IIT Bombay
-
ఐఐటీ బాబా ట్రాక్ రికార్డ్ : 10,12వ తరగతి మార్కులు వైరల్
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో పాపులర్ అయిన 'ఐఐటీ బాబా' గుర్తున్నాడా? ఇంజనీర్ బాబాగా పేరొందిన అభయ్ సింగ్ ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతిష్టాత్మక ఐఐటీ (IIT)బాంబేలో తెలివైన ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివి, లక్షల జీతాన్నిచ్చే ఉద్యోగాన్ని వదిలి అభయ్ ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టాడు. ఆధ్యాత్మిక జ్ఞానంతో శాస్త్రీయ విజ్ఞానాన్ని మిళితం చేస్తూ తన విశిష్టమైన విధానంతో మహా కుంభ్లో భక్తులను కట్టిపడేశాడు.తాజాగా అభయ్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. విద్యార్థి దశలో అభయ్ అద్భుతమైన ట్రాక్ రికార్డు వైరల్గా మారింది. 10వ తరగతి, 12వ తరగతి మార్కుల షీట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తెగ చక్కర్లు కొడుతోంది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన అభయ్ తన 10వ తరగతిలో 93 శాతం, 12వ తరగతి పరీక్షలలో 92.4 శాతం మార్కులు సాధించాడట. ఈ స్కోర్లు అతని మేధో నైపుణ్యాన్ని మరింత హైలైట్ చేస్తున్నాయి. పలు మీడియా నివేదికలు వెలువడ్డాయి. అంతేకాదు 2008లో, అతను IIT-JEE పరీక్షలో 731 ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) సాధించాడని నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో ఈ టాలెంటే అతడిని దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ అభ్యర్థులలో ఒకటిగా నిలిపిందిఅంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.ఇదీ చదవండి: బెల్లీ ఫ్యాట్ కరగాలంటే, ఈ ఐదు ఆసనాలు చాలు!మహాకుంభ మేళా 2025ల దర్శనమిచ్చిన వివిధ సాధువులు , బాబాలలో ఆకర్షణీయంగా నిలిచిన వారిలో ఒకరు ఐఐటీయన్ బాబా అభయ్ సింగ్ ఒకరు. ఈయన హర్యానాకు చెందినవాడు. ఇంజనీర్ బాబా ఐఐటీ బాంబే నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత, కెనడాలో మూడు సంవత్సరాలు పనిచేశాడు. ఏడాది రూ. 36 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం పొందాడు.. అభయ్ డిజైన్లో మాస్టర్స్ (MDs) కూడా చేశాడు అయితే, బాబా ఆ ఉద్యోగాన్ని వదిలి ట్రావెల్ ఫోటోగ్రఫీలో కోర్సు చేశాడు. ట్రావెల్ ఫోటోగ్రఫీ చేస్తున్న క్రమంలో అతనిలో మార్పుమొదలైంది. కొంతకాలం తన సొంత కోచింగ్ను ప్రారంభించాడు. నాలుగేళ్లు డేటింగ్...కానీ నాలుగేళ్లు ఒక అమ్మాయితో డేటింగ్ కూడా చేశాడు. తల్లిదండ్రుల మధ్య ఉన్న వివాదాలు చూసిన తన సంబంధాన్ని ఎప్పుడూ ముందుకు తీసుకెళ్లలేదని వెల్లడించాడు. ఇక్కడి నుండి ఆయన ఇంజనీరింగ్ వదిలి పూర్తిగా ఆధ్యాత్మికతకు వైపు మళ్లి బాబాగా మారాలని నిర్ణయించుకున్నాడు.తన జీవితమంతా మహాదేవ్కు అంకితం చేశానని కూడా మీడియాకు తెలిపిన సంగతి తెలిసిందే. -
ఐఐటీలు, ఎన్ఐటీల్లో మరో 15,000 సీట్లు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రాథమిక అంచనా ప్రకారం 15 వేల (ఐఐటీల్లో 5 వేలు, ఎన్ఐటీల్లో 10 వేలు) సీట్లు పెంచాలనే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్దకు వచ్చాయి. దీంతోపాటు ఆన్లైన్ విధానంలో కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ఐఐటీలు (IITs) యోచిస్తున్నాయి. కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు సీట్లు పెంచాల్సిన అవసరాన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు గత ఏడాది కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced) అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్షన్గా పెట్టుకుంటున్నారు. దాదాపు 1.45 లక్షల మంది ఈ బ్రాంచ్లనే కౌన్సెలింగ్లో మొదటి ఐచ్ఛికంగా ఎంచుకున్నారు. సీట్లు పెంచాలంటే ఫ్యాకల్టీతోపాటు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అదనంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐఐటీలు కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొన్నాయి. వీటికి కేంద్రం సానుకూలంగా ఉందని, త్వరలో నిర్ణయం రావొచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఐఐటీల్లో ఈ ఏడాది ఏఐ/ఎంఎల్ (ఆర్టిటఫిషియల్ ఇంటెలిజెన్స్/మిషన్ లెర్టినంగ్), డేటా సైన్స్ తదితర కంప్యూటర్ కోర్సుల్లో కనీసం 4 వేల సీట్లు పెరిగే అవకాశముంది. ప్రస్తుతం ఐఐటీల్లో మొత్తం 17 వేల సీట్లు ఉన్నాయి. సీటు అక్కడే కావాలి... జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకు పొందిన వారు బాంబే–ఐఐటీపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల సీట్ల పెంపునకు కేంద్రం అంగీకరిస్తే బాంబే–ఐఐటీకి (IIT Bombay) మొదటి ప్రాధాన్యమిచ్చే వీలుంది. ఆ తర్వాత ఢిల్లీ, కాన్పూర్, మద్రాస్ ఐఐటీలకు ప్రాధాన్యమిస్తున్నారు. వీటి తర్వాత స్థానంలో హైదరాబాద్ ఐఐటీ (IIT Hyderabad) నిలిచింది. బాంబే ఐఐటీలో ఓపెన్ కేటగిరీలో బాలురు 67, బాలికలు 291వ ర్యాంకుతో క్రితంసారి సీటు కేటాయింపు ముగిసింది. మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీల్లో 5 వేల లోపు ర్యాంకు వరకూ సీటు దక్కింది. అయితే, విద్యార్థులు అంతగా ప్రాధాన్యమి వ్వని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. ఈ కేటగిరీలో బిలాల్ ఐఐటీ ఉంది. ఇలాంటి ఐఐటీల్లో సీట్లు పెంచడం అవసరం లేదని భావిస్తున్నారు. ఎన్ఐటీల్లో... ఐఐటీల్లో సీట్ల పెంపు నేపథ్యంలో ఎన్ఐటీల్లో ఈసారి కటాఫ్ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్ ఎ¯న్ఐటీలో కంప్యూటర్ సైన్స్కు అంతకుముందు 1996 ర్యాంకు వరకూ సీటు వస్తే, 2024లో బాలురకు 3115 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. సీట్లు పెరిగితే 2025లో 4 వేల ర్యాంకు వరకూ సీటు వచ్చే అవకాశముంది. తమిళనాడు తిరుచిరాపల్లి ట్రిపుల్ఐటీలో బాలురకు గత ఏడాది 996 ర్యాంకుతోనే సీట్లు ఆగిపోగా, ఈ ఏడాది మాత్రం బాలురకు 1,509 ర్యాంకు దాకా సీటు వచ్చింది. చదవండి: ఊరంతా ఉద్యోగులే.. ప్రతి ఇంట్లో ఓ ప్రభుత్వ ఉద్యోగి..ఎన్ఐటీల్లో 82 శాతం విద్యార్థులు తొలి ప్రాధాన్యంగా కంప్యూటర్ సైన్స్ను ఎంచుకోగా, రెండో ప్రాధాన్యత కూడా 80 శాతం ఇదే బ్రాంచ్ ఉండటం విశేషం. మొత్తం మీద గత ఏడాది ఆరు రౌండ్ల తర్వాత 34,462వ ర్యాంకు వరకూ బాలికల విభాగంలో సిక్కిం ఎన్ఐటీలో సీఎస్సీ సీట్లు వచ్చాయి. మెకానికల్కు మాత్రం 58 వేల ర్యాంకు వరకూ ఓపెన్ కేటగిరీ సీట్లకు కటాఫ్గా ఉంది. బయోటెక్నాలజీకి 48 వేల వరకూ సీటు వచ్చింది. ఈసారి సీట్లు పెరిగితే ఈ కటాఫ్లో మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. -
వణికించిన ఫోన్ కాల్.. రూ. 7.28 లక్షలు దోపిడీ
ఆన్లైన్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. వయసుతో సంబంధం లేకుండా యువత, ఉన్నత విద్యావంతులు కూడా ఈ మోసాలకు గురవుతున్నారు. తాజాగా 25 ఏళ్ల ఐఐటీ బాంబే విద్యార్థి అధునాతన మోసంలో రూ. 7.28 లక్షలు కోల్పోయి బాధితుడయ్యాడు.వార్తా సంస్థ పీటీఐ రిపోర్ట్ ప్రకారం.. విద్యార్థికి ట్రాయ్ అధికారినంటూ ఓ వ్యక్తి నుండి కాల్ వచ్చింది. విద్యార్థి మొబైల్ నంబర్పై చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన 17 ఫిర్యాదులు నమోదయ్యాయని ఆ వ్యక్తి చెప్పాడు. తమ సూచనలను పాటించకపోతే "డిజిటల్ అరెస్ట్" అయ్యే ప్రమాదం ఉందని బెదిరించాడు.చట్టపరమైన పరిణామాలు, అభియోగాల తీవ్రతకు భయపడిన విద్యార్థి వారి సూచనలను అనుసరించడానికి అంగీకరించాడు. కేసుల నుంచి పేరును తొలగించడానికి, చట్టపరమైన సమస్యలను నివారించడానికి రూపొందించిన ప్రక్రియ పేరుతో స్కామర్లు పలు దఫాలుగా రూ. 7.28 లక్షలను వారి ఖాతాకు బదిలీ చేయాలని ఆదేశించారు. భయంతో అతను వారి సూచనలను అనుసరించిన విద్యార్థి చివరికి bమోసానికి గురయ్యాడు.వణికిపోవద్దు..ఇలాంటి ఆన్లైన్ మోసాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఇలాంటి మోసాలకు బలి అవుతున్న వ్యక్తుల సంఖ్య దేశంలో పెరుగుతోంది. ఈ స్కామ్లలో చాలా వరకు వాట్సాప్ వంటి డిజిటల్ ప్లాట్ఫారమ్లు లేదా చట్టబద్ధమైన సంస్థల పేరుతో నకిలీ వెబ్సైట్ల ద్వారా జరుగుతన్నాయి. అటువంటి కాల్స్ వచ్చినప్పుడు కాలర్ గుర్తింపును ధ్రువీకరించుకోవాలని, సున్నితమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో పరిస్థితిని అంచనా వేయడానికి కొంత సమయం తీసుకోవాలని, భయంతో హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. -
టాపర్ల ఎంపిక.. ఐఐటీ బాంబే..
