లు తమ నీటి అవసరాలపై సమర్పిం చిన ఇండెంట్లతోపాటు మైనర్ ఇరిగేషన్ కింద నీటి లెక్కలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటిలో 103 టీఎంసీలు కేటారుుంచాలని తెలంగాణ కోరుతోంది. ఏపీ 47 టీఎంసీల మేర కోరుతోంది. ఇప్పటివరకు వచ్చిన నీటిలో ఎక్కువగా ఏపీ వినియోగించిందని తెలంగాణ చెబుతుండగా, తెలంగాణయే అధికంగా వాడిందని ఏపీ పేర్కొంటోంది. దీనికి తోడు తెలంగాణలో కురిసిన వర్షాలతో చెరువులన్నీ నిండాయని, వాటి కింద 89.15 టీఎంసీల మేర నీటి వినియోగించారని అం టోంది. దీన్ని తెలంగాణ ఖండిస్తోంది. ఈ ఏడాది మొత్తంగా చెరువుల కింద 20 నుంచి 25 టీఎంసీలకు మించి వినియోగం లేదని స్పష్టం చేస్తోంది. పట్టిసీమ ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు తరలించిన 50 టీఎంసీలను కృష్ణాలో చేసిన వినియోగం కిందే చూడాలని డిమాండ్ చేస్తోంది. అలాగే మైనర్ ఇరిగేషన్ కింద ఏపీకి ఉన్న వాటా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతోంది. దీనిపై బోర్డు ఎలా స్పందిస్తుం దన్నది బుధవారంనాటి సమావేశంలో తేలనుంది. ఆ ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వద్దు.. గోదావరి నదీ జలాలను వినియోగిం చుకుంటున్న ప్రాజెక్టులపై బోర్డు పర్యవేక్షణ సరిపోతుందని తెలంగాణ పేర్కొంది. వాటిని బోర్డు పరిధిలోకి తేవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు గోదావరి బోర్డు ఇచ్చిన ముసారుుదా నోటిఫికేషన్పై తన అభిప్రాయాలను తెలిపింది. -
2018నాటికి ‘భగీరథ’కు 41.31 టీఎంసీలు
► 2033కి 50.6 టీఎంసీలు, 2048కి 60.75 టీఎంసీలు ► రాష్ట్ర తాగునీటి అవసరాలపై లెక్కలేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల నుంచి రాష్ట్ర తాగునీటి అవసరాలకు భవిష్యత్తులో ఏ మేర నీటి అవసరాలు ఉంటాయన్న అంశంపై ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. రాష్ట్ర తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథకు 2018 నాటికి 41.31 టీఎంసీలు, 2048 నాటికి 60.75 టీఎంసీల అవసరం ఉంటుందని లెక్కకట్టింది. నిజానికి మిషన్ భగీరథకు కృష్ణా, గోదావరి బేసిన్లలోని 26 సెగ్మెంట్లకు నీటిని అందించేందుకు ప్రాజెక్టుల నుంచి మొత్తంగా 39.19 టీఎంసీల నీటిని వాడుకోవాలని మొదట నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ప్రతి ప్రాజెక్టులో కనీసం 10 శాతం నీటిని తాగునీటి అవసరాల కోసం వాటర్ గ్రిడ్కు కేటాయించింది. కృష్ణా బేసిన్లో 19.59 టీఎంసీలు, గోదావరి 19.67 టీఎంసీలు కేటాయించగా.. ప్రస్తుతం దాన్ని సవరించింది. కృష్ణాలో 18.20 టీఎంసీలు, గోదావరిలో 23.11 టీఎంసీల నీటిని తీసుకోవాలని తాజాగా నిర్ణయించింది. 2018నాటికి మొత్తంగా 41.31 టీఎంసీలను వినియోగించాలని నిర్ణయించింది. ఇక 2033 నాటికి రాష్ట్ర నీటి అవసరాలు కృష్ణాలో 21.49, గోదావరిలో 29.11 టీఎంసీ కలిపి మొత్తంగా 50.6 టీఎంసీలకు పెరుగుతాయని లెక్కలేసింది. 2048లో కృష్ణాలో 24.98, గోదావరిలో 35.77 టీఎంసీలు కలిపి మొత్తంగా 60.75 టీఎంసీలు అవసరం ఉంటుందని అంచనా వేసింది. ఈ అవసరాలకు తగ్గట్లు నీటిని తీసుకునేలా సహకరించాలంటూ రెండ్రోజుల కిందట గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం(ఆర్డబ్ల్యూఎస్) నీటి పారుదల శాఖను కోరింది. నీటిపారుదల శాఖ అందుకు సమ్మతం తెలుపుతూ మెమో జారీ చేసింది. -
గోదావరి జలాలతో చెరువులు నింపండి
మంత్రి హరీశ్రావుకు రైతుల వినతి రఘునాథపల్లి : ఆశించిన స్థాయిలో వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి బోర్లు, బావులు ఎత్తిపోయి పంట పొలాలు, చెరువులు బీడులుగా మారాయి. గోదావరి జలాలతో చెరువులు నింపి ఆదుకోవాలని మండలంలోని మంగళబండతండా, మేకలగట్టు, ఖిలాషాపూర్కు చెందిన రైతులు, పార్టీల నాయకులు మంగళవారం హైదరాబాద్లో ఉన్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావును కలిసి వినతిపత్రం అందించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య , పశువులకు నీరు లేక అలమటిస్తున్నాయని వివరించారు. ఖిలాషాపూర్ పటేల్ చెరువు, మేకలగట్టు మేకలమ్మ చెరువు, మండలగూడెం చెరువులను గోదావరి జలాలతో నింపితే భూగర్భ జలాలు పెరిగి తమ బతుకులు బాగుపడతాయని వేడుకున్నారు. స్పందించిన మంత్రి వెంటనే దేవాదుల సీఈకి ఫోన్ చేసి చెరువులను నింపాలని ఆదేశించినట్లు చెప్పినట్లు రైతులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు బానోతు గోపాల్నాయక్, ఆలేటి సురేందర్రెడ్డి, బానోతు భిక్షపతినాయక్, దొంగ మహిపాల్రెడ్డి, గడ్డం అంజయ్య, వెంకట్నాయక్, ఉడుత వెంకటయ్య, తిరుపతిరెడ్డి, ఆనందం, వంగాల చంద్రయ్య, బాల్రెడ్డి, ఆలేటి ఉపేందర్రెడ్డి, దేవేందర్రెడ్డి ఉన్నారు. -
ఆరు నూరైనా 'మల్లన్న' ఆగదు
నిజామాబాద్: ఆరు నూరైన మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం ఆగదు' అని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం నిజామాబాద్లో పోచారం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తి కావొద్దని కాంగ్రెస్, టీడీపీలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన మండిపడ్డారు. ముంపు ప్రాంతం లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం అనివార్యమని చెప్పారు. 800 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతుంటే.. విపక్షాలకు కనిపించడం లేదని మంత్రి పోచారం విమర్శించారు. -
