ICC ODI rankings
-
Shubman Gill: పరుగుల వేటగాడు.. మిస్టర్ నంబర్ వన్
అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు అధిరోహిస్తున్న 25 ఏళ్ల శుభ్మన్ గిల్(Shubman Gill) ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో వరల్డ్ నంబర్వన్ ర్యాంకర్గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో భారత జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికైన అతడు బ్యాటర్గానూ ఇరగదీస్తున్నాడు. అంతా కలిసొస్తే భవిష్యత్లో భారత భావి కెప్టెన్గా గిల్ను చూడవచ్చు.... పంజాబ్ యువ ఓపెనర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన గిల్ ప్రస్థానం వర్దమాన ఆటగాళ్లకు ఆదర్శం.బ్యాట్ పట్టగానే ఆ కుర్రాడు తన పరుగుల వేట ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపెట్టాడు. అంతర్ జిల్లా అండర్–16 క్రికెట్ టోర్నీ మ్యాచ్లో 351 పరుగులు చేసి ప్రకంపనలు రేపాడు. అదే ఊపులో విజయ్ మర్చంట్ ట్రోఫీ అరంగేట్రంలోనే అజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. అండర్–19 జాతీయ జట్టుకు సులువుగానే ఎంపికయ్యాడు. అప్పటికే ఓపెనర్గా రాటుదేలిన ఆ కుర్రాడు 2018లో జరిగిన అండర్–19 ప్రపంచకప్ టోర్నీలో విశ్వరూపం ప్రదర్శించాడు.న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఆ టోర్నీలో 372 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవడంతో పాటు ’ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కించుకొని యువభారత జట్టు ట్రోఫీ చేజిక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తదనంతరం అండర్–19 ప్రదర్శనతో అనతి కాలంలోనే జాతీయ సీనియర్ జట్టుకు ఎంపికయ్యాడు. మనం చెప్పుకున్న ఈ విశేషాలన్నీ పంజాబ్ యువ క్రికెటర్ శుభ్మన్ గిల్ గురించే. సీనియర్ ప్లేయర్లు ఉన్న జట్టుకు వైస్ కెప్టెన్విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, షమీ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్న జట్టుకు గిల్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడంటే అతడి ప్రతిభ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. మూడు ఫార్మాట్లలోనూ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన గిల్ ముఖ్యంగా వన్డేల్లో తన అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు.2019లో న్యూజిలాండ్పై అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన గిల్ ఇప్పటి వరకు 52 మ్యాచ్లు ఆడి 62.13 సగటుతో 2734 పరుగులు సాధించాడు. క్రీజులో నిలదొక్కుకుంటే చాలు భారీ ఇన్నింగ్స్లు ఆడతాడనే గుర్తింపు తెచ్చుకున్న గిల్ ఇప్పటికే ఒక డబుల్ సెంచరీ, 8 సెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు.మూడు ఫార్మాటల్లో సెంచరీలు చేసిన అతికొద్దిమంది ఆటగాళ్లలో ఒకడైన గిల్ ఇటీవల ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో వీరవిహారం చేశాడు. మూడు మ్యాచ్లలో ఒక సెంచరీ రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసుకొని ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తిరిగి అగ్రస్థానం దక్కించుకున్నాడు.అండర్–19 స్థాయిలోనే గిల్ కంటే మెరుగైన నైపుణ్యం ఉన్న ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ప్రపంచకప్ అందించిన పృథ్వీ షా ఇప్పుడు టీమిండియా సెలక్షన్ దరిదాపుల్లో కూడా లేకుండా పోగా ప్రతిభకు క్రమశిక్షణ జోడించిన శుభ్మన్ గిల్ ‘ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి’ అనే ప్రాథమిక సూత్రాన్ని పాటిస్తున్నాడు. 2023 ఐపీఎల్ సీజన్ గుజరాత్ టైటాన్స్ తరఫున 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్న గిల్ ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీ సారథిగా కొనసాగుతున్నాడు. – ఇంతియాజ్ మొహమ్మద్చదవండి: CT 2025 Aus Vs Afg: వరుణుడు కరుణిస్తే... -
ఐదో స్థానానికి ఎగబాకిన విరాట్.. టాప్-10లో నలుగురు టీమిండియా బ్యాటర్లు
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో (ICC ODI Rankings) భారత బ్యాటర్ల హవా కొనసాగింది. టాప్-10లో ఏకంగా నలుగురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. శుభ్మన్ గిల్ (Shubman Gill) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రోహిత్ (Rohit Sharma) మూడు, విరాట్ (virat Kohli) ఐదు, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తొమ్మిది స్థానాల్లో ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్పై సెంచరీ చేయడంతో విరాట్ ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి చేరాడు. తాజా ర్యాంకింగ్స్లో ఛాంపియన్స్ ట్రోఫీ సెంచరీ హీరోలు గణనీయంగా లబ్ది పొందారు. విల్ యంగ్ 8 స్థానాలు మెరుగుపర్చుకుని 14వ స్థానానికి.. బెన్ డకెట్ 27 స్థానాలు మెరుగుపర్చుకుని 17వ స్థానానికి.. రచిన్ రవీంద్ర 18 స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానానికి.. టామ్ లాథమ్ 11 స్థానాలు మెరుగుపర్చుకుని 31వ స్థానానికి.. జోస్ ఇంగ్లిస్ 18 స్థానాలు మెరుగుపర్చుకుని 88వ స్థానానికి చేరారు. టాప్-10లో భారత బ్యాటర్లతో పాటు బాబర్ ఆజమ్ (2), హెన్రిచ్ క్లాసెన్ (4), డారిల్ మిచెల్ (6), హ్యారీ టెక్టార్ (7), చరిత్ అసలంక (8), షాయ్ హోప్ (10) ఉన్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టాప్-10లో కుల్దీప్ (3వ స్థానం) మినహా భారత్కు ప్రాతినిథ్యం లేదు. లంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ టాప్లో కొనసాగుతుండగా.. రషీద్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. కేశవ్ మహారాజ్, బెర్నాల్డ్ స్కోల్జ్, మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్, గుడకేశ్ మోటీ, షాహీన్ అఫ్రిది, ఆడమ్ జంపా టాప్-10లో ఉన్నారు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టాప్-10లో ఎలాంటి మార్పులు లేవు. మొహమ్మద్ నబీ, సికందర్ రజా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మెహిది హసన్ మిరాజ్, రషీద్ ఖాన్, మిచెల్ సాంట్నర్, మ్యాక్స్వెల్, బ్రాండన్ మెక్ముల్లెన్, రవీంద్ర జడేజా, గెర్హార్డ్ ఎరాస్మస్ టాప్-10లో కొనసాగుతున్నారు. ఈ వారం ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో ఒకే ఒక చెప్పుకోదగ్గ మార్పు జరిగింది. న్యూజిలాండ్ ఆటగాడు మైఖేల్ బ్రేస్వెల్ ఏకంగా 26 స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి చేరాడు.జట్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా ఎవరికీ అందనంత ఎత్తులో టాప్ ప్లేస్లో కొనసాగుతుంది. ఆసీస్, పాకిస్తాన్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఆతర్వాతి స్థానాల్లో నిలిచాయి. -
అగ్రపీఠాన్ని అధిరోహించిన శుభ్మన్ గిల్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. గత వారం ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉండిన గిల్.. ఓ స్థానం మెరుగుపర్చుకుని టాప్ ర్యాంక్కు చేరాడు. నంబర్ వన్ స్థానానికి చేరే క్రమంలో గిల్ పాక్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ను వెనక్కు నెట్టాడు. ప్రస్తుత ర్యాంకింగ్స్లో బాబర్ 773 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్, విరాట్, ధోని తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానానికి చేరిన నాలుగో భారత బ్యాటర్గా గిల్ రికార్డుల్లోకెక్కాడు. వన్డే ర్యాంకింగ్స్లో గిల్ నంబర్ స్థానానికి చేరడం ఇది తొలిసారి కాదు. 2023 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ గిల్ టాప్ ర్యాంక్లో ఉన్నాడు. ప్రస్తుతం గిల్ ఖాతాలో 796 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. గిల్కు రెండో స్థానంలో ఉన్న బాబర్కు మధ్య 23 పాయింట్ల వ్యత్యాసం ఉంది.ఈ వారం ర్యాంకింగ్స్లో గిల్తో కలుపుకుని భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లు టాప్-10లో ఉన్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో.. విరాట్ కోహ్లి ఆరులో.. శ్రేయస్ అయ్యర్ 9వ స్థానంలో నిలిచారు. గత వారంతో పోలిస్తే శ్రేయస్ ఓ ర్యాంక్ మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి చేరాడు. తాజా ర్యాంకింగ్స్లో సౌతాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ నాలుగులో, న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్ ఐదులో.. ఐర్లాండ్ ఆటగాడు హ్యారీ టెక్టార్ ఏడులో.. లంక కెప్టెన్ అసలంక ఎనిమిదిలో.. షాయ్ హోప్ పదో స్థానంలో ఉన్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ను కిందకు దించి లంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ టాప్ ర్యాంక్కు చేరుకున్నాడు. భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ ఓ స్థానం మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి చేరాడు. భారత్ నుంచి టాప్-10లో కుల్దీప్తో పాటు సిరాజ్ (10వ ర్యాంక్) మాత్రమే ఉన్నాడు. నమీబియా బౌలర్ బెర్నాల్డ్ స్కోల్జ్ మూడులో.. షాహీన్ అఫ్రిది ఐదులో.. కేశవ్ మహారాజ్ ఆరులో.. మిచెల్ సాంట్నర్ ఏడులో .. మ్యాట్ హెన్రీ ఎనిమిదిలో.. గుడకేశ్ మోటీ తొమ్మిది స్థానాల్లో ఉన్నారు.ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ మొహమ్మద్ నబీ టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా రెండో స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి రవీంద్ర జడేజా ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. జడ్డూ 217 రేటింగ్ పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు. జట్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా టాప్ ర్యాంక్లో కొనసాగుతుంది. భారత్.. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకు అందనంత ఎత్తులో ఉంది. ఇరు జట్లకు మధ్య దాదాపు 800 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది. -
బాబర్ను దించి అగ్రపీఠాన్ని అధిరోహించనున్న గిల్
టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో (ICC ODI Rankings) అగ్రపీఠాన్ని అధిరోహించనున్నాడు. ఈ వారం ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్న గిల్ (781 రేటింగ్ పాయింట్లు).. వచ్చే బుధవారం వెలువడే ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంక్కు చేరుకోనున్నాడు. ఇప్పటిదాకా టాప్ ర్యాంక్లో ఉన్న పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ (Babar Azam) (786).. ఇవాళ (ఫిబ్రవరి 14) న్యూజిలాండ్తో జరుగుతున్న ట్రై సిరీస్ ఫైనల్లో విఫలమయ్యాడు. బాబర్కు గిల్కు మధ్య కేవలం ఐదు పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఈ బుధవారం ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో గిల్ సెంచరీ చేశాడు. ఈ వారం ర్యాంకింగ్స్లో ఇది పరిగణలోకి రాలేదు. కాబట్టి వచ్చే వారం ర్యాంకింగ్స్లో ఈ సెంచరీ తాలుకా పాయింట్లు గిల్కు యాడ్ అవుతాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్కు (బంగ్లాదేశ్తో) ముందే గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో బాబర్ను కిందకు దించి టాప్ ర్యాంక్కు చేరుకుంటాడు.రేసులో రోహిత్ కూడా..!వన్డే ర్యాంకింగ్స్ టాప్ ర్యాంక్ రేసులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా ఉన్నాడు. ఈ వారం ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉన్న రోహిత్.. ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ ఆడితే గిల్ను సైతం వెనక్కునెట్టి టాప్ ర్యాంక్కు చేరుకుంటాడు. ప్రస్తుతం టాప్ ర్యాంక్లో ఉన్న బాబర్కు రోహిత్కు మధ్య కేవలం 13 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. బాబర్ ఖాతాలో 786 పాయింట్లు ఉండగా.. రోహిత్ ఖాతాలో 773 పాయింట్లు ఉన్నాయి.చరిత్ర సృష్టించిన బాబర్న్యూజిలాండ్తో జరుగుతున్న ట్రై సిరీస్ ఫైనల్లో విఫలమైనా పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హాషిమ్ ఆమ్లాతో కలిసి రికార్డు షేర్ చేసుకున్నాడు. ఆమ్లా, బాబర్కు తలో 123 ఇన్నింగ్స్ల్లో 6000 పరుగులు పూర్తి చేశారు. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన టాప్-5 ఆటగాళ్ల జాబితాలో బాబర్, ఆమ్లా తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. విరాట్ 136 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని తాకితే.. కేన్ మామ, వార్నర్ భాయ్ తలో 139 ఇన్నింగ్స్ల్లో 6000 పరుగుల క్లబ్లో చేరారు.ట్రై సిరీస్ ఫైనల్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 41.5 ఓవర్ల అనంతరం ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్లో ఇప్పటివరకు ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కాలేదు. రిజ్వాన్ 46, సల్మాన్ అఘా 45, తయ్యబ్ తాహిర్ 38, బాబర్ ఆజమ్ 29 పరుగులు చేశారు. ఖుష్దిల్ షా (6), ఫమీమ్ అష్రఫ్ (1) క్రీజ్లో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ, మైఖేల్ బ్రేస్వెల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. నాథన్ స్మిత్, జేకబ్ డఫీ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
బాబర్ ఆజమ్ టాప్ ర్యాంక్కు అతి చేరువగా శుభ్మన్ గిల్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో (ICC ODI Rankings) టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) రెండో స్థానానికి ఎగబాకాడు. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam) టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. బాబర్కు గిల్కు మధ్య రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. గిల్ మరో 6 పాయింట్లు సాధిస్తే బాబర్ ఆజమ్కు కిందకు దించి టాప్ ర్యాంక్కు చేరుకుంటాడు. గిల్ రెండో స్థానానికి చేరడంతో అప్పటివరకు ఆ స్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మూడో స్థానానికి పడిపోయాడు. వచ్చే వారం ప్రకటించే ర్యాంకింగ్స్లో రోహిత్కు కూడా అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. మూడో స్థానంలో ఉన్న రోహిత్కు టాప్ ప్లేస్లో ఉన్న బాబర్కు మధ్య కేవలం 13 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ప్రస్తుతం బాబర్ ఖాతాలో 786 పాయింట్లు, గిల్ ఖాతాలో 781, రోహిత్ ఖాతాలో 773 పాయింట్లు ఉన్నాయి.ఈ వారం ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి రెండు స్థానాలు కోల్పోయాడు. గత వారం నాలుగో ప్లేస్లో ఉన్న కోహ్లి.. ఇంగ్లండ్తో రెండో వన్డేలో విఫలం కావడంతో ఆరో స్థానానికి పడిపోయాడు. ఇంగ్లండ్తో తొలి రెండు వన్డేల్లో రాణించిన భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ ఓ స్థానం మెరుగుపర్చుకుని 10వ స్థానానికి చేరుకున్నాడు. ఈ వారం టాప్-10 బ్యాటర్ల ర్యాంకింగ్స్లో నలుగురు భారత బ్యాటర్లు ఉన్నారు. ఐర్లాండ్ ఆటగాడు హ్యారీ టెక్టార్ నాలుగో స్థానంలో, హెన్రిచ్ క్లాసెన్ ఐదులో, డారిల్ మిచెల్ ఏడులో, షాయ్ హోప్, రహ్మానుల్లా గుర్భాజ్ ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లండ్తో నిన్న జరిగిన మూడో వన్డే తాజా ర్యాంకింగ్స్ పరిగణలోకి రాలేదు.వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. రషీద్ ఖాన్ అగ్రస్థానానికి నిలబెట్టుకున్నాడు. మహీశ్ తీక్షణ ఓ స్థానం మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకాడు. నమీబియా బౌలర్ బెర్నార్డ్ స్కోల్జ్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో ప్లేస్కు చేరాడు. పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది నాలుగో స్థానాన్ని కాపాడుకోగా.. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు కోల్పోయి ఐదో ప్లేస్కు పడిపోయాడు. ఇంగ్లండ్తో తాజాగా జరిగిన సిరీస్కు దూరంగా ఉన్న మొహమ్మద్ సిరాజ్ నాలుగు స్థానాలు కోల్పోయి 10వ ప్లేస్కు పడిపోయాడు. తాజా ర్యాంకింగ్స్లో భారత్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే టాప్-10లో ఉన్నారు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో మొహమ్మద్ నబీ టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. రవీంద్ర జడేజా 10వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. -
అగ్రస్థానాల్లో పాకిస్తాన్ ఆటగాళ్లు..!
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ ఆటగాళ్లు సత్తా చాటారు. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది బౌలర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అఫ్రిది ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో ఇరగదీశాడు. మూడు మ్యాచ్ల ఆ సిరీస్లో అఫ్రిది 12.62 సగటున ఎనిమిది వికెట్లు తీశాడు. తాజా ర్యాంకింగ్స్లో అఫ్రిది మూడు స్థానాలు ఎగబాకగా.. టాప్ ప్లేస్లో ఉండిన కేశవ్ మహారాజ్ రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.తాజా ర్యాంకింగ్స్లో అఫ్రిదితో పాటు అతని సహచరుడు హరీస్ రౌఫ్ కూడా భారీగా లబ్ది పొందాడు. ఆసీస్పై సంచలన ప్రదర్శనల (3 మ్యాచ్ల్లో 10 వికెట్లు) అనంతరం రౌఫ్ 14 స్థానాలు మెరుగుపర్చుకుని 13వ స్తానానికి ఎగబకాడు. అలాగే మరో పాక్ బౌలర్ నసీం షా కూడా ర్యాంకింగ్స్లో సత్తా చాటాడు. నసీం 14 స్థానాలు మెరుగుపర్చుకుని 55వ ర్యాంక్కు చేరుకున్నాడు. భారత్ నుంచి కుల్దీప్ యాదవ్ (4), జస్ప్రీత్ బుమ్రా (6), మొహమ్మద్ సిరాజ్ (7) టాప్-10లో ఉన్నారు.బ్యాటింగ్ విషయానికొస్తే.. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్లో బాబర్ 80 పరుగులు చేసి రెండు మ్యాచ్ల్లో అజేయంగా నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్లో షాహీన్ అఫ్రిది టాప్ ప్లేస్కు చేరడంతో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పాక్ ఆటగాళ్లే అగ్రస్థానాలను ఆక్రమించినట్లైంది. తాజా ర్యాంకింగ్స్లో ప్రస్తుత పాక్ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ కూడా రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 23వ స్థానానికి చేరాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో 11 స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానానికి ఎగబాకాడు. తాజాగా న్యూజిలాండ్తో జరిగిన వన్డేలో 98 పరుగులు చేసిన బంగ్లా ఆటగాడు మహ్మదుల్లా 10 స్థానాలు మెరుగుపర్చుకుని 44వ స్థానానికి చేరాడు. టాప్-10 ర్యాంకింగ్స్లో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి వరుసగా 2 నుంచి 4 స్థానాల్లో నిలిచారు.ఆల్రౌండర్ల విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన మొహమ్మద్ నబీ టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా.. జింబాబ్వే సికందర్ రజా రెండో స్థానంలో, రషీద్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నారు. బంగ్లాదేశ్ ఆల్రౌండర్ మెహిది హసన్ మీరాజ్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి ఎగబాకాడు. భారత్ నుంచి రవీంద్ర జడేజా 14వ స్థానంలో ఉన్నాడు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన రోహిత్ శర్మ
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. గత వారం ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉన్న హిట్మ్యాన్.. ఓ ర్యాంక్ను మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకాడు. రోహిత్కు కెరీర్లో ఇదే అత్యుత్తమ వన్డే ర్యాంక్. శ్రీలంకతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్లో రోహిత్ రెండు హాఫ్ సెంచరీలు సహా 157 పరుగులు సాధించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, రోహిత్ రెండో ర్యాంక్కు ఎగబాకడంతో ఆ స్థానంలో ఉన్న శుభ్మన్ గిల్ మూడో స్థానానికి పడిపోయాడు. లంకతో సిరీస్లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయకపోయనా విరాట్ కోహ్లి నాలుగో స్థానాన్ని కాపాడుకున్నాడు. ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టార్ ఓ స్థానం మెరుగుపర్చుకుని విరాట్తో సమానంగా నాలుగో స్థానానికి చేరుకోగా.. పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. భారత్తో సిరీస్లో మెరుగైన ప్రదర్శన చేసిన లంక ఓపెనర్ పథుమ్ నిస్సంక ఓ స్థానం మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి చేరగా.. డారిల్ మిచెల్, డేవిడ్ వార్నర్, డేవిడ్ మలాన్, వాన్ డెర్ డస్సెన్ 6, 7, 9, 10 స్థానాల్లో ఉన్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. సౌతాఫ్రికాకు చెందిన కేశవ్ మహారాజ్ టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా.. హాజిల్వుడ్, ఆడమ్ జంపా, కుల్దీప్ యాదవ్, బెర్నాల్డ్ స్కోల్జ్, మొహమ్మద్ నబీ, షాహీన్ అఫ్రిది, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మహ్మద్ సిరాజ్ టాప్-10లో ఉన్నారు. వన్డే ఆల్రౌండర్ల విభాగంలో మొహమ్మద్ నబీ, షకీబ్ అల్ హసన్, సికందర్ రజా టాప్-3లో ఉన్నారు. -
ICC Rankings: మూడో స్థానానికి ఎగబాకిన రోహిత్ శర్మ
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసిన హిట్మ్యాన్ రేటంగ్ పాయింట్లు గణనీయంగా పెంచుకుని నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి చేరాడు. క్రితం వారం ర్యాంకింగ్స్లో మూడో ప్లేస్లో ఉండిన విరాట్ కోహ్లి ఓ ర్యాంక్ను కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోగా.. టీమిండియా యంగ్ గన్ శుభ్మన్ గిల్ రెండో స్థానాన్ని పదిలంగా కాపాడుకున్నాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 824 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. హ్యారీ టెక్టార్, డారిల్ మిచెల్, డేవిడ్ వార్నర్, డేవిడ్ మలాన్, నిస్సంక, డస్సెన్ టాప్ 10లో ఉన్నారు.ఐదు స్థానాలు ఎగబాకిన కుల్దీప్తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి చేరగా.. కేశవ్ మహారాజ్ టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. హాజిల్వుడ్, ఆడమ్ జంపా, కుల్దీప్, మహ్మద్ సిరాజ్, బెర్నాల్డ్ స్కోల్జ్, మహ్మద్ నబీ, బుమ్రా, షాహీన్ అఫ్రిది టాప్-10 జాబితాలో ఉన్నారు.ఆల్రౌండర్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో మహ్మద్ నబీ టాప్లో ఉండగా.. షకీబ్ అల్ హసన్, సికందర్ రజా, అస్సద్ వలా, రషీద్ ఖాన్, గెర్హార్డ్ ఎరాస్మస్, మ్యాక్స్వెల్, సాంట్నర్, మెహిది హసన్, జీషన్ మక్సూద్ టాప్-10లో ఉన్నారు. -
మూడో ర్యాంక్లో స్మృతి మంధాన (ఫొటోలు)
-
ఐసీసీ అగ్రపీఠంపై కొత్త ఆటగాడు.. ఐదేళ్ల తర్వాత..!
