Hamid Ansari
-
నేనెవర్నీ ఆహ్వానించ లేదు.. కలుసుకోను లేదు! : హమీద్ అన్సారీ
న్యూఢిల్లీ: ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కోసం గూఢచర్యం చేసినట్లు పేర్కొన్న పాకిస్తానీ జర్నలిస్టును యూపీఏ హయాంలో హమీద్ అన్సారీ తనను భారత్కు ఆహ్వానించారంటూ ఆరోపణలు వెలువెత్తాయి. ఐతే ఆ ఆరోపణలన్నింటిని హమీద్ అన్సారీ తోసి పుచ్చారు. ఈ మేరకు యూపీఏ హయాంలో తాను ఐదుసార్లు భారత్కు వచ్చానని, పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకి సున్నితమైన సమాచారాన్ని చేరవేసినట్లు పాకిస్తానీ జర్నలిస్ట్ నుస్రత్ మీర్జా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా హమీద్ అన్సారీని ప్రశ్నించడంతో ఆయన ఇలా వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మాట్లాడుతూ..."నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి తరుపున విదేశీ అతిథులకు ఆహ్వానాలు ప్రభుత్వ సలహా మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా పంపబడుతుంది. నేనెవర్నీ రీసివ్ చేసుకోలేదు, ఆహ్వానించ లేదు. తాను రాయబారిగా ఉన్న సమయాల్లో ప్రతి విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశాను. ఇరాన్ రాయబారిగా నేను చేసిన పని గురించి అప్పటి ప్రభుత్వానికి తెలుసు. నేను జాతీయ భద్రతకు కట్టుబడి ఉన్నాను. ఈ విషయమై భారత ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉంది." అని అన్నారు. మాజీ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన హమీద్ అన్సారీ ఇరాన్లో భారత రాయబారిగా ఉన్నప్పుడూ జాతీయ ప్రయోజనాలకు రాజీ పడ్డారంటూ బీజేపీ చేసిన ఆరోపణలను ఖండించారు. తాను టెహ్రాన్లో పనిచేసిన తర్వాత యూఎన్ఎస్సీకి భారత శాశ్వత ప్రతినిధిగా సేవలందించానని, తనకు భారత్లోనూ, విదేశాల్లోనూ గుర్తింపు ఉందని నొక్కి చెప్పారు. (చదవండి: నేను గెలవలేదు!... నా డబ్బులు వెనక్కిచ్చేయండి!...ప్రజలకు బెదిరింపులు) -
మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ వ్యాఖ్యలపై ఆగ్రహం
న్యూఢిల్లీ: మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. శత్రుత్వం నిండిన సంస్థ మద్దతుగల అంతర్జాతీయ వేదికపై భారత దేశ పరువు, ప్రతిష్ఠలను మంటగలిపేందుకు అన్సారీ ప్రయత్నించారని మండిపడ్డారు. రాజ్యాం గ పదవిని నిర్వహించిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం ఆందోళనకరమన్నారు. కొన్ని పాకిస్తాన్ ప్రాయోజిత సంస్థల భారత వ్యతిరేక కుట్రలో భాగమవుతున్నాయన్నారు. ఈ సంస్థలు భారతదేశ సంస్కృతి, సమగ్రతపై గందరగోళం సృష్టించడానికి కుట్ర చేస్తున్నాయని నఖ్వీ ఆరోపించారు. అన్సారీ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. భారతదేశం బలమైన, శక్తివంతమైన ప్రజాస్వామ్యమని, అందుకు ఇతరుల నుండి సర్టిఫికేట్ అవసరం లేదని పేర్కొన్నది. ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ బుధవారం నిర్వహించిన చర్చలో అన్సారీ మాట్లాడుతూ హిందూ జాతీయవాదంపై ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వాసాల ప్రాతిపదికన ప్రజలను వేరు చేసే సాంస్కృతిక జాతీయ వాదం పెరుగుతోందన్నారు. -
మోదీపై అన్సారీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ‘మీ మీద చాలా పెద్ద బాధ్యతలతో కూడిన అంచనాలున్నాయి. కానీ మీరు నాకు సహకరించడంలేదు. ఈ మధ్య బిల్లులెందుకు ఆమోదం కావట్లేదు’అని ప్రధాని మోదీ ముందస్తు సమాచారం లేకుండా తన గదిలోకి వచ్చి ప్రశ్నించారని మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారిక పూర్వకంగా, అసాధారణంగా ఆయన మాట్లాడినట్లు హమీద్ వెల్లడించారు. మోదీకి అతిథి మర్యాదలు చేసిన అనంతరం తన పనేమిటో రాజ్యసభకు, ప్రజానీకానికి తెలుసని సమాధానమిచ్చినట్లు తాను రాసిన పుస్తకం ‘బై మెనీ ఏ హ్యాపీ యాక్సిడెంట్’లో హమీద్ అన్సారీ పేర్కొన్నారు. ఎన్డీఏ తనకు వచ్చిన మెజారిటీని చూసి రాజ్యసభ ప్రక్రియలను, విధివిధానాలపై కూడా నైతిక హక్కును ఇచ్చినట్లు భావించిందని వ్యాఖ్యానించారు. అంతేగాక రాజ్యసభ టీవీ ప్రభుత్వానికి అనుకూలంగా రావడంలేదని అడిగినట్లు చెప్పారు. తాను రాజ్యసభ చానెల్ ఏర్పాటులో భాగంగా ఉన్నప్పటికీ, ఎడిటోరియల్పై తనకు నియంత్రణ లేదని, రాజ్యసభ కమిటీ ఆయా వ్యవహారాలను చూసుకుంటోందని, అందులో వస్తున్న కార్యక్రమాలపై ప్రజలను హర్షిస్తున్నాయని సమాధానమిచ్చినట్లు వెల్లడించారు. -
ఢిల్లీలో రాహుల్ ఇఫ్తార్ విందు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ/ముంబై: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతలకు బుధవారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో నిర్వహించిన ఈ విందుకు మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్తో పాటు మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరయ్యారు. వీరితోపాటు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే నేత కనిమొళి, జేడీఎస్ నేత డానిష్ అలీ, జేడీయూ తిరుగుబాటు నేత శరద్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నేత దినేశ్ త్రివేది, బీఎస్పీ నేత సతీశ్చంద్ర మిశ్రా, ఆర్జేడీ నాయకుడు మనోజ్ ఝా, ఎన్సీపీ నేత డీపీ త్రిపాఠి, జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు హేమంత్ సోరెన్ హాజరయ్యారు. బీజేపీ వ్యతిరేక శక్తుల ఏకీకరణకు వేదికగా మారనుందని భావిస్తున్న ఈ విందుకు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీలు చివరి నిమిషంలో గైర్హాజరయ్యారు. ప్రధాని వీడియో నవ్వించేలా ఉంది ప్రధాని మోదీ ట్వీటర్లో పోస్ట్ చేసిన ఫిట్నెస్ వీడియోపై రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. అది వింతగా, నవ్వించేలా ఉందన్నారు. బుధవారం ఇఫ్తార్ వేడుకలో మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్తో టేబుల్ పంచుకున్న రాహుల్..సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వైపు తిరిగి ‘మోదీకి దీటుగా మీరూ ఫిట్నెస్ వీడియోను పోస్ట్ చేయొచ్చుగా!’ అని అన్నారు. అక్కడే ఉన్న కనిమొళి, దినేశ్ త్రివేది, బీఎస్పీ నాయకుడు సతీశ్ చంద్ర మిశ్రాలు ప్రధాని వీడియో గురించి విని నవ్వుకున్నారు. మహా కూటమి.. ప్రజల ఆకాంక్ష మోదీ,బీజేపీ, ఆర్ఎస్ఎస్ను ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీలతో ఏర్పాటయ్యే మహా కూటమి ప్రజల ఆకాంక్ష అని రాహుల్ గాంధీ ముంబైలో విలేకరులతో అన్నారు. ‘మహా కూటమి ఏర్పాటు బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీల కోసం మాత్రమే కాదు. అది ప్రజల ఆకాంక్ష. మహాకూటమితోనే ప్రధాని, బీజేపీ, ఆరెస్సెస్ లను ఎదుర్కోగలం’ అని పేర్కొన్నారు. -
కర్ణాటక ఎన్నికల కోసమే ఆ దాడి చేశారా?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ గత రెండు రోజులుగా ఆందోళనలతో అట్టుడికి పోతోంది. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీకి యూనివర్శిటీ విద్యార్థుల సంఘం శాశ్వత సభ్యత్వం బహూకరించేందుకు బుధవారం సన్నాహాలు జరుగుతుండగా హఠాత్తుగా హిందూ యువ వాహిణికి చెందిన కార్యకర్తలు కర్రలు, పిస్టళ్లు పట్టుకొని యూనివర్శిటీలోకి వచ్చి నానా బీభత్సం సష్టించారు. వారు ఆ సమయంలో మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ బస చేసిన యూనివర్శిటీ భవనంలోని గేటును ధ్వంసం చేశారు. లోపలకి జొరబడేందుకు ప్రయత్నించారు. వారిలో హిందూ యువ వాహిణికి చెందిన ఆరుగురు కార్యకర్తలు యూనివర్శిటీ భద్రతా సిబ్బంది పట్టుకొని అక్కడ ఉన్న పోలీసులకు అప్పగించారు. యూనివర్శిటీపై దాడి చేసిన ఆరుగురు గూండాలను యూనివర్శిటీ భద్రతా సిబ్బంది పోలీసులకు అప్పగిస్తే మరుసటి రోజుకల్లా వారిని పోలీసులు ఎలాంటి కేసును కూడా నమోదు చేయకుండా విడిచిపెట్టారని యూనివర్శిటీ అధికార ప్రతినిధి ఎం. షఫే కిద్వాయ్ గురువారం నాడు మీడియాకు తెలియజేశారు. పిస్టళ్లలాంటి మారణాయుధాలను కూడా వారు పట్టుకొచ్చారని చెప్పారు. అన్సారీ కార్యక్రమానికి బందోబస్తుగా యూనివర్శిటీలోకి పోలీసులు వచ్చారు. ఉత్తరప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2002లో ఏర్పాటు చేసిన హిందు యువ వాహిణికి చెందిన వారు నిందితులు కనుక పోలీసులు వారిని వదిలేశారని, కేసు పెట్టే ధైర్యం పోలీసులు చేయలేకపోయారని సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయమై ఫిర్యాదు చేయడానికి యూనివర్శిటీ విద్యార్థులు ఊరేగింపుగా పోలీసు స్టేషన్కు వెళ్లగా వారిపై పోలీసులు తీవ్రంగా లాఠీచార్జి చేసి పంపించారని కిద్వాయ్ ఆరోపించారు. ఆలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో ఆరెస్సెస్ శాఖను ఏర్పాటు చేయాలని కొంతకాలంగా ఆరెస్సెస్ డిమాండ్ చేస్తుండగా, యూనివర్శిటీ విద్యార్థి సంఘం కార్యాలయంలో ఉన్న మొహమ్మద్ అలీ జిన్నా ఫొటోను ఎత్తివేయాలని స్థానిక బీజేపీ ఎంపీ పిలుపుతో సంఘ్ పరివార్ డిమాండ్ చేస్తోంది. ఆ ఫొటోను తొలగించడం కోసమే బుధవారం నాడు యూనివర్శిటీ క్యాంపస్లోకి జొరబడినట్లు హిందూ యువ వాహిణి కార్యకర్తలు తెలిపారు. విద్యార్థి సంఘం కార్యాలయంలో జిన్నా ఫొటోతోపాటు జాతిపిత మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ల ఫొటోలు ఉన్నాయి. వారంతా బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులే. అవిభక్త భారత చరిత్రలో జిన్నాకు కూడా ఎంతో పాత్ర ఉంది. ఆ పాత్రను ఎవరూ కాదనలేరు. గతంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ, హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్శిటీలపై దాడి చేసిన మతతత్వ హిందూ శక్తులు ఇప్పుడు అలీగఢ్ యూనివర్శిటీపై దాడి చేశాయి. ఏఎంయూలోని మొహమ్మద్ అలీ జిన్నా ఫొటోపై 80 ఏళ్లుగా ఎలాంటి గొడవ చేయని సంఘ్ పరివారం ఇప్పుడే ఎందుకు గొడవ చేయాల్సి వచ్చిందన్నది కోటి రూకల ప్రశ్నే. అయితే కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో సులభంగానే సమాధానం దొరకుతుంది. -
మన్మోహన్కు మోదీ సర్కార్ పరోక్ష క్షమాపణ!
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దేశభక్తిని, అంకిత భావాన్ని తాము ప్రశ్నించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం స్పష్టం చేశారు. ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ నిబద్ధతను ప్రధాని మోదీ ప్రశ్నించలేదని చెప్పారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలపై మోదీ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. తద్వారా మన్మోహన్పై మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన పరోక్షంగా క్షమాపణ చెప్పినట్టు అయిందని భావిస్తున్నారు. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగాల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలను ఎక్కడా ప్రశ్నించలేదు. అదేవిధంగా వారికి దేశంపట్ల ఉన్న నిబద్ధతపై అనుమానాలు లేవు. మన్మోహన్, అన్సారీలకున్న దేశభక్తి పట్ల మాకు నమ్మకం, విశ్వాసం ఉన్నాయని’ అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. గుజరాత్ శాససభ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచార సభల్లో మన్మోహన్, హమీద్ అన్సారీలపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ప్రధానంగా.. గుజరాత్ ఎన్నికలపై ప్రభావం చూపేలా పాకిస్తాన్ దౌత్యాధికారులను మన్మోహన్ కలిసినట్లు మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాక ఆదేశ మాజీ మంత్రితో మన్మోహన్ రహస్యంగా సమావేశమయ్యారని ఆరోపణలు గుప్పించారు. మన్మోహన్ సింగ్పై ప్రధాని మోదీ నిరాధార ఆరోపణలు చేశారని.. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తోంది. అంతేకాక ఈ ఆరోపణలపై మోదీ క్షమాపణలు చెప్పాంటూ శీతాకాల సమావేశాలు మొదలైనప్పటినుంచీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇదిలావుండగా.. అరుణ్జైట్లీ ప్రకటనపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. దీనిపై మన్మోహన్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే చేసినవని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అరుణ్ జైట్లీ చెప్పిన క్షమాపణలు తన గౌరవాన్ని తిరిగి పెంచుతాయని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
'అన్సారీ ఎందుకిలా చేస్తున్నారో తెలిసింది'
న్యూఢిల్లీ : మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీపై విశ్వ హిందూ పరిషత్ నిప్పులు చెరిగింది. ఓ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి ఎలా వెళ్లారని ప్రశ్నించింది. ఆయన కావాలనే ఇలా చేస్తున్నారని, ముస్లింలలో అసంతృప్తి ఉన్నదనే విషయాన్ని ఆయన చర్యల ద్వారా చూపించాలనుకుంటున్నారని మండిపడింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ మహిళా విభాగం ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే, ఈ సంస్ధకు ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనికే అన్సారీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీహెచ్పీ జాయింట్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ మాట్లాడుతూ 'ఈ కార్యక్రమానికి వెళ్లడం ద్వారా ఆయన మరోసారి తన వైఖరిని వెల్లడించారు. ముస్లింలలో అసంతృప్తి ఉందనే విషయాన్ని ఆయన వ్యాపింపజేస్తున్నారు' అని ఆరోపించారు. పీఎఫ్ఐ అంటే మరేమిటో కాదని, సిమీనే పీఎఫ్ఐగా రూపాన్ని మార్చుకుందంటూ ఆరోపించారు. కేరళలలోని పలువురు దేశ భక్తుల మరణాల వెనుక పీఎఫ్ఐ హస్తం ఉందని కూడా ఆరోపించారు. -
అన్సారీపై ఆర్ఎస్ఎస్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశంలోని ముస్లింలు అభద్రతలో ఉన్నారని ఉపరాష్ట్రపతిగా వైదొలుగతూ హమిద్ అన్సారీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత అన్సారీపై విరుచుకుపడ్డారు. ఆయన తనకు ఎక్కడ పూర్తి స్వేచ్ఛ, భద్రత ఉందని భావిస్తారో ఆ దేశానికి వెళ్లవచ్చని ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేష్ కుమార్ అన్నారు. అన్సారీ సహా ముస్లింలు భారత్లో అభద్రతా భావంతో ఉన్నారని భావిస్తున్నవారంతా ముస్లింలు సురక్షితంగా ఉన్న దేశం పేరు వెల్లడించి, నిరభ్యంతరంగా అక్కడికి వెళ్లవచ్చని కుమార్ పేర్కొన్నారు. నాగపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలను దేశంలో ఎవరూ విశ్వసించడం లేదని, ముస్లింలు సైతం ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకించారని చెప్పారు. పదేళ్లుగా లౌకిక వాదిగా ఉన్న హమీద్ అన్సారీ పదవీ విరమణ చేయగానే కుహనా లౌకికవాదిగా మారారని విస్మయం వ్యక్తం చేశారు. -
మైనారిటీలు లెక్కలోకే రారా?