గజ్వేల్కు ‘మిషన్ భగీరథ’ తొలిఫలం
దేశం దృష్టిని ఆకర్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ‘మిషన్ భగీరథ’ తొలి ఫలాన్ని మెదక్ జిల్లా గజ్వేల్ అందుకోబోతోంది. రూ.1055 కోట్లతో చేపట్టిన ఈ పథకం గజ్వేల్లో తుది దశకు చేరుకోగా...దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోనూ కొద్ది నెలల్లోనే పూర్తి చేయడానికి యంత్రాంగం కృషి చేస్తోంది. ఆగస్టు 7న ప్రధాని నరేంద్రమోదీ ఈ పథకాన్ని గజ్వేల్లో ప్రారంభించడానికి సన్నాహాలు సాగుతున్నాయి. గజ్వేల్ దాహార్తి తీరుస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ దినం కానుకగా 2015 జూన్ 2న గజ్వేల్ వాటర్గ్రిడ్కు(గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలు) రూ.1055 కోట్లు మంజూరు చేశారు. హైదరాబాద్కు గోదావరి జలాలను తరలించే పైప్లైన్ నుంచి నీటిని ట్యాపింగ్ చేసి ఈ ప్రాంతానికి అందించాలన్నది లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగా కొండపాకలోని హెచ్ఎండబ్ల్యూఎస్(హైద్రాబాద్ మెట్రో వాటర్ వర్క్)ప్రాంగణం నుంచి, ప్రజ్ఞాపూర్ వద్ద పైప్లైన్ నుంచి నీటిని ట్యాపింగ్ చేస్తున్నారు. ప్రజ్ఞాపూర్ నుంచి పైప్లైన్ను ట్యాపింగ్ చేసి ఆ నీటిని ఎత్తైన ప్రదేశంలో ఉన్న గజ్వేల్ మండలం కోమటిబండ అటవీ ప్రాంతంలోని సంప్హౌస్కు తరలించి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా గజ్వేల్ నియోజకవర్గంలోని 244 గ్రామాలు, గజ్వేల్ నగర పంచాయతీతో కలుపుకుని మరో 65 గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. - 14 మండలాలు.. 3 మున్సిపాలిటీలు గోదావరి జలాలను గజ్వేల్తో పాటు దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోని 14 మండలాల్లోగల 590 హాబిటేషన్లకు, మరో 3 మున్సిపాలిటీలకు నీటిని అందిస్తున్నారు. ఇందులో భాగంగానే గజ్వేల్ నియోజకవర్గంలో 793.76 కిలోమీటర్ల పొడవునా పైప్లైన్ల నిర్మాణం జరిగింది. 67, 275 నల్లా కనెక్షన్లు ఇవ్వడం లక్ష్యంగా ఉండగా ఇప్పటి వరకు 60,724 కనెక్షన్లను ఇవ్వగలిగారు. ప్రస్తుతం 106 గ్రామాల్లో న్యితం నల్లాల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 213 గ్రామాలకుగానూ 63,517 నల్లా కనెక్షన్లు ఇవ్వడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 7,450 కనెక్షన్లు ఇచ్చారు. సిద్దిపేట నియోజకవర్గంలోని 134 గ్రామాల్లో 42,168 నల్లా కనెక్షన్లకుగానూ ఇప్పటి వరకు 2,623 నల్లా కనెక్షన్లు ఇచ్చారు. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో పనులు పూర్తి కావడానికి మరో నాలుగు నెలలు పట్టే అవకాశముంది. దేశం దృష్టిని ఆకర్షించిన పథకం... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్గ్రిడ్ పథకం దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. పథకం తీరును పరిశీలించేందుకు ఎంతో మంది ప్రముఖులు గజ్వేల్కు వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో రెండ్రోజుల క్రితం గజ్వేల్లో పథకం తీరును ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వివరించి ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించడం...ఆయన సానుకూలంగా స్పందించటం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి ఆగస్టు 7న ఇక్కడ పర్యటించి ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించే అవకాశముందని తెలుస్తోంది. -
ప్రాజెక్టులు చుట్టొద్దాం
- కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల నిర్ణయం - నదీజలాల వివాదాలపై అవగాహనకు వచ్చేందుకే... - ప్రాజెక్టులు తమ పరిధిలోకొస్తే అజమాయిషీ ఎలా అనే దానిపై కసరత్తు సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలపై అవగాహనకు వచ్చేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు నిర్ణయించాయి. మరో 3, 4 రోజుల్లో వర్షాకాలం మొదలుకానుండటం, ఈ ఏడాది ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తెచ్చుకునే కసరత్తులు మొదలు కావడం, కేంద్రం నోటిఫై చేస్తే ప్రాజెక్టుల నిర్వహణను తామే చేపట్టాల్సి ఉండటంతో ముందుగా ప్రాజెక్టుల పర్యటనకు వెళ్లాలని బోర్డులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జూన్ 4 నుంచి రెండ్రోజులపాటు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేపట్టనున్న పర్యటనకు ముందు లేదా ఆ తర్వాత ప్రాజెక్టుల పరిధిలో పర్యటించేలా ప్రణాళిక రచించుకున్నట్లు సమాచారం. కృష్ణా ప్రాజెక్టుల పరిధిలోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల పరిధిలో నీటి వినియోగం, విడుదల, ప్రాజెక్టుల నిర్వహణపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య తీవ్ర విభేదాలు నెలకొనడం తెలిసిందే. ప్రాజెక్టులను నియంత్రణలోకి తెచ్చుకోవాలని కృష్ణా బోర్డుపై ఏపీ ఒత్తిడి తెస్తుంటే తెలంగాణ దాన్ని తిరస్కరిస్తోంది. అయితే ఏపీ వాదనకే మొగ్గు చూపిన బోర్డు వాటిని తమ నియంత్రణలోకి తెచ్చుకునేలా కసరత్తు చేస్తోంది. అదే జరిగితే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, నెట్టెంపాడు, కోయిల్సాగర్, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, భీమా, ఏఎమ్మార్పీ వద్ద మెజరింగ్ పాయింట్లూ బోర్డు నియంత్రణలోకి వెళ్తాయి. ఇందుకోసం ముందుగా సాగర్, శ్రీశైలం, జూరాల డ్యామ్ల ఏడాది నిర్వహణ ఖర్చు వివరాలతోపాటు హెడ్ రెగ్యులేటర్లు, పంప్హౌస్లు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, గేట్ల నిర్వహణ, విద్యుత్, జనరేటర్లు, డీజిల్, లిఫ్ట్ల వంటి వివరాలన్నింటిపై బోర్డు అంచనాకు రావాల్సి ఉంటుంది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చీఫ్ ఇంజనీర్ హోదాలో బోర్డుల చైర్మన్లు లేదా బోర్డు సభ్య కార్యదర్శులకు ఎక్కడైనా పర్యటించే వెసులుబాటు ఉంటుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. 