grand welcome
-
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం
-
వైఎస్ జగన్కు నీరా'జనం' (ఫోటోలు)
-
బుజ్జిపాపాయికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత (ఫోటోలు)
-
వినేశ్కు అపూర్వ స్వాగతం
న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ శనివారం స్వదేశానికి చేరుకుంది. స్వర్ణపతక పోరుకు ముందు అనర్హతకు గురై అప్పీల్కు వెళ్లిన ఆమె ఇన్నాళ్లూ పారిస్లోనే ఉండిపోయింది. ఫైనల్ రోజు కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమె అనర్హతకు గురైంది. ఫైనల్లో ఓడినా కనీసం రజతం ఖాయం అనుకోగా, అదీ చేజారిపోయింది. సంయుక్త రజతం కోసం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో వినేశ్ అప్పీలు చేసింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) మద్దతుతో నిష్ణాతులైన లాయర్ల బృందం ఆమె కేసును వాదించింది. విచారణ తదుపరి వాయిదాల అనంతరం చివరకు భారత రెజ్లర్కు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. దీంతో భారత్కు పయనమైన వినేశ్ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే క్రీడాభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. డోలు బాజాలు, భాంగ్రా నృత్యాల మధ్య ఆమె బయటకు వచ్చింది. వినేశ్ భర్త సోమ్వీర్ రాఠీ కూడా ఆమె వెంట ఉన్నాడు. ఒలింపిక్ పతక విజేతలైన స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాలతో పాటు, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా, పోటెత్తిన అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. వెల్లువెత్తిన అభిమానం చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన ఫొగాట్ కన్నీళ్లు పెట్టుకుంది. ఇది గమనించిన సాక్షి, బజరంగ్ ఆమెను దగ్గరికి తీసుకొని ఓదార్చారు. అనంతరం తేరుకొని వినమ్రంగా చేతులు జోడించి ‘యావత్ దేశానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని చెప్పింది. పెద్ద సంఖ్యలో అభిమానులంతా తమ వాహనాల్లో వినేశ్ను ఆమె స్వగ్రామం బలాలి (హరియాణా) చేరే వరకు అనుసరించారు. దీంతో ఈ 135 కిలో మీటర్ల మార్గమంతా వీఐపీ కాన్వాయ్ని తలపించింది. పారిస్ ఒలింపిక్స్లో భారత బృందానికి చెఫ్ డి మిషన్గా వ్యవహరించిన మాజీ షూటర్ గగన్ నారంగ్ కూడా శనివారం ఆమెతో పాటు స్వదేశం చేరుకున్నారు. ఆమెతో పారిస్లో దిగిన ఫొటోని ‘ఎక్స్’లో షేర్ చేస్తూ వినేశ్ నిజమైన చాంపియన్గా అభివర్ణించారు.‘క్రీడా గ్రామంలో తొలి రోజే ఆమె చాంపియన్గా అడుగుపెట్టింది. అనర్హతకు గురైనా ఇప్పటికీ ఆమెనే చాంపియన్. పతకాలు, విజయాలే కాదు... కొన్నిసార్లు పోరాటం కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. వినేశ్ కనబరిచింది కూడా అదే! యువతరానికి ప్రేరణగా నిలిచిన ఆమెకు నా సెల్యూట్’ అని నారంగ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. వినేశ్ కోసం ఢిల్లీలో, తమ స్వగ్రామంలో ఎదురు చూసిన అభిమానులు ఆమెకు బ్రహ్మరథం పట్టారని సోదరుడు హర్విందర్ ఫొగాట్ చెప్పాడు. ‘ఒలింపిక్స్ నిర్వాహకులు నాకు పతకం ఇవ్వకపోతేనేమి. ఇక్కడి ప్రజలంత ఎంతో ప్రేమ, గౌరవం అందించారు. నాకు ఇది 1000 ఒలింపిక్ పతకాలతో సమానం’ అని వినేశ్ వ్యాఖ్యానించింది. -
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఫొగట్ కు ఘనస్వాగతం
-
సీఎం రేవంత్ కు గ్రాండ్ వెల్కమ్
-
నంద్యాల పర్యటన.. దారిపొడవునా జననేతకు ఘన స్వాగతం (ఫొటోలు)
-
జననేత కోసం జనం
-
2024 ప్యారిస్ ఒలింపిక్స్: స్పెషల్ ఎట్రాక్షన్గా నీతా అంబానీ
రిలయన్స్ ఫౌండేషన్, నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్, ఛైర్మన్ నీతా అంబానీ 2024 పారిస్ ఒలింపిక్స్ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పారిస్లో జరుగుతున్న 142వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సెషన్కు నీతా అంబానీ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నుంచి ఘనస్వాగతం లభించింది. ముఖ్యంగా నీతా అంబానీ సాదరంగా ఆహ్వానించిన మాక్రాన్ ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట సందడి చేస్తోంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ కూడా నీతాకు శుభాకాంక్షలు తెలిపారు.ఫ్రాన్స్ రాజధాని నగరంలో జరిగిన లూయిస్ విట్టన్ ఫౌండేషన్లో జరిగిన 142వ ఐఓసీ షన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నీతా అంబానీ ఎంబ్రాయిడరీతో తీర్చిదిద్దిన ఎరుపు రంగు సూట్ను ధరించారు. గోల్డెన్ థ్రెడ్వర్క్ డ్రెస్లో చాలా నిరాడంబరమైన ఆభరణాలతో నీతా అందంగా, హుందాగా కనిపించారు..కాగా 2024 ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు శుక్రవారం, జూలై 26న జరగనున్నాయి. అధికారిక ప్రారంభోత్సవానికి ముందు జూలై 24న కొన్ని క్రీడలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఒలింపిక్స్లో 206 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 10,500 మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024 ఆగస్టు 11న ముగుస్తుంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, నీతా అంబానీ వ్యాపారవేత్తగా, పరోపకారిగా చాలా పాపులర్. ఇటీవల తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. -
పోలీసు ఆంక్షలున్నా.. పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
-
గన్నవరం చేరుకున్న జగన్.. భారీగా పోటెత్తిన జనం (ఫొటోలు)
-
అధైర్య పడొద్దు.. మంచి రోజులొస్తాయి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తమ బిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డినీ గుండెలకు హత్తుకుంది పుట్టిన గడ్డ పులివెందుల. ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చి తాను చేయగలిగేది మాత్రమే చెప్పిన జగన్ ఎప్పటికి తమ నాయకుడే అని చేతల్లో చూపించారు పులివెందుల వాసులు. రాజన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ, సవాళ్లను ఎదుర్కొంటూ... ముందుకు సాగుతున్న జగన్కు అండగా ఉంటామని నిరూపించింది. కష్టాలు తాత్కాలికమేనని.. మళ్లీ జగన్ పట్టం కడతారని అంటున్నారు పులివెందుల వాసులు. అందుకే సొంతూరికి వచ్చిన తమ బిడ్డకు అపూర్వ స్వాగతం పలికారు.కడప జిల్లాలో జరుగుతున్న తన రెండో రోజు పర్యటనలో భాగంగా పులివెందులలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పలువురిని కలుసుకున్నారు. రాయలసీమ లోని నాలుగు ఉమ్మడి జిల్లాలైన అనంతపురం చిత్తూరు కర్నూలు కడప ప్రాంతాల నుంచి దాదాపు 5,000 మంది అభిమానులు.. వైఎస్ జగన్ కలిసారు.ఎన్నికల అనంతరం తెలుగుదేశం నేతలు, ఆ పార్టీ ప్రోత్సహిస్తున్న రౌడీ ముఖలు చేస్తున్న దాడుల గురించి వైఎస్ జగన్కు వివరించారు. పార్టీ నేతలకు అభిమానులకు తాను అండగా ఉంటానని ఎవరు ఎలాంటి ఆందోళన గురి కావద్దని వైఎస్ జగన్ తెలిపారు. రేపు మధ్యాహ్నం వరకు పులివెందులో వైఎస్ జగన్ వివిధ వర్గాలను కలుసుకుంటున్నారు. -
పులివెందులలో వైఎస్ జగన్ కు అపూర్వస్వాగతం
-
సీఎం జగన్ కి వైఎస్సార్సీపీ నేతల ఘన స్వాగతం
-
లండన్ వీధుల్లోను అదే అభిమానం
-
భూటాన్లో ప్రధానికి ఘనస్వాగతం