జాతిహితం ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత మైనారిటీ ఓటు బ్యాంకులు లెక్కలోకి వచ్చేవి కాకుండా పోయాయి. అయినా, మన ప్రభుత్వం వారి రక్షణకు హామీని కల్పిస్తుంది, వారి సామాజిక పరిస్థితులను మెరుగుపరుస్తుంది. అంతేగానీ, దయచేసి అధికారంలో వాటాను మాత్రం అడగకండి. కాకపోతే ఎప్పటికో ఒకప్పటికి మన సొంత సంకేతాత్మకతా ఏర్పడవచ్చు. అప్పుడు మన సొంత దర్శన్ లాల్ తయారవుతాడు. అదే జరిగితే, పాక్లాగే మనమూ మైనారిటీలు లెక్కలోకి రానే రారు అనే సమాధానాన్నే ఎంచుకున్నట్టు అవుతుంది. కోర్టుల్లోని మన న్యాయమూర్తుల పద్ధతిని అరువు తెచ్చుకుని నా వాదనను ముందుగా ఉత్త వాస్తవాలను ఏకరువు పెట్టడంతో మొదలెడదాం. ఆ తర్వాత వాదనతో అది మంచి విషయమా లేక చెడ్డ విషయమా అని నిర్ధారిద్దాం. భారత ఉపరాష్ట్రతి పదవి నుంచి మొహమ్మద్ హమీద్ అన్సారీ నిష్క్రమణ, భారత రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని తెరచింది. గత యాభై ఏళ్లలో మన మైనారిటీలలో ఒక మతం వారు ఒక్కరైనా రాష్ట్రపతి, ఉప రాష్ట్ర పతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, అగ్రశ్రేణి మంత్రులు (హోం, రక్షణ, విదేశాంగ శాఖలు)గా పనిచేసినవారు లేరు. నేను చెప్పింది తప్పని గూగు ల్లో శోధించి నిరూపించాలని మీరు ఉబలాటపడవచ్చేమో. కానీ, నేను పలు స్వల్పకాలిక ప్రభుత్వాలతో సహా నేను ఆ చరిత్రనంతటినీ తిరగేయడమే కాదు, లోతుగా జల్లెడ పట్టేసి మరీ చూసేశాను. మైనారిటీలంటే ముస్లింలే కాదు, క్రైస్తవులు, సిక్కులు కూడానని మరచిపోకండి. గూగుల్ శోధనకు బదులు నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఉన్న వారి పేర్లను పరిశీలించండి. స్వాతంత్య్రానంతర కాలచరిత్రలోనే విశిష్టమైన రీతిలో నేడు మైనారిటీకి చెందిన క్యాబినెట్ మంత్రి ఒక్కరే ఉన్నారు. ఆమె, ఎన్డీఏ భాగస్వామి అకాలీదళ్కు చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్. ఆమెకు, అతి ముఖ్యమైన ఫుడ్ ప్రాసెసింగ్ శాఖను (లేదా అందుకు అసంతృప్తితో ఉన్న ఆమె విధేయులు పిలిచేట్టుగా పచ్చళ్లు, ఊరగాయలు, జామ్లు, జ్యూస్ల శాఖ) అప్పగించారు. ఇంకా దిగువ స్థాయికి పోయి జూనియర్ మంత్రులను పరిశీలిస్తే, మరి కొన్ని పేర్లు కనిపిస్తాయి. సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ కనిపిస్తారు. సహాయ మంత్రులలోకెల్లా ఆయనే అత్యంత సీనియర్. ఆయనది మైనారిటీ వ్యవహారాల శాఖని గమనించండి. విదేశీ వ్యవహారాల సహాయ మంత్రిగా ఉన్న ఎంజే అక్బర్ పేరు కూడా కనిపిస్తుంది. పేర్లు, ప్రత్యేకించి క్రైస్తవుల పేర్లు ఒక్కోసారి తప్పుదారి పట్టించొచ్చు గానీ, నాకు మరే ఇతర పేర్లూ కనిపించలేదు. కాబట్టి క్రైస్తవులు ఎవరూ లేకపోవడం కూడా ఈ మంత్రివర్గపు విశిష్టత కాదా? అది కూడా, ప్రధానంగా క్రైస్తవులే ప్రధానంగా ఉండే ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్న ప్పటి పరిస్థితి ఇది. పైగా, దాదాపు పూర్తి క్రైస్తవ రాష్ట్రాలైన మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్లూ, పంజాబ్, జమ్మూకశ్మీర్లూ తప్ప దేశంలోని 24 ఇతర రాష్ట్రాలలో ఎక్కడా మైనారిటీ ముఖ్యమంత్రి లేరు. దీన్ని మరింతగా పొడి గించి చూద్దాం. ఇందిరాగాంధీ ప్రాభవం వెలిగిన కాలం తర్వాత, అత్యంత బలమైన జాతీయ పార్టీగా ఉన్నది మోదీ–అమిత్షాల బీజేపీయే. ఆ పార్టీ పదవులలో ప్రముఖంగా కనిపించే మైనారిటీవారు ఎవరు? షానవాజ్ హుస్సేన్, ఎస్ఎస్ ఆహ్లూవాలియా, బహుశా ఆ తర్వాత తేజిందర్పాల్ బగ్గా. లౌకికవాద పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్, వామపక్షాలు, హిందీ మాట్లాడే ప్రాంతంలోని పార్టీల తీరు కూడా ఈ విషయంలో ఇంతేనంటూ మీరు దీనికి బదులు చెప్పొచ్చు. అయితే అది, భారత మైనారిటీలు అధికార చట్రానికి ఇంత దూరంగా ఎన్నడూ లేవనే నా మొదటి నిర్ధారణను బలో పేతం చేసేదే. దీనికి సంబంధించి మైనారిటీలలో అభద్రతాభావం ఉండటం సమంజసమే. మెజారిటీలో ఆత్మన్యూనత వాస్తవాలలో వేళ్లూనుకుని, కాల్పనికతలతో అల్లుకున్న అద్భుతమైన పలు వైచిత్రులను మన రాజకీయాలు ఆవిష్కరిస్తుంటాయి. ఎల్కే అద్వానీ, అటల్ బిహారి వాజ్పేయి (ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్న వరుస క్రమం) తమ పార్టీని 1984 నాటి శిథిలాల నుంచి తమ పార్టీని పునరుజ్జీవితం చేశారు. మైనారిటీల పట్ల హిందూ మెజారిటీలో ఉన్న ఆత్మన్యూనతా భావం అనే అంశాన్ని కేంద్రంగా చేసుకుని వారు ఆ పనిని చేపట్టారు. అది కాల్పనిక మైనదిగానీ లేదా విజయవంతంగా సాగించిన ప్రచారంతో రేకెత్తించిన తమపై తాము జాలిపడే «సామూహిక ధోరణిగానీ కాదు. దశాబ్దాల తరబడి సాగిన కాంగ్రెస్ పాలనలో నెహ్రూ, దృఢమైనదే అయినా సాపేక్షికంగా సులువైనదిగా ఉండే మైనారిటీవాదాన్ని అనుసరిం చారు. అది ఇందిరాగాంధీ, దూకుడుతనపు మైనారిటీవాదంగా పరిణమిం చింది. ఆ తర్వాత అది, షా బానో కేసులో రాజీవ్ గాంధీ చరిత్రాత్మకమైన లొంగుబాటుగా పరిణమించింది. అది, వారి సొంత పార్టీలోని ఉదారవాద ముస్లింలు సైతం భ్రమలను కోల్పోయేటంత నాటకీయంగా జరిగింది. అప్పట్లో ముస్లింల ప్రముఖ నేతగా ఎదుగుతున్న ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అందుకు నిరసనగా పార్టీని వీడారు కూడా. అలీఘర్ విశ్వవిద్యాలయం విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగిన ఆయన సహాయ మంత్రిగా ఉండేవారు. మితవాద హిందువులు (వారు బీజేపీ ఓటర్లే కానవసరం లేదు) దీన్ని, అదే సంస్కరణోత్సాహంతో హిందూ కోడ్ బిల్లులను తేవడంతో పోల్చి చూశారు. అదే పార్టీ, ముస్లిం మత పెద్దలను ఇలా ఎలా బుజ్జగిస్తుంది? అది అద్వానీకి అవకాశాన్ని తెరిచింది. మైనారిటీ అంటే మెజారిటీలో ఉన్న ఈ ఆత్మన్యూనతా భావం భారత రాజకీయాలను మౌలికమైన రీతిలో మార్చేసింది. ఫలితమే నేటి మైనారిటీ–ముక్త్ భారత్ సర్కార్. అన్సారీ అక్షింతలు అవసరం కాదా? 1993–94 నాటి ‘‘ఇండియా రీడిఫైన్స్ ఇట్స్ రోల్’’ అనే నా రచనలో, బీజేపీ ఇలా భారత రాజకీయాల్లో ప్రధాన శక్తిగా ఆవిర్భవించడం గురించి ఊహించి, చర్చించాను. ప్రధానిగా తన మొదటి అవిశ్వాస తీర్మానానికి జవాబు చెబుతూ వాజ్పేయి దాని నుంచి ఉల్లేఖిస్తూ, తీవ్ర విచారం ధ్వనించే స్వరంతో ఇలా అన్నారు: కొంత అసాధారణమైనదే జరిగింది. మైనారిటీ లంటే హిందూ మెజారిటీ ఆత్మన్యూనతా భావాన్ని ఏర్పరచుకుంది. నిరుత్సా హంతో ఆయన ఆ అంశాన్ని గుర్తించి, దాని గురించి తాను ఏమైనా చేస్తానని వాగ్దానం చేశారు. 1988లో మెజారిటీలోని ఈ ఆందోళన గురించి ఆయన నొక్కి చెప్పినప్పుడు ప్రశంసలు లభించాయి. రెండు దశాబ్దాల తర్వాత హమీద్ అన్సారీ మైనారిటీలలో ఉన్న అదే ఆందోళన గురించి మాట్లాడినం దుకు ఆయనపై దాడి చేస్తున్నారు. మనం వాజ్పేయి మాటలు విన్నంత శ్రద్ధగా ఆయన మాటలూ వినాలి. వాజ్పేయి చెప్పినదే సరైనదైతే, మనం ఆ తర్వాతి కాలంలో మన రాజకీయాలను అతిగా సరిదిద్దామా? అలా జరిగి ఉంటే, అన్సారీ అక్షింతలు వేయడం న్యాయమైన ఆందోళనతోనే కాదా? దిద్దుబాటు అవసరం లేదా? చివరిగా, అసలు మైనారిటీలు లెక్కలోకే రారా? విలక్షణమైన మూడు ఆసియా ప్రజాస్వామ్య దేశాలు ఈ సమస్యతో తంటాలు పడ్డాయి. బంగాళాఖాతం నుంచి మధ్యధరా సముద్రం వరకు ఉన్న సువిశాల ప్రాంతంలో ముస్లిం మైనారిటీలుసహా పౌరులందరికీ ఓటింగ్ హక్కును అనుమతించే దేశాలు ఇజ్రాయెల్, భారత్ మాత్రమేనని ఇజ్రాయెల్ నేత షైమన్ పెరెస్ 1992లో నాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అన్నారు. కాబట్టి ఆయన దేశం కూడా మైనారిటీలకు ప్రాధాన్యం ఇస్తుంది గానీ, వారికి యూదు పౌరులకుండే పూర్తి ప్రజాస్వామిక హక్కులను, ఎంపిక అవకాశా లను ఇవ్వదు. జాన్ లై కారె, తన ‘‘ద లిటిల్ డ్రమ్మర్ గర్ల్’’ అనే గూఢచార నవలలో ఖలీల్ అనే పాత్రతో.. ఇజ్రాయెల్ తన యూదు రాజ్య భావజాలాన్ని, ఆధు నిక ఉదారవాద ప్రజాస్వామ్యంతో సమం చేయడంలో ఎదుర్కొంటున్న సందిగ్ధాన్ని తెలిపారు. వెస్ట్బ్యాంక్ ప్రాంతాలను ఇజ్రాయెల్ తనవిగా ఉంచు కోవాలంటే, అరబ్బులందరికీ ఓటింగ్ హక్కు ఇవ్వాలి, ఇస్తే అది యూదు రాజ్యమే కాకుండా పోతుంది. అందువల్లనే ఇజ్రాయెల్, అందరికీ ఓటున్నా సమానత్వం లేని విచిత్ర ప్రజాస్వామ్యం అయింది. అరబ్బు పౌరులు ఉన్నత స్థానాలను అందుకోలేకపోతే ప్రశ్నించే వారు లేరు. పాకిస్తాన్ మనకు ఆదర్శమా? ఆ తర్వాత, పాకిస్తాన్ కూడా పెరెస్ రెండు ప్రజాస్వామ్యాల (ఆ ప్రజా స్వామ్యం వచ్చి పోతుండేదే అయినా) దేశంగా మారింది. ఇజ్రాయెల్లాగే అది కూడా ఒక భావజాల రాజ్యం, అదీ అదే ప్రశ్నను ఎదుర్కొంటోంది. మైనారిటీలకు సమాన రాజకీయ హక్కులు ఉండేట్టయితే, అది ఇస్లామిక్ రిపబ్లిక్గా ఉండగలదా? ఆ దేశ వ్యవస్థాపకులు ఆకుపచ్చ జెండాపై మైనారిటీ లకు ప్రాతినిధ్యం వహించేలా తెల్ల పట్టీని ఉంచారు. కానీ రాజకీయాలకు వచ్చేసరికి వలసవాద శైలిలో మైనారిటీలకు రిజర్వుడ్ నియోజక వర్గాలను ఏర్పాటు చేశారు. అది ఆసక్తికరమైన సంకేతాత్మకతలకు దారితీసింది. కొత్తగా ఏర్పరచిన, రాష్ట్రాల మధ్య సమన్యయ మంత్రిత్వ శాఖ మంత్రిగా దర్శన్ లాల్ నియామకం లేదా పాక్ సైన్యంలోని మొదటి సిక్కు అధికారి హర్చరణ్ సింగ్ సంస్మరణను పాటిస్తూ తమ క్షణిక లౌకికవాదానికి గర్వంతో ఉప్పొం గడం లేదా తాజాగా హిందూ అమరవీరుడు లాన్స్ నాయక్ లాల్ చాంద్ రబారీని కీర్తించడం అలాంటి సంకేతాత్మకతలే. అదే సమయంలో, హిందూ మైనారిటీ బాలికలను కిడ్నాప్ చేసి, బలవంతపు మత మార్పిడులు చేయిం చిన ఒక రాజకీయవేత్తను సత్కరించడమూ చేశారు. హిందువులను పార దోలి వారి జనాభాను క్షీణింపజేయడం కోసం విస్తృతంగా వారిపై వేధింపు లకు పాల్పడుతూనే ఉన్నారు. హిందువులే గాక, సిక్కులు, క్రైస్తవులు, అహ్మదీ యులను కూడా నాస్తిక మతభ్రష్టులని దూషిస్తూ, వేధింపులకు పాల్పడు తున్నారు. మునుపటి కాంగ్రెస్–లౌకికవాద ప్రభుత్వాలు మైనారిటీ ఓటు బ్యాంకుల రాజకీయ క్రీడ సాగించాయని భారత మితవాదం అనడంలో వాస్తవముంది. మైనారిటీలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చేస్తూ కాంగ్రెస్ను, దాని మిత్రులను అధికారంలోకి తెచ్చిన మాటా నిజమే. కానీ ఇప్పుడు, ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత వారి ఓటు బ్యాంకులు ఇక లెక్కలోకి వచ్చేవి కాకుండా పోయాయి. అయినా, మన ప్రభుత్వం వారి రక్షణకు హామీని కల్పిస్తుంది, వారి సామాజిక పరిస్థితులను మెరుగుపరచడం చేస్తుందను కోండి. అంతేగానీ, దయచేసి అధికారంలో వాటాను మాత్రం అడగకండి. కాకపోతే ఏదో ఒక సమయానికి మనం కూడా సంకేతాత్మకతను సృష్టించ వచ్చు. అప్పుడు మన సొంత దర్శన్ లాల్ తయారవుతాడు. అలాంటప్పుడు, ఈ సమస్యకు పాక్ చెప్పుకున్న.. మైనారిటీలు లెక్కలోకి రానే రారు అనే సమా ధానాన్నే మనమూ ఎంచుకున్నట్టు అవుతుంది. ఈ ప్రశ్నతో దీన్ని ముగిద్దాం: మనం మన జాతీయవాదాన్ని పునర్నిర్వచించుకునే సమయంలో మనకు స్ఫూర్తి, చివరకు పాకిస్తాన్ అవుతుందా? వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ శేఖర్ గుప్తా -
అభద్రతలో ముస్లింలు: అన్సారీ
-
అన్సారీకి రాజ్యసభ వీడ్కోలు
-
అన్సారీకి రాజ్యసభ వీడ్కోలు
చైర్మన్గా తన వంతు న్యాయం చేశారు: ప్రధాని ► సభా నియమాల్ని పాటించడంలో ఆయనకు ఆయనే సాటి: సభ్యులు ► అన్సారీ నుంచి ఎన్నో సలహాలు, సూచనలు తీసుకున్నా: మన్మోహన్ ► ప్రభుత్వ విధానాలపై విమర్శల్ని అనుమతించకపోతే నిరంకుశత్వమే: అన్సారీ న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్గా చివరి రోజైన గురువారం హమీద్ అన్సారీకి పార్టీల కతీతంగా ఘనంగా వీడ్కోలు పలికారు. రాజ్యాంగ ధర్మాన్ని పరిరక్షించడంలో అన్సారీ తన వంతు న్యాయం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. రాజ్యసభను సజావుగా నడపడంలో అన్సారీ పాత్రను సభ్యులు గుర్తు చేసుకున్నారు. విధి నిర్వహణలో ఎక్కువ సమయం సభా నియమాల్ని పాటించేందుకు కృషిచేశారని, ఆయన హయాంలో గందర గోళం మధ్య ఏ బిల్లు ఆమోదం పొందలేదని ప్రశంసించారు. రెండుసార్లు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన అన్సారీ.. పదేళ్ల పాటు రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించారు. తదుపరి చైర్మన్గా శుక్రవారం ఎం.వెంకయ్య నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ..‘ ప్రజలు, పార్లమెంట్ ఉభయ సభల తరఫున దేశ ఉపాధ్యక్షుడిగా మీరు అందించిన సేవలకు కృతజ్ఞతలు చెబుతున్నాను. దౌత్య ప్రతినిధిగా పశ్చిమాసియాలో ఎంతో చురుగ్గా పనిచేశారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా.. మైనార్టీ కమిషన్, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీతో కలిసి ఎక్కువ సమయం పనిచేశారు. ఇన్నేళ్లలో మీలో మీరు ఎంతో సంఘర్షణ అనుభవించి ఉంటారు. ఇక నుంచి ఆ సందిగ్ధత ఉండదు. స్వేచ్ఛగా ఉండేందుకు, మీ మనోభీష్టం మేరకు పనిచేసేందుకు, మాట్లాడేందుకు అవకాశం దొరుకుతుంది’ అని మోదీ పేర్కొన్నారు. శారీరకంగా కూడా అన్సారీ ఎంతో ఆరోగ్యవంతుడని మోదీ ప్రశంసించారు. సభా నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లా డుతూ ‘అన్సారీకి, సభ్యులకు ఇది ఎంతో ఉద్వేగభరిత సమయం. చైర్మన్గా మీ విధి నిర్వహణ ఎంతో సవాలుతో కూడింది. రాజ్య సభ 1950, 60ల్లో ఉన్నట్లు లేదు, ప్రస్తుతం పార్టీల బలాబలాల్ని సభ ప్రతిఫలిస్తుంది. పరస్పర దూషణలతో చర్చ మొదలై గందర గోళం, ఆందోళనల మధ్య సాగుతోంది. అయి తే అన్సారీ హయాంలో ఎన్నోసార్లు సభకు అంతరాయం కలిగినా.. చాలా సందర్భాల్లో మంచి చర్చ జరిగింది’ అని జైట్లీ పేర్కొన్నారు. నడక, యోగా అన్సారీ ఆరోగ్య రహస్యం రాజ్యసభ చైర్మన్గా అన్సారీ పాత్రను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కొనియాడారు. దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నా.. అన్సారీ వంటి వ్యక్తుల వల్లే పురోగమిస్తోందన్నారు. ఎన్నో సార్లు ఆయన నుంచి సలహాలు సహకారం పొందానని మన్మోహన్ గుర్తు చేసుకున్నారు. చైర్మన్గా సభ నడిపిన తీరును ప్రతిపక్ష నేత ఆజాద్ కొనియాడారు. మంచి ఆరోగ్యం కోసం అన్సారీ క్రమం తప్పకుండా నడకతో పాటు యోగా చేస్తారని తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ వెల్లడించారు. బాధ్యతగా వ్యవహరించాలి: అన్సారీ ప్రభుత్వ విధానాలపై స్వేచ్ఛగా, నిజాయతీతో కూడిన విమర్శల్ని అనుమతించకపోతే.. ప్రజాస్వామ్యం నిరంకుశత్వానికి దారి తీస్తుందని హమీద్ అన్సారీ అన్నారు. రాజ్యసభ చైర్మన్గా చివరి ప్రసంగం చేస్తూ.. ‘సభ్యులకు విమర్శించే హక్కుంది. అయితే కావాలని సభను అడ్డుకునేలా వ్యవహరించకూడదు. అందరికీ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి’ అని పేర్కొన్నారు. రాజ్యాంగం ఏర్పాటుచేసిన రాజ్యసభ దేశంలోని భిన్నత్వాన్ని ప్రతిఫలిస్తుందని అన్సారీ అభిప్రాయపడ్డారు. రాజ్యసభలో అధ్యక్ష స్థానం.. క్రికెట్లో అంపైర్, హాకీలో రిఫరీ వంటిదని ఆటను, ఆటగాళ్లను పర్యవేక్షిస్తూ.. రూల్స్ పుస్తకం ఆధారంగా వ్యవహరించాలని చెప్పారు. ‘నా కుమారుడు హిందూనా? ముస్లిమా?’ న్యూఢిల్లీ: రాజ్యసభలో శుక్రవారంతో పదవీకాలం ముగియనున్న ముగ్గురు సభ్యులకు వీడ్కోలు పలికేందుకు గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి, తృణమూల్ కాంగ్రెస్కు చెందిన బంద్యోపాధ్యాయ్, బీజేపీ ఎంపీ దిలీప్ పాండ్యల పదవీకాలం ముగియనుంది. ఈ కార్యక్రమంలో సీతారాం ఏచూరి మాట్లాడుతూ దేశంలో బహుళత్వాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఏకత్వంలోని భిన్నత్వ భావనలను బలపరిచినప్పుడే దేశం బలపడుతుందని ఆయన అన్నారు. ఏచూరి మాట్లాడుతూ ‘మన భిన్నత్వంపై మీరు మత, భాషా, సాంస్కృతిక తదితర ఏ ఏకత్వాన్నైనా బలవంతంగా రుద్దాలని చూస్తే దేశం ఒకటిగా ముందుకు సాగలేదు. బహుళత్వమే భారత బలం. అది లేనినాడు దేశం కుప్పకూలుతుంది’ అని హెచ్చరించారు. ‘నేను మద్రాసులో ఓ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. నా పాఠశాల విద్యాభ్యాసమంతా ఇస్లాం సంస్కృతి ఎక్కువగా ఉండే హైదరాబాద్లో సాగింది. ఓ సూఫీ ముస్లిం కూతురిని నేను పెళ్లి చేసుకున్నాను. మా మామయ్య తల్లి రాజ్పుత్ వంశానికి చెందిన వారు. అయితే నా కుమారుడు ఏమవుతాడు? అతడు బ్రాహ్మణుడా, హిందూనా, ముస్లిమా?.. అవేమీ కాదు, నా కుమారుడు భారతీయుడు’ అని ఏచూరి అన్నారు. -
అన్సారీపై వెంకయ్య ఎటాక్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని ముస్లింలలో అభద్రతా భావం నెలకొందని, అసంతృప్తి పోగైందంటూ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ అనడాన్ని ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు తప్పుబట్టారు. అన్సారీ వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న అసత్య ప్రచారం అని మండిపడ్డారు. మరోపక్క, బీజేపీ కూడా అన్సారీ వ్యాఖ్యలు తప్పుపట్టింది. అత్యున్నత హోదాలో ఉన్న ఓ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొంది. ఆయన రాజకీయ ఆశ్రయం కోరేందుకు ఇలా మాట్లాడినట్లుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ విమర్శించారు. పదవీ విరమణ సమయంలో ఉపరాష్ట్రపతి హోదాలో ఉండగానే ఇలాంటి మాటలు సరికాదన్నారు. తాము ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించబోమని స్పష్టం చేశారు. రాజ్యసభలో అన్సారీ ఉభయపక్షం వహిస్తున్నారని భావిస్తున్నారా అని ప్రశ్నించగా 'ఆయన తప్పు చేశారు.. అది ఉద్దేశపూర్వకంగా చేశారా? కాదా అనేది నేను చెప్పలేను' తెలిపారు. గురువారంతో పదవీ విరమణ చేయనున్న హమీద్ అన్సారీ ఓ ఇంటర్వ్యూలో పై వ్యాఖ్యలు చేశారు. గోరక్షకుల పేరిట కొందరు వ్యక్తులు గోవధకు పాల్పడిన వారిపై దాడులకు పాల్పడటం, హత్యలు చేయటంపై పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ‘ముస్లింలలో అభద్రత, అసౌకర్య భావనలు వ్యాపిస్తున్నాయి. దేశపౌరుల భారతీయతను ప్రశ్నించడమనేది ఇబ్బందికరమైన విషయం. జాతీయవాదాన్ని ప్రతిరోజూ ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు.. నేను భారతీయుడిని.. అంతే’ అని హమీద్ అన్సారీ అన్నారు. ఇదిలా ఉండగా, అన్సారీ దిగిపోతున్న వేళ 'మీ నుంచి మేం చాలా నేర్చుకున్నాం' అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. -
ఆర్డినెన్సుల సంప్రదాయం సరికాదు!