4వ తేదీ తర్వాతే బోర్డుల పర్యటనలు! జూన్ 4 నుంచి రాష్ట్రంలో రెండ్రోజులపాటు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటించి కృష్ణా, గోదావరి నదుల పరిధిలోని ప్రాజెక్టుల స్థితిగతులపై అధ్యయనం చేయనుంది. కమిటీ పర్యటనకు ముందే ప్రాజెక్టుల పరిధిలో పర్యటించాలని కృష్ణా బోర్డు మొదట నిర్ణయించింది. అయితే కృష్ణా బోర్డు చైర్మన్ నాథన్ మంగళవారం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కమిటీ పర్యటన ముగిశాకే ప్రాజెక్టులను సందర్శించాలని బోర్డు సభ్యులు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు గోదావరి బోర్డు చైర్మన్ రామ్శరాణ్ జూన్ రెండో వారంలో ప్రాజెక్టులను సందర్శించి నీటి లభ్యతపై అవగాహనకు రావాలని నిర్ణయించారు. -
మరో నాలుగు గ్రామాలకు గోదారమ్మ
గడువుకు ముందే పైప్లైన్ కనెక్షన్ హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు గజ్వేల్: గడువుకు ముందే గజ్వేల్ మండలంలోని ధర్మారెడ్డిపల్లి, గిరిపల్లి, బయ్యారం, బెజుగామ గ్రామాలకు గురువారం రాత్రి గోదావరి జలాలను అందించారు. ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు నేతృత్వంలో ‘మిషన్ భగీరథ’ గజ్వేల్ ఈఈ రాజయ్య ఆయా గ్రామాల్లో గోదావరి జలాల పైప్లైన్ను లింక్ చేశారు. కొన్ని రోజులుగా దాహార్తితో అల్లాడుతున్న ఈ గ్రామాలకు ‘గోదారమ్మ’ రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ‘మిషన్ భగీరథ’ పనులు వేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. ఏప్రిల్ 30 నాటికి నియోజకవర్గంలోని 128 పంచాయతీలకు నీటి సరఫరా అందించేందుకు ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ‘మిషన్ భగీరథ’ అధికారులు చురుకుగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా గోదావరి జలాలను అందుకున్న ఆయా గ్రామాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. -
భగీరథ యత్నం..!
కోటి ఎకరాల ఆయకట్టు లక్ష్యం.. లక్ష కోట్ల ఖర్చు ఐదేళ్లలో ప్రాజెక్టుల పూర్తి.. ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు నూతన జల విధానంతో సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం దసరా తర్వాత ప్రజలు, పార్టీల ముందుకు.. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్ర హక్కుగా కలిగిన నికర, మిగులు జలాల్లోని నిర్ణీత వాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తేవడం.. సుమారు రూ.లక్ష కోట్ల ఖర్చుతో కోటి ఎకరాలకు పైగా సాగునీరు అందించడం.. నియోజకవర్గానికి లక్ష ఎకరాల భూమికి సాగుయోగ్యత కల్పించడం లక్ష్యంగా రాష్ట్ర జల విధానం ముస్తాబైంది. ఐదేళ్లలో భారీ, మధ్యతరహా, చిన్నతరహా ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసేలా భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ప్రభుత్వం.. రాష్ట్ర పరీవాహకంలో లభ్యతగా ఉన్న ప్రతి నీటిచుక్కను ఆయకట్టుకు మళ్లించడం, అవసరాలకు తగినట్లుగా నిల్వ, వినియోగం చేసుకునేలా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. వరద ఉండే కొద్దిరోజుల్లోనే గరిష్ట స్థాయిలో నీటిని ఒడిసిపట్టుకునేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈ నేపథ్యంలో... కొత్త రాష్ట్రానికి జల విధానం అవసరమేమిటి, తక్షణం ప్రభుత్వం ముందున్న లక్ష్యాలు, రీ ఇంజనీరింగ్ ఎందుకు అవసరమవుతోంది, కొత్త, పాత ప్రాజెక్టుల పూర్తికి విధించుకున్న లక్ష్యాలు, బడ్జెట్, సమస్యలపై అటు ప్రజలకు, ఇటు పార్టీలకు స్పష్టతనిచ్చేలా నివేదిక సిద్ధం చేసింది. ఈ జల విధానంలో పొందుపరిచిన విషయాలను ‘సాక్షి’ సేకరించింది. జల విధానం ఎందుకంటే? రాష్ట్రంలో గోదావరి పరీవాహకం 69 శాతం, కృష్ణా పరీవాహకం 68.5 శాతం ఉన్నా... ఉమ్మడి ఏపీలో ఇక్కడి ప్రాజెక్టులకు అన్యాయం జరిగింది. తెలంగాణ బేసిన్ల నుంచి నీటిని కోస్తాంధ్రకు బదలాయించి అక్కడ రెండు పంటలకు నీళ్లిచ్చారు, తెలంగాణలో ఒక పంటకే నీరిచ్చా రు. 50 ఏళ్లలో చెరువుల కింద సాగు తగ్గింది. ప్రాజెక్టుల కిందా సాగు పెరగలేదు. ఫలితంగా భూగర్భ జలాల వినియోగం పెరిగి.. నీటి మట్టాలు గణనీయంగా తగ్గాయి. ఈ దృష్ట్యా గోదావరి, కృష్ణా నదుల్లోని 1,296 టీఎంసీల నికర, మిగులు జలాలను సమర్థవంతంగా వినియోగించుకుని కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు నూతన జల విధానాన్ని రూపొందించుకుంది. అసమాన నీటి పంపిణీ సమస్యను పరిష్కారించి.. తగిన ప్రణాళిక, నిర్వహణతో నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడమే ఈ విధాన ఆశయం. ఖర్చు తగ్గించేందుకే ఇప్పటికే నిర్మాణంలోని ప్రాజెక్టులను పూర్తి చేసి, కొత్తవాటిని నిర్మిం చి.. మొత్తంగా 1.12 కోట్ల ఎకరాలకు నీరివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వ్యయం తగ్గించడం, ఎత్తిపోతల ఖర్చు తగ్గించడం, సాగు, ఇతర అవసరాలకు ఎక్కువ రోజులు నీటిని అందుబాటులో ఉంచడం, గ్రావిటీ ద్వారా ఎక్కువ ఆయకట్టుకు నీరందించడం, ముంపు తక్కువగా ఉండేలా చూడటానికి రీ ఇంజనీరింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఇక భూగర్భ జలమట్టం పెంపునకు ఆధునిక సాంకేతిక పద్ధతులను తీసుకురావాలని, భూగర్భ జలాల పెంపునకు సంప్రదాయ పద్ధతులను ప్రోత్సహించడం, పూర్తయిన ప్రాజెక్టుల్లో నీటి వినియోగాన్ని గరిష్ట స్థాయికి పెంచడం, వివిధ బేసిన్ల మధ్య నీటిని బదిలీ చేసి సమతుల్యత సాధించడం ప్రభుత్వ ప్రాధాన్యంగా చేపట్టిన అంశాలు. నాలుగు ప్రాజెక్టులు కీలకం దేవాదుల, ప్రాణహిత-చేవెళ్ల, శ్రీరాంసాగర్ వరద కాలువ, ఇందిరా, రాజీవ్సాగర్ దుమ్ముగూడెం పనులు చేపట్టినా ఇప్పటి వరకు లక్ష్యాలను చేరుకోలేదు. కంతనపల్లికి 50 టీఎంసీల మేర కేటాయింపులున్నా ఇంతవరకు నీటి వినియోగం జరగలేదు. ఈ ప్రాజెక్టు ద్వారా వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో 7.5 లక్షల ఎకరాలకు నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. వరంగల్ జిల్లా ఏటూరునాగారం వద్ద నిర్మించదలిచిన 22.5 టీఎంసీల బ్యారేజీ నిర్మాణమే పూర్తి చేయలేదు. నిర్దేశిత 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలంటే రెండు మూడు రిజర్వాయర్లు అవసరం. వాటిని ఎక్కడ చేపట్టాలన్నది తేలలేదు. గోదావరిపై దేవాదుల ప్రాజెక్టు ద్వారా 38.182 టీఎంసీల నీటిని ఎత్తిపోసి.. 6.21 లక్షల ఎకరాలకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే నిర్ణీత నీటి కేటాయింపులకు, ఆయకట్టు లక్ష్యానికి పొంతన కుదరకపోవడం తో నీటి కేటాయింపులను 60 టీఎంసీలకు పెంచారు. అయినా ఈ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిపై గందరగోళం కొనసాగుతోంది. ఎందుకం టే దేవాదుల ఆయకట్టు మధ్యలో కొంత ఎస్సారెస్పీ వరద కాల్వ ఆయకట్టు ఉంది. తర్వాత మళ్లీ దేవాదుల ఆయకట్టు ఉంది. కొన్ని చోట్ల 2 ప్రాజెక్టులకు ఒకే ఆయకట్టు ఉంది. 160 టీఎంసీలు వినియోగించుకునే ప్రాణహిత-చేవెళ్ల బ్యారేజీని తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించేందుకు మహారాష్ట్ర వ్యతిరేకించడంతో మేటిగడ్డకు మార్చారు. ఈ ప్రాజెక్టుకు ఏకంగా 16 రిజర్వాయర్లను 124 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించేందుకు కసరత్తు పూర్తయింది. దుమ్ముగూడెం ప్రాజెక్టులు అంతర్రాష్ట్ర ప్రాజెక్టులుగా మారడంతో కొత్తగా రోళ్లపాడు, బయ్యారం వద్ద బ్యారేజీలను నిర్మించి, ఖమ్మం జిల్లా అంతా ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. గోదావరిలో కోలాటం.. కృష్ణాలో జంజాటం గోదావరిలో రాష్ట్రానికి పుష్కలంగా నీటి కేటాయింపులున్నా... ప్రాజెక్టులు పూర్తికాక నీటిని వినియోగించుకోలేక పోతున్నాం. మరోవైపు కృష్ణాలో కేటాయింపులు లేక నీటి కోసం పోరాడుతున్నాం. 1956కు ముందటి హైదరాబాద్ రాష్ట్రానికి కృష్ణా బేసిన్లో 542.79 టీఎంసీల మేర కేటాయింపులు ఉండేవి. అందులో 175 టీఎంసీల మేర గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలున్నా ఉమ్మడి ఏపీలో అలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఆ తర్వాత బచావ త్ ట్రిబ్యునల్ నీ టి కేటాయింపుల్లో ఎక్కువగా ఏపీకే లబ్ధి చేకూరింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు ప్రస్తు తం 299 టీఎంసీల మేర కేటాయింపులున్నాయి. ఇందులో ఒక్క జూరాలకు మినహా కరువుపీడిత ప్రాంతాలకు, ఫ్లోరైడ్ ప్రాంతాలకు నీటి కేటాయింపులు లేవు. బచావత్ ప్రకారం ఆర్డీఎస్ కెనాల్కు 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉన్నా... ఏపీ, కర్ణాటకల తీరుతో అందడం లేదు. ప్రస్తుతం నీటిని తిరిగి కేటాయించాలంటూ కోర్టులు, ట్రిబ్యునల్లో రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతోంది. ఇక గోదావరిలో లభ్యత జలాలు పుష్కలంగా ఉన్నా... ఎగువ రాష్ట్రాల తీరుతో దిగువకు నీరు రావడం లేదు. ముఖ్యంగా మహారాష్ట్ర కట్టిన అనధికార ప్రాజెక్టులతో శ్రీరాంసాగర్కు నీరు చేరడం లేదు. సింగూరు జలాలను పూర్తిగా హైదరాబాద్ తాగునీటి అవసరాలకే మళ్లిస్తుండటంతో దిగువన నిజాంసాగర్కు నీటి విడుదల జరగడం లేదు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు మహారాష్ట్ర అభ్యంతరాలతో జాప్యం జరుగుతోంది. నదుల అనుసంధానం పేరిట గోదావరి మిగులు జలాలను కృష్ణాకు తరలించాలని కేంద్రం భావిస్తోంది. కానీ నిజానికి గోదావరిలో ఎలాంటి మిగులు జలాలు లేవు. చేయాల్సింది మరెంతో.. భారీ, మధ్యతరహా సహా ప్రధాన ప్రాజెక్టులన్నింటినీ రూ.1.30 లక్షల కోట్లతో నిర్మిస్తున్నారు. ఇందులో ఇప్పటివరకు రూ.41వేల కోట్లు ఖర్చు చేయగా, మరో రూ.87 వేల కోట్ల వ్యయం చేయాల్సి ఉంది. ఇప్పటివరకు సుమారు 60 లక్షల ఎకరాల మేర నీరివ్వాల్సి ఉండగా.. 6.87లక్షల ఎకరాల మేర మాత్రమే ఇచ్చారు. ఇక చిన్న నీటి వనరుల కింద 20 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉన్నా... సాగులో ఉన్నది కేవలం 10 లక్షల ఎకరాలే. ఇక్కడా పూర్తిస్థాయిలో ఆయకట్టును వృద్ధి చేయాల్సి ఉంది. ఇక ప్రాజెక్టులకు అదనంగా బ్యారేజీలు నిర్మిస్తే మరింత ఆయకట్టు పెరుగుతుంది. మొత్తంగా కోటి ఎకరాల కొత్త ఆయకట్టు ఉంటుంది. మరోవైపు కొత్తగా పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలతో మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలకు రెండు మూడేళ్లలోనే నీరివ్వాలని సంకల్పించారు. అనుకున్న సమయానికి పూర్తి చేయాలంటే ప్రభుత్వం చేయాల్సింది ఎంతో ఉంది. భారీగా విద్యుత్ వ్యయం.. రాష్ట్రంలో చేపడుతున్న ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరాలు భారీగా ఉండనున్నాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్నవాటితోపాటు కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులకు కలిపి దాదాపు 10 వేల మెగావాట్ల విద్యుత్ అవసరంకాగా.. దీనికోసం ఏటా రూ.10వేల కోట్ల మేర ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయి. 