న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ శుక్రవారం(మార్చ్ 22) ఉదయం భూటాన్ వెళ్లారు. ప్రధానికి భూటాన్లోని పారో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఆ దేశ ప్రధాని షెరిగ్ టోబ్గే ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా భూటాన్తో ద్వైపాక్షిక సంబంధాల విషయమై ప్రధాని చర్చలు జరుపుతారు. భూటాన్ రాజుతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. గత వారమే భూటాన్ ప్రధాని భారత్లో ఐదు రోజుల పాటు పర్యటించి వెళ్లారు. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా ప్రధాని మోదీ ఈ పర్యటన చేపట్టినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింంది. భూటాన్తో భారత్ సంబంధాలు విశిష్టమైనవని తెలిపింది. కాగా, భూటాన్లో షెరిగ్ టోబ్గే ప్రభుత్వం ఇటీవలే కొలువుదీరింది. ఇదీ చదవండి.. ప్రధాని మోదీ చెప్పినా నిర్ణయం మారదు -
అనకాపల్లిలో సీఎం జగన్కు ఆత్మీయ స్వాగతం (ఫొటోలు)
-
2024 కొత్త కొత్తగా వెల్కమ్
చూస్తూండగానే నూతన సంవత్సరం వచ్చేసింది. 2024కు గ్రాండ్గా వెల్కం చెప్పేందుకు అంతా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. అయితే కొన్ని దేశాల వారు కొత్త ఏడాదిని స్వాగతిస్తూ పార్టీ మూడ్లో ఉంటే.. మరికొన్ని దేశాల వారు ఇంకా రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తూనే ఉంటారు. అంతర్జాతీయ టైమ్ జోన్ల ప్రకారం.. ప్రపంచంలో మొట్టమొదటగా న్యూజిలాండ్ సమీపంలోని కిరిబతి దీవుల వారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. తర్వాత న్యూజిలాండ్, ఆ్రస్టేలియా స్వాగతం పలుకుతాయి. ఇదే సమయంలో పలు దేశాల్లో ఇంకా డిసెంబర్ 31వ తేదీనే మొదలవుతూ ఉంటుంది. మరి ఇలా ఏయే దేశాలు కొత్త సంవత్సరానికి ముందుగా వెల్కం చెప్తాయో చూద్దామా.. ► ప్రపంచంలో మొదట పసిఫిక్ మహాసముద్రంలోని దీవులైన కిరిబతిలో నూతన సంవత్సరం మొదలవుతుంది. మన దేశంలో డిసెంబర్ 31న మధ్యాహ్నం 3.30 గంటలు అవుతున్న సమయంలోనే.. కిరిబతిలో అర్ధరాత్రి 12.00 గంటలు దాటేసి జనవరి 1 మొదలైపోయింది. మన దేశ సమయంతో పోల్చి చూస్తే, కొన్ని దేశాల్లో ఎప్పుడు కొత్త సంవత్సరం మొదలవుతుందంటే.. ►న్యూజిలాండ్.. మనకు సాయంత్రం 4.30 ►ఆ్రస్టేలియా.. మనకు సాయంత్రం 6.30 ►జపాన్, దక్షిణ కొరియా.. మనకు రాత్రి 8.30 ►చైనా, మలేషియా, సింగపూర్.. మనకు రాత్రి 9.30 ►థాయిలాండ్, వియత్నాం.. మనకు రాత్రి 10.30 ►యూఏఈ, ఒమన్.. మనకు జనవరి 1 వేకువజాము1.30 ► గ్రీస్, దక్షిణాఫ్రికా, ఈజిప్్ట.. మనకు వేకువజామున 3.30 ►జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, మొరాకో, కాంగో.. మనకు జనవరి 1 తెల్లవారుజామున 4.30 ►యూకే, ఐర్లాండ్, పోర్చుగల్.. మనకు వేకువన 5.30 ►బ్రెజిల్, అర్జెంటీనా.. మనకు జనవరి 1 ఉదయం 8.30 ►ప్యూర్టోరికో, బెర్ముడా, వెనెజువెలా.. మనకు జనవరి 1 ఉదయం 9.30 ►అమెరికా తూర్పుతీర రాష్ట్రాలు, పెరూ, క్యూబా.. మనకు జనవరి 1 ఉదయం 10.30 ►మెక్సికో, కెనడా, అమెరికా మధ్య రాష్ట్రాలు.. మనకు జనవరి 1 ఉదయం 11.30 ►అమెరికా దక్షిణ తీర రాష్ట్రాలు (లాస్ ఎంజిలిస్, శాన్ఫ్రాన్సిస్కో..).. మనకు జనవరి 1 మధ్యాహ్నం 1.30 ►హవాయ్.. మనకు 1న మధ్యాహ్నం ఉదయం 3.30 ►సమోవా దీవులు.. మనకు జనవరి 1 సాయంత్రం 4.30 ►బేకర్, హౌలాండ్ దీవులు.. మనకు 1న సాయంత్రం 5.30 సమీపంలోనే ఉన్నా.. ఓ రోజు లేటు.. వివిధ దేశాలు చాలా విస్తీర్ణంలో ఉన్నా.. ఏదో ఒక సమయాన్ని మొత్తం దేశానికి పాటిస్తూ ఉంటాయి. అందువల్ల ఆ దేశాల్లో ఒక చివరన ఉన్న ప్రాంతాల్లో సూర్యోదయం అయ్యాక కొన్ని గంటల తర్వాతగానీ మరో చివరన ఉన్న ప్రాంతాల్లో తెల్లవారదు. ఇలా వివిధ దేశాల ఆదీనంలో ఉన్న ప్రాంతాల్లో ఆయా దేశాల సమయాన్నే పాటించే క్రమంలో.. సమీపంలోనే ఉన్న ప్రాంతాల్లో కూడా వేర్వేరు తేదీలు, సమయం ఉంటుంటాయి కూడా. ►దీనివల్ల పసిఫిక్ మహా సముద్రం మధ్యలో ఉండే అంతర్జాతీయ డేట్లైన్ కూడా మెలికలు తిరిగి ఉంటుంది. ►మామూలుగా అయితే.. ప్రపంచంలో అన్ని దేశాలకన్నా ముందే రోజు మారిపోయే కిరిబతి దీవులకన్నా రెండు గంటలు ఆలస్యంగా సూర్యోదయం అయ్యే బేకర్, హౌలాండ్ దీవుల్లో అదే తేదీ, రోజు ఉండాలి. కానీ అమెరికా అధీనంలో ఉన్న ఈ దీవుల్లో ఆ దేశ సమయాన్ని పాటిస్తారు కాబట్టి.. అవి మొత్తంగా ఒక రోజు వెనకాల ఉంటాయి. ►ఉదాహరణకు కిరిబతిలో సోమవారం ఉదయం 8 గంటలు అవుతుంటే.. దానికన్నా రెండు గంటల తర్వాత సూర్యోదయం అయ్యే బేకర్, హౌలాండ్ దీవుల్లో మాత్రం ఆదివారం ఉదయం 6 గంటల సమయమే ఉంటుంది. ►ఈ కారణంతోనే ప్రపంచంలో అన్ని ప్రాంతాలకన్నా చివరిగా.. ఈ దీవుల్లో కొత్త సంవత్సరం మొదలవుతుంది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
CM YS Jagan Convoy Entry At Bhimavaram: భీమవరంలో జగనన్నకు ఘనస్వాగతం (ఫొటోలు)
-
సీఎం జగన్ కు ఘన స్వాగతం..నూజివీడులో జననీరాజనం..
-
Allu Arjun-69th National Film Award: అల్లు అర్జున్కు ఘనస్వాగతం.. ఇంటివద్ద ఫ్యాన్స్ కోలాహలం!(ఫొటోలు)
-
సీఎం జగన్కు ఘనస్వాగతం (ఫొటోలు)
-
హైదరాబాద్కు చేరుకున్న అమెరికా వెళ్లిన ఏపీ విద్యార్థులు
-
డల్లాస్ లో బండి సంజయ్ కి ఘన స్వాగతం
-
బీజేపీ కార్యాలయం వద్ద ప్రధానికి ఘన స్వాగతం
న్యూఢిల్లీ: ఇటీవల భారత్ సారథ్యంలో జీ20 శిఖరాగ్ర భేటీని విజయవంతంగా నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఘన స్వాగతం లభించింది. బుధవారం సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశానికి హాజరైన సందర్భంగా ప్రధానికి కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్తోపాటు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తదితరులు స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో హాజరైన పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ప్రధానిపై పూల వర్షం కురిపిస్తూ కార్యాలయంలోకి ఆహా్వనించారు. జీ20 విజయవంతంగా ముగియడం, ప్రపంచ నేతలు మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించడం తెలిసిందే. ఈ భేటీ తర్వాత బీజేపీ ప్రధాన కార్యాలయంలోకి ప్రధాని రావడం ఇదే మొదటిసారి. -
AP: రాష్ట్రానికి తిరిగి వచ్చిన సీఎం జగన్ దంపతులు
సాక్షి, విజయవాడ: లండన్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు రాష్ట్రానికి వచ్చారు. ఈరోజు(మంగళవారం) తెల్లవారుజామున కృష్ణాజిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగిన సీఎం జగన్ దంపతులకు ఘన స్వాగతం లభించింది. సీఎం జగన్కు గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద సీఎస్, మంత్రులు, డీజీపీ ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్ దంపతులు రోడ్డు మార్గంలో తాడేపల్లి నివాసానికి బయల్దేరిన క్రమంలో దారి పొడువునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. -
టీటీడీ బోర్డ్ మెంబర్ మేకా శేషుబాబుకు ఘన స్వాగతం
-
CM Jagan Kalyandurgam Tour : కళ్యాణదుర్గంలో సీఎం జగన్కు ఘన స్వాగతం (ఫొటోలు)
-
CM Jagan Chittoor Tour : చిత్తూరులో సీఎం జగన్కు ఘన స్వాగతం (ఫొటోలు)
-
శంషాబాద్ కు చేరుకున్న జేపీ నడ్డా
-
140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గొప్ప గౌరవమిది: మోదీ