సాక్షి, అమరావతి: జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్లకు ఐఐటీ బాంబే (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–బాంబే)అగ్రగామి ఎంపికగా కొనసాగుతోంది. ఈ ఏడాది టాప్–10 జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులంతా ఐఐటీ–బాంబేలోనే ప్రవేశాలు పొందారు. మొదటి 25 ర్యాంకుల్లో 24 మంది, 50 ర్యాంకుల్లో 47 మంది, 1000లోపు ర్యాంకుల్లో 246 మంది ఐఐటీ–బాంబే నుంచే ఇంజనీర్లుగా ఎదిగేందుకు ప్రణాళిక వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంజనీరింగ్ విద్య, పరిశోధన రంగంలో అగ్రగామిగా ఐఐటీ బాంబే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. అందుకే.. 2018లో కేంద్ర ప్రభుత్వం దీనికి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ హోదాను మంజూరు చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా జాతీయ సాంకేతిక విద్యను విస్తరించడంలో భాగంగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐఐటీ మద్రాస్ ‘జేఈఈ అడ్వాన్స్డ్–2024’ నివేదికను విడుదల చేసింది. అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహణ, జోసా కౌన్సెలింగ్లో కీలకంగా వ్యవహరించిన (జేఈఈ అడ్వాన్స్డ్ ఆర్గనైజింగ్ చైర్పర్సన్–2) ఆచార్య అన్నాబత్తుల రత్నకుమార్ ఏపీకి చెందిన వ్యక్తి కావడం విశేషం. 2024–25 విద్యా సంవత్సరానికి 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించగా.. 1.80 లక్షల మంది పరీక్షలు రాశారు. ఇందులో 17,695 మంది 23 ఐఐటీల్లో సీట్లు సాధించారు. వీరిలో భారతీయ పౌరసత్వ మూలాలున్న 88 మంది, ఇద్దరు విదేశీ విద్యార్థులు కూడా ఉన్నారు. బాంబే తర్వాత ఢిల్లీనే.. దేశంలోని 23 ఐఐటీల్లో ఐఐటీ బాంబే తర్వాత టాప్ ర్యాంకర్ల ఫేవరెట్ ఎంపికగా ఐఐటీ–ఢిల్లీ మారింది. ఇందులో టాప్–50 ర్యాంకర్లలో ఇద్దరు, టాప్–100లో 23 మంది, టాప్–200లో 50 మంది, టాప్–500లో 109, టాప్–1000లో 204 మంది ప్రవేశాలు పొందారు. ఆ తర్వాత తొలి వెయ్యి ర్యాంకుల్లో ఐఐటీ మద్రాస్లో 128 మంది, ఐఐటీ కాన్పూర్లో 117 మంది, ఐఐటీ ఖరగ్పూర్లో 82 మంది, ఐఐటీ గౌహతిలో 69 మంది, ఐఐటీ రూరీ్కలో 55 మంది, ఐఐటీ హైదరాబాద్లో 41 మంది, ఐఐటీ వారణాసిలో 23 మంది, ఐఐటీ ఇండోర్లో ఐదుగురు, ఐఐటీ గాం«దీనగర్లో ఒకరు ప్రవేశాలు పొందారు. మహిళా విద్యార్థులప్రవేశాలు ఇలా.. గడచిన నాలుగేళ్లతో పోలిస్తే ఐఐటీల్లో సీట్ల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది. 2024–25 ప్రవేశాల్లో 23 ఐఐటీల్లో సూపర్ న్యూమరరీ సీట్లు 3,566 ఉండగా.. మొత్తం సీట్లు 17,760కు చేరాయి. వీటిలో 17,695 సీట్లు భర్తీ చేశారు. వీటిలో సుమారు 80 శాతం ప్రవేశాలు పురుషులే పొందుతున్నారు. ఏటా ఐఐటీల్లో ప్రవేశాలు పొందుతున్న మహిళలు మాత్రం కేవలం 3 వేల వరకు మాత్రమే ఉంటున్నారు. గడచిన ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 73 మంది మాత్రమే అధికంగా ప్రవేశాలు తీసుకున్నారు. ఐఐటీలో అత్యధికంగా ఖరగ్పూర్లో 363, వారణాసిలో 301, బాంబేలో 278, రూర్కీలో 275, ఢిల్లీలో 246, కాన్పూర్లో 248, మద్రాస్లో 231 మందితో పాటు హైదరాబాద్లో 120, తిరుపతిలో 50 మంది మహిళలు ప్రవేశాలు పొందారు. తెలియకుంటే.. మిన్నకుంటే మేలు! జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో విద్యార్థులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాము కలలుకన్న ఐఐటీల్లో సీట్లు సాధించేందుకు ప్రతి మార్కును లెక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మైనస్ మార్కులు ఉండటంతో తెలియని ప్రశ్నల జోలికి వెళ్లడం లేదు. ఇలా పేపర్–1 గణితంలో 7వ ప్రశ్నను 80.31 శాతం మంది విడిచిపెట్టేశారు. ఇలా ప్రశ్నలు1, 3, 4, 5, 14, 17కు సుమారు 60 శాతానికిపైగా విద్యార్థులు సమాధానాలు రాయలేదు. ఫిజిక్స్లో 7వ ప్రశ్నకు అత్యధికంగా 82.32 శాతం మంది సమాధానం ఇవ్వలేదు. ఇలా 2, 3, 6, 16 ప్రశ్నలు 60 శాతానికిపైగా దూరంగా ఉన్నారు. కెమిస్ట్రీలో చాలావరకు జవాబు రాయడానికి ప్రయత్ని0చినట్టు తెలుస్తోంది. ఇలానే పేపర్–2లో గణితంలో 5వ ప్రశ్నకు అత్యధికంగా 71.11 శాతం మంది, ఫిజిక్స్లో 7వ ప్రశ్నకు 72.27 శాతం మంది జవాబు రాయలేదు. మొత్తంగా చూస్తే రెండు పేపర్లలో ఏ ఒక్క ప్రశ్నకు కూడా నూరు శాతం మంది జవాబు పెట్టకపోవడం గమనార్హం. -
రామాయణంతో ఆటలా? బాంబే ఐఐటీ విద్యార్థులకు భారీ జరిమానా
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ బాంబే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)మరోమారు వార్తల్లో నిలిచింది. రామాయణంలోని కొన్ని అంశాల ఆధారంగా ఇక్కడి విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ వివాదాస్పదంగా మారింది. రామాయణాన్ని అపహాస్యం చేసేవిధంగా విద్యార్థులు ఈ నాటకం వేశారంటూ పెద్దఎత్తున విమర్శలు చెలరేగాయి.రామాయణం నాటకం పేరుతో బాంబే ఐఐటీ విద్యార్థులు సనాతన హిందూ సంప్రదాయాలను మంట గలిపారనే విమర్శలు వెల్లువెత్తాయి. రెండు నెలల క్రితం ఐఐటీ బాంబేలో ‘రాహోవన్’ పేరుతో విద్యార్థులు రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఒక నాటకాన్ని ప్రదర్శించారు. ఇది విమర్శలపాలైన నేపధ్యంలో తాజాగా ఆ విద్యార్థులపై ఐఐటీ బాంబే అధికారులు చర్యలు చేపట్టారు.ఈ నాటకంలో వివిధ పాత్రలు పోషించిన విద్యార్థులలో ఒక్కొక్కరికి రూ.1.20 లక్షల చొప్పున జరిమానా విధించారు. బాంబే ఐఐటీలో ప్రతియేటా ఆర్ట్స్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు. 2024 మార్చి 31న ఈ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ వేడుకల్లో కొంత మంది విద్యార్థులు ‘రాహోవన్ ’ అనే నాటకాన్ని ప్రదర్శించారు.రామాయణం ఇతివృత్తంగా ఈ నాటకాన్ని రూపొందించారు. అయితే శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడి పేర్లను వారు పోషించిన పాత్రలకు నేరుగా ఉపయోగించలేదు. అయితే రామాయణంలోని అరణ్య కాండంలోని కొన్ని ఘట్టాలను పోలిన సన్నివేశాలు వీరు ప్రదర్శించిన నాటకంలో ఉన్నాయి. అవి రామాయణాన్ని అపహాస్యం చేసేవిగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. వీరు వేసిన నాటకంలోని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఆర్ధిక అనిశ్చితి.. ఐఐటీ బాంబే విద్యార్ధులకు దక్కని జాబ్ ఆఫర్లు
అంతర్జాతీయ స్థాయిలో ఆర్ధిక అనిశ్చితి దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో జరిగే ప్లేస్మెంట్స్పైనా ప్రభావం చూపుతోంది. ఐఐటీ బాంబే విద్యార్ధుల్లో 36 శాతం మంది అభ్యర్ధులకు ప్రస్తుత ప్లేస్మెంట్ సీజన్లో ఇప్పటివరకూ ఉద్యోగాలు లభించలేదు. 2 వేల మంది ప్లేస్మెంట్లో నమోదు చేసుకుంటే వారిలో 712 మందికి ఇప్పటికీ జాబ్ ఆఫర్లు రాకపోవడం గమనార్హం. పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం..ఐఐటీ బాంబే ప్లేస్మెంట్స్లో నమోదు చేసుకున్న సీఎస్ఈ విద్యార్ధులకు పూర్తిస్ధాయిలో జాబ్ ఆఫర్లు పొందలేకపోవడం ఇదే తొలిసారి. ప్లేస్మెంట్ డ్రైవ్లో పాల్గొన్న కంపెనీల్లో 380 కంపెనీలు దేశీ కంపెనీలు కాగా, అంతర్జాతీయ కంపెనీ సంఖ్య ఈసారి తక్కువగా ఉందని చెబుతున్నారు. కాగా, ఆర్ధిక అనిశ్చితి, ఇతరాత్ర కారణాల వల్ల ఐఐటీ బాంబే నిర్ధేశించిన ప్యాకేజీ ఇచ్చేందుకు సంస్థ మొగ్గుచూపడలేదని తెలుస్తోంది. అయితే ప్లేస్మెంట్స్లో పాల్గొనే ముందు పలు దశల్లో ఆయా కంపెనీలు సంప్రదింపులు జరుపుతున్నాయని అధికారులు తెలిపారు. -
24 ఏళ్లకే ఉద్యోగం.. 29 ఏళ్లకే రిటైర్మెంట్.. గూగుల్ ఉద్యోగి స్ట్రాటజీ అదిరింది!
24 ఏళ్లకే ఉద్యోగం..29 ఏళ్లకే రిటైర్మెంట్. ఆహా! జీవితం అంటే ఇది’ అని అనుకుంటున్నారా? ఐఐటీ బాంబే పూర్వ విద్యార్ధి డేనియల్ జార్జ్ (29) ఇలాగే అనుకున్నాడు. 6 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి చివరికి రిటైర్మెంట్ తీసుకున్నాడు. డేనియల్ జార్జ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిపుణుడు. 2018లో జార్జ్ ఐఐటి బాంబే నుండి బిటెక్ పూర్తి చేశాడు. 24 ఏళ్ల వయస్సు అమెరికాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో ఏడాదికి 265,000 డాలర్ల (సుమారు రూ. 2.20 కోట్లు) ప్యాకేజీతో జాబ్ సంపాదించాడు. అంత డబ్బు ఎలా ఆదా చేశాడు అతను గూగుల్లో పనిచేసే సమయంలో సంపాదించిన డబ్బును ఆదా చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో లెక్కలేసుకుని తన శాలరీని ఎంత మొత్తంలో ఆదా చేసే త్వరగా రిటైర్ అవ్వచ్చు? అనంతరం తన సొంత దేశమైన భారత్లో ఎలా నివసించవచ్చో గుర్తించాడు. అంతే అప్పటి నుంచి రిటైర్మెంట్ కోసం శాలరీని సేవ్ చేయడం మొదలు పెట్టాడు. గూగుల్లో పనిచేయడం ఓ కల గూగుల్లో పనిచేయడం ఒక కల. అదో ‘మాయా అద్భుత భూభాగం’లాంటిదని అభివర్ణిస్తూ డబ్బుల్ని ఎలా సేవ్ చేశాడో చెప్పుకొచ్చాడు. ముందుగా గూగుల్లో అపరిమిత ఆహారం, పానీయాలు, పింగ్ పాంగ్ టేబుల్స్ , వీడియో గేమ్ రూమ్లు, సాకర్ ఫీల్డ్లు, జిమ్, టెన్నిస్ కోర్ట్లు, ఫ్రీ మసాజ్ వంటి మరిన్ని సౌకర్యాలను అందించింది. వాటిని వినియోగించుకున్నాడు. కానీ అప్పుడే జార్జ్ గూగుల్లో తాను సంపాదించే జీతంలో సగానికిపైగా మొత్తాన్ని ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు గుర్తించాడు. ట్యాక్స్ తగ్గించుకునేందుకు అప్పటి నుంచి జార్జ్ తన ట్యాక్స్ను తగ్గించుకోవడానికి రిటైర్మెంట్ అకౌంట్లో ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. ఆఫీస్కి నడిచి వెళ్లడం, గూగుల్లో పని చేసే సమయంలో మూడుపూటలా అక్కడే భోజనం చేయడంతో డబ్బు ఆదా అయ్యేది. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఆహారాన్ని ఖర్చు చేసినట్లు చెప్పాడు. సాధారణంగా సిలికాన్ వ్యాలీలో ఇంటి రెంట్ చాలా ఖరీదైన వ్యవహారంతో కూడుకుంది. అయినప్పటికీ, తన స్నేహితులతో కలిసి అపార్ట్మెంట్ని షేర్ చేసుకోవడం వల్ల అద్దె తగ్గిందని అన్నాడు. ట్యాక్స్ చెల్లింపులు ఎంతంటే? జార్జ్ ప్రతి సంవత్సరం పన్ను ఆదా చేసుకునేందుకు రూ.62లక్షలు పెట్టుబడి పెడుతూ వచ్చాడు. రిటైర్మెంట్ అయ్యేందుకు కావాల్సినంత మొత్తాన్ని సమకూర్చుకున్నాడు. గత ఏడాది జార్జ్ 29 ఏళ్ళ వయసులో థర్డ్ ఇయర్ ఏఐ అనే స్టార్టప్ను ప్రారంభించాడు. “ఇప్పుడు నేను జీతం సంపాదించడం గురించి ఎప్పుడూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నేను నా కంపెనీని ప్రారంభించడం కోసం రిస్క్ చేయగలను. నా భార్య పిల్లల కోసం కావాల్సినంత సంపాదించాను. అందుకే త్వరగా రిటైర్మెంట్ తీసుకుంటున్నాను అంటూ ఆర్ధిక పాఠాలు చెబుతున్నాడు. -
రూ. కోటికి పైగా జీతంతో జాబ్స్.. ఏకంగా 85 మందికి..
భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన బాంబే, ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) 2023-24 ప్లేస్మెంట్ సీజన్ ఫేజ్-1లో 85 మంది విద్యార్థులు రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక ప్యాకేజీలతో జాబ్ ఆఫర్లను పొందారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఐఐటీ బాంబే ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో మొత్తం 388 దేశీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. ఇందులో యాక్సెంచర్, ఎయిర్బస్, యాపిల్, బార్క్లేస్, గూగుల్, జెపి మోర్గాన్ చేజ్, మైక్రోసాఫ్ట్, టాటా గ్రూప్ వంటి ప్రముఖ రిక్రూటర్లు ప్లేస్మెంట్ ప్రక్రియలో భాగంగా ఉన్నాయి. రిక్రూట్మెంట్లో 1,340 మంది విద్యార్థులు హాజరు కాగా, ఇందులో 1,188 మంది ఉద్యోగాలు సాధించారు. ఇందుకో కూడా ఎక్కుమంది ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఉద్యోగాలు సాధించారు. ఆ తరువాత ఐటీ/సాఫ్ట్వేర్, ఫైనాన్స్/బ్యాంకింగ్/ ఫిన్టెక్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిజైన్ వంటి వాటిలో ఉద్యోగాలు పొందారు. సగటు ప్యాకేజీ వివరాలు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ: రూ. 21.88 లక్షలు ఐటీ/సాఫ్ట్వేర్: రూ. 26.35 లక్షలు ఫైనాన్స్: రూ. 32.38 లక్షలు కన్సల్టింగ్: రూ. 18.68 లక్షలు రీసర్చ్ అండ్ డెవలప్మెంట్: రూ. 36.94 లక్షలు ఇదీ చదవండి: గిఫ్ట్స్ ఇవ్వడంలో ఎవరైనా వీరి తర్వాతే.. కోడలికి రూ.451 కోట్ల నెక్లెస్ కొన్ని సంస్థలు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించగా.. మరికొన్ని సంస్థలు వర్చువల్గా పాల్గొన్నాయి. జపాన్, తైవాన్, సౌత్ కొరియా, నెదర్లాండ్స్, సింగపూర్, హాంకాంగ్ వంటి అంతర్జాతీయ స్థానాల్లో 63 మంది ఉద్యోగాలు సాధించారు. ఎంపికైన మొత్తం 1188 మంది విద్యార్థుల్లో ఏడు మంది ప్రభుత్వ రంగ సంస్థల్లో, 297 మంది ఇంటర్న్షిప్ల ద్వారా ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్లను పొందారు. గతంలో ఎన్నికైన ఉద్యోగులతో పోలిస్తే.. ఈ సారి ఎంపికైన ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉందని సమాచారం. -
ఏ వెలుగులకీ ప్రస్థానం!
