Hitech City
-
HYD: మైండ్ స్పేస్ భవనం వద్ద టెకీ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హైటెక్ సిటీలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మైండ్ స్పేస్ టవర్పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. హైటెక్ సిటీలో వద్ద ఉన్న మైండ్ స్పేస్ టవర్లో 13వ ఫ్లోర్ నుంచి దూకి టెకీ వంగ నవీన్ రెడ్డి(24) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నవీన్ రెడ్డి ఎన్సీఆర్ యోయిస్ కంపెనీలో పని చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
ఈ బర్మా ఫుడ్.. క్రేజీ టేస్ట్!
సాక్షి, సిటీబ్యూరో: వినూత్న వంటకాలను ఆస్వాదించే వారి సంఖ్య ఈ మధ్య పెరిగింది. సిటీ లైఫ్లోని పాశ్చాత్య ఒరవడులకు గతకాలపు అభిరుచులను అద్ది వడ్డించే పసందైన రుచులకు ఆదరణ పెరిగింది. ఇలాంటి రెస్టారెంట్లు, ఫుడ్ స్పాట్స్కు నగరంలో మంచి క్రేజ్ ఉంది. ఐతే ఇలాంటి అంశాలతో కొన్ని రెస్టారెంట్లు నగరంలో ఇప్పటికే ఆదరణ పొందుతుండగా.. వారసత్వ వంటకాలకు అధునాతన హంగులద్ది వడ్డించే బర్మా బర్మా రెస్టారెంట్ హైటెక్ సిటీలో సందడి చేస్తోంది. అంతేగాకుండా బర్మీస్ వంటకాల రుచి తెలిసిన ఫుడ్ లవర్స్కు క్రేజీ స్పాట్గా మారింది.బర్మా సంస్కృతికి ప్రతీకగా.. ఖౌసూయ్, టీ లీఫ్ సలాడ్, సమోసా సూప్, మాండలే నూడిల్ బౌల్, బర్మీస్ ఫలూడా వంటి వంటకాలు ఇప్పడు చాలామందికి ఫేవరెట్ డిషెస్గా మారాయి. పరాటాతో టోహు మాష్, కొబ్బరి క్రీమ్తో స్టిక్కీ రైస్, మెకాంగ్ కర్రీ, కుంకుమపువ్వు–సమోసా, చీజ్కేక్ వంటి నోరూరించే రుచులకు నాలెడ్జ్ సిటీలోని బర్మా కేరాఫ్ అడ్రస్గా మారింది. బర్మాలో ప్రసిద్ది చెందిన ఈ విభిన్న రుచులు నగరంలో ప్రారంభించడం విశేషం. ఆసియాలోని అతిపెద్ద ఐటీ పార్కులలో ఒకటైన నగరాన్ని తన గమ్యస్థానంగా ఎంచుకోవడం, ఆహారాన్ని ఆస్వాదించడంలోనూ నగరవాసుల వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోంది.బర్మా సంప్రదాయ ప్రతీకలైన బర్మీస్ స్వరాలతో పాటు అక్కడి వీధులు, గృహాల నుంచి ప్రేరణ పొందిన యాంబియన్స్తో ఆహ్లాద ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. బర్మీస్ ప్రత్యేకతల నుంచి అత్యుత్తమంగా ఎంపిక చేసిన ఆరి్టసానల్ ‘టీ’లు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ మొదలు తరతరాలుగా ఆదరణ పొందుతున్న గిరిజన, వారసత్వ వంటకాలు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉడికించిన అరటి ఆకు పాకెట్స్(కయునిన్ మావో) సిగ్నేచర్గా నిలుస్తుంది.సంస్కృతుల సమ్మేళనం..వలస ఆహార సంస్కృతులు, స్వదేశీ పదార్థాలతో సమ్మిళితమైన గతకాలపు హోమ్స్టైల్ వంటలు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుండగా ఇక్కడి బెస్ట్ సెల్లర్స్లో ‘మామిడి సలాడ్, స్పైసీ టీ లీఫ్, అవకాడో సలాడ్, లోటస్ రూట్ చిప్స్, సమోసా సూప్, బ్రౌన్ ఆనియన్, రంగూన్ బేక్డ్ మిల్క్’ ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. చిన్ననాటి స్నేహితులైన చిరాగ్ ఛజెర్, అంకిత్ గుప్తాల ఆలోచనల్లోంచి ఆవిష్కృతమైన బర్మా బర్మా.. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, అహ్మదాబాద్లో విస్తరించింది.ముఖ్యంగా కోల్కతాలో ఎన్నడూ లేనివిధంగా బర్మీస్ సంస్కృతికి జీవం పోస్తోందని సహవ్యవస్థాపకులు అంకిత్ గుప్తా పేర్కొన్నారు. 2023లో అందించిన కొండే నాస్ట్ ట్రావెలర్ టాప్ రెస్టారెంట్ అవార్డ్స్లో బర్మా బర్మా 34వ స్థానంలో నిలిచిందని అన్నారు. వంటకాలు పులుపు, కారం రుచులతో.. కాఫీర్ లైమ్లు, బాలాచాంగ్ మిరియాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు తదితరాలను వినియోగిస్తాం. సిటీలో బర్మా నుంచి తీసుకొచ్చిన బాండెల్ చీజ్, పికిల్డ్ ప్లం, బాలచాంగ్ పెప్పర్స్, లాఫెట్ వంటి బర్మీస్ పదార్థాల రుచులతో నగరవాసులను యాంగోన్ వీధులకు తీసుకెళతామని వివరించారు. -
Virat Kohli: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. సిటీలో కోహ్లి రెస్టారెంట్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి కేవలం క్రికెటర్గానే కాకుండా వ్యాపారవేత్తగానూ రాణిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో సంస్థలో పెట్టుబడులు పెట్టిన ఈ ఢిల్లీ బ్యాటర్.. వన్ 8 కమ్యూన్ పేరిట రెస్టారెంట్ చైన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఆతిథ్య రంగంలో కొత్త ఒరవడిని సృష్టిస్తూ అద్బుతమైన మెనూతో ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్న వన్ 8 కమ్యూన్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఎంట్రీ ఇచ్చింది.కోహ్లికి హైదరాబాద్ అంటే కూడా చాలా ఇష్టంనగరంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో గల నాలెడ్జ్ సిటీలో ఈ రెస్టారెంట్ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వన్ 8 కమ్యూన్లో కోహ్లి భాగస్వామి వర్తిక్ తిహారా మాట్లాడుతూ.. ‘‘సౌత్లో మొదట బెంగళూరులో మా రెస్టారెంట్ ఓపెన్ చేశాం.అక్కడి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఆ స్ఫూర్తితో హైదరాబాద్లోనూ ఆరంభించాం. కోహ్లికి హైదరాబాద్ అంటే కూడా చాలా ఇష్టం. ఐపీఎల్ కోసం ఇటీవలే ఇక్కడికి వచ్చాడు కూడా! ఇక్కడి ఫుడ్, సిటీ వైబ్.. అన్నీ తను చాలా ఎంజాయ్ చేస్తాడు. కుదిరితే మరో ఏడు నుంచి ఎనిమిది నెలల్లో ఇక్కడే మరో రెస్టారెంట్ కూడా ప్రారంభిస్తాం’’ అని ‘సాక్షి’కి తెలిపారు.అతడి ఫేవరెట్ డిష్ ఇదేఅదే విధంగా.. గ్లోబల్ మెనూతో పాటు 20 రకాల స్థానిక రుచులతో తమ మెనూను నింపేశామని.. ప్రఖ్యాత హైదరాబాదీ బిర్యానీతో పాటు సోయా హలీం ఇక్కడ మరో స్పెషాలిటీ అని తెలిపారు. కోహ్లికి ఉన్న అభిమాన గణాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఫుడ్ ఎంజాయ్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వర్తిక్ తిహారా పేర్కొన్నారు.ఇక విరాట్ కోహ్లి వెజిటేరియన్ ఎక్కువగా ఇష్టపడతాడని.. మష్రూమ్ డిమ్సమ్ అతడి ఫేవరెట్ డిష్ అని తెలిపారు. పాన్ ఇండియా లెవల్లో అన్ని రకాల వంటకాలను కోహ్లి ఆస్వాదిస్తాడని పేర్కొన్నారు. రికార్డుల రారాజుగా పేరొందిన రన్మెషీన్ కోహ్లి ఫిట్నెస్, డైట్ విషయంలో పక్కాగా ఉంటాడన్న విషయం తెలిసిందే.భోజనం బాగుందంటూ కితాబులుఇదిలా ఉంటే.. వన్ 8 కమ్యూన్ ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పుణే, కోల్కతా, బెంగళూరు తదితర నగరాల్లో కొలువు దీరింది. ఇక హైదరాబాద్లోనూ ఇప్పటికే కింగ్ కోహ్లి అభిమానులు ఈ రెస్టారెంట్ను సందర్శిస్తున్నారు. ఫుడ్, పార్టీ ప్లేస్ అన్నీ ఆహ్లాదకరంగా ఉన్నాయని.. భోజనం కూడా చాలా రుచిగా ఉందని చెబుతున్నారు.చదవండి: విరాట్ కోహ్లి ఆర్సీబీని వీడాలి.. ఆ జట్టులో చేరాలి: ఇంగ్లండ్ స్టార్ -
ఐ బౌటిక్ లో సినీ ప్రముఖులు మరియు మోడల్స్ సందడి (ఫోటోలు)
-
మాదాపూర్లో రెండు భారీ భవనాల కూల్చివేత..!
-
ఆ భూములకు మార్కెట్ ధర నిర్ణయించండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో కమ్మ, వెలమ కుల సంఘాలకు కేటాయించిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయించాలని సర్కార్ను హైకోర్టు ఆదేశించింది. జీవో 571 ప్రకారం మార్కెట్ ధరను అంచనా వేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్న గత ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే నిర్మాణాలు చేసి ఉంటే అవి తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఖానామెట్లో కమ్మ, వెలమ కుల సంఘాల కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదెకరాల చొప్పున కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రిటైర్డు ప్రొఫెసర్ ఎ.వినాయక్రెడ్డి పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్కుమార్ ధర్మాసనం మరోసారి సోమవారం విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. కుల సంఘాలకు భూకేటాయింపు అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. 2012, సెప్టెంబర్ 14 నాటి జీవో 571 మేరకు ప్రభుత్వం ఈ సంఘాలకు ఇచ్చిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయిస్తామని, ఇందుకు అనుమతించాలని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ వినతిని ఆమోదించవద్దని కోరారు. అనంతరం ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
హైటెక్ సిటీ: ప్రాణం తీసిన అతివేగం.. యువతి మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మాదాపూర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అతి వేగం ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. నిండు ప్రాణం గాలిలో కలిసింది. హైటెక్ సిటీ ఫ్లైఓవర్పై హైస్పీడ్లో వెళ్తున్న స్కూటీ సైడ్వాల్ను ఢీకొనడంతో వాహనం వెనుక కూర్చున్న యువతి ఫ్లైఓవర్పై నుంచి పడిపోయి మృతిచెందింది. వివరాల ప్రకారం.. మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని లోయర్ ట్యాంక్బండ్లో నివాసం ఉంటున్న స్వీటీ పాండే(22) ఓ ప్రైవేట్ ఉద్యోగి. గురువారం సాయంత్రం వెస్ట్ బెంగాల్లోని కోల్కతాకు చెందిన స్నేహితుడు రాయన్ ల్యూకెతో కలిసి స్కూటీపై జేఎన్టీటీయూ కూకట్పల్లి నుంచి బయలుదేరింది. యువకుడు ఐకియా వైపు వెళ్తూ వాహనాన్ని వేగంగా నడిపాడు. హైటెక్ సిటీ చౌరస్తా వద్ద ఉన్న ఫ్లైఓవర్ వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి ప్రొటెక్షన్ వాల్ను ఢీకొన్నది. ఈ క్రమంలో బైక్పై వెనుక కూర్చున్న స్వీటీ పాండే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్ పైనుంచి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న రాయన్ ల్యూకే కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో, వారిద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో స్వీటీ పాండే తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా తరలించినట్టు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ప్రమాదవశాత్తు కిందపడి గర్భిణి మృతి -
కేబుల్ బ్రిడ్జికి వెళ్తున్నారా.. పోలీసుల హెచ్చరిక ఇదే..
సాక్షి, హైదరాబాద్: వాహనదారులను సైబరాబాద్ పోలీసులు మరోసారి హెచ్చరించారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను నిలిపితే జరిమానా విధించనున్నట్టు తెలిపారు. ఎవరైనా కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేస్తే 9490617346 అనే నెంబర్కు వాట్సాప్ చేయాలని సూచించారు. వివరాల ప్రకారం.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా, ప్రమాదాలను నిలువరించేందుకు సైబరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేయరాదని పోలీసులు హెచ్చరించారు. పార్కింగ్ చేసిన వాహనాలకు భారీ జరిమానా విధిస్తామని తేల్చిచెప్పారు. క్యారేజ్వే వద్ద వాహనాలను పార్క్ చేయడం వల్ల ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. అక్రమంగా వాహనాలను పార్కింగ్ చేస్తే భారీ జరిమానా విధిస్తామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. అయితే కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేసి, ఇతరులకు ఇబ్బంది కలిగించినట్లు ప్రజల దృష్టికి వస్తే నేరుగా తమకు ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు. 9490617346 అనే నెంబర్కు వాట్సాప్ చేయాలని తెలిపారు. ఇదే సమయంలో ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు. Traffic movement on the Cable bridge is smooth. We request commuters not to park vehicles on carriageway which obstructs traffic flow. If any are found parking illegally on the bridge will attract a hefty penalty. Public can also report these issues through WhatsApp 9490617346. pic.twitter.com/UZiy5MjMQd — CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) August 8, 2023 -
Hyderabad: హైటెక్ సిటీలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలకు నిలయమైన హైటె క్ సిటీ సైబర్ టవర్స్కు కూతవేటు దూరంలోని ఓ మార్కెటింగ్ కంపెనీలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రావడంతో కలకలం రేగింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు, ఫైర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న రోహిణి లేఅవుట్లోని ఓ భవనం మూడో అంతస్తులో మూవింగ్ నీడిల్ అనే మార్కెటింగ్ కంపెనీ ఉంది. ఆపైఅంతస్తులో ఇదే కంపెనీకి చెందిన క్యాంటీన్, కెఫెటేరియాను నిర్వహిస్తున్నారు. అయితే శనివారం రాత్రి 8.30 గంటలకు క్యాంటీన్లో మంటలు చెలరేగాయి. అదిచూసిన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. గంటసేపు శ్రమించి మంటలను అదుపుచేశారు. క్యాంటీన్లోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం సంభవించిందని, ఫరీ్నచర్ పూర్తిగా కాలిపోయిందని అధికారులు తెలిపారు. శనివారం కావడంతో ఉద్యోగులెవరూ లేరని, ప్రాణనష్టం తప్పిందని వెల్లడించారు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: వివేకా కేసు: గంగిరెడ్డిని కలిసేందుకు సునీత ప్రయత్నం!) -
హైటెక్సిటీ మెట్రోస్టేషన్లో యూఎస్ వీసా దరఖాస్తు కేంద్రం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హైటెక్సిటీ మెట్రో స్టేషన్లో అమెరికా వీసా దరఖాస్తు కేంద్రం ఆదివారం ప్రారంభం కానుంది. వీసా అప్లికేషన్ సెంటర్గా పిలిచే ఈ కేంద్రంలో అమెరికాకు వెళ్లాలనుకునేవారి వేలిముద్రల సేకరణ, వీసా దరఖాస్తు పత్రాల సమర్పణ, ఇంటర్వ్యూ తదితర సేవలను అందించనున్నట్లు మెట్రో అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేంద్రాన్ని అమెరికా కాన్సులేట్ అధికారులు ఏర్పాటుచేశారన్నారు. స్టేషన్ మధ్యభాగం (కాన్కోర్స్)లో ఈ కేంద్రం ఏర్పాటు చేస్తున్నా రు. కాగా ప్రస్తుతం ఈ కేంద్రం బేగంపేట్లోని కాన్సులేట్ సమీపంలోని గౌరా గ్రాండ్ భవన్లో ఉన్న విషయం విదితమే. నగరవాసులు, మెట్రో ప్రయాణికులు ఈ కేంద్రాన్ని వినియోగించుకోవాలని మెట్రో అధికారులు కోరారు. చదవండి: Hyderabad: మలక్పేట హోటల్లో అగ్ని ప్రమాదం.. కార్మికుడి మృతి -
హైదరాబాద్ అంటే హైటెక్సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ కాదు!
ముషీరాబాద్ (హైదరాబాద్): హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ కాదని హైద రాబాద్ నగరం పేదలు నివసించే బస్తీల్లో, కాలనీల్లో ఉందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. వీటి అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ముషీరా బాద్ నియోజకవర్గంలోని అడిక్మెట్, రాంనగర్ డివిజన్లలోని పలు బస్తీలు, కాలనీల్లో అధికారు లతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సంద ర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. పేదలు, చిన్ని చిన్న ఉద్యోగులు నివసించే కాలనీలు, బస్తీలు నిర్ల క్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధి అంటే హైటెక్సిటీ అభివృద్ధి అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. నిజమైన హైదరాబాద్ అంటే ఓల్డ్సిటీ, ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్పేట్, సికింద్రాబాద్, సనత్నగర్లతోపాటు అనేక ప్రాంతాలున్నాయన్నారు. మెయిన్రోడ్లమీద రంగులు పూసి హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడికి వెళ్లినా డ్రైనేజీ, వర్షపునీరు, కలుషిత మంచినీరు, రోడ్లపై గుంతలు, వీధిలైట్ల సమస్యలను చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ నుంచే 80 శాతం రెవెన్యూ వస్తోంటే.. నగర అభివృద్ధికి 8 శాతం నిధులు కూడా ఖర్చుపెట్టడం లేదని చెప్పారు. హైదరాబాద్లోని రెండు ప్రధాన శాఖ లైన జీహెచ్ఎంసీ, జలమండలి అప్పుల ఊబిలో చిక్కి చిన్న చిన్న పనులకు సైతం నిధులు విడుదల చేయలేని దుస్థితి నెలకొందని దుయ్యబట్టారు. అందువల్ల ప్రభుత్వం బస్తీల్లో ఉండే నిజమైన హైద రాబాద్ అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. చదవండి: నాడు టీడీపీలో.. నేడు కాంగ్రెస్లో.. చంద్రబాబుతో మాకు సంబంధం లేదు -
ఐటీ ఉద్యోగులకు షాక్.. అప్పటి నుంచి 100 శాతం వర్క్ ఫ్రమ్ ఆఫీస్!