వాషింగ్టన్: భారత్, అమెరికా సమాజాలు, సంస్థలు ప్రజాస్వామిక విలువలపై నిర్మితమై ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తమ వైవిధ్యాన్ని ఇరు దేశాలు గర్వకారణంగా భావిస్తున్నాయని చెప్పారు. నాలుగు రోజుల అధికారిక పర్యటన కోసం అమెరికాలో అడుగుపెట్టిన మోదీకి గురువారం శ్వేతసౌధంలో సాదర స్వాగతం లభించింది. అధికారిక లాంఛనాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత్, అమెరికా రాజ్యాంగాలు ‘దేశ ప్రజలమైన మేము’ అనే మూడు పదాలతోనే ప్రారంభమవుతాయని గుర్తుచేశారు. తనకు అద్భుతమైన స్వాగతం పలికిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జిల్ బైడెన్ దంపతులకు, అమెరికా ప్రభుత్వ యంత్రాంగానికి మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు ఇక్కడ తనకు లభించిన స్వాగతం 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గొప్ప గౌరవమని హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలో నివసిస్తున్న 40 లక్షల మందికిపైగా భారతీయులకు గర్వకారణమని అన్నారు. ప్రజాస్వామ్య బలానికి ఇదొక రుజువు: మోదీ ‘అందరి ప్రయోజనాల కోసం, అందరి సంక్షేమం కోసం’ అనే ప్రాథమిక సూత్రాన్ని భారత్, అమెరికా ఎంతగానో విశ్వసిస్తున్నాయని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మూడు దశాబ్దాల క్రితం ఒక సామాన్యుడిగా అమెరికా వచ్చానని, అప్పుడు వైట్హౌస్ బయటి నుంచే చూశానని అన్నారు. ప్రధానమంత్రి హోదాలో చాలాసార్లు ఇక్కడికి వచ్చానని చెప్పారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భారతీయ–అమెరికన్ల కోసం వైట్హౌజ్ గేట్లు తెరవడం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చని అన్నారు. అమెరికాలో ఉంటున్న భారతీయులు కష్టపడి పని చేస్తున్నారని, భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నారని మోదీ ప్రశంసించారు. చదవండి: అది మా డీఎన్ఏలోనే ఉంది: బైడెన్తో కలిసి మీడియా సమావేశంలో మోదీ భారత్–అమెరికా స్నేహం మొత్తం ప్రపంచాన్ని బలోపేతం చేయడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. ప్రపంచ శాంతి, సౌభాగ్యం, స్థిరత్వం కోసం ఇరుదేశాలు కలిసి పని చేస్తున్నాయని వివరించారు. ప్రజాస్వామ్య బలానికి భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యమే ఒక రుజువు అని వెల్లడించారు. కీలకమైన అంశాలపై అధ్యక్షుడు జో బైడెన్తో చర్చించబోతున్నానని పేర్కొన్నారు. చర్చలు సానుకూలంగా జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. అమెరికా పార్లమెంట్ను రెండోసారి ఉద్దేశించి ప్రసంగించే అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు. భారత్ సహకారంతో ‘క్వాడ్’ బలోపేతం: బైడెన్ భారత్–అమెరికా సంబంధాలు 21వ శతాబ్దంలో అత్యంత ప్రభావశీల సంబంధాల్లో ఒకటి అని జో బైడెన్ స్పష్టం చేశారు. వైట్హౌస్లో మోదీని ఆహా్వనిస్తూ ఆయన మాట్లాడారు. ఈ రోజు రెండు దేశాలు కలిసి తీసుకుంటున్న నిర్ణయాలు రాబోయే తరాల భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ సేవల విస్తరణ, వాతావరణ మార్పుల నియంత్రణ వంటి అంశాలపై ఇరుదేశాలు సన్నిహితంగా కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. స్వేచ్ఛాయుత, భద్రమైన ఇండో–పసిఫిక్ లక్ష్యంగా భారత్ సహకారంతో ‘క్వాడ్’ కూటమిని బలోపేతం చేస్తున్నామని బైడెన్ వివరించారు. చదవండి: Narendra Modi: ఎదురొచ్చి మరీ మోదీకి బైడెన్ దంపతుల సాదర స్వాగతం.. ప్రత్యేక విందు -
మీ అందరికి గ్రాండ్ వెల్కమ్
-
కోనసీమలో సీఎం జగన్కు ఘన స్వాగతం (ఫొటోలు)
-
ఆస్ట్రేలియాలో మోదీ మ్యాజిక్.. ఓ రేంజ్లో భారతీయుల స్వాగతం!
సిడ్నీ/మెల్బోర్న్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వదేశంతో పాటుగా పలు దేశాల్లో అభిమానులు భారీ సంఖ్యలోనే ఉన్నారు. కాగా, మోదీ.. ఇప్పటికే పలు దేశాల పర్యటనకు వెళ్లిన సందర్భాల్లో అభిమానులు, భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. తాజాగా ప్రధాని మోదీ.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడున్న భారతీయులు ప్రధానికి వినూత్నంగా స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న మోదీని కలిసేందుకు భారత సంతతి ప్రజలు ఏకంగా ఓ విమానాన్ని బుక్ చేసుకుని మరీ వచ్చారు. సోమవారం రాత్రి మెల్బోర్న్ నుంచి సిడ్నీకి ప్రయాణించారు. తాము ప్రయాణించిన విమానానికి మోదీ ఎయిర్ వేస్ అని పేరు కూడా పెట్టుకున్నారు. ఇక, మోదీ కోసం 170 మంది కలిసి ప్రత్యేకంగా ఓ విమానాన్ని బుక్ చేసుకున్నారు. చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని, తలకు టర్బన్లను కట్టుకుని విమానంలో డ్యాన్స్ స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఇండియన్ ఆస్ట్రేలియన్ డయాస్పొరా ఫౌండేషన్ (ఐఏడీఎఫ్) సిడ్నీలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆస్ట్రేలియాలోని భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వస్తున్నారు. ఇందులో భాగంగానే మెల్బోర్న్లోని మోదీ మద్దతుదారులు, అభిమానులు కూడా సిడ్నీకి బయలుదేరారు. వీరంతా సోమవారం రాత్రి మెల్ బోర్న్ నుంచి సిడ్నీకి ప్రయాణించారు. "Modi Airways" , a plane full of Indian diaspora members arriving in Sydney this morning for the Diapsora Event. https://t.co/GCjs4TSuag pic.twitter.com/RCpIBVWIyG — Sidhant Sibal (@sidhant) May 23, 2023 WATCH | Indian Diaspora from Melbourne ready to take off on special chartered flight @modiairways to meet PM @narendramodi in Sydney, Australia. pic.twitter.com/T8vhbRayXP — DD News (@DDNewslive) May 23, 2023 #Live Modi Airways arrives at Qudos Arena @EthnicLinkGuru @Pallavi_Aus @DrAmitSarwal https://t.co/welCRRSmwU — The Australia Today (@TheAusToday) May 23, 2023 ఇది కూడా చదవండి: భారత ప్రధాని మోదీకి అరుదైన గౌరవం -
నిజాంపట్నంకు చేరుకున్న సీఎం జగన్
-
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలుకు దారిపొడవునా ఘన స్వాగతం
-
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలుకు దారిపొడవునా ఘన స్వాగతం
సాక్షి, హైదరాబాద్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాదిలో తొలిసారి రి తెలంగాణకు వచ్చారు. తన పర్యటనలో ప్రధాని మోదీ మొత్తం రూ.11 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వాటిలో కొన్ని ప్రారంభోత్సవాలు, పలు శంకుస్థాపనలు ఉన్నాయి. తొలుత సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ను మోదీ ప్రారంభించారు. నల్లగొండ, మిర్యాలగూడ రైల్వే స్టేషన్లలో తిరుపతి వందే భారత్ రైలుకు దారి పొడవునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. జాతీయ జెండాలతో స్వాగతం చెబుతూ.. వందే భారత్ రైలుతో సెల్ఫీలు దిగారు.స్టేషన్ల వద్ద స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా స్వాగతం పలికారు. కాగా శనివారం ఉదయం 11.30 నిమిషౠలకు బేగంపేట ఎయిర్పోర్టుకు వచ్చిన మోదీని గవర్నర్ తమిళిసై, ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లి వందే భారత్ రైలు ప్రారంభించడంతోపాటు రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్టీఎస్ సెకండ్ ఫేజ్లో భాగంగా 13 ఎమ్ఎమ్టీఎస్ రైళ్లను ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్లోని పరేడ్గ్రౌండ్స్ సభలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేసి ప్రసంగించారు. అనంతరం చెన్నైకు ప్రయాణమయ్యారు. -
Nikhat Zareen Photos: బాక్సర్ నిఖత్ జరీన్కు ఘన స్వాగతం (ఫొటోలు)
-
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో చంద్రబోస్ కు ఘన స్వాగతం
-
నా కోరిక నెరవేరింది.. చిట్టి పాదాల పారాణి ముద్రలతో స్వాగతం! మనసుకు హాయి..