15 ఎత్తిపోతల పథకాలతో 370 టీఎంసీల నీటిని వినియోగించి.. 40.21లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, 1.34లక్షల ఎకరాల పాత ఆయకట్టుకు నీరివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకే 5,903 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఇవి పూర్తయి విద్యుత్ వాడుకుంటే.. యూనిట్కు రూ.5.37 చొప్పున లెక్కించినా ఏటా రూ.7,640 కోట్ల మేర ఖర్చవుతుంది. ఇక ప్రాణహిత, పాలమూరు ఎత్తిపోతలకు కలిపి మరో 5 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం. వీటికి మరో రూ.3వేల కోట్ల ఖర్చు చేయాల్సి ఉంటుంది. విద్యుత్ ధర పెరిగితే ఖర్చు మరింతగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎత్తిపోతలను తగ్గించే మార్గాలను అన్వేషిస్తోంది. ‘లక్ష’ సాగు 61 నియోజకవర్గాల్లోనే.. రాష్ట్రంలో 2.76 కోట్ల ఎకరాల భూమి ఉండగా.. సాగుకు అనువైన భూమి 1.67 కోట్ల ఎకరాలు. ప్రస్తుతం 46.99 లక్షల ఎకరాలు సాగులో ఉంది. హైదరాబాద్ మినహా 9 జిల్లాలోని 104 నియోజకవర్గాల్లో 61 నియోజకవర్గాల్లోనే లక్ష ఎకరాలకు పైగా సాగులో ఉంది. 75 వేల ఎకరాలకు పైగా సాగుభూమి ఉన్నవి 11 నియోజకవర్గాలు, 50 వేల ఎకరాలకు పైగా ఉన్నవి 12 ఉన్నాయి. 20 నియోజకవర్గాల్లో 50 వేల ఎకరాల కంటే తక్కువగా సాగులో ఉంది. అన్ని నియోజకవర్గాల్లో లక్ష ఎకరాల సాగు జరిగేలా నూతన జల విధానం రూపొందింది. భూసేకరణే గుదిబండ నిర్మాణంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో రిజర్వాయర్, డ్యామ్లు, కాలువల పనులు ముగిసినప్పటికీ ఇతర శాఖల పరిధిలో తేల్చుకోవాల్సిన అంశాలు, భూసేకరణ పూర్తికాకపోవడం వంటివి ఆయకట్టుకు నీరివ్వలేని పరిస్థితికి కారణమవుతున్నాయి. తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులు, ప్రధాన ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రంలో భూసేకరణ అవసరమైన ప్రాజెక్టులు 36 వరకు ఉండగా... వాటిలో ఇప్పటివరకు 7 ప్రాజెక్టులకు మాత్రమే భూసేకరణ పూర్తిచేయగలిగారు. మిగతా ప్రాజెక్టులకు సంబంధించి సేకరణ పెండింగ్లోనే ఉంది. మొత్తంగా 36 ప్రాజెక్టులను కలిపి 3,09,132 ఎకరాల మేర భూమి కావాలని గుర్తించగా.. ఇప్పటిదాకా 2,14,551 ఎకరాలు సేకరించారు. మరో 94,580 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. కొత్తగా ఇచ్చిన జీవో 123తో సేకరణ మొదలుపెట్టినా ఆశించిన సమయంలోగా పూర్తిచేయడం కష్టమే. చిన్ననీటి వనరులపైనా దృష్టి రాష్ట్రంలో చిన్ననీటి వనరులకు కృష్ణా, గోదావరి నదుల నుంచి 262 (కృష్ణాలో 97, గోదావరిలో 165) టీఎంసీలను పూర్తిస్థాయిలో సద్వినియోగ పరుచుకొని చెరువుల కింద ప్రతి ఎకరాన్ని తడపడమే లక్ష్యంగా ప్రభుత్వం మిషన్ కాకతీయను రూపొందించుకుంది. గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేసేలా ముందుకు వెళ్లేలనేది ప్రభుత్వ ప్రణాళికలో భాగం. సమగ్ర సర్వే ద్వారా గుర్తించిన 46,531 చిన్న నీటివనరుల కింద మొత్తంగా 20.09 లక్షల ఎకరాల ఆయకట్టును రూ.20 వేల కోట్లతో వృద్ధిలోకి తేవాలని.. ఏడాదికి 20శాతం చెరువుల (సుమారు 9వేలు) చొప్పున పునరుద్ధంచాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందులో భాగంగా తొలి ఏడాది రూ. 2వేల కోట్లతో 9,651 చెరువుల పనులను చేపట్టింది. ఇందులో 8 వేల చెరువుల పనులు పూర్తయ్యాయి. ఇక చెరువుల కబ్జాలకు పాల్పడినా, చెరువులను దెబ్బతీసే చర్యలకు పాల్పడినా కనీసం ఏడాది జైలు శిక్ష పడేలా ముసాయిదా చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది. నదుల అనుసంధానం.. దక్షిణాదిలోని మహానది-గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. గోదావరిలో 530 టీఎంసీల మిగులు జలాలున్నాయని చెబుతూ రాష్ట్ర పరిధిలో ఇచ్చంపల్లి (గోదావరి)-నాగార్జునసాగర్(కృష్ణా), ఇచ్చంపల్లి-పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు... అటునుంచి పెన్నా, కావేరీలకు తరలించాలని ప్రణాళిక రూపొందించారు. అయితే ఇక్కడ లభ్యంగా ఉన్న 980 టీఎంసీల నీరు రాష్ట్ర అవసరాలకే సరిపోతుందని, ఎప్పుడో 30 ఏళ్ల కిందట చేసిన అధ్యయనాన్ని పట్టుకొని గోదావరిలో అదనపు జలాలున్నాయనేది సరికాదని తెలంగాణ వాదిస్తోంది. గోదావరిపై కొత్తగా చేపడుతున్న ప్రాణహిత-చేవెళ్ల(160 టీఎంసీలు), ఎల్లంపల్లి (60టీఎంసీలు), దేవాదుల (38 టీఎంసీలు), కంతనపల్లి (50టీఎంసీలు) సహా ఇతర ప్రాజెక్టుల నీటి అవసరాలను వివరిస్తూ దీన్ని అడ్డుకునే యత్నం చేస్తోంది. - సోమన్నగారి రాజశేఖర్రెడ్డి, సాక్షి ప్రతినిధి లక్ష్యాలపై వరల్డ్బ్యాంకుకు నివేదిక రాష్ట్రంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న, కొత్తగా చేపడుతున్న సాగునీటి ప్రా జెక్టులకు ఒక్కో ఆర్థిక సంవత్సరంలో ఎన్ని నిధులు అవసరమనే వివరాలను ప్రభుత్వం