చదివేస్తే ఉన్న మతి పోయిందని నానుడి. బాంబే ఐఐటీ పాలకవర్గం నిర్వాకం వల్ల తిండి చుట్టూ మన సమాజంలో అల్లుకొని ఉన్న వివక్ష ఆ ఉన్నత శ్రేణి విద్యాసంస్థను కూడా తాకింది. బాంబే ఐఐటీ హాస్టళ్లలో మూణ్ణెల్ల క్రితం శాకాహారులకు విడిగా టేబుల్స్ కేటాయించాలన్న డిమాండ్ బయల్దేరింది. మాంసాహారుల పక్కన కూర్చుంటే ఆ ఆహారం నుంచి వచ్చే వాసనల కారణంగా తమలో వికారం, వాంతులు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆ డిమాండు చేస్తున్నవారి ఫిర్యాదు. ఎప్పుడో 1958లో స్థాపించిన ఆ విద్యాసంస్థలో ఇప్పుడే ఈ డిమాండ్ ఎందుకు తలెత్తిందన్న సంగతలా వుంచితే... దాన్ని అంగీకరిస్తే మాంసాహారం అపవిత్రం లేదా మలినం అని సమాజంలోని కొన్ని వర్గాల్లో నెలకొన్న అభిప్రాయానికి ఆమోదముద్ర వేసినట్టవుతుందన్న సందేహం బాంబే ఐఐటీ పాలకవర్గానికి కలగలేదు. ప్రాంగణంలోని మూడు హాస్టళ్లలో విడిగా ఆరు టేబుళ్లను ‘వెజిటేరియన్ ఓన్లీ’ బోర్డులతో అలంకరించింది. అంతటితో ఊరుకోలేదు. దీనిపై నిరసన వ్యక్తం చేసిన విద్యార్థికి రూ. 10,000 జరిమానా విధించింది. ఈ నిరసన ఘర్షణకు దారితీస్తుందనీ, క్రమశిక్షణ ఉల్లంఘన కిందికొస్తుందనీ డీన్ అంటున్నారు. ఇలాంటి డిమాండ్ తలెత్తినప్పుడు దానిపై అందరి అభిప్రాయాలూ తీసుకోవటం, ఒక కమిటీని నియమించటం, దాని సాధ్యాసాధ్యాలు, పర్యవసానాలపై చర్చించటం ప్రజాస్వామిక పద్ధతి. అలాంటి విధానమే అమలైవుంటే శాకాహార విద్యార్థులు అంతిమంగా తమ డిమాండ్ను వదులుకునేవారో, మాంసాహార ప్రియులు వారి సమస్య పట్ల సానుభూతితో వ్యవహరించేవారో తెలిసేది. ఈ ప్రక్రియ అమలైందా లేదా... అందులో వచ్చిన అనుకూల, ప్రతికూల అభిప్రాయాలేమిటన్నది ఎవరికీ తెలియదు. బాంబే ఐఐటీలోని అంబేడ్కర్ పెరియార్ ఫూలే స్టడీ సర్కిల్ (ఏపీపీఎస్సీ) విద్యార్థుల ప్రకారం పాలకవర్గం ఈ మొత్తం వ్యవహారాన్ని గోప్యంగా ఉంచింది. కనుక సహజంగానే నిరసనలు వ్యక్తమయ్యాయి. ‘మేం ఏం చేసినా శిరసావహించాల్సిందే, లేకుంటే కొరడా ఝళిపిస్తాం’ అన్నట్టు వ్యవహరించటం, ప్రశ్నించటమే నేరమన్నట్టు పరిగణించటం ఉన్నత శ్రేణి విద్యాసంస్థకు శోభస్కరం కాదు. వికారాలున్నవారిని దూరంగా పోయి తినమని చెప్పక గోటితో పోయేదానికి గొడ్డలి అందుకున్నట్టు ఇంత రాద్ధాంతం దేనికో అర్థం కాదు. పాశ్చాత్య దేశాల్లో కూడా శాకాహారం, మాంసాహారం విభజన వుంది. డెయిరీ ఉత్పత్తులు సైతం సమ్మతం కాదనే వెగానిజం కూడా అక్కడుంది. అమెరికన్లలో గత మూడు నాలుగేళ్లలో దాదాపు 15 శాతం మంది శాకాహారులుగా మారారని ఈమధ్య ఒక సర్వే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2020లో 1,400 కోట్ల డాలర్లుగా ఉన్న వెగాన్ మార్కెట్, ఆ మరుసటి ఏడాదికి 1,577 కోట్ల డాలర్లకు పెరిగిందని మరో సర్వే అంటున్నది. అయితే మన దేశంలో వలే అక్కడ తినే ఆహారం కులాలతో ముడిపడి లేదు. ఇక్కడ శాకాహారులు చాలా ఉన్నతులనీ, మాంసాహారులు తక్కువనీ అభిప్రాయం బలంగా పాతుకుపోయింది. అందుకు మన సంస్కృతి, సంప్రదాయాలు కూడా దోహదపడుతున్నాయి. ఆహారపుటలవాట్లలో కులాన్ని వెతకటం పాక్షిక దృష్టి అంటున్నవారు కొన్ని తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, కశ్మీర్ వంటిచోట్ల బ్రాహ్మణులు మాంసాహారులుగా ఉండటాన్ని ఉదహరిస్తున్నారు. కానీ ఇవి చెబుతున్నవారు మన దేశంలో చాలాచోట్ల అట్టడుగు కులాలవారికి అద్దెకు ఇల్లు ఇవ్వకుండా ఉండటానికి ‘వెజిటేరియన్లకు మాత్రమే’ అనే బోర్డులు పెడుతున్న ధోరణిని మరిచిపోకూడదు. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను ఒంటిస్తంభం మేడలో ఉంచి చదువు చెప్పించాలనుకోకుండా... ప్రాథమిక విద్య మొదలుకొని అన్ని దశల్లోనూ విద్యాసంస్థలకు పంపటంలో ఒక అంతరార్థం ఉంటుంది. వివిధ వర్గాల పిల్లలతో కలిసిమెలిసి పెరగటం, సామాజిక అవగాహన పెంపొందించుకోవటం అనే లక్ష్యాలు కూడా అంతర్లీనంగా ఇమిడివుంటాయి. తెలియనిది తెలుసుకోవటం, భిన్నత్వాన్ని గౌరవించటం, అవసరమైతే ప్రశ్నించటం, ఈ క్రమంలో తనను తాను మార్చుకోవటం కూడా విద్యాసముపార్జనలో భాగమే. బాధ్యతాయుతమైన రేపటి పౌరులుగా రూపొందటానికి ఇవన్నీ అవసరం. బాంబే ఐఐటీలో చదువుతున్నవారు పరిశోధనల కోసమో, ఉన్నతోద్యోగాల కోసమో విదేశాలకు వెళ్లవలసి వచ్చినప్పుడు తోటి మనిషి ఆహారాన్ని చూసి వికారాలు తెచ్చుకోవటం అక్కడికి కూడా మోసుకుపోతే క్షణకాలమైనా మనుగడ సాగించగలరా? ఈ ఆలోచన వాళ్లకు రాకపోతే పోయింది... సంస్థ నిర్వాహకులకేమైంది? ఉన్నతశ్రేణి విద్యాసంస్థల్లో ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని రాజ్యసభలో మొన్న జూలైలో కేంద్రం తెలిపింది. ఈ ఉదంతాల్లో వ్యక్తిగత కారణాలను వెదకటం తప్ప సంస్థాగతంగా ఎలాంటి దిద్దుబాటు చర్యలు అవసరమన్న విచికిత్సలోకి పోవటం లేదు. తినే తిండి మొదలుకొని ఎన్నిటినో ఎత్తి చూపి న్యూనత పరిచే ధోరణి ఉండటాన్ని ఈ సంస్థల పాలకవర్గాలు గుర్తించటం లేదు. బాంబే ఐఐటీ మరో అడుగు ముందుకేసి అలాంటి ధోరణులను బలపర్చే నిర్ణయాన్ని తీసుకోవటం ఆందోళన కలిగించే అంశం. ఈ జాడ్యం హైదరాబాద్ ఐఐటీకి కూడా వ్యాపించిందంటున్నారు. ఏకంగా శాకాహారుల కోసం అది ప్రత్యేక హాల్ కేటాయించబోతున్నదన్న వార్తలొస్తున్నాయి. తమ సంస్థల్ని ప్రపంచ శ్రేణి విద్యా కేంద్రాలుగా రూపుదిద్దటం ఎలాగన్న ఆలోచనలు మాని, క్షీణ విలువలను తలకెత్తుకోవటం ఏ మేరకు సమంజసమో నిర్వాహకులు ఆలోచించాలి. -
గ్లాస్ సీలింగ్ బ్రేక్స్:ఈ మెకానికల్ ఇంజనీర్ గురించి తెలిస్తే ఫిదా
దేశీయ ఐఐటీ గ్రాడ్యుయేట్లు ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద కంపెనీలను లీడ్ చేస్తున్నారు. కొత్త ఆవిష్కరణకు నాంది పలుకు తున్నారు. పురుషులతో పాటు సమానంగా మహిళలు మెకానికల్ ఇంజనీరింగ్, డిజైనింగ్ రంగాల్లో సత్తా చాటుతున్నారు. కొత్త మహీంద్రా థార్ను డిజైన్ చేసిన మహిళ, BITS పిలానీకి చెందిన మెకానికల్ ఇంజనీర్ రామ్కృపా అనంతన్ విశేషంగా నిలుస్తున్నారు. ఆటోమోటివ్ పరిశ్రమలో రామ్కృపా అనంతన్ పేరు తెలియని వారు లేరు అతిశయోక్తి కాదు.ముఖ్యంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్లో డిజైన్ హెడ్గా స్పెషల్ ఎట్రాక్షన్గా నిలుస్తున్నారు. అంతేకాదు సొంత డిజైన్ స్టూడియోను కూడా నిర్వహిస్తున్న రామ్ కృపా అనంతన్ గురించి, ఆమె సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం. మహీంద్రా అండ్ మహీంద్ర అండ్ లేటెస్ట్ వాహనాల్లో థార్ SUVకున్న క్రేజ్గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి అంతటి ప్రజాదరణ ఉన్న థార్ 2వ తరం థార్ ఆవిష్కారం వెనుక చీఫ్ డిజైనర్ రామ్ కృపా. పాపులర్ బొలెరో, మహీంద్రా SUV విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత కూడా ఆమెదే. థార్, XUV700, స్కార్పియోలాంటి మహీంద్రా ఉత్పత్తులకు చీఫ్ డిజైనర్ గా తన సత్తా చాటుకున్నారు. ఎవరీ రామ్ కృపా అనంతన్ బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ , ఐఐటీ బాంబే నుంచి మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ ను పూర్తి చేశారు. ఆ తర్వాత 1997లో మహీంద్రా అండ్ మహీంద్రాలో ఇంటీరియర్ డిజైనర్గా కరియర్ను మొదలు పెట్టారు. 2005లో డిజైన్ హెడ్గా మహీంద్రా XUV 500 SUVని డిజైన్ చేసిన క్రెడిట్ దక్కించుకున్నారు.అలాగే XUV 700, స్కార్పియో ఐకానిక్ డిజైన్లను రూపకల్పన చేశారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత, రామ్కృపా అనంతన్ చీఫ్ డిజైనర్ పాత్రకు పదోన్నతి పొందారు. క్రక్స్ స్టూడియో, మైక్రో ఈవీ కాన్సెప్ట్ రెండేళ్ల తరువాత ప్రస్తుతం ఆమె సొంతంగా KRUX డిజైన్ స్టూడియో స్థాపించారు. 20 శాతం అప్సైకిల్ భాగాలను ఉపయోగించి Two 2 అనే మైక్రో-మొబిలిటీ కాన్సెప్ట్ వాహనాన్ని ఆవిష్కరించారు. చిన్న బ్యాటరీతో కూడా ఎక్కువ పరిధినిస్తుంది. 'ఓలా ఎలక్ట్రిక్'లో కృపా అనంతన్ దేశీయ ఈవీ మేకర్ బెంగళూరుకు చెందిన కంపెనీ తన ఎలక్ట్రిక్ కారు ‘ఓలా ఎలక్ట్రిక్ సెడాన్ను విడుదల చేయనుంది. దీని ధర రూ. 15 నుండి రూ. 25 లక్షల శ్రేణిలో ఉంటుందని అంచనా. గత ఏడాది ఆగస్టులో రామకృపా అనంతన్ ఓలా ఎలక్ట్రిక్స్లో డిజైన్ హెడ్గా చేరారు. ద్విచక్ర వాహనం , రాబోయే నాలుగు-చక్రాల విభాగాలకు ఆమె లీడ్గా ఉన్నారు. -
బాలీవుడ్ స్టార్ బిల్డింగ్లో సూపర్మార్కెట్: నెలకు అద్దె ఎంతో తెలుసా?