అత్యవసర పరిస్థితుల్లోనే దీన్ని వాడాలి ► పార్లమెంటు స్తంభనతో విపక్షాలకే నష్టం ► పార్లమెంటేరియన్గా జ్ఞాపకాలు మరువలేనివి ► ఎంపీల వీడ్కోలు సమావేశంలో రాష్ట్రపతి ప్రణబ్ ► మోదీ, ఇందిరపై ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు న్యూఢిల్లీ: ప్రభుత్వం తరచూ ఆర్డినెన్సులు తీసుకొచ్చే సంప్రదాయాన్ని మానుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లోనే ఆర్డినెన్సు మార్గాన్ని ఎంచుకోవాలన్నారు. పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఎంపీలంతా కలిసి ఆదివారం ప్రణబ్ ముఖర్జీకి వీడ్కోలు సమావేశం ఏర్పాటుచేశారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్లు ప్రణబ్ ముఖర్జీకి సెంట్రల్ హాల్లోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతూ.. ‘తప్పనిసరి, అత్యవసర పరిస్థితుల్లోనే ఆర్డినెన్సును వినియోగించాలని నేను బలంగా విశ్వసిస్తాను. సాధారణ, ఆర్థికపరమైన అంశాల్లో ఆర్డినెన్సుపై ఆలోచించకూడదు’ అని సూచించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన అంశాలు లేదా హౌజ్ కమిటీ ముందు పెండింగ్లో ఉన్న అంశాలపై ఆర్డినెన్సు తీసుకురావటం సరైంది కాదన్నారు.శత్రు ఆస్తుల చట్టం–1968కు సవరణలు తీసుకొచ్చేందుకు విఫలమైన ప్రభుత్వం దీనిపై ఐదుసార్లు ఆర్డినెన్సులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ప్రణబ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ బిల్లు మార్చినెలలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. మోదీ సహకారం మరువలేనిది ప్రతి అడుగులోనూ ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన సూచనలు, సహకారం మరువలేనివని ప్రణబ్ గుర్తుచేసుకున్నారు. ‘దేశంలో గుణాత్మక పరివర్తన తీసుకొచ్చేందుకు మోదీ బలమైన కాంక్ష, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో ఏర్పడిన బంధం మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తనకు మార్గదర్శకత్వం చేశారని గుర్తుచేసుకున్న ప్రణబ్.. దృఢచిత్తం, స్పష్టమైన ఆలోచనలు, నిర్ణయాత్మకమైన కార్యాచరణే ఆమెను ఉన్నతమైన వ్యక్తిగా నిలిపాయన్నారు. తప్పును తప్పు అని చెప్పటంలో సంశయించేవారు కాదన్నారు. ఎమర్జెన్సీ తర్వాత లండన్లో ఇందిర మాట్లాడుతూ‘ఈ 21 నెలల్లో అన్ని వర్గాల భారతీయులను పరాధీనులుగా మార్చాం’ అని తప్పును ఒప్పుకున్నట్లు ప్రణబ్ తెలిపారు. రచ్చకాదు.. చర్చ జరగాలి 1969లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయినపుడు అధికార, విపక్షాల్లోని గొప్ప పార్లమెంటేరియన్ల ప్రసంగాలు విని ఎన్నో విషయాలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. సభలో చర్చలు, వాదోపవాదాలు, భిన్నాభిప్రాయాల విలువ తనకు బాగా తెలుసని రాష్ట్రపతి చెప్పారు. తరచూ పార్లమెంటును స్తంభింప చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు విపక్షానికే చేటుచేస్తాయని కూడా ప్రణబ్ సుతిమెత్తగా హెచ్చరించారు. ‘స్వాతంత్య్రానంతరం దేశ సోదరభావం, గౌరవం, ఐకమత్యాన్ని ప్రోత్సహించేందుకు మనం నిర్ణయించుకున్నాం. ఈ విధానాలే మన దేశానికి ధ్రువతారగా మారాయి’ అని ప్రణబ్ పేర్కొన్నారు. ‘నేను ఎంపీగా ఉన్న రోజుల్లో పార్లమెంటులో చర్చలు, వాదోపవాదాలు జరిగేవి. భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యేవి. పార్లమెంటులో తరచూ ఆందోళనలు జరగటం వాయిదా పడటం వల్ల విపక్షానికే నష్టం జరుగుతుందని అర్థం చేసుకున్నా’ అని ప్రణబ్ వెల్లడించారు.‘సప్తవర్ణ శోభితమైన జ్ఞాపకాలు, దేశ ప్రజలకు వినయపూర్వకమైన సేవకుడిగా పనిచేసినందుకు సంతోషకరమైన, సఫలీకృతమైన భావనతో ఈ భవనాన్ని (పార్లమెంటును) వీడుతున్నాను’ అని ప్రణబ్ ఉద్వేగంగా తన ప్రసంగాన్ని ముగించారు. ప్రణబ్ గురుసమానులు: సుమిత్ర రాజ్యాంగం, పార్లమెంటరీ నియమ, నిబంధనలపై పట్టు ఉన్న ప్రణబ్ ముఖర్జీ అంటే ఎంపీలకు ఎనలేని గౌరవమని స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. చాలా మంది పార్లమెంటేరియన్లకు ప్రణబ్ గురువులాంటివారన్నారు. ప్రజలంతా దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పునరంకితం అవ్వాలని ఆయన తరచూ కోరేవారని హమీద్ అన్సారీ గుర్తుచేశారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో ప్రణబ్ ముఖర్జీ పాత్రను ఎంపీలు గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రణబ్కు ఎంపీల తరపున ‘కాఫీ టేబుల్’ పుస్తకాన్ని స్పీకర్ బహూకరించారు. న్యూఢిల్లీ: కొత్త రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని రెండు బంగ్లాలు చారిత్రక ప్రాధాన్యం సంతరించు కున్నాయి. మంగళవారం పదవీ విరమణ చేయనున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఢిల్లీ రాజాజీ మార్గ్లోని 10వ నంబర్ భవనం స్వాగతం పలకడానికి ముస్తాబవు తోంది. మాజీ రాష్ట్రపతి కలామ్ 2015లో మరణిం చేవరకు ఈ బంగ్లాలోనే నివసించారు. తర్వాత దీన్ని కేంద్ర మంత్రి మహేశ్ శర్మకు కేటా యించారు. భవనాన్ని ప్రణబ్కు కేటాయించడంతో శర్మ అక్బర్ రోడ్డులోని 10వ నంబర్ ఇంటికి మారారు. యాదృచ్ఛికంగా ఇదే భవనంలో కొత్త రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్నాథ్ కోవింద్ తాత్కా లికంగా నివసిస్తుండటం విశేషం. రాష్ట్రపతి ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఆయన ఈ బంగ్లాలోనే నివసిస్తున్నారు. 10, అక్బర్ రోడ్డు నుంచే కోవింద్ రాష్ట్రపతి భవన్లోకి అడుగుపెట్టనున్నారు. ప్రణబ్తో మరువలేని జ్ఞాపకాలు! న్యూఢిల్లీ: భారత 13వ రాష్ట్రపతిగా తన పదవికి మంగళవారం రాజీనామా చేయనున్న ప్రణబ్ ముఖర్జీ వ్యక్తిత్వం, తమతో ఆయన అనుబంధాన్ని పాత మిత్రులు గుర్తుచేసుకుంటున్నారు. రాజకీయ చాణక్యుడిగా, ఆర్థిక, విదేశాంగ విధానాల నిపుణుడిగానే కాదు.. క్లిష్ట సమయాల్లో పార్టీని ఆదుకోవటంలో ప్రణబ్ గొప్పదనం మరిచిపోలేనిదంటున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో ఆమె కేబినెట్ మంత్రిగా ప్రణబ్ మధ్య చాలా కీలకాంశాలపై వ్యక్తిగతంగా చర్చ జరిగేదని.. అంతలా ప్రణబ్ను ఇందిర విశ్వసించేవారన్నారు. ‘ఇందిర, ఎమర్జెన్సీకి సంబంధించిన విషయాలపై ఎంత ప్రయత్నించినా ప్రణబ్ నోటినుంచి ఒక్క మాట కూడా రాబట్టలేరు’ అని ప్రణబ్ ముఖర్జీకి సన్నిహితుడైన జర్నలిస్టు జయంత ఘోష్ తెలిపారు. ‘ఆరోగ్య సమస్యలు తలెత్తాక పొగతాగటం మానేశారు. అలవాటు మానుకోలేని కారణంగా నికోటిన్ లేకున్నా ఉట్టి పైప్లనే నోట్లో పెట్టుకునేవారు’ అని ఘోష్ గుర్తుచేసుకున్నారు. ముఖ్యనేతలు, దేశాధినేతలు, విదేశీ ప్రముఖులు బహుమతులుగా ఇచ్చిన 500కు పైగా పైప్ల కలెక్షన్ను రాష్ట్రపతి భవన్ మ్యూజియంకు ప్రణబ్ కానుకగా ఇచ్చారు. ‘ప్రణబ్కు రాజకీయాలతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థ గురించి చాలాబాగా తెలుసు. ప్రభుత్వానికి సమస్యలు రానీయకుండా రాజ్యాంగాన్ని కాపాడటం కూడా ఆయనకు తెలుసు. భారత అత్యుత్తమ రాష్ట్రపతుల్లో ఆయన ఒకరు’ అని కేంద్ర కేబినెట్లో మాజీ సహచరుడు శివ్రాజ్ పాటిల్ తెలిపారు. రక్షణ, ఆర్థిక, విదేశాంగ, హోం వంటి వివిధ శాఖల బాధ్యతలు నిర్వహించినా ప్రభుత్వంలో ఆయనే ఎప్పుడూ నెంబర్ 2గా ఉండేవారన్నారని మరికొందరు పేర్కొన్నారు. -
మాయావతి రాజీనామా ఆమోదం
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామా ను చైర్పర్సన్ హమీద్ అన్సారీ ఆమోదించినట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లో దళితులపై జరుగుతున్న దాడులు, హింస గురించి సభలో మాట్లాడే అవకాశం తనకు ఇవ్వడంలేదని అధికార బీజేపీ, చైర్పర్సన్పై ఆరోపణలు చేస్తూ ఆమె బుధవారం 3 పేజీల రాజీనామా లేఖ రాశారు. అయితే, దానిని చైర్పర్సన్ తిరస్కరించారు. దీంతో నిర్దేశిత ఫార్మాట్లో తన సొంత దస్తూరితో రాసిన ఏక వాక్య రాజీనామా లేఖను తిరిగి అందించగా చైర్పర్సన్ ఆమోదించారు. మాయావతి రాజీనామాను డ్రామా అని బీజేపీ కొట్టిపారేసింది. -
సగం మందికే 'ప్రమోషన్'!
ఉపరాష్ట్రపతి పదవి అలంకరించిన 12 మందిలో ఆరుగురు మాత్రమే రాష్ట్రపతులయ్యారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి మహ్మద్ హమీద్ అన్సారీ సహా మిగిలిన ఆరుగురికి అత్యున్నత రాజ్యాంగ పదవి చేపట్టే అవకాశం రాలేదు. మొదటి ముగ్గురుసర్వేపల్లి రాధాకృష్ణన్, జాకిర్ హుస్సేన్, వీవీ గిరి రాష్ట్రపతులయ్యాక, ఆ తర్వాత ముగ్గురికి (గోపాల్ స్వరూప్ పాఠక్, బసప్ప దానప్ప జట్టి, మహ్మద్ హిదాయతుల్లా) ఆ అదృష్టం దక్కలేదు. తర్వాత వరుసగా ఉపరాష్ట్రపతులైన ముగ్గురూ (ఆర్.వెంకట్రామన్, శంకర్దయాళ్ శర్మ, కేఆర్ నారాయణన్) రాష్ట్రపతి పదవిని అధిష్టించారు. కాని, ఇప్పటికి చివరి ముగ్గురుకె.కృష్ణకాంత్, భైరోసింగ్ షెఖావత్, మహ్మద్ హమీద్ అన్పారీ రాష్ట్రపతి భవన్లో ఐదేళ్ల చొప్పున నివాసముండే అవకాశం దక్కించుకోలేకపోయారు. ‘ప్రమోషన్’ పొందిన ‘మొదటి’ ముగ్గురు! మొదటి ఉపరాష్ట్రపతిగా పదేళ్లు చేపిన సర్వేపల్లి రాధాకృష్టన్ పదవీకాలం ముగిసిన వెంటనే 1962లో రాష్ట్రపతి అయ్యారు. తర్వాత ఉపరాష్ట్రపతిగా ఉన్న జాకిర్ హుస్సేన్ కూడా 1967లో కాంగ్రెస్ మద్దతుతో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసిన తెలుగువాడైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు నుంచి హుస్సేన్ గట్టి పోటీ ఎదుర్కున్నారు. హుస్సేన్ పదవి చేపట్టిన రెండేళ్లకే మరణించడంతో ఉపరాష్ట్రపతి వీవీ గిరీని అదృష్టం వరించింది. 1969 రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ ‘అధికార’ అభ్యర్థి, ఆంధ్రపదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిని ఓడించడానికి ప్రధాని ఇందిరాగాంధీ నడుం బిగించారు. ‘ఉప’ పదవికి గిరితో రాజీనామా చేయించాక రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయించి ‘అంతరాత్మ ప్రబోధం’ పేరుతో గెలిపించారు. ‘రెండో’ ముగ్గురికి దక్కని చాన్స్! తర్వాత ముగ్గురికి రాష్ట్రపతి అయ్యే భాగ్యం దక్కలేదు. నాలుగో ఉపరాష్ట్రపతి అయిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జీఎస్ పాఠక్, తర్వాత ఈ పదవి అధిష్టించిన బీడీ జట్టి, ఐదో వైస్ప్రెసిడెంట్ మహ్మద్ హిదాయతుల్లా(సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్)ను రాష్ట్రపతిని చేయాలనే ఆలోచన రాజకీయపార్టీలకు రాలేదు. పాఠక్, హిదయతుల్లా ‘ప్రమోషన్’కు ప్రయత్నించలేదు. మైసూరు మాజీ సీఎం అయిన జట్టికి 1977లో కాంగ్రెస్ ఓటమి ఆ అవకాశం ఇవ్వలేదు. ‘మూడో’ ముగ్గురూ ‘ప్రథమ పౌరులయ్యారు’! ఆ తర్వాత ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన ముగ్గురూ కేంద్ర మంత్రులుగా పనిచేసినవారే. 1982లో ఇందిర ప్రధానిగా ఉండగా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన కేంద్ర మాజీ మంత్రి ఆర్. వెంకట్రామన్ మూడేళ్లకే 1987లో ప్రధాని రాజీవ్గాంధీ నిర్ణయంతో రాష్ట్రపతి అయ్యారు. ఆయన తర్వాత ఉపరాష్ట్రపతిగా ఉన్న మాజీ గవర్నర్ ఎస్డీ శర్మ పదవీ కాలం ముగిసే సమయానికి 1992లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీచేసి గెలిచారు. తర్వాతి ఉపరాష్ట్రపతి కేఆర్ నారాయణన్ కూడా 1997లో దాదాపు అన్ని పారీ్టల మద్దతుతో తొలి ‘దళిత’ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ‘నాలుగో’ ముగ్గురికీ అందని అదృష్టం! యునైటెడ్ ఫ్రంట్ ప్రధాని ఐకే గుజ్రాల్ హయాంలో(1997లో) ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ కృష్ణకాంత్ ఉపరాష్ట్రపతి అయ్యారు. 2002లో అప్పటి ఏపీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు మద్దతుతో రాష్ట్రపతి పదవికి అభ్యర్థి అయ్యే అవకాశం మొదట కనిపించింది. తర్వాత కొన్ని పరిణామాల వల్ల పదవి ఆయనకు అందినట్టే అంది జారిపోయింది. మహారాష్ట్ర మాజీ గవర్నర్ పీసీ అలెగ్జాండర్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వ్యతిరేకించడంతో ఏపీజే అబ్దుల్ కలాం పేరు చివరకు ఖాయమైంది. కృష్ణకాంత్ తర్వాత పదవిలోకి వచ్చిన షెఖావత్ 2007 రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రతిభా పాటిల్పై పోటీచేసి ఓడిపోయారు. తర్వాత యూపీఏ, వామపక్షాల మద్దతుతో ఉపరాష్ట్రపతి అయిన మాజీ గవర్నర్ ఎంహెచ్ అన్పారీని 2012లో సోనియా రాష్ట్రపతిగా చేయాలని భావించినా చివరికి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీకి అవకాశమిచ్చారు. అన్సారీ నొచ్చుకోకుండా రెండోసారి ఆయనను ఉపరాష్ట్రపతిని చేశారని అంటారు. పైన చెప్పిన 12 మంది ఉపరాష్ట్రపతుల్లో ముగ్గురు ముగ్గురు చొప్పున ఆరుగురు రెండు విడతలుగా రాష్ట్రపతులయ్యారు. మరి ఈ ‘ఆనవాయితీ’ కొనసాగితే ఆగస్ట్ ఐదున జరిగే ఎన్నికలో గెలుపు ఖాయమనుకుంటున్న ఎం. వెంకయ్యనాయుడికి ప్రమోషన్ లభిస్తుందా? అన్నది భవిష్యత్ కాలమే నిర్ణయిస్తుంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
13న ఉప రాష్ట్రపతి పర్యటన
సాక్షి, హైదరాబాద్: భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ నెల 13న హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఉర్దూ యూనివర్సిటీలో జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మొదటి మహమ్మద్ కులీకుతుబ్షా స్మారక ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఖరారైన షెడ్యూలు ప్రకారం ఆ రోజు మధ్యాహ్నం ఉప రాష్ట్రపతి బేగంపేట చేరుకుంటారు. అక్కణ్నుంచి నేరుగా వర్సిటీకి చేరుకుంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి న్యూఢిల్లీకి బయల్దేరి వెళతారు. ఈ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. అవసరమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాట్లు, వైద్య, ఆరోగ్య, సమాచార, పౌర సంబంధాలు, బీఎస్ ఎన్ఎల్, తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసులు తదితర శాఖల ద్వారా నిర్వహించే పనులను చేపట్టాలని సూచించారు. ఈ సమా వేశంలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, మున్సిపల్ కార్య దర్శి నవీన్ మిట్టల్, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, సైబరా బాద్ కమిషనర్ సందీప్ శాండిల్య, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. -
ఉగ్ర పోరుకు సహకారం
జకార్తా: ఉగ్రవాదం, పైరసీ తదితర సరిహద్దు సమస్యలపై పరస్పరం సహకరించుకోవాలని ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ (ఐఓఆర్ఏ) తీర్మానించింది. భారత్, 20 హిందూ మహాసముద్ర తీరప్రాంత దేశాలతో ఏర్పడిన ఈ అసోసియేషన్ జకార్తాలో భేటీ అయింది. దీనికి భారత ఉపరాష్ట్రపతి అన్సారీతోపాటు హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలకు చెందిన పలువురు దేశాధినేతలు హాజరయ్యారు. ఐఓఆర్ఏలో భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇరాన్ , కెన్యా, మలేసియా, సింగపూర్, శ్రీలంక, థాయ్లాండ్ తదితర 21 దేశాలకు సభ్యత్వం ఉంది. సముద్ర ప్రాంత రక్షణ, భద్రత, వ్యాపారం, పెట్టుబడులు, విపత్తు నిర్వహణ, టూరిజం, సంస్కృతి తదితర అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని ఈ సమావేశం తీర్మానించింది. ఉగ్రవాదంపై పోరుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఈ సమావేశం ప్రత్యేకంగా మరో తీర్మానం చేసింది. భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మాట్లాడుతూ అభివృద్ధికి ఉగ్రవాదం అడ్డంకిగా నిలుస్తోందని అన్నారు. -
ఆన్ లైన్ ప్రేమ.. పాకిస్తాన్ వెళ్లి..