సాక్షి, సిటీబ్యూరో: ఐటీ క్యాపిటల్గా మారిన గ్రేటర్ సిటీలో వచ్చే ఏడాది జనవరి నుంచి వంద శాతం ఉద్యోగులు ఆఫీసు నుంచి పనిచేసేలా నగరంలోని ఐటీ కంపెనీలు చర్యలు ప్రారంభించాయి. ఈ మేరకు ఉద్యోగులకు వర్తమానాలు పంపినట్లు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఇప్పటివరకు హైబ్రీడ్ విధానంలో.. అంటే సుమారు 70 నుంచి 80 శాతం మంది ఆఫీసుకు వచ్చి పనిచేస్తుండగా.. మరో 20 నుంచి 30 శాతం మంది వర్క్ఫ్రం హోం కొనసాగిస్తున్నారు. వీరిలోనూ పలువురు కార్యాలయంలో అత్యవసర సమావేశాలకు హాజరయ్యేందుకు వారంలో ఒకటి రెండు మార్లు ఆఫీసులకు వస్తున్నారు. ప్రస్తుతం మహానగరం పరిధిలో అన్ని వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు పూర్తిస్తాయిలో కొనసాగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. కాగా వర్క్ఫ్రం హోం అయినప్పటికీ ఆయా కంపెనీలు, ఉద్యోగుల ఉత్పాదకత, ఎగుమతులు ఏమాత్రం తగ్గలేదని హైసియా వర్గాలు పేర్కొనడం విశేషం. ఐటీలో నయా ట్రెండ్ ఇలా... నగరంలో కార్పొరేట్, బడా, చిన్న ఐటీ కంపెనీలు సుమారు 1500 వరకు ఉన్నాయి. వీటిల్లో సుమారు 7 లక్షల మంది ఉపాధి పొందుతున్నట్లు అంచనా. ఈ ఏడాది జూన్–అక్టోబరు మధ్యకాలంలో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతోన్న ఉద్యోగులు 20 నుంచి 25 శాతానికి పెరిగినట్లు హైసియా వర్గాలు తెలిపాయి. దిగ్గజ కంపెనీలుగా పేరొందిన టీసీఎస్,ఇన్ఫోసిస్ కంపెనీలు సైతం ఈజాబితాలో ఉండడం గమనార్హం. కొన్ని కంపెనీల్లో ఈ ట్రెండ్ 27 శాతం మేర నమోదైందట. అనుభవం గడించిన ఉద్యోగులు ఇతర కంపెనీలకు వలసలు పోతుండగా..ఫ్రెషర్స్ ఈ కంపెనీల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. ఈపరిణామం ఈ రంగంలో కొత్తేమీ కానప్పటికీ ఇటీవల మరింత పెరగడం విశేషమని నిపుణులు చెబుతున్నారు. ప్రాజెక్టుల జోరు పెరిగింది.. నిపుణులైన ఐటీ ఉద్యోగులు వలసబాట పట్టడానికి ప్రధాన కారణం నూతన ప్రాజెక్టులేనని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో పలు కంపెనీలు డిజిటల్ టెక్నాలజీని అధికంగా అమలు చేస్తున్న కారణంగానే ఐటీ ప్రాజెక్టులు అనూహ్యంగా పెరిగాయి. అమెరికా,యూరప్,కెనడా,ఆ్రస్టేలియా దేశాలకు చెందిన సంస్థలకు నగరంలోని పలు కంపెనీలు ఔట్సోర్సింగ్ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. వీటికి ప్రాజెక్టుల సంఖ్య పెరగడంతో నిపుణులైన ఉద్యోగులకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ప్రధానంగా కృత్రిమ మేథ,మిషన్ లెరి్నంగ్,బ్లాక్చైన్,సైబర్సెక్యూరిటీ సంబంధిత ప్రాజెక్టులకు డిమాండ్ పెరిగిందట. ఇందులో అనుభవం ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండడం విశేషం. డిజిటల్ టెక్నాలజీ నిపుణులకు తాజాగా 30 శాతం మేర డిమాండ్ పెరగడం ఐటీలో నయా ట్రెండ్. -
Hyderabad: కేపీహెచ్బీ.. ఇదో హైరైజ్ కాలనీ
ఆసియాలోనే అతి పెద్ద కాలనీగా రూపొందిన కేపీహెచ్బీ కాలనీ నగరంలోనే ప్రసిద్ధిగాంచిన నివాస ప్రాంతంగా ఏర్పడింది. సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకు స్థానమున్న ఈ కాలనీలో గంజి, బెంజి మిళితమై నివాసకేంద్రంగా ఉండటం విశేషం. ఒకప్పుడు రాళ్లూ రప్పలు, చెట్టూ చేమలతో చిట్టడవిగా ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం ఆకాశ హర్మ్యాలకు చిరునామాగా మారింది. విభిన్న సంస్కృతుల మేళవింపుతో దేశ, విదేశాల వారికి ఆవాసంగా ఉంది. మహా నగరానికే మణిమకుటంగా వెలుగొందుతోంది కేబీహెచ్బీ కాలనీ. దాని ప్రస్థానమిదీ.. 1969లో 1,326 ఎకరాలను అప్పటి ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. 1978లో హౌసింగ్ బోర్డు పేద, మద్య తరగతి ప్రజలకు నివాసం కోసం నో లాస్, నో ప్రాఫిట్ పేరుతో ఇళ్ల నిర్మాణం కోసం శ్రీకారం చుట్టింది. హుడా నిబంధనల ప్రకారం 40 శాతం ఖాళీ స్థలాలను వదిలి మిగిలిన ప్రాంతాన్ని ప్లాట్లుగా విభజించింది. అనంతరం 1981– 82 ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పట్లో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, ఇళ్లు లేని వారు ఎంతోమంది హౌసింగ్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. - మొదట్లో కేపీహెచ్బీ కాలనీ ఫేజ్– 1, ఫేజ్– 2 ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అప్పటికి దరఖాస్తులు మిగిలిపోవటంతో 3, 4 ఫేజుల నిర్మాణం చేపట్టింది. అప్పట్లోనే 100 ఎకరాల స్థలాన్ని జేఎన్టీయూకు కేటాయించింది. అనంతరం 5వ, 6వ ఫేజులో హెచ్ఐజీల పేరుతో పెద్ద ప్లాట్లను వేలం వేసింది. లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్లు కేటాయిస్తూ హౌసింగ్ బోర్డు నిర్ణయం తీసుకొంది. 15 ఫేజుల్లో లాటరీ పద్ధతిలో కమర్షియల్ స్థలాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించారు. హౌసింగ్ బోర్డుకు గుండె లాంటి కూకట్పల్లిలో హౌసింగ్ బోర్డు ఆదాయం సమకూర్చుకునేందుకు బహిరంగ వేళాన్ని ప్రోత్సహించింది. దీంతో పోటాపోటీగా స్థలాల విక్రయాలు జరిగాయి. స్పైనల్ రోడ్డుతో మహర్దశ.. కూకట్పల్లి నుంచి కేపీహెచ్బీ మీదుగా హైటెక్ సిటీ వరకు 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్పైనల్ రోడ్డు నిర్మాణం కోసం చేసిన శంకుస్థాపన ఈ రోజు వేలల్లో ఉన్న సామాన్యులను కోటీశ్వరులుగా చేసింది. స్పైనల్ రోడ్డుకు ముందు 10 వేల రూపాయలకు ఇళ్లు కొనాలన్నా హడలిపోయే ప్రజలు స్పైనల్ రోడ్డు నిర్మాణంతో గజం లక్ష రూపాయలకు చేరింది. అప్పట్లో రాష్ట్రంలోనే హౌసింగ్బోర్డు వేసిన వేలంలో గజం ధర లక్ష రూపాయలకు పలకటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకవైపు ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్, మరోవైపు మెట్రో రైల్వే స్టేషన్, ఇంకో వైపు హైటెక్ సిటీకి వెళ్లే హైస్పీడ్ రహదారి, మరో వైపు స్పైనల్ రోడ్డు నిర్మాణంతో హౌసింగ్ బోర్డు దశ మారిపోయింది. రాష్ట్రంలోనే అతిపెద్ద వ్యాపార కేంద్రంగా కూకట్పల్లి ప్రఖ్యాతి గాంచింది. దీనికి తోడు ప్రతిష్టాత్మకమైన జేఎన్టీయూ యూనివర్సిటీ ఇక్కడే ఉండటంతో జేఎన్టీయూ అనుబంధ కళాశాలలు కూడా సమీపంలోనే ఉండటంతో ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్గా మారింది. సకల సౌకర్యాలకు నెలవు.. తెలంగాణలోనే మొట్టమొదట గేటెడ్ కమ్యూనిటిల నిర్మాణం కూడా ఈ ప్రాంతం నుంచే ప్రారంభమయ్యాయి. అత్యంత ఎత్తైన 42 అంతస్థుల భవన నిర్మాణాలు చోటుచేసుకోవటమే కాకుండా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఇక్కడ నిర్మాణం కావటంతో ఈ ప్రాంతానికి మహర్దశ పలికింది. ప్రభుత్వం 50 శాతానికిపైగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. కొన్ని డ్లూప్లెక్స్ నిర్మాణాలు చేపట్టారు. ముఖ్యంగా లోదా కాలనీ, రెయిట్ట్రీ పార్కు (మలేసియా టౌన్ షిప్), హిందూ ఫార్చ్యూన్, వన్ సిటీ కాలనీ వంటి ప్రాంతాలు అధునాతనంగా నిర్మించటంతో అధిక శాతం సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఈ ప్రాంతం పట్ల ఆకర్షితులయ్యారు. హైటెక్ సిటీకి సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ రోడ్లు్ల, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, ప్లే గ్రౌండ్స్, క్లబ్ హౌస్, మీటింగ్ హౌస్లను ఏర్పాటు చేయటంతో సామాన్యుడితో పాటు కోటీశ్వరులకు కూడా కావాల్సిన వస్తువులు అందుబాటులో లభిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు, సినీ రంగ ప్రముఖులు కూడా ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ ఒకవైపు ఓఆర్ఆర్ సమీపంలో ఉండటమే కాకుండా ముంబై జాతీయ రహదారికి ఆనుకొని ఉండటంతో ఈ ప్రాంతం మరో అబిడ్స్ను తలపిస్తోంది. ఇక్కడ అక్షరాలా లక్షకు పైగా జనాభా నివాసం ఉంటారంటే అతిశయోక్తి లేదు. అతిపెద్ద నివాస కేంద్రం.. కూకట్పల్లికి చుట్టు పక్కల పారిశ్రామిక ప్రాంతాలైన సనత్నగర్, బాలానగర్, జీడిమెట్ల, పాశమైలారం, బొల్లారం, పటాన్ చెరు, కాజిపల్లి, బొంతపల్లి ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొనటంతో ఇక్కడి కారి్మకులకు నివాస యోగ్యమైన ప్రాంతంగా కేపీహెచ్బీ అవతరించింది. దీంతో ఈ ప్రాంతానికి మరింత డిమాండ్ పెరిగింది. మాదాపూర్, గచి్చబౌలి ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు రావటంతో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడే బీహెచ్ఇయల్ ఆర్ అండ్, ఎన్ఆర్ఎస్ఏ, ఎంఎస్ఎమీ, బీహెచ్ఈఎల్, ఐడీపీఎల్, ఐడీఎల్, బీడీఎల్ ప్రభుత్వరంగ సంస్థలు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతాన్ని నివాస కేంద్రంగా ఏర్పరచుకున్నారు. కోస్తాంధ్రవాసులకు అడ్డా.. నగరంలో నూతనంగా ఇళ్లు నిర్మించుకోవాలన్నా, సామాన్యుడికి అవసరమయ్యే ఇళ్లు అద్దెకు కావాలన్నా ఇతర ప్రాంతాల నుంచి వలస వచి్చన ప్రజలు ఈ ప్రాంతాన్నే ప్రధాన అడ్డాగా ఎంపిక చేసుకుంటున్నారు. ఇక్కడ విద్యారంగంతో పాటు వ్యాపార రంగం, కార్మికరంగం, ప్రజలు ఎక్కువగా నివాసముంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారు కూడా ఈ ప్రాంతంలోనే నివాసముంటూ జీవనోపాధికి బాటలు వేసుకుంటున్నారు. ఇక్కడ నివాసముంటూ హాస్టళ్లలో బ్యాచ్లర్స్ జీవితాలను గడుపుతూ ఏదో ఒక రంగంలో ఉపాధి వెదుక్కొని ఇక్కడే వివాహం చేసుకొని నివాసాలు ఏర్పాటు చేసుకోవటం విశేషం. కోస్తా, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల వారు ఇక్కడే నివాసం ఉండటంతో ఆ ప్రాంతానికి సంబంధించిన హోటల్స్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవటం విశేషం. గుంటూరు గోంగూర, రాగి సంకటి, నాటు కోడి పులుసు, గోదావరి ఘుమఘుమలు, రొయ్యల పులుసు, పాలమూరు చికెన్ గ్రిల్స్, హైదరాబాద్ బిర్యానీతో పాటు అన్ని వంటలకు కేరాఫ్గా ఈ ప్రాంతం నిలిచింది. ఇక్కడ సకల సౌకర్యాలు లభించటంతో కేవలం కేపీహెచ్బీ ప్రాంతంలోనే వెయ్యికి పైగా హాస్టల్స్ ఏర్పడటం విశేషం. ఇలా.. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ తెలంగాణ ప్రాంతంలోనే అతిపెద్ద ఆదాయ వనరుగా ఏర్పడటం విశేషం. -
సైబర్ మాయ.. లక్షలు పాయె
సాక్షి, హిమాయత్నగర్: ‘‘నగరానికి చెందిన పావని ఫోన్ నంబర్ను ఓ వ్యక్తి వాట్సప్ గ్రూప్లో యాడ్ చేశాడు. మీరు చెప్పినట్లుగా విని నేను పెట్టుబడి పెట్టి ఇప్పుడు కోటీశ్వరుడిని అయ్యానంటూ ఏవో కొన్ని స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేయడం. వీటిని చూసిన పావని తాను కూడా ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరాలిని కావొచ్చనే ఆశతో డబ్బు పెట్టి మోసపోయింది.’’ ‘‘నాలుగు రోజుల క్రితం హైటెక్సిటీలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా చేసే యువతికి ఇన్స్ట్రాగామ్లో ఓ వ్యక్తి పరిచయమై క్రిప్టోలో డబ్బు పెట్టమన్నాడు. అతగాడి మాటలకు బుట్టలో పడ్డ యువతి పలు దఫాలుగా రూ.92లక్షలు పెట్టుబడి పెట్టినాక మాయగాడి ఇన్స్ట్రాగామ్, వాట్సప్ మాయమైంది.. అప్పటికి గాని యువతికి అర్థం కాలేదు తాను మోసపొయినట్లు’’. ఈ రెండు ఉదాహారణలే కాదు ఇలా వారంలో పది, పదిహేను మంది ఇన్వెస్ట్మెంట్, క్రిప్టో కరెన్సీ వలలో పడి మోసపోయిన బాధితులు సైబర్క్రైం పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మోసపోతున్న వారిలో వందకు వందశాతం విద్యావంతులే ఉండటం అందులోనూ ఐటీ రంగానికి చెందిన వారు, వ్యాపార రంగానికి చెందిన వారు ఉండటం మరింత హాస్యాస్పదానికి గురిచేస్తుంది. కోటీశ్వరులైనట్లుగా నకిలీ ఆధారాలతో బురిడీ ముక్కూ మెహం తెలియని కొందరు వ్యక్తులు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. వీరిలో ఎక్కువ సంఖ్యలో నైజీరియన్లు ఉంటుంటే మిగత వారు రాజస్థాన్, యూపీ, అస్సాంలకు చెందిన వారు ఉంటున్నారు. ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన నకిలీ బ్యాంక్ స్టేట్మెంట్స్, డబ్బు వచ్చినట్లుగా వారికి వారే వాట్సప్ చాటింగ్లో గొప్పలు చెప్పుకోవడం వంటివి చేస్తున్నారు. పెట్టుబడి పెడుతున్న వారిని నమ్మించేందుకు రూ.5వేలకు 10వేలు ఇవ్వడం లేదా రూ.10వేలకు 20వేలు ఇవ్వడం చేస్తున్నారు. ఇదిగో లాభాలు వస్తున్నాయి కదా అంటూ ఏమాత్రం ఆలోచించకుండా లక్షల రూపాయిలు పెట్టేస్తూ అప్పులపాలౌవుతున్నారు. హెచ్చరిస్తున్నాం అయినా వలలో పడిపోతున్నారు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్లకు సంబంధించిన ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ అధికారిక పేజీల్లో ఇన్వెస్ట్మెంట్లు, క్రిప్టో కరెన్సీలు చేసి మోసపోవద్దంటూ పోలీసులు పోస్టులు పెడుతున్నారు. ఆయా కమీషనరేట్ పరిధిలోని పోలీసుస్టేషన్లకు సంబం«ధించిన వారు కూడా అవగాహాన కలి్పస్తున్నారు. ప్రజలు ఎవరూ కూడా వీటిని పట్టించుకోవడం లేదు. కొత్తవారితో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటూ లక్షల రూపాయిలు మోసపోతున్నారు. – కేవీఎం ప్రసాద్, సైబర్క్రైం ఏసీపీ -
మాదాపూర్లో హైటెక్ దందా.. కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువులు చదివి.. ఎన్నో ఆశలతో కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న వారికి ఊహంచని షాక్ తగిలింది. ఐటీ కొలువు వచ్చిందని.. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదని భావించిన ఉద్యోగులకు కంపెనీ భారీ షాకిచ్చింది. డబ్బులు వసూలు బోర్డు తిప్పేసింది. వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న ధన్యోన్ ఐటీ టెక్నాలజీ సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయితే, అంతకుముందు.. సదరు ఐటీ కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావాలంటూ ఫేస్బుక్లో ప్రకటన ఇచ్చింది. దీంతో పలువురు నిరుద్యోగులు, ఆశావహులు కంపెనీని సంప్రదించారు. ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం వారికి భారీ ప్యాకేజీలు ఆఫర్ చేసింది. ఉద్యోగం ఫైనల్ చేసుకున్న వారితో కంపెనీ డీల్ కుదుర్చుకుంది. సదరు కంపెనీ యాజమాన్యం ఉద్యోగం పేరుతో దాదాపు 200 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 2 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. డబ్బులు ఇచ్చిన వారికి ఆఫర్ లెటర్స్ సైతం పంపించినట్టు తెలుస్తోంది. రోజులు గుడుస్తున్నా.. ఆఫీస్ నుంచి పిలుపురాకపోవడంతో బాధితులు.. తాము మోసపోయినట్లు గుర్తింపు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. -
హైటెక్ సిటీ సమీపంలో MMTS రైలు ఢీకొని ముగ్గురు మృతి
-
హైటెక్ సిటీ సమీపంలో ప్రమాదం.. ఎఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి
సాక్షి, హైదరాబాద్: హైటెక్ సిటీ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. వీరు రైల్వే ట్రాక్పైనుంచి వెళ్తుండగా రైలు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను వనపర్తికి చెందిన రాజప్ప, శ్రీను, కృష్ణగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం భౌతికకాయాలను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ప్రమాదానికి గురయ్యారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మృతుల్లో ఒకరి వద్ద మద్యం సీసాలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో రైల్వేస్టేషన్కు సమీపంలోని మూలమలుపులో పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. చదవండి: ఆటోలో వచ్చి బాలికను కిడ్నాప్ చేసిన కిరాతకులు.. గదిలో బంధించి 3 నెలలపాటు సామూహిక అత్యాచారం -
ఇక సాఫీ జర్నీ
సాక్షి, హైదరాబాద్: కైతలాపూర్ ఆర్ఓబీని మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. హైటెక్ సిటీ– బోరబండ స్టేషన్ల మధ్య నిర్మించిన ఆర్ఓబీతో కూకట్పల్లి, హైటెక్ సిటీల మధ్య సాఫీ ప్రయాణం సాధ్యం కానుంది. జేఎన్టీయూ జంక్షన్, మలేషియన్ టౌన్షిప్ జంక్షన్, హైటెక్సిటీ ఫ్లై ఓవర్, సైబర్టవర్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కులు తగ్గుతాయని అధికారులు పేర్కొన్నారు. సనత్నగర్, బాలానగర్, సికింద్రాబాద్ల నుంచి వచ్చేవారు మూసాపేట వద్ద డైవర్ట్ అయి కైతలాపూర్ మీదుగా మాదాపూర్ మెయిన్రోడ్ చేరుకోవచ్చు. తద్వారా 3.5 కి.మీ దూరం తగ్గడంతోపాటు గంట ప్రయాణ సమయం కలిసి వస్తుంది. ఎస్సార్డీపీలో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.86 కోట్లు. ఎస్సార్డీపీ ద్వారా చేపట్టిన 41 పనుల్లో ఇప్పటి వరకు 29 పూర్తయినట్లు అధికారులు పేర్కొన్నారు. వాటిలో ఏడు ఆర్ఓబీ/ఆర్యూబీలున్నాయన్నారు. (చదవండి: సిటీలో డీడీసీ... మాదకద్రవ్యాలపై స్పెషల్ డ్రైవ్) -
ఐటీ కారిడార్లలో వజ్ర పరుగులు.. చార్జీలు ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: నగరంలో వజ్ర ఏసీ బస్సులు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. గతంలో హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్ తదితర దూర ప్రాంతాలకు నడిచిన ఈ బస్సులను నగరంలో నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. క్యాబ్లకు ఎక్కువగా డిమాండ్ ఉండే హైటెక్ సిటీ, ఐటీ కారిడార్లలో వీటిని నడుపుతున్నారు. ఐటీ దిగ్గజ సంస్థల్లో పనిచేసే సాఫ్ట్వేర్ నిపుణులు, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఆయా సంస్థల నుంచి సమీపంలోని మెట్రో స్టేషన్లకు, ప్రధాన ప్రాంతాలకు చేరుకొనేలా ఇవి అందుబాటులో ఉంటాయి. సుమారు 5 లక్షల మందికిపైగా ప్రయాణికులు.. ► సాధారణంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజు సుమారు 1,500 బస్సులు ఐటీ పారిశ్రామిక ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. సుమారు 5 లక్షల మందికిపైగా ప్రయాణికులు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్లకు ప్రయాణం చేస్తారు. కోవిడ్ కారణంగా ఐటీ సంస్థలను మూసివేసి వర్క్ఫ్రమ్ హోమ్ ప్రకటించడంతో ఈ మార్గంలో ప్రజా రవాణా కూడా స్తంభించింది. (క్లిక్: జూన్లో కరోనా కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం) ► కొంతకాలంగా కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఐటీ సంస్థల కార్యకలాపాలను పునరుద్ధరించారు. రాకపోకలు పెరిగాయి. ఈ క్రమంలో క్యాబ్లు, ఆటోలు తదితర ప్రైవేట్ వాహనాల నుంచి ఎదురయ్యే పోటీని ఎదుర్కొనేందుకు ఆర్టీసీ ప్రస్తుతం వజ్ర మినీ ఏసీ బస్సులను ఈ మార్గంలో నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రయాణికులకు అనుగుణంగా.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మెట్రో, ఇతర మార్గాల్లో జేఎన్టీయూకు చేరుకొనే ప్రయాణికులు అక్కడి నుంచి వేవ్రాక్ వరకు వెళ్లేందుకు అనుగుణంగా వజ్ర బస్సులు ఉంటాయి. సైబర్టవర్స్, మైండ్స్పేస్, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, డీఎల్ఎఫ్, ఇన్ఫోసిస్, విప్రో, ఐసీఐసీఐ, అమెజాన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని పలు ప్రాంతాలకు తక్కువ చార్జీలతో ప్రయాణం చేయవచ్చు. (క్లిక్: ఇకపై ఆ లైసెన్సుల జారీ కఠినతరం) బస్సుల వేళలు.. జేఎన్టీయూ నుంచి వేవ్ రాక్ వరకు.. ఉదయం 8, 8.30, 9.50, 10.20, సాయంత్రం 4.25, 4.55, 6.15, 6.45 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. వేవ్రాక్ నుంచి జేఎన్టీయూ వరకు... ఉదయం 8.50, 9.20, సాయంత్రం 3.35, 4.05, 5.25, 5.55 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. చార్జీలు జేఎన్టీయూ నుంచి మైండ్స్పేస్కు రూ.20, జేఎన్టీయూ నుంచి వేవ్రాక్కు రూ.40, మైండ్స్పేస్ నుంచి వేవ్రాక్కు రూ.20. వీకెండ్లో సమతామూర్తి వద్దకు సిటీబస్సులు ఓ నెటిజన్ విజ్ఞప్తికి స్పందించిన ఆర్టీసీ ఎండీ ముచ్చింతల్లోని కొలువైన సమతామూర్తి విగ్రహం వద్దకు వీకెండ్ సిటీ బస్సులు నడపాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు. సమతామూర్తి విగ్రహం వద్దకు నేరుగా ఆర్టీసీ బస్సుల్లేవని, క్యాబ్లో వెళ్లేందుకు రూ.1000 వరకు ఖర్చవుతుందని ఓ నెటిజన్ ట్విట్టర్లో ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు సజ్జనార్ సానుకూలంగా స్పందించారు. ‘ఆర్టీసీ పట్ల మీ ఆసక్తికి ధన్యవాదాలు’ అంటూ అభినందించారు. -
హైదరాబాద్లో వర్క్ ఫ్రం ఆఫీస్.. బ్యాక్ టు ‘ట్రాఫిక్ రూల్స్’
సాక్షి, హైదరాబాద్: దశల వారీగా ‘వర్క్ ఫ్రం ఆఫీస్’ పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులూ సన్నద్ధమవుతున్నారు. ఐటీ కారిడార్లో క్రమగా వాహనాల రద్దీ పెరుగుతోంది. వ్యక్తిగత వాహనాలు, ట్రావెల్ బస్సులలో ఉద్యోగులు కార్యాలయాలకు హాజరవుతుండటంతో ఐటీ కారిడార్ జంక్షన్లలో ఉదయం, సాయంత్రం సమయాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. ఇప్పటికే ఆయా కారిడార్లలోని ట్రాఫిక్ కూడళ్ల వద్ద పని చేయని సిగ్నల్స్, సీసీ కెమెరాలను రిపేరు చేసి పోలీసులు నిర్వహణకు సిద్ధం చేశారు. రెండున్నరేళ్ల తర్వాత... ► కరోనా ప్రభావంతో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ముగించేందుకు ఐటీ కంపెనీలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ► దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెలాఖరు నుంచి ఉద్యోగులు దశల వారీగా ఉద్యోగులు హాజరయ్యేలా కంపెనీలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ► తొలుత సగం మంది ఉద్యోగులను వారం విడిచి వారం ఆఫీసులకు వచ్చేలా.. క్రమంగా హాజరు శాతాన్ని పెంచుతూ.. రెండు మూడు నెలల్లో పూర్తి స్థాయిలో ఉద్యోగులు ప్రత్యక్ష విధులు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. ► సిటీ నలుమూలల నుంచి ప్రతి రోజు ఐటీ, ఇతర ఉద్యోగులు ఐటీ కారిడార్కు వస్తుంటారు. దీంతో మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి ట్రాఫిక్ పీఎస్ల పరిధిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. (క్లిక్: హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ భారీ డేటా సెంటర్) ► ఐటీ కారిడార్లో ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల రద్దీ పెరగనుంది. ఇందుకు తగ్గట్టుగానే జంక్షన్లు, సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ జాం కాకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పని చేయని సిగ్నళ్లు, పాడైపోయిన కెమెరాలను బాగు చేయడంతో పాటూ, వార్షిక సర్వీస్లను చేసే పనిలో నిమగ్నమయ్యారు. కొత్తగా మూడు సెక్టార్లు.. ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10 ట్రాఫిక్ పీఎస్లు ఉన్నాయి. ఐటీ కారిడార్లో కొత్తగా మూడు ట్రాఫిక్ సెక్టార్లు ఏర్పాటు చేశారు. సిటీ నలుమూలల నుంచి ప్రతి రోజు ఉద్యోగులు మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి వంటి ప్రాంతాలకు వస్తుంటారు. దీంతో ఆయా ట్రాఫిక్ పీఎస్ల పరిధిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టేషన్ల పరిధిలోని ఆఫీసర్లు, సిబ్బందిపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త సెక్టార్లు ఏర్పాటు చేస్తే సిబ్బందిపై ఒత్తిడి తగ్గి, ట్రాఫిక్ నియంత్రణ సులువవుతుందని అధికారులు భావించారు. మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి ట్రాఫిక్ పోటీస్ స్టేషన్ల పరిధిలో కొత్తగా మూడు సెక్టార్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ► మాదాపూర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో రాయదుర్గం సెక్టార్ ► గచ్చిబౌలి పీఎస్ పరిధిలో నార్సింగి సెక్టార్ ► కూకట్పల్లి పీఎస్ పరిధిలో కేపీహెచ్బీ సెక్టార్ను ఏ ర్పాటు చేశామని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ► ఒక్కో సెక్టార్కు ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎస్ఐలు, 45 మంది కానిస్టేబుళ్లు కేటాయించారు. (క్లిక్: హైదరాబాద్లో అడుగుపెట్టిన లండన్ బేస్డ్ యూనికార్న్ కంపెనీ) -
తప్పతాగి ర్యాష్ డ్రైవింగ్
-
హైటెక్ సిటీలో కారు బీభత్సం.. ఫుట్పాత్పై ఎగిరిపడ్డ ఆటో
సాక్షి, హైదరాబాద్: హైటెక్ సిటీ రహేజా మైండ్స్పేస్ వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న యువకులు రాష్ డ్రైవింగ్ చేస్తూ తమ ఆడి కారుతో ముందున్న ఆటోను ఢీకొట్టారు. దీంతో ఆటో ఫుట్పాత్ మీదకు ఎగిరిపడి నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఉమేశ్ కుమార్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ప్రమాదానికి కారణమైన యువకులు కారును అక్కడే వదిలి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఉమేశ్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కాగా ఉమేశ్ కుమార్ మృతికి కారణమైన వారిని విడిచిపెట్టొద్దని అతని బందువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీకెమెరాల ఫుటేజీ ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు వారికి వివరించారు. చదవండి: అరాచకం.. స్కూటర్ను ఢీకొట్టాడని చితకబాదారు; వీడియో వైరల్ -
హైటెక్ సిటీ: విదేశీ యువతులతో వ్యభిచారం
మాదాపూర్: హైటెక్ సిటీలోని ఓ స్టార్ హోటల్పై యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ టీమ్ దాడి చేసి విదేశీ యువతులు, మోడళ్లతో నిర్వహిస్తున్న ఓ వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేసింది. నిర్వాహకుడు పరారీ కాగా, ఐదుగురు యువతులను, ఒక విటుడిని అదుపులోకి తీసుకొని మాదాపూర్ పోలీసులకు అప్పగించింది. మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... మాదాపూర్లోని ఓ స్టార్ హోటల్లో ఉజబెకిస్తాన్కు చెందిన ముగ్గురు యువతులు, ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతుల పేరిట ఐదు రూమ్లు బుక్ చేశారు. నిర్వాహకులు అర్నవ్, ప్రిన్స్లు ఫోన్లో విటులతో మాట్లాడి హోటల్కు రప్పించి యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా, సోమవారం సాయంత్రం 5 గంటలకు సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ టీమ్ సదరు హోటల్పై దాడి చేసింది. వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉజబెకిస్తాన్కు చెందిన ముగ్గురు యువతులు, ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుంది. విటుడు షేక్పేట్కు చెందిన జ్ఞాన శేఖర్ మణికంఠన్(44)ను పోలీసులు అరెస్టు చేశారు. హోటల్ గదులలో రూ.29,560 నగదు, కండోమ్ ప్యాకెట్లు, సెల్ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. కాగా, యువతులను రెస్క్యూ హోంకు తరలిస్తామని సీఐ తెలిపారు. పరారీలో ఉన్న నిర్వాహకుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైటెక్ సిటీ: వాహనదారులకు తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: కేపీహెచ్బీ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే దారిలో నూతనంగా రూ.66.59 కోట్లతో పూర్తి చేసిన హైటెక్ సిటీ రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్యూబీ)ని సోమవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఉండే మార్గంలో దాదాపు 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఆర్యూబీ ప్రారంభంతో వాహనదారులకు ఊరట లభించనుంది. ప్రస్తుతం ఈ ఆర్యూబీ ప్రారంభంతో ఇప్పటికే అధిక ట్రాఫిక్ ఉన్న హైటెక్ సిటీ, ఎంఎంటీఎస్ స్టేషన్ మార్గంలో కష్టాలు తీరనున్నాయి. ఇక జేఎన్టీయుహెచ్ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే దారిలోని ఈ రైల్వే బ్రిడ్జి కింద గతంలో చిన్నపాటి వర్షం పడితే ఇక్కడి కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తేది. ప్రతిరోజు దాదాపుగా 40 వేల లీటర్ల నీరు ఊరుతూ ఉండేది. అదే విధంగా చిన్నపాటి వర్షం కురిసినా వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి ఉండేది కాదు. ప్రస్తుతం ఈ నీటిని నిల్వ చేయటానికి సమీపంలోనే పెద్ద సంపును నిర్మించారు. ఈ సంపులో నిల్వ చేసిన నీటిని మూసాపేట సర్కిల్లో నాటిన హరితహారం మొక్కలకు అందించనున్నారు. చదవండి: సర్పంచ్ పాడె మోసిన మంత్రి జగదీశ్ రెడ్డి -
‘ఆ రూట్లో.. ట్రామ్ లేదా బీఆర్టీఎస్ ఏర్పాటు’
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి జేఎన్టీయూ నుంచి హైటెక్సిటీ వరకు ఎలివేటెడ్ పద్ధతిలో బీఆర్టీఎస్ కారిడార్ గాని ట్రామ్ ట్రాన్స్పోర్టు విధానాన్ని కాని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన శాసనసభకు తెలిపారు. జేఎన్టీయూ నుంచి హైటెక్సిటీ మార్గంలో మెట్రో కారిడార్ నిర్మించాలని, తీవ్ర రద్దీ పెరిగిన సుచిత్ర కూడలి నుంచి కూడా ఈ తరహా ఏర్పాటు అవసరమని, కానీ అక్కడ మెట్రో నిర్మాణానికి వీలుగా స్థలం లేనందున కనీసం ఎంఎంటీఎస్నైనా ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ సభ్యుడు వివేకానంద కోరారు. జేఎన్టీయూ నుంచి హైటెక్సిటీ వైపు రద్దీ తీవ్రంగా ఉన్నందున అక్కడ ప్రత్యేక వ్యవస్థ అవసరమని, అయితే ట్రామ్ మార్గాన్ని గాని ఎలివేటెడ్ కారిడార్ ద్వారా బీఆర్టీఎస్ విధానాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి పేర్కొన్నారు. మెట్రో రైళ్లలో పాస్ను ప్రవేశపెట్టే అంశం కూడా పరిశీలనలో ఉందని, ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా రాత్రివేళ వాటి సమయాన్ని పొడిగించే యోచనలో ఉన్నామన్నారు. ప్రస్తుతం 20 వేల ద్విచక్రవాహనాలు, 400 కార్లు నిలిపేందుకు వీలుగా వివిధ ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లలో పార్కింగ్ సౌకర్యం కల్పించామని, త్వరలో 20 ప్రాంతాల్లో మల్టీలెవల్ పార్కింగ్ టవర్లు నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు వ్యయం రూ.14,500 కోట్లు కాగా, వయబిలిటీ గ్యాప్ ఫండ్గా 10 శాతం మొత్తాన్ని కేంద్రప్రభుత్వం భరించిందని, అందులోనూ ఇంకా రూ.2 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఎంజీబీఎస్ నుంచి 5 కి.మీ. దూరంలో ఉన్న ఫలక్నుమా వరకు వీలైనంత త్వరలో మెట్రో రైలు కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. -
రహేజా మైండ్స్పేస్లో కరోనా కలకలం.. ఖాళీ!