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మొహమ్మద్ నబీ అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ స్థానంలో దాదాపు ఐదేళ్ల పాటు కొనసాగిన బంగ్లా ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ రెండో స్థానానికి పడిపోయాడు. గాయం కారణంగా షకీబ్ వన్డేలకు దూరంగా ఉండటం.. ఈ మధ్యలో నబీ సత్తా చాటడంతో వీరిద్దరి ర్యాంక్లు తారుమారయ్యాయి. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డేలో సెంచరీతో పాటు వికెట్ తీయడంతో నబీ అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విభాగంలో భారత ఆటగాడు రవీంద్ర జడేజా 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగం టాప్-10లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగిన లంక ఆటగాడు పథుమ్ నిస్సంక 10 స్థానాలు మెరుగుపర్చుకుని 18వ స్థానానికి చేరగా.. మూడో వన్డేలో 97 పరుగులతో అజేయంగా నిలిచిన నిస్సంక సహచరుడు అసలంక 5 స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ టాప్లో కొనసాగుతుండగా.. భారత ఆటగాళ్లు శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వరుసగా 2, 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. కేశవ్ మహారాజ్ టాప్లో కొనసాగుతుండగా.. భారత బౌలర్లు సిరాజ్, బుమ్రా, కుల్దీప్ నాలుగు, ఐదు, తొమ్మిది స్థానాల్లో నిలిచారు. టెస్ట్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు చేసిన కేన్ విలియమ్సన్ టాప్ ప్లేస్ను మరింత పదిలం చేసుకోగా.. భారత ఆటగాళ్లు విరాట్ ఏడులో, పంత్, రోహిత్ శర్మ 12, 13 స్థానాల్లో నిలిచారు. టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో బుమ్రా టాప్లో కొనసాగుతుండగా.. అశ్విన్ 3, రవీంద్ర జడేజా తొమ్మిదో స్థానంలో నిలిచారు. సిరాజ్, షమీ 19, 20 స్థానాల్లో కొనసాగుతున్నారు. టెస్ట్ ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో జడేజా, అశ్విన్, అక్షర్ 1, 2, 5 స్థానాల్లో కొనసాగుతున్నారు. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ టాప్లో కొనసాగుతుండగా.. యశస్వి జైస్వాల్ ఆరో ప్లేస్లో నిలిచాడు. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆదిల్ రషీద్ టాప్లో కొనసాగుతుండగా.. భారత బౌలర్లు అక్షర్ పటేల్, రవి భిష్ణోయ్ ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు. -
నేను అప్పుడు కూడా నంబర్ వన్.. ప్రధాన లక్ష్యం మాత్రం అదే: సిరాజ్
Mohammed Siraj opens up on being No. 1 ranked ODI bowler: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ర్యాంకుల గురించి తను పట్టించుకోనని.. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఆడటం మాత్రమే ముఖ్యమని స్పష్టం చేశాడు. కాగా ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో ఈ హైదరాబాదీ బౌలర్ అదరగొట్టిన విషయం తెలిసిందే. భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023లో అద్భుత ప్రదర్శనతో మరోసారి అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. గతంలో రెండుసార్లు ‘టాప్’నకు చేరి ఆ తర్వాత తన స్థానాన్ని కోల్పోయిన సిరాజ్ ఈ ప్రపంచకప్లో 10 వికెట్ల ప్రదర్శనతో మళ్లీ నంబర్ వన్గా అవతరించాడు. మొత్తంగా 709 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంకులో ఉన్న పాకిస్తాన్ పేసర్ షాహిన్ అఫ్రిదిని వెనక్కి నెట్టి.. అగ్రపీఠాన్ని అధిరోహించాడు. ఈ నేపథ్యంలో సిరాజ్ ఐసీసీతో మాట్లాడుతూ.. తన ప్రధాన లక్ష్యం ఏమిటో వెల్లడించాడు. ‘‘నిజం చెప్పాలంటే.. గతంలో కూడా నేను నంబర్ 1గా ఉన్నాను.. ఆ తర్వాత ర్యాంకింగ్స్ విషయంలో ఎత్తుపళ్లాలు. కాబట్టి నంబర్లను నేను ఏమాత్రం పట్టించుకోను. నా ఏకైక లక్ష్యం టీమిండియా వరల్డ్కప్ గెలవడంలో నా వంతు సహకారం అందించడమే. బౌలర్గా నా ప్రదర్శన వల్ల జట్టు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు’’ అని సిరాజ్ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా సొంతగడ్డపై ప్రపంచకప్లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియా ఇప్పటి వరకు ఆడిన ఎనిమిదింట ఎనిమిది మ్యాచ్లు గెలిచింది. తాజా ఎడిషన్లో సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచిన రోహిత్ సేన లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్ నెదర్లాండ్స్తో ఆడనుంది. బెంగళూరు వేదికగా ఆదివారం ఈ మ్యాచ్ జరుగనుంది. ఇక ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో సిరాజ్ ప్రథమ స్థానంలో ఉండగా.. కుల్దీప్ యాదవ్ (4వ స్థానం), .జస్ప్రీత్ బుమ్రా (8వ స్థానం), మహ్మద్ షమీ (10వ స్థానం) టాప్-10లో చోటు దక్కించుకున్నారు. చదవండి: CWC 2023: టీమిండియాతో మ్యాచ్.. నెదర్లాండ్స్ జట్టులో కీలక మార్పు! కారణమిదే View this post on Instagram A post shared by ICC (@icc) -
చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. కోహ్లికి కూడా సాధ్యం కాలేదు
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ సత్తాచాటాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన బ్యాటర్ల ర్యాంకింగ్స్లో గిల్ అగ్రస్ధానానికి చేరుకున్నాడు. గిల్ నెంబర్ 1 ర్యాంక్ను సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. గత కొంతకాలంగా అద్బుత ప్రదర్శన కనబరుస్తున్న గిల్.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను వెనక్కినెట్టి అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో కూడా గిల్ అదరగొడుతున్నాడు. తొలి మూడు మ్యాచ్లకు జ్వరం కారణంగా దూరమైన ఈ యువ ఓపెనర్.. ఆ తర్వాత మ్యాచ్ల్లో రీ ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపాడు. ప్రస్తుతం బ్యాటర్ల ర్యాంకింగ్స్లో 830 రేటింగ్ పాయింట్లతో గిల్ టాప్ ప్లేస్లో ఉండగా.. 824 రేటింగ్ పాయింట్లతో బాబర్ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. గిల్ అరుదైన ఘనత.. వన్డేల్లో వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్గా అవతరించిన గిల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అత్యంత తక్కువ ఇన్నింగ్స్లలోనే నెం1 ర్యాంక్కు చేరుకున్న రెండో భారత ఆటగాడిగా శుబ్మన్ రికార్డులకెక్కాడు. గిల్ కేవలం 41 ఇన్నింగ్స్లలోనే ఈ రికార్డును గిల్ సాధించాడు. కాగా ఈ అరుదైన ఫీట్ నమోదు చేసిన జాబితాలో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఉన్నాడు. 2010లో వన్డేల్లో నెం1 బ్యాటర్గా నిలిచిన ధోని.. కేవలం 38 ఇన్నింగ్స్లలోనే ఈ ఘనతను అందుకున్నాడు. అదే విధంగా వన్డేల్లో అగ్రపీఠాన్ని అధిరోహించిన నాలుగో భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. గిల్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, ధోని, విరాట్ కోహ్లి ఈ ఘనత సాధించారు. -
మళ్లీ మనోడే నెంబర్ 1.. షాహిన్ ఆఫ్రిదిని వెనక్కినెట్టిన సిరాజ్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అదరగొట్టాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ బౌలర్ల జాబితాలో సిరాజ్ మరోసారి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. వన్డే వరల్డ్కప్లో దుమ్మురేపుతున్న సిరాజ్.. పాక్ స్పీడ్ స్టార్ షాహిన్ ఆఫ్రిదిని వెనక్కినెట్టి నంబర్ వన్ స్ధానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్కప్లో సిరాజ్ ఇప్పటివరకు 10 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకతో జరిగిన వరల్డ్ కప్ మ్యాచులో మూడు వికెట్లతో సిరాజ్ చెలరేగాడు. ఆ తర్వాత సౌతాఫ్రికాతో మ్యాచ్లో కూడా ఓ కీలక వికెట్ సాధించాడు. కాగా హైదరాబాద్ స్టార్ సిరాజ్ నెం1 ర్యాంక్కు చేరుకోవడం ఇది మూడో సారి. ప్రస్తుతం బౌలర్ల ర్యాంకింగ్స్లో 709 పాయింట్లతో సిరాజ్ టాప్ ప్లేస్లో ఉండగా.. రెండో స్థానంలో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ (694 పాయింట్లు) ఉన్నాడు. అయితే భారత్ నుంచి కుల్దీప్ యాదవ్ నాలుగు, బుమ్రా తొమ్మిది, షమీ పది స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ అగ్రస్ధానానికి చేరుకున్నాడు. వన్డే వరల్డ్కప్లో అదరగొడుతున్న గిల్.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను వెనక్కి నెట్టి నెం1 స్ధానాన్ని సొంతం చేసుకున్నాడు. చదవండి: Ben Stokes: సెంచరీతో అదరగొట్టిన స్టోక్స్.. వరల్డ్కప్లో ఇదే మొదటిది -
బాబర్ ఆజమ్ ‘శకం’ ముగిసింది.. నయా నంబర్ వన్ శుభ్మన్ గిల్
రెండేళ్ల కాలంలో ఎవరు చేయలేని పనిని టీమిండియా యువ కెరటం శుభ్మన్ గిల్ చేసి చూపించాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో రెండేళ్లకుపైగా అగ్రపీఠంపై కూర్చున్న బాబర్ను ఎట్టకేలకు కిందికి దించాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో గిల్ అగ్రస్థానానికి ఎగబాకి, బాబర్ను రెండో ప్లేస్కు నెట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్కప్లో 6 ఇన్నింగ్స్ల్లో రెండు అర్ధసెంచరీల సాయంతో 219 పరుగులు చేసిన గిల్.. బాబర్ కంటే ఆరు రేటింగ్ పాయింట్లు (830) అధికంగా సాధించి, ఐసీసీ ర్యాంకింగ్స్లో తొలిసారి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. సచిన్, ధోని, కోహ్లి తర్వాత వన్డే ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంక్కు చేరిన భారత బ్యాటర్ గిలే కావడం విశేషం. తాజా ర్యాంకింగ్స్లో గిల్తో పాటు విరాట్ కోహ్లి కూడా తన ర్యాంకింగ్ను మెరుగుపర్చుకున్నాడు. ప్రస్తుత వరల్డ్కప్లో భీకర ఫామ్లో ఉన్న విరాట్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. వరల్డ్కప్లో ప్రదర్శనల కారణంగా తాజా ర్యాంకింగ్స్లో భారీ కుదుపు ఏర్పడింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారీగా స్థానచలనాలు జరిగాయి. డికాక్ (మూడో స్థానం), శ్రేయస్ (18), ఫకర్ జమాన్ (11), ఇబ్రహీం జద్రాన్ (12) తమతమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. బౌలింగ్ విషయానికొస్తే.. ఈ విభాగం టాప్-10లో ఏకంగా నలుగురు భారత బౌలర్లు చోటు దక్కించుకున్నారు. ప్రస్తుత ప్రపంచకప్లో 10 వికెట్లు పడగొట్టిన మొహమ్మద్ సిరాజ్ మరోసారి అగ్రపీఠాన్ని అధిరోహించగా.. కుల్దీప్ యాదవ్ నాలుగు, బుమ్రా తొమ్మిది, షమీ పది స్థానాల్లో నిలిచారు. బ్యాటింగ్ విభాగంలో టాప్-10లో గిల్, కోహ్లితో పాటు రోహిత్ శర్మ (ఆరో స్థానం) కూడా ఉన్నాడు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో భారత్ వరుసగా ఎనిమిది విజయాలు సాధించి సెమీస్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. -
World Cup 2023: వరల్డ్ నెంబర్ 1 బౌలర్గా షాహిన్ అఫ్రిది..
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ స్పీడ్ స్టార్ షాహిన్ షా అఫ్రిది అదరగొట్టాడు. తొలిసారి వరల్డ్ నెంబర్ 1 బౌలర్గా అవతరించాడు. వన్డే ప్రపంచకప్-2023లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్న అఫ్రిది.. ఏకంగా 7 స్ధానాలు ఎగబాకి అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్వుడ్ని వెనక్కినెట్టి 673 రేటింగ్ పాయింట్లతో టాప్-1లోకి షాహీన్ దూసుకువచ్చాడు. కాగా ఏ ఫార్మాట్లోనైనా నెం.1 ర్యాంక్ను చేరుకోవడం అఫ్రిదికి ఇదే మొదటి సారి. వన్డే ప్రపంచకప్-2023లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన అఫ్రిది 16 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. వంద వికెట్ల మైలురాయి.. అంతర్జాతీయ వన్డేల్లో మరో అరుదైన ఘనతను అఫ్రిది అందుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్గా అఫ్రిది రికార్డులకెక్కాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో షాహీన్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 3 వికెట్లతో షాహీన చెలరేగాడు. చదవండి: World cup 2023: చరిత్ర సృష్టించిన డికాక్.. వన్డే వరల్డ్కప్ చరిత్రలోనే! -
అగ్రపీఠానికి మరింత చేరువైన గిల్.. దుమ్ములేపిన డికాక్, క్లాసెన్! బాబర్ ఇక..
ICC ODI Batting Rankings: టీమిండియా యువ బ్యాటర్ శుబ్మన్ గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రపీఠానికి మరింత చేరువయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో 823 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ప్రస్తుతం వరల్డ్ నంబర్ 1 బ్యాటర్గా ఉన్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కంటే కేవలం ఆరు పాయింట్లు వెనుకబడి ఉన్నాడు. డెంగ్యూ జ్వరం కారణంగా కాగా డెంగ్యూ జ్వరం కారణంగా భారత ఓపెనింగ్ బ్యాటర్ వన్డే వరల్డ్కప్-2023 ఆరంభ మ్యాచ్లకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెరుగైన చికిత్స అనంతరం పూర్తి ఫిట్నెస్ సాధించిన ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ అహ్మదాబాద్లో పాకిస్తాన్తో మ్యాచ్తో తిరిగి జట్టుతో చేరాడు. చిరకాల ప్రత్యర్థి పాక్తో మ్యాచ్లో కేవలం 16 పరుగులకే పరిమితమైన శుబ్మన్ గిల్.. బంగ్లాదేశ్పై అర్ధ శతకం(53) సాధించి తిరిగి ఫామ్లోకి వచ్చాడు. ఇప్పటి వరకు మొత్తంగా మూడు ఇన్నింగ్స్లో కలిపి 95 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో వన్డేల్లో బాబర్ ఆజం నంబర్ వన్ ర్యాంకును ఆక్రమించే క్రమంలో మరో ముందడుగు వేశాడు. దుమ్ములేపిన డికాక్, క్లాసెన్ ఇక ఐసీసీ బుధవారం ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్లు క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్ దుమ్ములేపారు. బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా వన్డే ప్రపంచకప్-2023లో మూడో సెంచరీ నమోదు చేసిన డికాక్ ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకు సాధించాడు. అదే విధంగా.. ఆరంభం నుంచి అద్భుత ఇన్నింగ్స్ ఆడుతున్న క్లాసెన్ బంగ్లాదేశ్పై 90 పరుగులు చేసి తాజా ర్యాంకింగ్స్లో నాలుగు స్థానాలు మెరుగుపరచుకుని నాలుగో ర్యాంకు సొంతం చేసుకున్నాడు. కోహ్లి, రోహిత్ ఇలా ఇక బాబర్ ఆజం(పాకిస్తాన్- 829 పాయింట్లు), శుబ్మన్ గిల్(ఇండియా- 823), క్వింటన్ డికాక్(సౌతాఫ్రికా- 769), హెన్రిచ్ క్లాసెన్(సౌతాఫ్రికా- 756)లతో పాటు ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్(747 పాయింట్లు) టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి రెండు స్థానాలు కోల్పోయి వార్నర్ తర్వాతి ర్యాంకులో నిలిచాడు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం మెరుగుపరచుకుని ఎనిమిదో ర్యాంకు సాధించాడు. చదవండి: రుత్రాజ్ విధ్వంసకర శతకం.. కేవలం 51 బంతుల్లోనే View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: వన్డే ర్యాంకింగ్స్లో అదరగొట్టిన కోహ్లి.. రాహుల్ ఏకంగా..