మా ఇంటి మహాలక్ష్మి ఆడపిల్లపుట్టిందని సంబరం చేశారు. ఇంట్లోకి పూలతో రహదారి పరిచారు. చిట్టి పాదాల పారాణి ముద్రలు వేశారు. అమ్మాయి పుడితే ఇలా స్వాగతం పలకండి. ‘ఆడదే ఆధారం... మన కథ ఆడనే ఆరంభం...’ అంటూ పాడుకునే నేల మనది. ఆడపిల్ల పుట్టగానే గొంతులో వడ్ల గింజలు వేసిన నేల కూడా ఇది. తల్లి గర్భంలోనే శిశువును గుర్తించి పుట్టకముందే ప్రాణం తీస్తున్న పాపాలకూ కొదవలేదు. ఇక ఆడపిల్లను కన్నతల్లికి ఎదురయ్యే కష్టాలను ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆడపిల్ల పుట్టింది... అనగానే కోడలిపై చిర్రుబుర్రులాడే అత్తలు, భార్య–బిడ్డల ముఖం చూడని మగవాళ్లు ఉన్న సమాజం మనది. ఇన్ని దారుణాల మధ్య ఓ సంతోషవీచిక వెల్లివిరిసింది. పుట్టింది ఆడపిల్ల అని తెలియనే పండుగ చేసుకున్నారు. ఊరూ వాడా అందరినీ పిలిచి వేడుక చేసుకున్నారు. అమ్మమ్మగారింట్లో రెండు నెలలు పూర్తి చేసుకున్న బిడ్డ మూడవ నెల నానమ్మ దగ్గరకు ప్రయాణమైంది. ఆ బిడ్డనెత్తుకుని అత్తగారింటికి వచ్చిన తల్లికి పూలబాట పరిచారు అత్తింటివాళ్లు. పాపకు ఘన స్వాగతం పలికారు. ఆడబిడ్డ పుట్టడం అంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రావడమేనన్నారు. ఆదర్శంగా నిలిచిన కుటుంబం తెలంగాణ, మహబూబాబాద్ జిల్లాలో ఉంది. కే సముద్రం మండలం, తాళ్లపూసపల్లి గ్రామానికి చెందిన పొడగంటి శ్రీనివాసాచారి, భద్రకాళి దంపతుల ఆదర్శవంతమైన ఆత్మీయత ఇది. పాపాయి కోసం పూజలు కోడలు గర్భిణి అని తెలియగానే మగ పిల్లవాడు పుట్టాలని అనుకుంటారు. కానీ భద్రకాళి కుటుంబీకులు మాత్రం ఆడపిల్ల కావాలని పూజలు చేశారు. వాళ్ల పెద్దకొడుకు సాయి కిరణ్కు సిరిసిల్ల పట్టణానికి చెందిన సంహితతో రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది. సంహిత నెలతప్పినప్పటి నుంచి భద్రకాళితోపాటు ఆమె తోడికోడలు సుమ, మరదలు రమ్య కూడా ఆడపిల్లలు పుట్టాలని వ్రతాలు, పూజలు చేశారు. వాళ్లందరికీ మగపిల్లలే. ఈ తరంలోనైనా ఇంట్లో ఆడపిల్ల కావాలని వాళ్ల కోరిక. ప్రసవం రోజు వరంగల్లో ఆసుపత్రికి ఇంటిల్లిపాది తరలి వెళ్లారు. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే సంతోషంగా కేకలు వేస్తూ, హాస్పిటల్లో అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. అపూర్వ స్వాగతం కోడలు పుట్టింటికి వచ్చిన రోజు ఇంటిని పూలతో అలంకరించారు. ముత్తయిదువలతో స్వాగతం పలికారు. చిన్నపాప కాళ్లకు పారాణి రాసి తొలి అడుగుల గుర్తులు నట్టింట్లో ముద్రించుకున్నారు. ఆ అడుగులను కళ్లకు అద్దుకున్నారు. ఆ జ్ఞాపకం కలకాలం నిలిచి ఉండడానికి ఫొటోలు తీశారు. నా కోరిక తీరింది నాకు చిన్నప్పటి నుండి ఆడపిల్లలంటే ఇష్టం. మా వారు కూడా ఆడపిల్ల ఉన్న ఇంటి అందమే వేరు అంటూ ఉంటారు. అందుకోసమే మా ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆడ పిల్లలను ప్రతి పండుగకు పిలుస్తాం. వారు చేసే సందడి చూసి సంబుర పడుతాం. మా ఇంట్లో ఆడపిల్ల ఉండాలనే కోరిక నెరవేరింది. అందుకోసమే అలా స్వాగతం పలికాం. – భద్రకాళి, పాపాయి నానమ్మ – ఈరగాని భిక్షం, సాక్షి, మహబూబాబాద్ -
జూ.ఎన్టీఆర్కు ఘన స్వాగతం..కళ్లలో నీళ్లు తిరిగాయని భావోద్వేగం.
సాక్షి, హైదరాబాద్: ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చిందని అనౌన్స్ చేసిన క్షణంలో ఆనందం తట్టుకోలేక పోయామని ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. 'ఆస్కార్ వేదిక మీద ట్రిపుల్ ఆర్ టీం చేతికి ఆస్కార్ అందించినప్పుడు అంతకు మించిన ఆనందం ఇంకోటి లేదనిపించింది. మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన అభిమానులకి, ప్రజలకి పేరుపేరునా ధన్యవాదాలు. రాజమౌళి చేతిలో ఆస్కార్ అవార్డు చూసినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవార్డు వచ్చిన విషయం నా ఫ్యామిలీలో మొదటగా నా వైఫ్ కి కాల్ చేసి షేర్ చేసుకున్నాను.' అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సాంగ్కు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫీ చేశారు. జూ.ఎన్టీఆర్, రామ్చరణ్ వేసిన స్టెప్పులు యావత్ ప్రపంచాన్ని ఊర్రూతలించాయి. -
న్యూజిలాండ్తో మూడో టీ20.. టీమిండియాకు గ్రాండ్ వెల్కమ్! వీడియో వైరల్
India Vs New Zealand 3rd T20:న్యూజిలాండ్తో కీలక పోరుకు టీమిండియా సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా సిరీస్ డిసైడర్ మూడో టీ20లో బుధవారం కివీస్తో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు సోమవారం అహ్మదాబాద్కు చేరుకుంది. ఈ సందర్భంగా టీమిండియాకు సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. "భారత్, న్యూజిలాండ్ ఆఖరి టీ20 కోసం అహ్మదాబాద్ చేరుకున్నాం" అని ఈ వీడియోకు బీసీసీఐ క్యాప్షన్ ఇచ్చింది. ఇక అహ్మదాబాద్కు చేరుకున్న భారత జట్టు మంగళవారం తమ ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. ఇదిలా ఉంటే.. కీలకమైన మూడో టీ20లో భారత పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన గిల్ స్థానంలో పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా పేసర్ ముఖేష్ కుమార్కు కూడా ఆఖరి టీ20కు భారత తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. భారత తుది జట్టు(అంచనా): ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్ చదవండి: IND vs NZ: బ్యాటర్లకు చుక్కలు చూపించిన లక్నో పిచ్.. క్యూరేటర్పై వేటు! Hello Ahmedabad 👋 We are here for the third & final T20I of the #INDvNZ series 👏 👏#TeamIndia pic.twitter.com/gQ1jPEnPvK — BCCI (@BCCI) January 30, 2023 -
Hijab: అరెస్ట్ కాదు.. ఆమెకు ఘన స్వాగతం!
టెహ్రాన్: అంతర్జాతీయ క్రీడా వేదికలో హిజాబ్ లేకుండా పాల్గొని.. వార్తల్లో ప్రముఖంగా నిలిచింది ఇరాన్ అథ్లెట్ ఎల్నాజ్ రెకాబీ. అయితే.. ఆపై ఆమె ప్రభుత్వాగ్రహానికి గురికాకతప్పదని, జైలు శిక్ష ఖాయమని అంతా భావించారు. అంతేకాదు.. స్వయంగా ఆమె తన అరెస్ట్ భయాన్ని సైతం వ్యక్తం చేయడం, ఆ వెంటనే కనిపించడం లేదన్న కథనాలతో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఇక భయాందోళనల నడుమ బుధవారం వేకువజామున రాజధాని టెహ్రాన్కు చేరుకున్న ఆమెకు ఊహించని సీన్ కనిపించింది. వేల మంది ఎయిర్పోర్ట్కు చేరుకుని ఆమెకు ఘనస్వాగతం పలికారు. హిజాబ్ లేకుండా పోటీల్లో పాల్గొన్న ఆమె తెగువకు సలాం చేస్తూ నినాదాలు చేశారు. ఆ గ్రాండ్ వెల్కమ్ను రెకాబీ సైతం అంతే ఆత్మీయంగా స్వీకరించింది. 33 ఏళ్ల వయసున్న రెకాబీ.. ఇరాన్ తరపున సియోల్(దక్షిణ కొరియా రాజధాని)లో ఆదివారం జరిగిన క్లయింబింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్నారు. గతంలో హిజాబ్తోనే ఆమె ఎన్నో పోటీల్లో పాల్గొన్నారు. అయితే ఆదివారం ఈవెంట్ సందర్భంగా ఆమె హిజాబ్ ధరించకపోవడంతో ఆమె ఇరాన్ ప్రభుత్వ ఆగ్రహానికి గురికాక తప్పదని అంతా భావించారు. ఇరాన్లో జరుగుతున్న హిజాబ్ నిరసనల్లో భాగంగానే ఆమె అలా చేసి ఉంటుందని అంతా చర్చించుకున్నారు. ఎయిర్పోర్ట్లో దిగగానే అరెస్ట్ కాక తప్పదని అనుకున్నారు. కానీ, ఆ అంచనా తప్పింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమెని గతంలో స్పందిస్తూ.. ఇరాన్ మహిళా అథ్లెట్లకు మెడల్స్ కంటే హిజాబ్ ముఖ్యమని సూచించారు. అయితే.. రెకాబీ మాత్రం హిజాబ్ తొలగించి మరీ పోటీల్లో పాల్గొంది. ఇక హిజాబ్ తొలగింపుపై ఇరాన్ నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. దీంతో ఆమె క్షమాపణలు చెప్తూ.. అది అనుకోకుండా జరిగిందంటూ ఓ సందేశం సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టెహ్రాన్లో ల్యాండ్ అయిన ఆమెకు.. ముందు ముందు ఎలా ఉంటుందన్నది చూడాలి మరి!. ఇదీ చదవండి: తప్పు జరిగిపోయింది.. క్షమించండి -
కొత్త కారుతో గ్రాండ్ ఎంట్రీ .... పల్టీ కొట్టిందిగా!