ప్రేమ కోసం పాకిస్తాన్ వెళ్లిన ఓ భారత యువకుడు అక్కడ జైల్లో బంధి అయ్యాడు. దీంతో అతని తల్లిదండ్రులు కొడుకును ఎలాగైనా తమకు అప్పగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని వేడుకుంటున్నారు. మోదీ చొరవ తీసుకుని పుత్రభిక్ష పెట్టి తమను పున్నామ నరకం నుంచి కాపాడాలని ముంబైకు చెందిన ఫౌజియా అన్సారీ, నెహాల్ అన్సారీలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. 2012లో ఆఫ్గానిస్తాన్ వెళ్లిన హమీద్ అన్సారీ(31) అక్కడి నుంచి అక్రమంగా పాకిస్తాన్ లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత సైన్యానికి చిక్కడంతో పాకిస్తాన్ సైనిక కోర్టు అతనికి మూడేళ్ల జైలు శిక్షను విధించింది. 2012 నవంబరు 10వ తేదీన తమ కుమారుడు చివరగా మాట్లాడినట్లు తల్లిదండ్రులు చెప్పారు. ఓ పాకిస్తాన్ అమ్మాయిని ఆన్ లైన్ లో ప్రేమించానని చెప్పినట్లు తెలిపారు. మూడేళ్ల శిక్షకాలం పూర్తయిన తర్వాత ఈ ఏడాది నవంబరు 12న ముంబై వస్తున్నానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కూడా హమీద్ ఇంటికి రాకపోవడంతో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు లేఖ రాసిన స్పందన లేదని చెప్పారు. ఇక ప్రధానమంత్రి మోదీయే తమ కుమారుడిని తిరిగి రప్పించగలరని అందుకే ఆయనకు వినతి పత్రం అందజేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. -
చర్చ లేకుండానే ముగింపు
తుడిచిపెట్టుకుపోయిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ► నోట్ల రద్దుపై చివరి రోజు వరకూ అధికార, ప్రతిపక్షాల మధ్య రచ్చ ► 21 రోజుల్లో 19గంటలు సాగిన లోక్సభ, 22గంటలు సాగిన రాజ్యసభ న్యూఢిల్లీ: తాము చెప్పినట్లు వినాలంటూ విపక్షాలు, తమకు నచ్చినట్లే జరగాలంటూ అధికార పక్షం పట్టుదలతో నెలరోజుల పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎలాంటి చర్చ లేకుండానే తుడిచిపెట్టుకుపోయాయి. పెద్ద నోట్ల రద్దుపై తలెత్తిన ఇక్కట్లపై చర్చించాల్సిన అధికార, విపక్షాలు ఉభయసభల్లో తమ పంతం నెగ్గించుకునేందుకు సభా సమయాన్ని పణంగా పెట్టాయి. దీంతో చివరకు శుక్రవారం లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉభయసభల్ని నిరవధికంగా వాయిదావేశారు. నవంబర్ 16న సమావేశాలు మొదలుకాగా తొలి రోజు నుంచి సభల్లో వాయిదాలు కొనసాగాయి. నోట్ల రద్దుపై ఓటింగ్తో కూడిన చర్చ జరగాలంటూ లోక్సభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం, అధికార పక్షం అంగీకరించకపోవడంతో గందరగోళం కొనసాగింది. అంతరాయం వల్ల లోక్సభలో 92 గంటల సభా సమయం వృథా అయ్యింది. మొత్తం 21 రోజుల పాటు లోక్సభ సమావేశం కాగా... కేవలం 19 గంటలే నడిచింది. రాజ్యసభలో 86 గంటల సమయం వృథా కాగా., సభ 22 గంటలే పనిచేసింది. వాయిదాల వల్ల రాజ్యసభ జాబితాలోని 330 ప్రశ్నలకు గాను కేవలం రెండింటికి, లోక్సభలో మొత్తం 440 ప్రశ్నలకు గాను 50 ప్రశ్నలకు మౌఖిక సమాధానాలిచ్చారు. లోక్సభలో నోట్ల రద్దుపై 193 నిబంధన కింద టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి చర్చను మొదలుపెట్టినా... విపక్షాల ఆందోళనలతో అది కొనసాగలేదు. సభా కార్యకలాపాలన్ని రద్దు చేసి నోట్ల రద్దుపై తామిచ్చిన వాయిదా తీర్మానాలు చేపట్టాలంటూ మొదటి రోజు నుంచి ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్సభ స్పీకర్ వాయిదా తీర్మానాల్ని తిరస్కరించారు. అధికార, విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. రాజ్యసభలో సమావేశాల మొదటి రోజే నోట్ల రద్దుపై చర్చను ప్రారంభించారు. ప్రధాని సభలోనే ఉండాలన్న విపక్ష డిమాండ్తో సభ పదేపదే వాయిదా పడింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన కాసేపటికే నిరవధికంగా వాయిదా పడింది. లోక్సభ సమావేశం కాగానే గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం సమావేశం కాగానే కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే లేచి తాము నోట్ల రద్దు చర్చకు సిద్ధమని గురువారమే చెప్పామని, అయితే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తమపై అనవసర ఆరోపణలు చేశారని చెప్పారు. దివ్యాంగుల హక్కుల బిల్లుకు ఆమోదం తాజా సమావేశాల్లో సభలు ఒక్క బిల్లునే ఆమోదించాయి. దివ్యాంగులపై వివక్షకు కఠిన శిక్షలకు ఉద్దేశించిన హక్కుల బిల్లును సభలు ఆమోదం తెలిపాయి. బుధవారం రాజ్యసభ ఆమోదించిన దీనికి లోక్సభ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఆమోద సమయంలో ప్రధాని సభలో ఉన్నారు. ఖర్చు రూ.267 కోట్లు షెడ్యూల్ ప్రకారం ఉభయ సభలు 21 రోజుల పాటు సమావేశం కావాలి. కానీ, ఇందులో లోక్సభలో కేవలం 19 గంటలపాటు, రాజ్యసభలో 22.25 గంటలే సభాకార్యక్రమాలు జరిగాయి. సాధారణంగా పార్లమెంటు నడిచేందుకు ఒక్కోసభలో నిమిషానికి రూ.2.5 లక్షలు ఖర్చవుతుంది (చాలాకాలంగా దీన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు). ఈ లెక్కన ఉభయ సభలు తుడిచిపెట్టుకుపోవటంతో ఖజానాకు రూ. 267 కోట్లు నష్టం వాటిల్లింది. -
నైజీరియాలో హమీద్ అన్సారీ పర్యటన
-
‘ఉగ్ర’ నియంత్రణతోనే శాంతి, భద్రత
నామ్ డిక్లరేషన్లో వెల్లడి పోర్లమార్(వెనిజులా): ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని అంతమొందించాలని ప్రపంచ దేశాలకు నామ్(అలీన కూటమి) సభ్యదేశాలు పిలుపునిచ్చాయి. అంతర్జాతీయ సమాజంలో శాంతి, భద్రతకు ఇది పెను ముప్పుగా మారిందని, ఉగ్ర సంస్థలకు నిధులు సమకూర్చడం, అక్రమంగా ఆయుధాలు సరఫరా చేయడాన్ని నిరోధించాలని కోరాయి. 17వ నామ్ సదస్సు చివరి రోజైన సోమవారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. భారత్ తరఫున ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ సమావేశాలకు హాజరయ్యారు. మతం,నమ్మకాల ఆధారంగా కొన్ని ఉగ్ర సంస్థలు సాంస్కృతిక, వారసత్వ కట్టడాల విధ్వంసానికి పాల్పడడం, మానవ జాతిపై నేరాలకు ఒడిగట్టడాన్ని కూటమి ఖండించింది. ఉగ్ర సంస్థలు తాలిబన్, ఆల్ఖైదా, ఐసిస్ దాని అనుబంధ సంస్థలు జబాత్ అల్ నుర్సా, బోకో హారం, అల్ షబాబా , ఐక్యరాజ్య సమితి గుర్తించిన కొన్ని సంస్థల కార్యకలాపాలు, ఉగ్ర వ్యాప్తికి అవి కల్పిస్తున్న వాతావరణాన్ని గర్హించింది. ఐరాస చార్టర్, ఇతర అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అన్ని దేశాలు మరింత సమర్థంగా, సమన్వయంతో ఈ ముప్పును ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది. ప్రస్తుతమున్న ఐరాస ఉగ్ర వ్యతిరేక వ్యూహ అమలు తదితరాలకు అదనంగా భవిష్యత్తులో మరో సమగ్ర ఒప్పందాన్ని కుదుర్చునే దిశగా కూటమి ఆలోచన మొదలెట్టింది. తీవ్రవాదాన్ని ఏదో ఒక మతం, వర్గం, జాతితో ముడిపెట్టకూడదని, వీటిని తీవ్రవాద కార్యకలాపాలను సమర్థించుకోవడానికి ఉపయోగించుకోకూడదని డిక్లరేషన్లో పేర్కొన్నారు. ఉగ్ర వ్యతిరేక చర్యల కింద అనుమానితుల వివరాలు బయటపెట్టడానికి, వ్యక్తుల గోప్యతపై దాడికి వాడుకోవద్దని తెలిపారు. ఉగ్ర ముప్పును ఎదుర్కోవాలంటే నిర్దిష్ట చర్యలు అవసరమని, ప్రభావవంత సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని 120 దేశాల బృందాన్ని భారత్ ఆదివారం కోరింది. ఉద్యమానికి సంఘటితమవుదాం అలీన ఉద్యమ పునరుత్తేజం, పటిష్టానికి సభ్య దేశాలు మద్దతును పునరుద్ఘాటించాయి. ఐరాస చార్టర్, అంతర్జాతీయ ఒప్పందాల మేరకు వివాదాలను పరిష్కరించుకోవాలని తీర్మానించాయి. చట్టబద్ధ ప్రభుత్వాలను కూలదోసే అక్రమ విధానాలను తిరస్కరించాయి. ఏదైనా దేశం సమగ్రత, ఐక్యతకు భంగం కలిగించే యత్నాల పట్ల వ్యతిరేకత కొనసాగుతుందని పునరుద్ఘాటించాయి. ఇతర దేశాల సారభౌమత్వాన్ని గౌరవించాలని, వారి అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోరాదని, బల ప్రయోగం, బెదిరింపులకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. అణ్వాయుధ రహిత ప్రపంచం కోసం పనిచేయాలని తీర్మానించాయి. అణు నిరాయుధీకరణ కోసం తక్షణం చర్చలు ప్రారంభం కావాలని పిలుపునిచ్చాయి. శాంతియుత ప్రయోజనాల కోసం అణు విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే దేశాల సారభౌమత్వాన్ని పునరుద్ఘాటించాయి. -
సభా సమయం తగ్గిపోతోంది: హమీద్ అన్సారీ
న్యూఢిల్లీ : భావోద్వేగాల నియంత్రణ, సభను సజావుగా జరిపించడం రాజ్యసభ సభ్యులకు అత్యవసరమని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ అన్నారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల సమయం తగ్గిపోతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన వారికి శనివారం ఏర్పాటు చేసిన ఓరియెంటేషన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కొన్ని గ్రూపుల, కొందరు వ్యక్తుల ప్రయోజనాలకోసం ఎంపీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ విలువైన సభాసమయాన్ని పాడుచేస్తున్నారని, దీన్ని నివారించేందుకు సభ్యులు సభా మర్యాదలు పాటించాలని సూచించారు. గతంలో 100 నుంచి 110 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలుండేవని, ప్రజా సమస్యలపై చర్చించేందుకు తగినంత సమయం ఉండేదని ఇప్పుడది 70 రోజులకు పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చి సభకు అంతరాయం కలిగిస్తూ..విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని ఇలా ప్రవర్తించడం ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. -
నేడు స్వదేశానికి రానున్న ఉపరాష్ట్ర్రపతి
న్యూఢిల్లీ: మంగోలియా రాజధాని ఉలన్బాటర్లో జరుగుతున్న 11వ ఆసియా-యూరోప్ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్న ఉపరాష్ట్ర్రపతి హమిద్ అన్సారీ ఈరోజు ఇండియాకు తిరిగిరానున్నారు. బ్రిగ్జిట్ తర్వాత విశ్వవ్యాప్తంగా ఏర్పడ్డ ఆర్థిక మందగమనంపై వివిధ దేశాధినేతలు ఈ సదస్సులో ప్రధానంగా చర్చించారు. సమావేశంలో పాల్గొన్న బంగ్లాదేశ్, స్విట్జర్లాండ్,ఎస్టోనియా దేశాధినేతలతో అన్సారీ ప్రత్యేకంగా సమామేశమై భారత ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. -
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు
- ఆసియా-యూరప్ సమావేశ సదస్సులో హమీద్ అన్సారీ - ఫ్రాన్స్ ఉగ్రదాడి మృతులకు సదస్సు నివాళి ఉలాన్బాటర్: ఉగ్రవాదంపై అంతర్జాతీయ సమాజం ఉక్కుపాదం మోపాలని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పిలుపునిచ్చారు. మంగోలియా రాజధాని ఉలాన్బాటర్లో 11వ ఆసియా-యూరప్ సమావేశ సదస్సు (ఏఎస్ఈఎం)లో ప్రసంగిస్తూ.. ‘ఉగ్రవాదానికి ఆర్థికంగా సాయం చేసేవారు, బాధ్యత వహించేవారు, దాడులకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. మన సమాజానికి ఉగ్రవాద పెనుభూతం హెచ్చరికలు చేస్తోంది. దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు ఏకమై పోరాడాలి. ఉగ్రవాదం కోరలను పీకేయాలి’ అని పేర్కొన్నారు. శుక్రవారం మొదలైన ఈ సదస్సులో భారత్ సహా 49 దేశాలు పాల్గొంటున్నాయి. ఫ్రాన్స్లోని నీస్లో జరిగిన ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించి సదస్సును ప్రారంభించారు. ఆసియా, యూరప్ దేశాల మధ్య రాజకీయ, భద్రత, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏఎస్ఈఎం ఏర్పడి 20 ఏళ్లు కావస్తుండటంతోపాటు.. మంగోలియన్ రాజ్యం ఏర్పడి 810 ఏళ్లు పూర్తయిన వేడుకలు కూడా ఈ సందర్భంగా జరగనున్నాయి. వివిధ దేశాల ప్రతినిధులతోపాటు ఈయూ, ఆసియాన్ల ప్రతినిధులూ ఇందులో పాల్గొన్నారు. -
పీవీ మంచి చేశారు.. చెడూ చేశారు!: అన్సారీ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తన విధానాలతో దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించారని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ కొనియాడారు. 1991లో ఆర్థిక వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు దేశాన్ని మార్చివేశాయన్నారు. అయితే ఆయన తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాల ప్రతికూల పర్యవసానాలు కూడా ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బాబ్రీ మసీదు విధ్వంసం ఘటనను నిలువరించడంలో విఫలమయ్యారని, అప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రభావం ఇంకా దేశాన్ని వీడలేదన్నారు. వినయ్ సీతాపతి రచించిన‘హాఫ్ లయన్-హౌ పీవీ నరసింహారావు ట్రాన్స్ఫామ్డ్ ఇండియా’ పుస్తకావిష్కరణ సభలో అన్సారీ మాట్లాడారు. -
కొత్త ఆలోచనలకు స్వేచ్ఛ ఉండాలి