-
రహేజా మైండ్స్పేస్లో కరోనా కలకలం.. ఖాళీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రవేశించిన కోవిడ్-19(కరోనా వైరస్) ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంపెనీలను సైతం గడగడలాడిస్తోంది. హైటెక్ సిటీలో కరోనా కలకలం రేగడంతో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. వివరాలు... రహేజా మైండ్ స్పేస్లో గల ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న టెకీ ఇటీవలే ఇటలీకి వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో సదరు ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్లు భావిస్తున్నారు. వైరస్కు సంబంధించిన లక్షణాలు బయటపడటంతో సదరు బిల్డింగ్లోని సాఫ్ట్వేర్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. (దేశంలో 28 కరోనా కేసులు: కేంద్ర మంత్రి) ఈ క్రమంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఉద్యోగులను ఇంటికి పంపించి.. వర్క్ ఫ్రం హోంకు ఆదేశించాయి. హైదరాబాద్లో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో.. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని ఆదేశించాయి. హ్యాండ్ సానిటైజర్స్ ఉపయోగించాలని... జన సమ్మర్ధం ఉన్నచోట వస్తువులను తాకడం, కరచాలనం చేయకూడదని ఉద్యోగులకు సూచించాయి. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు మెట్ల మార్గం ఉపయోగించాలని.. వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత శుభ్రత పాటించాలని పేర్కొన్నాయి.(వారికి కరోనా సోకలేదు: పబ్లిక్ హెల్త్ డైరెక్టర్) -
హైటెక్సిటీకి ఎన్ జనార్థన రెడ్డి ఫౌండేషన్ వేశారు
-
‘మరిన్ని రోబోటిక్ యంత్రాలు అందుబాటులోకి’
సాక్షి, హైదరాబాద్ : మ్యాన్హోల్లోని చెత్తను తొలగించే రోబోటిక్ యంత్రాన్ని నగర మేయర్ బొంతు రామ్మోహన్ హైటెక్సిటీలో ప్రారంభించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో మొట్ట మొదటిసారిగా హైటెక్ సిటీలో చెత్తను తీసే రోబోటిక్ యంత్రాన్ని తీసుకొచ్చామని అన్నారు. గతంలో మ్యాన్హోల్స్ లోని చెత్త తీసే క్రమంలో దురదృష్టవశాత్తు పలువురు కార్మికులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ యంత్రం తొడ్పడుతుందని తెలిపారు. అలాగే కొత్త టెక్నాలజీతో తయారైన రోబోటిక్ యంత్రం ద్వారా పూడికతీత పనులు చేస్తున్నామని, ఈ యంత్రంతో 24 గంటలు పని చేయవచ్చని పేర్కొన్నారు. దీనికి నాలుగు కెమెరాలతో పాటు రోబోటిక్ లెగ్స్, ఆర్మ్స్, యూజర్ ఇంటర్ ఫేస్ డిస్ప్లేకు అనుసంధానంగా ఉంటాయన్నారు. ఈ రోబో యంత్రాలకు రహేజా సంస్థ సహకారం అందించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో నగరంలో మరిన్ని రోబోటిక్ యంత్రాలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, జోనల్ కమిషనర్ హరి చందన హాజరయ్యారు. -
హైటెక్ సిటీలో స్కైవాక్ షురూ
సాక్షి, సిటీబ్యూరో: హైటెక్సిటీ మెట్రో స్టేషన్ నుంచి ఎల్అండ్టీ నెక్టŠస్ గలేరియా మాల్ను అనుసంధానిస్తూ నిర్మించిన స్కైవాక్ సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. స్టేషన్లో దిగిన ప్రయాణికులు నేరుగా గలేరియా మాల్కు వెళ్లి షాపింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ట్రాఫిక్, పొల్యూషన్ సమస్యల బారిన పడకుండా నేరుగా షాపింగ్కు వెళ్లే వారికి ఇదో సదవకాశమని ఎల్అండ్టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి అన్నారు. ఇప్పటికే పంజగుట్ట మెట్రోస్టేషన్ వద్ద ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. రవాణా ఆధారిత అభివృద్ధిలో భాగంగా ఎల్అండ్టీ సంస్థ నగరంలో పలు చోట్ల మాల్స్ నిర్మించడంతో పాటు వాటిని స్టేషన్లకు అనుసంధానించడంతో ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉందన్నారు. ప్రపంచ స్థాయి సదుపాయాలను గ్రేటర్ సిటీజన్లకు పరిచయం చేశామన్నారు. -
3 నిమిషాలకో.. మెట్రో!
సాక్షి, హైదరాబాద్: సిటీ జనానికి మెట్రో మరింత అందుబాటులోకి వచ్చింది.. ఇకపై ప్రతి మూడు నిమిషాలకో మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. జూబ్లీ చెక్పోస్ట్–హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైలు రివర్సల్ సదుపాయం లేకపోవడంతో మొన్నటి వరకు 8 నిమిషాలకో రైలు నడిపారు. ఇప్పుడు రివర్సల్ సదుపాయం రావడంతో పీక్ అవర్స్లో 3 నిమిషాలు, నాన్పీక్ అవర్స్లో 5 నిమిషాలకో రైలు అందుబాటులోకి రానుందని మెట్రో వర్గాలు తెలిపాయి. కాగా మెట్రో సర్వీసులకు గ్రేటర్ సిటీజన్ల నుంచి ఆదరణ క్రమంగా పెరుగుతోంది. సరాసరిన ప్రతివారం ప్రయాణికుల సంఖ్యలో 5–6 వేల మేర పెరుగుదల నమోదవుతోంది. బుధవారం మెట్రో ప్రయాణికుల సంఖ్య 3.06 లక్షలకు చేరుకోవడం విశేషం. ఇక స్టేషన్లలో రద్దీని కలిపితే ప్రయాణికుల సంఖ్య 3.23 లక్షలకు చేరుకున్నట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ.), నాగోల్–హైటెక్ సిటీ (28 కి.మీ.) మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. గురువారం హైటెక్ సిటీ, అమీర్పేట్, ఎల్బీనగర్, మియాపూర్, సికింద్రాబాద్, ఉప్పల్ తదితర స్టేషన్లు సైతం వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడాయి. హైటెక్ సిటీ–రాయదుర్గం మైండ్స్పేస్ జంక్షన్ (1.1 కి.మీ.) మార్గంలో మెట్రో పట్టాలు, సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్స్, స్టేషన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ నెలాఖరులో ఈ మార్గంలో మెట్రో రైళ్ల ట్రయల్ రన్ నిర్వహిస్తామని హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. ఎంజీబీఎస్–జేబీఎస్ (10 కి.మీ.) మార్గంలో ఈ ఏడాది డిసెంబర్లో మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మార్గంలో ఇప్పటికే మెట్రో పనులు, స్టేషన్లు, సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్స్, విద్యుదీకరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. హైటెక్ సిటీ మెట్రోస్టేషన్ బుధవారం 24 వేల మంది ప్రయాణికుల రాకపోకలతో సరికొత్త రికార్డు సృష్టించినట్లు హెచ్ఎంఆర్ అధికారులు తెలిపారు. మెట్రో రైళ్ల మధ్య అంతరం.. 8 నిమిషాలు.. ఇప్పటి వరకు ఇలా.. 3 నిమిషాలు.. ఇకపై పీక్ అవర్లో.. 5 నిమిషాలు..నాన్ పీక్ అవర్లో.. -
మిడ్నైట్ మెట్రో మరెంత దూరం?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రజల మెట్రో రైలు నైట్ రైడ్ కల ఇప్పట్లో తీరేలా లేదు. వేకువజామున 5 గంటలకు, అర్ధరాత్రి సమయంలో మెట్రో రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్రోవేళలను పొడిగించాలని కోరుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ.), నాగోల్–హైటెక్ సిటీ (28 కి.మీ.) మార్గంలో మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నాయి. నిత్యం ఈ మార్గాల్లో ఐటీ, బీపీవో, కెపీఓ, ప్రభుత్వ, ప్రైవేటు, అసంఘటిత, మార్కెటింగ్ రంగాల్లో పనిచేస్తున్న వేతన జీవులతోపాటు మహిళలు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు వేలాదిగా జర్నీ చేస్తున్నారు. రోజూ సుమారు 3 లక్షల మంది ఈ రూట్లలో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకే మెట్రో రైలు ప్రయాణం అందుబాటులోఉంది. అమీర్పేట్ స్టేషన్ నుంచి రాత్రి 11.02 నిమిషాలకు చివరి మెట్రో రైలు అందుబాటులో ఉంది. అయితే నగరంలో వివిధ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు షిఫ్టు వేళలు 24 గంటలూ ఉంటాయి. తెల్లవారుఝామున 5 గంటల నుంచి.. రాత్రి 1 గంట వరకు మెట్రో రైలు సర్వీసులను ఈ ప్రధాన రూట్లలో అందుబాటులో ఉంచాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆక్యుపెన్సీ ఉండదనేనా.. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబై, బెంగళూరు మహానగరాల్లో ఉదయం 5.30 గంటల నుంచి 11.30 వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అయితే, గ్రేటర్ హైదరాబాద్ సిటీలో రాత్రి 10.30 గంటల తర్వాత మెట్రోరైళ్లలో ఆక్యుపెన్సీ అంతగా ఉండదని.. దీంతో తమకు గిట్టుబాటు కాదన్న అంచనాతోనే నిర్మాణ సంస్థ అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మెట్రో రైళ్లలో ప్రయాణించే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రోరైళ్లలో చెల్లుబాటయ్యేలా కాంబి టికెట్ లేదా నెల వారీ పాస్ల జారీ అంశంపైనా మెట్రో అధికారుల నుంచి మౌనమే సమాధానమౌతోంది. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని చెప్పి అధికారులు తప్పించుకుంటున్నారు. మరోవైపు పాస్ల జారీ విషయంలో ఈ మూడు రవాణా విభాగాల మధ్య సయోధ్య కుదరడంలేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రాత్రి 1 గం. వరకు నడపాలి హైటెక్ నగరంగా పేరొందిన హైదరాబాద్లో వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య వర్గాలకు రాత్రి 12 గంటల వరకు క్షణం తీరిక లేకుండా గడపడం సర్వసాధారణం. అర్థరాత్రి 12 గంటల వరకూ సిటీలో పగటి తరహాలోనే ప్రధాన రహదారులపై జన సంచారం, ప్రయాణికులు, వాహనదారుల రాకపోకలుంటాయి. ఈ నేపథ్యంలో అర్థరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు సర్వీసులను అందుబాటులో ఉంచాలని ఎల్అండ్టీ వర్గాలను సంప్రదించగా... ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పి దాటవేయడం గమనార్హం. హైటెక్సిటీ వరకు మెట్రో అందుబాటులోకి రాగానే పని వేళలను పెంచుతామని చెప్పిన అధికారులు ప్రస్తుతం మీనమేషాలు లెక్కిస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఎంజీబీఎస్, నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లను మెట్రో స్టేషన్లకు అనుసంధానించారు. అయితే పొరుగు రాష్ట్రాలు, దూర ప్రాంత జిల్లాల నుంచి తెల్లవారుజామున 4–5 గంటలకే వేలాది మంది ప్రయాణికులు నగరంలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లకు చేరుకుంటారు. వీరంతా సమీపంలోని మెట్రో స్టేషన్కు వెళ్లగానే మూసిన గేట్లే దర్శనమిస్తుండటంతో బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. -
సగం జీతం.. ఇంటి అద్దెకే..!
సాక్షి, సిటీబ్యూరో: అంబర్పేట్లో స్నేహితులతో షేరింగ్ రూమ్లో ఉంటున్న మహేశ్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు రూ. 20,000ల జీతం. ఇటీవలే పెళ్లి అయ్యింది. అంతకుముందు స్నేహితులతో కలిసి అంబర్పేట్ నుంచి బేగంపేట్లో ఉన్న తన ఆఫీస్కు వచ్చేవాడు. పెళ్లి కావడంతో ఇల్లు మారాల్సి వచ్చింది. బేగంపేట్లో ఇల్లు అద్దెకు తీసుకుందామని నిశ్చయించుకుని వెతకడం మొదలుపెట్టాడు. తీరా అక్కడి అద్దెలు చూసి ఆశ్చర్యపోయాడు. నెలకు రూ. 12,000 అద్దె కడితే కానీ అన్ని వసతులతో సింగల్ బేడ్ రూమ్ ఇల్లు లభించడంలేదు. ఖమ్మం ట్రాన్స్పోర్టు కంపెనీలో విధులు నిర్వహిస్తున్న షేక్ ఇమామ్ ఇటీవల నగరంలోని దివాన్దేవిడిలోని ట్రాన్స్పోర్టు కంపెనీకి ట్రాన్స్ఫర్ అయింది. అతని వేతనం 16,000. ఉద్యోగం ఉన్న చోటే ఇల్లు తీసుకుందామని పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల అద్దె కోసం వెతికాడు. సర్వసాధారణంగా ఇళ్ల అద్దెలు పాతబస్తీకి తక్కువగా ఉంటాయాని ఉండాలనుకున్నాడు. కానీ సింగల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని సౌకార్యలతో రూ. 8500 కంటే తక్కువ లేదు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన రవితేజకు ఇటీవలే హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఫ్రెషర్ అవడంతో శిక్షణలో నెలకు రూ. 25,000 జీతం వస్తోంది. అప్పటి వరకు అమీర్పేట్లో సాఫ్ట్వేర్ శిక్షణ తీసుకున్నాడు. తొందరగా ఉద్యోగం రావడంలో సమయానికి ఆఫీసు వెళ్లాలని క్రమశిక్షణ పాటించాలని ఇల్లు హైటెక్ సిటీ ప్రాంతంలో తీసుకుందామనుకున్నాడు. తీరా అక్కడికి వెళ్లి గది అద్దెకు తీసుకుందామంటే అద్దెను చూసి విస్తుపోయాడు. రూ. 13,000 నుంచి రూ. 15,000కు మించి పెడితేనే సౌకర్యవంతమైన గది దొరికే పరిస్థితి ఉందక్కడ. వచ్చిన జీతంలో సగం గది అద్దెకే వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదీ.. నగరంలోని అద్దెల పరిస్థితి. ఏటా నగరంలో అద్దెలు పెరిగిపోతున్నాయ్. దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్లోని పలు ప్రాంతా ల్లో అద్దెలు ఎక్కువగా పెరిగాయని పలు సంస్థల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నగరంలోని బేగంపేట్, అమీర్పేట్, కూకట్పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, హై టెక్సిటీ తదితర ప్రాంతాల్లో అద్దెలు ఏటా పెరుగున్నాయే తప్ప తగ్గడం లేదు. 2019 జూన్ నాటికి అద్దెల్లో 8 శాతం వృద్ధి ఏర్పడిందని సంస్థలు తమ సర్వేల్లో పేర్కొంటున్నాయి. మొత్తం 15 నగరాల్లో అధ్యయనం చేయగా అత్యధిక అద్దెలు ఉన్న నగరాలుగా కోల్కతా, బెంగుళూరు, అహ్మదాబాద్ 6.5 శాతంగా ఉండగా, 8 శాతం వృద్ధితో హైదరబాద్ నగరం నిలిచింది. నగరం ఒక్కటే ఇళ్ల అద్దెలు 60 శాతం వ్యత్యాసం నగరం ఒక్కటైనా ఇళ్ల అద్దెల వ్యత్యాసం ఓల్డ్సిటీకి హైటెక్ సిటీ 60 శాతం తేడా ఉంది. 900 చగదరపు గజాల ఇళ్లు ఓల్డ్సిటీలో రూ. 8,000 ఉండగా అదే ఇల్లు హైలెక్ సిటీలో రూ. 20 వేల వరకు ఉంది. నగరంలో గడచిన మూడేళ్లలో ఓల్డ్ సిటీలోనూ ఇళ్ల అద్దెలు విపరీతంగా పెరగాయి. హైటెక్ సిటీతో పోలస్తే ఓల్డ్ సిటీలో తక్కువగా అద్దెలు పెరగాయని పలు సంస్థలు సర్వేల్లో వెల్లడైంది. అద్దెల వివరాలివీ బేగంపేటలో అద్దెను పరిశీలిస్తే ఒక పడకగది ఉన్న ఇల్లు 600 చదరపు అడుగుల నుంచి 900 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటే రూ. 7500 నుంచి రూ. 16,000 వరకు ఉంది. సికింద్రాబాద్లో పరిశీలిస్తే రూ. 7,000 నుంచి రూ. 13,000 వరకు ఉంది. కొండాపూర్లో రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు ఉంది. హైటెక్సిటీలోనూ ఇదే పరిస్థితి. నెలకు రూ. 10,000 నుంచి రూ. 13,500 వరకు అద్దెలు ఉన్నాయి. కొత్తగా ఇల్లు కట్టేవారికి వరం గచ్చిబౌలి, కూకట్పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో కొత్తగా ఇల్లు నిర్మించేవారు సైతం అద్దెలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణం రెండు లేదా మూడు సంవత్సరాల్లో తీర్చేలా ముందు జాగ్రత్తలు తీసు కుంటున్నారు. తమ కుటుంబం కోసం ఒక అం తస్తు, అద్దెల కోసం మరో రెండస్తుల చొప్పున ప్రణాళిక వేసి అందుకు అవసరమయ్యే సొమ్మును బ్యాంకులో రుణంగా పొందుతున్నారు. ఇదిలా ఉంటే అద్దెలు చెల్లించేవారు వచ్చే నెల జీతంలో సగం అద్దెకే చెల్లించాల్సి వస్తోందని, పొదుపు సంగతి ఏనాడో మర్చిపోయామని చిరుద్యోగులు వాపోతున్నారు. -
మరో ‘మెట్రో’
సాక్షి, సిటీబ్యూరో: ఐటీ ఉద్యోగుల రద్దీ అధికంగా ఉండడంతో అమీర్పేట్ – హైటెక్సిటీ మార్గంలో అదనంగా మరో మెట్రో రైలును నడపనున్నట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైటెక్సిటీ, దుర్గం చెరువు మెట్రో స్టేషన్ల నుంచి ఉద్యోగులు కార్యాలయాలకు చేరుకునేందుకు వీలుగా పలు ఐటీ కంపెనీలు షటిల్ బస్సులను నడుపుతుండడంతో రద్దీ పెరిగింది. ప్రధానంగా తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్ ఈస్ట్, ఉప్పల్ తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా ఐటీ ఉద్యోగులు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తుండడంతో అదనపు రైలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి 11గంటల మధ్య ఈ రూట్లో సుమారు 14వేల మంది ఉద్యోగులు ప్రయాణిస్తుండడంతో రైళ్లు కిటకిటలాడుతున్నాయని పేర్కొన్నారు. రద్దీ అధికంగా ఉండడంతో అదనపు రైలు ఏర్పాటు చేశామన్నారు. హైటెక్సిటీ వద్ద మెట్రో రైలు రివర్సల్ సదుపాయం పూర్తయ్యే వరకు అదనపు రైలు రాకపోకలు సాగిస్తుందన్నారు. ప్రస్తుతం రివర్సల్ సదుపాయం లేకపోవడంతో ప్రతి 8 నిమిషాలకో రైలు ఈ మార్గంలో అందుబాటులో ఉందన్నారు. జూలై చివరి నాటికి రివర్సల్ సదుపాయం పూర్తవుందని.. దీంతో రైళ్ల ఫ్రీక్వెన్సీని తగ్గిస్తామని తెలిపారు. ఆగస్టులో రాయదుర్గం (మైండ్స్పేస్ జంక్షన్) వరకు మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయని, ఈ మార్గంలో ఇప్పటికే పనులు పూర్తయ్యాయని చెప్పారు. ప్రస్తుతం నిత్యం ఎల్బీనగర్ – మియాపూర్, నాగోల్ – హైటెక్సిటీ రూట్లో 2.75 లక్షల మంది జర్నీ చేస్తున్నారని తెలిపారు. -
రూట్ క్లోజ్
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ ఆర్టీసీపై మరో పిడుగు పడింది. ఇప్పటి దాకా ప్రజారవాణాలో అగ్రగామిగా వెలుగొందిన సిటీబస్సుపై ‘మెట్రో’ నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి మెట్రో రైళ్ల రాకతో ఆ నష్టాలు మరింత పెరిగాయి. మెట్రో రైలు సేవలు విస్తృతమవుతున్నకొద్దీ వివిధ రూట్ల నుంచి సిటీ బస్సులు వైదొలగాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎల్బీనగర్–మియాపూర్ మెట్రో రైలు రాకతో మొదలైన ప్రతికూల పరిస్థితులు తాజాగా అమీర్పేట్–హైటెక్సిటీ మెట్రో రైలు ప్రారంభంతో తారస్థాయికి చేరుకున్నాయి. నగరంలోని 15 ప్రధాన మార్గాల్లో ప్రతిరోజు హైటెక్సిటీకి రాకపోకలు సాగించే సుమారు 300 బస్సులపై మెట్రో ప్రభావంపడే అవకాశం ఉదని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే వివిధ మార్గాల్లో హైటెక్సిటీకి తిరిగే మరో 28 ఏసీ బస్సులను సైతం ఆ మార్గంలో రద్దు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 2.5 లక్షల మందికి పైగా ప్రయాణికులు ఆర్టీసీ నుంచి మెట్రో వైపు మళ్లనున్నట్లు అంచనా. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై గ్రేటర్ ఆర్టీసీ దృష్టి సారించింది. మరోవైపు ప్రయాణికుల అవసరాలపైనా సర్వే చేపట్టింది. ఆదాయ మార్గాల్లోనే మెట్రో పరుగులు ఆర్టీసీకి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గాల్లోనే మెట్రో రైళ్లు కూతపెడుతున్నాయి. ఎల్బీనగర్ నుంచి దిల్సుఖ్నగర్, కోఠి, అమీర్పేట్, కూకట్పల్లి, మియాపూర్ మీదుగా లింగంపల్లి, పటాన్చెరు, బీహెచ్ఈఎల్కు ప్రతి రోజు వందలకొద్దీ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఈ రూట్లో ఏసీ బస్సులకు క్రమంగా ఆదరణ పెరుగుతున్న సమయంలోనే ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో మెట్రో రైలు ప్రారంభమైంది. దీంతో ఆ మార్గంలో తిరిగే ఏసీ బస్సులను ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వైపు, బీఎన్రెడ్డి నగర్, తదితర మార్గాలవైపు మళ్లించారు. ప్రస్తుతంఎల్బీనగర్ నుంచి హైటెక్సిటీ మీదుగా పటాన్చెరు వరకు 18 ఏసీ బస్సులు నడుస్తున్నాయి.అలాగే ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా వేవ్రాక్ వరకు మరో నాలుగు బస్సులు, ఉప్పల్ నుంచి వేవ్రాక్ వరకు మరో 6 ఏసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ బస్సులన్నింటిలోనూ 60 నుంచి 65 శాతం వరకు ఆక్యుపెన్సీ ఉంది. నగర శివార్లలో స్థిరపడిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇప్పటి వరకు ఏసీ బస్సుల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం నాగోల్ నుంచి హైటెక్సిటీ వరకు నేరుగా మెట్రో రైలు అందుబాటులోకి రావడంతో ఈ రూట్లో తిరిగే 28 ఏసీ బస్సులను ఇప్పటికిప్పుడు ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ బస్సుల్లో కొన్నింటిని హైటెక్సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు, మరికొన్ని బస్సులను నగర శివార్ల వైపు మళ్లించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రయాణికుల అవసరాలపైన సర్వే చేపట్టారు. ప్రయాణికుల ఆదరణ లభించే మార్గాల్లోనే బస్సులను నడుపనున్నట్టు ఆర్టీసీ గ్రేటర్ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. బస్సు బతికేదెట్టా! రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సుమారు రూ.650 కోట్ల మేర నష్టాల్లో ఉండగా, ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోనే రూ.400 కోట్లకు పైగా నష్టాల్లో నడుస్తున్నట్లు లెక్క తేల్చారు. ఆదాయానికి మించిన నిర్వహణ వ్యయం, ఇంధన వ్యయం, ఇతరత్రా ఖర్చులు ఆర్టీసీని తీవ్ర కష్టాల్లోకి నెట్టేశాయి. రోజుకు రూ.3.5 కోట్ల ఆదాయంవస్తే బస్సుల నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం రూ.4.50 కోట్ల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి. దీంతో రోజుకు రూ.కోటి చొప్పున నష్టాలను భరిస్తూ 3,550 బస్సులను తిప్పుతున్నారు. కానీ ప్రయాణికుల ఆదరణ ఉన్న మార్గాల్లోనే మెట్రో రైళ్లు పరుగులు తీయడంతో సిటీ బస్సుకు గడ్డుకాలంగా మారింది. సగానికి పైగా బస్సులను నగర శివార్ల వైపు మళ్లించడం మినహా మరో గత్యంతరం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కో మెట్రో రూట్ ప్రారంభమవుతున్న కొద్దీ ఆ రూట్లో సిటీ బస్సులను క్రమంగా తగ్గించుకోవాల్సి వస్తోంది. సంస్థకు వస్తున్న నష్టాలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఆర్టీసీ దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా సొంత స్థలాలను కమర్షియల్ కాంప్లెక్స్ల కోసం లీజుకిచ్చే చర్యలు చేపట్టి.. పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ఆహ్వానం పలికారు. -