ముంబైలోని బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్కు చెందిన ఇంటిని IIT గ్రాడ్యుయేట్లు లీజుకు తీసుకున్నారు. ఇక్కడ సూపర్ మార్కెట్ను ఏర్పాటు చేశారు. ముంబైలోని శాంతాక్రూజ్ పరిసరాల్లో సల్మాన్ నాలుగంతస్తుల కమర్షియల్ బిల్డింగ్లో "ఫుడ్ స్క్వేర్" అనే సూపర్ మార్కెట్ కొలువు దీరింది. మయాంక్ గుప్తా, లలిత్ ఝవార్ ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్లు దీన్ని షురూ చేశారు. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం లీజుకు తీసుకున్న 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లకు గాను నెలకు అద్దె రూ. 90 లక్షలు. తొలి 12 నెలలకు అద్దె రూ. 90 లక్షలు. ఏడాది తర్వాత రూ. 1 కోటికి పెరుగుతుందని భవిష్యత్తులో మరింత పెరగవచ్చని తెలుస్తోంది. స్వయంగా రైతులమైన తమకు గత ఐదేళ్లకు పైగా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఆక్వాపోనిక్స్, స్థిరమైన నేల ఆధారిత వ్యవసాయ క్షేత్రాలను నిర్వహిస్తున్న అనుభవం ఉందని ఫుడ్ స్క్వేర్ జనరల్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు మయాంక్ గుప్తా తెలిపారు. "ఫుడ్ స్క్వేర్" ప్రపంచం నలుమూలల నుండి పండ్లు, కూరగాయలను అందిస్తుంది, 350 రకాల చీజ్లను కూడా అందిస్తుంది. గుప్తా, ఝవార్ 2019లో భారతదేశంలోని కొల్హాపూర్లో "ల్యాండ్క్రాఫ్ట్ ఆగ్రో"ని స్థాపించగా ఇప్పటివరకు 3.6 మిలియన్ల పెట్టుబడులను సాధించగలిగారు. 2012లో దాదాపు రూ. 120 కోట్లతో ఆస్తిని వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించాలనే ఉద్దేశ్యంతో దీన్ని కొనుగోలు చేసినట్టు సమాచారం. ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన ఫుల్హాల్కు జూలై 2017లో లీజుకు ఇచ్చారు. సల్మాన్ తండ్రి సలీం ఖాన్ ఈ రిటైల్ చైన్ ఫుడ్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఫ్యూచర్ గ్రూప్ సల్మాన్కు కూడా రూ.2.40 కోట్లు బకాయిపడింది. దీంతో తమ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) ఆశ్రయించారు. ఈ క్రమంలో ఏప్రిల్లో సల్మాన్ఖు అనుకూలంగా తీర్పు రావడంతో కొన్ని నెలల క్రితం ఫుడ్ హాల్ ఖాళీ చేసింది. ఇప్పుడు ఈ స్థానంలో ఫుడ్ స్క్వేర్ ఈ స్థానంలో చేరింది. సల్మాన్ ఖాన్ నికర విలువ పలు నివేదికల ప్రకారం సల్మాన్ ఖాన్ నికర విలువ 2850 కోట్లు. సినిమాలతోపాటు, సల్మాన్ పలు బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కోట్లాది రూపాయిలు ఆర్జిస్తాడు. ఒక్కో బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం రూ.6 నుంచి 7 కోట్లు వసూలు చేస్తాడు. వార్షిక సంపాదన దాదాపు రూ.220 కోట్లు. ఆదాయం నెలకు 16 కోట్లు. సల్మాన్కు ముంబైలో ఆస్తి ఉండటమే కాకుండా దుబాయ్లో కోట్లాది రూపాయల ఆస్తి ఉన్న సంగతి తెలిసిందే. -
ఐఐటీ బాంబే విద్యార్థికి జాక్ పాట్: కళ్లు చెదిరే ప్యాకేజీ
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బొంబాయి (IIT-బాంబే) మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో తమ విద్యార్థి ఏకంగా రూ.3.7 కోట్ల వార్షిక వేతనం దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. ఓ మల్టీ నేషనల్ కంపెనీ తమ విద్యార్థికి ఈ ఆఫర్ ఇచ్చిందని ఐఐటీ బాంబే తన ప్రకటనలో తెలిపింది. అయితే ఆ విద్యార్థుల పేర్లు, ఆఫర్ ఇచ్చిన కంపెనీల వివరాలను సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. మరో విద్యార్థికి రూ. 1.7 కోట్ల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ దక్కించుకున్నట్టు తెలిపింది. గత సంవత్సరం అంతర్జాతీయ ఆఫర్ రూ. 2.1 కోట్లతో పోల్చితే ఇది గణనీయమైన పెరుగుదల అని పేర్కొంది. అయితే అంతకుముందు సంవత్సరం దేశీయ ఆఫర్ వార్షికంగా రూ. 1.8 కోట్లుగా ఉంది. 2022-23 ప్లేస్మెంట్ల వివరాల ప్రకారం 300 ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్లలో 194 మంది విద్యార్ధులు జాబ్స్ అంగీకరించారు. ఇందులో వార్షిక వేతనం రూ.1 కోటి కంటే ఎక్కువ ఉన్న ఆఫర్లు 16. IIT-బాంబేలోని విద్యార్థులు అమెరికా జపాన్, యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్స్, హాంకాంగ్ , తైవాన్లలో సంస్థల నుండి ఈ సంవత్సరం 65 విదేశీ ఉద్యోగ ఆఫర్లను అందుకున్నారు. మొత్తంగా, 2022-23 ప్లేస్మెంట్ డ్రైవ్లో 82 శాతం మంది విద్యార్థులు సక్సెస్ అయ్యారని, బిటెక్, డ్యూయల్ డిగ్రీ , ఎంటెక్ ప్రోగ్రామ్ల నుండి దాదాపు 90 శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారనీ తెలిపింది. ఈ ఏడాది ఇంతమంది భారీ వేతనంతో తమ విద్యార్థులు ఉద్యోగాలు పొందడంపై ఐఐటీ బాంబే సంతోషం వ్యక్తం చేసింది. -
ఐఐటీ బాంబేలో కొత్త వివాదం.. నాన్ వెజిటేరియన్లు వేరే చోట కూర్చోవాలంటూ..