వరల్డ్బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో తెలిపింది. ప్రాధాన్యతా క్రమంలో ఏయే ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తిచేసేదీ, వాటికి అవసరమై న నిధులు, వాటిని ఏరీతిన ఖర్చు చేయనున్నన్న అంశాలను పేర్కొంది. ఈ నివేదిక మేరకు... రాష్ట్రంలోని ప్రాజెక్టుల పూర్తికి రూ.1.03 లక్షల కోట్లు అవసరం. ప్రస్తుత ప్రభుత్వ ఐదేళ్ల గడువు ముగిసేనాటికి (అంటే 2018-19 ఆర్థిక సంవత్సరానికి) సుమారు రూ.55,931కోట్లు అవసరం. మిగతా రూ.47,120 కోట్లు తర్వాతి మూడేళ్లలో వెచ్చించాల్సి ఉంటుంది. వరల్డ్ బ్యాంకుకు చెప్పినట్లే ప్రభుత్వం ప్రాజెక్టులపై ఏటా రూ.25 వేలకోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించింది. అంటే వచ్చే మూడేళ్లలోనే రూ.75వేల కోట్ల మేర కేటాయించే అవకాశముంది. వీటికి తోడు కేంద్రం నుంచి వచ్చే ఏఐబీపీ, ట్రిపుల్ఆర్ నిధులు, వివిధ బ్యాంకులు అందించే రుణాల లక్ష్యాలను ప్రభుత్వం జల విధానంలో వివరించనుంది. -
కృష్ణా జిల్లాలోకి గోదావరి నీరు
నూజివీడు: పోలవరం కుడికాలువ ద్వారా గోదావరి జలాలను నూజివీడు మండలం పల్లెర్లమూడి వద్ద కృష్ణా జిల్లాలోకి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విడుదల చేశారు. కాలువ వద్ద మంత్రి బుధవారం పూజలు నిర్వహించి గోదావరి జలాలకు హారతిచ్చారు. తొలుత పోలవరం కాలువకు కృష్ణా-పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దులో అడ్డంగా మట్టికట్ట ఏర్పాటు చేశారు. ఆ కట్టకు గండికొట్టి మంత్రి జలాలను కృష్ణా జిల్లాలోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎంపీ మాగంటి బాబు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
గోదావరి జలాలపైనే రాష్ట్ర భవిష్యత్తు
సెప్టెంబర్ నాటికి రాయలసీమకు ‘పట్టిసీమ’ నీళ్లు కుప్పం పర్యటనలో చంద్రబాబు చిత్తూరు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర భవిష్యత్తు గోదావరి జలాలపైనే ఆధారపడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లాలోని కుప్పంలో రెండురోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన ‘చంద్రన్న సంక్షేమబాట’ సభలో సీఎం ప్రసంగించారు. ఏటా 3వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని కరువు ప్రాంతాలకు అందించేందుకే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని చెప్పారు. సెప్టెంబర్ నాటికి రాయలసీమకు పట్టిసీమ నీటిని తరలిస్తామన్నారు. హంద్రీ-నీవాకోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నామని, ఈ ప్రాజెక్టును పూర్తి చేసి అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీటిని తరలిస్తామని ఆయన చెప్పారు. కుప్పంకు వచ్చే ఏడాది మార్చిలోపు, ఆ తరువాత చిత్తూరుకు నీరందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సోమశిల, స్వర్ణముఖి ద్వారా తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాలకు నీటిని మళ్లిస్తామన్నారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదుల్ని అనుసంధానం చేయనున్నట్లు సీఎం చెప్పారు. అవినీతికి తావులేకుండా చేస్తా.. డ్వాక్రా మహిళలకు జనరిక్ మందుల షాపులు ఇస్తున్నట్టు సీఎం తెలిపారు. అలాగే పొట్టేళ్ల పెంపకం, మీ-కోడి కార్యక్రమాలు కూడా వారికే ఇస్తున్నామని పేర్కొన్నారు. వచ్చేఏడాది మార్చి 15లోపు రాష్ట్రంలో ఇంటింటికీ 15 ఎంబీపీఎస్ సామర్ధ్యం కలిగిన ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రెవెన్యూశాఖతోపాటు అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేసి అవినీతికి తావులేకుండా చేస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దళితుని ఇంట సీఎం భోజనం కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మంగళవారం అనిమిగానిపల్లిలో దళితుడు వుునికృష్ణ కుటుంబంతో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా సీఎం వూట్లాడుతూ రూ.ఐదువేల కోట్లతో ఎస్సీలకు అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. -
గోదావరికి కొత్త రూట్..!
సాక్షి,సిటీబ్యూరో: గోదావరి జలాలు సిటీలో గలగలా పారించేందుకు జలమండలి అధికారులు కొత్త రూట్ సిద్ధం చేస్తున్నారు. జలమండలి ప్రాజెక్టు సమీక్షలో సీఎం చేసిన సూచనల ఆధారంగా కసరత్తు ప్రారంభించారు. కొత్త రూట్లో పైప్లైన్ల ఏర్పాట్లపై సాధ్యాసాధ్యాలను నివేదిక రూపొందించేపనిలో పడ్డారు. విద్యుత్ ఖర్చు తగ్గించడంతో పాటు భూమ్యాకర్షణ శక్తి(గ్రావిటీ)ద్వారానే రాజధాని నగరానికి నీటిని తరలించవచ్చు. పైపులైను మార్గంలోని పలు గ్రామాల్లో నీటి సమస్య తీరనుంది. వాటర్గ్రిడ్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ వరదాయిని గోదావరి మంచినీటి పథకానికి కూడా సరికొత్త మార్గనిర్దేశం చేశారు. ఇటీవల జలమండలి ప్రాజెక్టులపై సుదీర్ఘంగా సమీక్షించిన ఆయన ఈ పథకానికి కొత్త మార్గాన్ని సూచించారు. కేసీఆర్ సూచించారు. సీఎం ఆదేశాలతో జలమండలి అధికారులు ప్రతిపాదనులు రూపొందిస్తున్నారు. కొత్త మార్గం ఇలా.. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నగర శివార్లలోని శామీర్పేట్ వరకు రూ.3500 కోట్ల అంచనా వ్యయంతో 186 కి.