హైటెక్సిటీ మెట్రో షురూ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్వాసుల కలల మెట్రో రైలు అమీర్పేట– హైటెక్ సిటీ (10 కి.మీ) రూట్లో పరుగులు పెట్టింది. బుధవారం ఉదయం 9.30 గంటలకు అమీర్పేట ఇంటర్ఛేంజ్ మెట్రో స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పచ్చజెండా ఊపి రైలును లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మెట్రో రైలులో 15 నిమిషాల పాటు హైటెక్సిటీ వరకు ప్రయాణించారు. హైటెక్సిటీ స్టేషన్, పరిసరాలను, హెచ్ఎంఆర్ చేపట్టిన సుందరీకరణ పనులను పరిశీలించి తిరిగి అమీర్పేట వరకు మెట్రోలోనే ప్రయాణించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఎల్అండ్టీ మెట్రో ఎండీ కెవీబీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ మార్గంలోమెట్రో ప్రారంభం కావడంతో హైదరాబాద్లో 56 కిలోమీటర్ల మేర మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ తర్వాత అంత పొడవైన మెట్రో హైదరాబాద్ సొంతం కావడం విశేషం. ప్రస్తుతం ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ), నాగోల్–హైటెక్సిటీ (27 కి.మీ) మార్గంలో మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. కాగా, నూతనంగా ప్రారంభమైన ఈ మార్గంలో సాయంత్రం 4 గంటల నుంచి సాధారణ ప్రయాణికులకు ప్రయాణానికి అనుమతించారు. అమీర్పేట– హైటెక్సిటీ మార్గం ప్రత్యేకతలివీ.. – ఈ మార్గం కారిడార్–3గా పిలిచే నాగోల్–హైటెక్సిటీ (27 కి.మీ)రూటులో అంతర్భాగం. – ఈ మార్గం మొత్తం 10 కి.మీ కాగా.. అమీర్పేటతో కలిపి 9 స్టేషన్లున్నాయి. – జూబ్లీ చెక్పోస్ట్ వద్ద ఉన్న మెట్రో స్టేషన్ ట్రాఫిక్ రద్దీ రీత్యా ఒకే అంతస్తులో నిర్మించారు. మిగతా స్టేషన్లు రెండు అంతస్తుల్లో ఉన్నాయి. – మధురానగర్ మెట్రో స్టేషన్ను తరుణి మెట్రో స్టేషన్గా తీర్చిదిద్దారు. ఇక్కడ మహిళలు, చిన్నారులకు సంబంధించిన అన్ని రకాల వస్తువులు లభ్యమయ్యేలా 150 స్టాల్స్ ఏర్పాటు చేశారు. – ప్రస్తుతం మెట్రో రైళ్లలో నిత్యం 2 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఈ మార్గం ప్రారంభంతో మరో లక్ష మంది అదనంగా ప్రయాణిస్తారని అంచనా. – జేబీఎస్– ఎంజీబీఎస్ (10 కి.మీ) మార్గం ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని మెట్రో అధికారులు తెలిపారు. – మెట్రో రైలు కనిష్టంగా గంటకు 32 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్– హైటెక్సిటీ వరకు 50 నిమిషాల్లో ఒక చివరి నుంచి మరో చివరకు చేరుకోవచ్చు. అదే బస్సులు లేదా కార్లలో అయితే జర్నీ రెండుగంటలకు పైమాటే. – ప్రస్తుతం అమీర్పేట–హైటెక్సిటీ రూట్లో ప్రతి 12 నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. జూబ్లీహిల్స్– హైటెక్సిటీ వరకు ఒకే ట్రాక్లో మెట్రో వెళ్లాల్సి రావడంతో ఫ్రీక్వెన్సీ ఆలస్యమవుతోంది. రివర్సల్ సదుపాయం ఈ ఏడాది మే నెలలో అందుబాటులోకి వస్తే ఫ్రీక్వెన్సీని తొలుత 6 నిమిషాలకు..ఆ తర్వాత 3 నిమిషాలకు తగ్గించనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. – ఈ మార్గం ప్రారంభంతో హైటెక్సిటీ, యూసుఫ్గూడ, జూబ్లీహిల్స్, శిల్పారామం, హైటెక్స్ తదితర ప్రాంతాల్లోని ఐటీ, బీపీఓ, కెపీఓ రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి. – జేబీఎస్– ఫల్నుమా మార్గం కూడా ప్రారంభమైతే మొత్తం 3 రూట్లలో నిత్యం 15 లక్షల మంది ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తారని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలో కామన్ మొబిలిటీ కార్డు: ఎన్వీఎస్రెడ్డి, హెచ్ఎంఆర్ ఎండీ ఒకే స్మార్ట్కార్డుతో మెట్రోరైళ్లు, ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించేందుకు వీలుగా కామన్ మొబిలిటీ కార్డును ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నాం. మా వైపునుంచి కసరత్తు పూర్తయినా.. ఆర్టీసీ అధికారులు ఈ అంశంపై దృష్టిసారించారు. లండన్లో కామన్మొబిలిటీ కార్డు ప్రవేశపెట్టేందుకు 15 ఏళ్ల సమయం పట్టింది. నగరంలో అంత సమయం పట్టకపోయినా.. త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. హైటెక్సిటీ వద్ద రైలు రివర్సల్ సదుపాయాన్ని మే నెలాఖరునాటికి పూర్తిచేస్తాం. జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో ఈ ఏడాది డిసెంబర్ నాటికి మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తాయి. వచ్చే ఏడాదిలో ఎంజీబీఎస్– ఫలక్నుమా మార్గంలో మెట్రో పరుగులు పెడుతుంది. -
హైటెక్ సిటీ మెట్రో రైలు ప్రారంభోత్సం
-
హై'టెక్'కు మెట్రో రైలు పరుగులు
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ వాసుల కలల మెట్రో రైలు బుధవారం హైటెక్ సిటీకి పరుగులు పెట్టింది. ఉదయం 9.30 గంటలకు అమీర్పేట్ ఇంటర్ఛేంజ్ మెట్రోస్టేషన్లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జెండా ఊపి లాంఛనంగా రైలును ప్రారంభించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి హడావుడి, ప్రచారం, ఆర్బాటం లేకుండా గవర్నర్ మెట్రో రైలును ఆరంభించారు. అనంతరం హైటెక్ సిటీ వరకు గవర్నర్ మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. అయితే ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఈ మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. కాగా మొత్తం 10 కి.మీ. మార్గంలో అమీర్పేట్తో కలిపి 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. హైటెక్సిటీకి మెట్రో పరుగుతో ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో పనిచేస్తున్న లక్షలాదిమంది ఉద్యోగులకు ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి. ప్రారంభంలో ఈ మార్గంలో నిత్యం లక్ష మంది రాకపోకలు సాగిస్తారని, మరికొన్ని రోజుల్లో రద్దీ రెండు లక్షల మార్కును దాటుతుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఆయా మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఇబ్బందులు మెట్రో ప్రయాణికులకు చుక్కలు చూపేలా ఉన్నాయి. ఇంటి నుంచి వ్యక్తిగత వాహనాల్లో ఆయా స్టేషన్లకు చేరుకున్నవారికి ఆయా స్టేషన్ల వద్ద పరిమితంగానే పార్కింగ్ స్థలం అందుబాటులో ఉండడంతో ఇబ్బందులు తప్పవన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి.. ఆటోలు, క్యాబ్లు, బస్సుల్లోనే మెట్రో స్టేషన్లకు చేరుకుంటే పార్కింగ్ చిక్కులు తప్పుతాయని మెట్రో అధికారులు సెలవిస్తుండడం గమనార్హం. త్వరలో ఆయా స్టేషన్ల వద్ద స్మార్ట్ పార్కింగ్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. -
మార్చిలో హైటెక్ సిటీకి మెట్రో
సాక్షి, సిటీబ్యూరో: అమీర్పేట్–హైటెక్ సిటీ (10 కి.మీ)మార్గంలో మార్చి మూడో వారంలో మెట్రో రైళ్లు పరుగులు పెట్టే అవకాశం ఉన్నట్లు మెట్రోరైలు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ మార్గంలో కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కమిషనర్ ఆఫ్ రైల్వేసేఫ్టీ అధికారుల బృందం భద్రత పరీక్షలు నిర్వహిస్తోంది. సుమారు 18 రకాల పరీక్షలు కీలకదశకు చేరుకున్నట్లు మెట్రో వర్గాలు పేర్కొన్నాయి. రైళ్లకు ప్రధానంగా లోడ్, స్పీడ్, ట్రాక్, ట్రాక్షన్, సిగ్నలింగ్ తదితర అంశాలపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. మెట్రో రైళ్ల ఆలస్యం.. ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో బుధవారం విద్యుత్ సంబంధ అంతరాయాల కారణంగా మెట్రో రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఒక చివరి నుంచి మరో చివరకు 52 నిమిషాల్లో చేరుకోవాల్సి ఉండగా..75 నిమిషాలు పట్టినట్లు ప్రయాణికులు వాపోయారు. పలు స్టేషన్లలో నిమిషానికి పైగా రైళ్లను నిలిపారు. రైళ్ల ఆలస్యం సర్వసాధారణమేనని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెట్రో వర్గాలు స్పష్టం చేశాయి. కాగా నిత్యం ఈ రూట్లో సుమారు రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న విషయం విదితమే. -
ఆర్మీలో సీక్రెట్ ఏజెంట్ అని చెప్పి..
గచ్చిబౌలి : తాను ఆర్మీలో సీక్రెట్ ఏజెంట్గా పని చేస్తున్నానని మ్యాట్రిమోనిలో తప్పుడు సమాచారం ఇచ్చి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పెళ్లి చేసుకున్నాడు. నమ్మించి వంచించి రెండుసార్లు అబార్షన్ చేయించాడు. బాధితురాలికి తెలియకుండానే రూ. 60 లక్షలకు టోకరా వేసి ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఘరానా మోసగాడు కటకటాలపాలయ్యాడు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ ఆర్.శ్రీనివాస్ తెలిపిన మేరకు.. మధ్యప్రదేశ్కు చెందిన అఖిలేష్ గుజార్ అలియాస్ తేజస్ అలియాస్ తేజ పటేల్ అలియాస్ తన్మయ్(36) కొండాపూర్లోని శుభం బోటానికల్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఆర్మీలో సీక్రేట్ ఏజెంట్గా పని చేస్తున్నాని భారత్ మ్యాట్రిమోనిలో తప్పుడు వివరాలు, ఆర్మీ డ్రెస్లో ఉన్న ఫొటోలను అఖిలేష్ ఉంచాడు. హైటెక్సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేసే పూజ నిజమేనని నమ్మి 2018 మే నెలలో కూకట్పల్లిలోని ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుంది. తెలియకుండా పూజ పేరిట సిటీ బ్యాంక్లో రూ. 15 లక్షలు రుణం, బజాజ్ పైనాన్స్లో రూ.12 లక్షలు, ఇండియన్ బుల్లో రెండు లక్షలు, అమెక్స్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 4.91 లక్షలు, ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వార రూ.2.71 లక్షలు, ఎస్బీఐ సేవింగ్ అకౌంట్ నుంచి రూ.5.61 హెచ్డీఎఫ్సీ మ్యూచవల్ ఫండ్ ద్వారా రూ.10 లక్షలు, బంగారు ఆభరణాలు తీసుకొని చెప్పాపెట్టకుండా ఉడాయించాడు. అంతకు ముందు రెండు సార్లు పూజ గర్భం దాల్చగా తెలియకుండా ట్యాబ్లెట్లు వేసి ఒకసారి, బలవంతంగా మరో సారి అబార్షన్ చేయించాడు. భర్త కనిపించకుండా పోయేసరికి బాధితురాలు గచ్చిబౌలి పీఎస్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడికి మధ్యప్రదేశ్లో భార్య, ఏడేళ్ల సంవత్సరాల కొడుకు ఉన్నట్లు తేల్చారు. ఇప్పటికే నలుగురిని పెళ్లి చేసుకొని మోసం చేసినట్లు నిర్ధారించారు. మ్యాట్రిమోనియాలో తప్పుడు వివరాలు ఇచ్చి యువతుల వివరాలు, ఫోన్ నెంబర్ తెలుసుకుంటాడు. శారీరక సంబంధాలు పెట్టుకొని, డబ్బులు దండుకొని మోసగిస్తుంటాడు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది యువతులను మోసం చేశారని సీఐ తెలిపారు. నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
‘హైటెక్’కు వాయిదా!
సాక్షి, సిటీబ్యూరో: హైటెక్ సిటీ వరకు మెట్రోరైలు నూతన సంవత్సరంలోనే పరుగులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమీర్పేట్–హైటెక్సిటీ మార్గంలో ఎస్ఆర్డీపీ పనుల కారణంగా రైళ్లు ఒక చివరి నుంచి మరో చివరకి వెళ్లి వెనక్కి వచ్చేందుకు రివర్సల్ ట్రాక్ సదుపాయం లేదు. దీంతో మెట్రో రైలు ఒక గమ్యం నుంచి మరో గమ్యస్థానానికి ఒకే ట్రాక్లో వెళ్లి తిరిగి అక్కడి నుంచి వచ్చేందుకు ట్విన్ సింగిల్ట్రాక్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయిన వెంటనే ఈ రూట్లో మెట్రో రైళ్ల వాణిజ్య రాకపోకలు ప్రారంభిస్తామని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ, మెట్రో రైలు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ మార్గానికి సంబంధించి రైలు వేగం, బ్రేకులు, కమ్యూనికేషన్బేస్డ్ ట్రెయిన్ కంట్రోల్వ్యవస్థ, ట్రాక్, సిగ్నలింగ్, టెలీకమ్యూనికేషన్ తదితర 18 రకాల భద్రతా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అన్ని పరీక్షల్లోనూ మెట్రో రైళ్లు విజయం సాధించినట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. ఈ మార్గంలోని 8 స్టేషన్ల వద్ద కూడా మిగిలిన పనులను వడివడిగా పూర్తిచేస్తామని పేర్కొన్నాయి. ఈ రూట్లో మెట్రో స్టేషన్ల పరిస్థితి ఇదీ.. అమీర్పేట్–హైటెక్సిటీ రూట్లో మొత్తం 8 స్టేషన్లున్నాయి. ఇందులో మధురానగర్ స్టేషన్ వద్ద పనులు పూర్తిచేసి తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఇక యూసుఫ్గూడా స్టేషన్ వద్ద సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్నెం.5 స్టేషన్ వద్ద ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. పెద్దమ్మగుడి స్టేషన్ వద్ద పనులు తుది అంకానికి చేరుకున్నాయి. మాదాపూర్ స్టేషన్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దుర్గం చెరువు స్టేషన్కు మెట్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఇక హైటెక్సిటీ స్టేషన్ పనులతోపాటు సుందరీకరణ పనులు పూర్తిచేయడంతో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. నిత్యం రెండు లక్షలమంది మెట్రో జర్నీ.. ప్రస్తుతం ఎల్బీనగర్–మియాపూర్(29 కి.మీ)మార్గంలో నిత్యం సుమారు 1.50 లక్షల మంది మెట్రో జర్నీ చేస్తున్నారు. ఆదివారం, ఇతర సెలవుదినాల్లో రద్దీ 1.95 లక్షల వరకు ఉంది. ఇక నాగోల్–అమీర్పేట్(17 కి.మీ)మార్గంలో నిత్యం సుమారు 50 వేల మంది ప్రయాణిస్తుండగా..సెలవురోజుల్లో రద్దీ 80 వేల వరకు ఉంటుంది. అమీర్పేట్–హైటెక్సిటీ మార్గంలో మెట్రో రైళ్లు జనవరిలో అందుబాటులోకి వస్తే నిత్యం మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య మూడులక్షల మార్కును దాటే అవకాశాలున్నట్లు మెట్రో రైలు వర్గాలు అంచనావేస్తున్నాయి. జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గం వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభించే అవకాశాలున్నాయన్నారు.ఎంజీబీఎస్–ఫలక్నుమా మార్గంలో జనవరిలో పనులు మొదలుపెట్టి వచ్చే ఏడాది చివరిలోగా మెట్రో మార్గాన్ని పూర్తిచేయాలని భావిస్తున్నట్లు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ వర్గాలు తెలిపాయి. -
అమీర్పేట్–హైటెక్సిటీ రూట్లో ట్రయల్ రన్ షురూ
సాక్షి,సిటీబ్యూరో: నగర ప్రజలకు మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చి నవంబర్ 29 నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా మెట్రో మరో మైలు రాయిని అందుకునేందుకు సిద్ధమైంది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న హైటెక్సిటీ రూట్లో రైళ్లు వచ్చేనెలలో పరుగులు తీయనున్నాయి. ఇందుకోసం గురువారమే అమీర్పేట్–హైటెక్ సిటీ(10 కి.మీ) రూట్లో ట్రయల్ రన్ ప్రారంభమైంది. ఈ ట్రయల్ రన్ను హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఎల్అండ్టీ మెట్రో ఎండీ కె.వి.బి.రెడ్డి కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ మార్గంలో మెట్రో రైళ్లలో ప్రయాణించి రైళ్ల సామర్థ్యం, ఇతర సాంకేతిక అంశాలను నిశితంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం 10 కి.మీ. దూరం ఉండే ఈ మార్గంలో మధురానగర్(తరుణిమెట్రో స్టేషన్), యూసుఫ్గూడ, జూబ్లీహిల్స్ రోడ్నెం.5, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గంచెరువు, హైటెక్సిటీ పేర్లతో మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఈ మార్గంలో మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు అనేక సాంకేతిక సవాళ్లను అధిగమించామని, ఆస్తుల సేకరణ కోసం సుదీర్ఘ న్యాయ పోరాటంచేయాల్సి వచ్చిందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ రూట్లో ట్రైడెంట్ హోటల్ ప్రాంతంలో రైలు రివర్సల్ సదుపాయం ఏర్పాటు చేసేందుకు మరికొన్ని నెలల సమయం పడుతుందన్నారు. అప్పటి దాకా ‘ట్విన్ సింగిల్ లైన్ మెథడ్’ విధానంలో రైళ్లు హైటెక్సిటీ వరకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి వెనక్కి వస్తాయని వివరించారు. మెట్రో రైళ్లకు రెండువైపులా ఇంజిన్లు ఉండడంతో ఇది పెద్ద సమస్య కాబోదన్నారు. నగర మెట్రో రైలు వ్యవస్థలో సంప్రదాయ రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థతో పాటు అధునాతన కమ్యూనికేషన్ బేస్డ్ ట్రెయిన్ కంట్రోల్ వ్యవస్థ అందుబాటులో ఉండడంతో ఈ విధానంలో రైళ్లను నడపడం తేలికేనన్నారు. నగర మెట్రో ప్రాజెక్టు ఇంజినీరింగ్ అద్భుతమని ఎల్అండ్టీ మెట్రో ఎండీ కె.వి.బి.రెడ్డి తెలిపారు. ఈ ట్రైల్ రన్లో చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డీవీఎస్రాజు, ఎస్ఈ విష్ణువర్థన్రెడ్డి, ఎంపీ నాయుడు, బాలకృష్ణ, ఎ.కె.షైనీ తదితరులు పాల్గొన్నారు. ఏడాదిగా 3.20 కోట్ల మంది జర్నీ గతేడాది నవంబరు 28న ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా మెట్రో ప్రారంభమై మరుసటి రోజు నుంచి నగరవాసులకు మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.గురువారానికి మెట్రో అందుబాటులోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. ఈ ఏడాది కాలంలో 3.20 కోట్ల మంది మెట్రోల్లో జర్నీ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి నాగోల్–అమీర్పేట్ (17కి.మీ), ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ) రూట్లో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రెండు మార్గాల్లో సరాసరిన నిత్యం 2 లక్షలమంది ప్రయాణిస్తున్నారు. డిసెంబర్ నెలలో హైటెక్సిటీ మెట్రో మార్గం ప్రారంభమైతే రద్దీ మరో లక్ష వరకు పెరుగుతుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో జేబీఎస్–ఎంజీబీఎస్(10కి.మీ) మార్గంలోనూ మెట్రో ప్రారంభమవుతుందన్నారు. 2019 చివరి నాటికి పాతనగరానికి సైతం మెట్రో రైళ్లు వెళతాయని స్పష్టం చేశారు. మెట్రో రెండోదశకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు. -
డిసెంబర్కు డౌటే!