ముంబయి: ఐఐటీ బాంబేలో ఆహార అలవాట్లపై వివక్ష చూపుతున్నారనే కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. హాస్టల్ క్యాంటీన్లో నాన్వెజ్ భుజించే ఓ విద్యార్థిని మరో విద్యార్థి అవమానపరిచారని ఓ స్టుడెంట్ తెలిపాడు. హాస్టల్ క్యాంటీన్ 12లో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు చెప్పాడు. క్యాంటీన్లో శాఖాహారం తినే వారికి మాత్రమే ఇక్కడ కూర్చోవాలి అంటూ పోస్టర్లు కూడా అంటించినట్లు వెల్లడించాడు. ఆ ప్రదేశాల్లో నాన్ వెజిటేరియన్లు ఖాళీ చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నాడు. హాస్టల్లో తినే ఆహారం ఆధారంగా ఏమైనా విభజన ఉందా? అనే అంశంపై ఆర్టీఐలో సమాధానం కోరినట్లు విద్యార్థులు తెలిపారు. అయితే.. ఈ ప్రశ్నకు ఫుడ్ ఆధారంగా ఎలాంటి వివక్ష లేదని యాజమాన్యం నుంచి బదులు సమాధానం కూడా వచ్చిందని పేర్కొన్నాడు. అయినప్పటికీ ఈ విధంగా వివాదం కొనసాగుతోందని తెలిపాడు. ఈ రకమైన వివక్ష తమకు అవమానకరమని కొంత మంది విద్యార్థులు ట్విట్టర్లో పోస్టు చేశారు. అంబేద్కర్ పెరియార్ పూలే స్టడీ సర్కిల్(ఏపీపీఎస్సీ) విద్యార్థులు ఈ అంశంపై స్పందించారు. ఆహారం ఆధారంగా ఎలాంటి విభజన లేదని ఆర్టీఐలో సమాధానం వచ్చినప్పటికీ కొందరు ఈ రకమైన వివక్షను కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'విజిటేరియన్స్ ఓన్లీ' అనే పోస్టర్లని క్యాంటీన్ గోడలకు అంటించారని తెలిపారు. Even though RTIs and mails for hostel GSec shows that there is no institute policy for food segregation, some individuals have taken it upon themselves to designate certain mess areas as "Vegetarians Only" and forcing other students to leave that area.#casteism #Discrimination pic.twitter.com/uFlB4FnHqi — APPSC IIT Bombay (@AppscIITb) July 29, 2023 తాము ఉన్నత వర్గాలమని చూటుకోవడానికే కొందరు ఈ రకమైన వివక్ష చూపుతున్నారని విద్యార్థులు చెప్పారు. అట్టడుగు వర్గాల విద్యార్థులను అవమానపరచడమేనని అన్నారు. ఈ అంశంపై ఐఐటీ డైరక్టర్ నుంచి గానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. నాన్వెజిటేరియన్ విద్యార్థులు ప్రత్యేక ప్లేట్లను ఉపయోగించాలనే ఘటనలు 2018లోనూ జరిగినట్లు చెప్పారు. ఇదీ చదవండి: అమానవీయం: నీళ్లు అడిగాడని.. దివ్యాంగుడ్ని పోలీసులు చితకబాదారు.. వీడియో వైరల్.. -
50 ఏళ్ల అనుబంధం: నందన్ నీలేకని కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఫిలాంత్రపిస్ట్ నందన్ నీలేకని మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. తను చదువుతున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబేకి భారీ విరాళానని ప్రకటించారు. తన 50 సంవత్సరాల అనుబంధాన్ని పురస్కరించుకుని రూ. 315 కోట్లను విరాళంగా ఇచ్చారు. (సుందర్ పిచాయ్: 32 ఎకరాల్లో లగ్జరీ భవనం, ఖరీదెంతో తెలుసా?) నందన్ నీలేకని ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాసిస్ చౌధురి ఒక అవగాహన ఒప్పందంపై మంగళవారం అధికారికంగా సంతకాలు చేశారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, ఇంజినీరింగ్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న రంగాలలో పరిశోధనలను ప్రోత్సహించడానికి ఐఐటీ బాంబేలోని టెక్ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి ఈ విరాళాన్ని వినియోగించనున్నారు. ఐఐటీ బాంబేతో తన జీవితంలో ఒక మూలస్తంభంలాంటిది. ఇవాల్టి తన ప్రయాణానికి పునాది వేసిందని నీలేకని పేర్కొన్నారు. తన విజయానికి బాటలు వేసిన ఇలాంటి గౌరవప్రదమైన సంస్థతో 50 ఏళ్ల అనుబంధాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థకు సాయం చేయడం సంతోషంగా ఉందని నీలేకని పేర్కొన్నిరు. ఇది కేవలం డబ్బు సాయం మాత్రం కాదు.. తన జీవితానికి చాలా అందించిన గొప్ప ప్రదేశం పట్ల తనకున్న గౌరవం, అలాగే రేపటి ప్రపంచాన్ని తీర్చిదిద్దే విద్యార్థుల పట్ల ఇది తన నిబద్ధత అన్నారు. (అంబానీ,అదానీ కాదు: తొలి 100 కోట్ల ఎయిర్బస్ హెలికాప్టర్, ఇంకా విశేషాలు) ఐఐటీ బాంబేతో అనుబంధం నీలేకని 1973లో ఐఐటీ బాంబేలోఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. గతంలో కూడా ఇదే ఇన్స్టిట్యూట్కి 85 కోట్లు అందించారు. దీంతో మొత్తం సహకారం రూ. 400 కోట్లకు చేరుకుంది. 1999 - 2009 వరకు ఐఐటీ బాంబే హెరిటేజ్ ఫౌండేషన్ బోర్డులో పనిచేశారు. 2005-2011 వరకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో ఉన్నారు. 1999లో ప్రతిష్టాత్మకమైన విశిష్ట పూర్వ విద్యార్ధి అవార్డును, 2019లో ఐఐటీ బాంబే 57వ కాన్వకేషన్లో భాగంగా గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు నందన్ నీలేకని. (మరిన్ని బిజినెస్వార్తలు, ఆసక్తికర కథనాల కోసం చదవండి సాక్షిబిజినెస్) To mark 50 years of my association with @iitbombay, I am donating ₹315 crores to my alma mater. I am grateful to be able to do this🙏 Full release: https://t.co/q6rvuMf2jn pic.twitter.com/f8OEfZ1UTq — Nandan Nilekani (@NandanNilekani) June 20, 2023 -
IIT Bombay: ఏడో అంతస్తు నుంచి దూకిన ఐఐటీ విద్యార్థి..
ముంబై: ఐఐటీ బాంబేలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్న ఇతడు హాస్టల్ ఏడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ ఘటన జరిగింది. గుజరాత్ అహ్మదాబాద్కు చెందిన ఈ విద్యార్థి వయసు 18 ఏళ్లు. కాలేజీలో జాయిన్ అయి మూడు నెలలే అయింది. ఫస్ట్ ఎండ్ సెమిస్టర్ పరీక్షలు కూడా శనివారమే ముగిశాయి. ఆ మరునాడే ఇతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ విద్యార్థి ఎప్పుడూ ఒంటిరిగా ఉంటాడని, హాస్టల్ రూమ్మేట్తో కూడా సరిగా మాట్లాడట్లేదని పోలీసులు తెలిపారు. ఒంటరితనం వల్లే అతనికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే పరీక్షల ఒత్తిడి కూడా ఓ కారణం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: భారత్లో భూకంప భయాలు.. మూడు రోజుల్లో మూడు రాష్ట్రాల్లో ప్రకంపనలు.. -
జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్లపై పరిమితులు ఎత్తేయాలి
న్యూఢిల్లీ: జీరో బ్యాలన్స్తో కూడిన బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్బీడీ) ఖాతాల నుంచి డిజిటల్ చెల్లింపులపై ఉపసంహరణ పరిమితులు ఎత్తివేయాలని ఐఐటీ బోంబే నివేదిక సూచించింది. ఈ ఖాతాలకు సంబంధించి విత్డ్రాయల్ పరిమితులు ఆర్బీఐ నియంత్రణల వెలుపల ఉండాలని అభిప్రాయపడింది. ఈ కామర్స్ లావాదేవీలపై 0.3 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటును ప్రభుత్వం అమలు చేసేందుకు అనుమతించాలి సూచించింది. 0.3 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) రూపంలో ఏటా రూ.5,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని, దీన్ని యూపీఐ సదుపాయాల బలోపేతానికి ఉపయోగించకోవచ్చని పేర్కొంది. డిజిటల్ పేమెంట్ ఫెసిలిటేషన్ ఫీజు మాదిరే ఈ కామర్స్ మర్చంట్స్, ఇనిస్టిట్యూషన్స్ నిర్వహించే డిజిటల్ లావాదేవీలపై ఎండీఆర్ విధించొచ్చని తెలిపింది. ‘‘ప్రస్తుత డిజిటల్ చెల్లింపుల దశకంలో.. డిజిటల్ చెల్లింపులను పాత తరానికి చెందిన సేవింగ్స్ డిపాజిట్ ఖాతాల ఉపసంహరణ పరిమితుల పరిధి నుంచి తొలగించాలి. కొన్ని బ్యాంక్లు లావాదేవీలపై నియంత్రణలు విధిస్తున్నాయి. ఉదాహరణకు ముంబైకి చెందిన ఒక బ్యాంక్ ఒక నెలలో బీఎస్బీడీ ఖాతాల నుంచి 10 సార్ల వరకే ఉపసంహరణలను పరిమితం చేసింది. సేవింగ్స్ ఖాతా అన్నది లావాదేవీల కోసం కాదు. కనీస పొదుపు కోసం. ధనిక, పేద మధ్య ఈ ఖాతాల విషయంలో వ్యత్యాసం చూపకూడదు. కావాలంటే ఖాతాలను బట్టి సర్వీజు చార్జీలు భిన్నంగా ఉండొచ్చు. అంతే కానీ, సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ల మధ్య ఉపసంహరణ లావాదేవీల పరంగా పరిమితులు విధించడం వివక్ష కిందకు వస్తుంది. సమానత్వ హక్కుకు భంగం కలిగిస్తుంది’’అని ఈ నివేదిక పేర్కొంది. -
జేఈఈ టాపర్స్ దృష్టి... ఐఐటీ బాంబే వైపే
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), బాంబే హవా కొనసాగుతోంది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్–2022లో టాప్–100 ర్యాంకర్లలో 93 మంది ఐఐటీ బాంబేను మొదటి ప్రాథామ్యంగా ఎంపిక చేసుకున్నారు. వీరిలో 69 మంది బాంబే ఐఐటీలో సీటు సాధించారు. ఇందులో 68 మంది మొదటి విడత కౌన్సిలింగ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోర్సును ప్రథమ ప్రాథామ్యంగా ఎంపిక చేసుకోగా ఒక్కరు ఇంజినీరింగ్ ఫిజిక్స్ను తీసుకున్నారు. టాప్–100 ర్యాంకర్లలో 28 మంది ఐఐటీ ఢిల్లీలోనూ ముగ్గురు ఐఐటీ మద్రాస్లోనూ జాయినయ్యారు. జాయింట్ సీట్ ఎలొకేషన్ అథారిటీ ఈ వివరాలను అందించింది. గత ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో టాప్–100 ర్యాంకర్లలో 62 మంది, 2020లో 58 ఐఐటీ బాంబేలో ప్రవేశం పొందగా 2019లో టాప్–100 ర్యాంకర్లలో 62 మంది, 2018లో 59 మంది ఇక్కడే సీటు సాధించారు. టాప్–500 ర్యాంకర్లకూ బాంబే ఐఐటీనే మొదటి ప్రాథామ్యంగా ఉంది. టాప్–500 ర్యాంకర్లలో 173 మంది ఇక్కడ, 127 మంది ఢిల్లీ ఐఐటీలో స్థానం సంపాదించారు. టాప్–500 ర్యాంకర్లలో మద్రాస్, ఖరగ్పూర్, కాన్పూర్ ఐఐటీల్లో సీట్లు సాధించిన వారి సంఖ్య 50 మంది లోపే. -
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల.. రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే..