- అకడమిక్ ఐడియాలకు అడ్డుకట్ట వేయవద్దు - రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీ: విద్యా రంగంలో కొత్త ఆలోచనలకు స్వేచ్ఛ ఉండాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. కొత్త ఆలోచనలకు అడ్డుకట్ట వేసేలా తలుపు మూయవద్దని, ఆలోచనలు ఫలప్రదమయ్యే వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. దేశంలో ఉన్నత విద్యను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని, ఆవిష్కరణలకు, పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఉపాధ్యాయులు, విద్యావేత్తలు గుర్తింపును సాధించగలుగుతారని చెప్పారు. ‘ద ఎడ్యుకేషన్ ప్రెసిడెంట్’ అనే పుస్తకానికి సంబంధించిన తొలి కాపీని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ నుంచి ప్రణబ్ ముఖర్జీ స్వీకరించారు. 2012లో రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన కార్యకలాపాల ఆధారంగా ‘ద ఎడ్యుకేషన్ ప్రెసిడెంట్’ పుస్తకాన్ని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ రూపొందించింది. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థలను సందర్శించడం ద్వారా తాను ఎంతో నేర్చుకున్నానని ఈ సందర్భంగా రాష్ట్రపతి చెప్పారు. దేశంలోని ఐఐటీలు మొదలైన వాటి నుంచి బయటకు వచ్చిన ప్రతిభ అంతర్జాతీయ కంపెనీల కోసం పనిచేస్తోందని, దేశం కోసం శ్రమించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
మాల్యా తాజా రాజీనామా ఆమోదం
న్యూఢిల్లీ: మద్యం వ్యాపారి, ఎంపీ విజయ్ మాల్యా రాజ్యసభ సభ్యత్వం ముగిసింది. ఆయన తాజాగా పంపిన మరో రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఆమోదించారు. డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఈమేరకు బుధవారం రాజ్యసభలో ప్రకటించారు. తక్షణమే ఇది అమల్లోకి వచ్చిందని చెప్పారు. నిబంధనల ప్రకారం లేదంటూ మాల్యా తొలుత పంపిన రాజీనామా లేఖను అన్సారీ మంగళవారం తిరస్కరించడం తెలిసిందే. దీంతో మాల్యా తాను సంతకం చేసిన రాజీనామాను మరోసారి పంపారు. ఎగువ సభలో స్వతంత్ర సభ్యుడిగా ఉన్న మాల్యా.. బ్యాంకులకు రూ.9,400 కోట్లు ఎగ్గొట్టి బ్రిటన్కు పారిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా, మాల్యా సభ్యత్వాన్ని తక్షణమే బహిష్కరించాలంటూ రాజ్యసభ నైతిక విలువల కమిటీ కూడా తన సిఫార్సును బుధవారమే నివేదించింది. మాల్యా తొలుత పంపిన లేఖతోసహా మొత్తం వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకొని కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. -
రాజ్యసభ నుంచి ఎంపీని బయటకు పొమ్మన్నారు
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ పై రాజ్యసభ చైర్మన్ హమిద్ అన్సారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నుంచి బయటకు వెళ్లాలని ఆదేశించారు. అగస్టా- వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంపై చర్చకు శేఖర్ ఇచ్చిన నోటీసును అన్సారి తిరస్కరించారు. ఈ అంశంపై చర్చ జరగాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. రక్షణ మంత్రి మనోహర్ పరికర్ వెంటనే ప్రకటన చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. పదేపదే సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారు. చైర్మన్ ఎన్నిసార్లు వారించినా ఆయన వినిపించుకోలేదు. దీంతో ఆగ్రహించిన అన్సారి సభ నుంచి బయటకు వెళ్లాల్సిందిగా శేఖర్ రాయ్ ను ఆదేశించారు. ఈ రోజు సభలో అడుగుపెట్టడానికి వీల్లేదని పేర్కొన్నారు. చైర్మన్ ఆదేశాలకు నిరసనగా తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ఈ రోజు సభకు హాజరు కాబోమని ప్రకటించారు. అగస్టా- వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంపై పెద్దల సభ ఈ రోజు కూడా దద్దరిల్లింది. విపక్ష సభ్యుల ఆందోళనతో పలుమార్లు వాయిదా పడింది. -
వచ్చేనెల 5న హైదరాబాద్కు ఉప రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 5న ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ హైదరాబాద్కు రానున్నారు. మార్చి 3 నుంచి 6వ తేదీ వరకు హైదరాబాద్లో అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ మహా సభలు జరుగనున్నాయి. 5వ తేదీన ‘వ్యవసాయ సంక్షోభం-రైతుల ఆత్మహత్యలు, ఇన్పుట్ సబ్సిడీ’ అనే అంశంపై జరిగే సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారని సంఘం రాష్ట్ర నాయకురాలు పశ్య పద్మ తెలిపారు. ఉప రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రొటోకాల్ విభాగాన్ని మంగళవారం సచివాలయంలో ఆమె సంప్రదించారు. -
'ఈసారైనా బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగాలి'
ఢిల్లీ: గత శీతాకాల రాజ్యసభ సమావేశాలు తుడ్చి పెట్టుకుపోవడంతో రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ స్వయంగా రంగంలోకి దిగారు. న్యూఢిల్లీలో శనివారం రాజ్యసభకు చెందిన అఖిలపక్ష నేతలతో హమీద్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. ఈసారైనా బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని వారిని ఉపరాష్ట్రపతి కోరినట్టు సమాచారం. -
ఆమెకు తొలి అవార్డు
బ్యాంకాక్: మొట్టమొదటి ప్రపంచ సంస్కృతం అవార్డుకు థాయ్లాండ్ యువరాణి, సంస్కృత భాషాకోవిదులు మహాచక్రీ సిరింధ్రోన్ను భారత్ ఎంపిక చేసింది. ఈ మేరకు అవార్డు అందుకోవాల్సిందిగా భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ శుక్రవారమి క్కడ ఆమెను కలసి ఆహ్వానించారని భారత విదేశీ వ్యవహారాల (తూర్పు) కార్యదర్శి అనిల్ వాద్వా తెలిపారు. గత ఏడాది బ్యాంకాక్లో అంతర్జాతీయ సంస్కృతం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రపంచంలోని సుమారు 60 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
వారిని వ్యక్తిగతంగా కలవాలా?
పారిశ్రామికవేత్తలతో ప్రధాని, ఆర్థికమంత్రి భేటీలపై తన తాజా పుస్తకంలో ప్రణబ్ ప్రశ్న న్యూఢిల్లీ: ‘భారత ప్రధానమంత్రి లేదా ఆర్థిక మంత్రి పారిశ్రామికవేత్తలను వ్యక్తిగతంగా కలవాలా?’.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వీయ అనుభవాలతో విడుదల చేసిన తాజా పుస్తకంలో ఈ ప్రశ్నను సంధించారు. అయితే ఈ ప్రశ్నను ఆయనే జవాబూ ఇచ్చేశారు. పారిశ్రామికవేత్తలతో తనకు వ్యక్తిగతంగా లేదా సమష్టిగా జరిగిన భేటీలు చాలా కీలకమైనవని చెప్పారు. ప్రణబ్ అనుభవాలతో రచించిన ‘ద టర్బులెంట్ ఇయర్స్: 1980-1996’ పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ గురువారం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకంలో 1988-1991 మధ్య దేశంలో సామాజిక, రాజకీయ సంక్షోభ సమయంలో వీపీ సింగ్కు తనకు మధ్య ఉన్న వ్యత్యాసాలను ఆయన వివరించారు. రాజీవ్గాంధీ కేబినెట్లో ఆర్థికమంత్రిగా నియమితులైన వీపీ సింగ్ పారిశ్రామికవేత్తలతో వ్యక్తిగతంగా సమావేశం అయ్యేవారు కాదని, కానీ తాను ఆర్థికమంత్రి, వాణిజ్య మంత్రిగా ఉన్న సమయంలో వారితో వ్యక్తిగతంగా, సమష్టిగా సమావేశమయ్యే వాడినని, ఇది సంబంధిత రంగాల గురించి పూర్తి అవగాహన చాలా కీలకమని ఆయన తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్తో విభేదాల గురించి ప్రణబ్ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ పదవి నుంచి మన్మోహన్ తప్పుకోవడంలో తన ప్రమేయం ఏమీ లేదన్నారు. తమ మధ్య వృత్తిపరమైన వైరుధ్యాలే తప్ప, మన్మోహన్తో తనకు ఎటువంటి విభేదాలు లేవని చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సాధించిన అతి పెద్ద విజయం ఏమిటంటే.. ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడమే అని చెప్పారు. వీటి కారణంగానే మన దేశ వృద్ధిరేటు పెరిగిందని, మన ఆర్థిక వ్యవస్థ వాస్తవ సామర్థ్యాన్ని తెలుసుకునేలా చేశాయని చెప్పారు. -
సహనమే ఆయుధం
ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ మలప్పురం(కేరళ): వివాదరహిత సమాజ నిర్మాణంలో సహనమే ప్రధాన ఆయుధమని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ స్పష్టంచేశారు. మతాల మధ్య అంతరాలను తొలగిస్తే అసహనం అనేది ఉండదన్నారు. భిన్నత్వం కలిగి ఉన్న మన సమాజంలో సహనంతో దేన్నైనా స్వీకరించే, అన్ని మతాలను అర్థం చేసుకునేతత్వాన్ని ప్రజల్లో పెంపొందిచాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారమిక్కడ ‘అసహనం’పై ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మతాల మధ్య ఘర్షణ నివారణకు సహనం.. ధర్మం, స్వేచ్ఛలా పనిచేస్తుందన్నారు. -
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతికి.. మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం మోదీ.. రాష్ట్రపతి భవన్, ఉప రాష్ట్రపతి నివాసాలకు వెళ్లి ప్రణబ్, అన్సారీలకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు ప్రముఖులు రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు రాష్ట్రపతి భవన్ సందర్శనకు సాధారణ ప్రజలను అనుమతించారు. ప్రజలు ప్రణబ్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
త్వరలోనే భారత్కు చోటా రాజన్!
-
త్వరలోనే భారత్కు చోటా రాజన్!
ఆదివారం ఇండోనేషియాలో అన్సారీ పర్యటన అమల్లోకి రానున్న ఒప్పందాలు బాలి/న్యూఢిల్లీ: ఇండోనేషియాలో పట్టుబడ్డ అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ను భారత్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దేశాల మధ్య నేరస్తుల అప్పగింత, పరస్పర న్యాయ సహకారం అంశాలపై ఒప్పందాలు జరిగాయని.. వీటి ఆధారంగా రాజన్ను భారత్ తరలించేందుకు మార్గం సుగమం అవుతుందని.. ఇండోనేసియాలోని భారత రాయబారి గుర్జిత్ సింగ్ తెలిపారు. నేరస్తుల అప్పగింతపై 2011లోనే ఒప్పందం కుదిరిందని.. అయితే ఆదివారం భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఇండోనేసియా రానున్న సందర్భంగా.. అధికారికంగా నేరస్తుల అప్పగింత మొదలవుతుందని తెలిపారు. రాజన్ను వీలైనంత త్వరగా భారత్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, హోంశాఖ, తమ శాఖ కలిసి పనిచేస్తున్నాయని విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. మరోవైపు.. ఇండోనేసియా పోలీసుల ఆధీనంలో ఉన్న రాజన్ను ఆయన న్యాయవాది ఫ్రాన్సికో ప్రస్సార్ కలిశారు. పోలీసులు శుక్రవారం రాజన్ను ఆరుగంటలు ప్రశ్నించారు. భారత్లో చేసిన వివిధ నేరాలపై విచారించారు. అతడు తమకు సహకరించాడని తెలిపారు. ఈ విచారణపై భారత దౌత్యకార్యాలయానికి నివేదిక సమర్పించారు. తనకు ప్రాణాపాయం ఉందని రాజన్ భావిస్తే.. తన న్యాయవాది ద్వారా ఫిర్యాదు చేయవచ్చని బాలి నగర పోలీసులు తెలిపారు. రెండ్రోజుల్లో భారత అధికారులు బాలికి వెళ్లి.. రాజన్ను తీసుకు వచ్చే అవకాశాలున్నాయి. -
కంబోడియా ప్రధానితో అన్సారి భేటీ
న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి కంబోడియాలో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా అన్సారి చైనా పర్యటనను ముగించుకుని కంబోడియా వెళ్లారు. ఫోమ్ పెన్ విమానాశ్రయంలో అన్సారికి కంబోడియా సమాచార శాఖ మంత్రి కీయూ కన్హారిత, కంబోడియాలో భారత రాయబారి నవీన్ శ్రీవాత్సవ స్వాగతం పలికారు. భారత్, కంబోడియాల మధ్య వాణిజ్య ఒప్పందం, దృఢమైన మైత్రి భాగస్వామ్యంపై చర్చలు జరపనున్నారు. కంబోడియా ప్రధాని హున్, జాతీయ అసెంబ్లీ ప్రెసిడెంట్ హెంగ్ సమ్రిన్లతో సమావేశమయ్యారు. ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. -
అన్సారీపై ఆర్ఎస్ఎస్ ధ్వజం
అత్యున్నత పదవిలో ఉంటూ లౌకిక ధర్మాన్ని పాటించాల్సింది పోయి ఫక్తు మత నాయకుడిలా మాట్లాడారంటూ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీపై ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) ధ్వజమెత్తింది. ఇటీవల ఆలిండియా ముస్లిమ్ మజ్లిస్-ఏ-ముషావరత్ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రసంగించిన అన్సారీ భారత్లో ముస్లింలు అణిచివేతకు గురవుతున్నారని వ్యాఖ్యానించడం తెలిసిందే. అన్సారీ అభిప్రాయంతో పూర్తిగా విభేదిస్తూ.. ముస్లింలు ఎదుర్కొంటున్న పరిస్థితులకు వారి అతివాద ధోరణే కారణమని తెలియజెప్పడంలో అన్సారీ విఫలమయ్యారని ఆర్ఎస్ఎస్ తన అధికారిక పత్రిక 'పాంచజన్య'లో పేర్కొంది. గుర్తింపు, భధ్రత, విద్యావకాశాలు, అభివృద్ధి తదితర విషయాల్లో ముస్లింలు సవాళ్లను ఎదుర్కొంటున్నారంటూ అన్సారీ ఓ మత నాయకుడి మాదిరిగా మాట్లాడారని, అందరి సంక్షేమం గురించి ఆలోచించాల్సిన ఆయన స్థాయికి తగ్గట్లు వ్యవహరించలేదని 'పాంచజన్య' విమర్శించింది. 'ఇస్లాం, నవీన విధానం (మోడర్నిటీ) రైలు పట్టాల్లా ఎప్పటికీ కలవవని ఐఎస్ఐఎస్, తాలిబన్, బొకోహరాం లాంటి ముస్లిం తీవ్రవాద సంస్థలు అంటున్నాయి. ఇస్లాం, మోడర్నిటీలు వేరువేరనే నిజాన్ని అన్సారీ లాంటివాళ్లు చెప్పరు. శతాబ్దాల కిందట ఏర్పరుచుకున్న నియమాలు నూతన విధానాలెలా అవుతాయో ఆయన ఆత్మావలోకనం చేసుకోవాలి' అని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది. ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఇతర ముస్లిం సంస్థలు భారత్ అనుసరిస్తున్న లౌకిక విధానానికి ఎలా తూట్లు పొడుస్తున్నాయో అన్సారీ గుర్తెరగాలని, రిజర్వేషన్లు, అభివృద్ధి ఫలాలు మతం ఆధారంగా లభించవనే విషయం అర్థం చేసుకుంటే మంచిదని పేర్కొంది. ముస్లింలకు మదర్సాల ఏర్పాటుకు అనుమతులు, హజ్ యాత్రలకు ఆర్థిక సహాయం అందించడాన్ని ఆర్ఎస్ఎస్ ప్రశ్నించింది. -