ICC ODI Rankings: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అదరగొట్టాడు. వన్డే వరల్డ్కప్-2023లో ఆస్ట్రేలియాతో ఆరంభ మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రన్మెషీన్.. మూడు స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంకు సాధించాడు. అదే విధంగా ప్రపంచకప్ మ్యాచ్లలో సెంచరీలతో చెలరేగిన సౌతాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్, ఇంగ్లండ్ ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ మలన్ సైతం తమ స్థానాలు మెరుగుపరుచుకున్నారు. ఇక వన్డే వరల్డ్ నంబర్ 1 బ్యాటర్, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ సైతం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అదే విధంగా సౌతాఫ్రికా బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్, ఐర్లాండ్ స్టార్ హ్యారీ టెక్టార్, ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టాప్-5లో కొనసాగుతున్నారు. ఏడు స్థానాలు ఎగబాకి కాగా శ్రీలంకతో మ్యాచ్లో క్వింటన్ డికాక్ సెంచరీ చేయగా.. కోహ్లి ఆసీస్తో మ్యాచ్లో 85 పరుగులు సాధించాడు. వీరిద్దరు వరుసగా 6, 7 స్థానాల్లో నిలిచారు. మరోవైపు.. ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ బంగ్లాదేశ్తో మ్యాచ్లో విధ్వంసకర శతకం(140)తో విరుచుకుపడి.. ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంకు సాధించాడు. రాహుల్ ర్యాంకు ఎంతంటే ఇదిలా ఉంటే.. టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ 15 స్థానాలు మెరుగుపరచుకుని.. 19వ ర్యాంకులో నిలిచాడు. సొంతగడ్డపై ఆరంభ మ్యాచ్లో ఆస్ట్రేలియా విధించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడిన భారత్ను సిక్సర్తో విజయతీరాలకు చేర్చాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. అయితే, కేవలం మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. మరోవైపు.. గిల్ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమై నంబర్ 1గా అవతరించే అవకాశం చేజార్చుకున్నాడు. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే 1. బాబర్ ఆజం(పాకిస్తాన్) 2. శుబ్మన్ గిల్(భారత్) 3. రాసీ వాన్ డెర్ డసెన్(సౌతాఫ్రికా) 4. హ్యారీ టెక్టర్(ఐర్లాండ్) 5. డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా). చదవండి: ఈ వరల్డ్కప్లోనే కోహ్లి.. సచిన్ సెంచరీల రికార్డు బ్రేక్ చేస్తాడు! -
వరల్డ్కప్కు ముందు మొహమ్మద్ సిరాజ్కు భంగపాటు
భారత్ వేదికగా రేపటి నుంచి ప్రారంభంకానున్న వన్డే వరల్డ్కప్ 2023కు ముందు టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్కు భంగపాటు ఎదురైంది. కొద్ది రోజుల కిందట ఆసీస్తో జరిగిన మూడో వన్డేలో ధారాళంగా పరుగులు (9 ఓవర్లలో 68 పరుగులు) సమర్పించుకున్నందుకు గాను సిరాజ్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో 11 పాయింట్లు (680 నుంచి 669) కోల్పోయాడు. తద్వారా అతను ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉండిన ఆసీస్ పేసర్ జోష్ హాజిల్వుడ్తో అగ్రస్థానాన్ని షేర్ చేసుకోవాల్సి వచ్చింది. భారత్తో జరిగిన మూడో వన్డేలో 8 ఓవర్లలో 42 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన హాజిల్వుడ్ అప్పటివరకు తన ఖాతాలో ఉన్న 669 పాయింట్లను నిలబెట్టుకుని సిరాజ్తో పాటు సంయుక్తంగా అగ్రపీఠాన్ని అధిరోహించాడు. వరల్డ్కప్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అక్టోబర్ 8న జరిగే మ్యాచ్లో వీరిరువురిలో టాప్ ర్యాంకర్ ఎవరో తేలిపోతుంది. తాజాగా ర్యాంకింగ్స్లో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ ద్వయం ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ మూడు, నాలుగు స్థానాలు నిలబెట్టుకోగా.. పాక్ స్పీడ్స్టర్ షాహీన్ అఫ్రిది 2 స్థానాలు ఎగబాకి 6వ ప్లేస్కు చేరుకున్నాడు. గత ర్యాంకింగ్స్లో ఆరో స్థానంలో ఉండిన మిచెల్ స్టార్క్ 2 స్థానాలు కోల్పోయి 8వ స్థానానికి పడిపోయాడు. 11వ ర్యాంక్లో ఉండిన మొహమ్మద్ నబీ ఓ స్థానం మెరుగుపర్చుకుని 10వ స్థానానికి ఎగబాకగా.. 10వ ప్లేస్లో ఉండిన కుల్దీప్ యాదవ్ 11వ స్థానానికి పడిపోయాడు. ఈ మార్పులు మినహాయించి టాప్-10 వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్లో ఎలాంటి మార్పులు జరగలేదు. వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత్తో సిరీస్లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఆసీస్ వెటరన్ డేవిడ్ వార్నర్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఐర్లాండ్ హ్యారీ టెక్టార్తో సమానంగా నాలుగో స్థానానికి ఎగబాకాడు. 5వ స్థానంలో ఉండిన ఇమామ్ ఉల్ హాక్ ఓ స్థానం దిగజారి ఆరుకు పడిపోగా.. గత వారం ర్యాంకింగ్స్లో 11వ స్థానంలో ఉండిన రోహిత్ ఓ స్థానం మెరుగుపర్చుకుని 10వ స్థానానికి చేరాడు. 10వ స్థానంలో ఉండిన ఫకర్ జమాన్ 11వ ప్లేస్కు పడిపోయాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, శుభ్మన్ గిల్, డస్సెన్లు టాప్-3 ర్యాంకింగ్స్లో కొనసాగుతుండగా.. విరాట్ 9వ స్థానాన్ని కాపాడుకున్నాడు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో టాప్-10 స్థానాలు యధాతథంగా కొనసాగుతున్నాయి. షకీబ్, నబీ, సికందర్ రజా టాప్-3లో కొనసాగుతున్నారు. -
బాబర్ ఆజమ్ను కాపాడిన టీమిండియా మేనేజ్మెంట్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాప్ ర్యాంక్ను టీమిండియా మేనేజ్మెంట్ పరోక్షంగా కాపాడింది. రెండో ర్యాంక్లో ఉన్న శుభ్మన్ గిల్ను ఆసీస్తో మూడో వవ్డేలో ఆడకుండా రెస్ట్ ఇచ్చిన భారత క్రికెట్ జట్టు యాజమాన్యం బాబర్ టాప్ ర్యాంక్ కోల్పోకుండా తోడ్పడింది. ఆసీస్తో తొలి రెండు వన్డేల్లో (74, 104) పరుగుల వరద పారించడంతో తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో గిల్ టాప్ ర్యాంక్కు మరింత చేరువయ్యాడు. గిల్ ప్రస్తుత రేటింగ్ పాయింట్లకు బాబర్ రేటింగ్ పాయింట్లకు మధ్య తేడా కేవలం 10 పాయింట్లు మాత్రమే. ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న బాబర్ 857 పాయింట్లు కలిగి ఉంటే.. గిల్ తాజా ప్రదర్శనలతో మరిన్ని పాయింట్లు సాధించి తన కెరీర్ బెస్ట్ అయిన 847 పాయింట్లు సాధించాడు. ఒకవేళ ఆసీస్తో మూడో వన్డేలో గిల్ ఆడి ఉంటే, కనీస పరుగులు చేసినా నంబర్ వన్ వన్డే బ్యాటర్ అయ్యుండేవాడు. ప్రపంచ నంబర్ వన్ వన్డే బ్యాటర్ హోదాలో అతను వరల్డ్కప్ ఎంట్రీ ఇచ్చేవాడు. అయితే టీమిండియా యాజమాన్యం తీసుకున్న నిర్ణయం కారణంగా ఇది కార్యరూపం దాల్చలేదు. బాబర్ టాప్ వన్డే ర్యాంకర్గానే వరల్డ్కప్ బరిలో నిలుస్తాడు. అయితే ఈ ముచ్చట బాబర్కు ఎన్నో రోజులు నిలబడేలా లేదు. గిల్.. వరల్డ్కప్ ఆరంభ మ్యాచ్ల్లో ఏ ఒక్క మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసినా వరల్డ్ నంబర్ వన్ వన్డే బ్యాటర్గా అవతరిస్తాడు. ఇదిలా ఉంటే, తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో బ్యాటింగ్ విభాగంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. టాప్ 12 ర్యాంక్లు యాధాతథంగా కొనసాగుతున్నాయి. భారత్ నుంచి గిల్, కోహ్లి (9వ ర్యాంక్) టాప్ 10లో ఉండగా.. రోహిత శర్మ 11వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే ఈ విభాగంలో టీమిండియా ఏస్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. ఆసియా కప్ 2023 ఫైనల్లో అద్భుతమైన ప్రదర్శన కారణంగా టాప్ ర్యాంక్కు చేరుకున్న సిరాజ్... ఆ తర్వాత ఆసీస్తో జరిగిన రెండు వన్డేలు ఆడనప్పటికీ వన్డే టాప్ ర్యాంక్ను కోల్పోలేదు. ఈ విభాగంలో సిరాజ్తో పాటు కుల్దీప్ యాదవ్ టాప్ 10లో (10వ ర్యాంక్) ఉన్నాడు. ఇక్కడ కూడా ర్యాంకింగ్స్లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే రెండో జట్టుగా
టీమిండియా చరిత్ర సృష్టించింది. టెస్టు, వన్డే, టీ20.. ఇలా మూడు ఫార్మాట్లలో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నెం1 జట్టుగా భారత్ అవతరించింది. మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించిన భారత జట్టు.. వన్డేల్లో మళ్లీ ఆగ్ర పీఠాన్ని అధిరోహించింది. 116 రేటింగ్తో పాకిస్తాన్(115)ను వెనక్కి నెట్టి భారత్ టాప్ ర్యాంక్కు చేరుకుంది. కాగా ఇప్పటికే టెస్టు, టీ20 ర్యాంకింగ్స్లో భారత్ మొదటి స్ధానంలో కొనసాగుతోంది. ఇక మూడు ఫార్మాట్లలో టాప్ ప్లేస్లో నిలిచిన భారత జట్టు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. టీమిండియా సరికొత్త రికార్డు.. అన్ని ఫార్మాట్లలో ఏకకాలంలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న రెండో జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. ఇంతకుముందు 2012 దక్షిణాఫ్రికా ఈ అరుదైన ఘనత సాధించింది. ఇక భారత్ టాప్ ర్యాంక్లో ఉండగా.. పాకిస్తాన్(115), ఆస్ట్రేలియా(111) రేటింగ్తో వరుసగా రెండు, మూడు స్ధానాల్లో కొనసాగుతున్నాయి. భారత్ ఘన విజయం ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 5 వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. జోష్ ఇంగ్లీస్(45), స్టీవ్ స్మిత్(41), మార్నస్ లబుషేన్(39) పర్వాలేదనిపించారు. అనంతరం 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (77 బంతుల్లో 10 ఫోర్లతో 71), శుభ్మన్ గిల్(63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 74) అదరగొట్టారు. వీరిద్దరితో పాటు కేఎల్ రాహుల్(63 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 58 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 50) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆసీస్ బౌలర్లలో జంపా రెండు వికెట్లు.. కమ్మిన్స్, అబాట్ తలా వికెట్ పడగొట్టారు. చదవండి: U19 World Cup: వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే? No. 1 Test team ☑️ No. 1 ODI team ☑️ No. 1 T20I team ☑️#TeamIndia reigns supreme across all formats 👏👏 pic.twitter.com/rB5rUqK8iH — BCCI (@BCCI) September 22, 2023 -
సిరాజ్ మియా.. మరోసారి వరల్డ్ నంబర్ 1 బౌలర్గా.. ఏకంగా..
ICC Men's ODI Bowling Rankings: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్లో అదరగొట్టాడు. మరోసారి ప్రపంచ నెంబర్ 1 బౌలర్గా అవతరించాడు. ఆసియా కప్-2023 ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో సంచలన రికార్డులు నమోదు చేయడంతో పాటు బౌలింగ్ ర్యాంకింగ్స్లో ఏకంగా 8 స్థానాలు ఎగబాకాడు. తద్వారా మరోసారి అగ్రపీఠం కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్వుడ్ని వెనక్కినెట్టి 694 రేటింగ్ పాయింట్లతో టాప్-1లోకి దూసుకువచ్చాడు. కాగా శ్రీలంకతో ఆసియా వన్డే కప్ ఫైనల్లో సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన ఈ హైదరాబాదీ స్టార్.. మరో రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. సిరాజ్ దెబ్బకు శ్రీలంక కకావికలం సిరాజ్ దెబ్బకు లంక బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. లంకను 50 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన మియా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కొలంబో మ్యాచ్లో మొత్తంగా ఏడు ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ ఫాస్ట్బౌలర్.. 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 10 ఓవర్ల కోటా పూర్తి చేసేందుకు సిద్ధం అవుతుండగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అతడిని వారించాడు. ఫిట్నెస్ కూడా ముఖ్యమంటూ ట్రైనర్ సూచనలు ఇవ్వడంతో.. అలా సిరాజ్ పేస్ అటాక్కు తెరపడింది. లేదంటే.. మరిన్ని వికెట్లు కూల్చేవాడేమో! మొత్తం ఎన్ని వికెట్లంటే? ప్రస్తుతం సిరాజ్ వన్డే వరల్డ్కప్-2023కి సిద్ధమయ్యే పనిలో ఉన్నాడు. అంతకంటే ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో భాగం కానున్నాడు. కాగా ఈ ఏడాది ఆరంభంలో సిరాజ్ మొట్టమొదటి సారి వరల్డ్ నంబర్ 1 ర్యాంకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆసియా టోర్నీ తాజా ఎడిషన్లో సిరాజ్ 12.2 సగటుతో మొత్తంగా 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ తాజా వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే 1. మహ్మద్ సిరాజ్- ఇండియా- 694 పాయింట్లు 2. జోష్ హాజిల్వుడ్- ఆస్ట్రేలియా- 678 పాయింట్లు 3. ట్రెంట్ బౌల్ట్- న్యూజిలాండ్- 677 పాయింట్లు 4. ముజీబ్ ఉర్ రెహమాన్- అఫ్గనిస్తాన్- 657 పాయింట్లు 5. రషీద్ ఖాన్- అఫ్గనిస్తాన్- 655 పాయింట్లు. చదవండి: ఆసియా కప్ ఫైనల్లో ఘోర ఓటమి.. శ్రీలంక కెప్టెన్పై వేటు! కొత్త కెప్టెన్ ఎవరంటే? Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
వన్డే ర్యాకింగ్స్లో సత్తాచాటిన గిల్, కిషన్..
ఐసీసీ వన్డే ర్యాకింగ్స్లో భారత బ్యాటర్లు శబ్మన్ గిల్, ఇషాన్ కిషన్ అదరగొట్టారు. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో గిల్ మూడో స్ధానానికి చేరుకున్నాడు. ఇంతకుముందు నాలుగో ర్యాంక్లో ఉన్న గిల్.. ఆసియాకప్-2023లో భాగంగా నేపాల్పై అద్భుతంగా రాణించడంతో తన స్ధానాన్ని మెరుగుపరుచుకున్నాడు. ఈ మ్యాచ్లో గిల్ 62 బంతుల్లో 67 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. మరోవైపు పాకిస్తాన్తో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్ 12 స్ధానాలు ఎగబాకి 24వ స్ధానానికి చేరుకున్నాడు. కిషన్ పాకిస్తాన్పై 82 పరుగులతో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక టాప్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం(882 పాయింట్లు) ఉండగా.. రెండో స్ధానంలో దక్షిణాఫ్రికా స్టార్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ కొనసాగుతున్నాడు. టాప్ 10 వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్ జాబితా 1.బాబర్ ఆజం (పాకిస్తాన్) 2.రస్సీ వాండర్ డస్సెన్ (దక్షిణాఫ్రికా) 3.శుబ్మన్ గిల్(భారత్) 4.ఇమామ్-ఉల్-హక్ (పాకిస్తాన్) 5.హ్యారీ టెక్టర్ (ఐర్లాండ్) 6.డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) 7.ఫఖర్ జమాన్ (పాకిస్తాన్) 8.క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా) 9.స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) 10.విరాట్ కోహ్లీ (భారత్) చదవండి: రోహిత్, కోహ్లిలను తీసేయరు కదా! కాబట్టి.. తుది జట్టులో అతడే బెటర్: గంభీర్ -
వన్డేల్లో నెం1 జట్టుగా పాకిస్తాన్.. మరి టీమిండియా?
అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ అగ్రస్ధానానికి చేరుకుంది. శ్రీలంక వేదికగా ఆఫ్గానిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన పాకిస్తాన్.. మళ్లీ నెం1 వన్డే జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి బాబర్ సేన టాప్ ర్యాంక్ను కైవసం చేసుకుంది. కాగా 118 రేటింగ్తో పాక్ -ఆస్ట్రేలియా జట్లు సమం ఉన్నాయి. అయితే పాయిట్లు పరంగా ఆస్ట్రేలియా(2714) కంటే పాకిస్తాన్(2725) ముందంజలో ఉండడంతో అగ్రపీఠాన్ని సొంతం చేసుకుంది. ఇక భారత జట్టు విషయానికి వస్తే.. వన్డే ర్యాంకింగ్స్లో మూడో స్ధానంలో కొనసాగుతుంది. రేటింగ్స్ పరంగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా కంటే ఐదు పాయింట్లు వెనుకబడి ఉంది. ఇక న్యూజిలాండ్ 104 రేటింగ్స్తో నాలుగో స్థానంలో నిలిచింది. అదే విధంగా ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఐదో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్ధానాల్లో వరుసగా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్,శ్రీలంక, ఆఫ్గానిస్తాన్, వెస్టిండీస్ నిలిచాయి. సిరీస్ క్లీన్ స్వీప్.. ఇక కొలాంబో వేదికగా జరిగిన మూడో వన్డే విషయానికి వస్తే.. 59 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్ను ఓడించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 3–0తో పాకిస్తాన్ క్లీన్స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. మొహమ్మద్ రిజ్వాన్ (67), కెప్టెన్ బాబర్ ఆజమ్ (60) అర్ధ సెంచరీలు సాధించగా, ఆగా సల్మాన్ (38 నాటౌట్), నవాజ్ (30) రాణించారు. నైబ్, ఫరీద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గన్ జట్టు 48.4 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్గాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహమాన్ (37 బంతుల్లో 64) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. నవాజ్, అఫ్రిది,అష్రాప్ తలా రెండు వికెట్లు సాధించారు. చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్కు భారత జట్టు ఇదే.. స్టార్ ఆటగాళ్లకు నో ఛాన్స్! సంజూకు -
వన్డే ర్యాంకింగ్స్.. అదరగొట్టిన ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్
వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్ను 2-1తో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐసీసీ బుధవారం ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్లు తన స్థానాలను మెరుగుపరుచుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో ఇషాన్ కిషన్ 43వ ర్యాంక్, బౌలర్లలో కుల్దీప్ 14వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. విధ్వంసక ఓపెనర్ ఇషాన్ రెండో టెస్టు, మూడు వన్డేల్లో వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు కొట్టాడు. దాంతో ఈ లెఫ్ట్ హ్యాండర్ 14 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. కుల్దీప్ కూడా ఏకంగా 8 స్థానాలు మెరుగుపర్చుకొని 14 ర్యాంకులో నిలిచాడు. ఈ సిరీస్లో కుల్దీప్ మూడు వన్డేలు కలిపి ఏడు వికెట్లు పడగొట్టాడు. అయితే వన్డే సిరీస్లో రెండు, మూడు వన్డేలకు దూరంగా ఉన్న కోహ్లి, రోహిత్లు ఒక్కో స్థానం కోల్పోయారు. ఇంతకుముందు టాప్ 10లో హిట్మ్యాన్ 11వ స్థానానికి, 8వ స్థానంలో ఉన్న కోహ్లీ 9వ ర్యాంక్కి పడిపోయారు. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్లో గాయంతో వన్డే సిరీస్కు దూరమైన మహ్మద్ సిరాజ్ ఒక స్థానం దిగజారి 677 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం టాప్ ర్యాంక్ను కాపాడుకున్నాడు. 886 పాయింట్లతో బాబర్ ఆజం తొలి స్థానంలో ఉండగా.. వాండర్ డుసెన్ 777 పాయింట్లతో రెండు, 755 పాయింట్లతో ఫఖర్ జమాన్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా నుంచి శుబ్మన్ గిల్ 724 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలర్ల విభాగంలో జోష్ హాజిల్వుడ్ 705 పాయింట్లతో టాప్లో ఉండగా.. 686 పాయింట్లతో మిచెల్ స్టార్క్, 682 పాయింట్లతో రషీద్ ఖాన్లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. చదవండి: స్లో ఓవర్ రేట్ దెబ్బ.. ఇంగ్లండ్, ఆసీస్లకు షాక్; డబ్ల్యూటీసీ పాయింట్స్లో భారీ కోత R Ashwin: 'టీమిండియా బజ్బాల్ ఆడితే జట్టులో ఎవరు మిగలరండి' -
చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్.. 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా!