సాక్షి, సిటీబ్యూరో: అమీర్పేట్–హైటెక్సిటీ మార్గంలో మెట్రో రైలు పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తయ్యే అవకాశాలు దరిదాపుల్లోనూ కనిపించడంలేదు. ఇటీవల ఎల్బీనగర్–అమీర్పేట్ మార్గంలో మెట్రో రైలును లాంఛనంగా ప్రారంభించిన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్..డిసెంబర్ నాటికి హైటెక్ సిటీ కారిడార్ను పూర్తిచేసి మెట్రో రైళ్లనుసిటీజన్లకు అందుబాటులోకి తీసుకురావాలని హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ అధికారులకు సూచించారు. అయితే ఈ మార్గంలో మెట్రో పనుల పూ ర్తికి పలు బాలారిష్టాలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా రివర్సల్ ట్రాక్ ఏర్పాటు పనులు ఆలస్యమౌతుండడమే దీనికి కారణమని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితితో ఈ రూట్లో మెట్రో రాకకోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమంది ఐటీ, బీపీఓ, కెపిఓ రంగాల ఉద్యోగులకు మరో ఆరునెలలపాటు నిరీక్షించక తప్పని పరిస్థితి నెలకొంది. రివర్సల్ట్రాక్ పనులే కీలకం... నాగోల్–హైటెక్సిటీ(28 కి.మీ)మెట్రో మార్గాన్ని ప్రభుత్వం 1.5 కి.మీ మేర పెంచి రాయదుర్గం వరకు పొడిగించిన విషయం విదితమే. రాయదుర్గం ప్రాంతంలో 15 ఎకరాల సువిశాల స్థలంలో టెర్మినల్ స్టేషన్తోపాటు మెట్రోమాల్స్, ప్రజోపయోగ స్థలాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అయితే మెట్రో మార్గాన్ని ఉన్నఫలంగా పొడిగించడం..హైటెక్సిటీ–రాయదుర్గం రూట్లో పనులు సకాలంలో మొదలుకాకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. మరోవైపు హైటెక్సిటీ నుంచి శిల్పారామం వరకు అరకిలోమీటరు మేర మెట్రో పిల్లర్లను పొడిగించి అక్కడివరకు మెట్రోట్రాక్ ఏర్పాటుచేసి అక్కడి నుంచి రివర్సల్ట్రాక్(మెట్రో రైళ్లు మలుపుతిరిగే ట్రాక్)ఏర్పాటుచేయాలని తొలుత నిర్ణయించారు. అయితే ఈ మార్గంలో ఎస్ఆర్డీపీ పనుల కారణంగా మెట్రో పిల్లర్లు ఏర్పాటుచేయడం కష్టసాధ్యమని నిపుణులు స్పష్టంచేయడంతో రివర్సల్ట్రాక్ ఏ ర్పాటు పనులు మరింత ఆలస్యమయ్యాయి. దీం తో ఈ రూట్లో మెట్రో మరింత ఆలస్యమౌతోంది. రివర్సల్ ట్రాక్కు ప్రత్యామ్నాయమిదే.. హైటెక్సిటీకి సకాలంలో మెట్రోను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హెచ్ఎంఆర్,ఎల్అండ్టీ అధికారులు ఆగమేఘాల మీద పనులు ప్రారంభించారు. రివర్సల్ ట్రాక్ ఏర్పాటు చేస్తేనే అమీర్పేట్–హైటెక్సిటీ(10 కి.మీ)మార్గంలో ప్రతి ఐదు నిమిషాలకోరైలును నడిపే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా హైటెక్సిటీ నుంచి 500 మీటర్ల దూరంలోని లెమన్ట్రీ హోటల్ వరకు 7 మెట్రో పిల్లర్లను ఏర్పాటుచేసి మెట్రో ట్రాక్ను పొడిగించనున్నారు. అక్కడి నుంచి రివర్సల్ ట్రాక్ను ఏర్పాటుచేసి మెట్రో రాకపోకలకు మార్గం సుగమం చేయనున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పనులు ప్రారంభమైనప్పటికీ వీటిని పూర్తిచేసేందుకు వచ్చే ఏడాది మార్చి వరకు సమయం పట్టనున్నట్లు స్పష్టంచేశారు. ఎల్బీనగర్–మియాపూర్ మెట్రో ఫుల్..జోష్ ఎల్బీనగర్–మియాపూర్(29 కి.మీ)మార్గం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో ఈ రూట్లో మెట్రోలో రద్దీ క్రమంగా పెరుగుతూనే ఉంది. సాధారణ రోజుల్లో రద్దీ 1.30 లక్షలు కాగా..సెలవురోజుల్లో రద్దీ 1.50 లక్షలనుంచి 1.60 లక్షలవరకు ఉందని మెట్రో అధికారులు చెబుతున్నారు. ఇక నాగోల్–అమీర్పేట్ మార్గంలో నిత్యం 50–60 వేల మంది రాకపోకలు సాగిస్తుండగా..సెలవురోజుల్లో రద్దీ 80–90 వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఎల్బీనగర్–మియాపూర్ మార్గంలో త్వరలో రద్దీ రెండు లక్షల మార్కు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
శరవేగంగా హైటెక్ సిటీ మెట్రో కారిడార్
సాక్షి,సిటీబ్యూరో: హైటెక్సిటీ వరకు మెట్రో కారిడార్ ఏర్పాటు పనుల్లో వేగం పెంచాలని హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్డైరెక్టర్ ఎన్వీఎస్రెడ్డి మెట్రో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ అధికారులను ఆదేశించారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచనల మేరకు ఈ ఏడాది డిసెంబర్లోగా పనులను పూర్తి చేయాలన్నారు. ఆదివారం సైబర్టవర్స్ నుంచి రహేజా మైండ్స్పేస్ జంక్షన్ వరకు జరుగుతున్న మెట్రో పనులు,హైటెక్సిటీ స్టేషన్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ ప్రాంతాల్లో చేపట్టిన సుందరీకరణ పనులను ఆయన పరిశీలించారు. పనులు వేగవంతంపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ⇔ సైబర్టవర్స్,శిల్పారామం ఫ్లైఓవర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న మెట్రో పిల్లర్లను ప్రధాన రహదారి మధ్యలో కాకుండా పక్కన ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతంలో పిల్లర్ల ఏర్పాటు పనులను ఇంజినీరింగ్ సవాళ్లను అధిగమించాలి. ⇔ హైటెక్సిటీ–ట్రైడెంట్ హోటల్ మార్గంలో 22 మెట్రో పిల్లర్లు, వయాడక్ట్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలి. ఈ పనుల పూర్తితో మెట్రో రైలు రివర్సల్ సదుపాయం ఏర్పాటు కానుంది. ఈ పనుల పూర్తికి ప్రధాన రహదారిని మూసివేసి ట్రాఫిక్ డైవర్షన్ చేసేందుకు సహకరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్కు సూచించారు. తాత్కాలికంగా సైబర్టవర్ జంక్షన్ నుంచి సైబర్ టవర్ గేట్వే జంక్షన్ మార్గంలో ప్రధాన రహదారిని మూసివేయడం లేదా పాక్షికంగా తెరిచే ఏర్పాటు చేయాలి. సైబర్టవర్స్ ఫ్లైఓవర్ను సైబర్గేట్వే వరకు వన్వే ఫ్లైఓవర్గా చేయాలి. ఈ మార్గంలో ట్రాఫిక్ను డెలాయిట్ ఎక్స్రోడ్–ఒరాకిల్ జంక్షన్–గూగుల్ఎక్స్రోడ్–హైటెక్స్–శిల్పారామం–హైటెక్సిటీ జంక్షన్ మీదుగా మళ్లించాలి. ⇔ ట్రాఫిక్ దారి మళ్లించేందుకు ప్రత్యామ్నాయ రహదారులను యుద్ధప్రాతిపదికన హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ అధికారులు అభివృద్ధి చేయాలి. ⇔ సైబర్టవర్స్ వద్ద 2 పోర్టల్ పిల్లర్ల నిర్మాణ పనులను తక్షణం పూర్తిచేయాలి. ⇔ ఈ పిల్లర్ల నిర్మాణ సమయంలో ట్రాఫిక్నుదారిమళ్లించాలి. ⇔ పోర్టల్ పిల్లర్ల నిర్మాణం తరువాత సాధారణ మెట్రో పిల్లర్లను ఏర్పాటు చేసేందుకు ట్రైడెంట్ హోటల్ వద్ద ప్రధాన రహదారిని విస్తరించాలి. ⇔ మెట్రో పిల్లర్ల ఏర్పాటు అనంతరం దెబ్బతిన్న రహదారిని తక్షణం పునరుద్ధరించాలి. ట్రాఫిక్, ఎల్అండ్టీ అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ⇔ మెట్రో పిల్లర్లకు ఫౌండేషన్లు ఏర్పాటైన చోట ఎల్అండ్టీ సిబ్బంది బార్కేడ్లను తొలగించి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూడాలి. ⇔ హైటెక్సిటీ స్టేషన్ నుంచి ట్రైడెంట్ హోటల్ వరకు 650 మీటర్ల మేర ఏర్పాటుచేయనున్న రివర్సల్ ట్రాక్ ఏర్పాటుకు స్ట్రక్చరల్,ట్రాక్, సిగ్నలింగ్, ఎలక్ట్రికల్ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. సుందరీకరణ పనుల పరిశీలన.. ⇔ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, పెద్దమ్మదేవాలయం, మాదాపూర్, దుర్గంచెరువు, హైటెక్సిటీ వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ పనులను ఎల్అండ్టీ అధికారులు తక్షణం పూర్తిచేయాలి. ⇔ దుర్గం చెరువు స్టేషన్ వద్ద ఇప్పటికే మెట్రో పనుల కోసం సేకరించిన ఆస్తులను టౌన్ప్లానింగ్ విభాగం అడ్డు తొలగించాలి. ⇔ అమీర్పేట్–హైటెక్సిటీ మార్గంలోని ఐదు మెట్రో స్టేషన్ల వద్ద మిగిలిన పనులను, సుందరీకరణ పనులను తక్షణం పూర్తిచేయాలి. -
హైటెక్ సిటీలో 7వ కేబుల్ ఎక్స్పో విజన్
-
హైటెక్ సిటీలో వంద గుడిసెలు దగ్ధం
హైదరాబాద్: హైటెక్ సిటీలో వంద గుడిసెలు కాలి బూడిదయ్యాయి. పొయ్యిలో పడ్డ ప్లాస్టిక్ కవర్తో చెలరేగిన మంటలు వలస కూలీలకు బూడిదను మిగిల్చాయి. గుడిసెలతోపాటు వాటిలో నిల్వ చేసుకున్న నిత్యావసరాలు, బట్టలు కాలిపోవడంతో వలస కూలీలు నిరాశ్రయులయ్యారు. మాదాపూర్లోని పత్రికానగర్లో గురువారం ఉదయం 9.30 సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒడిశాకు చెం దిన వలస కూలీల బృందం ఓ గుడిసెలో వంట చేస్తుండగా ప్లాస్టిక్ కవర్ అంటుకోవడంతో మంటలు చేలరేగాయి. మాదాపూర్ ఫైర్స్టేషన్ అధికారి పర్యవేక్షణలో సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆస్తినష్టం దాదాపు రూ.75 లక్షలు ఉంటుందని, వందకు పైగా గుడిసెలు కాలిపోయాయని తెలిపారు. ఉలిక్కిపడ్డ పత్రికానగర్ ఐటీ కారిడార్ నడిబొడ్డులో, పెద్ద పెద్ద కంపెనీలు, భవనాల మధ్యలో మంటలు భారీస్థాయిలో చెలరేగడంతో స్థానికులు, అపార్ట్మెంట్ వాసులు ఉలిక్కిపడ్డారు. గాలి వాటానికి మం టలు తమవైపు వస్తాయోనని కార్యాలయాలు, అపార్ట్మెంట్ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుం దోనని ఆలోచించేలోపే 100 గుడిసెలకు పైగా కాలి బూడిద కావడంతో ఆ ప్రాంతం పొగమయంగా మారిపోయింది. నిరాశ్రయులైన 300 మంది కూలీలు ఒడిశా, వరంగల్, నల్లగొండ తదితర ప్రాంతాలకు చెందిన వలస కూలీలు ఆరేళ్ల నుంచి గుడిసెలను ఏర్పాటు చేసుకొని మాదాపూర్ పరిసరాల్లో రోజు కూలి పనులు చేసుకొని జీవ నం సాగిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంతో వారు దాచుకున్న నగదు, చిన్న చిన్న బంగారు, వెండి ఆభరణాలు కాలి బూడిదయ్యాయి. ఉదయమే అందరూ కూలీ పనులకు వెళ్లడంతో ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. ఒక్కసారిగా గుడిసెలు తగలబడిపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. పునరావాసం కల్పించాలని బాధితులు అధికారులను వేడుకుంటున్నారు. -
సెలబ్రిటీ గోల్ఫ్ ప్లే ఆఫ్
-
హైటెక్స్లో సందడిగా సండే ప్లీ
-
రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో 5k రన్
-
కావాలనే ఆలస్యం !
► అదనపు నిధులకోసమే ‘మెట్రో’ లేట్! ► మాల్స్ నిర్మాణం, రిటైల్ ఆదాయం ► ఆశించిన స్థాయిలో రాకపోవడంతో నిరాశ ► రైట్ఆఫ్వే సమస్యలు లేవంటున్న అధికార వర్గాలు సాక్షి,సిటీబ్యూరో: నగర మెట్రో ప్రాజెక్టు ప్రారంభోత్సవం తరచూ వాయిదా పడడానికి నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ధోరణే ప్రధాన కారణమని..ప్రభుత్వం నుంచి అధిక నిధులు, రాయితీలు రాబట్టేందుకే ప్రారంభోత్సవంపై నిర్మాణ సంస్థ మీనమేషాలు లెక్కిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నాగోలు-మెట్టుగూడ(8కిమీ), మియాపూర్-ఎస్.ఆర్.నగర్(11కిమీ) మార్గాల్లో ఈ ఏడాది జూన్లో ప్రారంభోత్సవానికి సాంకేతికంగా అన్ని పనులు పూర్తయినప్పటికీ.. ప్రారంభోత్సవాన్ని నిర్మాణ సంస్థ ఆలస్యం చేయడం వెనక పలు కారణాలున్నట్లు భావిస్తున్నారు. ఆలస్యానికయ్యే వ్యయం సుమారు రూ.3 వేల కోట్లు సర్కారు తమకు చెల్లించాలని, ఇతర వాణిజ్య రాయితీలనూ నిర్మాణ సంస్థ కోరుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రారంభోత్సవాన్ని ఆలస్యం చేస్తే సర్కారు దిగొస్తుందని నిర్మాణ సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. అయితే నిర్మాణ సంస్థ తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను దశలవారీగా పరిష్కరించామని, ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదనపు నిధులు చెల్లించే విషయంలో మాత్రం ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. కాగా ఈ రెండు మార్గాల్లో మినీ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సైతం ముందుకొచ్చిందని, ప్రయాణికులు తమ వాహనాలను నిలుపుకునేందుకు పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉన్నాయని, ప్రారంభం ఎప్పుడు చేసినా ప్రయాణీకులకు ఇబ్బందులు ఉండవని తెలి పాయి. ఇప్పటికిప్పుడు ఈ రెండు రూట్లలో మెట్రో రైళ్ల వాణిజ్య కార్యకలాపాలు (కమర్షియల్ ఆపరేషన్స్) ప్రారంభించినా తొలి నాలుగేళ్లు నిర్మాణ సం స్థకు నిర్వహణ పరమైన నష్టాలు తప్పవని ముందుగానే అంచనా వేసిన నేపథ్యంలో తాజాగా ఆలస్యం చేయడం అర్థరహితమని ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేయడం గమనార్హం. నష్టాల బూచి చూపి...! అదనపు నిధులతోపాటు..అన్ని స్టేషన్లలో రిటైల్ అవుట్లెట్లు (స్టేషన్లలో దుకాణాలు)ఏర్పాటుకాకపోవడం, పంజాగుట్ట, హైటెక్సిటీ, ఎర్రమంజిల్, మూసారాంభాగ్ ప్రాంతాల్లో మెట్రో మాల్స్ నిర్మాణం పూర్తికాకపోవడం, వాణిజ్య ప్రకటనల ఏర్పాటు, స్టేషన్లలో రిటైల్ దుకాణాల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో.. ఇప్పటికిప్పుడు మెట్రో రాకపోకలు ప్రారంభిస్తే వాణిజ్యపరంగా తమకు గిట్టుబాటు కాదన్న ఉద్దేశంతోనే నిర్మాణ సంస్థ ప్రారంభోత్సవానికి వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. రెండు మార్గాల్లోని 15 స్టేషన్లలో వాణిజ్య స్థలాలను పూర్తిస్థాయిలో అద్దెకివ్వలేదని తెలిసింది. మరోవైపు మాల్స్ నిర్మాణం పూర్తికాకపోవడం, వాణిజ్య ప్రకటనల రూపేణా ఆశించిన స్థాయి లో ఆదాయం సమకూరకపోవడంతో ప్రారంభాన్ని మరికొంత ఆలస్యం చేస్తే బాగుంటుందన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఎల్అండ్టీ వర్గా లు మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నాయి. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ధ్రువీకరణ ఆలస్యమవడంతోపాటు,నాంపల్లి, బేగంపేట్, సికింద్రాబాద్ ఇస్కాన్, ఖైరతాబాద్, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారి మధ్యలో పనులు చేపట్టేం దుకు అవసరమైన రైట్ఆఫ్వే అందుబాటులో లేకపోవడం, పలు స్టేషన్లకు చేరుకునే మార్గాలను రీడిజైన్లు చేయమని ప్రభుత్వం ఆదేశాలివ్వడమేఆలస్యానికి ప్రధాన కారణమని చెబుతోంది. అయితే రైట్ఆఫ్వే విషయంలో ఎల్అండ్టీ కోరుతున్న అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరించినట్లు ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేయడం గమనార్హం. మూడు చోట్ల మినహా ఎక్కడా సమస్యలు లేవని తెలిపాయి. పాతనగరం అలైన్మెంట్పైనా అదేతీరు.. జేబీఎస్-ఫలక్నుమా 5.3 కి.మీ మార్గంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం గతంలో ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు సమావేశం నిర్వహించకపోవడం గమనార్హం. అలైన్మెంట్పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వని నేపథ్యంలో ఈ మార్గంలో పనులు మొదలుకాలేదు. అదనపు నిధులు రాబట్టేందుకేనా..? మెట్రోను జూలై 2017 నాటికి పూర్తిచేయాల్సి ఉంది. కానీ గడువును 2018 డిసెంబరు నాటికి పొడిగించిన విషయం విదితమే. దీంతో మెట్రో ప్రాజెక్టు అంచనా వ్యయం తొలుత అనుకున్న రూ.14 వేల కోట్ల నుంచి రూ.17 వేల కోట్ల వరకు పెరగనున్నట్లు నిర్మాణ సంస్థ అంచనా వేస్తోంది. అయితే పెరిగిన అంచనా వ్యయాన్ని ప్రభుత్వమే తమకు చెల్లించాలని కోరుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే మెట్రో ప్రాజెక్టు పనులకు తమ సంస్థ రూ.3 వేల కోట్లు ఖర్చు చేసిందని, రైట్ఆఫ్వే లభించకపోవడం, పాతనగరం అలైన్మెంట్ ఖరారు కాకపోవడంతోనే గడువు పెరిగి తమపై ఆర్థిక భారం పడుతోందని ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. దీంతో నిర్మాణ సంస్థ ప్రారంభోత్సవంపై డైలమాలో పడినట్లు సమాచారం. -
We want బెటర్ సిటీ