పాక్ రాజకీయ దుస్సాహసానికి ప్రతీక
1965 యుద్ధంపై హమీద్ అన్సారీ న్యూఢిల్లీ: మాజీ ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి, కశ్మీరీలు 1965లో పాక్ చొరబాటును సమర్థంగా తిప్పికొట్టారని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ కొనియాడారు. 1965 యుద్ధం పాక్ రాజకీయ దుస్సాహసానికి ప్రతీక అని, అందులో ఆ దేశ సైన్యం తీవ్రంగా నష్టపోయిందన్నారు. అయితే ఆ వైఫల్యాన్ని కప్పిపెట్టారన్నారు. ఆ యుద్ధానికి 50 ఏళ్లయిన నేపథ్యంలో మంగళవారమిక్కడ త్రివిధ దళాలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్సారీ ప్రసంగించారు. కశ్మీర్లోకి చొరబాటుదారులను పంపి, స్థానికుల మద్దతు కూడగట్టి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు 1965, ఆగస్టు 5న పాకిస్తాన్ 'ఆపరేషన్ జీబ్రాల్టర్' ప్రారంభించిందని చెప్పారు. ఆ విషయాన్ని కశ్మీరీ ప్రజలు భద్రతా బలగాలకు చేరవేసి పాక్ కుయుక్తులను తిప్పికొట్టారన్నారు. ఈ పన్నాగం విఫలమవడంతో పాక్ రెండో కార్యాచరణను ప్రారంభించి, సరిహద్దులో భారత బలగాలపై కాల్పులకు పాల్పడిందని వివరించారు. కాగా, జమ్మూకశ్మీర్ను అస్థిరపరిచేందుకు పాక్ కొత్త పద్ధతుల్లో కుయుక్తులు పన్నుతోందని ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ చెప్పారు. భవిష్యత్తులో చిన్నపాటి యుద్ధాలకు సైతం భారత్ సిద్ధంగా ఉందన్నారు. -
ఉపరాష్ట్రపతి, ప్రధాని హోళీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీలు దేశ ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండుగ భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నమని అన్సారీ తన సందేశంలో పేర్కొన్నారు. వసంత రుతువు రాకకు సూచిక అయిన హోళీని జాతి, మత, ప్రాంతాలకు అతీతంగా దేశ ప్రజలందరూ వేడుకగా జరుపుకోవాలని కోరారు. 'ఈ రంగుల పండుగ మీజీవితాల్లో ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నాను' అని ప్రధాని ట్వీట్ చేశారు. -
రాజ్యసభలో సమయం మారినా పరిస్థితి మారలేదు
ఢిల్లీ: శీతాకాల సమావేశంలో సభ సజావుగా సాగాలనే ఉద్దేశంతో రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని మార్చినా సభలో ఆందోళనలకు తెరపడలేదు. రాజ్యసభలో 11 గంటలకే ప్రశ్నోత్తరాల సమయం మొదలయ్యేది. అయితే రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఈ సమయాన్ని మధ్యాహ్నం 12 గంటలకు మార్చారు. కానీ హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ దే శీయ టెర్మినల్కు ఉన్న రాజీవ్గాంధీ పేరును తొలగించి ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. దీంతో మారిన ప్రశ్నోత్తరాల సమయం వృథా అయింది. -
ఇస్రోకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ ఈ ఏడాది ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతికి ఎంపికైంది. అంతరిక్షాన్ని శాంతియుతంగా వినియోగించుకొనేందుకు వీలుగా అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి కృషిచేస్తున్నందున ‘ఇస్రో’కు ఈ బహుమతి ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ నేతృత్వంలోని అవార్డుల కమిటీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ప్రాజెక్టును విజయవంతం చేయడం ద్వారా ఇస్రో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిందని అందులో పేర్కొంది. -
భారత్లో చైనా పారిశ్రామిక పార్కులు
అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఇరు దేశాలు వాణిజ్య లోటు భర్తీ దిశగా చర్యలు బీజింగ్: భారత్లో చైనా సంస్థలు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసే దిశగా ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. అలాగే, బ్రహ్మపుత్ర నది వరదల గణాంకాలను ఇచ్చిపుచ్చుకునేందుకు, పాలన సంబంధ అంశాలపై ఇరుదేశాల అధికారులు తరచూ చర్చించుకునేందుకు మరో రెండు ఒప్పందాలు కుదిరాయి. పంచశీల్ 60వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు చైనా పర్యటనకు వచ్చిన భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, చైనా ఉపాధ్యక్షుడు లి యువాన్చావోల సమక్షంలో సోమవారం ఈ ఒప్పందాలు కుదిరాయి. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల సహకారం, రెండు దేశాల వాణిజ్య సంస్థల మధ్య సహకారం పెంపొందించడాన్ని మరింత విస్తరించాలని ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. రెండు పొరుగు దేశాలు ఏక కాలంలో శక్తిమంతమైన దేశాలుగా ఎదుగుతుండటం చాలా అరుదుగా జరుగుతుందని అన్సారీ పేర్కొన్నారు. భారత్, చైనాల మధ్య వాణిజ్య లోటు ఏకంగా 35 బిలియన్ డాలర్ల మేర ఉంటున్న నేపథ్యంలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటు అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గతేడాది 65.47 బిలియన్ డాలర్లుగా ఉండగా, ప్రస్తుతం భారత్లో చైనా పెట్టుబడులు 1.1 బిలియన్ డాలర్ల మేర మాత్రమే ఉన్నాయి. వాణిజ్య లోటును తగ్గించేందుకు, భారత్లో చైనా పెట్టుబడులను మరింత ఆకర్షించేందుకు ప్రతిపాదిత పారిశ్రామిక పార్కులు దోహదపడగలవు. ఇరు దేశాల్లోనూ పెట్టుబడుల విషయంలో పరస్పర సహకారం అందించుకోవడానికి ఈ ఎంవోయూ ఉపయోగపడగలదు. ఈ ఒప్పందం విషయంలో అన్సారీ వెంట వచ్చిన భారత ప్రతినిధి బృందంలోని వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్, చైనా వాణిజ్యమంత్రి గావో హుచెంగ్తో సమావేశమయ్యారు. వాణిజ్య లోటుతో పాటు వజ్రాభరణాలు, ఫార్మా, ఐటీ తదితర భారత ఉత్పత్తుల విక్రయానికి చైనా మార్కెట్లో అవకాశాలు కల్పించడం తదితర అంశాల గురించి ఇందులో చర్చించినట్లు ఆమె తెలిపారు. చైనాకు ఎగుమతి చేస్తున్న వాటికన్నా ఎక్కువగా భారత్ దిగుమతి చేసుకుంటోందని నిర్మల వివరించారు. భారత్లో చైనా పెట్టుబడులు పెరిగితే ఈ అసమానతలు కొంత మేర అయినా తగ్గగలవని ఆమె పేర్కొన్నారు. తయారీతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వే వంటి అనేక రంగాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు చైనా కంపెనీలకు అపార అవకాశాలు ఉన్నాయని నిర్మల తెలిపారు. కేంద్రంలో కొత్తగా మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇరు దేశాల వాణిజ్య మంత్రులు సమావేశం కావడం ఇదే ప్రథమం. అటు, బ్రహ్మపుత్ర నది వరదలకు సంబంధించిన ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా చైనా.. మే 15 నుంచి అక్టోబర్ 15 దాకా సంబంధింత డేటాను భారత్కు అందించనుంది. వరదలను అంచనా వేసేందుకు ఇది భారత్కు ఎంతగానో తోడ్పాటును అందించనుంది. దీనికోసం చైనా వైపున ఉన్న హైడ్రోలాజికల్ సెంటర్ల మెయింటెనెన్స్కి అయ్యే వ్యయాలను భారత ప్రభుత్వం భరిస్తుంది. ఇక, మూడో ఒప్పందం కింద.. రెండు దేశాల ప్రభుత్వ పాలనా యంత్రాంగం అధికారులు పాలన సంబంధిత విధానాల గురించి చర్చించుకుంటారు. భారత్-చైనా సాంస్కృతిక సంబంధాల ఎన్సైక్లోపీడియా ఆవిష్కరణ దాదాపు రెండు వేల ఏళ్ల కాలం నుంచీ గల సాంస్కృతిక సంబంధాలపై తొలి ఎన్సైక్లోపీడియాను భారత్-చైనా ఆవిష్కరించాయి. రెండు దేశాల పరిశోధకులు దీన్ని సంయుక్తంగా రూపొందించారు. ఏడో దశాబ్దంలో చైనా పరిశోధకుడు హ్యుయన్ సాంక్ భారత్లో పర్యటించి బౌద్ధ గ్రంధాలను చైనాకు తీసుకెళ్లిన కాలం నుంచి ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల సర్వస్వంగా ఈ ఎన్సైక్లోపీడియాను రూపొందించడం జరిగింది. వాణిజ్య, దౌత్య సంబంధాల వివరాలను కూడా ఇందులో పొందుపర్చారు. ఇంగ్లిష్ చైనీస్ భాషల్లో ప్రచురించిన ఈ పుస్తకాలను అన్సారీ, యువాన్ చావోలు సంయుక్తంగా ఆవిష్కరించారు. -
చైనా పర్యటనకు ఉపరాష్ట్రపతి అన్సారీ
న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ నెలలో చైనా పర్యటనకు వెళ్లనున్నారు. భారత్, చైనాల మధ్య పంచశీల ఒప్పందం ఏర్పడి 60 ఏళ్లయిన సందర్భంగా ఈ నెల 28న జరిగే ప్రత్యేక స్మారకోత్సవంలో అన్సారీ పాల్గొంటారు. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాలో భారత్ ఉన్నత స్థాయి ప్రతినిధి పర్యటించడం ఇదే తొలిసారి. బీజింగ్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అన్సారీ పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇటీవల భారత పర్యటనకు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా ఇతర మంత్రులతో సమావేశమయ్యారు. చైనా పర్యటనకు రావాల్సిందిగా వాంగ్ ఆహ్వానించగా, మోడీ సుముఖత వ్యక్తం చేశారు. కాగా తేదీలు ఇంకా ఖరారు కావాల్సివుంది. -
మండేకు నేతల ఘన నివాళి
* ప్రజానాయకుడిని కోల్పోయాం: రాష్ట్రపతి * నిజమైన మాస్ లీడర్: ప్రధాని * బీజేపీ ఆఫీసుకెళ్లి నివాళులర్పించిన రాహుల్ గాంధీ న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మరణించిన కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గోపీనాథ్ ముండేకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీ సహా వివిధ పార్టీల నేతలు ఘన నివాళి అర్పించారు. ఆయన్ను గొప్ప ప్రజా నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా కొనియాడారు. నిరంతరం సామాన్యుల కోసం పనిచేసిన నాయకుడిని పోగొట్టుకోవడం బాధాకరమని రాష్ట్రపతి ప్రణబ్ తన సంతాప సందేశంలో పేర్కొనగా ముండే మరణం అందరికీ తీరని లోటని ఉప రాష్ట్రపతి అన్సారీ పేర్కొన్నారు. ముండే మరణం తనను షాక్కు గురిచేసిందని, ఆయన మరణంపట్ల తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నానని ప్రధాని మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆయన్ను నిజమైన మాస్ లీడర్గా అభివర్ణించారు. ముండే మరణం దేశానికి తీరని లోటని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. ముండే ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నానంటూ సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కంటతడిపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ముండే కుటుంబానికి సంతాపం తెలిపారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు వివిధ రాష్ట్రాల సీఎంలు ముండే మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంచిన ముండే పార్థివదేహాన్ని అన్సారీ, మోడీ, రాహుల్ గాంధీ, ఎల్.కె. అద్వానీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్, అరుణ్జైట్లీ, వెంకయ్య నాయుడు, స్మృతి ఇరానీ, అనంత్ కుమార్, హర్షవర్ధన్ తదితరులు సందర్శించి నివాళులర్పించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, వీహెచ్పీ చీఫ్ అశోక్ సింఘాల్ తదితరులు కూడా ముండే పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన పార్థివదేహాన్ని బీజేపీ ఆఫీసు నుంచి పూలతో అలంకరించిన సైనిక వాహనంలో ఎయిర్పోర్టుకు తీసుకెళ్లి అక్కడి నుంచి ముంబై తరలించారు. వై.ఎస్. జగన్ సంతాపం... గోపీనాథ్ ముండే ఆకస్మిక మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్కు కాబోయే సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ముండే మృతికి సంతాపం తెలియజేశారు. ముండే కు నివాళులర్పించిన కిషన్రెడ్డి,నాగం సాక్షి, హైదరాబాద్: కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గోపీనాథ్ ముండే అకాలమృతి పట్ల బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్రెడ్డి తదితరులు ఢిల్లీ వెళ్లారు. ముండే భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత డాక్టర్ లక్ష్మణ్లు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రేమేందర్రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డి, అరుణజ్యోతి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ముండే చిత్రపటం ముందు నివాళులర్పించారు. ముండే కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆలస్యంగా వస్తానంటూ.. బుధవారం ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలకు కాస్త ఆలస్యంగా వస్తానంటూ పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడుకు చెప్పిన గోపీనాథ్ ముండే అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోవడం అందరినీ కలచి వేసింది. సొంత నియోజకవర్గానికి వెళ్తున్నందున లోక్సభ సభ్యుడిగా తన ప్రమాణస్వీకారానికి ఆలస్యంగా వచ్చేందుకు అనుమతించాలంటూ ముం డే సోమవారం రాత్రే తనను కోరారని...అందుకు తాను అంగీకరించానని, ఈలోగా ఈ ఘోరం జరిగిపోయిందని చెబుతూ వెంకయ్య నాయుడు ఉద్వేగానికి గురయ్యారు. -
రాజ్యసభ సభ్యుల విభజన వాయిదా!