ఒక వ్యక్తి కొత్త కారుతో గ్రాండ్గా ఎంటీ ఇస్తున్నాడు. కానీ అతనికి కొత్త కారుతో వచ్చిన ఆనందం కాస్త చేదు అనుభవాన్ని మిగిల్చింది. బ్రాండెడ్ టాటా నెక్సాన్ కారుతో చక్కటి పూల దండతో అలకరింపబడి ఉన్న కారుతో ఇంటికి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చాడు. ఐతే సెక్యూరిటీ గార్డు కూడా గేట్ తీసి చక్కగా దారి ఇచ్చాడు కూడా. కానీ సదరు వ్యక్తి కారుని లోపలి పోనిచ్చి పక్కనే పార్క్ చేసిన బైక్లపైకి పోనిచ్చాడు. దీంతో కారు ఆ బైక్లన్నింటిని ఢీ కొడుతూ ఒక పక్కకు పల్టీ కొట్టబోయింది. ఇంతలో సెక్యూరిటీ గార్డు పరిగెత్తుకుంటూ వచ్చి సదరు కారు నడుపుతున్న వ్యక్తికి సాయం అందిస్తాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని వినోద్ కుమార్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. What a grand arrival home ? pic.twitter.com/ilSeNcKexD — Sqn Ldr Vinod Kumar (Retd) (@veekay122002) October 7, 2022 (చదవండి: విధ్వంసం.. క్రిమియా-రష్యాను కలిపే వంతెనపై భారీ పేలుడు) -
విశాఖలో జగనన్నకు ఘన స్వాగతం
-
శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవం: అమెరికాలో టీటీడీ చైర్మన్ దంపతులకు ఘన స్వాగతం
డాలస్: అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న టీటీడీ శ్రీవెంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవానికి హాజరయ్యేందుకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు అమెరికాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైవీ దంపతులకు ఘన స్వాగతం లభించింది. నార్త్ అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కడప రత్నాకర్ తదితరులు వీరిని సాదరంగా ఆహ్వానించారు. జూన్ 18న శాన్ఫ్రాన్సిస్కో, 19,సియాటెల్, డాలస్లో 25న , 26న సెంట్ లూయస్, 30న చికాగో, జూలై 2వ తేదీన న్యూఓర్లీన్స్, 3, వాషింగ్టన్ డీసీ, అట్లాంటాలో జూలై 9న, 10న అలబామాలో అత్యంత వైభవంగా శ్రీనివాస కల్యాణాన్ని నిర్వహిస్తారు. డాలస్లోని క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్లో తెలుగువారి ఆధ్వర్యంలో టీపాడ్ నేతృత్వంలో జూన్ 25న విశేష పూజాకార్యక్రమం, శ్రీనివాస కల్యాణం ఇతర సేవలు ఘనంగా నిర్వహించనున్నారు. సుప్రభాత సేవ, తోమాల సేవ, అభిషేకం, కల్యాణ సేవలను అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. (డాలస్లో శ్రీనివాసుడి కల్యాణం) -
గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్ కు ఘన స్వాగతం
-
ఏపీ సీఎం వైఎస్ జగన్కు ఘనస్వాగతం
-
రైతు కంట తడి పెట్టనివ్వను: మంత్రి కాకాణి
ముత్తుకూరు(నెల్లూరు జిల్లా): వ్యవసాయశాఖ మంత్రిగా, రైతు బిడ్డగా రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కంట తడి పెట్టనివ్వకుండా బాధ్యతలు నిర్వర్తిస్తానని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. మంత్రిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ రాజకీయంగా జన్మనిచ్చి ఎదుగుదలకు ఆశీస్సులందించిన సర్వేపల్లి ప్రజానీకాన్ని కంఠంలో ప్రాణమున్నంత వరకు రుణపడి ఉంటానని కాకాణి అన్నారు. చదవండి👉: టీడీపీ కుట్రలు: తమ్ముళ్ల నాటకం.. విస్తుబోయే నిజం మంత్రి హోదాలో ఆదివారం సాయంత్రం తొలిసారిగా ముత్తుకూరుకు వచ్చిన కాకాణికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సభలో ఆయన ప్రసంగించారు. ఏ హోదాలో ఉన్నప్పటికీ నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.360 కోట్లతో సీసీరోడ్లు, సైడు డ్రెయిన్ల నిర్మాణం చేయించామన్నారు. రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలకు వెళ్లే ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణం కూడా చేపడతామన్నారు. ట్యాంకర్ల ద్వారా రవాణా చేసే దుస్థితి లేకుండా ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తున్నామన్నారు. ఇంటింటికీ కుళాయి పథకం అమలు చేస్తున్నామన్నారు. 80 రోజుల పాటు గ్రామాల్లో పర్యటన మే 10వ తేదీ తర్వాత ‘సిటిజన్ అవుట్రీచ్ కాంపైన్’ పేరుతో అధికారులతో కలసి ప్రతి ఇంటికి వెళ్లి పలకరిస్తామని, సంక్షేమ పథకాల అమలు, అవసరమైన పనులపై వాకబు చేస్తామన్నారు. ఈ కార్యక్రమం 9 నెలలు జరుగుతుందన్నారు. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసి తీరుతామన్నారు. ప్రతి పేద కుటుంబానికి నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. -
సచిన్, అమితాబ్లా ఫీల్ అయ్యా: బ్రిటన్ ప్రధాని
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆయన ఇండియాకు చేరుకున్నారు. మొదటిరోజు భారత ప్రధాన నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో బోరిస్ జాన్సన్ పర్యటించారు. రెండో రోజు ఢిల్లీలో ప్రధాని మోదీతో బోరిస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఇదిలా ఉండగా.. గురువారం గుజరాత్లో పర్యటనను బోరిస్ జాన్సన్ గుర్తు చేసుకొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్లో తనకు ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు భారత ప్రజలకు, ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గుజరాత్లో తన స్వాగత హోర్డింగ్స్ చూసి.. ఆయన ఓ సచిన్ టెండూల్కర్, బిగ్బీ అమిత్ బచ్చన్లా ఫీలయ్యానని అన్నారు. ఇలాంటి స్వాగతాన్ని తాను మరెక్కడా చూడలేనమోనని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తనకు మంచి స్నేహితుడని బోరిస్ ప్రకటించారు. మరోవైపు.. బోరిస్ జాన్సన్ భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో భారత్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పర్యటించడం ఆనందంగా ఉందన్నారు. ఇది ఓ చారిత్రక సందర్భం అంటూ మోదీ వ్యాఖ్యానించారు. ఇది చదవండి: భారత్.. ఏ దేశానికీ ముప్పు కాదు -
KTR వరంగల్ పర్యటన
-
నగరి ప్రజల ప్రేమ మరువలేను (ఫోటోలు)
-
చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డికి ఘన స్వాగతం
-
వీధి కుక్కకు హారతి ఇచ్చి మరీ ఘన స్వాగతం!..ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Mumbai Society Gives A Grand Welcome To Stray Dog: ఇంతవరకు జంతువులకు సంబంధించిన పలు కథనాలను విన్నాం. పెంపుడు జంతువులు తన యజమాని పట్ల కనబరిచే విశ్వాసం, ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. . వీధి కుక్కలను ఆదరించే వాళ్లు కూడా ఉన్నారు. ఒకరో ఇద్దరో వాటికి ఆహారం పెట్టడం వంటివి చేస్తుంటారు. అవి కూడా వాళ్ల పట్ల మాత్రమే ప్రేమగా ఉంటాయి. కానీ ఈ వీధి కుక్క అందుకు భిన్నం అందరీ ప్రేమాభిమానలను గెలుచుకుంది ఎలాగో తెలుసా! అసలు విషయంలోకెళ్తే...ముంబైలో ప్రభాదేవిలోని ఒక సొసైటీ విస్కీ అనే వీధి కుక్క ఉంది. ఆ కుక్కని ఆ సోసైటీ వాళ్లంతా ప్రేమగా చూసుకునేవారు. ఒకరోజు ఉన్నట్టుండి హఠాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో ఆ సోసైటి వాసుల నిద్రహారాలు మాని మరీ ఆ కుక్క కోసం వెతకడం ప్రారంభించారు. ఏడు రోజులు అనంతరం ఆ కుక్క విల్సన్ కాలేజీకి సమీపంలోని మైదానంలో కనిపించింది. దీంతో ఆ కాలనీ వాసులు ఆ కుక్కను సోసైటీకి కారులో తీసుకకువచ్చి హారతీ ఇచ్చి మరి ఘన స్వాగతం పలికారు. పైగా ఆ సోసైటీ వాసులు అది మాకు కుక్క కాదు అని చెప్పడం విశేషం. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం ఇది అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. View this post on Instagram A post shared by StreetdogsofBombay (@streetdogsofbombay) (చదవండి: అమ్మ నాన్న ఐ లవ్ యూ !..వైరల్ అవుతున్న ఉక్రెయిన్ సైనికుడి చివరి వీడియో!) -
Rohit Sharma: రోహిత్ శర్మకు గ్రాండ్ వెల్కమ్
దుబాయ్: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఆ జట్టు ఆటగాళ్లు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇంగ్లండ్తో సిరీస్ అనంతరం యూఏఈకి చేరుకున్న రోహిత్ శర్మ ఆరు రోజులపాటు క్వారంటైన్లో ఉన్నాడు. తాజాగా శనివారంతో క్వారంటైన్ పీరియడ్ కంప్లీట్ చేసుకున్న రోహిత్ జట్టు సభ్యులతో కలిశాడు. ఈ నేపథ్యంలో రోహిత్కు హగ్గులతో పాటు బెస్ట్ విషెస్ అందించారు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. చదవండి: Dinesh karthik: బౌలర్ యార్కర్ దెబ్బ.. క్రీజులోనే కూలబడ్డ బ్యాట్స్మన్ '' మా కెప్టెన్కు ఇదే వెల్కమ్.. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టీమ్మేట్స్'' అని క్యాప్షన్ జత చేసింది. కాగా టి20 ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లి టీమిండియా టి20 కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకోనున్న సంగతి తెలిసిందే. కాగా కోహ్లి స్తానంలో రోహిత్ టి20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఆటగాళ్లు రోహిత్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ముంబై ఇండియన్స్ రెండో అంచె పోటీల్లో తన తొలి మ్యాచ్ను రేపు (సెప్టెంబర్ 19న) సీఎస్కేతో తలపడనుంది. ఇక రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమయ్యాడు. ఇప్పటికే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ను ఐదుసార్లు చాంపియన్గా నిలిపాడు. ఇక ఈ సీజన్లోనూ ముంబై నిలకడ ఆటతీరును కనబరుస్తుంది. ఐపీఎల్ 2021 సీజన్లో ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్లాడి 4 విజయాలు.. మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. చదవండి: MS Dhoni: జోరు మీదున్న తలైవా.. ఫోర్లు, సిక్సర్ల వర్షం NZ Vs Pak Series Cancellation: కివీస్ సిరీస్ రద్దు.. కావాలనే మాపై కుట్రలు పన్నుతున్నారు View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) -