♦ అవినీతి అంతం..అభివృద్ధి మంత్రం.. అదే అందరి నినాదం ♦ పొలిటీషియన్లు మారాల్సిందే.. గళమెత్తిన యువత ఓపెన్ డిబేట్ మన హైటెక్ సిటీ విశ్వనగరం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. అభివృద్ధి రాకెట్ స్పీడ్లో వెళ్తుందని.. ఆధునిక సాంకేతికత, అద్భుత నైపుణ్యతతో కలల నగరంగా మారబోతోందని పాలకులు చెబుతున్నారు. మరి ప్రజలేమంటున్నారు..!! జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ భాగ్యనగరంపై సిటీ యువత అభిప్రాయాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ ఓపెన్ డిబేట్ నిర్వహించింది. నారాయణగూడలోని రెడ్డి మహిళా కళాశాలలో జరిగిన చర్చాగోష్టిలో యువత గళం విప్పారు. వ్యవస్థలో వేళ్లూనికొనిపోయిన అవినీతిని అంతం చేయనిదే అభివృద్ధిని సాధ్యం కాదన్నారు. పాలకుల్లో మార్పు వస్తేనే ‘డ్రీమ్ సిటీ’ సాధ్యమవుతుందన్నారు. - కాచిగూడ పారిశుధ్యానికి పెద్దపీట మన నగరం క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఉండాలి. చెట్లను నరకొద్దు. మొక్కలు విరివిగా పెంచాలి. రోజురోజుకు వాతావరణ కాలుష్యం పెరిగిపోయి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. వైద్య సౌకర్యాలను పెంపొందించాలి. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్ అంటూ చీపురు పట్టుకుని నాయకులు, అధికారులు ఫొటోలకు ఫోజులిచ్చే బదులు ఆచరణలోకి దిగాలి. - పి.వైష్ణవి, అంబర్పేట మహిళలకు రక్షణ ముఖ్యం సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రభుత్వాలు మారుతున్నా, ఎన్ని చట్టాలు తెస్తున్నా మహిళలపై వేధింపులు తగ్గడం లేదు. సమాజంలో ముఖ్యంగా పురుషుల్లో మార్పు రానంతకాలం ఎన్ని చట్టాలు చేసినా ఉపయోగం ఉండదు. చట్టాలను సమర్థవంతంగా అమలు చేస్తే మహిళలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. - ఆర్.రచన, వారసిగూడ అవినీతి రహిత నగరం... ప్రభుత్వ కార్యాలయాల్లో విచ్చల విడిగా అవినీతి పెరిగిపోయింది. ఎక్కడ చూసినా డబ్బులు లేనిదే పనులు జరగడం లేదు. ప్రతి పనికి ఇంత రేటు నిర్ణయించుకుని, ఆ డబ్బు ముట్టజెప్పితే కానీ పనులు చేయడం లేదు. అవినీతి రహిత సమాజ నిర్మాణమే అసలైన డ్రీమ్సిటీ. ప్రతిరోజూ అనేక చోట్ల అవినీతి చేపలు పట్టుబడుతున్నా వారిలో మార్పు మాత్రం రావడం లేదు. ఇలాంటి అవినీతి పరులు ఉన్నంత కాలం నగరం ఎంత అభివృద్ధి చెందినా పేదప్రజలకు న్యాయం జరగదు. - పి.ప్రసన్న, ఓల్డ్సిటీ మహిళా స్పెషల్ బస్సులు కావాలి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటేనే మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. కొందరు పోకిరీల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత్యంతరం లేక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. మహిళలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపితే కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలి. - వి.స్వాతి, ఉప్పుగూడ ఉన్నత విద్యావకాశాలు కల్పించాలి నగర ప్రజలు ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉన్నత విద్యాసంస్థలను స్థాపించాలి. సమాజంలో మారుతున్న పరిస్థితులకనుగుణంగా విద్యావిధానంలో మార్పులు తేవాలి. చదువుకున్న.. ప్రతిభ కలిగిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పిస్తుందన్న నమ్మకం ప్రభుత్వం కల్పించాలి. - ఎ.స్వర్ణలత, బర్కత్పుర కోడ్ కూసినా..! నాయకులు తమ గొప్పలు చెప్పుకుంటూ ప్రచారం చేస్తుంటారు. ఇందుకు కూడళ్లలోను.. రోడ్డు వెంట బ్యానర్లు కడుతుంటారు. ఎన్నికల కోడ్ కూసిందంటే వీటన్నింటినీ తొలగించాలి. గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో ఉన్న ఫ్లెక్సీలను బల్దియా అధికారులు తొలగించారు. అయితే, కోడ్ అమల్లోకి వచ్చినా అధికారులు తిరిగిన ప్రాంతాల్లో ఒకటైన వెంగళరావునగర్ డివిజన్లో ఇంకా ప్రచార బ్యానర్లు, ఫ్లెక్సీలు అలాగే ఉన్నాయి. - వెంగళరావునగర్ ‘కోడ్’ కొరడా.. పావలా పనిచేస్తే పదిరూపాయల ప్రచారం చేసుకుంటారు నేతలు. పాలకుల చూపు తమ మీద పడాలని తాపత్రయ పడే వీరాభిమానులు పార్టీ జెండాలు, పోస్టర్లను భుజాన మోస్తుంటారు. జెండా కిందపడితే అవమానం జరిగిందని వీరంగం వేస్తారు. మరి ఎన్నికల కోడ్ కూసిందంటే ఎంతటి పెద్ద నేత పోస్టర్ అయినా చెత్త బండి ఎక్కాల్సిందే. శనివారం సికింద్రాబాద్లోని పీజీరోడ్లో వెలిసిన కటౌట్లను తొలగించి చెత్త రిక్షాలో ఇలా తరలించారు. - రాంగోపాల్పేట్ ఫ్లాష్ బ్యాక్ 1934 ఇరుకు సందుల్లో దుకాణాలు.. కాలు కదపలేని విధంగా ఫుట్పాత్ను సైతం ఆక్రమించేసిన వ్యాపారులు.. గృహోపకరణాల నుంచి చెవి రింగుల వరకు తక్కువ ధరకు లభించే మార్కెట్ నగరంలో ఏదన్నా ఉందంటే అది అబిడ్స్ ప్రాంతమే. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఒకప్పుడు ఎంతో విశాలంగా ప్రశాంతంగా ఉండేదనడానికి నిదర్శనం ఈ చిత్రం. ఈ చిత్రంలో కనిపిస్తున్నది 1934లో తీసిన అబిడ్స్ సర్కిల్ ప్రాంతం. అప్పటికి ఇప్పటికి అసలు పోలికే లేనట్టు మారిపోయింది. -
హైదరా‘బ్యాడ్’
భాగ్యనగరంలో వర్షం వస్తోందంటే భయం! చినుకుపడితే చిత్తడి బడుగుజీవి బాధలు వర్ణనాతీతం. పట్టించుకునే నాథుడే ఉండడు. ఎక్కడ మ్యాన్హోల్ తెరిచి ఉందో? ఏ రకంగా కాటువేస్త్తుందో తెలియని పరిస్థితి! ఇక లోతట్టు ప్రాంతాలు జలమయమై, ఇళ్లలోకి నీరు రావడం మామూలే! పేరుకు హైటెక్ సిటీ.. వర్షం పడితే పిటీ! దీనికి తోడు కిలో మీటర్ల వరకు ట్రాఫిక్ జామ్. ఇది గత 15 ఏళ్ల నుంచి జరుగుతున్నా ఇంతవరకూ శాశ్వత ప్రాతిపదికన ఒక్క ప్రణాళికా రూపొందించలేని దౌర్భాగ్యంలో ఉన్నామంటే సిగ్గుపడాలి. అక్రమ నిర్మాణాలు, మ్యాన్ హోల్లో పూడిక తీయకపోవడం, నాలాల పక్కనే ఆక్రమణలు.. ఇలా చెప్పుకుంటూపోతే ఇన్నీఅన్నీ కావు. మన భాగ్యనగరంలో అధికారి కంగా 1,475 మురికివాడలున్నాయి. అనధికారంగా 2,000 వరకూ ఉం టాయని అంచనా. ఈ మురికివాడల్లో డ్రైనేజీ వ్యవస్థ బాగుపడేది ఎప్పుడు? ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రం అధికారులు హడావుడి చేయడం షరా మామూలే. పైగా ఒక ప్రజాప్రతినిధి, నగర పాలక సంస్థకు ఫిర్యాదు చేస్తే కనీసం స్పందన కూడా లేకపోవడం శోచ నీయం. క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ మాటలు బోర్డ్డులకే పరిమితం! ఆచరణలో మాత్రం శూన్యం. అధికారులు దీన్ని గుర్తించి నగరంలో నాలాలు, లోత ట్టు ప్రాంతాలపై దృష్టి సారించి సామాన్యుల గోడు పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. - శొంఠి విశ్వనాథం చిక్కడపల్లి, హైదరాబాద్ 20 -
బుక్ & క్లిక్
ఓల్డ్ ఈజ్ గోల్డ్. అదేమిటో తెలియాలంటే నాటి వాసనలు నేటికీ పోని పాతబస్తీకి వెళ్లాలి. చరిత్ర చెప్పే చార్మినార్ చూడాలి. కొండంత రాచఠీవీ ఒలకబోసే గోల్కొండ చూడాలి. చౌమహల్లా ప్యాలెస్సూ, నిజాం నగల తేజస్సూ దర్శించాలి. ఈ సిటీ.. కొత్త ఒక వింత. ఇదేమిటో తెలియాలంటే సింగపూర్కి సీక్వెల్ లాంటి మాదాపూర్కి వెళ్లాలి. హైటెక్ సిటీ దిశగా హైజంప్ చేయాలి. ఐమ్యాక్స్ తెరకు కళ్లప్పగించాలి. ఫిలింనగర్ స్టార్లూ.. ఫైవ్స్టార్ బార్లూ.. సాలార్జంగ్ మ్యూజియమ్మూ.. పబ్బుల్లో దమ్మారో దమ్మూ.. ఒకటికి ఒకటి పొసగని జీవనశైలుల వైరుధ్యానికి, సజీవ సంప్రదాయాల సమన్వయానికి ఉదాహరణ ఈ నగరం. కలల నగరం.. కలానికి వరం.. ఇదొక విచిత్రాల ఊరు. తెల్సుకుంటున్న కొద్దీ తెరుచుకునే విశేషాల హోరు. ప్రయాస లేకుండానే ప్రాణం పోసుకునే ప్రాస కవితలా.. అలా అలా తిరుగుతుంటే చాలు సిటీపై ఇష్టం కూడా అనాయాసంగా పుట్టుకొస్తుంది. సిటీలో తిరుగుతున్నకొద్దీ పెరుగుతూనే ఉంటుంది. ప్రేయసి మీద పెరిగే ప్రేమ అయితే వర్ణిస్తూ ప్రేమలేఖ రాస్తామేమో..! ప్రేమ పునాదిగా పురుడు పోసుకున్న ఈ లవ్లీ సిటీ మీద ఇష్టం పెరుగుతున్న కొద్దీ సిటీ స్పెషల్గా ఏదైనా రాయలనిపిస్తోందేమో..! అందుకే ఈ నగరం మీద వచ్చినన్ని పుస్తకాలు బహుశా మరే నగరం గురించీ ఇప్పటిదాకా వచ్చి ఉండకపోవచ్చు. ఇంకా పుంఖానుపుంఖాలుగా వస్తూనే ఉండవచ్చు. ఎన్నెన్నో పుస్తకాలు.. ఫొటోలు.. ‘ఎంత చెప్పినా, ఎంత చూపినా ఇంకా కొంత మిగిలే ఉండే వండర్ మన భాగ్యనగరం’ అంటారు నగరంలో ఫొటోగ్రాఫర్గా ప్రసిద్ధుడైన రవీందర్రెడ్డి. రచయిత నూపుర్కుమార్తో కలిసి ఆయన భాగ్య నగరంలోని వింతలు విశేషాలతో పోట్రెయిట్ ఆఫ్ ఎ సిటీ పేరుతో పుస్తకం రూపొందించారు. నరేంద్రలూధర్ ఆవిష్కరించిన ‘రాజా దీనదయాళ్’, ‘రాక్ స్పేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’, సయ్యద్ ఇమామ్ రచించిన ‘ది అన్టోల్డ్ చార్మినార్’, వనజ బెనజిర్ అందించిన ‘హైదరాబాద్ హజిర్ హై’, మధు వట్టి రచన ‘ఎ గైడ్ టు హెరిటేజ్ ఆఫ్ హైదరాబాద్’, మల్లాది కృష్ణానంద్ రాసిన ‘హెరిటేజ్ హైదరాబాద్’, ఇంకా... ‘హైదరాబాద్ ఎ విజువల్ వాయేజ్ ఆఫ్ డిస్కవరీ’, ‘ది స్ల్పెండర్స్ ఆఫ్ హైదరాబాద్’, ‘హైదరాబాద్ 400 ఇయర్స్’.. ఇలాంటివెన్నో ఉన్నాయి. నగరం గురించి తెలుసుకోవాలనుకునేవారికి ఈ పుస్తకాలను తిరగేయడం ఓ మంచి అవకాశం. మరోవైపు ఎంత రాసినా ఇంకా తర‘గని’ విశేషాల గని లాంటి ఈ ఊరు రచయితల కలాలకూ, హైదరాబాద్ ఫొటోగ్రాఫర్ల కెమెరాలకూ పనిపెట్టడంలో పూర్తి స్థాయిలో విజయం సాధించింది. దీంతో సిటీపై బుక్స్ మాత్రమే కాదు డాక్యుమెంటరీలు, షార్ట్ఫిలింస్ వెల్లువెత్తుతున్నాయి. ‘సినిమాలకైనా, డాక్యుమెంటరీస్కైనా.. సిటీని మించిన ముడిసరుకు ఎక్కడా దొరకదు’ అని చెప్పారు సిటీ బేస్డ్ టూరిస్ట్ ప్లేసెస్పై ఇటీవలే ఒక విజయవంతమైన డాక్యుమెంటరీని రూపొందించిన సిటీ యువకుడు రాజ్కిషోర్. ..:: ఎస్.సత్యబాబు -
జీవితమే సపొలం
చుట్టూ భవనాలు.. వీటి మధ్యకు కాడెడ్లు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారా..! ఈ వ్యవసాయ క్షేత్రం హైటెక్సిటీకి కూతవేటు దూరంలో ఉంది. ఓ పదేళ్లు ఫ్లాష్బ్యాక్లోకి వెళ్తే ఇక్కడన్నీ వ్యవసాయ భూములే. అభివృద్ధి పథంలో ముందుగా ఇక్కడికి హైటెక్ సిటీ వచ్చింది.. దాని వెంట దేశవిదేశాలకు చెందిన ఎన్నో ఐటీ కంపెనీలు బారులు తీరాయి.. అంతే.. అక్కడి భూముల ధరలు ఆకాశాన్నంటాయి. రియల్ బూమ్ రెక్కలు తొడిగి.. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. వాలిపోయింది. కాసుల గలగల ముందు ధాన్యరాసుల కళ చిన్నబోయింది. వందలాది ఎకరాల వ్యవసాయ భూమి రియల్ సెక్టర్గా మారిపోయింది. ఇదే జోరులో ఎందరో కట్టల గుట్టలు ఆఫర్ చేసినా.. ఓ పెద్దాయన మాత్రం తన భూమిని అమ్మేదిలేదని భీష్మించుకున్నాడు. చుట్టూ ఐటీ ప్రపంచం సోకులు పోతున్నా.. నేటికీ పల్లెటూరి మోతుబరిలా దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఓ వైపు తళతళ మెరిసే రోడ్లు.. మరోవైపు ఆకాశాన్నంటే ఐటీ భవనాలు.. వీటి మధ్యే ఉంది సయ్యద్ జాఫర్ ఐదెకరాల వ్యవసాయ భూమి. ఆయన పొలానికి అటుఇటుగా ఉన్న వ్యవసాయ క్షేత్రాలన్నీ కోట్లకు అమ్ముడుపోయాయి. అయినా జాఫర్ బాయ్.. ‘భూమిని నమ్ముకుంటాను కానీ అమ్ముకోనని’ డిసైడ్ అయ్యాడు. ఆయన మనసెరిగిన కొడుకు సయ్యద్ గౌస్ కూడా తండ్రి బాటలోనే సాగుతున్నాడు. తృణప్రాయంగా.. నాలుగు తరాలుగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తోంది ఈ కుటుంబం. తాతలనాడు అరక పట్టి.. మెరక దున్నారంటే ఓకే..! తమ పొలానికి ఎన్ని ఆఫర్లు వచ్చినా తోసిపుచ్చి.. నేటికీ సయ్యద్ కుటుంబం పొలం పనులతోనే జీవనం సాగిస్తోంది. ఇప్పటికీ కాడెడ్లతోనే పొలాన్ని దున్నుతున్నారు. సేంద్రియ ఎరువులతోనే సాగు చేస్తున్నారు. తిండిగింజలు కరువైన నాడు ఎన్ని డబ్బులు ఉన్నా ఏం లాభం అంటాడు జాఫర్ ఉరఫ్ ఫకీర్సాబ్. రైతులు ఉన్నప్పుడే.. జనజీవనం సాగుతుందని చెబుతాడు. ఈ పొలంలో వరితోపాటు టమాటాలు, వంకాయలు, సొరకాయలు వంటి కూరగాయలతో పాటు, ఆకుకూరలూ పండిస్తున్నారు. ‘ఎనిమిదేళ్ల నుంచి ఈ పొలంలో పనిచేస్తున్నా. మాదాపూర్లో పొలం పనులకు వెళ్తున్నా అంటే హైటెక్సిటీలో పొలమేందని మా వాళ్లు ఆశ్చర్యపోతుంటరు’ అని చెబుతుంది రైతు కూలి శాంతమ్మ. మా ఇంటి పంటే తింటాం.. ‘నాకిప్పుడు 80 ఏళ్లు. నా కొడుకులు, మనవళ్లతో సమానంగా నడుస్తా. మా పొలంలో పండిన కూరగాయలే తింటం. మా ఇంటి నుంచి పొలానికి కిలోమీటర్ ఉంటది. రోజూ రెండు మూడు సార్లు పొలానికి నడుచుకుంటనే పోయొస్తుంట. ఈ తరం వారికి వ్యవసాయం భారంగా తోస్తోంది. గిట్టుబాటుకాకా.. పల్లెల్లో కూడా చాలామంది రైతులు వ్యవసాయానికి దూరమైతున్నరు’ అని అంటారు సయ్యద్ జాఫర్. నాన్న కోరిక.. నా ఇష్టం.. ‘చిన్నప్పటి నుంచే మా నాన్న వ్యవసాయంపై నాకు ఆసక్తి కలిగించారు. మా నాన్న కోరిక మేరకు వ్యవసాయం చేస్తున్నా. మా తమ్ముడు హోటల్ నడిపిస్తున్నాడు. బాగానే లాభాలు వస్తున్నాయి. అయినా పొలంబాట వీడేది లేదు. మా పిల్లలు ‘వ్యవసాయం ఎందుకు నాన్నా’ అని అంటుంటారు. ఈ దారిలో వెళ్తూ చాలామంది మా పొలం దగ్గర ఆగి చూస్తుంటారు. ‘ఇక్కడ వ్యవసాయమా.. మంచి పని చేస్తున్నావ్..!’ అని మెచ్చుకుంటారు కూడా’ అంటూ సంతోషంగా చెబుతారు సయ్యద్ గౌస్ . .:: తన్నీరు సింహాద్రి, మాదాపూర్ -
సైబర్ రాముడు
తెలుగుజాతికి అయోధ్యాపురి భద్రగిరి అయితే.. హైదరాబా దీలకు భద్రాద్రి హైటెక్సిటీ దగ్గర వెలసిన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం. భద్రగిరి రామయ్య పాదాలు కడిగేందుకు గోదారి పొంగితే.. ఈ సైబర్ రాముడి పాదాల చెంతన పుట్టిన ఐటీ ప్రవాహం ప్రపంచవ్యాప్తమైంది. భద్రుడు కొలిచిన రాముడికి రామదాసు ఆలయం కట్టిస్తే..ముమ్మూర్తులా అదే రూపంతో ఉన్న రాముడిని సిటీవాసుల దరి చేర్చాడు ఓ రామభక్తుడు. ఆ ఆలయ విశేషాలు శ్రీరామనవమి సందర్భంగా.. ..:: త్రిగుళ్ల నాగరాజు చతుర్భుజములతో.. వామహస్తాల్లో చక్రం, ధనస్సు, దక్షిణ హస్తాల్లో శంఖం, బాణం ధరించి.. ఎడమ తొడపై సీతమ్మతల్లి ఆసీనురాలు కాగా.. లక్ష్మణస్వామి సమేతుడై దాశరథి.. భద్రాచలంలో ఆత్మారాముడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. భద్రగిరిలో కొలువుదీరిన ఈ రాముడి ప్రతిరూపమే సైబర్సిటీలో కొలువుదీరింది. 14 ఏళ్ల సమయం.. నాలుగు దశాబ్దాల కిందట 1972లో రామభక్తుడు న్యాపతి రామారావు మదిలో ఓ రామాలయం నిర్మించాలనే భావన కలిగింది. ఇదే విషయం తను ఎంతగానో ఆరాధించే కంచి పరమాచార్య, నడిచే దైవం చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారికి విన్నవించుకున్నారు. భద్రాచలం వెళ్లి దర్శనం చేసుకోలేని భక్తుల కోసం భద్రాద్రి రాముడి ప్రతిరూపంగా ప్రతిష్ఠించమని సెలవిచ్చారు స్వామి. ఆలయ నిర్మాణానికి ఇప్పుడు హైటెక్సిటీగా పిలుస్తున్న కొండాపూర్ గ్రామం అయితే బాగుంటుందని సూచించారు. అప్పుడది అరణ్యం. భవిష్యత్తులో ఈ ప్రదేశం ప్రపంచ ప్రఖ్యాతి చెందుతుందని స్వామి ఆనాడే చెప్పారట. స్వామి అనుగ్రహంతో కొండాపూర్లో ఏడెకరాల స్థలం కొనుగోలు చేశారు రామారావు. తర్వాత పదేళ్లకు 1982 ఏప్రిల్ 8న ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం కోసం కంచి స్వామివారు శంఖం కూడా పంపించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక నుంచి నిర్మాణరంగ నిపుణులను తీసుకొచ్చారు రామారావు. కారణాంతరాలు ఏవైనా, కాకతాళీయమైనా.. ఆలయ నిర్మాణానికి సరిగ్గా.. 14 ఏళ్లు పట్టింది. వనవాసం పూర్తిచేసుకున్న నీలిమేఘశ్యాముడు పట్టాభిరాముడైనట్టు 1996 ఏప్రిల్ 22న కంచి స్వాములు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి స్వాముల చేతుల మీదుగా లక్ష్మణ సమేతుడైన సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. నాటి నుంచి ఈ ఆలయాన్ని భక్తులు అపరభద్రాద్రిగా కొలుస్తున్నారు. అద్వైత క్షేత్రం.. ఆధునిక ప్రపంచానికి ప్రతీకగా భాసిల్లుతున్న సైబరాబాద్లో ఆధ్యాత్మిక సుగంధాలు పంచుతోంది ఈ రామాలయం. ‘19 ఏళ్లుగా శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెబుతున్నారు దేవస్థానం కమిటీ చైర్మన్, న్యాపతి రామారావు కుమారుడు డా.శ్రీనివాసరావు. ‘మా నాన్నగారు న్యాపతి రామారావు సంకల్పం, కంచి స్వామి వారి అనుగ్రహంతో ఈ ఆలయం నిర్మితమైంది. ఇప్పటికే దేవాలయ ఆవరణలో సుదర్శన నరసింహస్వామి, గోదాదేవి ఆలయాలు నిర్మించాం. అద్వైత భావాన్ని చాటుతూ ఇటీవల ఆలయ ప్రాంగణంలో శివాలయం (ఏకాంబరేశ్వర స్వామి) నిర్మించాం. రానున్న రోజుల్లో ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని మరింత విస్తరిస్తాం’ అని తెలిపారు శ్రీనివాసరావు. కల్యాణం చూతము రారండి.. శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయం చుట్టూ చలువ పందిళ్లు వేసి అందంగా ముస్తాబు చేశారు. ‘స్వామివారి కల్యాణ వేడుకలో భాగంగా గత ఆదివారం అంకురార్పణ చేశాం. నాటి నుంచి ప్రతి రోజూ విశేష వాహన సేవలు నిర్వహిస్తున్నాం. శనివారం ఉదయం 9.45 గంటలకు స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామ’ని తెలిపారు దేవస్థానం కమిటీ సెక్రటరీ భానుమూర్తి. అందరి దేవుడు.. అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు. నేను 19 ఏళ్లుగా ఈ ఆలయానికి వస్తున్నాను. ఈ ఆలయంలోకి అడుగుపెట్టడంతోనే ప్రశాంతత కలుగుతుంది. ఇక్కడి రాములవారి మూలవిరాట్ను దర్శించుకోవడం ఓ భాగ్యంగా భావిస్తాను. రాముడు అందరి దేవుడు. మానవుడి నడవడి ఎలా ఉండాలో రాముడు నడిచి చూపించాడు. ఆయన చూపిన బాట యుగధర్మాలకు అతీతమైంది. నాటికీ నేటికీ ఏనాటికీ అనుసరణీయమైనది. - సుధ, సినీనటి -
పిచ్చోళ్ల సిటీ కూడా ఇలా ఉండదు
-
సెల్ ఫోనే ప్రాణం తీసింది
హైదరాబాద్: హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో శనివారం విషాదం చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్లో ట్రాక్ దాటుతున్న యువకుడిని రైలు ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో సదరు యువకుడు అక్కడికక్కడే మరణించాడు. రైల్వేస్టేషన్లోని ప్రయాణికులు, సిబ్బంది వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకుని ... పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు సెల్ ఫోన్ మాట్లాడుతు రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. -
వెనిస్ ఇన్ హైదరాబాద్
ప్రముఖ ఆర్టిస్టు సూర్యప్రకాష్ కుంచె నుంచి జాలువారిన రమణీయ చిత్రాల ఎగ్జిబిషన్ ‘వెనిస్ ఇన్ హైదరాబాద్’ విశేషంగా ఆకట్టుకుంటోంది. హైటెక్సిటీ హోటల్ ట్రైడెంట్లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. ఈ నెల 27 వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. సాక్షి, సిటీప్లస్ -
ఆదిభట్ల మరో హైటెక్ సిటీ!