న్యూఢిల్లీ: అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 18 మంది సభ్యులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య 7, 11 చొప్పున విభజించేందుకు చేపట్టాల్సిన ప్రక్రియ వాయిదా పడింది. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 18 మంది ఎంపీలను లాటరీ ద్వారా రెండు రాష్ట్రాల కు పంచాలి. ఈ మేరకు విభజన ప్రక్రియ చేపట్టేందుకు బుధవారం రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ముందు ఆ ఎంపీలు హాజరుకావాల్సి ఉండగా.. టీడీపీ సభ్యులెవరూ రాలేదు. కాంగ్రెస్ నుంచి చిరంజీవి, సుబ్బిరామిరెడ్డి మినహా మిగతా వారంతా వచ్చారు. టీఆర్ఎస్ సభ్యుడు కె.కేశవరావు వచ్చారు. ఈ ఎంపీలంతా లాటరీ ద్వారా ఇరు రాష్ట్రాలకు తమను కేటాయించడం సరికాదని అభ్యంతరం వ్యక్తంచేశారు. లాటరీ ద్వారా స్థానికత నిర్ధారించడం సమంజసం కాదన్నారు. ఈ అభ్యంతరాలను విన్న హమీద్ అన్సారీ.. తాను పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని, సభ్యుల అభ్యర్థన మేరకు ప్రత్యామ్నాయ అవకాశాల పరిశీలనకు న్యాయశాఖకు పంపిస్తానంటూ ప్రక్రియను ఈనెల 30కి వాయిదావేశారు. -
పెద్దల సభలో వాయిదాల పర్వం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజ్యసభలో ఆందోళన కొనసాగుతోంది. బిల్లు రాబోతోందని సభా వ్యవవహారాల సప్లిమెంటరీ ఎజెండాలో ఉండటంతో రోజంతా ఉత్కంఠతో సాగింది. ఉదయం 11 గంటలకు తొలుత రాజ్యసభ ప్రారంభం కాగానే.. చైర్మన్ హమీద్ అన్సారీ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. అప్పటికే సీమాంధ్ర సభ్యులు కె.వి.పి.రామచంద్రరావు, సుజనాచౌదరి, సి.ఎం.రమేశ్లు వెల్లో ఆందోళనకు దిగారు. బుధవారం లోక్సభలో జరిగిన తీరును ఖండిస్తున్నామంటూ ఎస్పీ సభ్యుడు ప్రస్తావించగా.. మరో సభ గురించి ఇక్కడ ప్రస్తావన తేవద్దంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ దశలో సభ అదుపు తప్పటంతో వెంటనే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. తిరిగి సమావేశం కాగానే.. టీడీపీ ఎంపీ సి.ఎం.రమేశ్ చైర్లో ఉన్న డిప్యూటీ చైర్మన్ కురియన్ వద్ద నుంచి కాగితాలు లాక్కునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో మంత్రులు పలు నివేదికలు ప్రవేశపెట్టారు. కొద్దిసేపటికి ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుకు లోక్సభ ఈనెల 18న ఆమోదం తెలిపింది. దాన్ని సభ ముందుంచుతున్నాను..’ అని రాజ్యసభ సెక్రటరీ జనరల్.. లోక్సభ నుంచి వచ్చిన సందేశాన్ని చదివి వినిపించారు. ఆ సమయంలో సి.ఎం.రమేశ్ సెక్రటరీ జనరల్ నుంచి కాగితాలు లాగి చింపేయటానికి ప్రయత్నించారు. వెంటనే డిప్యూటీ చైర్మన్ ‘సిబ్బందిపై దాడిచేయబోవడం సరికాదు.. ఇది దురదృష్టకరం..’ అంటూ తీవ్రంగా ఆక్షేపించారు. సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక.. ‘సభ్యుడు రమేశ్ వ్యవహరించిన తీరు అభ్యంతరకరం.. ’ అంటూ ఆయనపై చర్య తీసుకోబోతున్నట్లు డిప్యూటీ చైర్మన్ చెప్పబోయారు. అయితే విపక్షాలు అభ్యంతరం చెప్తూ రమేశ్కు మాట్లాడే అవకాశం కల్పించాలని కోరాయి. దీంతో రమేశ్ లేచి సభకు క్షమాపణలు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా పేపర్లు గుంజుకోలేదని, భావోద్వేగంతోనే అలా జరిగిందన్నారు. దీంతో ఆయనపై చర్య తీసుకోవటం లేదని కురియన్ ప్రకటించారు. అనంతరం సి.ఎం.రమేశ్, సుజనాచౌదరి, కేవీపీలు వెల్లో ఆందోళన కొనసాగించారు. వారికి మద్దతుగా కేంద్రమంత్రి చిరంజీవి కూడా తన స్థానంలో లేచి నిల్చున్నారు. సెక్రటరీ జనరల్ను తోయలేదు: రమేశ్ రాజ్యసభలో బిల్లును టేబుల్ చేసే సమయంలో చించేశానని.. అంతేకానీ, సెక్రటరీ జనరల్ను తాకడం, తోయడం లాంటి ఘటనలేవీ జరగలేదని రమే్శ్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనను సస్పెండ్ చేయడానికి కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. రాజ్యసభ సజావుగా నడిచి సీమాంధ్రుల సమస్యలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో కూడా టీవీ ప్రసారాలు నిలిపేసి బిల్లును ఆమోదించాలనే ప్రయత్నాలను మానుకోవాలని చైర్మన్కు చెప్పామన్నారు. -
జాతికి క్షమాపణ చెప్పండి : మోదుగుల
స్పీకర్ మీరాకుమార్కు మోదుగుల లేఖ సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలకు భిన్నంగా అధికార పార్టీ పక్షపాతిగా వ్యవహరిస్తున్న స్పీకర్ మీరాకుమార్ తన పదవి నుంచి తప్పుకుని జాతికి క్షమాపణ చెప్పాలని టీడీపీ సీమాంధ్ర ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన స్పీకర్కు మూడు లేఖలు పంపారు. ‘అవిశ్వాసంపై మేము పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పుడు.. సభ సజావుగా సాగడంలేదని స్పీకర్ అనుమతివ్వలేదు. మరి విభజన బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో సభ సజావుగా సాగుతుందా?’ అని మోదుగుల ప్రశ్నించారు. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు న్యాయనిపుణుల సలహాను కోరిన రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ ప్రజాస్వామ్య విలువలను కాపాడారని గుర్తు చేస్తూ.. లోక్సభలో కనీస విలువలు పాటించలేదని స్పీకర్ను దుయ్యబట్టారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరించారని ఆరోపించారు. 13వ తేదీన లోక్సభలో తెలంగాణ బిల్లు పెట్టిన సమయంలో జరిగిన పరిణామాలపై సీసీటీవీ దృశ్యాలను బహిర్గతపర్చాలని డిమాండ్ చేశారు. శరద్ యాదవ్, తంబిదొరైలతో భేటీ తెలంగాణ ప్రాంత టీడీపీ నేత నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ఆ ప్రాంత నేతల బృందం సోమవారం రాత్రి జేడీయూ అధినేత శరద్యాదవ్, ఏఐఏడీఎంకే నేత తంబిదొరైలను వేర్వేరుగా కలిసి పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేసింది. నామా వెంట టీడీపీ ఎంపీ రమేష్ రాథోడ్, ఆ పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ యర్రబెల్లి దయాకర్రావు తదితరులు ఉన్నారు. -
ఉర్దూకు ‘మహా’ గౌరవం
భివండీ, న్యూస్లైన్: ఉర్దూ భాషకు మహారాష్ట్రలో సముచిత స్థానం లభించిందని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పేర్కొన్నారు. పట్టణంలో శనివారం జరిగిన జి.ఎం.మోమిన్ మహిళా కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన అఖిల భారతీయ ఉర్దూ మహా సమ్మేళనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఉర్దూ భాష తన అస్తిత్వాన్ని కాపాడుకుందన్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ భాషను సరిగా పట్టించుకోవడం లేదన్నారు. అయితే మహారాష్ట్రలో మాత్రం గౌరవం లభించిందన్నారు. ఉర్దూ భాష ఉనికిని కాపాడడం కోసం జీ.ఎం. మోమిన్ గర్ల్స్ కళాశాల ఇటువంటి మహాసమ్మేళనం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాలను మున్ముందు కూడా చేపట్టాలని నిర్వాహకులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఉర్దూ భాష వికాసం కోసం రూపొందించిన వెబ్సైట్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కె.శంకరనారాయణన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఫౌజియాఖాన్, ఠాణే జిల్లా ఇంచార్జి మంత్రి గణేశ్ నాయిక్, మైనారిటీ శాఖ మంత్రి ఆరిఫ్ మహ్మద్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇదొక మైలురాయి: ప్రణబ్ముఖర్జీ
న్యూఢిల్లీ: అరుణ గ్రహ రహస్యాలను చేధించేందుకు ఉద్దేశించిన మార్స్ ఆర్బిటార్ మిషన్(మంగళయాన్) ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ హర్షం వ్యక్తంచేశారు. ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ మంగళవారం ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్కు సందేశం పంపించారు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక మైలురాయని, ఈ విజయం మరింతమంది శాస్త్రజ్ఙులకు స్పూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. మార్స్ మిషన్ విజయవంతం కావడం సంతోషకరమని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తెలిపారు. చరిత్రాత్మకం: ప్రధాని మార్స్ మిషన్ ప్రయోగం సఫలం కావడాన్నిచరిత్రాత్మక విజయంగా ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అభివర్ణించారు. ప్రయోగం విజయవంతం కాగానే ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్కు ఆయన స్వయంగా ఫోన్ చేసి ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రజ్ఞులకు అభినందనలు తెలిపారు. అనంతరం రాధాకృష్ణన్, ఆయన సహచరులకు అభినందనలు తెలుపుతూ ప్రధాని ఒక సందేశం పంపించారు. ‘అంతరిక్ష వాహక నౌకల ప్రయోగంలో ఇస్రో అద్భుత నైపుణ్యం కలిగి ఉందనడానికి ఈ ప్రయోగం ఒక నిదర్శనం. భారతదేశ అంతరిక్ష కార్యక్రమంలో మైలురాయిగా నిలిచే ఈ మార్స్ మిషన్ భవిష్యత్ అంచెలు కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. మీరు ఈ దేశం గర్వించేలా చేస్తారన్న నమ్మకం నాకుంది’ అని ఆ సందేశంలో ప్రధాని పేర్కొన్నారు. భారతీయులంతా గర్విస్తున్న అద్భుత వైజ్ఞానిక విజయం ఇదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. భూమి పుత్రుడు అంగారకుడు! అంగారకుడిని భూగ్రహానికి కుమారుడిగా భారతీయులు భావిస్తారని, ఆ గ్రహంపై జీవం మనగలిగే పరిస్థితులున్నాయా, లేవా అన్న విషయం ఈ ప్రయోగం ద్వారా తేలుతుందని బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి అన్నారు. సీఎం, ఆర్థిక మంత్రి అభినందనలు పీఎస్ఎల్వీసీ-25 ప్రయోగాన్ని విజయవంతం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చైర్మన్ రాధాకృష్ణన్, ఇతర శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంలోని కీలకమైన నాలుగు దశలు పూర్తి చేసుకుని విజయవంతంగా మార్స్ మిషన్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి చేర్చడంతో భారత అంగారక యాత్ర 300 రోజుల ప్రయాణం విజయవంతంగా ప్రారంభమైందని సీఎం కార్యాలయం పేర్కొంది. ‘ఇస్రో’కు జగన్ అభినందనలు అంగారక గ్రహ యాత్రలో భాగంగా మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళయాన్) ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ రాధాకృష్ణన్తో పాటు శాస్త్రవేత్తల బృందానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. తొలి ప్రయత్నంలోనే అపూర్వ విజయం సాధించడం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు తమ అసమాన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని ఆయన కొనియాడారు. ఈ ప్రయోగాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం ద్వారా ప్రపంచంలో అంగారక యాత్రను చేపట్టిన నాలుగోదేశంగా భారత దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన ఇస్రో.. భవిష్యత్తులో మరిన్ని ఘన విజయాలు సాధించాలని జగన్ ఒక సందేశంలో ఆకాంక్షించారు. మరిన్ని ప్రయోగాలు జరపాలి: బాబు పీఎస్ఎల్వీ సీ-25ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను చంద్రబాబు అభినందించారు. అంతరిక్ష రంగంలో భారత్ విజయపతాకను రెపరెపలాడించారని వారిని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు జరపాలని ఓ ప్రకటనలో అభిలషించారు. కాగా.. పీఎస్ఎల్వీసీ 25 ప్రయోగం విజయవంతం కావడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హర్షం వ్యక్తంచేశారు. ప్రజలను పిచ్చివాళ్లను చేయటమే.. ‘‘మార్స్ మిషన్ పూర్తిగా అర్థరహితం. మార్స్పై రోవర్ ప్రయోగం నిర్వహించిన నాసా అంగారకుడిపై జీవం ఆనవాలే లేదని బహిరంగంగా ప్రకటించింది. అయినప్పటికీ.. మార్స్ మీద జీవాన్వేషణ కోసం వెళుతున్నామని ప్రకటన చేయటం.. ప్రజలను పిచ్చివాళ్లను చేయటమే.’’ - మాధవన్నాయర్, ఇస్రో మాజీ చైర్మన్ దీపావళి టపాసుల ఖర్చులో పదో వంతే... ‘‘మార్స్ మిషన్పై రూ. 450 - 500 కోట్లు ఖర్చు చేశారంటూ భారతీయులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? ఇది ఖచ్చితంగా భారత్ గర్వించదగ్గ రోజు. పది అడుగులకన్నా ఎత్తుకు వెళ్లని దీపావళి టపాసుల కోసం ఒక్క రోజులో రూ. 5,000 కోట్లు ఖర్చుపెట్టటానికి భారతీయులకు ఎలాంటి ఇబ్బందీ లేదు. అందులో పదో వంతు అంగారకుడి వరకూ వెళ్లటానికి ఖర్చు చేస్తే ఎందుకింత గగ్గోలు?’’ - యు.ఆర్.రావు, ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ పాలక మండలి చైర్మన్ ఇస్రోకు కీలక మైలురాయి.. ‘అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగాల్లో పాలుపంచుకునే యోగ్యత ఈ ప్రయోగం ద్వారా ఇస్రోకు పెరుగుతుంది. ఇస్రోకు ఇది చాలా కీలక మైలురాయి’ - కే కస్తూరిరంగన్, ఇస్రో మాజీ చైర్మన్ మాపై ఆధిక్యం చూపేందుకే: చైనా అంతరిక్షంలో శాంతిని నెలకొల్పేందుకు కలిసి పనిచేద్దామని అంతర్జాతీయ సమాజానికి చైనా పిలుపునిచ్చింది. భారత్ ప్రయోగించిన మార్స్ మిషన్ విజయవంతం కావడంపై చైనా స్పందించింది. ‘అంతరిక్షం మానవాళికందరికీ చెందుతుంది. దానిపై ప్రయోగాలు చేసేందుకు అన్ని దేశాలకు హక్కుంది’ అని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హాంగ్లీ వ్యాఖ్యానించారు. అయితే, చైనా అధికారిక మీడియా మాత్రం తమ దేశ అంతరిక్ష ప్రయోగాలపై పైచేయి సాధించేందుకే భారత్ ఈ ప్రయోగాలు చేస్తోందని విమర్శించింది. చైనా గతంలో చేపట్టిన మార్స్ ప్రయోగం విఫలమైంది. -
ఉప రాష్ట్రపతి అన్సారీ దంపతులను సన్మానించిన ఎన్నారైలు
భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ దంపతులను లండన్లోని ఎన్నారైలు గురువారం రాత్రి ఘనంగా సత్కరించారు. ఏన్నారైలు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బ్రిటన్లోని భారత రాయబారి డాక్టర్ వీరేంద్ర పౌల్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. స్థానిక ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్తలు లార్డ్ స్వరాజ్ పాల్, లార్డ్ గులాం నూన్, లార్డ్ కరణ్ బిల్మెరా, లార్డ్ లార్ పాపట్ తదితర అతిరథ మహారథులంతా ఆ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అక్స్ఫర్డ్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్లో సిటీజన్ షిప్ అండ్ ఐడెంటిటీ అనే అంశంపై ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఉపన్యాసం చేయనున్నారు.భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ మూడు దేశాల పర్యటనలో భాగంగా క్యూబా, పెరూ దేశాలలో పర్యటించారు. అనంతరం హవానా చేరుకున్నారు. అక్కడి నుంచి నిన్న ఉదయం లండన్ చేరుకున్నారు.