శ్రీలంక మహిళల జట్టు కెప్టెన్ చమారీ ఆటపట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ ఉమన్స్ వన్డే ప్లేయర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచిన మొదటి శ్రీలంక క్రికెటర్గా ఆటపట్టు రికార్డులకెక్కింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో 758 పాయింట్లతో ఆటపట్టు టాప్ ర్యాంక్కు చేరుకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ బెత్ మూనీ(758)ను వెనుక్కి నెట్టింది. కాగా స్వదేశంలో న్యూజిలాండ్ మహిళల జట్టుతో జరిగిన వన్డే సిరీస్లో అటపట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. మూడు మ్యాచ్ల్లో రెండు సెంచరీలతో చెలరేగింది. ఓవరాల్గా ఈ సిరీస్లో 248 పరుగులు అటపట్టు సాధించింది. ఈ అద్బుత ప్రదర్శన ఫలితంగా తన కెరీర్లో తొలిసారి నెం1 ర్యాంక్ను సొంతం చేసుకుంది. జయసూర్య తర్వాత చమారీనే.. ఇక ఓవరాల్గా శ్రీలంక మెన్స్, ఉమెన్స్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్గా కూడా ఆటపట్టు నిలిచింది. ఇప్పటివరకు శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య వన్డే ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంక్ సాధించాడు. సెప్టెంబరు 2002 నుంచి మే 2003 వరకు జయసూర్య నెం1 ర్యాంక్లో కొనసాగాడు. అ తర్వాత ఏ ఒక్క శ్రీలంక క్రికెటర్(మెన్స్ అండ్ ఉమన్స్) టాప్ ర్యాంక్ను సాధించలేకపోయారు. తాజాగా అటపట్టు 20 ఏళ్ల తర్వాత అగ్రస్ధానానికి చేరుకుని రికార్డులకెక్కింది. ఇక తాజాగా వన్డే ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ రు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్కు చేరుకుంది. శ్రీలంక సిరీస్లో భాగంగా రెండో వన్డేలో సోఫీ డివైన్ 137 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడింది. చదవండి: Harbhajan Singh: ప్రపంచంలో టాప్ 5 బెస్ట్ ప్లేయర్స్ వీరే.. కోహ్లి, రోహిత్కు నో ఛాన్స్! -
భారీ జంప్ కొట్టిన మార్క్రమ్.. కెరీర్ బెస్ట్ సాధించిన శుభ్మన్
సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారీ జంప్ కొట్టాడు. ఇటీవలే నెదర్లాండ్స్తో జరిగిన మూడో వన్డేలో భారీ శతకం (175) బాదిన మార్క్రమ్.. ఏకంగా 13 స్థానాలు మెరుగుపర్చుకుని 41వ స్థానానికి ఎగబాకాడు. అలాగే ఆల్రౌండర్స్ విభాగంలో 16 స్థానాలు మెరుగుపర్చుకుని 32వ స్థానానికి చేరాడు. నెదర్లాండ్స్తో సిరీస్లో రెండో వన్డేలోనూ అర్ధసెంచరీతో (51 నాటౌట్) రాణించిన మార్క్రమ్.. దక్షిణాఫ్రికా 2-0 తేడాతో సిరీస్ చేజిక్కించుకోవడంతో పాటు సఫారీ టీమ్ వన్డే వరల్డ్కప్-2023కు నేరుగా అర్హత సాధించడంలోనూ ప్రధాన పాత్ర పోషించాడు. కెరీర్లో తొలిసారి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో 41వ స్థానానికి చేరిన మార్క్రమ్.. వన్డేలతో పాటు టీ20లు, టెస్ట్ల్లోనూ సత్తా చాటుతున్నాడు. ఇక ఈ వారం ర్యాంకింగ్స్ మెరుగుపర్చుకున్న ఆటగాళ్ల విషయానికొస్తే.. టీమిండియా యువకెరటం శుభ్మన్ గిల్ఓ స్థానం మెరుగుపర్చుకుని కెరీర్ బెస్ట్ నాలుగో ర్యాంక్ సాధించగా.. బౌలింగ్ విభాగంలో న్యూజిలాండ్ ప్లేయర్ మ్యాట్ హెన్రీ ఏకంగా 5 స్థానాలు జంప్ చేసి 10 నుంచి 5వ స్థానానికి ఎగబాకాడు. నెదార్లండ్స్తో సిరీస్లో ఓ ఫైఫర్తో పాటు 8 వికెట్లు పడగొట్టిన సఫారీ బౌలర్ సిసండ మగాలా ఏకంగా 35 స్థానాలు ఎగబాకి 165 ర్యాంక్కు చేరుకున్నాడు. బ్యాటర్ల విభాగంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. డస్సెన్, ఇమామ్ ఉల్ హాక్, గిల్, వార్నర్, కోహ్లి, డికాక్, రోహిత్, స్టీవ్ స్మిత్, ఫకర్ జామన్ వరుసగా 2 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో జోష్ హాజిల్వుడ్ టాప్లో కొనసాగుతుండగా.. బౌల్డ్, సిరాజ్, స్టార్క్, మ్యాట్ హెన్రీ, రషీద్ ఖాన్, జంపా, షాహీన్ అఫ్రిది, ముజీబ్ రెహ్మాన్, షకీబ్ 2 నుంచి 10 ప్లేస్ల్లో ఉన్నారు. ఆల్రౌండర్ల విభాగంలో షకీబ్ టాప్లో కొనసాగుతుండగా.. నబీ, రషీద్ ఖాన్ టాప్-3లో ఉన్నారు. -
కోహ్లిని వెనక్కునెట్టిన గిల్.. హిట్మ్యాన్ ఏ స్థానంలో ఉన్నాడంటే..?
న్యూజిలాండ్తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ముగిసిన అనంతరం ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా అన్ని విభాగాల్లో దుమ్మురేపింది. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్ను 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసిన భారత్ (114 రేటింగ్ పాయింట్లు).. టీమ్ ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ను వెనక్కునెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించింది. అలాగే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లోనూ సత్తా చాటింది. న్యూజిలాండ్ సిరీస్ (2 మ్యాచ్ల్లో 5 వికెట్లు)తో పాటు అంతకుముందు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లోనూ (3 మ్యాచ్ల్లో 9 వికెట్లు) అద్భుతంగా రాణించిన భారత స్టార్ పేసర్, హైదరాబాద్ కా షాన్ మహ్మద్ సిరాజ్ మియా తొలిసారి వన్డే ర్యాంకింగ్స్లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్గా అవతరించగా.. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టారు. న్యూజిలాండ్ సిరీస్లో 3 మ్యాచ్ల్లో 360 పరుగులు (209, 40 నాటౌట్, 112), అంతకుముందు శ్రీలంక సిరీస్లో 3 మ్యాచ్ల్లో 207 పరుగులు చేసిన (70, 21, 116) గిల్.. కివీస్తో సిరీస్లో అంతగా రాణించని రన్మెషీన్ విరాట్ కోహ్లిని వెనక్కునెట్టి, ఏకంగా 20 స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా, కివీస్తో ఆఖరి వన్డేలో శతకం బాదిన రోహిత్ ఓ స్థానం మెరుగుపర్చుకుని 9వ స్థానానికి చేరుకున్నాడు. ఈ విభాగంలో పాక్ సారధి బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. డస్సెన్, డికాక్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. -
వన్డే ర్యాంకింగ్స్లో దుమ్మురేపిన సిరాజ్.. ఏకంగా టాప్ ప్లేస్ కైవసం
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ముగిసిన అనంతరం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్ను 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసిన భారత్ (114 రేటింగ్ పాయింట్లు) టీమ్ ర్యాంకింగ్స్లో.. ఇంగ్లండ్ను వెనక్కునెట్టి అగ్రస్థానానికి ఎగబాకగా, బౌలింగ్ విభాగంలో భారత స్టార్ పేసర్, హైదరాబాద్ కా షాన్ మహ్మద్ సిరాజ్ మియా తొలిసారి వన్డేల్లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్గా అవతరించాడు. 🚨 There's a new World No.1 in town 🚨 India's pace sensation has climbed the summit of the @MRFWorldwide ICC Men's ODI Bowler Rankings 🔥 More 👇 — ICC (@ICC) January 25, 2023 న్యూజిలాండ్ సిరీస్తో పాటు అంతకుముందు శ్రీలంకతో జరిగిన సిరీస్లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చిన సిరాజ్.. టీమిండియా తరఫున బుమ్రా తర్వాత వన్డేల్లో టాప్ ర్యాంక్ సాధించిన బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. శ్రీలంక సిరీస్లో 3 మ్యాచ్ల్లో 9 వికెట్లు, కివీస్తో సిరీస్లో 2 మ్యాచ్ల్లో 5 వికెట్లు పడగొట్టిన సిరాజ్.. మొత్తం 729 రేటింగ్ పాయింట్లు తన ఖాతాలో వేసుకుని అగ్రపీఠాన్ని అధిరోహించాడు. సిరాజ్ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హేజిల్వుడ్ (727) ఉన్నాడు. హేజిల్వుడ్కు సిరాజ్కు కేవలం 2 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. వీరిద్దరి తర్వాత ట్రెంట్ బౌల్ట్ (708), మిచెల్ స్టార్క్ (665), రషీద్ ఖాన్ (659) వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచారు. కివీస్తో రెండో వన్డేలో అద్భుతంగా రాణించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న మరో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ సైతం తన ర్యాంక్ను మెరుగుపర్చుకున్నాడు. షమీ.. 11 స్థానాలు ఎగబాకి 32వ స్థానంలో నిలిచాడు. దాదాపు మూడేళ్ల తర్వాత గతేడాది (2022) ఫిబ్రవరిలో వన్డే ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చిన సిరాజ్.. ఏడాది మొత్తం ఫార్మాట్లకతీతంగా రాణించాడు. రీఎంట్రీ తర్వాత సిరాజ్ 21 వన్డేల్లో ఏకంగా 37 వికెట్లు నేలకూల్చాడు. ఈ ప్రదర్శన ఆధారంగా సిరాజ్కు 2022 ఐసీసీ అత్యుత్తమ వన్డే జట్టులో కూడా చోటు లభించింది. కొత్త బంతిలో ఇరు వైపుల స్వింగ్ చేయగల సామర్థ్యం కలిగిన సిరాజ్.. గతకొంత కాలంగా అన్ని విభాగాల్లో రాటుదేలాడు. కెరీర్ ఆరంభంలో పరుగులు ధారాళంగా సమర్పించుకుంటాడు, టాపార్డర్ బ్యాటర్ల వికెట్లు పడగొట్టలేడు అనే అపవాదు సిరాజ్పై ఉండేది. అయితే గత ఏడాది కాలంలో సిరాజ్ తన లోపాలను సరిచేసుకుని పేసు గుర్రం బుమ్రాను సైతం మరిపించేలా రాటుదేలాడు. ప్రస్తుతం సిరాజ్ కొత్త బంతిని అద్భుతంగా ఇరువైపులా స్వింగ్ చేయడంతో పాటు, ఆరంభ ఓవర్లు, మిడిల్ ఓవర్లలో అన్న తేడా లేకుండా పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతున్నాడు. గత 10 వన్డేల్లో సిరాజ్ ప్రతి మ్యాచ్లో కనీసం ఒక్క వికెట్ తీశాడు. అలాగే పవర్ ప్లేల్లో మెయిడిన్ ఓవర్లు సంధించడంలోనూ సిరాజ్ రికార్డులు నెలాకొల్పాడు. -
IND VS NZ 3rd ODI: నంబర్ వన్ జట్టుగా అవతరించిన టీమిండియా
న్యూజిలాండ్పై మూడో వన్డేలో గెలుపు అనంతరం.. స్వదేశంలో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్లో కివీస్ను ఒక్క మ్యాచ్ కూడా గెలవనీయకుండా ఊడ్చేసిన రోహిత్ సేన మరో అరుదైన గౌరవం కూడా దక్కించుకుంది. టీమిండియా.. తాజా ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్కు ముందు మూడో స్థానంలో ఉండిన టీమిండియా.. టాప్ ప్లేస్లో ఉండిన ఇంగ్లండ్ను వెనక్కు నెట్టి అగ్రపీఠానికి చేరుకుంది. The new No.1 team in the @MRFWorldwide ICC Men's ODI Team Rankings 🤩 More 👉 https://t.co/sye7IF4Y6f pic.twitter.com/hZq89ZPO31 — ICC (@ICC) January 24, 2023 3 వన్డేల ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో 12 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్.. రెండో మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో, తాజాగా ముగిసిన ఆఖరి మ్యాచ్లో 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే టీ20 ర్యాంకింగ్స్లో టాప్లో ఉన్న భారత్.. వన్డేల్లోనూ ఈ ఘనత సాధించి అరుదైన రికార్డు నెలకొల్పింది. టెస్ట్ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా (126 రేటింగ్ పాయింట్లు) తర్వాత రెండో స్థానంలో ఉన్న భారత్.. త్వరలో స్వదేశంలో జరిగే 4 మ్యాచ్ల సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకోగలిగితే, ఈ విభాగంలోనూ అగ్రపీఠానికి చేరుకుంటుంది. మొత్తంగా క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో టీమిండియా టాప్ ర్యాంక్కు చేరుకునేందుకు మరో 4 మ్యాచ్ల దూరంలో (4 టెస్ట్లు) ఉంది. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్తో మూడో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఓపెనర్లు రోహిత్ శర్మ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఆఖర్లో హార్ధిక్ పాండ్యా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ✅ A dominant win in a series decider✅ A record win at home✅ Strong comeback after multiple setbacksIndia's journey to the top of the @MRFWorldwide ICC Men's ODI Team Rankings had a bit of everything 👀https://t.co/f9qr0P1xIb— ICC (@ICC) January 24, 2023 అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ను ఓపెనర్ డెవాన్ కాన్వే (100 బంతుల్లో 138; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) సుడిగాలి శతకం సైతం ఆదుకోలేకపోయింది. కాన్వే మినహా మిగతా వారెవ్వరూ భారీ స్కోర్లు చేయకపోవడంతో కివీస్ లక్ష్యానికి 91 పరుగుల దూరంలో నిలిచిపోయింది (41.2 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌట్). హెన్రీ నికోల్స్ (42), మిచెల్ సాంట్నర్ (34) ఓ మోస్తరుగా రాణించారు. భారత బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. చహల్ 2, హార్ధిక్, ఉమ్రాన్ మాలిక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
'కివీస్ను క్లీన్స్వీప్ చేస్తే టీమిండియాకు సువర్ణావకాశం'
ఈ ఏడాది వన్డే వరల్డ్కప్కు టీమిండియా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్- నవంబర్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. దీనికి ముందు టీమిండియా వరుసగా వన్డే సిరీస్లు ఆడుతూ విజయాలు దక్కించుకుంటూ వస్తుంది. ఇప్పటికే లంకతో వన్డే సిరీస్ నెగ్గిన టీమిండియా.. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఇక మూడో వన్డేలోనూ కివీస్ను టీమిండియా ఓడించి సిరీస్ను క్లీన్స్వీప్ చేస్తే వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలచే సువర్ణావకాశం లభించనుంది. ఈ విషయం ఇప్పటికే ఐసీసీ తన ట్విటర్లో పేర్కొంది. ''మూడో వన్డేలో న్యూజిలాండ్ను టీమిండియా ఓడిస్తే వన్డేల్లో నెంబర్వన్ ర్యాంకు సొంతం చేసుకోనుంది'' అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్, న్యూజిలాండ్, టీమిండియాలు 113 రేటింగ్ పాయింట్లతో ఉన్నప్పటికి మ్యాచ్లు, పాయింట్ల ఆధారంగా వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ టీమిండియా న్యూజిలాండ్ను మూడో వన్డేల్లో ఓడిస్తే రెండు రేటింగ్ పాయింట్లతో మొత్తంగా 115 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచే అవకాశం ఉంది. రానున్న వన్డే వరల్డ్కప్కు ముందు టీమిండియాకు ఇది మంచి బూస్టప్ అని చెప్పొచ్చు. ఒకవేళ టీమిండియా కివీస్తో మూడో వన్డేలో ఓడినా రెండో స్థానంలో నిలిచే అవకాశం కూడా ఉంది. మరి మంగళవారం ఇండోర్ వేదికగా జరగనున్న మూడో వన్డేలో టీమిండియా గెలిచి వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి దూసుకెళ్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ICC confirms if India beat New Zealand in the 3rd ODI, India will be number 1 in ranking. — Johns. (@CricCrazyJohns) January 22, 2023 చదవండి: విధ్వంసం సృష్టిస్తున్నాడు.. టెస్టు క్రికెటర్ ముద్ర చెరిపేయాల్సిందే 'టీమిండియా రైట్ ట్రాక్లోనే వెళ్తుందా?'.. మీకేమైనా అనుమానమా! -
టీమిండియా చేతిలో పరాజయం.. టాప్ ర్యాంక్ కోల్పోయిన న్యూజిలాండ్
IND VS NZ 2nd ODI: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే తర్వాత ఐసీసీ టీమ్ వన్డే ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. టీమిండియా చేతిలో ఓటమి అనంతరం న్యూజిలాండ్ వన్డేల్లో తమ టాప్ ర్యాంక్ కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. తాజా ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ అగ్రస్థానానికి చేరుకోగా టీమిండియా నాలుగు నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్ ఖాతాల్లో సమానంగా 113 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కివీస్తో సిరీస్ను భారత్ 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేస్తే సింగిల్గా టాప్ ర్యాంక్కు చేరుకుంటుంది. ఇప్పటికే టీ20ల్లో టాప్ ర్యాంక్లో ఉన్న భారత్.. వన్డేల్లో ఆ స్థానాన్ని చేరుకునేందుకు మరో మ్యాచ్ దూరంలో మాత్రమే ఉంది. ఇక టెస్ట్ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా (126 రేటింగ్ పాయింట్లు) తర్వాత రెండో స్థానంలో ఉన్న భారత్.. త్వరలో స్వదేశంలో జరిగే 4 మ్యాచ్ల సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకోగలిగితే, ఈ విభాగంలోనూ అగ్రపీఠానికి చేరుకుంటుంది. మొత్తంగా క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో టీమిండియా టాప్ ర్యాంక్కు చేరుకునేందుకు మరో 5 మ్యాచ్ల దూరంలో (ఓ వన్డే, 4 టెస్ట్లు) మాత్రమే ఉంది. ఇదిలా ఉంటే, రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. మహ్మద్ షమీ (3/18), మహ్మద్ సిరాజ్ (1/10), శార్దూల్ ఠాకూర్ (1/26), హార్ధిక్ పాండ్యా (2/16), కుల్దీప్ యాదవ్ (1/29), వాషింగ్టన్ సుందర్ (2/7) విజృంభించడంతో 34.3 ఓవర్లలోనే కివీస్ను 108 పరుగులకు ఆలౌట్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రేస్వెల్ (22), మిచెల్ సాంట్నర్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 20.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (50 బంతుల్లో 51 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్లో 48వ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ (53 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు) భీకర ఫామ్ను కొనసాగించాడు. వేగంగా మ్యాచ్ ముగించే క్రమంలో విరాట్ కోహ్లి (9 బంతుల్లో 11; 2 ఫోర్లు) సాంట్నర్ బౌలింగ్లో స్టంప్ ఔటయ్యాడు. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లే, మిచెల్ సాంట్నర్లకు తలో వికెట్ దక్కింది. నామమాత్రమైన మూడో వన్డే ఇండోర్ వేదికగా జనవరి 24న జరుగనుంది. -
వన్డే ర్యాంకింగ్స్లో అదరగొట్టిన విరాట్ కోహ్లి.. టాప్-5లోకి ఎంట్రీ
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అదరగొట్టాడు. శ్రీలంకతో వన్డే సిరీస్లో రెండు సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లి.. బ్యాటర్ల ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో 283 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. సిరీస్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక రాబోయే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్లో కోహ్లి అద్భుతంగా రాణిస్తే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు క్వింటన్ డికాక్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్ను వెనుక్కి నెట్టి రెండో ర్యాంక్కు చేరే అవకాశం ఉంది. టాప్ ర్యాంక్లో 887 పాయింట్లతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కొనసాగుతున్నాడు. కాగా కోహ్లి ఖాతాలో ప్రస్తుతం 750 రేటింగ్ ఉంది. విరాట్ ఇదే ఫామ్ను మరో ఏడాది పాటు కొనసాగిస్తే బాబర్ను అధిగమించడం పెద్ద విషయం ఏమీ కాదు. మరోవైపు మహ్మద్ సిరాజ్ కూడా బౌలర్ల ర్యాంకింగ్స్లో సత్తా చాటాడు. తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ను సిరాజ్ సాధించాడు. శ్రీలంకపై అద్భుత ప్రదర్శన కనబరిచిన సిరాజ్.. మూడో ర్యాంక్కు చేరుకున్నాడు. చదవండి: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి టీమిండియా కీలక పేసర్గా! ఆ ఒక్క లోటు తప్ప! కెప్టెన్ మాటలు వింటే.. -
Ind vs SL: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో మెరిసిన కోహ్లి, రోహిత్..