నీరజ్ చోప్రాకు స్వగ్రామంలో ఘన స్వాగతం
పానిపట్: టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రాకు హర్యానా పానిపట్లోని తన స్వగ్రామం సమల్ఖాలో ఘన స్వాగతం లభించింది. దారిపొడవునా అతన్ని అభినందిస్తూ గ్రామస్థులు సంబరాలు జరుపుకున్నారు. ఒలింపిక్స్లో అథ్లెటిక్స్ విభాగంలో దేశానికి స్వర్ణం అందించిన వ్యక్తిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో 87.58 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం అందుకున్నాడు. తన స్వగ్రామంలో గ్రామస్తులు చూపిన ప్రేమపై నీరజ్ సంతోషం వ్యక్తం చేశాడు. మీ నుంచి ఇంత ప్రేమను పొందడం చాలా సంతోషంగా ఉంది. జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నాకు రానున్న కాలంలోనూ ఇదే తరహా మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నా. దేశానికి మరిన్ని పతకాలు తీసుకొచ్చేందుకు మరింత కష్టపడతా అంటూ తెలిపాడు. -
ఢిల్లీ ఎయిర్పోర్టులో పీవీ సింధుకు ఘనస్వాగతం
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో బాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకం సాధించి మువ్వన్నెల జెండాను మరోసారి రెపరెపలాడించిన తెలుగుతేజం పీవీ సింధుకు మంగళవారం స్వదేశానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం లభించింది. 2016 రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన అనంతరం ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకొని వరుసగా రెండో ఒలింపిక్స్లోనూ ఈ ఘట్టాన్ని ఆవిష్కరించిన రెండో భారత ప్లేయర్గా, తొలి మహిళగా సింధు చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్కు అభిమానులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఈ సందర్భంగా కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ను పీవీ సింధు కలవనుంది. కాగా టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న భారత ఒలింపిక్ బృందం ఆగస్టు 15 వేడుకలకు హాజరుకానుంది. వేడుకల్లో పాల్గొననున్న బృంద సభ్యులను ప్రధాని మోదీ తన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కొత్త కోడలికి మెట్టుకో గిఫ్ట్
-
ఆత్మీయ ఆహ్వానం.. కొత్త కోడలికి మెట్టుకో గిఫ్ట్
వరకట్న పిశాచి మన సమాజంలో ఎందరు ఆడవాళ్లని బలి తీసుకుందో లెక్కేలేదు. భార్య తల్లిదండ్రులంటేనే నడిచే ఏటీఎంలా కనిపిస్తారు కొందరు భర్తలకు. పెళ్లికి ముందే భారీగా కట్నం తీసుకున్నప్పటికి వారి ధనదాహం తీరదు. వివాహం తర్వాత కూడా అదనపు కట్నం తేవాల్సిందిగా వేధింపులకు గురి చేస్తారు. చిత్రహింసలు పెట్టి.. చివరకు ప్రాణాలు తీస్తారు. అత్తమావలు, ఆడపడుచు, భర్తతో సహా అత్తింటివారందరూ ఆమెను కట్నం కోసం వేధింపులకు గురి చేస్తారు. అయితే అందరు ఇలానే ఉంటారు అనుకుంటే పొరపాటే. కొడలిని, కూతురుతో సమానంగా చూసే అత్తింటివారుంటారు. కోడలి నుంచి కట్నం ఆశించడం కాదు.. కన్నవాళ్లని విడిచిపెట్టి.. తమకోసం వచ్చిన కోడలికి.. బదులుగా బహుమతులు ఇచ్చే వారు కూడా ఉంటారు. ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ సంఘటన మన తెలుగు రాష్ట్రాల్లోనే చోటు చేసుకుంది. అయితే ఎక్కడ అనే వివరాలు మాత్ర లేవు. ఇక వివాహం చేసుకుని.. తమ ఇంట్లోకి అడుగుపెడుతున్న కొత్త కోడలికి జీవితాంతం గుర్తుండిపోయే రీతిలో అద్భుతంగా స్వాగతం పలికారు ఈ అత్తింటివారు. మేళతాళాలతో నూతన దంపతులను ఇంట్లోకి ఆహ్వానించారు. ఆ తర్వాత ఇంట్లోకి అడుగుపెడుతున్న కోడలికి మెట్టుకొక బహుమతిచ్చారు. ఇక పెద్ద మెట్టు మీద ఏకంగా 50 వేల రూపాయల నగదు ఇచ్చారు. ఈ ఆత్మీయ ఆహ్వానానికి సదరు పెళ్లి కుమార్తె భావోద్వేగానికి గురైంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో నిజమా కాదా తెలియదు కానీ ఇంత మంచి అత్తింటివారు దొరికిన ఆ అమ్మాయి అదృష్టవంతురాలు.. అందరు మీలానే ఆలోచిస్తే.. ఇక ఈ లోకంలో ఆడపిల్లలను వద్దునుకునే తల్లిదండ్రులే ఉండరు అని ప్రశంసిస్తున్నారు. -
చెన్నై చేరుకున్న చిన్నమ్మ
చెన్నై: అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న మాజీ సీఎం దివంగత జయలలిత స్నేహితురాలు, అన్నా డీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ తమిళనాడుకు చేరుకున్నారు. చెన్నైలోని ఎంజీఆర్ నివాసానికి చేరుకుని జయలలిత చిత్రపటానికి నివాళులర్పించారు. అంతకుముందు తన అనుచరులతో సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో మళ్లీ రాజకీయ అరంగేట్రం చేస్తానని ప్రకటించారు. కర్నాటక రాజధాని బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవించి జనవరి 27న విడుదల అయ్యారు. అయితే ఆమె ఇటీవల కరోనా బారినపడడంతో అస్వస్థతకు గురయ్యారు. చికిత్స తీసుకున్న అనంతరం క్వారంటైన్ కాలం పూర్తి చేసుకుని సోమవారం బెంగళూరు నుంచి తమిళనాడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా శశికళకు పెద్ద ఎత్తున అభిమానులు, ఆమె అనుచరులు భారీ స్వాగతం పలికారు. పదుల సంఖ్యలో కాన్వాయ్లు బారులు తీరాయి. వేలాది మంది అభిమానులు ఆమె వెంట ఉన్నారు. అయితే శశికళ జైలు నుంచి విడుదల కాకముందే అన్నాడీఎంకే రెండాకుల గుర్తుపై కేసు వేసిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే ఇంకా తన పార్టీగా పేర్కొంటూ శశికళ రెండాకుల పార్టీ పతాకాన్ని ఆమె తన వాహనానికి వినియోగించుకున్నారు. తాజాగా తమిళనాడుకు చేరుకున్న సమయంలో కూడా అదే గుర్తు ఉన్న జెండాలు కనిపించాయి. ఇక ప్రత్యక్ష రాజకీయాలతో శశికళ బిజీ కానున్నారు. దీంతో తమిళనాడులో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయోనని తమిళ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. అయితే శశికళ రాకపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధించింది. జయలలిత సమాధి, స్మారక మందిరం మూసివేయగా.. శశికళ పోస్టర్లు అతికించవద్దని నిషేదాజ్ఞలు విధించింది. దీంతోపాటు రెండాకుల గుర్తు వాడకంపై ఇప్పటికే అన్నాడీఎంకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తం 2 కేసులు నమోదు చేయించిన విషయం తెలిసిందే. -
రాష్ట్రపతికి సీఎం జగన్ ఘన స్వాగతం
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్రపతి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో హెలికాఫ్టర్ ద్వారా మదనపల్లెకి సమీపంలోని చిప్పిలిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మదననపల్లెలోని సత్సంగ్ ఆశ్రమానికి వెళ్లిన రామ్నాథ్ కోవింద్.. భారత్ యోగా విద్యా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆశ్రమంలో యోగా శిక్షకులు, విద్యార్థులతో రామ్నాథ్ మాట్లాడారు. యోగాభ్యాసంలో అనుభవాలను ఆశ్రమ విద్యార్థులు వివరించారు. (చదవండి: హైకోర్టులో నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఊరేగింపు... మేళతాళాలు...
ముంబై: ఆస్ట్రేలియా పర్యటనలో ఆస్ట్రేలియానే నేలకు దించి చరిత్ర తిరగరాసిన భారత క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది. ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో ముందుగా ముంబై చేరుకున్నారు. అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పయనమయ్యారు. సిరీస్ గెలిపించిన కెప్టెన్ అజింక్య రహానే మాతుంగాలోని తన స్వగృహానికి చేరగానే హౌజింగ్ సొసైటీలోని స్థానికులంతా ఎర్రతివాచీ పరిచి మరీ నాయకుడికి ఘన స్వాగతం పలికారు. భార్యతో పాటు రహానే తన రెండేళ్ల కుమార్తెను ఎత్తుకొని నడుస్తుండగా ఇరుగు పొరుగువారు, స్థానికులు అతనిపై అడుగడుగున పూలజల్లు కురిపించారు. అనంతరం రహానేతో కేక్ కట్ చేయించి వేడుక జరుపుకున్నారు. అంతకుముందు ముంబై క్రికెట్ సంఘం రహానే, రోహిత్ శర్మ, శార్దుల్ ఠాకూర్, పృథ్వీ షాలను ఘనంగా సన్మానించింది. బ్రిస్బేన్ టెస్టు హీరో రిషభ్ పంత్ ఢిల్లీలో హర్షధ్వానాల మధ్య ఇంటికి చేరుకున్నారు. తమిళ సీమర్ నటరాజన్కు సొంతూరైన ‘చిన్నప్పంపట్టి’ గ్రామస్థులంతా రథంపై ఊరేగించి బ్రహ్మరథం పట్టారు. ఈ స్వాగత కార్యక్రమంలో ఊరంతా పాల్గొనడం విశేషం. ఓ నెట్ బౌలర్గా జట్టుతో పాటు వెళ్లిన ఈ తమిళ తంబి అన్ని ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్గా ఘనత వహించాడు. కరోనా దృష్ట్యా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం రహానే, రోహిత్, శార్దుల్, పృథ్వీ, హెడ్ కోచ్ రవిశాస్త్రిలను ఏడు రోజుల పాటు హోమ్ క్వారంటైన్ కావాలని అధికారులు సూచించారు. -
బ్యాండ్ బాజాతో రహానేకు ఘన స్వాగతం..