సాక్షి, ఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్డ్–2022 ఫలితాలను పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ముంబై ఆదివారం ప్రకటించింది. ఫలితాలతోపాటే తుది ఆన్సర్ కీ, మెరిట్ లిస్ట్ను విడుదల చేసింది. విజయవాడకు చెందిన పొలిశెట్టి కార్తికేయ ఆరో ర్యాంకు సాధించింది. అభ్యర్థులు స్కోర్ కార్డులను jeeadv.ac.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలను రిజర్వేషన్లవారీగా ఆయా వర్గాల కోటా ప్రకారం విడుదల చేశారు. రిజల్ట్ కోసం క్లిక్ చేయండి.. ఇక జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) సీట్ల కేటాయింపు కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. 12వ తేదీ నుంచి ‘జోసా’ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. అడ్వాన్స్డ్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, జీఎఫ్టీఐలలో మెరిట్, రిజరేషన్ల ప్రాతిపదికన ప్రవేశాలు లభిస్తాయి. 23 ఐఐటీలలో 16,598 సీట్లు, 31 ఎన్ఐటీలలో 23,994, 26 ఐఐఐటీలలో 7,126, 33 జీఎఫ్టీఐలలో 6,759 సీట్లు ఈసారి భర్తీకి అందుబాటులో ఉన్నట్లు ‘జోసా’ సీట్ల వివరాలను విడుదల చేసింది. వాటిలోనే మహిళలకు సూపర్ న్యూమరరీ కోటా కూడా అమలు కానుంది. ఐఐటీలలో 1,567, ఎన్ఐటీలలో 749, ఐఐఐటీలలో 625, జీఎఫ్టీఐలలో 30 సీట్లు మహిళలకు సూపర్ న్యూమరరీ కోటా కింద రానున్నాయి. ఆర్కిటెక్చర్ కోర్సులకు సంబంధించిన అభ్యర్థులు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టుకు 11, 12 తేదీల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 14న ఏఏటీ పరీక్షను నిర్వహించి 17న ఫలితాలను విడుదల చేయనున్నారు. -
ఒకసారి ఐఐటీ సీటు వదులుకుంటే ఇక నో చాన్స్..!
సాక్షి, అమరావతి: గతంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో వచ్చిన సీటును వదిలేసుకున్నవారికి జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహణ సంస్థ ఐఐటీ బాంబే షాకిచ్చింది. అలాంటివారు ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి అవకాశం లేదని తేల్చిచెప్పింది. దీని ప్రకారం.. గతంలో కౌన్సెలింగ్ ద్వారా కేటాయించిన సీటుకు అంగీకారం తెలిపి.. తర్వాత చేరని విద్యార్థులకు అడ్వాన్స్డ్–2022 పరీక్ష రాసే అవకాశం ఉండదు. అలాగే ఐఐటీల్లో చేరి మధ్యలో మానేసినవారికి కూడా చాన్స్ లేదని పేర్కొంది. అదేవిధంగా జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)–2021 కౌన్సెలింగ్లో కేటాయించిన ఐఐటీ సీటును ఆమోదించి.. ఆ తర్వాత చివరి రౌండ్ కౌన్సెలింగ్కు ముందువరకు దాన్ని ఉపసంహరించకుండా కొనసాగి ఉంటే వారికి కూడా అడ్వాన్స్డ్ రాయడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. అలాగే అడ్వాన్స్డ్లో అర్హత మార్కులు సాధించినవారే ఆర్కిటెక్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ)కి అర్హులని పేర్కొంది. జేఈఈ మెయిన్ పేపర్ 2ఏ, 2బీల్లో అర్హత ఉన్నా అడ్వాన్స్డ్ రాయకుండా నేరుగా ఏఏటీ పరీక్షకు అవకాశం ఉండదని తెలిపింది. అడ్వాన్స్డ్ పరీక్షకు సంబంధించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ ఐఐటీ బాంబే ఈ విషయాలు వెల్లడించింది. జేఈఈ మెయిన్కు నమోదు చేసిన కేటగిరీలే కొనసాగింపు విద్యార్థులు తమ రిజర్వేషన్, తదితర కేటగిరీలకు సంబంధించి జేఈఈ మెయిన్లో నమోదు చేసిన అంశాలే జేఈఈ అడ్వాన్స్డ్కూ యథాతథంగా కొనసాగుతాయని ఐఐటీ బాంబే తెలిపింది. మెయిన్లో తప్పుగా కేటగిరీలను నమోదు చేస్తే వాటిని అడ్వాన్స్డ్లో సరిచేసుకునేందుకు అవకాశం ఉండదని స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్లో జనరల్ కేటగిరీ ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కోటా కింద నమోదు చేసుకున్న విద్యార్థులు ఆ పత్రాలను సమర్పించకపోతే.. జనరల్ కటాఫ్ మార్కులు సాధిస్తేనే అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులని పేర్కొంది. ఇదే నిబంధన ఓబీసీ నాన్ క్రిమీలేయర్ కేటగిరీకి వర్తిస్తుందని తెలిపింది. అలాగే రాష్ట్రాల జాబితాలో ఓబీసీ నాన్ క్రిమీలేయర్ కేటగిరీలో ఉండి.. సెంట్రల్ ఓబీసీ జాబితాలో లేని కేటగిరీల విద్యార్థులు కూడా ఆ కేటగిరీ ప్రయోజనాలు పొందలేరని వెల్లడించింది. రక్షణ సర్వీసుల్లో పనిచేసేవారి పిల్లల రిజర్వేషన్లు కూడా కొన్ని కేటగిరీల వారికే వర్తించనున్నాయి. యుద్ధాల్లో లేదా శాంతిస్థాపన కార్యక్రమాల్లో మరణించిన, వికలాంగులైన, కనిపించకుండాపోయిన వారి సంతానానికి మాత్రమే ఈ కోటా సీట్లు దక్కుతాయి. ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్డ్ కాగా, జేఈఈ అడ్వాన్స్డ్–2022 పరీక్షను ఆగస్టు 28న నిర్వహించనున్నట్లు ఐఐటీ బాంబే ప్రకటించింది. వాస్తవానికి ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 4న ఈ పరీక్షను నిర్వహించాల్సి ఉంది. కానీ జేఈఈ మెయిన్ పరీక్షలు జూన్, జూలై నెలల్లోకి వాయిదా పడడంతో అడ్వాన్స్డ్ పరీక్షను కూడా వాయిదా వేయక తప్పలేదు. కాగా జేఈఈ మెయిన్లో నిర్ణీత కటాఫ్ మార్కులు సాధించి.. అర్హత పొందిన వారిలో టాప్ 2.5 లక్షల మందికి మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. వీరికి మాత్రమే అడ్వాన్స్డ్–2022కు అవకాశం.. ► గతేడాది జోసా చివరి రౌండ్ కౌన్సెలింగ్కు ముందు ఉపసంహరించుకున్నవారు. ► బీఈ, బీటెక్లతోపాటు డ్యుయెల్ డిగ్రీ కోర్సుల్లో సీట్లు పొందేందుకు ఐఐటీలు నిర్వహించే రెసిడెన్షియల్ ప్రిపరేటరీ కోర్సుల్లో చేరిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు. ► గతేడాది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లో సీట్లు వచ్చినవారు. అయితే వీరికి నిర్దేశిత అర్హతలు ఉండాలి. ► గతేడాది సీటు పొందినా దాన్ని ఆమోదించడం, ఫీజు చెల్లించడం, విద్యా సంస్థలో రిపోర్టు చేయనివారు ► 2021 జేఈఈ అడ్వాన్స్డ్కు దరఖాస్తు చేసుకొని రెండు పేపర్లూ రాయనివారు.. జేఈఈ మెయిన్–2022లో అర్హత సాధించినవారు. ► జేఈఈ మెయిన్ బీఈ, బీటెక్ కోర్సులకు సంబంధించిన పేపర్–1ను కాకుండా పేపర్ 2ఏ, 2బీలను రాసినవారు. -
Gorilla Fan: ఈ ఫ్యాన్తో కరెంటు బిల్లు తక్కువ! అందుకే ఇలా!