ICC Men's ODI Batting Rankings: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ర్యాంకింగ్స్లో సత్తా చాటారు. స్వదేశంలో శ్రీలంకతో తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ ఇద్దరు క్రికెటర్లు తమ ర్యాంకులను మెరుగుపరచుకున్నారు. గువహటి మ్యాచ్లో ఓపెనర్ రోహిత్ శర్మ.. 67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. అద్భుత ఇన్నింగ్స్తో.. ఇక వన్డౌన్ బ్యాటర్గా వచ్చిన కోహ్లి.. 87 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 113 పరుగులు సాధించాడు. తద్వారా వన్డేల్లో 45వ సెంచరీ, ఓవరాల్గా అంతర్జాతీయ కెరీర్లో 73వ శతకం తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో కోహ్లి రెండు స్థానాలు ఎగబాకి.. ఆరో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు.. రోహిత్ ఒక స్థానం మెరుగుపరచుకుని ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం వన్డే ర్యాంకింగ్స్లో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా లంకతో తొలి వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే బాబర్ ఆజం(పాకిస్తాన్) రాసి వాన్ డెర్ డసెన్ (సౌతాఫ్రికా) ఇమామ్ ఉల్ హక్(పాకిస్తాన్) క్వింటన్ డి కాక్ (సౌతాఫ్రికా) డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) చదవండి: రంజీల్లో పృథ్వీ షా చరిత్ర.. నా రికార్డు బ్రేక్! థ్రిల్ అయ్యా.. ఎవరికీ అందనంత ఎత్తులో! Ind Vs SL: ఇలాంటి ఆటగాడిని చూడలేదు.. ఆ ప్రేమ నిజం! కోహ్లి ప్రశంసల జల్లు -
ODI Rankings: క్లీన్స్వీప్లు.. టీమిండియా, పాకిస్తాన్ ఏ స్థానాల్లో ఉన్నాయంటే!
ODI Men's Team Rankings: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా మూడో స్థానంలో నిలిచింది. జింబాబ్వేతో వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన భారత జట్టు 111 రేటింగ్ పాయింట్లు సాధించింది. ఇక నెదర్లాండ్స్తో సిరీస్ను 3-0తో వైట్వాష్ చేసిన టీమిండియా దాయాది పాకిస్తాన్ నాలుగో ర్యాంకును పదిలం చేసుకుంది. కివీస్ మొదటి స్థానమే అయినా! ఇక వెస్టిండీస్ను 2-1తో ఓడించిన న్యూజిలాండ్ జట్టు 124 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానాన్ని కాపాడుకుంది. అయితే, విండీస్కు ఒక మ్యాచ్ కోల్పోయిన నేపథ్యంలో ఐదు పాయింట్లు కివీస్ చేజారాయి. మరోవైపు.. ఇంగ్లండ్ 119 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆసియా కప్ టోర్నీకి సన్నద్ధం! కాగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో కేఎల్ రాహుల్ జింబాబ్వేతో వన్డే సిరీస్కు సారథ్యం వహించాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వరుసగా 10 వికెట్లు, 5 వికెట్లు, 13 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. ఈ మూడు మ్యాచ్లలో అద్బుతంగా రాణించిన బ్యాటర్ శుబ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. మరోవైపు.. పాకిస్తాన్ నెదర్లాండ్స్తో సిరీస్ను క్లీన్స్వీప్ చేసినా.. ఆతిథ్య డచ్ జట్టు నుంచి మొదటి, ఆఖరి వన్డేల్లో తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంది. ఇదిలా ఉంటే.. జింబాబ్వే, నెదర్లాండ్స్ పర్యటన ముగించుకున్న టీమిండియా, పాకిస్తాన్ ఆసియా కప్-2022 టోర్నీకి సన్నద్ధమవుతున్నాయి. ఆగష్టు 28న దుబాయ్లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో యూఏఈకి పయనమయ్యాయి. ఐసీసీ మెన్స్ వన్డే జట్టు తాజా ర్యాంకింగ్స్ టాప్-5 1. న్యూజిలాండ్- రేటింగ్- 124 2. ఇంగ్లండ్- రేటింగ్- 119 3. ఇండియా- రేటింగ్- 111 4. పాకిస్తాన్- రేటింగ్- 107 5. ఆస్ట్రేలియా- రేటింగ్- 101 చదవండి: Asia Cup 2022: పాక్తో మ్యాచ్కు ముందు భారత్కు ఎదురుదెబ్బ! ద్రవిడ్ దూరం?! Asia Cup 2022: యూఏఈ చేరుకున్న టీమిండియా.. కోహ్లి ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్ -
సిరీస్ క్లీన్స్వీప్.. వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా స్థానం?
వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ, కోహ్లి, బుమ్రా, షమీ లాంటి సీనియర్ల గైర్హాజరీలో ధావన్ నాయకత్వంలోని యువ జట్టు కరేబియన్ గడ్డపై అదరగొట్టింది. మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసి విండీస్ను సొంతగడ్డపై మట్టికరిపించిన తొలి టీమిండియా జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ టీమిండియా మూడో స్థానానికి చేరుకుంది. ఇంతకముందు 106 పాయింట్లతో పాకిస్తాన్తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్న టీమిండియా.. విండీస్తో వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేయడం ద్వారా నాలుగు పాయింట్లు మెరుగుపరుచుకొని 110 పాయింట్లతో భారత్ మూడో స్థానానికి చేరుకోగా.. పాకిస్తాన్ 106 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయింది. 101 పాయింట్లతో ఆస్ట్రేలియా ఐదో స్థానంలో కొనసాగుతుంది. ఇక 128 పాయింట్లతో న్యూజిలాండ్ టాప్లో ఉండగా.. 119 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉంది. ఇక విండీస్తో వన్డే సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగాయి. ఆఖరి మ్యాచ్లో వర్షం అంతరాయం కలిగించినప్పటికి టీమిండియా స్పష్టమైన ఆధిక్యం చూపెట్టి సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది.మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో వరుణుడు రెండుసార్లు అడ్డు తగలడంతో మ్యాచ్ను 36 ఓవర్లకు కుదించారు. గిల్తో పాటు కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా అర్థ సెంచరీ చేయడం.. శ్రేయాస్ అయ్యర్ 44 పరుగులతో ఆకట్టుకోవడంతో 36 ఓవర్లలో 225 పరుగులు చేసింది. డక్వర్త్ లూయీస్ పద్ధతిలో భారత జట్టు నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో 137 పరుగులకే విండీస్ జట్టు కుప్పకూలింది. దీంతో టీమిండియా 119 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ ఆటగాళ్లలో బ్రాండన్ కింగ్ 42, నికోలస్ పూరన్ 42, హోప్ 22 పరుగులు చేశారు. భారత బౌలర్లలో చహల్ 4, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణా చెరో వికెట్ తీసుకున్నారు. ఇక వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన టీమిండియా ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ విజయంపై కన్నేసింది. జూలై 29 నుంచి ఇరుజట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరగనుంది. చదవండి: IND Vs WI: ఆర్సీబీ అత్యుత్సాహం.. గిల్ విషయంలో తప్పుడు ట్వీట్ ODI Cricket: 'వన్డే క్రికెట్కు ముప్పు లేదు'.. కుండ బద్దలు కొట్టిన ఐసీసీ -
నానాటికి దిగజారుతున్న కోహ్లి ర్యాంక్.. ఏడేళ్లలో తొలిసారి ఈ దుస్థితి..!
Virat Kohli: ఐసీసీ తాజాగా (జులై 27) విడుదల చేసిన పురుషుల వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరింత దిగజారాడు. గడిచిన ఏడేళ్లలో ఎన్నడూ లేనంత కింది ర్యాంక్కు రన్మెషీన్ పడిపోయాడు. తాజా ర్యాంకింగ్స్లో 5వ స్థానానికి (744 రేటింగ్ పాయింట్లు) దిగజారిన కోహ్లి.. 2015 అక్టోబర్ తర్వాత టాప్-4 ర్యాంకింగ్స్లో నుంచి బయటికి వచ్చాడు. గత దశాబ్ద కాలం పాటు వన్డేల్లో మకుటం లేని మారాజుగా చలామణి అయిన కోహ్లి.. ఇటీవలి కాలంలో ఈ ఫార్మాట్లో ఎక్కువ మ్యాచ్లు ఆడకుండా ఈ దుస్థితి తెచ్చుకున్నాడు. రెస్ట్ పేరుతో ప్రస్తుతం విండీస్తో జరుగుతున్న వన్డే సిరీస్కు కూడా అతను డుమ్మా కొట్టాడు. కోహ్లి పరిస్థితి ఇలా ఉంటే, తాజా ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఓ స్థానాన్ని కోల్పోయి 6వ ప్లేస్కు పడిపోయాడు. మరోవైపు విండీస్తో వన్డే సిరీస్లో రాణించిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధవన్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్లు తమ ర్యాంక్లను మెరుగుపర్చుకున్నారు. తొలి వన్డేలో 3 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్న ధవన్ ఓ స్థానం మెరుగుపర్చుకుని 13వ ప్లేస్కు చేరుకోగా.. వరుస హాఫ్సెంచరీలు సాధించిన అయ్యర్ ఏకంగా 20 స్థానాలు ఎగబాకి 54వ స్పాట్కు చేరుకున్నాడు. ఈ జాబితాలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, మరో పాక్ ఆటగాడు ఇమామ్ ఉల్ హాక్, సఫారీ ప్లేయర్లు డస్సెన్, డికాక్లు టాప్ 4గా నిలిచారు. ఇక బౌలర్ల విషయానికొస్తే.. కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అతని కంటే కేవలం ఒక్క పాయింట్ వెనుక ఉండి రెండో స్థానంలో నిలిచాడు. చదవండి: వన్డే, టీ20 ర్యాంకింగ్స్లో నంబర్ 1.. ఇప్పుడు టెస్టు ఫార్మాట్లో! -
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దుమ్మురేపిన పంత్, పాండ్యా
ఇంగ్లండ్తో ముగిసిన ఆఖరి వన్డేలో అద్బుత సెంచరీతో చెలరేగిన రిషభ్ పంత్ టీమిండియాకు సిరీస్ విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. వన్డేల్లో మెయిడెన్ సెంచరీ అందుకున్న పంత్ తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ సత్తా చాటాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో పంత్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి 52వ స్థానానికి చేరుకున్నాడు. ఇదే ఇంగ్లండ్పై 55 బంతుల్లో 71 పరుగులు చేసిన పాండ్యా 8 స్థానాలు ఎగబాకి 42వ స్థానంలో నిలిచాడు. ఇక ఇంగ్లండ్తో ఆఖరి వన్డేలో కెరీర్ బెస్ట్ నమోదు చేసిన పాండ్యా(4/24) బౌలింగ్ ర్యాంకింగ్స్లో 25 స్థానాలు ఎగబాకి 70వ స్థానానికి చేరుకున్నాడు. ఇక యజ్వేంద్ర చహల్ నాలుగు స్థానాలు ఎగబాకి 16వ స్థానంలో నిలిచాడు. గాయంతో ఆఖరి వన్డేకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా తన నెంబర్ వన్ స్థానాన్ని ట్రెంట్ బౌల్ట్కు కోల్పోయాడు. తొలి వన్డేలో 6/19తో కెరీర్ బెస్ట్ నమోదు చేసిన బుమ్రా నెంబర్వన్ స్థానం ఆక్రమించినప్పటికి.. ఆఖరి వన్డేకు దూరమవడంతో టాప్-2కి పడిపోయాడు. బ్యాటింగ్ విభాగంలో బాబర్ ఆజం 892 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉండగా.. ఇమాముల్ హక్ రెండు, వాండర్ డుసెన్ మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక విరాట్ కోహ్లి ఒక స్థానం దిగజారి నాలుగో స్థానంలో నిలవగా.. రోహిత్ శర్మ(5వ స్థానం).. తన స్థానాన్ని కాపాడుకున్నాడు. బౌలింగ్ విభాగంలో ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, షాహిన్ అఫ్రిది వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉండగా.. ఆల్రౌండర్ల విభాగంలో షకీబ్ అల్ హసన్ తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత మహ్మద్ నబీ, రషీద్ ఖాన్లు ఉన్నారు. టీమిండియా నుంచి హార్దిక్ పాండ్యా ఎనిమిదో స్థానంలో కొనసాగతున్నాడు. A new No.1! A busy week in ODI cricket has led to a number of changes in the @MRFWorldwide ICC Men's Player Rankings. Details 👇 — ICC (@ICC) July 20, 2022 చదవండి: తొలి మ్యాచ్లోనే అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్.. 4 వికెట్లతో..! 'కార్లు కాదు పరిగెత్తడానికి.. రిటైర్మెంట్తోనైనా మేల్కొనండి' -
ICC ODI Rankings: వరల్డ్ నెంబర్ వన్ వన్డే బౌలర్గా బుమ్రా!
ICC ODI Bowling Rankings: ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో రాణించిన అతడు ఏకంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. మూడు స్థానాలు ఎగబాకి 718 పాయింట్లతో వరల్డ్ నంబర్ వన్ వన్డే బౌలర్గా నిలిచాడు. బుమ్రా మినహా మరే ఇతర టీమిండియా బౌలర్లు టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయారు. కాగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్లో బుమ్రా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఓవల్ వేదికగా సాగిన ఈ మ్యాచ్లో 7.2 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. అదే విధంగా ఇంగ్లండ్ గడ్డపై వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తొలి పేసర్గా నిలిచాడు బుమ్రా. అంతేకాకుండా పలు ఇతర రికార్డులు కూడా తన పేరిట లిఖించుకున్నాడు. సుమారు ఆరేళ్ల తర్వాత వన్డేల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఇక ఇప్పటికే ఇంగ్లండ్తో టీ20 సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ గెలుపుతో వన్డే సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. కాగా బుమ్రా రెండేళ్ల అనంతరం టాప్ ర్యాంకు అందుకోవడం విశేషం. గతంలో(2017) టి20 బౌలింగ్ విభాగంలో అతను టాప్ ర్యాంకులో నిలిచాడు. ఇదిలా ఉంటే.. భారత్ తరఫున భువనేశ్వర్ మాత్రమే టి20 బౌలర్ల జాబితాలో టాప్–10లో (ఏడో ర్యాంకులో) ఉన్నాడు. వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో కోహ్లి (803), రోహిత్ శర్మ (802) వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్-10లో ఉన్న బౌలర్లు వీళ్లే! 1.జస్ప్రీత్ బుమ్రా(ఇండియా) 2.ట్రెంట్ బౌల్ట్(న్యూజిలాండ్) 3.షాహిన్ ఆఫ్రిది(పాకిస్తాన్) 4.జోష్ హాజిల్వుడ్(ఆస్ట్రేలియా) 5.ముజీబ్ ఉర్ రెహమాన్(అఫ్గనిస్తాన్) 6.మెహెదీ హసన్(బంగ్లాదేశ్) 7.క్రిస్ వోక్స్(ఇంగ్లండ్) 8. మ్యాట్ హెన్రీ(న్యూజిలాండ్) 9.మహ్మద్ నబీ(అఫ్గనిస్తాన్) 10. రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్) చదవండి: ICC T20 Rankings: దుమ్ము లేపిన సూర్యకుమార్.. ఏకంగా 44 స్థానాలు ఎగబాకి.. ఐదో ర్యాంకు! -
పాక్ కెప్టెన్ అరుదైన ఘనత.. మెచ్చుకొని తీరాల్సిందే!
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం వన్డే క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ ఆల్టైమ్ వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో బాబర్ ఆజం భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ను అధిగమించి 15వ స్థానానికి చేరుకున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్లో 57, 114,105* సూపర్ ప్రదర్శనతో ఆకట్టుకున్న బాబర్ ఆజం కోసం ఐసీసీ ప్రత్యేకంగా ఆల్టైమ్ ర్యాంకింగ్స్ను సవరించింది. దీనిలో భాగంగానే బాబర్.. 891 పాయింట్లతో సచిన్ను అధిగమించి 15వ స్థానంలో నిలిచాడు. సచిన్ 887 పాయింట్లతో 16వ స్థానంలో ఉన్నాడు. ఇక ఈ జాబితాలో టీమిండియా నుంచి సచిన్ కంటే కోహ్లి చాలా ముందు ఉన్నాడు. 911 పాయింట్లతో కోహ్లి ఆరో స్థానంలో ఉండడం విశేషం. విండీస్ దిగ్గజం సర్ వివ్ రిచర్డ్స్ 935 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో పాక్ గ్రేట్ జహీర్ అబ్బాస్ 931 పాయింట్లతో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ 921 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత డేవిడ్ గ్రోవర్(ఇంగ్లండ్, 919 పాయింట్లు), డీన్ జోన్స్( ఆస్ట్రేలియా, 918 పాయింట్లు) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. కాగా టాప్ 16 మందిని పరిశీలిస్తే.. కోహ్లి, బాబర్ ఆజం తప్ప మిగతావారు ఎప్పుడో క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. సమకాలీన క్రికెట్లో కోహ్లితో పాటు బాబర్ ఆజం కూడా మంచి రికార్డులు నమోదు చేస్తున్నాడు. బాబర్ ఆజం సాధించిన ఫీట్ గురించి తెలుసుకున్న టీమిండియా అభిమానులు.. ''కోహ్లి తర్వాతే ఉన్నప్పటికి.. బాబర్ ఆజం ఇటీవలే సూపర్గా ఆడుతున్నాడు.. ప్రత్యర్థి అయినా మెచ్చుకొని తీరాల్సిందే'' అంటూ కామెంట్ చేశారు. చదవండి: Nari Contractor: టీమిండియా మాజీ కెప్టెన్ తలలో మెటల్ ప్లేట్.. 60 ఏళ్ల తర్వాత తొలగింపు! అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన స్టార్ క్రికెటర్.. Babar Azam has moved up to 15th position in the ICC All-Time ODI Batting Rankings #Cricket pic.twitter.com/2T6HZTZhT4 — Saj Sadiq (@SajSadiqCricket) April 6, 2022 -
ICC Ranking: బంగ్లా పులుల దెబ్బకు వెనక్కు తగ్గిన పాక్..