-
అజింక్య రహానేకు గ్రాండ్ వెల్కమ్ : వీడియో వైరల్
సాక్షి, ముంబై: ఆస్ట్రేలియా గడ్డపై సరికొత్త చరిత్రను లిఖించిన టీమిండియా కెప్టెన్ అంజిక్య రహానేకు ముంబైలో ఘన స్వాగతం లభించింది. అపూర్వ విజయయంతో బోర్డర్-గావస్కర్ ట్రోఫిని దక్కించుకున్న రహానే టీంపై దేశవ్యాప్తంగా ప్రశంసలజల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో ముంబైలోని ఆయన అభిమానులు, స్థానికులు కూడా రహానే ఘన స్వాగతం పలికారు. గురువారం ముంబైలోని ఆయన నివాసానికి తిరిగివచ్చిన తరుణంలో బాండ్ బాజాలతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. టీమిండియా విజయంతో దేశం గర్వపడేలా చేసిన కూల్ కెప్టెన్ రహానేకు అపూర్వ స్వాగతం పలికారు అభిమానులు. కుమార్తె ఆర్యను ఎత్తుకుని వస్తున్న రహానేపై పూల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను రహానె భార్య రాధిక ఇన్స్టాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది ఆస్ట్రేలియాలో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడంతో టీమ్ ఇండియాకు నాయకత్వం వహించిన అజింక్య రహానే నేతృత్వంలోని యంగ్ ఇండియా టీం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా రహానే తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా దొపావ్కర్ను సెప్టెంబర్ 26, 2014లో లవ్ కమ్ ఆరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతుల ముద్దుల కూతురే ఆర్య . Skipper Ajinkya Rahane received a grand reception at his home in Mumbai. ❤🤩 pic.twitter.com/2h3W0Khest — Anish Singh (@The_anishsingh) January 21, 2021 -
భూటాన్ లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం
-
అఖండ విజేతకు అపూర్వ స్వాగతం
-
కొత్త వత్సరానికి ఘన స్వాగతం
బీచ్రోడ్డు(విశాఖ తూర్పు): కొత్త సంవత్సరానికి నగర ప్రజలు ఘన స్వాగతం పలికారు. 2018కు బైబై చెప్పి.. 2019కు స్వాగతం చెబుతూ.. సోమవారం అర్ధరాత్రి వరకు డ్యాన్సులు, పాటలతో సరదాగా గడిపారు. నగరంలోని పలు హోటళ్లలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఇందులో యువతీయువకులు పెద్ద ఎత్తున పాల్గొని, వేడుకలు జరుపుకున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సాగరతీరంలో యువత సందడి చేశారు. బీచ్రోడ్డు మొత్తం జాతరను తలపించింది. అల్లిపురం(విశాఖ దక్షిణ): నగరాన్ని ప్రశాంతంగా ఉంచేం దుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తద్వారా విశాఖను సేఫ్ జోన్గా మార్చాలని అధికారులు, సిబ్బందికి నగర పోలీస్ కమిషనర్ మహేష్చంద్ర లడ్డా సూచించారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మంగళవారం సూర్యాభాగ్ ఏఆర్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేక్ కట్ చేసి, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రూపొందించిన హేండ్బుక్, డైరీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర శాంతిభద్రతలు కాపాడటంలో సిబ్బంది ముఖ్యపాత్ర వహించాలన్నారు. 2019లో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. పాపాహోంలో..: పోలీస్ కమిషనరేట్లోని పాపాహోం, సీతమ్మధారలోని బాలికల పాపాహోంలో జరిగిన వేడుకల్లో సీపీ పాల్గొన్నారు. చిన్నారులతో కలసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆయనకు కేక్ తినిపించేందుకు పోటీ పడ్డారు. నగర డీసీపీ–1 రవీంద్రనాథ్బాబు, డీసీపీ–2 అద్మన్ నయీమ్ అశ్మీ, క్రైం డీసీపీ ఏఆర్ దామోదరరావు, ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. బీచ్రోడ్డు(విశాఖ తూర్పు): కలెక్టర్ ప్రవీణ్ కుమార్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు మంగళవారం అన్ని శాఖల ఉన్నాతాధికారులు కలెక్టరేట్కు క్యూ కట్టారు. జాయింట్ కలెక్టర్ సృజన ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఉప రవాణాశాఖాధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో తేజ్, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు. -
అర్చరీ క్రీడకారిణి జ్యోతి సురేఖకు గన్నవరంలో ఘనస్వాగతం
-
పారిస్లో ఫ్రాన్స్ ఆటగాళ్లకు ఘన స్వాగతం
-
విశ్వ సుందరి కిరీటమే లక్ష్యం
మిస్ ఇండియా అనుకృతి వాస్ సొంత రాష్ట్రంలో అడుగుపెట్టారు. మిస్ ఇండియా కిరీటంతో స్వగ్రామం చేరుకున్న ఆమెకు ఆప్తులు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అనుకృతి వాస్ అందరితోనూ ఆనంద క్షణాల్ని పంచుకున్నారు. సాక్షి, చెన్నై : మిస్ ఇండియాగా ఎంపికైన అనుకృతి వాస్ తమిళనాడుకు చెందిన వారే. తిరుచ్చి కోట్టూరు సరస్వతి నగర్లో నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రశాంత్, షెలినా దంపతుల కుమార్తె ఈ అనుకృతి వాస్. ఈమెకు ఇంజినీరింగ్ చదువుతున్న సోదరుడు గౌతమ్ కూడా ఉన్నారు. అనుకృతి వాస్కు నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆమె తండ్రి కుటుంబాన్ని వీడి ఎక్కడికో వెళ్లిపోయారు. దీంతో తల్లి షెలినా సంరక్షణలో పెరిగారు. బాల్యం, ప్రాథమిక, మాధ్యమిక విద్యా భ్యాషం అంతా తిరుచ్చిలో సాగింది. ఉన్నత చదువు చెన్నై లయోల కళాశాలలో బీఏ –ఫ్రెంచ్ చదువుతున్నారు. తమ బిడ్డ మిస్ ఇండియాగా ఎంపిక కావడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేవు. ఆప్తులు, సరస్వతి నగర్ వాసులే కాదు, సహచర విద్యార్థినులు, స్నేహితులు అను రాకకోసం ఎదురు చూశారు. అయితే, శనివారం స్వస్థలానికి ఆమె వస్తున్న సమాచారాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు. ఉదయాన్నే సరస్వతి నగర్కు చేరుకున్న అనుకృతి వాస్కు కుటుంబీకులు, బంధువులు, ఆప్తులు, స్నేహితులు ఆహ్వానం పలికారు. మిత్రులతో కలిసి స్వీట్లు పంచుకుంటూ అను ఆనందాన్ని పంచుకున్నారు. చెన్నైలోనూ.. తిరుచ్చిలో కుటుంబీకులు, ఆప్తులతో ఆనందాన్ని పంచుకునేందుకు అను వచ్చిన సమాచారంతో అభిమానులు పోటెత్తారు. సరస్వతి నగర్ పరిసర వాసులు, తిరుచ్చిలోనూ పలు సంస్థలు, యువజనులు తరలివచ్చి ఆమెను అభినందించారు. అక్కడి నుంచి అనుకృతి వాస్ సాయంత్రం చెన్నైకి చేరుకున్నారు. ఇక్కడి ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెను పలు సంస్థలు సత్కరించి, అభినందించాయి. కాగా, తల్లి సంరక్షణలో పెరిగినా, తన వంతుగా సామాజిక సేవను సైతం అనుకృతి వాస్ సాగిస్తుండడం విశేషం. హిజ్రాలకు విద్యను బోధిస్తున్నారు. అగ్ని అనే ప్రాజెక్ట్ ద్వారా అందరికీ విద్య లభించాలన్న సంకల్పంతో ప్రత్యేక కార్యక్రమాన్ని సాగిస్తున్నారు. చిన్న అనాథాశ్రమాన్ని సైతం నిర్వహిస్తున్న అనుకృతి వాస్ను ప్రముఖులు పొగడ్తలతో, ప్రశంసలతో ముంచెత్తారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, విశ్వ సుందరి కిరీటం లక్ష్యం అని ఆకాంక్షను వ్యక్తం చేశారు. విశ్వ సుందరి కిరీటం లక్ష్యం విశ్వ సుందరి 2018 పోటీలకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అనుకృతి తన సామాజిక సేవను, తన లక్ష్యాన్ని మీడియా ముందు ఉంచారు. 30 మంది పిల్లలతో తాను చిన్న అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. సమాజంలో అందరికీ విద్య దక్కాలని, స్వయం ప్రతిభతో ప్రతి ఒక్కరూ జీవించాలన్నారు. ఇందులో భాగంగా ముప్ఫై మంది హిజ్రాలకు తన వంతు సాయాన్ని అందిస్తున్నట్టు వివరించారు. సమాజానికి తన వంతు సహకారం అందించే రీతిలో బ్యూటీ విత్ ఏ పర్పస్ ప్రాజెక్టు ద్వారా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పళని స్వామిని కలవనున్నట్టు పేర్కొన్నారు. ఇక, తన విజయానికి కారణం తల్లి అని ఆనందాన్ని వ్యక్తంచేశారు. ఆమె ఇచ్చిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదు అని, తనను సూపర్ ఉమెన్గా ఆమె భావించే వారు అని తెలిపారు. మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకునే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. మహిళలు ప్రతికూల దృక్పథాన్ని వీడి అనుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలని సూచించారు. మహిళలు తలచుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదు అని, అన్నింటా జయ కేతనం ఎగుర వేయగలరని వ్యాఖ్యానించారు. కృషి, పట్టుదల, ఆత్మ స్తైర్యంతో లక్ష్య సాధనపై దృష్టిని సారించిన పక్షంలో విజయం తప్పకుండా వరిస్తుందన్నారు. అనుకృతి వాస్ ఆదివారం నగరంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. -