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల క్రితం అక్కడ గజం స్థలం ధర రూ.2 వేలు కూడా కష్టమే. కానీ, నేడు రూ.8 వేలకు పైగానే పలుకుతోంది! ఒకప్పుడు షేర్ ఆటోలు కూడా తిరగని ఆ ప్రాంతంలో ఇప్పుడు లగ్జరీ కార్లు దూసుకెళ్తున్నాయ్!! ఒకప్పుడు సినిమా చూడాలంటే సిటీకీ రావాల్సిందే. కానీ నేడక్కడే మల్టీప్లెక్స్లు రూపుదిద్దుకుంటున్నాయ్!!! ఇంతకీ ఆ ప్రాంతమేంటంటే ఆదిభట్ల గ్రామం. ఐటీ సెజ్ రాకతో ఇప్పటికే రియల్ దూకుడు మీదున్న ఆదిభట్లలో ఇప్పుడు ఏరోస్పేస్ కంపెనీలూ క్యూ కడుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఆదిభట్ల గ్రామం మరో హైటెక్ సిటీగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. స్థిరాస్తి వ్యాపారానికి సెలైన్ ఎక్కించేవి ఐటీ కంపెనీలు. ఇది చాలదన్నట్లు ఆదిభట్లలో ఏరోస్పెస్ కంపెనీలూ కొలువుదీరాయి. గతంలోనే ఆదిభట్లలో 250 ఎకరాల్లో వైమానిక సెజ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సెజ్లో టాటా సికోర్ స్కై, టాటా అడ్వాన్స్డ సిస్టమ్, టాటా లాక్హిడ్ మార్టిన్ సిస్టమ్, సముహా ఏరోస్పేస్ సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఇటీవలే టాటా అడ్వాన్డ్స్ సిస్టమ్స్ సంస్థ జర్మనీకి చెందిన రుమాగా సంస్థతో కలసి డార్నియర్ విమాన పరికరాల తయారీ పరిశ్రమనూ స్థాపించింది. డార్నియర్-228 విమాన ప్రధాన భాగంతో పాటు విమాన రెక్కలను కూడా ఇక్కడ తయారు చేయనున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరం చుట్టూ మూడు క్లస్టర్లుగా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రానుంది. ఇందులో క్లస్టర్-3లో భాగంగా హైదరాబాద్ ఎయిర్పోర్టు డెవలప్మెంట్ అథారిటీలో ఆదిభట్ల, మహేశ్వరం, రావిరాల, మామిడిపల్లిలో 79.2 చ.కి.మీ. పరిధిలో ఐటీఐఆర్ విస్తరించి ఉంటుంది. అంతేకాకుండా ఔటర్ రింగ్రోడ్డు గ్రోత్ కారిడార్-1కు 11.5 చ.కి.మీ., కారిడార్-2కు 14.3 చ.కి.మీ. కేటాయించి శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బొంగ్లూరు ఔటర్ రింగ్రోడ్డు వరకు దీన్ని అనుసంధానం చేస్తారు. మరోవైపు ఆదిభట్ల ప్రాంతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 10 కి.మీ., ఎల్బీనగర్కు 12 కి.మీ., ఔటర్ రింగ్ రోడ్డుకు 1.5 కి.మీ. దూరంలో ఉండటమూ మరింత కలిసొస్తుందని నిపుణులు చెబుతున్నారు. జనవరిలో టీసీఎస్ ప్రారంభం.. ఆదిభట్లలో ఇప్పటికే ఉన్న ఐటీ కంపెనీల్లో వేల సంఖ్యలో ఉద్యోగులున్నారు. వచ్చే జనవరిలో టీసీఎస్లో కొత్తగా 28 వేల ఉద్యోగులు రానున్నట్లు సమాచారం. దీంతో ఆదిభట్ల చుట్టుపక్కల ప్రాంతాలు హైటెక్ సిటీని తలపించనున్నాయన్నమాట. గతంలో ఇండిపెండెంట్ హౌస్లకే పరిమితమైన ఈ ప్రాంతానికి ఇప్పుడు అపార్ట్మెంట్ సంస్కృతికి చేరింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆదిభట్లపై రియల్టర్లు, ఎన్నారైలు, ఐటీ ఉద్యోగులు ఇలా అందరి చూపు పడింది. భారీ నివాస, వాణిజ్య సముదాయాలు నిర్మించేందుకు 6 బడా సంస్థలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ధరలు కూడా అందుబాటులో ఉండటం, మెరుగైన రవాణా, మౌలిక వసతులు పుష్కల్కంగా ఉండటంతో ఐటీ ఉద్యోగులు, మదుపుదారులు, ఎన్నారైలు ఈ ప్రాంతంలో స్థలాలు కొనేందుకు ఎగబాకుతున్నారు. రెండు మూడేళ్ల కిత్రం ఆదిభట్లలో గజం స్థలం ధర రూ.2 వేలుగా ఉండేది. కానీ, ప్రస్తుతం రూ. 8 వేల నుంచి రూ. 10 వేలకు పైగానే పలుకుతోంది. ఆదిభట్లలోని పలు ప్రాజెక్ట్లివే.. బొంగ్లూరు ఓఆర్ఆర్ వద్ద 20 ఎకరాల్లో మెట్రోసిటీ ఇన్ఫ్రాటెక్ ఫేజ్-2ను ప్రారంభించినట్లు మెట్రో సిటీ ఇన్ఫ్రా డెవలపర్స చైర్మన్ కే మనోహర్రెడ్డి చెప్పారు. ఇప్పటికే 36 ఎకరాల్లో ఫేజ్-1ను పూర్తి చేశాం. గజం ధ ర రూ.5,500లుగా నిర్ణయించాం. ఆదిభట్ల టీసీఎస్ వెనుక ప్రాంతంలో 20 ఎకరాల్లో మరో కొత్త వెంచర్ను ప్రారంభించాం. గజం ధర రూ.18-20 వేలుగా చెబుతున్నాం. రానున్న రోజుల్లో ఆదిభట్లలో మల్టీప్లెక్స్ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సామాన్యులకు సైతం సొంతిల్లు అందించేందుకు గాను గున్గల్లో 30 ఎకరాల్లో శ్రీ బాలాజీ నగర్ను నిర్మిస్తున్నట్లు శ్రీసాయి బాలాజీ ఎస్టేట్స్ అధినేత ఎన్. కృష్ణ గౌడ్ చెప్పారు. ముందుగా 25 శాతం సొమ్ము చెల్లిస్తే సరి.. మిగతా డబ్బును 24 సులభ వాయిదా పద్ధతుల్లో చెల్లించేలా ఆఫర్ను ప్రకటించినట్లు పేర్కొన్నారు. గజం ధర రూ.4 వేలుగా నిర్ణయించామన్నారు. -
కూలిన భారీ హోర్డింగ్... సాప్ట్వేర్ ఇంజినీర్ మృతి
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం మరో నిండి ప్రాణాన్ని బలి తీసుకుంది. హైటెక్ సిటీ సమీపంలోని గచ్చిబౌలి చౌరస్తా వద్ద బైక్పై వెళ్తున్న పృధ్వీసేనా రెడ్డి అనే వ్యక్తిపై భారీ హోర్డింగ్ కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో పృధ్వీ అక్కడికక్కడే మరణించాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థాలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుడి వద్ద దొరికిన ఐడీ కార్డు ఆధారంగా అతడు నానక్రామ్గూడలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు. మృతుడు కూకట్పల్లి నివాసి అని... అతడి బంధువులకు సమాచారం అందజేసినట్లు చెప్పారు. హోర్డింగ్ ఏర్పాటులో లోపం కారణంగానే కూలిందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులపై కేసు నమోదు చేశారు. మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతో గత వారం హిమాయత్ నగర్ లోని తెరిచిఉంచిన మ్యాన్ హోల్ పడి ఓ వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్లో ఎయిర్టెల్ పబ్లిక్ వైఫై
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ కంపెనీ ఎయిర్టెల్, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పబ్లిక్ వైఫై సౌకర్యాన్ని హైదరాబాద్ హైటెక్సిటీ ప్రాంతంలో ప్రారంభించింది. ప్రస్తుతం ఎనిమిది కిలోమీటర్ల మేర 17 స్థానాల్లో ఈ సేవలు అందుబాటులోకి వ చ్చాయి. స్మార్ట్ఫోన్, ట్యాబ్లెట్ పీసీ, ల్యాప్టాప్ ఇలా ఉపకరణం ఏదైనా ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. ఇతర ఆపరేటర్లకు చెందిన కస్టమర్లు సైతం వైఫై పొందవచ్చని భారతీ ఎయిర్టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్ సీఈవో వెంకటేష్ విజయ్రాఘవన్ తెలిపారు. 3 నెలల పైలట్ ప్రాజెక్టు కింద ప్రస్తుతం ప్రతి వినియోగదారుకు రోజుకు 750 ఎంబీ వరకు డేటా ఉచితమని చెప్పారు. నెట్ వేగం 42 ఎంబీపీఎస్ వరకు ఉంటుందన్నారు. వినియోగదారులు తమ ఉపకరణంలో వైఫైని ఆన్ చేసి పబ్లిక్ వైఫైని ఎంచుకోవాలి. వెంటనే వన్ టైమ్ పాస్వర్డ్ మొబైల్కు వస్తుంది. దీన్ని టైప్ చేస్తే నెట్ సౌకర్యం పొందొచ్చు. నగరం మొత్తం..: ఎయిర్టెల్ దశలవారీగా భాగ్యనగరి మొత్తం వైఫై సౌకర్యాన్ని కల్పించనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్లో 14,000 కిలోమీటర్ల మేర ఎయిర్టెల్ ఫైబర్ విస్తరించింది. ఇందులో హైదరాబాద్ వాటా 2,200 కిలోమీటర్లు. 3 నెలల తర్వాత వైఫై ఫ్రీగా ఇవ్వాలా, లేదా స్వల్పంగా చార్జీ చేయాలా అన్నది నిర్ణయిస్తామని కంపెనీ చెబుతున్నప్పటికీ.. ఉచితంగా ఇవ్వడం వల్ల కంపెనీపై పెద్ద ఎత్తున భారం పెరుగుతుంది. చార్జీ చేయడం ఖాయమని ఎయిర్టెల్ అధికారి ఒకరు తెలిపారు. హైదరాబాద్లో పబ్లిక్ వైఫైని ఏర్పాటు చేయడం ఎయిర్టెల్కు ఇదే తొలిసారి. 17 స్థానాల్లో సగటున 40 వేల మంది వైఫై వినియోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. రాజధాని అంతటా వైఫై: కేటీఆర్ నాలుగైదు నెలల్లో భాగ్యనగరి మొత్తం వైఫై హైదరాబాద్గా (హైఫై) మారిపోనుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. హైటెక్ సిటీ వద్ద ఎయిర్టెల్ పబ్లిక్ వైఫై ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లో 700 చదరపు కిలోమీటర్ల మేర వైఫై సౌకర్యం అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. అంగుళం స్థలం కూడా వదలమని చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే.. త్వరలో టెండర్లు..: వైఫై సేవలు అందించేందుకు ఎయిర్సెల్, రిలయన్స్ జియో తదితర టెలికం కంపెనీలు కూడా ముందుకు వచ్చాయి. త్వరలో టెండర్లు పిలుస్తున్నాం. భాగ్యనగరానికి ఎవరు వచ్చినా వైఫై వంటి సౌకర్యాలుంటే సానుకూలంగా స్పందిస్తారు. ఇ-కామర్స్ రంగం దూసుకెళ్తోంది. డిజిటల్ అనుసంధానం పెద్ద ఎత్తున చేపడతాం. తద్వారా ఉత్తమ ఉత్పత్తులు, సేవలు పొందేందుకు మార్గం సుగమం అవుతుంది. స్మార్ట్ఫోన్ నుంచే ‘మీ సేవ’ సర్వీసులు కొన్ని అయినా ప్రజలకు అందాలన్నది మా ధ్యేయం. స్మార్ట్ఫోన్ నుంచి ఏవైనా ధ్రువీకరణ పత్రాలు కోరితే.. ఆ పత్రాలు ఇంటికి రావాలన్నది మా ఆలోచన. మ్యాన్హోల్ తెరిచివుంటే దాన్ని ఫొటో తీసి జీహెచ్ఎంసీ పంపిస్తే అధికారులు స్పందించేలా టెక్నాలజీని వినియోగించనున్నాం. త్వరలో వొడాఫోన్ వైఫై..: టెలికం కంపెనీ వొడాఫోన్ సైతం పబ్లిక్ వైఫై సేవలను అందించనుంది. కొద్ది రోజుల్లో ప్రణాళిక కార్యరూపం దాల్చనుందని వొడాఫోన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆపరేషన్స్ బిజినెస్ హెడ్ మన్దీప్ సింగ్ భాటియా తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నట్టు ఆయన చెప్పారు. -
నో టెన్షన్స్
ఎప్పుడూ కంప్యూటర్లు.. ప్రాజెక్ట్ వర్క్లతో బిజీగా ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగులు సరదాగా స్టెప్పులేశారు. జాబ్ టెన ్షన్స్కు చెక్ పెట్టేసి.. ఎంచక్కా ఎంజాయ్ చేశారు. గొంతుకలు సవరించి వినసొంపైన పాటలను అందుకున్నారు. హైటెక్సిటీలోని ఇనార్బిట్మాల్లో రేడియో మిర్చి, హీరో మోటో కార్ప్ సంస్థలు సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన ‘మిర్చి క్లాష్ ఆఫ్ ది కార్పొరేట్స్’ గ్రాండ్ ఫైనల్లో బాలీవుడ్, టాలీవుడ్ పాటలకు అదిరిపోయే డ్యాన్స్తో టెకీలు ఉర్రూతలుగించారు. ఫ్యాషన్ షోలోహొయలొలికించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ కల్చరల్ ఫెస్ట్లో మిస్టర్ కార్పొరేట్గా సీటెల్ కంపెనీకి చెందిన మొహనీశ్, మిస్ కార్పొరేట్ గా ఐబీఎం ఉద్యోగిని డింపుల్ గెలిచారు. చాంపియన్స్ ట్రోఫీని టెక్ మహీంద్రా గెలుచుకుంది. -
బెంగాలీ ఫుడ్ఫెస్టివల్
హైటెక్ సిటీలోని రాడిసన్ హైదరాబాద్ హోటల్ దసరా నవరాత్రుల సందర్భంగా శుక్రవారం నుంచి బెంగాలీ ఫుడ్ఫెస్టివల్ ప్రారంభిస్తోంది. ఈ హోటల్లోని కాస్కేడ్-24X7 రెస్టారెంట్ భోజనప్రియులైన ‘సిటీ’జనులకు బెంగాలీ రుచులను వడ్డించనుంది. బెగుని, మఛ్ చాప్, నర్కోల్ దియే మాంషొ, భపా ఇలిష్, కొపి బెట్కి పాలక్, బైగన్ ఘంటొ, జింగె పొస్తో, సుఖ్తొ, భజా ముంగెర్ దాల్, మిస్టీ పులావు, ముడి ఘంటొ, ఆలూ దియే మాంషొ, దోయి మఛొ, బెట్కి మఛేర్ ఝల్, చొణార్ తొర్కారి, మిస్టీ దోయి వంటి సంప్రదాయ బెంగాలీ వంటకాలను అందించనుంది. పూర్తి బెంగాలీ అలంకరణతో ఉండే కాస్కేడ్ రెస్టారెంట్లో అతిథులకు వడ్డన చేసే స్టీవార్డ్స్ సైతం సంప్రదాయ బెంగాలీ వస్త్రధారణతో కనిపిస్తారు. -
సాయం మాని 'సెల్'తో ఫోటోలా?
ఆధునిక యుగంలో మానవత్వం అడుగంటిపోతోంది. సాటి మనిషి కళ్లెదుటే కష్టాల్లో ఉంటే చేతనైన సాయం చేయడానికి కూడా ముందుకురాని మనుషులెందరో. ఎవడికే సమస్య వస్తే తానెందుకు స్పందించాలన్న సంకుచిత ధోరణి ఎక్కువగా కనబడుతోంది. సాటివాడు చావుబతుకుల్లో ఉన్నా పట్టించుకునే తీరికేలేని సమాజంలో మన మున్నామంటే ఆందోళన కలుగుతోంది. సమాచార సాంకేతిక వెల్లువలో కొట్టుకుపోతూ మానవత్వాన్ని మర్చిపోతున్నాం. టెక్నాలజీకి ఇచ్చే విలువ మనిషి ప్రాణానికి ఇవ్వడం లేదంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఇందుకు హైటక్ సిటీకి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదమే సజీవ రుజువు. ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్ ప్రయాణిస్తున్న ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ప్రకాశ్రాజ్ ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన బస్సు ఢికొట్టింది. మరో ఆటోను కూడా ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం రోడ్డు మీద పడింది. గాయాలపాలైన కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసి అక్కడున్నవారిలో చాలా మంది తన ఫోటోలు తీసుకోవడాన్ని చూసి ప్రకాశ్రాజ్ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆపదలో ఉన్నవారికి సాయం అందించాలన్న స్పృహ లేకుండా తన ఫోటోలు తీసుకోవడంలో నిమగ్నమైన యువతను చూసి ఆయన ఆందోళన చెందారు. జరిగిన ప్రమాదం కంటే మనుషుల అమానవీయ నైజమే తనను ఎక్కువ భయానికి గురిచేస్తోందని తర్వాత ట్విటర్ లో పేర్కొన్నారు. మానవత్వాన్ని మరిచి మనం ఎక్కడకు పోతున్నామంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాటివాడికి సాయం చేయలేని దుస్థితిలో ఉన్నందుకు సిగ్గుతో తలవంచుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు రోజూ ప్రతిచోట జరుగుతూనే ఉన్నాయి. అయితే మనుషులు స్పందించే తీరే అభ్యంతరకరంగా ఉంది. డిజిటల్ మోజులో పడి మనిషి స్పందన రహితుడుగా మారిపోతున్నాడు. చేయి చాచి సాయం అందించడం మానేసి సెల్ ఫోన్ లో బంధించడానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు. ప్రతి విషయంలోనూ ఇలానే ప్రవర్తిస్తున్నాడు. ఎదురుగా ఉన్న మనిషిని వదిలేసి ఏమాత్రం విశ్వసనీయత లేని 'డిజిటల్' బంధాల కోసం వెంపర్లాడుతున్నాడు. ప్రాణం కంటే విలువైనది, మానవత్వం కంటే గొప్పది ఏదీ లేదని తెలుసుకుంటే మంచిది. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. కాదంటారా? -
షటిలర్స్.. షహర్
చార్మినార్.. గోల్కొండ.. బిర్లామందిర్.. హైటెక్ సిటీ.. ఇలా హైదరాబాద్కీ షాన్గా నిలిచే జాబితాలోకి షటిల్ను కూడా చేర్చాలేమో. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ బ్యాడ్మింటన్ జరిగినా.. మన సిటీ రాకెట్లు రివ్వున దూసుకుపోతున్నాయి. సైనా మొదలు సాయిదత్ వరకు విజయ పరంపర కొనసాగుతోంది. తాజాగా గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో నలుగురు హైదరాబాదీలు పతకాలు సాధించడం విశేషం. స్వర్ణ, రజత, కాంస్యాలతో మన షటిల్ ఎక్స్ప్రెస్ దూసుకుపోయింది. వీరంతా ఇక్కడే ఆటలో ఓనమాలు నేర్చుకొని ఇంతింతై... వటుడింతై అన్నట్లు ఎదిగారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంతో వారికున్న అనుబంధాన్ని ఆ నలుగురు పంచుకున్నారు. ఫ్రమ్ హైదరాబాద్ ‘నేను హైదరాబాదీని అని చెప్పుకోవడంలోనే నాకు గర్వంగా అనిపిస్తుంది. టోర్నీల్లో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్లినప్పుడు కూడా కేవలం ఇండియాతో సరి పెట్టకుండా ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పుకుంటాను. బయటి వాళ్లలో కూడా చాలా మందికి మన సిటీ గురించి బాగా తెలుసు. ఇక్కడి ప్రతీ చోటు ఇష్టమే. చార్మినార్ వంటి చారిత్రక ప్రాంతాల నుంచి కొత్త తరం మాల్స్ వరకు ఎక్కడైనా ఫెంటాస్టిక్గా ఉంటుంది. ఎల్బీ స్టేడియంలో శిక్షణ నుంచి ఏ స్థాయికి చేరుకున్నా అన్నీ హైదరాబాద్తోనే ముడిపడి ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా మన సిటీ మరో మెగా ఈవెంట్కు వేదిక అవుతుందని నమ్ముతున్నా. నేను అందులో భాగం కావాలని కోరుకుంటున్నా. బిర్యానీ భలే రుచి ‘నేను పుట్టి పెరిగింది ఇక్కడే.. హైదరాబాద్ తప్ప మరో సిటీ గురించి ఊహించలేను. ఇతర నగరాలతో దీనిని పోల్చడం కూడా సరైంది కాదు. సికింద్రాబాద్లోని ఆగ్జిలియం స్కూల్లో, ఆ తర్వాత మెహిదీపట్నం సెయింట్ ఆన్స్ కాలేజీలో చదువుకున్నాను. చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్పై దృష్టి పెట్టాను కాబట్టి ఫ్రెండ్స్తో తిరగడంవంటి సరదాలు తక్కువే. ఎక్కడికి వెళ్లినా అమ్మా నాన్నలతోనే. మన హైదరాబాదీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అందులోనూ బిర్యానీ టేస్ట్కు పడి చస్తాను. అందుకే నా ఫేవరేట్ ఫుడ్ పాయింట్ అంటే ప్యారడైజ్ హోటలే. అక్కడ లభించే అన్ని వెరైటీలను టేస్ట్ చేస్తాను. భవిష్యత్తులోనూ హైదరాబాద్కు గర్వకారణంగా నిలుస్తాను. ఈజీ గోయింగ్ సిటీ హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. మధ్యలో మూడేళ్లు బెంగళూరు వెళ్లడం మినహా అంతా ఇక్కడే ఉన్నాను. బహుశా నగరంతో అనుబంధం పెరిగిపోవడం వల్లే తొందరగా వెనక్కి వచ్చేశానేమో! ఆల్ సెయింట్స్ హైస్కూల్, రత్న జూనియర్ కాలేజి, సెయింట్ ఫ్రాన్సిస్ (బర్కత్పురా)లలో నా చదువు సాగింది. ఈ సిటీ గురించి సరిగ్గా చెప్పాలంటే కంఫర్ట్.. ఈజీ గోయింగ్.. ఈజిలీ రీచబుల్. ఎల్బీ స్టేడియంలో తొలిసారి రాకెట్ పట్టుకొని ఫుల్ వైట్డ్రెస్లో అడుగు పెట్టిన రోజు నాకు ఇంకా గుర్తుంది. నాటినుంచి ఇప్పటి వరకు నేనేం సాధించినా హైదరాబాదీగానే. మొదట్లో మేం బషీర్బాగ్, ఆ తర్వాత అత్తాపూర్లో ఉండేవాళ్లం. ఇప్పుడు అకాడమీకి దగ్గరగా గచ్చిబౌలికి మారాం. సిటీ బస్సుల్లో వేలాడుతూ గ్రౌండ్కు చేరిన రోజులు ఉన్నాయి. కానీ దానినీ ఎంజాయ్ చేశాను. సిటీ ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో దాదాపు ప్రతీ హోటల్లో వెరైటీ ఐటమ్స్ ప్రయత్నించాను. హైదరాబాద్ స్పోర్ట్స్ సిటీగా మరింత పేరు తెచ్చుకోవాలని నా కోరిక. మధుర జ్ఞాపకం చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఎంజాయ్ చేసినంత నేను ఎక్కడా ఎంజాయ్ చేయలేను. టోర్నీల కోసం బయటి నగరాలకు వెళ్లడం తప్పదు. ఆల్ సెయింట్స్ హైస్కూల్, ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదివాను. అజహర్లాంటి క్రికెటర్లు చదివిన స్కూల్లోనే చేరగానే నాలో అనుకోకుండానే క్రీడాకారుడి ఆలోచనలు వచ్చాయేమో! సిటీలో నాకు బంధుమిత్రులు చాలా మంది ఉన్నారు. నా కజిన్స్తోనే అన్ని సరదాలు. వారాంతంలో జీవీకే మాల్, ఇనార్బిట్ మాల్లోనే ఎక్కువగా ఉంటాను. నాకున్న డైట్ పరిమితుల వల్ల బిర్యానీ ఎక్కువగా తినలేను కానీ.. బషీర్బాగ్ కేఫ్ బహార్ నా ఫేవరేట్ ఫుడ్ జాయింట్. ఎలాంటి నాన్ వెజ్ అయినా ఎక్కువగా అక్కడి నుంచి తెప్పించుకుంటా. ఇక రంజాన్ నెలలో బహార్ హలీమ్ ఒక్క రోజూ మిస్ కాను. మొదటి నుంచి కొత్తపేట సమీపంలోని అష్టలక్ష్మి టెంపుల్ దగ్గరే ఉంటున్నాం. సిటీ ఎంత మారినా ప్రతీది మధుర జ్ఞాపకమే. - మొహమ్మద్ అబ్దుల్ హాదీ -