మీ మార్గంలో గోదావరి మంచినీటి పథకం పైప్లైన్ పనులను 2008లో ప్రారంభించిన విషయం విదితమే. ఈ పథకం మొదటి దశ ద్వారా నగరానికి 10 టీఎంసీల నీటిని తరలించాలని లక్ష్యం నిర్దేశించారు. పాత మార్గం ప్రకారం కరీంనగర్ జిల్లాలోని ఎల్లంపల్లి-బొమ్మకల్-మల్లారం నీటిశుద్ధికేంద్రం-కొండపాక-ఘన్పూర్-శామీర్పేట్(నగర శివారు) మార్గంలో ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎం సూచనల ప్రకారం కొత్త మార్గంలో బొమ్మకల్రిజర్వాయర్ను మినహాయించి ఎల్లంపల్లి(126 మీటర్ల ఎత్తున్న కాంటూరు)నుంచి కరీంనగర్ జిల్లాలోని ధర్మారం జగిత్యాల మార్గంలో ఎత్తై కొండ ప్రాంతం ఎండపల్లి(480మీటర్ల ఎత్తు)కి నీటిని పంపింగ్ చేసి అక్కడి నుంచి భూమ్యాకర్షణ శక్తి(గ్రావిటీ) ఆధారంగా 10 టీఎంసీల నీటిని మల్లారం నీటి శుద్ధి కేంద్రానికి తరలించాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. దీంతో ఆయన ఆదేశాలతో కొత్త మార్గం సాధ్యాసాధ్యాలపై జలమండలి అధికారులు కసరత్తు చేస్తున్నారు. గోదావరి పథకం తొలిదశను ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర సర్కారు లక్ష్యం నిర్దేశంచడంతో గోదావరి పథకం రెండోదశలో భాగంగా ఈ కొత్త మార్గం గుండా నీటిని తరలించాలా ? లేదా తొలిదశలోనే ఈ మార్గం గుండా నగరానికి నీటిని తరలించాలా ? అన్న అంశంపై అధికారులు పరిశీలనచేయనున్నారు. క్షేత్రస్థాయి పర్యటన తరవాత కొత్త మార్గంపై సీఎంకు నివేదిస్తామని అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం తాము క్షేత్రస్థాయి పరిశీలన మాత్రమే జరుపుతున్నామని స్పష్టంచేశారు. నూతన మార్గంలో నేల వాలును తెలిపే కాంటూరు మ్యాపులను అధ్యయనం చేసిన తరవాతనే కొత్త మార్గంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. తీరనున్న పలు గ్రామాల దాహార్తి.. సీఎం సూచనల ప్రకారం గోదావరి ప్రస్తుత మార్గాన్ని స్వల్పంగా మార్చిన పక్షంలో పైప్లైన్కు ఆనుకొని ఉన్న కరీంనగర్,మెదక్ జిల్లాలకు చెందిన పలు గ్రామాల దాహార్తి తీరనుందని, అక్కడి జిల్లా గ్రిడ్లకు ఈ మార్గం దాహార్తిని తీర్చే వరదాయినిగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త మార్గం గుండా పైప్లైన్లు వేస్తే నీటి పంపింగ్కు అయ్యే విద్యుత్ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. -
గజ్వేల్కు గోదావరి జలాలు
గజ్వేల్: తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్న గజ్వేల్ నియోజకవర్గాన్ని గోదారమ్మా కరుణించనుంది. ప్రజలకు గోదావరి నీటిని అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన కసరత్తులో సంబంధిత యంత్రాంగం నిమగ్నమై ఉంది. నియోజకవర్గంలోని గజ్వేల్, కొండపాక, జగదేవ్పూర్, వర్గల్, ములుగు మండలాల్లో సుమారు 60 కిలోమీటర్ల మేర గోదావరి పైప్లైన్ విస్తరించి ఉండగా దీనిని ట్యాప్ చేసి ఇక్కడ దాహార్తి తీర్చడానికి అవసరమైన టీఎంసీల నీటిని తీసుకోనున్నారు. ఈ విషయాన్ని గురువారం గజ్వేల్లో పర్యటించిన మంత్రి హరీష్రావు వెల్లడించారు. ‘గోదావరి’ ట్యాపింగ్ అంశంపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడం గమనార్హం. జంట నగరాల్లోని కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కాప్రా, మల్కాజిగిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంత్లాల్లో తాగనీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గోదావరి సుజల స్రవంతి పథకాన్ని రూ. 3,375కోట్ల అంచనాల వ్యయంతో అంకురార్పణ చేశారు. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి 10 టీఎంసీల నీటిని తరలించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 186 కిలోమీటర్ల మేర పైప్లైన్ను విస్తరించడానికి పనులు వేగంగా సాగుతున్నాయి. కొన్నిచోట్ల పూర్తి కావస్తున్నాయి. 2014లోగా పథకాన్నిపూర్తిచేయాలనే సంకల్పంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో రాజీవ్ రహదారిని ఆనుకుని ఈ పనులు సాగుతున్నాయి. పైప్లైన్ విస్తరణ, భూసేకరణ పరంగా గజ్వేల్ నియోజకవర్గంలోనే ఎక్కువ నష్టం జరుగుతోంది. నియోజకవర్గంలోని కొండపాక, జగదేవ్పూర్, గజ్వేల్, వర్గల్, ములుగు మండలాల్లో సుమారు 60 కిలోమీటర్ల పొడవునా పైప్లైన్ విస్తరించి ఉంది. అదేవిధంగా మొత్తం సేకరిస్తున్న 1,800 ఎకరాల భూమిలో ఈ నియోజకవర్గంలోనే 500 ఎకరాలకు పైగా సేకరించారు. సింగూరుకు ప్రత్యామ్నాయంగా ‘గోదావరి’.... గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో దశాబ్దాల కాలంగా నెలకొన్న మంచినీటి సమస్యకు తెరదించేందుకు సింగూరు నుంచి పైప్లైన్ ద్వారా ఇక్కడికి నీటిని తీసుకురావాలని తొలుత భావించారు. ఇందుకోసం రూ.150 నుంచి 200 కోట్లు అవసరమవుతుందని, నిధులు విడుదల చేసినా...ఈ పథకం నిర్వాహణకు నెలకు కరెంటు బిల్లుల రూపేణా రూ.కోటికిపైగా చెల్లించాల్సి వస్తుందని అంచనా వేశారు. నెలకు రూ.కోటి కరెంట్ బిల్లులు చెల్లించాల్సి వస్తే పథకాన్ని నడపటం భారంగా మారుతుందని, ఫలితంగా ప్రజలపై కూడా పన్నులు వేయాల్సిన పరిస్థితి అనివార్యమయ్యే అవకాశముంది. అందువల్లే సింగూరు పథకానికి ప్రత్యామ్నాయంగా ‘గోదావరి’ సుజల స్రవంతి ట్యాపింగ్కు ప్రాధాన్యతనిస్తున్నట్లు మంత్రి హరీష్రావు వెల్లడించారు. ఈ పథకం పైప్లైన్ను ట్యాప్చేసి నీటిని పొందగలిగితే గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడమేకాక నియోజకవర్గంలో దాహార్తితో అల్లాడుతున్న మరికొన్ని గ్రామాలకు కూడా మంచినీటిని అందించవచ్చని భావిస్తున్నారు. ఈ అంశాన్ని పలు సందర్భాలలో ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించడం, ఈ వ్యవహారంపై సీఎం దృష్టికి వెళ్లడంతో తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి. గజ్వేల్ నియోజకవర్గ రూపురేఖలు మార్చడమే కాకుండా, మరో రెండేళ్ల తర్వాత తన సొంత నియోజకవర్గంలో మంచినీటి సమస్య కారణంగా మహిళలు ఖాళీబిందెలతో రోడ్డెక్కితే తన పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ జూన్ 4న గజ్వేల్లోని ప్రజ్ఞాగార్డెన్స్లో నిర్వహించిన సమీక్షలో సంచలన ప్రకటన చేసిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో నియోజకవర్గంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడానికి అవసరమైన మార్గాలను కనుగొనడంలో భాగంగా ‘గోదావరి’ పథకాన్ని వర్తింపజేయడానికి ఆదేశాలిచ్చారు. -
పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
రామన్నగూడెం వద్ద 6.59 మీటర్లకు చేరిన వరద నీరు ఏటూరునాగారం : ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద వరద నీరు క్రమేపీ పెరుగుతోంది. బుధవారం పుష్కరఘాట్ వద్ద నీటి మట్టం 6.59 మీటర్లకు చేరింది. ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మూడు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు గోదావరమ్మ పరవళ్లుతొక్కుతూ ప్రవహిస్తోంది. గత నెలలో ఏడారిగా మారిన గోదావరి నది.. ఇప్పుడు జలకళను సంతరించుకుంది. గోదావరిలో నీరు క్రమేపీ పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద నీటి మట్టం 8.50 మీటర్లుకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ధర్మసాగర్కు చేరిన గోదావరి జలాలు ధర్మసాగర్ : దేవాదుల పైపులైన్ ద్వారా గోదావరి జలాలు ధర్మసాగర్ రిజర్వాయర్కు చేరాయి. బుధవారం ఉదయం ఏటూరునాగారంలోని దేవాదుల వద్ద జె. చొక్కారావు ఎత్తిపోతల ప్రాజెక్టులోని ఇన్టేక్వెల్ నుంచి మోటార్లను ఆన్ చేయటంతో తొలుత భీంఘన్పూర్ రిజర్వాయర్ చేరుకొగా, అక్కడి నుంచి పులుకుర్తి పంప్ హౌజ్ కు అనంతరం బుధవారం రాత్రి 8.10 గంటలకు ధర్మసాగర్ రిజర్వాయర్కు గోదావరి జలాలు చేరుకున్నాయి. భద్రకాళి, వడ్డేపల్లి చెరువులకు కూడా పంపింగ్ వరంగల్ అర్బన్ : దేవాదుల నుంచి గోదావరి జలాలలను ధర్మసాగర్ రిజర్వాయర్తోపాటు భద్రకాళి, వడ్డేపల్లి చెరువులకు సామర్థ్యం మేరకు పంపింగ్ చేసే అవకాశం ఉంటుందని బల్దియా ఇంజినీర్లు తెలిపారు. దేవాదుల ఇన్టేక్ వెల్ వద్ద నుంచి ఒక టీఎంసీ నీటిని పంపింగ్ చేస్తే మూడు జలాశయాలు జలకళ సంతరించుకుంటాయని, దీంతో మరో ఆరు నెలల పాటు నగర వాసులకు తాగునీటికి ఢోకా ఉండదని పేర్కొంటున్నారు. కాగా, కరీంనగర్ ఎల్ఎండీ నుంచి నీటి విడుదలకు బ్రేక్ పడింది. వారం రోజుల పాటు కాకతీయ కెనాల్ ద్వారా నీటి సరఫరా చేసిన ఎల్ఎండీ ఇంజినీర్లు.. మరమ్మతుల పేరుతో నీటి విడుదలను ఈనెల 20న నిలిపివేశారు. ప్రస్తుతం కాకతీయ కెనాల్లో ఉన్న నీటి నిల్వలను ఫిల్టర్బెడ్ల ద్వారా శుద్దీకరణ చేసి పంపింగ్ చేస్తున్నారు. -
అందని ద్రాక్షగా గోదావరి జలాలు
శుద్ధ జలాల కోసం ఎదురుచూస్తున్న మూడు మండలాల ప్రజలు డీఫ్లోరైడ్ ప్రాజెక్టు ప్రారంభించి మూడు నెలలైనా గొంతు తడపని నీళ్లు వెక్కిరిస్తున్న లీకేజీలు శాయంపేట, న్యూస్లైన్ : లక్ష్యం ఎంత గొప్పదైనా చిత్తశుద్ధి లేకపోతే ప్రయోజనం ఉండదని చెప్పడానికి మండలంలోని జోగంపల్లి వద్ద ఏర్పాటు చేసిన డీఫ్లోరైడ్ ప్రాజెక్టు మంచి ఉదాహరణ. ఏళ్లు గడుస్తున్నా శుద్ధి చేసిన గోదావరి జలాలు ప్రజల గొంతును తడపలేకపోతున్నాయి. మొదటి దశలో రూ. 9కోట్లతో పనులు ప్రారంభించిన అధికారులు అన్ని పనులు పూర్తయినట్లు ప్రకటించడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 18న అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆర్భాటంగా దీనిని ప్రారంభించారు. అయితే అప్పటి నుంచే పనుల్లో నాణ్యత కూడా బయటపడుతూ ఉంది. ట్రయల్న్ ప్రారంభించి మూడు నెలల గడుస్తున్నా నీళ్లు లీకేజీల గండాన్ని దాటలేకపోతున్నాయి. దీంతో మూడు మండలాల్లోని 15 గ్రామాల ప్రజలకు గోదావరి జలాలు కలగానే మిగిలాయి. గోదావరి జలాలను శుద్ధిచేసి పరకాల, మొగుళ్లపల్లి, శాయంపేట మండలాల్లోని 15 గ్రామాలకు తాగునీరు అందించాలని భావించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జోగంపల్లి వద్ద డీఫ్లోరైడ్ ప్రాజెక్టు నిర్మాణానికి 2009, ఫిబ్రవరి 19న శంకుస్థాపన చేశారు. రూ.23కోట్లతో నిర్మాణ పనులు చేపట్టేందుకు అనుమతిచ్చారు. మొదటి విడతగా రూ.9కోట్లు విడుదల చేశారు. 2011లోగా ఈ ప్రాజెక్టు పనులను పూర్తిచేసి ప్రజలకు తాగునీరందించాలని సూచించారు. కానీ గడువు పూర్తయినా పనులు మాత్రం పూర్తికాలేదు. కానీ ఈఏడాది ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టును అప్పటి ఎమ్మెల్యే గండ్ర హడావుడిగా ప్రారంభించారు. అలాగే రెండోదశలో మంజూరైన రూ.23 కోట్లతో తాగునీటి పనులకు శంకుస్థాపన చేశారు. తీరా మోటార్లు స్టార్ట్ చేయగానే ఎక్కడికక్కడ లీకేజీలు బయటపడడంతో అధికారులు వెంటనే మోటార్లు ఆఫ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి ఇదే తంతు. దీంతో శుద్ధ జలం కోసం ఆశలు పెట్టుకున్న మూడు మండలాల ప్రజలకు నిరాశే మిగిలింది. అధికారులు వెంటనే లీకేజీలకు మరమ్మతులు చేయించి తాగునీరు అందించేందుకు కృష్టి చేయాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు. కనీసం వచ్చే ఏడాది నాటికైనా గొంతు తడిపేలా కృషి చేయాలని ముక్తకంఠంతో అభ్యర్థిస్తున్నారు.