ఇటీవల ముగిసిన వన్డే సిరీస్లో దక్షిణాఫ్రికాను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. తాజాగా విడుదలైన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లోనూ సత్తా చాటింది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1తో గెలుచుకుని సఫారీ గడ్డపై తొలి సిరీస్ విజయాన్ని సొంతం చేసుకున్న బంగ్లా పులులు.. వన్డే ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ను వెనక్కి నెట్టి ఆరో స్థానానికి ఎగబాకాయి. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన తొలి వన్డేలో 88 పరుగుల తేడాతో ఓటమి చవిచూడటంతో పాకిస్థాన్ ఏడో స్థానానికి పడిపోయింది. తాజా ర్యాంకింగ్స్లో బంగ్లాదేశ్, పాకిస్థాన్లకు సమానంగా 93 పాయింట్లే ఉన్నప్పటికీ.. రేటింగ్ పాయింట్స్లో పాక్తో పోలిస్తే మెరుగ్గా ఉండటంతో బంగ్లాదేశ్ ఆరోస్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ 121 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లండ్ (119), ఆస్ట్రేలియా (117), టీమిండియా (110), సౌతాఫ్రికా (102) వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో నిలిచాయి. ఆరు, ఏడు స్థానాల్లో బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఉండగా.. 8వ స్థానంలో శ్రీలంక (81), 9వ స్థానంలో వెస్టిండీస్ (77), 10వ స్థానంలో ఆఫ్ఘనిస్థాన్ (68) జట్లు ఉన్నాయి. చదవండి: ఐపీఎల్ మీడియా హక్కుల టెండర్లకు ఆహ్వానం.. బీసీసీఐపై కనకవర్షం..! -
ICC ODI Rankings: మూడో స్థానానికి రోహిత్.. కోహ్లికి మరింత దగ్గర
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో రోహిత్ శర్మ తన పాయింట్లను మెరుగుపరుచుకున్నాడు. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో తొలి మూడు స్థానాల్లో ఉన్న బాబర్ అజమ్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల మధ్య ఎలాంటి మార్పు లేదు. అయితే విండీస్తో జరిగిన తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించిన రోహిత్ మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో రోహిత్ ఖాతాలో రెండు పాయింట్లు జమ అయ్యాయి. ప్రస్తుతం రోహిత్ 807 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. కోహ్లి 828 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. బాబార్ అజమ్ 873 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక మిగతావారిలో చూసుకుంటే ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్, పాకిస్తాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్లు టాప్టెన్లోకి దూసుకొచ్చారు. 741 పాయింట్లతో ఫఖర్ జమాన్ తొమ్మిదో స్థానంలో ఉండగా.. జో రూట్ 740 పాయింట్లతో పదో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్లో ఎలాంటి మార్పు లేదు. విండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ మాత్రం ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో టాప్ 20లోకి ప్రవేశించాడు. టీమిండియాతో తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే. 🔹 Babar Azam still at the top 🔹 Rohit Sharma closes in on Virat Kohli 🔹 Fakhar Zaman and Joe Root sneak into the top 10 Here’s how things stand after the latest update to the @MRFWorldwide ICC Men's ODI Player Rankings for batters 📈 More details 👉 https://t.co/gkPWgLbUCq pic.twitter.com/JOgc1SpQKm — ICC (@ICC) February 9, 2022 -
ICC Women's ODI Rankings: రెండో ర్యాంక్లో మిథాలీ
ICC Women ODI Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసిన మహిళా బ్యాటర్స్ వన్డే ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ మూడో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియన్ బ్యాటర్ అలీసా హీలీ (750 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా.. మిథాలీ 738 పాయింట్లతో ఆమె తర్వాతి స్థానం ఆక్రమించింది. ఇక భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ ఐదు నుంచి నాలుగో స్థానానికి చేరింది. స్మృతి మంధాన ఆరో ర్యాంకులో మార్పులేదు. బౌలింగ్ విభాగంలో జులన్ గోస్వామి రెండో ర్యాంక్లో... ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో దీప్తి శర్మ నాలుగో ర్యాంక్లో కొనసాగుతోంది. చదవండి: Icc U 19 World Cup 2022: మరో ఫైనల్ వేటలో.. అండర్-19 టీమిండియా IPL 2022 Auction: వేలంలో మనవాళ్లు 23 మంది.. అంబటి, హనుమ విహారి, తన్మయ్, మనీశ్ రెడ్డి.. ఇంకా.. -
కోహ్లి, రోహిత్ల ర్యాంకులు పదిలం.. దూసుకొచ్చిన డికాక్, డస్సెన్
Kohli Retains 2nd Spot In ODI Rankings: ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా బ్యాటర్లు విరాట్ కోహ్లి(2వ ర్యాంక్), రోహిత్ శర్మ(3)లు తమ ర్యాంకులను పదిలంగా కాపాడుకున్నారు. దక్షిణాఫ్రికాతో 3 వన్డేల సిరీస్లో కోహ్లి రెండు హాఫ్ సెంచరీలు బాది రేటింగ్ పాయింట్లను మెరుగుపర్చుకోగా, రోహిత్.. ఈ సిరీస్ ఆడనప్పటికీ తన ర్యాంక్కు కాపాడుకోగలిగాడు. 🔹 Quinton de Kock continues his rise 🔼 🔹 Massive gains for Rassie van der Dussen 🔥 🔹 England players move up in the T20I charts 📈 Here’s how things stand after the latest update to the @MRFWorldwide ICC Men’s Player Rankings 📝 Details 👉 https://t.co/Jxktm5FBsr pic.twitter.com/HBGUPKNHsT — ICC (@ICC) January 26, 2022 మరోవైపు ఇదే సిరీస్లో సెంచరీలతో రాణించిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు డికాక్(5), వాన్డర్ డస్సెన్(10)లు టాప్-10లోకి దూసుకురాగా.. పాక్ సారధి బాబర్ ఆజమ్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత్తో సిరీస్లో రాణించిన సఫారీ కెప్టెన్ టెంబా బవుమా(3 వన్డేల్లో 153 పరుగులు).. ఏకంగా 21 స్థానాలు ఎగబాకి 59వ స్పాట్కు చేరుకోగా, బౌలింగ్ ర్యాంకింగ్స్లో ప్రొటీస్ బౌలర్ ఎంగిడి నాలుగు ప్లేస్లు మెరుగుపర్చుకుని 20 స్థానానికి చేరుకున్నాడు. చదవండి: Rohit Sharma: హిట్ మ్యాన్ ఈజ్ బ్యాక్.. స్లిమ్గా, ఫిట్గా..! -
టాప్ ర్యాంకు కోల్పోయిన మిథాలీ... అదరగొట్టిన ఝులన్ గోస్వామి
ICC ODI Rankings: భారత మహిళల వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తన టాప్ ర్యాంక్ను కోల్పోయింది. ఐసీసీ మంగళవారం ప్రకటించిన మహిళల వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్లో ఆమె అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్లో మిథాలీ విఫలం కావడం ఆమె ర్యాంక్పై ప్రభావం చూపింది. ఈ క్రమంలో మిథాలీ రాజ్ 738 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా... రెండో స్థానంలో ఉన్న లిజెల్లే లీ (దక్షిణాఫ్రికా) 761 పాయింట్లతో తొలి ర్యాంక్ను అందుకుంది. అదే విధంగా... భారత జట్టు మరో బ్యాటర్ స్మృతి మంధాన 710 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇక బౌలర్లలో ఝలన్ గోస్వామి 727 పాయింట్లతో రెండు స్థానాలు పురోగమించి.. ద్వితీయ స్థానానికి చేరుకుంది. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్లో భాగంగా ఝలన్ గోస్వామి 4 వికెట్లతో రాణించిన సంగతి తెలిసిందే. బ్యాట్తోనూ సత్తా చాటిన ఆమె... ఆల్రౌండర్ల జాబితాలో టాప్-10లో నిలిచింది. ఈ విభాగంలో గతంలో టాప్-4లో ఉన్న దీప్తి శర్మ.. ప్రస్తుత ర్యాంకింగ్స్లో ఐదో స్థానానికి పడిపోయింది. చదవండి: Unmukt Chand: అమెరికన్ లీగ్లో పరుగుల సునామీ సృష్టించిన మాజీ భారత బ్యాటర్ -
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: దుమ్మురేపిన మిథాలీ.. రెండేళ్ల తర్వాత
దుబాయ్: ఐసీసీ మంగళవారం ప్రకటించిన ఐసీసీ వుమెన్స్ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా వుమెన్స్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సత్తా చాటింది. ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో 72 పరుగులతో ఆకట్టుకున్న మిథాలీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్ 5లోకి అడుగుపెట్టింది. 725 పాయింట్లతో మూడు స్థానాలు ఎగబాకిన ఆమె ఐదో స్థానంలో నిలిచింది. తాజాగా 22 ఏళ్ల క్రికెట్ కెరీర్ను పూర్తి చేసుకున్న మిథాలీ 38 ఏళ్ల వయసులోనూ అద్భుత ఫామ్తో అదరగొడుతుంది. 2019 తర్వాత మిథాలీ వన్డే ర్యాంకింగ్స్లో మళ్లీ టాప్ 5లోకి అడుగుపెట్టడం విశేషం. ఇక బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లండ్కు చెందిన టామీ బ్యూమాంట్ 791 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా బ్యాట్స్వుమన్ లిజీ లీ 758 పాయింట్లతో రెండో స్థానంలో, ఆసీస్కు చెందిన అలీసా హేలీ 756 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో టీమిండియా నుంచి జులన్ గోస్వామి 681 పాయింట్లతో తన ఐదో స్థానాన్ని నిలుపుకోగా.. ఆసీస్కు చెందిన జెస్ జోనాసన్, మేఘన్ స్కట్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇక ఆల్రౌండ్ విభాగంలో టీమిండియా నుంచి దీప్తి శర్మ ఐదో స్థానంలో నిలవగా.. ఎలిస్సే పేరీ(ఆస్ట్రేలియా) తొలి స్థానంలో,మేరీజన్నే కాప్(దక్షిణాఫ్రికా), స్టాఫైన్ టేలర్(వెస్టిండీస్) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక ఇంగ్లండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భాగంగా టీమిండియా తొలి వన్డేలో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 34.5 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కాగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే రేపు(బుధవారం) జరగనుంది. అంతకముందు ఇంగ్లండ్తో జరిగిన ఏకైక డే నైట్ టెస్టు మ్యాచ్ను టీమిండియా డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ఐసీసీ అధికారిక ప్రకటన: టీ20 ప్రపంచకప్ టోర్నీ ఎప్పుడంటే.. ఊహించని విధంగా బౌన్సర్ వేశాడు.. దాంతో In the latest @MRFWorldwide ICC Women's ODI Player Rankings for batting: ↗️ @M_Raj03 enters top five ↗️ @natsciver moves up one spot Full list: https://t.co/KjDYT8qgqn pic.twitter.com/szonwdMmn9 — ICC (@ICC) June 29, 2021 -
ICC RANKINGS: రెండో ర్యాంక్ నిలబెట్టుకున్న కోహ్లీ
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా రెండు, మూడు స్థానాలను నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 857 రేటింగ్ పాయింట్లు ఉండగా, రోహిత్ ఖాతాలో 825 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ జాబితాలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ 865 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంకతో జరిగిన సిరీస్లో అద్భుతంగా రాణించిన బంగ్లా వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ 739 రేటింగ్ పాయింట్లు సాధించి 14వ స్థానానికి ఎగబాకాడు. ఇదిలా ఉంటే, బౌలర్ల ర్యాంకింగ్స్లో భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (690 పాయింట్లు) ఒక స్థానాన్ని కోల్పోయి ఐదో ప్లేస్కు దిగజారాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ నంబర్వన్గా కొనసాగుతుండగా, బంగ్లా బౌలర్ మెహదీ హసన్ (725 పాయింట్లు) మూడు స్థానాలు ఎగబాకి రెండో ప్లేస్కు, మరో బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ (652) తొమ్మిదో స్థానానికి ఎగబాకారు. ఆల్రౌండర్ల జాబితాలో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్లో బంగ్లా సీనియర్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ 387 పాయింట్లతో టాప్లో ఉన్నాడు. ఇక జట్టు ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్(121), ఆస్ట్రేలియా(118), భారత్(115), ఇంగ్లండ్(115) వరుసగా ఒకటి నుంచి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. చదవండి: ధోనీ కోసం గంగూలీని పది రోజులు బతిమాలాను.. -
కెరీర్ బెస్ట్ సాధించిన బంగ్లా బౌలర్.. ఐదో స్థానంలో బుమ్రా
దుబాయ్: ఐసీసీ బుధవారం ప్రకటించిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో బౌలింగ్ విభాగంలో బంగ్లా బౌలర్లు దుమ్మురేపారు. స్పిన్నర్ మెహదీ హసన్ 3 స్థానాలు ఎగబాకి 725 పాయింట్లతో రెండో ర్యాంక్లో నిలిచి కెరీర్ బెస్ట్ సాధించాడు. మరో బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ ఏకంగా 8 స్థానాలు ఎగబాకి 652 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఐసీసీ వరల్డ్కప్ సూపర్ సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ను ఇప్పటికే 2-0 తేడాతో బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో మెహదీ హసన్ రెండు మ్యాచ్లు కలిపి 7 వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ 6 వికెట్లు తీసి కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు హసన్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో బంగ్లా నుంచి ఒక స్పిన్నర్ టాప్2లో నిలవడం ఇదే మూడోసారి. ఇంతకముందు ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ 2009లో తొలిసారి బౌలింగ్ విభాగంలో నెంబర్వన్ స్థానంలో నిలిచాడు. ఇక 2010లో మరో బంగ్లా స్పిన్నర్ అబ్దుర్ రజాక్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్ 2లో నిలిచాడు. ఇక తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 737 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. అఫ్గన్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహమాన్ 708 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఆసీస్ బౌలర్ మాట్ హెన్రీ(691 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా 690 పాయింట్లతో ఒకస్థానం దిగజారి ఐదో స్థానంలో నిలిచాడు. బుమ్రా తప్ప మరో టీమిండియా బౌలర్ టాప్టెన్లో లేకపోవడం విశేషం. ఇక బ్యాటింగ్ విభాగానికి వస్తే బాబర్ అజమ్(865 పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా.. కోహ్లి(857), రోహిత్ శర్మ 825 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక ఆల్రౌండ్ విభాగంలో బంగ్లా స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ 396 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. టీమిండియా నుంచి జడేజా 245 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. చదవండి: World Cup Super League: భారీ విజయం.. టాప్లో బంగ్లాదేశ్! ⬆️ Mehidy Hasan Miraz climbs to No.2 ⬆️ Mustafizur Rahman breaks into top 10 Huge gains for Bangladesh bowlers in the @MRFWorldwide ICC Men’s ODI Player Rankings 👏 pic.twitter.com/nr1PGH0ukT — ICC (@ICC) May 26, 2021\ -
కోహ్లీ 'ఆ సలహా' వల్లే నేడు ఈ స్థాయికి: బాబర్ ఆజమ్
కరాచీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇచ్చిన ఆ సలహా వల్లే తన బ్యాటింగ్ ఈ స్థాయికి చేరిందని ప్రశంసలతో ముంచెత్తాడు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్. నెట్స్లో సీరియస్గా ప్రాక్టీస్ చేయాలని కోహ్లి ఇచ్చిన సలహాతో తన ఆట చాలా మెరుగుపడిందని ఆయన వెల్లడించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో దుమ్మురేపుతున్న ఆజమ్.. ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లిని వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. సఫారీలతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో వరుసగా 103, 31, 94 పరుగులతో రాణించిన ఆజమ్.. ఆ సిరీస్లో 13 పాయింట్లు సాధించి, పాక్ సిరీస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచిన సందర్భంగా సహచర క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్తో జరిగిన చిట్చాట్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ చిట్ చాట్ సందర్భంగా కోహ్లి ఇచ్చిన సలహాను ఆజమ్ గుర్తు చేసుకున్నాడు. గతంలో నేను నెట్ ప్రాక్టీస్ను చాలా తేలికగా తీసుకునేవాడినని, ఆ తర్వాత కోహ్లి సలహా మేరకు ఆ అలవాటును మార్చుకున్నాని పేర్కొన్నాడు. నెట్ సెషన్స్ ఎంత ముఖ్యమో ఆ తరువాతే అర్థం చేసుకున్నానని, అక్కడ కష్టపడితేనే మైదానంలో సత్తా చాటగలమని గ్రహించానని వెల్లడించాడు. నెట్స్లో నిర్లక్ష్యపు షాట్లు ఆడకూడదని, నెట్ సెషన్స్ను కూడా మ్యాచ్లానే భావించాలని కోహ్లీ సూచించాడని తెలిపాడు. నెట్స్లో మన ప్రవర్తన ఎలా ఉంటే మ్యాచ్లో కూడా అలానే ఉంటుందని కోహ్లి చెప్పిన విషయాన్ని ఆజమ్ గుర్తు చేసుకున్నాడు. -
విరాట్కు ఛేజింగ్ అంటే ఎంత ఇష్టమో తెలుసుగా..
చెన్నై: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని(857 రేటింగ్ పాయింట్లు) వెనక్కునెట్టి టాప్ ర్యాంక్కు చేరుకున్న పాక్ కెప్టెన్ బాబర్ అజమ్కు(865) భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వసీం జాఫర్ శుభాకాంక్షలు తెలిపారు. వన్డేల్లో బాబర్ టాప్ ప్లేస్కు చేరిన సందర్భంగా ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలపడంతో పాటు అతని టాప్ ర్యాంక్పై వ్యంగ్యాస్త్రం సంధించాడు. టీమిండియా కెప్టెన్కు ఛేజింగ్ అంటే ఎంత ఇష్టమో తెలుసుగా.. నీ టాప్ ర్యాంక్ను కూడా అతి త్వరలోనే సక్సెస్ఫుల్గా ఛేజ్ చేస్తాడన్న అర్ధం వచ్చేలా ఆయన ట్వీట్లో పేర్కొన్నాడు. జాఫర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది. Congratulations @babarazam258, well deserved. But don't get too comfy at the top, you know how much Virat Kohli loves chasing 😉 #ICCRankings https://t.co/Zl2i8DFHG8 — Wasim Jaffer (@WasimJaffer14) April 14, 2021 ఇదిలా ఉంటే ఐసీసీ వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్లో కోహ్లి ఏకంగా 1258 రోజులు పాటు టాప్ ర్యాంక్లో కొనసాగి చరిత్ర సృష్టించాడు. ఇటీవల కాలంలో అతనికి వన్డే క్రికెట్ ఆడే అవకాశం ఎక్కువగా రాకపోవడం వల్లే టాప్ ర్యాంక్ను కోల్పోయాడు. చివరిసారిగా అతను ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరీస్లో ఆడాడు. అందులో కూడా రెండు అర్ద శతకాలతో రాణించి, టీమిండియాకు సిరీస్ విక్టరీని(2-1) అందించాడు. మరోవైపు దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో అద్భుతంగా రాణించిన పాక్ కెప్టెన్.. ఆ సిరీస్ ద్వారా 13 పాయింట్లు దక్కించుకుని, కోహ్లిపై 8 పాయింట్ల ఆధిక్యంలో నిలిచాడు. సఫారీలతో జరిగిన ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో 103, రెండో వన్డేలో 31, మూడో వన్డేలో 94 పరుగులతో రాణించిన అజమ్.. ఆ జట్టు సిరీస్ విజయం(2-1) సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో అతను టీమిండియా కెప్టెన్ను ఓవర్టేక్ చేసి టాప్ ర్యాంక్కు చేరుకున్నాడు. ఈ క్రమంలో జహీర్ అబ్బాస్, జావిద్ మియాందాద్, మహ్మద్ యూసఫ్ల తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంక్కు చేరుకున్న నాలుగో పాక్ బ్యాట్స్మెన్గా రికార్డుల్లోకెక్కాడు. -
పాక్ కెప్టెన్ నుంచి కోహ్లికి పొంచి ఉన్న ముప్పు..
దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టాప్ ర్యాంక్కు పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ ఎసరు పెట్టేలా ఉన్నాడు. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్లో 857 రేటింగ్ పాయింట్లు కలిగిన టీమిండియా కెప్టెన్.. రెండో స్థానంలో ఉన్న పాక్ కెప్టెన్ బాబర్ అజామ్(852) కంటే కేవలం ఐదు పాయింట్లు ఎక్కువ కలిగి ఉన్నాడు. ఇటీవల ఇంగ్లాండ్తో ముగిసిన వన్డే సిరీస్లో రెండు అర్ద శతకాలతో రాణించిన కోహ్లి.. అగ్రస్థానాన్ని కాపాడుకోగలిగాడు. అయితే కోహ్లి టాప్ ర్యాంకుకు ఇప్పుడు ముప్పొచ్చేలా కనిపిస్తుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ అద్భుతంగా రాణించడంతో అతను రేటింగ్ పాయింట్లను భారీగా పెంచుకొని వచ్చే వారం ప్రకటించబోయే ఐసీసీ ర్యాంకుల్లో కోహ్లిను దాటి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోనున్నాడు. తొలి వన్డేలో 103, రెండో వన్డేలో 31, మూడో వన్డేలో 94 పరుగులతో రాణించిన అజమ్.. ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతను మొదటి, మూడు వన్డేల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఈ సిరీస్లో అజమ్కు తోడుగా ఫకర్ జమాన్(193, 103) కూడా రాణించడంతో పాక్ జట్టు దక్షిణాఫ్రికాను వారి సొంతగడ్డపై 2-1తేడాతో మట్టికరిపించింది. కాగా, సమకాలీన క్రికెట్లో కోహ్లికు పోటీగా బాబర్ ఆజమ్ ఉంటాడని పలువురు విశ్లేషకులు చెబుతుంటారు. -
టాప్లో కొనసాగుతున్న కోహ్లి..
దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దుమ్ములేపాడు. ఇటీవల ఇంగ్లండ్తో ముగిసిన వన్డే సిరీస్లో వరుసగా హాఫ్ సెంచరీలతో(56, 66) అలరించిన ఛేజింగ్ కింగ్.. వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్.. 870 రేటింగ్ పాయింట్లు సాధించి నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మూడో ర్యాంకులో కొనసాగుతుండగా.. వరుసగా హాఫ్ సెంచరీ, సెంచరీ బాదిన కేఎల్ రాహుల్ 31 స్థానం నుంచి 27వ స్థానానికి ఎగబాకాడు. ఆఖరి వన్డేలో సూపర్ ఫిఫ్టీ సాధించిన హార్దిక్ 42వ ర్యాంకు దక్కించుకోగా, వరుస అర్ధసెంచరీలతో చెలరేగిన రిషబ్ పంత్(77, 78) టాప్-100లో అడుగుపెట్టాడు. మరోవైపు బౌలింగ్ విభాగంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక ర్యాంకు దిగజారి నాలుగో స్థానంలో నిలువగా, భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల తర్వాత బెస్ట్ ర్యాంక్(11వ ర్యాంక్) అందుకున్నాడు. ఇంగ్లండ్తో సిరీస్లో 7 వికెట్లు తీసిన పేసర్ శార్దూల్ ఠాకూర్ 93 నుంచి 80వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానంలో, ఆఫ్ఘన్ బౌలర్ ముజీబుర్ రెహ్మాన్ రెండులో, న్యూజిలాండ్ మ్యాట్ హెన్రీ మూడో స్థానంలో నిలిచారు. చదవండి: సన్రైజర్స్కు ఊహించని షాక్..లీగ్ నుంచి స్టార్ ఆటగాడు ఔట్ -
వన్డే ర్యాంకింగ్స్లో దూసుకెళ్లిన టీమిండియా
దుబాయ్: ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ను 2-1తేడాతో కైవసం చేసుకున్న భారత జట్టు.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్తో టెస్టు(3-1), టీ20(3-2) సిరీస్లను సైతం కైవసం టీమిండియా టెస్టుల్లో అగ్రస్థానంలో, టీ20ల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. టీమిండియా చేతిలో వన్డే సిరీస్ కోల్పోయినప్పటికీ.. ఇంగ్లాండ్ 121 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వన్డే సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కోహ్లి సేన.. న్యూజిలాండ్(118)ను మూడో స్థానానికి నెట్టి 119 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్ను 3-0తో వైట్వాష్ చేసిన న్యూజిలాండ్ 118 పాయింట్లకు మాత్రమే పరిమితమై మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక్కడ చదవండి: ఆ క్యాచ్ హైలెట్.. ఒకవేళ అవి జారవిడవకుండా ఉంటే..! ఈ జాబితాలో 111 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో, 108 పాయింట్లతో ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా జట్లు నిలిచాయి. కాగా, భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో టీమిండియా 7 పరుగుల తేడాతో సూపర్ విక్టరీని సాధించి ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో చివరిదాకా పోరాడి భారత శిబిరంలో గుబులు పుట్టించిన ఇంగ్లాండ్ యువ ఆల్రౌండర్ సామ్ కర్రన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కైవసం చేసుకోగా, వరుస అర్ధసెంచరీలతో అలరించిన ఇంగ్లండ్ ప్లేయర్ జానీ బెయిర్ స్టోకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ఇక్కడ చదవండి: టీమిండియా టాపార్డర్ తీరుపై వీవీఎస్ అసంతృప్తి! -
టాప్లో కోహ్లి.. రెండుకే పరిమితమైన రోహిత్
దుబాయ్: ఐపీసీ బుధవారం ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. బ్యాటింగ్ విభాగంలో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి దుమ్మురేపాడు. 870 పాయింట్లతో కోహ్లి అగ్రస్థానంలో నిలవగా.. హిట్మాన్ రోహిత్ మాత్రం 842 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఇక మూడో స్థానంలో పాక్ బ్యాట్స్మన్ బాబర్ అజమ్(837 పాయింట్లు) కొనసాగుతున్నాడు. కాగా అజమ్కు.. రోహిత్కు కేవలం 5 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. కివీస్ బ్యాట్స్మన్ రాస్ టేలర్ 818 పాయింట్లతో నాలుగు, ఆసీస్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ 791 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. గతేడాది డిసెంబర్లో ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్లో రెండు అర్థసెంచరీలతో మెరిసిన కోహ్లి 870 పాయింట్లతో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. టాప్లో ఉన్న కోహ్లికి, రెండులో ఉన్న రోహిత్కు 28 పాయింట్ల వ్యత్యాసం ఉండడం విశేషం. మరోవైపు ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ మాత్రం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: 'ఇలాగే ఆడితే రికార్డులు బ్రేక్ అవడం ఖాయం' ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 722 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆప్ఘన్ క్రికెటర్ ముజీబ్ ఉర్ రెహమాన్ రెండో స్థానంలో ఉండగా.. టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మూడో స్థానంలో నిలిచాడు. బంగ్లా బౌలర్ మెహదీ హసన్, ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. ఆల్రౌండ్ విభాగంలో బంగ్లా స్టార్ ఆటగాడు షకీబ్ ఆల్ హసన్ టాప్ లేపగా.. మహ్మద్ నబీ, వోక్స్, స్టోక్స్, ఇమాద్ వసీమ్లు వరుసగా 2,3,4,5 స్థానాల్లో ఉన్నారు. టీమిండియా నుంచి రవీంద్ర జడేజా(8వ స్థానం) మాత్రమే టాప్ టెన్లో చోటు దక్కించుకున్నాడు.చదవండి: కోహ్లి కెప్టెన్... నేను వైస్ కెప్టెన్ అంతే! -
దుమ్మురేపిన కోహ్లి.. రెండో స్థానంలో రోహిత్
దుబాయ్ : 2020 ఏడాది ముగింపు సందర్భంగా గురువారం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ను ప్రకటించింది. ఆసీస్ టూర్లో రెండు హాఫ్ సెంచరీలతో స్థిరమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 870 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. గాయం కారణంగా ఆసీస్ టూర్కు దూరంగా ఉన్న హిట్మ్యాన్ రోహిత్ శర్మ 842 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి రెండు స్థానాల మధ్య 28 పాయింట్ల వ్యత్యాసం ఉండడం విశేషం. (చదవండి : అందుకే హార్దిక్ను వద్దనుకున్నాం: కోహ్లి) బాబర్ అజమ్(837), రాస్ టేలర్(818), ఆరోన్ ఫించ్(791) పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. ఇక టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్లో వరుసగా రెండు సెంచరీలు సాధించి జోరు కనబర్చిన ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ చాలారోజుల తర్వాత టాప్ 20లోకి అడుగుపెట్టగా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా టాప్ 20లో చోటు సంపాదించాడు. ఇక ఆసీస్ టూర్లో బ్యాటింగ్లో ఇరగదీసిన టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 555 పాయింట్లతో 49వ స్థానంలో నిలిచి బ్యాటింగ్లో కెరీర్ బెస్ట్ చేరుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 722 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. బంగ్లాదేశ్ బౌలర్ ముజీబుర్ రెహమాన్ 701 పాయింట్లతో రెండో స్థానం.. టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా 700 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో టాప్ 10లో బుమ్రా మినహా టీమిండియా నుంచి ఒక్క బౌలర్ కూడా లేడు. ఇక ఆసీస్కు చెందిన హాజిల్వుడ్, పాట్ కమిన్స్లు ఆరు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు.(చదవండి : టీమిండియాకు మరో షాక్) -
కోహ్లి, రోహిత్ల ఆధిపత్యం
దుబాయ్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ఆధిపత్యం ప్రదర్శించారు. బుధవారం తాజాగా విడుదల చేసిన ర్యాంకుల్లో వీరిద్దరూ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. కోహ్లి 871 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, రోహిత్ 855 పాయింట్లతో రెండో ర్యాంకులో నిలిచాడు. వీరి తర్వాత బాబర్ ఆజమ్ (పాకిస్తాన్), రాస్ టేలర్ (న్యూజిలాండ్), డుప్లెసిస్ (దక్షిణాఫ్రికా) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలను దక్కించుకున్నారు. టెస్టు బ్యాట్స్మెన్ ర్యాంకుల్లో స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) 911 పాయింట్లతో తొలి స్థానాన్ని కైవసం చేసుకోగా... విరాట్ కోహ్లి (886 పాయింట్లు), మార్నస్ లబ్షేన్ (827 పాయింట్లు) తర్వాతి రెండు స్థానాలను సాధించారు. పాకిస్తాన్తో మూడో టెస్టులో 267 పరుగులు సాధించిన ఇంగ్లండ్ బ్యాట్స్మన్ జాక్ క్రాలీ 53 స్థానాలు మెరుగుపరుచుకొని కెరీర్లో అత్యుత్తమంగా 28వ ర్యాంకుకు చేరుకున్నాడు. టి20 కేటగిరీలో భారత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ రెండో ర్యాంకులో ఉన్నాడు. పాకిస్తాన్ బ్యాట్స్మన్ బాబర్ ఆజమ్ టాప్ ర్యాంకును, ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో టెస్టుల్లో ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా, 904 పాయింట్లు), వన్డేల్లో ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్, 722 పాయింట్లు), టి20ల్లో రషీద్ ఖాన్ (736 పాయింట్లు) మొదటి స్థానంలో ఉన్నారు. 719 పాయింట్లతో భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వన్డేల్లో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇటీవల పాకిస్తాన్తో సిరీస్లో అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్ స్టార్ పేసర్ టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో టాప్–10లో చోటు దక్కించుకున్నాడు. అతను ఆరు స్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంకుకు చేరుకున్నాడు. టీమ్ ర్యాంకింగ్స్లో భారత్ వన్డేల్లో రెండో ర్యాంకులో... టెస్టులు, టి20ల్లో మూడో స్థానంలో నిలిచింది. -
భారత్... వన్డే టాప్ ర్యాంకర్
మాంచెస్టర్ : ప్రపంచ కప్ ఆతిథ్య దేశం ఇంగ్లండ్ను తోసిరాజంటూ వన్డేల్లో టీమిండియా టాప్ ర్యాంక్కు చేరింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం 123 పాయింట్లతో భారత్ అగ్ర స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు టాపర్గా ఉన్న ఇంగ్లండ్ 122 పాయింట్లతో రెండో స్థానానికి పడి పోయింది. న్యూజిలాండ్ (114), ఆస్ట్రేలియా (112) వరుసగా తర్వాతి ర్యాంకుల్లో ఉన్నాయి. గురువారం వెస్టిండీస్పై నెగ్గిన భారత్ ఈ నెల 30న ఇంగ్లండ్పైనా గెలిస్తే 124 పాయింట్లతో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. అప్పుడు ఇంగ్లండ్ 121 పాయింట్లకు పరిమితం అవుతుంది. ఆ జట్టు నెగ్గితే 123 పాయింట్లతో నంబర్ వన్ ర్యాంకును తిరిగి కైవసం చేసుకుంటుంది. ఒకవేళ విండీస్పై ఓడి, ఇంగ్లండ్పై గెలిచినా 122 పాయింట్లతో భారత్ అగ్రస్థానానికి ఢోకా ఉండకపోయేది. రెండింటిలోనూ ఓడితే మాత్రం పాయింట్లు 120కి పడిపోడిపోయేవి. -
ఆ జాబితాలో టీమిండియా నుంచి ఒక్కరూ లేరు..!
దుబాయ్ : ఎమ్మారెఫ్ టైర్స్ ఐసీసీ వన్డే ఇంటర్నేషనల్ ఆల్రౌండర్ల జాబితా బుధవారం విడుదలైంది. బంగ్లా క్రికెటర్ షకీబుల్ హసన్ 359 పాయింట్లతో ఈ జాబితాలో టాప్ ర్యాంక్లో నిలిచాడు. ప్రపంచకప్ కొద్ది రోజుల్లో ప్రారంభవనుండగా ఓవైపు వెస్టిండీస్, ఐర్లాండ్ దేశాలతో జరిగిన త్రైపాక్షిక వన్డే సిరీస్ సాధించి జోష్ మీదున్న బంగ్లా టీమ్కు.. ఆల్రౌండర్ల లిస్టులో షకీబుల్ టాప్లో నిలవడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసినట్టయింది. ట్రై సిరీస్లో భాగంగా మూడు మ్యాచ్లాడిన షకీబుల్ 140 పరుగులు సాధించి, రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఆల్రౌండర్ల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్న అఫ్గాన్ ఆటగాడు రషీద్ఖాన్ (339)ను రెండో స్థానంలోకి నెట్టి టాప్ ర్యాంక్ను కైవసం చేసుకున్నాడు. ఇక మూడో స్థానంలో అఫ్గాన్ మరో ఆటగాడు మహ్మద్ నభి, పాక్ క్రికెటర్ ఇమామ్ వసీం, న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ సాంట్నర్ నాలుగు ఐదు స్థానాల్లో నిలిచారు. ఆరో స్దానంలో ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ వోక్స్, ఏడో స్థానాన్ని పాక్ ఆటగాడు మహ్మద్ హఫీజ్ దక్కించుకున్నారు. ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో వరుసగా.. వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్, జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, శ్రీలంక ఆటగాడు మాథ్యూస్ ఉన్నారు. టీమిండియా నుంచి టాప్ 10 స్థానాల్లో ఒక్క ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ నుంచి ఇద్దరు చొప్పున టాప్ 10లో నలుగురు చోటు దక్కించుకోవడం విశేషం. -
అగ్రస్థానంలోనే మంధాన, జులన్
దుబాయ్: భారత అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, జులన్ గోస్వామి తమ టాప్ స్థానాలను నిలుపుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో స్మృతి 797 పాయింట్లతో బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండగా... బౌలర్ల కేటగిరీలో జులన్ గోస్వామి 730 పాయింట్లతో నెం.1గా కొనసాగుతోంది. భారత వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ 713 పాయింట్లతో నాలుగోస్థానంలో నిలిచింది. టాప్–10 బ్యాట్స్వుమెన్లో భారత్ నుంచి మిథాలీ, స్మృతి మినహా వేరెవరూ చోటు దక్కించుకోలేకపోయారు. బౌలింగ్ విభాగంలో పేసర్ శిఖా (688 పాయింట్లు), లెగ్స్పిన్నర్ పూనమ్ యాదవ్ (656 పాయింట్లు) వరుసగా ఐదు, పదో స్థానాలను దక్కించుకున్నారు. వన్డే టీమ్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా (22 పాయింట్లు) అగ్రస్థానం, ఇంగ్లండ్ 18 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. భారత్ (16 పాయింట్లు), న్యూజిలాండ్ (14), దక్షిణాప్రికా (13) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. దీంతో న్యూజిలాండ్ వేదికగా 2021లో జరుగనున్న ఐసీసీ మహిళల ప్రపంచ కప్నకు టాప్–5లో నిలిచిన ఈ ఐదు దేశాలు అర్హత సాధించాయి. శ్రీలంక క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా ఈ మెగా టోర్నీకి అర్హత సాధించాల్సి ఉంది. -
టీమిండియా ఫస్ట్ ర్యాంకు కొట్టాలంటే!
హైదరాబాద్ : సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్లో తిరిగి నెం1 స్థానాన్ని సాధించాలంటే వన్డే సిరీస్ను వైట్వాష్ చేయాలి. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్ను 2-1తో గెలిచిన భారత్.. గురువారం ఆతిథ్య జట్టుతో తొలి వన్డే ఆడనుంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్లో 126 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్ టాప్లో ఉండగా..123 పాయింట్లతో కోహ్లి సేన రెండో ర్యాంకులో కొనసాగుతోంది. గత మే నెలలో ఇంగ్లండ్ భారత్ను వెనక్కు నెట్టి తొలి ర్యాంకును సాధించిన విషయం తెలిసిందే. అయితే భారత్ మళ్లీ ఆ ర్యాంకు పొందాలంటే ప్రస్తుత వన్డే సిరీస్ను 3-0తో వైట్ వాష్ చేయాలి. ఇక ఇంగ్లండ్ సైతం అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలంటే మరో 10 పాయింట్లు సాధించాలి. భారత్ను వైట్వాష్ చేస్తేనే సాధ్యమవుతోంది. ప్రపంచకప్ సన్నాహకల్లో భాగంగా అన్ని జట్లు ఈ ఏడాది బీజీ షెడ్యూల్ను గడపనున్నాయి. ఈ సిరీస్ల్లోని ఫలితాలతో ర్యాంకులు తారుమారయ్యే అవకాశం ఉంది. జూలై 17న ఇంగ్లండ్-భారత్ సిరీస్ ముగియనుండగా.. జూలై 13 నుంచి జింబాంబ్వే వేదికగా పాకిస్థాన్ 5 వన్డే మ్యాచ్లు ఆడనుంది. జూలై 22 నుంచి వెస్టిండీస్ మూడు వన్డేలకు బంగ్లాదేశ్కు ఆతిథ్యమివ్వనుంది. జూలై 29 నుంచి దక్షిణాఫ్రికా శ్రీలంక వేదికగా 5 వన్డే మ్యాచ్లు ఆడనుంది. ఇక నెపాల్, నెదార్లండ్పై రెండు వన్డే మ్యాచ్లు ఆడనుంది. జింబాంబ్వేపై పాక్ 4-1తో సిరీస్ గెలిస్తేనే తన ర్యాంకు నిలబెట్టుకోనుంది. అలాగే దక్షిణాఫ్రికా సైతం తన ర్యాంకు కోల్పోవద్దంటే శ్రీలంకను వైట్ వాష్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ర్యాంకులు 1. ఇంగ్లండ్ 126 రేటింగ్ పాయింట్స్ 2. భారత్ 123 3. దక్షిణాఫ్రికా 113 4. న్యూజిలాండ్ 112 5. పాకిస్తాన్ 102 6. ఆస్ట్రేలియా 100 -
ఐసీసీ ర్యాంకింగ్స్లో మరో నాలుగు దేశాలు
దుబాయ్ : అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్ జాబితాలోకి మరో నాలుగు జట్లు వచ్చి చేరాయి. పురుషుల వన్డే జట్టు ర్యాంకింగ్స్లో ఇప్పటి వరకు 12 జట్లు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా నేపాల్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, యూఏఈ జట్లను పాయింట్ల పట్టికలో చేర్చినట్లు ఐసీసీ శుక్రవారం తెలిపింది. రేటింగ్ పాయింట్లను లెక్కించే ముందు కొత్త జట్లు ఆడిన అన్ని ద్వైపాక్షిక సిరీస్ల ఫలితాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. వన్డే హోదా సాధించిన వాటిలో స్కాట్లాండ్ (28 పాయింట్లు) 13వ ర్యాంక్.. యూఏఈ(18పాయింట్లు) 14వ ర్యాంక్ సాధించింది. నేపాల్, నెదర్లాండ్స్ జట్లు చెరో నాలుగు మ్యాచ్లు ఆడిన తరువాత పాయింట్ల పట్టికలో పూర్తిస్థాయి ర్యాంకులను పొందనున్నాయి. ఈ నాలుగు జట్లు వన్డే రేటింగ్ కలిగిన జట్లతో ఆడిన ప్రతి మ్యాచ్కు పాయింట్స్ కేటాయించారు. మే1,2015 నుంచి ఏప్రిల్ 30, 2017 వరుకు జరిగిన మ్యాచ్ 50 శాతం వెయిటేజ్ ఇవ్వగా.. మే 1,2017 అనంతరం జరిగిన మ్యాచ్లకు 100 శాతం వెయిటేజ్ ఇచ్చారు. ఈ జట్లతో ఇప్పటికే తొలి 12 స్థానాల్లో ఉన్న జట్ల ర్యాంకుల్లో ఎలాంటి మార్పు ఉండదని ఐసీసీ పేర్కొంది. గతేడాది నెదర్లాండ్స్ వన్డే హోదాను సాధించగా.. ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో సూపర్ సిక్స్కు అర్హత సాధించిన స్కాట్లాండ్, యూఏఈలు తమ అంతర్జాతీయ వన్డే హోదాను కాపాడుకోగలిగాయి. క్వాలిఫయర్స్లో నేపాల్, పపువా న్యూగినియాపై గెలిచి అంతర్జాతీయ వన్డే జట్టు హోదాను సొంతం చేసుకుంది. -
ర్యాంకుల్లో ఎగబాకిన మంధాన..