వృద్ధి అస్త్రం.. ఐటీఐఆర్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)కి కేరాఫ్ హైదరాబాద్. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలిలు ఐటీకి కేంద్రబిందువులు. ఇప్పుడు వీటిని తలదన్నే రీతిలో రంగారెడ్డిజిల్లా సరిహద్దు ప్రాంతాలైన మహేశ్వరం, ఆదిబట్ల, పోచారం, ఉప్పల్లకు ఐటీరంగ సంస్థలు రానున్నారుు. విభజన నేపథ్యంలో హైదరాబాద్లో ఐటీ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళనకు ఐటీఐఆర్ ప్రాజెక్టు చెక్ పెట్టనుంది. కేంద్రం ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్తో నగర శివారు ప్రాంతాల రూపురేఖలు మారనున్నారుు. - న్యూస్లైన్, ఇబ్రహీంపట్నం రూరల్ ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్లైన్: ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ప్రధాన కేంద్రం నగరం నుంచి శివారు ప్రాంతాలకు బదిలీ కానుంది. ముఖ్యంగా ఆదిబట్ల, మహేశ్వరంలో ఐటీ అనుబంధ కంపెనీలు రూపుదిద్దుకుంటున్నాయి. టీసీఎస్, కాగ్నిజెంట్, బయోజెనిక్స్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, లాకిడ్ మార్టిన్, ఏరోస్పేస్ అండ్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ సెజ్ తదితర ఐటీ కార్యకలాపాలు సాగించే ప్రతిష్టాత్మక సంస్థలకు ఆదిబట్ల కేంద్రస్థానం కాబోతుంది. ఈ క్రమంలో ఆదిబట్ల పరిసర ప్రాంతా ల్లో మరిన్ని బహుళజాతి, ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నా యి. ఇటీవల పలు చిన్న, మధ్యస్థాయి ఐటీ కంపెనీలు సంయుక్తంగా సమూహ ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్ను ఏర్పాటు చేశాయి. ఇటీవల స్థిరాస్థి వ్యాపారంలో స్తబ్ధత ఏర్పడినప్పటికీ ఐటీఐఆర్ వంటి ప్రాజెక్టులతో భవిష్యత్లో పుంజుకునే అవకాశాలు కల్పిస్తున్నాయి. కేసీఆర్ నోట.. ఐటీఐఆర్ మాట రాష్ట్ర ముఖ్యమంతి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తన ప్రమాణ స్వీకారం రోజున ముఖ్యంగా ఐటీఐఆర్ గురించి పదేపదే ప్రస్తావించారు. అద్భుతమైన ఐటీఐఆర్ ప్రాజెక్టు వుంది కాబట్టి ఈ ప్రాంత ఐటీ, స్థిరాస్థి వ్యాపారానికి బెంగ అవసరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఈ ప్రాజెక్టు కార్యాచరణపై చర్చించనున్నట్లు సీఎం ప్రకటించారు. ఆయన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఐటీఐఆర్ గురించి చర్చించే అవకాశాలున్నాయి. మరోవైపు ఐటీశాఖ మంత్రి తారకరామారావు ఇటీవల ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైనప్పుడు ఈ ప్రాంతంలో చేపట్టబోయే ఐటీఐఆర్ ప్రాజెక్టుపై ప్రత్యేక ఆసక్తి కనబర్చినట్లు సవూచారం. ఇలాంటి ప్రాజెక్టులతో మరిన్ని పెట్టుబడుల్ని స్వాగతించి ఐటీ కి కేరాఫ్ అడ్రస్గా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామని కేటీఆర్ ప్రకటించారు. ఐటీఐఆర్.. గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్) ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. రూ.2.19 లక్షల కోట్లతో 50వేల ఎకరాల్లో ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలను ఏర్పాటు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ నగరం చుట్టూ మూడు క్లస్టర్లుగా ఐటీఐఆర్ ప్రాజెక్టులను ఏర్పాటు చే య నున్నారు. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ క్లస్టర్ పరిధిలో శంషాబాద్ విమానాశ్రయం, మామిడిపల్లి, మహేశ్వ రం, ఆదిబట్ల వున్నాయి. ఔటర్రింగ్రోడ్డు చుట్టూ అభివృద్ధి చేసే దిశగా ఈ ప్రాంతాన్ని గుర్తించారు. సైబరాబాద్ డెవలప్మెంట్ ఏరియాలో మాదాపూర్, మణికొండ, గచ్చిబౌలి, కోకాపేట తది తర ప్రాంతాలు వున్నాయి. ఉప్పల్ క్లస్టర్ పరిధిలో పోచారం తదితర ప్రాంతాలున్నాయి. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ క్లస్టర్లో భాగంగా ఆదిబట్ల, మహేశ్వరం, రావిర్యాల, మామిడిపల్లిలో 79.2 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ రీజియన్ ఏర్పాటవుతోంది. ఔటర్రింగ్రోడ్డు గ్రోత్కారిడార్-1కు 11.5 చ.కిమీ, కారిడార్-2కు 14.3చ.కిమీ కేటాయించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బొంగ్లూర్ ఔటర్రింగ్రోడ్డు వరకు దీనిని అనుసంధానం చేస్తారు. రెండు దశల్లో.. ఐటీఐఆర్లో చిన్న, మధ్య తరహా సంస్థలను ఏర్పాటు చేస్తారు. మొదటిదశలో 2013 నుంచి 2018 వరకు ప్రాజెక్టు పనులను చేపడతారు. ఇందులో భాగంగా రూ.3,275 కోట్ల వ్యయంతో ఔటర్రింగ్రోడ్డుకు గల 3రేడియల్ రోడ్లను అభివృద్ధి చేస్తారు. రెండో దశలో 2018 నుంచి 2038 వరకు ఐటీఐఆర్ మౌలిక సదుపాయాలను రూపొందిస్తారు. కేంద్ర సాయం.. ఐటీఐఆర్లో రహదారులు, విమాన ప్రయాణ సదుపాయాల అభివృద్ధి కోసం అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించనుంది. మౌలిక వసతుల కల్పన వ్యయ అంచనాను రూ.4863 కోట్లుగా కేంద్రం అంచనా వేసింది. తొలిదశలో రూ.942 కోట్లు, మలిదశలో రూ.3921 కోట్లు కేటాయించనుంది. ఇవన్నీ ఏర్పాటైతే నగరశివారు ప్రాంతాలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వస్తాయి. ఉపాధి.. ఐటీఐఆర్తో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ పరిస్థితిని కొంతవరకు రూపుమాపొచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇరు ప్రభుత్వాలు కృషిచేయాల్సిన ఆవశ్యకత వుంది. దాదాపు 15లక్షల వుందికి ప్రత్యక్ష, 56లక్షల వుందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఐటీఐఆర్తో శేరిలింగంపల్లి, హయత్నగర్, ఇబ్రహీంపట్నం, రామచంద్రాపురం, ఘట్కేసర్, ఉప్పల్, మహేశ్వరం, రాజేంద్రనగర్, సరూర్నగర్ మండలాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతాయుని స్థానికులు ఆశిస్తున్నారు. -
‘నా వాహనం సురక్షితం’ క్యాబ్లోనే ప్రయాణించండి
మార్చి 1 నుంచి క్యాబ్లకు పోలీసు రిజిస్ట్రేషన్ నంబర్లు.... లేదంటే వాహనం సీజ్ సాక్షి, సిటీబ్యూరో: హైటెక్ సిటీలో తిరిగే ప్రతి క్యాబ్ కూడా పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రత్యేక నంబర్ను పొందాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 1 నుంచి పోలీసు రిజిస్ట్రేషన్ మొదలవుతుందని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భం గా కమిషనర్ కార్యాలయంలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్యాబ్ల రిజిస్ట్రేషన్కు సంబంధించి వివరాలను ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి వివరించారు. పోలీసులు జారీ చేసే నా వాహనం సురక్షితం అనే స్టిక్కర్ ఉన్న క్యాబ్లోనే మహిళా ఉద్యోగులు ప్రయాణించాలని ఆయన సూచించారు. పోలీసు రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా తిరిగే క్యాబ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ పులిందర్రెడ్డి, సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కా ర్యదర్శి శ్రీనివాస్రెడ్డిలు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ ఇలా... ఐటీ కారిడార్లోని ఉద్యోగులను తరలించే ప్రతి క్యాబ్ పోలీసు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇందుకోసం వాహనం, డ్రైవర్, యజమాని వివరాలు నింపేందుకు ప్రత్యేక ఫారాలను తయారు చేశారు. వాహనం రిజిస్ట్రేషన్ కాగితాలు, ఫిట్నెస్, పొల్యుషన్, ఇన్సూరెన్స్ కాగితాలు సమర్పించాలి. అలాగే డ్రైవర్ వివరాల కోసం అతని ఫోటో, చిరునామా తెలిపే రేషన్, ఓటర్, ఆధార్లో ఏదైనా ఒక కార్డు, సెల్నంబర్ ఇవ్వాలి. ఇక వాహన యజమాని వివరాలకై చిరునామా తెలిపే ఏదేని ప్రభుత్వ కార్డు, సెల్నంబర్ ఇవ్వాల్సి ఉంది. ఫారాలు కూకట్పల్లి ట్రాఫిక్ ఠాణాలో లభిస్తాయి. మార్చి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది. ప్రతి ఏటా క్యాబ్లు పోలీసుల వద్ద రెన్యూవల్ చేయించుకోవాలి.రిజిస్ట్రేషన్ కోసం రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. క్యాబ్ వివరాలు క్షణాల్లో... క్యాబ్లకు పోలీసులు ప్రత్యేకంగా క్యూర్ నంబర్ను కేటాయిస్తారు. డ్రైవర్ ఫోటో, వివరాలతో కూడిన స్టిక్కర్ను వాహనం లోపల, బయటి వ్యక్తులకు కనిపించేలా అతికించాలి. స్టిక్కర్లో ఉన్న కోడ్ నంబర్ను మొబైల్ యాప్ ద్వారా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ సెల్నంబర్ 8500411111కు ఎస్ఎంఎస్ చేస్తే క్షణాల్లో వాహనం, డ్రైవర్ పూర్తి వివరాలు అందుతాయి. ఇలా పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ అయిన క్యాబ్ల వివరాలన్నీ త్వరలో ట్రాఫిక్ పోలీసు వెబ్సెట్లో పొందుపరుస్తారు. దాంతో క్యాబ్ డ్రైవర్లు నేరాలకు పాల్పడరని అధికారులు ఆశిస్తున్నారు. -
`విద్యార్థుల కృషితోనే హైటెక్ సిటీగా హైదరాబాద్`
నిజామాబాద్: విద్యార్థుల కృషితోనే హైదరాబాద్ హైటెక్ సిటీగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పారు. అయితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హైదరాబాద్ను హైటెక్ సీటీగా చేశానని గొప్పలు చెబుతున్నారని ఆమె విమర్శించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్థుల పాత్ర అనే అంశంపై సదస్సుకు కవిత గురువారం హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చకు వచ్చిన నేపథ్యంలో తెలంగాణను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. అయితే అది కాస్తా మెంటల్గేమ్గా తేలిపోయిందని కవిత ఎద్దేవా చేశారు. -
‘దుర్గం’పైసుందర మార్గం
రూ. 250 కోట్లతో వేలాడే వంతెన సందర్శకులను ఆకట్టుకునేలా ‘హౌరా’ తరహాలో ఏర్పాటు జూబ్లీహిల్స్- హైటెక్సిటీ రోడ్డులో తప్పనున్న ‘జాం’జాటం సాక్షి, సిటీబ్యూరో : ఓవైపు .. జూబ్లీహిల్స్ నుంచి హైటెక్సిటీ, మాదాపూర్ల వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ జాంజాటాన్ని తప్పిస్తూనే, మరోవైపు.. పర్యాటక కేంద్రంగానూ సందర్శకులను ఆకట్టుకునేలా ఓ అందమైన వంతెన నగరంలో అందుబాటులోకి రానుంది. ఎలాంటి స్తంభాల ఆధారం లేకుండా ఏర్పాటు కానున్న ఈ వేలాడే వంతెన(సస్పెన్షన్ బ్రిడ్జి)ను దుర్గం చెరువుపై నిర్మించనున్నారు. హౌరా- కోల్కతాల మధ్య ఉన్న హౌరా బ్రిడ్జిని( రవీంద్ర సేతు) తలపించే ఈ వంతెనను జీహెచ్ఎంసీ, ఏపీఐఐసీ, పర్యాటకశాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) బాధ్యతను ఏపీఐఐసీ.. ‘రైల్ ఇండియా టెక్నో, ఎకనామిక్, సర్వీసెస్(రైట్స్)’కు అప్పగించింది. అది ట్రాఫిక్, పర్యావరణం, చెరువుపై నిర్మాణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని క్షేత్రస్థాయి సర్వేతో డీపీఆర్ను పూర్తిచేసింది. నిర్మాణవ్యయాన్ని రూ. 250 కోట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ బ్రిడ్జి ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆయా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల నేతృత్వంలో సాంకేతిక, స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఏపీఐఐసీ టూరిజం, జీహెచ్ఎంసీల అధికారులు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీలు త్వరలో సమావేశమై బ్రిడ్జి పనులకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నాయి. ఏయే ప్రభుత్వ విభాగాలు ఎంత వ్యయాన్ని భరించాలనే అంశాలను సైతం త్వరలో జరగబోయే సమావేశాల్లో నిర్ణయించనున్నారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి సమీప ప్రాంతం నుంచి మాదాపూర్ ఇనార్బిట్మాల్ వరకు ఈ వంతెనను నిర్మించనున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. ఆరు లేన్లతో నిర్మించే ఈ వంతెన పొడవు 350 మీటర్లు. దీని ట్రాఫిక్ సామర్ధ్యం 7000 పీసీయూ (పర్ అవర్ కార్ యూనిట్). అంటే గంట సమయంలో ప్రయాణించే వాహనాలు. హౌరా బ్రిడ్జి సామర్ధ్యం రోజుకు దాదాపు లక్ష వాహనాలు. ఈ బ్రిడ్జి వాడుకలోకి వస్తే జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36పై వాహన భారం తగ్గుతుంది. -
నగరం వెలుపలే నిలిచిపోతున్న రైళ్లు
సాక్షి, సిటీబ్యూరో : విశాఖ నుంచి హైదరాబాద్ ఆగమేఘాల మీద పయనమయ్యాడు హరీష్. హైటెక్సిటీలోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఐదంకెల జీతంతో కూడిన ఉద్యోగం వచ్చింది తనకు. కల నెరవేరబోతోందని సంతోషంగా విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కేశాడు. హైదరాబాద్ నగర శివార్ల వరకు ఎలాంటి బ్రేకులు లేకుండా పట్టాలపై వాయువేగంతో పరుగులు తీసిన ఆ ట్రైన్కు ఘట్కేసర్ నుంచే బ్రేకులు మొదలయ్యాయి. ఆగుతూ, సా..గుతూ రైలు కదులుతోంది. ఉదయం 10 గంటలకు తాను హెటెక్సిటీకి చేరుకోవాలి. చర్లపల్లి నుంచి నుంచి మౌలాలీ వరకు రావడానికే గంటకు పైగా గడిచింది. అప్పటికే ఉదయం 8 అయింది. మౌలాలీ సమీపంలో రైలు ఠకీమని ఆగిపోయింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్లాట్ఫామ్ ఖాళీగా లేకపోవడంతో ఉదయం 8.30 వరకు ఆ ట్రైన్ అక్కడే నిలిపివేశారు. ట్రైన్ దిగి వెళ్లలేక, స్టేషన్కు చేరుకోలేక మిగతా ప్రయాణికులతో పాటు హరీష్ ఆ ట్రైన్లోనే పడిగాపులు కాయల్సి వచ్చింది. చివరకు అరగంటకు పైగా ఆలస్యంగా ఆ ట్రైన్ సికింద్రాబాద్ చేరుకుంది. దీంతో అతను సకాలంలో సదరు సాఫ్ట్వేర్ సంస్థకు చేరుకోలేకపోయాడు. ఉద్యోగం పోయి ఉస్సూరంటూ వెనుదిరిగాడు. ఇది ఒక్క హరీష్ సమస్యే కాదు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు సకాలంలో చేరుకోకపోవడం వల్ల ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు తీవ్ర బ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరానికి చేరుకొనే రైళ్లు ప్రతిరోజు నిర్ణీత సమయానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకోలేకపోతున్నాయి. ఉదయం ప్లాట్ఫామ్లపై రద్దీ కారణంగా చాలా రైళ్లను శివార్లలోనే నిలిపివేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర దుర్గంధాన్ని భరిస్తూ, సకాలంలో గమ్యం చేరుకోలేక రైళ్లలోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఉదయం 7.45 గంటలకు రావలసిన సింహపురి ఎక్స్ప్రెస్ 8.30 గంటలకు చేరుకుంటుంది. తెల్లవారుజామున 6.35 గంటలకే రావలసిన గౌతమి ఎక్స్ప్రెస్ అరగంట ఆలస్యంగా వస్తుంది. చెన్నై-హైదరాబాద్ చార్మినార్ ఎక్స్ప్రెస్, దురంతో, గరీబ్థ్.్ర. ఇలా వరుసగా అన్ని రైళ్లు నగర శివార్లలోనే నిలిచిపోతున్నాయి. వందల కొద్దీ కిలోమీటర్లు ప్రయాణం చేసి, గంటల కొద్దీ రైళ్లలో గడిపి, ఇప్పుడో ఇంకొద్ది సేపటికో స్టేషన్కు చేరుకుంటామనుకొనే ప్రయాణికులను ఆలస్యం తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. తీరని వ్యథ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.. పది ప్లాట్ఫామ్లు.. ప్రతిరోజు లక్షా 50 వేల మంది ప్రయాణికుల రాకపోకలు.. వందల కొద్దీ రైళ్ల హాల్టింగ్.. ఉదయం నాలుగింటి నుంచే రైళ్ల ఆగమనం.. ప్లాట్ఫామ్ల రద్దీ.. కానీ ఏ ఒక్క రైలూ సకాలంలో స్టేషన్కు చేరుకున్న దాఖలా కనిపించదు. ప్రతిరోజు 80కి పైగా ఎక్స్ప్రెస్లు, వంద ప్యాసింజర్ రైళ్లు, మరో 122 సబర్బన్, ఎంఎంటీఎస్ రైళ్లు సికింద్రాబాద్ కేంద్రంగానే నడుస్తాయి. పైగా ప్రతి సంవత్సరం 3 నుంచి 4 కొత్త రైళ్లు వచ్చి చేరుతున్నాయి. దీంతో ఉదయం సాయంత్రం రద్దీ వేళల్లో వచ్చే రైళ్లు, వెళ్లే రైళ్లతో స్టేషన్పై ఒత్తిడి తారస్థాయికి చేరుకుంది. ఒక రైలు ప్లాట్ఫామ్ వదిలితే కానీ మరో రైలు స్టేషన్లోకి ప్రవేశించడం సాధ్యం కాదు. దీంతో చాలా రైళ్లు నగర శివార్లలోనో, సమీప స్టేషన్లలోనో నిలిచిపోతున్నాయి. ప్రయాణికులకు మాత్రం గమ్యస్థానానికి దగ్గర్లోనే ఉన్నట్లనిపిస్తుంది. కానీ ఎప్పుడు స్టేషన్కు చేరుకుంటారో తెలియని అనిశ్చితి. ఇక వాళ్ల కోసం స్టేషన్లో బంధుమిత్రుల పడిగాపులు. ఆపదలో ఉన్నవారికి, అత్యవసరమైన పనుల్లో వచ్చేవాళ్లకు ఈ జాప్యం మరిన్ని కష్టాలను, బాధలను తెచ్చిపెడుతోంది. ఆచరణకు నోచని అభివృద్ధి సికింద్రాబాద్పై ఒత్తిడిని తగ్గించేందుకు ఎయిర్లెవల్ కన్స్ట్రక్షన్స్ కట్టిం చి ప్లాట్ఫామ్లు పెంచాలని ప్రతిపాదించిన వరల్డ్క్లాస్ ప్రమాణాలు 2008 నుంచి ఆచరణకు నోచుకోలేదు. అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో స్టేషన్ను అభివృద్ధి చేసి ప్లాట్ఫామ్లు పెంచాలని ప్రతిపాదించారు. {పయాణికుల మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నట్లు పదేపదే ప్రకటించే దక్షిణమధ్య రైల్వే నగర శివార్లలోని రైల్వేస్టేషన్ల విస్తరణను మాత్రం విస్మరించింది. {పస్తుతం 2 ప్లాట్ఫామ్లు ఉన్న మౌలాలీ స్టేషన్లో నాలుగు ప్లాట్ఫామ్లు నిర్మించవచ్చు. దానివల్ల సైనిక్పురి, ఏఎస్రావునగర్, ఈసీఐఎల్, చర్లపల్లి తార్నాక, సీతాఫల్మండి, ఉప్పల్ తదితర ప్రాంతాల ప్రయాణికులకు ఊరట లభిస్తుంది. తద్వారా సికింద్రాబాద్పై ఒత్తిడి తగ్గుతుంది. కొన్ని రైళ్లను మౌలాలీ వరకే పరిమితం చేయవచ్చు. మల్కాజిగిరి స్టేషన్లో ప్రస్తుతం 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. మరో 3 ప్లాట్ఫామ్లు కట్టేందుకు కావలసిన స్థలం ఉంది. ఈ స్టేషన్లో మౌలిక సదుపాయాలు, అదనపు ట్రాక్ల నిర్మాణం వల్ల నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్కు వచ్చే రైళ్లను ఇక్కడ నిలిపేందుకు అవకాశం ఉంటుంది. హైటెక్సిటీలోని ఎంఎంటీఎస్ స్టేషన్ను అభివృద్ధి చేయడం వల్ల ముంబై మీదుగా వచ్చే రైళ్లను అక్కడ నిలిపేందుకు అవకాశం లభిస్తుంది. ఈ ప్రతిపాదనలేవీ అమలుకు నోచుకోలేదు. ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. -
పేరుకే హైటెక్ సిటీ...అంతా లోటెక్కే
-
మలుపు తిరిగిన కిడ్నాప్.. సాఫ్ట్వేర్ యువతిపై రేప్
-
ట్రాఫిక్ వలయంలో సిటీ బస్సు..
సాక్షి, సిటీబ్యూరో : ఆర్టీసీ మెట్రో ఎక్స్ప్రెస్. ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ నుంచి కొండాపూర్కు బయలుదేరింది. అప్పటికి అరగంట గడిచింది. బస్సు ఇంకా ప్యారడైజ్ దాటి ముందుకు వెళ్లలేదు. పదకొండోసారి ఫోన్ చూసుకున్నాడు శ్రీకాంత్. ఠంచన్గా 9 గంటలకు ఆఫీసులో ఉండాలి. కానీ పుణ్యకాలం కాస్తా సికింద్రాబాద్లోనే గడిచిపోతోంది. గడియారంలో పరుగులు తీస్తున్న నిమిషాల ముల్లు చూసుకొని బెంబేలెత్తాడు. మరో ఆలోచనకు తావు లేకుండా బస్సులోంచి కిందకు దూకి నంత పని చేశాడు. కనిపించిన ఆటో ఎక్కేసి ఆఫీస్ అడ్రస్ చెప్పాడు. రూ.750 చెల్లించి నెలవారీ బస్పాస్ తీసుకున్నప్పటికీ తరచుగా బస్సుల జాప్యం కారణంగా తనకు ఆటో చార్జీలు తప్పడం లేదు. ఇది హైటెక్ సిటీ లోని ఓ కంపెనీలో పనిచేసే శ్రీకాంత్ ఒక్కరి సమస్యే కాదు. సిటీ బస్సును నమ్ముకొని ఉదయం ఆఫీసులకు, సాయంత్రం ఇళ్లకు ప్రయాణాలు చేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రయాణికులంతా ఎదుర్కొంటున్న ఇబ్బంది. ఇటీవల బస్సుల వేగం దారుణంగా పడిపోతోంది. గంట గడిచినా పట్టుమని 10 కిలోమీటర్లు కూడా ప్రయాణం ముందుకు సాగడం లేదు. రోజురోజుకూ జటిలమవుతున్న వాహనాల రద్దీ, కుంచించుకుపోతున్న రోడ్లు, డొక్కు బస్సులు, బ్రేక్డౌన్లు సిటీ ప్రయాణాన్ని నరకప్రాయం చేస్తున్నాయి. నగర శివార్లలో సైతం పోటెత్తుతున్న ట్రాఫిక్తో ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాలన్నా సమయం బస్సులోనే గడిచిపోతోంది. నత్తలు నయం... ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్పేట్ వంటి ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో మూడు నిమిషాలకు కిలోమీటర్ చొప్పున... వాహనాల రద్దీ తక్కువగా ఉన్న శివారు రహదారులపైన రెండున్నర నిమిషాలకు కిలోమీటర్ చొప్పున ఆర్డినరీ బస్సులకు రన్నింగ్ టైమ్ విధించారు. ఈ లెక్కన గంటకు కనీసం 20 కిలోమీటర్ల వరకు వెళ్లాలి. కానీ ఈ బస్సులు గంటకు 10 కి.మీ. కూడా ముందుకు కదలడం లేదు. అలాగే మెట్రో ఎక్స్ప్రెస్లు, డీలక్స్లు, ఏసీ బస్సులు రద్దీ ప్రాంతాల్లో రెండున్నర నిమిషాలకు కిలోమీటర్ చొప్పున, శివార్లలో 2 నిమిషాలకు కిలోమీటర్ చొప్పున వెళ్లాలి అంటే 45 నిమిషాల్లో సుమారు 20 కి.మీ. వెళ్లాల్సిన మెట్రో బస్సులు సైతం ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్లపైనే చిక్కుకొని పోతున్నాయి. 28 కి.మీ. ఉన్న సికింద్రాబాద్-కొండాపూర్ మార్గంలో ఆర్డినరీ బస్సులు గంటా 10 నిమిషాల్లో గమ్యం చేరుకోవలసి ఉండగా రెండు గంటలు దాటుతోంది. మెట్రో, ఏసీ బస్సులు కూడా అదే సమయానికి చేరుకుంటున్నాయి. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు రద్దీ కారణంగా బస్సులు రోడ్లపై నిలిచిపోయి అంగుళం కూడా ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. మెట్రో పనులు జరగుతున్న మార్గాల్లో ఈ పరిస్థితి మరింత భయానకంగా మారింది. రోడ్లపైనే నిల్చిపోతున్న పలు బస్సులు ఇటీవల వరుసగా కురిసిన వర్షాల కారణంగా వందలాది బస్సుల్లో విడిభాగాలు దెబ్బతిన్నాయి. ఈ బస్సులు సకాలం లో మరమ్మతులకు నోచుకోపోవడం వల్ల ఎక్కడికక్కడ నిలి చిపోతున్నాయి. పదిరోజుల క్రితం దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన ఒక బస్సుకు నాగోల్ వద్ద రాడ్ ఊడిపోయింది. డ్రైవ ర్ అప్రమత్తత వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. కొన్ని బస్సులకు రియర్వ్యూలు కూడా ఉండడం లేదు. రాత్రి పూట హెడ్లైట్లు వెలగని బస్సులు కూడా ఉన్నాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విడిభాగాల కొరత వల్ల వివిధ డిపోల పరిధిలో బ్రేక్డౌన్లు బాగా పెరిగాయి. రోజూ 15 నుంచి 20 బస్సులు రోడ్లపైనే నిలిచిపోతున్నాయి. తగ్గిన ప్రయాణికులు సకాలంలో గమ్యానికి చేర్చలేని సిటీ బస్సులకు ప్రయాణికులు దూరమవుతున్నారు. ఆటోరిక్షా లు, సెవెన్సీటర్ ఆటోలు, కార్లు వంటి ప్రత్యామ్నాయ వాహనాలవైపు మళ్లుతున్నారు. బస్సు ల నిర్వహణలోని వైఫల్యం కారణంగా ఇటీవల ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య దారుణంగా పడిపోయినట్లు అంచనా. లక్షలాదిమంది ప్రయాణికులు ఆర్టీసీకి దూరమయ్యారు.