రేణిగుంట రైల్వేస్టేషన్లో వరప్రసాద్కు ఘనస్వాగతం
-
కాపులంతా జగన్ వెంటే
సాక్షి, తిరుపతి తుడా : కాపులు సీఎం చంద్రబాబునాయుడి మోసాలను గుర్తించారని, అందుకే వారంతా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో ఎన్టీఆర్ కుటుంబా నికి అత్యంత ఆప్తులుగా ఉన్న నైనారు కుటుంబానికి చెందిన నైనారు మధుబాల బంధుమిత్రులు, అనుచరులతో కలిసి బుధవారం వైఎస్సార్ సీపీలో చేరారు. భూమన కరుణాకరరెడ్డి నివాసంలో జరి గిన ఈ కార్యక్రమంలో నైనారు మధుబాలకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. కరుణాకరరెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ నైనారు కుటుంబంతో తనకు చిన్ననాటి నుంచి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ఆ కుటుంబం పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఓటు బ్యాంకు కోసం గత ఎన్నికల్లో కాపులను వాడుకున్న సీఎం చంద్రబాబు వారిని దారుణంగా మోసం చేశారని దుయ్యబట్టారు. కుల రాజకీయాలతో చంద్రబాబు పార్టీని నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఎవరు తీసిన గోతిలో వారే పడతారన్న సామెతను నిజం చేస్తూ కుల రాజకీయాలే ఆయన్ను ముంచనున్నాయని జోస్యం చెప్పారు. కాపులకు వైఎస్సార్ సీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. నైనారు మధుబాల మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. కాపు నాయకులు దుద్దేల బాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు బాలిశెట్టి కిశోర్ మాట్లాడుతూ కాపు ఉద్యమానికి జగన్మోహన్రెడ్డి సంపూర్ణ మద్దతు తెలపడంతో బలిజలు వైఎస్సార్ సీపీపై నమ్మకంతో ఉన్నారన్నారు. పార్టీ ఎస్సీ సెల్ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు టి.రాజేంద్ర, అజయ్కుమార్ మాట్లాడుతూ మానవత్వమే వైఎస్సార్సీపీ కులమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కుసుమకుమారి, బొమ్మగుంట రవి, బండ్ల లక్ష్మీపతి పాడి శివప్రసాద్ యాదవ్, పుల్లయ్య, రాధామాధవి, శైలజ, లక్ష్మీరెడ్డి, వాసుయాదవ్, కేతం జయచంద్రారెడ్డి, గీతా యాదవ్, సాయికుమారి తదితరులు పాల్గొన్నారు. -
కామన్వెల్త్ క్రీడా విజేతలకు ఘనస్వాగతం
సాక్షి, న్యూఢిల్లీ: గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు గెల్చుకుని వచ్చిన భారత క్రీడాకారులకు దేశంలో ఘన స్వాగతం లభిస్తోంది. రెజ్లింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన సుశీల్ కుమార్కి, బాక్సింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన మేరికోమ్కి సొంత రాష్ట్రాల్లో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్లో దేశానికి తొలిసారిగా స్వర్ణ పతకాన్ని అందించిన క్రీడాకారిణి మనికా బత్రాకు ఢిల్లీలో ఘనస్వాగతం లభించింది. మంగళవారం ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న మనికాకు అభిమానులు పెద్దఎత్తున స్వాగత ర్యాలీ నిర్వహించారు. మనికా దేశం గర్వపడేలా చేసిందని, ఇలాగే మరిన్ని స్వర్ణ పతకాలు గెలవాలని క్రీడాభిమానులు కోరుకున్నారు. మనికా బత్రా మాట్లాడుతూ.. ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. కామన్వేల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించడం సంతోషంగా ఉందని, ఇలాగే మరిన్ని పతాకాలను భారత్కు అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్లో భారతదేశానికి తొలిసారిగా స్వర్ణ పతకాన్ని అందించింది క్రీడాకారిణి మనికా బత్రా. సింగపూర్ క్రీడాకారిణి మెయినగ్యు యూతో జరిగిన హోరాహోరీ పోరులో మనికా 11-7, 11-6, 11-2, 11-7 పాయింట్లతో గెలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో కామన్వెల్త్ చరిత్రలో భారతదేశానికి టేబుల్ టెన్నిస్లో స్వర్ణపతకం తీసుకొచ్చిన మొదటి మహిళగా రికార్డులకెక్కింది. సెమీ ఫైనల్లో ఈమె వరల్డ్ నెంబర్ ఫోర్ మరియు ఒలింపిక్ మెడల్ గ్రహీతైన సింగపూర్ క్రీడాకారిణి తియాన్వై ఫెంగ్ను ఓడించడం విశేషం. గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యలను భారత అథ్లెట్లు సొంతం చేసుకున్నారు. మొత్తం 66 పతకాలతో భారత్ మూడోస్థానంలో నిలిచింది. భారత మెన్స్ అథ్లెట్లు 13 స్వర్ణాలతో పాటు 9 రజతాలు, 13 కాంస్యా పతకాలు సాధించారు. ఇక ఉమెన్స్ విభాగంలో 12 స్వర్ణాలు, 10 రజతాలు, 6 కాంస్యా పతకాలు వచ్చాయి. మిక్స్ డ్ టీమ్ విభాగం లో ఒక్కో స్వర్ణం, రజతం, కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. -
అంబరాన్నంటిన న్యూ ఇయర్ వేడుకలు
-
షేర్ బహదూర్ దేవ్బాకు ఘనస్వాగతం
-
మిథాలీ సేనకు ముంబయిలో ఘనస్వాగతం
-
మహిళా క్రికెటర్లకు ఘనస్వాగతం..
ముంబై: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడి తిరిగి స్వదేశం చేరుకున్న మిథాలీ సేనకు ఘనస్వాగతం లభించింది. బుధవారం తెల్లవారుజామున ఇంగ్లండ్ నుంచి ముంబై చేరుకున్న జట్టుకు బీసీసీఐ సిబ్బంది, అభిమానులు ఇండియా.. ఇండియా అంటూ హర్షాతిరేకల మధ్య ఘనంగా ఆహ్వానించారు. జులై 23న ఇంగ్లండ్తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 9పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. టోర్ని ఆసాంతం భారత మహిళల ప్రదర్శన భారత అభిమానుల మనసులను గెలుచుకొంది. కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్కౌర్, జులన్ గోస్వామితో పాటు పలువురు క్రికెటర్లకు ముంబైలోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానంలో ఘనస్వాగతం లభించింది. ఈ స్వాగతం అంచనా వేయలేదు.. ఈ సందర్భంగా మిథాలీ మాట్లాడుతూ.. ‘స్వదేశంలో ఇంతటి ఘనస్వాగతం లభిస్తోందని ఏ ఒక్కరమూ అంచనా వేయలేదు. ప్రస్తుతం క్రీడల్లో అమ్మాయిలు అద్భుతంగా రాణిస్తున్నారు. వారంతా వేడుకలు చేసుకోవాలి. గతంలో మహిళా క్రికెట్ గురించి ఎక్కువగా మాట్లాడుకునే వారు కాదు. ప్రపంచకప్లో మా ప్రదర్శనతో ఇప్పుడు అందరూ మా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది చాలా సంతోషకరం’ అని మిథాలీ తెలిపారు. త్వరలో బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి మిథాలీ సేనను సత్కరించనుంది. ఈ కార్యక్రమంలోనే గతంలో ప్రకటించిన నజరానా(ఒక్కొక్క మహిళా క్రికెటర్కు రూ.50లక్షలు)ను అందజేయనుంది. త్వరలో ప్రధాని మోదీని మిథాలీ సేన కలిసే అవకాశం ఉంది. -
శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న అమిత్ షా
-
తిరుమలలో సీఎం కేసీఆర్కు ఘనస్వాగతం
తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావుకు రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. మంగళవారం సాయంత్రం విమానాశ్రయానికి చేరుకున్న సీఎంకు ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తిరుమల గెస్ట్హౌస్కు చేరుకున్నారు. టీటీడీ అతిథి గృహంలో సీఎం కేసీఆర్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని ఆత్మీయంగా పలకరించారు. బుధవారం ఉదయం సీఎం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ. 5 కోట్ల 59 లక్షల విలువైన బంగారు ఆభరణాలను శ్రీవారికి అందజేస్తారు. అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మ వారిని దర్శించుకుంటారు. ఆయనతో పాటు కేటీఆర్, కవిత కుటుంబసభ్యులు, మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, పద్మారావు, ఐకే రెడ్డి తదితరులు ఉన్నారు. -
రేణిగుంటలో కేసీఆర్కు ఘనస్వాగతం