సాక్షి, న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ తాజాగా నెంబర్ వన్ ర్యాంకును కోల్పోయారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు దిగజారి మూడో స్థానానికి పరిమితమయ్యారు. తాజా ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎలిస్ పెర్రీ (725 పాయింట్లు) అగ్రస్థానంలో నిలవగా, ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ (718 పాయింట్లు) రెండో ర్యాంకు దక్కించుకున్నారు. గతేడాది అక్టోబర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ను 2-1తో భారత్ కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించడంతో కెప్టెన్ మిథాలీ నెంబర్ వన్ ర్యాంకు సాధించారు. కాగా, తాజాగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో విఫలం కావడంతో మిథాలీ (707 పాయింట్లు) టాప్ ర్యాంకును కోల్పోవడంతో పాటు రెండు స్థానాలు కిందకి దిగారు. ఎగబాకిన మంధాన.. హర్మన్ ర్యాంకు కిందకి! సఫారీలతో వన్డే సిరీస్లో అద్భుతంగా రాణించిన భారత ఓపెనర్ స్మృతీ మంధాన 14 ర్యాంకులు ఎగబాకారు. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో 21వ ర్యాంకులో నిలిచారు. తాజా వన్డే సిరీస్లో 84, సెంచరీ (135) ఇన్నింగ్స్లతో మంధాన (503 పాయింట్లు) మెరుగైన ర్యాంకు సాధించారు. అదే సమయంలో భారత మరో స్టార్ క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ (660 పాయింట్లు) రెండు స్థానాలు కోల్పోయి 7వ ర్యాంకులో ఉన్నారు. బౌలర్లలో మరిజాన్నే కాప్ టాప్.. ఐసీసీ బాలర్ల తాజా వన్డే ర్యాంకింగ్స్ లో దక్షిణాఫ్రికా పేసర్ మరిజాన్నే కాప్ (653 పాయింట్లు) అగ్రస్థానాన్ని నిలుపుకున్నారు. వన్డే క్రికెట్లో 200 వికెట్లు సాధించిన తొలి మహిళా బౌలర్గా నిలిచిన భారత వెటరన్ క్రికెటర్ జులన్ గోస్వామి (643 పాయింట్లు) రెండో ర్యాంకులో నిలిచారు. -
భారత్ టాప్ ర్యాంక్ సుస్థిరం
దుబాయ్: దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న వన్డే సిరీస్ను 4–1తో సొంతం చేసుకున్న భారత్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన వన్డే తాజా ర్యాంకింగ్స్లో అగ్ర స్థానాన్ని పటిష్టం చేసుకుంది. మంగళవారం జరిగిన ఐదో వన్డేలో విజయం సాధించిన భారత్ 122 ర్యాంకింగ్ పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. ఈ సిరీస్కు ముందు 119 పాయింట్లతో రెండో ర్యాంకులో ఉన్న టీమిండియా నాలుగు వన్డేల్లో విజయాలు సాధించి అగ్రస్థానానికి చేరుకుంది. సిరీస్లోని చివరి వన్డేలో కోహ్లి సేన ఓటమి పాలైనా 121 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. మరోవైపు జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్లో జోరుమీదున్న అఫ్గానిస్తాన్ తొలిసారి టాప్–10లో చోటు దక్కించుకుంది. -
జట్టులో లేకున్నా.. ‘టాప్’ లేపాడు!
దుబాయ్: లంకతో వన్డే సిరీస్కు విశ్రాంతి తీసుకున్నా టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో తన స్థానాన్ని కోల్పోలేదు. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో కోహ్లి 876 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా విధ్వంసక ఆటగాడు ఏబీ డివిలియర్స్ రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. భారత తాత్కాలిక వన్డే, టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ తాజా ర్యాంకింగ్స్లో ఐదో ర్యాంకుకు ఎగబాకాడు. ఇటీవల లంకతో మొహాలీ వేదికగా జరిగిన రెండో వన్డేలో తన విశ్వరూపం రూపిస్తూ అజేయ డబుల్ సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ తాజా ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు మెరుగు పరుచుకుని టాప్-5లో చేరాడు. అజేయ ద్విశతకం బాదిన రోహిత్ ఆ మరుసటి వన్డేలో విఫలమైనా.. 800 ప్లస్ రేటింగ్ పాయింట్లను కెరీర్లో తొలిసారి సాధించాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 14వ ర్యాంకులో ఉన్నాడు. బౌలర్ల విషయానికొస్తే లంకతో వన్డే సిరీస్లో రాణించిన యుజువేంద్ర చహల్ 23 ర్యాంకులు మెరుగు చేసుకుని 28వ స్థానంలో, హార్ధిక్ పాండ్యా 45వ ర్యాంకు, చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ 16 స్థానాలు ఎగబాకి 56వ ర్యాంకులో కొనసాగుతున్నారు. ఆటగాళ్లు ర్యాంకులు మెరుగు పరుచుకున్నా.. టీమిండియా ర్యాంకులో ఎలాంటి మార్పు లేదు. 119 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. లంకతో వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేస్తే భారత్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకునేది. 120 పాయింట్లతో వన్డే ర్యాంకుల్లో దక్షిణాఫ్రికా జట్టు తన హవా కొనసాగిస్తోంది. -
దటీజ్ కోహ్లీ: పది రోజుల్లోనే మళ్లీ సాధించాడు!
దుబాయ్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా నిలిచాడు. తాను కోల్పోయిన అగ్రస్థానాన్ని కేవలం పదిరోజుల్లోనే కోహ్లీ తిరిగి సొంతం చేసుకోవడం విశేషం. న్యూజిలాండ్ పై సొంతగడ్డపై ఇటీవల జరిగిన వన్డే సిరీస్ ను భారత్ 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో ఛేజింగ్ స్టార్ కోహ్లీ రెండు సెంచరీలతో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. సిరీస్ లో పరుగుల వరద పారించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న కోహ్లీ.. ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ లో మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా విధ్వంసక క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ను వెనక్కి నెట్టి కోహ్లీ ఈ టాప్ ర్యాంకుకు ఎగబాకాడు. దీంతోపాటు కెరీర్ లోనే ఏ భారత బ్యాట్స్ మెన్ కు సాధ్యం కాని వన్డే రేటింగ్ పాయింట్లు కోహ్లీ సాధించాడు. 889 అత్యుత్తమ రేటింగ్ పాయింట్లతో భారత్ తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు సొంతం చేసుకున్న క్రికెటర్ గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు సచిన్ (887 రేటింగ్ పాయింట్లు) పేరిట ఉండేది. ఇటీవల 887 పాయింట్లు సాధించి సచిన్ సరసన నిలిచిన కోహ్లీ తాజా సిరీస్ లో వీర విహారంతో 889 పాయింట్లకు చేరాడు. సఫారీ క్రికెటర్ డివిలియర్స్(872 పాయింట్లు), ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(865 పాయింట్లు) కోహ్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. జట్టు ర్యాకింగ్స్ లో దక్షిణాఫ్రికా, టీమిండియాలు 120 పాయింట్లతో ఉన్నప్పటికీ రేటింగ్ పాయింట్లలో స్వల్ప ఆధిక్యంలో ఉన్న సఫారీలు పట్టికలో అగ్రస్థానం కైవసం చేసుకోగా, భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఐసీసీ తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ(7), ఎంఎస్ ధోనీ (11), శిఖర్ ధావన్(15)లు మాత్రమే టాప్-20లో చోటు దక్కించుకున్నారు. వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్ పట్టికలో బూమ్రా మూడో ర్యాంకు సాధించి కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ ను నమోదు చేశాడు. బూమ్రా(3), అక్షర్ పటేల్(8), భువనేశ్వర్ కుమార్(15)లు మాత్రమే టాప్ 20లో చోటు దక్కించుకున్నారు. -
కోహ్లి... మళ్లీ నంబర్వన్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ∙టాప్–10లో ధావన్ లండన్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో మళ్లీ టాప్ ర్యాంక్ను అందుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలో కోహ్లి ప్రదర్శన అతడికి ఈ ర్యాంక్ను కట్టబెట్టింది. 861 పాయింట్లతో కోహ్లి టాప్ ర్యాంక్కు చేరుకోగా... ఫిబ్రవరి నుంచి నంబర్వన్ స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (847 పాయింట్లు) మూడో స్థానానికి పడిపోయాడు. మూడో స్థానంలో ఉన్న డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) 861 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. చివరిసారి కోహ్లి గత జనవరిలో కేవలం నాలుగు రోజులు నంబర్వన్ స్థానంలో ఉన్నాడు. భారత మరో క్రికెటర్ శిఖర్ ధావన్ ఐదు ర్యాంక్లు మెరుగు పరచుకుని 10వ ర్యాంక్కు చేరుకున్నాడు. రోహిత్ శర్మ, ధోనీ ఒక్కో స్థానం కోల్పోయి వరుసగా 13వ, 14వ ర్యాంక్ల్లో ఉన్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ హాజల్వుడ్ తొలిసారి టాప్ ర్యాంక్ సాధించాడు. మరోవైపు ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు టైటిల్ను నిలబెట్టుకుంటే మళ్లీ నంబర్వన్ ర్యాంక్ను సాధిస్తుంది. ‘కోహ్లి’ పెయింటింగ్కు రికార్డు ధర బర్మింగ్హామ్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి పదేళ్ల ఐపీఎల్ ప్రస్థానంపై గీసిన ఓ పెయింటింగ్ దిమ్మతిరిగే రేటు పలికింది. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు సాషా జాఫ్రి రూపొందించిన ఈ చిత్రాన్ని స్థానిక మహిళా పారిశ్రామికవేత్త పూనమ్ గుప్తా 2 లక్షల 90 వేల పౌండ్లు (రూ.2 కోట్ల 37 లక్షలు) వెచ్చించి కొనుగోలు చేశారు. ఇటీవల జరిగిన విరాట్ కోహ్లి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన చారిటీ డిన్నర్లో పూనమ్ గుప్తా ఈ పెయింటింగ్ను కొన్నారు. ప్రస్తుత భారత యువ ఆటగాళ్లు సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్నారని ఆమె ప్రశంసించారు. మనుషుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా కోహ్లి ఫౌండేషన్ చేస్తున్న కృషిని అందరూ అభినందించాల్సిందేనని పూనమ్ చెప్పారు. -
నంబర్వన్ వార్నర్
► ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ► మూడో స్థానానికి కోహ్లి దుబాయ్: ఆస్ట్రేలియా సంచలన బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్లో తొలిసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు నంబర్వన్ గా ఉన్న ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా–861 పాయింట్లు)ను వెనక్కి నెట్టి వార్నర్ (880) టాప్ ర్యాంక్లోకి వచ్చాడు. 2016 ఆరంభం నుంచి అత్యద్భుత ఫామ్లో ఉన్న వార్నర్... ఈ సమయంలో 28 వన్డేల్లో 65 సగటుతో 1,755 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక స్థానం దిగజారి మూడో ర్యాంక్ (852)కు పడిపోయాడు. బ్యాట్స్మెన్ జాబితాలో టాప్–20లో మరో ఇద్దరు భారత ఆటగాళ్లు ధోని (13వ), శిఖర్ ధావన్ (15వ) ఉన్నారు. వన్డే బౌలర్ల జాబితాలో ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత్ నుంచి అత్యుత్తమంగా అక్షర్ పటేల్ 12వ స్థానంలో నిలిచాడు. ఆల్రౌండర్లలో షకీబ్ అల్ హసన్ తన టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. -
చిత్తుగా ఓడినా.. 'కంగారు' అక్కర్లేదు!
వన్డేల్లో ప్రపంచ నంబర్వన్ అయిన ఆస్ట్రేలియా జట్టుకు ఘోర పరాభవం ఎదురైనా ర్యాంకుల్లో మాత్రం వెనక్కి తగ్గలేదు. వన్డేల్లో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఏకంగా ఓ టీమ్ చేతిలో ఆసీస్ జట్టు 5-0 తేడాతో వైట్ వాష్ అయిన సందర్భమే లేదు. కానీ రెండు రోజుల కిందట దక్షిణాఫ్రికాతో జరిగిన చివరిదైన ఐదో వన్డేలోనూ ఆసీస్ పరాజయంపాలై వన్డేల్లో ఓ దారుణ సిరీస్ కు ముగింపు పలికింది. మరోవైపు సొంతగడ్డపై జరిగిన వన్డే సిరీస్ లో చివరి మ్యాచ్ లోనూ ఆసీస్ జట్టును 31 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. దీంతో వన్డే చరిత్రలోనే ఆసీస్ పై 5-0తో సిరీస్ క్లీన్ స్విప్ చేసిన జట్టుగా సఫారీలు నిలిచారు. తమ వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఐదు వన్డేల సిరీస్ లో దారుణ ఓటమిని చవిచూసినా ఆసీస్ జట్టు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. 118 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, తాజా సిరీస్ తో కొన్ని మెరుగుపరుచుకున్న దక్షిణాఫ్రికా జట్టు కేవలం రెండు పాయింట్ల(116) తేడాతో రెండో స్థానంలో నిలిచింది. సఫారీలతో సిరీస్ ప్రారంభానికి ముందు ఆసీస్ 124 పాయింట్లతో ఏ జట్టుకు అందనంత ఎత్తులో ఎక్కువ పాయింట్లతో టాప్ ర్యాంకులో ఉండేది. కానీ సిరీస్ లో దారుణంగా ఓడినా.. పాయింట్ల అంతరం తగ్గిందే తప్పా.. ర్యాంకు మాత్రం తగ్గకపోవడం గమనార్హం. మరోవైపు న్యూజిలాండ్ 113 పాయింట్లతోనూ, టీమిండియా 110 పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. రేపటి నుంచి ప్రారంభమమ్యే సిరీస్ లో న్యూజిలాండ్ పై 4-1తో నెగ్గితేనే భారత్ మూడో ర్యాంకు సాధిస్తుంది. -
మూడో ర్యాంకులో భారత్
దుబాయ్: ఇటీవలి కాలంలో వన్డే మ్యాచ్లు ఆడనప్పటికీ ఐసీసీ వన్డే జట్ల ర్యాంకింగ్స్ లో టీమిండియా (110 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచింది. శుక్రవారం ప్రకటించిన ఈ జాబితాలో ఆస్ట్రేలియా (124) టాప్లో ఉండగా న్యూజిలాండ్ (113) రెండో స్థానంలో ఉంది. అయితే ఈనెల 30 నుంచి ఆసీస్తో జరిగే ఐదు వన్డేల సిరీస్లో 3-2తో దక్షిణాఫ్రికా నెగ్గితే భారత్ నాలుగో స్థానానికి పడిపోతుంది. వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్సలో కోహ్లి (813) రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. -
ఐసీసీ వన్డే, టీ20 ర్యాంకులు వచ్చేశాయి...
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వన్డే, టీ20 ర్యాంకింగ్స్లో భారత క్రికెట్ జట్టు ఒక్కో స్థానం కిందకి దిగింది. ఐసీసీ విడుదల చేసిన వార్షిక సవరణ జాబితాలో భారత్ కు టీ20ల్లో రెండో స్థానం దక్కగా, వన్డేల్లో నాలుగో స్థానంలో నిలిచింది. నిన్న ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. టీ20 ర్యాంకింగ్స్: న్యూజీలాండ్ 132 పాయింట్లతో తొలి ర్యాంకును సాధించగా, భారత్ రెండో స్థానంలో నిలిచింది. వెస్టిండీస్(3), దక్షిణాఫ్రికా(4), ఇంగ్లండ్ (5), ఆస్ట్రేలియా(6) ర్యాంకులు సొంతం చేసుకున్నాయి. బంగ్లాదేశ్ ను వెనక్కినెట్టి అఘ్గనిస్తాన్ కాస్త మెరుగుపడింది. బంగ్లాదేశ్(10) వన్డే ర్యాంకింగ్స్: వన్డే ప్రపంచకప్ ఐదోసారి సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా తాజా ర్యాంకింగ్స్ లో తొలిస్థానాన్ని దక్కించుకోగా, న్యూజీలాండ్(2), దక్షిణాఫ్రికా(3), భారత్(4), శ్రీలంక(5) స్థానాల్లో నిలిచాయి. ఆసీస్ ఖాతాలో 124 పాయింట్లు ఉండగా, న్యూజీలాండ్ 113 పాయింట్లు, దక్షిణాఫ్రికా 112 పాయింట్లు, భారత్ 109 పాయింట్లతో ఉన్నాయి. టెస్ట్ ర్యాంకింగ్స్: టెస్టుల్లో అయితే ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని దక్కించుకోగా, పాకిస్తాన్(3), ఇంగ్లండ్(4), న్యూజీలాండ్(5) స్థానాల్లో నిలిచాయి. కాగా, గత ర్యాంకుల్లో మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఆరో స్థానానికి పడిపోయింది. 2014-15 వార్షిక సంవత్సరంలో సాధించిన ఫలితాల ఆధారంగా టెస్టు ర్యాంకింగ్స్ ను ప్రకటించారు. -
రెండో స్థానంలోనే భారత్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే టీమ్ ర్యాంకింగ్స్లో భారత జట్టు రెండో స్థానంలో కొనసాగుతుండగా... ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా తమ నంబర్వన్ స్థానాన్ని మరింత పదిలపర్చుకుంది. గురువారం ప్రకటించిన తాజా ర్యాంకుల్లో ఆస్ట్రేలియా (129 రేటింగ్ పాయింట్లు) అగ్రస్థానంలో నిలువగా, భారత్ (117) ఆసీస్ను అనుసరించింది. 2017 జూన్లో చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఇందులో పాల్గొనే జట్ల కోసం ఈ ఏడాది 30 సెప్టెంబర్ను కటాఫ్ తేదీగా నిర్ణయించారు. ఆ రోజు వరకు ర్యాంకుల్లో టాప్-8లో ఉన్న జట్లు టోర్నీకి అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ 8వ, పాకిస్తాన్ 9వ స్థానాల్లో ఉన్నాయి. బంగ్లా దీనిని నిలబెట్టుకోగలిగితే పాక్ను వెనక్కి నెట్టి 2006 తర్వాత మరోసారి చాంపియన్స్ ట్రోఫీకి క్వాలిఫై అవుతుంది. మరోవైపు టి20 ప్రపంచ ర్యాంకింగ్స్లోనూ భారత్ రెండో స్థానంలోనే ఉంది. -
రెండో స్థానంలోనే భారత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
దుబాయ్: ఇటీవలి ప్రపంచకప్లో సెమీస్కు చేరిన భారత వన్డే జట్టు అంతర్జాతీయ క్రికెట్ ర్యాంకింగ్స్లో తమ రెండో స్థానాన్ని నిలుపుకుంది. ప్రస్తుతం 116 పాయింట్లతో ఉన్న ధోని సేన టాప్లో ఉన్న ఆసీస్ కన్నా ఆరు పాయింట్లు వెనుకబడి ఉంది. మూడో స్థానంలో దక్షిణాఫ్రికా (112) ఆ తర్వాత శ్రీలంక (108), కివీస్ (107), ఇంగ్లండ్ (101), పాకిస్తాన్ (95) ఉన్నాయి. ఇక బ్యాటింగ్ విభాగంలో కోహ్లి నాలుగో స్థానంలోనే ఉండగా ధావన్ 6, కెప్టెన్ ధోని 8వ స్థానంలో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో భారత్ నుంచి ఎవరూ టాప్-10లో లేరు. -
భారత జట్టును అభినందించిన దాల్మియా!
జింబాబ్వేతో జరిగిన వన్డే సిరిస్ లో ఘన విజయాన్ని దక్కించుకున్న భారత క్రికెట్ జట్టును బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా ప్రశంసలతో ముంచెత్తారు. జింబాబ్వేతో జరిగిన వన్డే సిరిస్ ను 5-0 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే. 'విదేశీ గడ్డపై క్లీన్ స్పీప్ చేసిన భారత జట్టుకు నా శుభాకాంక్షలు. యువకులతో కూడిన భారత జట్టు విశ్వాసాన్ని నింపింది. పట్టుదలతో ఆడింది' అని దాల్మియా ఓ ప్రకటనలో తెలిపారు. బులవాయోలో జరిగిన ఐదవ వన్డేలో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో 5-0 తేడాతో భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది. జింబాబ్వే జట్టుపై విజయంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో భారత జట్టు నంబర్ వన్ స్థానాన్ని పదిలపరుచుకుంది.