‘ఫ్యాన్ కంపెనీ స్టార్టప్ మొదలుపెట్టాలనుకుంటున్నాను’ అని మనోజ్ మీనా తన ఆలోచనను చెబితే నవ్వి తేలికగా తీసుకున్నవారే తప్ప భుజం తట్టినవారు తక్కువ. ‘ఇప్పటికే మార్కెట్లో బోలెడు ఫ్యాన్ కంపెనీలు ఉన్నాయి. ఇక పెద్ద కంపెనీల సంగతి సరే సరే. వాటిని వదిలి మీ ఫ్యాన్ కోసం జనాలు వస్తారా?’ అడిగాడు ఒక మిత్రుడు. నిజమే మరీ...బోలెడు పోటీ! ఇలాంటి సమయంలోనే ‘మా ప్రత్యేకత ఏమిటి?’ అనే ప్రశ్న ముందుకు వస్తుంది. అయితే వారి ప్రత్యేకతే కంపెనీ విజయానికి బాటలు వేసింది. మనోజ్ మీనా, శిబబ్రత్దాస్లు ఐఐటీ, బాంబే గ్రాడ్యూయెట్స్. మనోజ్ మీనా ఫౌండర్గా ‘ఆటంబెర్గ్ టెక్నాజీస్’ మొదలైంది. తరువాత దాస్ కో–ఫౌండర్గా చేరాడు. ఇద్దరికీ కాలేజిరోజుల నుంచి ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ అంటే ఇష్టం. దీనికి సంబంధించిన కార్యక్రమాలు, పోటీలలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఆటంబెర్గ్ టెక్నాజీస్ వారి ‘గొరిల్లా ఫ్యాన్’ విజయవంతం కావడానికి కారణం... సంప్రదాయ సీలింగ్ ఫ్యాన్లతో పోల్చితే ఇవి ఇంధనాన్ని ఆదా చేస్తాయి. కరెంటు బిల్లు బరువును తగ్గిస్తాయి. ఈ ఫ్యాన్ను ఆన్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా, స్పీడ్ తగ్గించాలన్నా, పెంచాలన్నా గోడకు ఉన్న స్విచ్ దాకా వెళ్లనక్కర్లేదు. చేతిలో ఉన్న స్మార్ట్ రిమోట్తో చేయవచ్చు. సామాన్యుడికి ఇంతకంటే కావాల్సింది ఏమిటి! సామాన్యులే కాదు ఈ ఫ్యాన్లను ఇన్ఫోసిస్, ఆదిత్య బిర్లా గ్రూప్...లాంటి పెద్ద కంపెనీలు కొనుగోలు చేయడం విశేషం. బంగ్లాదేశ్, నైజీరియా...మొదలైన దేశాలకు గొరిల్లా ఫ్యాన్లు ఎగుమతి అవుతున్నాయి. ఈ మేడిన్–ఇండియా కంపెనీ 2017లో నేషనల్ ఎంటర్పెన్యూర్షిప్ అవార్డ్ గెలుచుకుంది. ఇక్కడితో ఆగిపోలేదు. గ్లోబల్ క్లైమెట్ సాల్వర్ అవార్డ్(వరల్డ్ వైల్డ్లైఫ్ ఫండ్) గెలుచుకుంది. గ్లోబల్ క్లీన్టెక్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ విన్నర్గా నిలిచింది. ప్రధానమంత్రి నీతి ఆయోగ్ ‘ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్’ గుర్తింపు పొందింది. ఫోర్బ్స్ 30 అండర్ 30 ‘సైన్స్ అండ్ గ్రీన్ టెక్నాలజీ’ విభాగంలో, ఫోర్బ్స్ 30 అండర్ 30 ఏషియా ‘ఇండస్ట్రీ, మాన్యుఫాక్చరింగ్ అండ్ ఎనర్జీ’ విభాగంలో చోటు సంపాదించింది. ‘మార్కెట్ బజ్వర్డ్స్ను గుడ్డిగా ఫాలో కావద్దు. ఉదాహరణకు...ఆటోమేషన్ అనేది మూడు, నాలుగు సంవత్సరాల క్రితం మార్కెట్ బజ్వర్డ్. తరువాత ఐవోటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) బజ్వర్డ్గా మారింది. వాటి వెంట పరుగులు తీసేముందు... వినియోగదారులకు వాటిని ఎలా అందుబాటులోకి తేవాలనేదానిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. సమంజసమైన ధరలలో ప్రాడక్ట్ను వినియోగదారులకు చేరువ చేయగలిగితే ఆ ప్రాడక్ట్ మార్కెట్లో బెస్ట్సెల్లర్గా నిలుస్తుంది’ అంటాడు ‘ఆటంబెర్గ్ టెక్నాలజీస్’ కో–ఫౌండర్ దాస్. ఇక ఇన్వెస్టర్స్ గురించి ఫౌండర్ మనోజ్ మీనా ఇలా అంటాడు... ‘మన కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపడం సంతోషించదగిన విషయమే అయినా సరిౖయెన ఇన్వెస్టర్స్ను ఎంపిక చేసుకోవడం అనేది ఒక సవాలు’. అయితే ముంబై కేంద్రంగా మొదలైన ‘ఆటంబెర్గ్’ కంపెనీ మొదట్లో అనూహ్యమైన విజయమేమీ సాధించలేదు. మొదటి ఆరు నెలలు జీరోరెవెన్యూ వెక్కిరించింది. మరోవైపు రకరకాల ఆర్థిక ఒత్తిళ్లు. ఇద్దరినీ తీవ్రమైన నిరాశ కమ్మేసింది. ఆ సమయంలో తాత్వికుల మాట ‘ఆగనంత వరకు నీ ప్రయాణం ఎంత నెమ్మదిగా సాగుతుంది అనేది ముఖ్యం కాదు’ పదేపదే గుర్తు తెచ్చుకొని ధైర్యం తెచ్చుకునేవారు. ఆర్ అండ్ బీ, ట్రైనింగ్, ఫండ్ రైజింగ్, భాగస్వాములను వెదుక్కోవడం....ఒక్కటా రెండా, ఎన్నెన్నో విషయాలు తలకు మించిన భారం అయ్యాయి. అయినప్పటికీ భయానికి ఎక్కడా తలవంచలేదు. వారి ఆశ వృథా పోలేదు. మెల్లగా అయినా సరే కంపెనీ వృద్ధిరేటు పెరుగుతూ పోయింది. కూలర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్, ఏసీ...మొదలైన అప్లికేషన్లపై పనిచేస్తున్న ‘ఆటంబెర్గ్’ భవిష్యత్లో హౌజ్హోల్డ్ కన్జ్యూమర్ అప్లికేషన్లలో అత్యున్నతస్థాయి విజయాలు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. చదవండి: ఐ యామ్ ఏబుల్.. వైకల్యాన్నే కాదు, మా నైపుణ్యాలనూ చూడండి..! -
కరోనా బాధితులకు పిల్లలు పుట్టరా..? టెన్షన్ పెడుతున్న రీసెర్చ్!
సాక్షి, ముంబై: ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇదిలా ఉండగా కరోనా సోకిన వారిపై చేసిన అధ్యయనం బాధితులను కలవరపాటుకు గురిచేస్తోంది. కొవిడ్ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని పరిశోధకులు ఓ అధ్యయనంలో వెల్లడించారు. ఐఐటీ బొంబాయి పరిశోధకులు కరోనా బారిన పడి కోలుకున్న పురుషులపై ఓ రీసెర్చ్ చేశారు. ఇందులో భాగంగా కొవిడ్ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని వారి అధ్యయనంలో తేలింది. స్వల్ప లక్షణాలతో అనారోగ్యానికి గురైన వారిలోనూ సంతానోత్పత్తికి సంబంధించిన ప్రోటీన్లు దెబ్బతింటున్నాయని వారు తెలుసుకున్నారు. కాగా, పురుషుల వీర్యకణాలపై చేసిన ఈ పరిశోధనను.. ఏసీఎస్ ఒమెగా జర్నల్ గత వారం ప్రచురించింది. ఈ అధ్యయనాన్ని ఐఐటీ బొంబాయితో కలిసి జస్లోక్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించారు. ఈ అధ్యయనంలో వైరస్ కారణంగా పురుషుల సంతానోత్పత్తి తగ్గుతుందని తాజాగా తేలినట్లు స్పష్టం చేశారు. ఈ అధ్యయనం కోసం 20 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 10 మంది ఆరోగ్యవంతమైన పురుషుల వీర్యంతో పాటు 17 మంది కొవిడ్ బారిన పడి కోలుకున్న వారి వీర్యకణాల నమూనాలను విశ్లేషించినట్లు తెలిపారు. కరోనా బారినపడిన వారితో ఆరోగ్యవంతుల.. వీర్య కణాలను పోల్చగా.. గణనీయంగా కణాల తగ్గినట్లు అధ్యయనంలో గుర్తించారు. కరోనా బాధితుల్లో సంతానోత్పత్తికి సంబంధించిన రెండు ప్రోటీన్లు సెమెనోజెలిన్1, ప్రోసాపోసిన్ తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు చెప్పారు. ఇక, కొవిడ్కు కారణమైన సార్స్-2 వైరస్ ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని.. దాంతో పాటు ఇతర వ్యవస్థలను దెబ్బతీస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇది చదవండి: భారత్లో ఎక్స్ఈ స్ట్రెయిన్ కేసులు.. ఎన్కే అరోరా కీలక వ్యాఖ్యలు ఇవే.. -
భారతీయ విద్యార్ధులకు జాక్ పాట్, ఏడాదికి శాలరీ రూ.2.16 కోట్లు..!
IIT Bombay Placements 2021 Highest Package: ఐఐటీలు, ఐఐఎంలు అంటేనే ప్రతిభకు పట్టుగొమ్మలు. అందుకే మల్టీ నేషనల్ కంపెనీలు ఐఐటీయన్స్కి ఏడాదికి కోట్లలో జీతం చెల్లించడానికి కూడా వెనకాడవు. ఇటీవల ఐఐటీ బాంబే ఫస్ట్ ఫేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో ఐఐటీ బాంబే విద్యార్ధులు జాక్ పాట్ కొట్టేశారు.క్యాంపస్ ప్లేస్మెంట్లో కోటి రూపాయలకు పైగా జీతంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో 1382 ఉద్యోగాలు సాధించగా అందులో 45 ఇంటర్నేషనల్ కంపెనీలు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. 18రోజుల పాటు జరిపిన ఫస్ట్ ఫేజ్ క్యాంపస్ సెలక్షన్లో 12మంది విద్యార్ధులు కోటికి పైగా శాలరీ తీసుకోనున్నారని, ఇదే ఫస్ట్ ఫేజ్ ఇంటర్వ్యూలో తొలి రికార్డ్గా నమోదైనట్లు ఎలైట్ టెక్ అండ్ ఇంజనీరింగ్ స్కూల్ ప్రతినిధులు వెల్లడించారు. ఫస్ట్ ఫేజ్లో 315 కంపెనీలు డిసెంబర్ 18తో ముగిసిన ఫస్ట్ ఫేజ్ ఇంటర్వ్యూలో మొత్తం 1723 ఉద్యోగాలకు గాను 1382 ఉద్యోగాలకు విద్యార్ధులు ఎంపికైనట్లు ఐఐటీ బాంబే ఓ రిపోర్ట్ను విడుదల చేసింది. ఇక ఇదే క్యాంపస్ ఇంటర్వ్యూలో 2019లో 1172 మంది, 2020లో 973 మంది సెలక్ట్ అయ్యారు. ఇంటర్వ్యూ లేకుండా గతేడాది 182మంది ప్రీప్లేస్ మెంట్ ఆఫర్ పొందగా, ఈ ఏడాది 248 మంది విద్యార్ధులు ప్రీప్లేస్మెంట్ ఆఫర్(ఇంటర్నషిప్ త్వరాత ఇంటర్వ్యూతో సంబంధం లేకుండా జాబ్) దక్కించుకున్నారు. ఇంజనీరింగ్ టెక్నాలజీతో పాటు ఇద్దరు విద్యార్ధులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం సంపాదించారు. త్వరలో నిర్వహించే సెకండ్ ఫేజ్లో ఐఐటీ బాంబే యూనివర్సిటీ విద్యార్ధులు అధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదిస్తారని ఐఐటీ బాంబే ధీమా వ్యక్తం చేసింది. జాక్ పాట్ కొట్టేశారు ఐఐటీ బాంబే యూనివర్సిటీ ప్రకారం.. ఫస్ట్ ఫేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో విదేశీ కంపెనీల్లో ఏడుగురు విద్యార్ధులు వార్షిక వేతనం కోటి రూపాయలు ఉండగా..అధిక వార్షిక వేతనం రూ.2.16కోట్లుగా ఉంది. ఇక దేశీయ కంపెనీల్లో ఐదుగురు విద్యార్ధులు కోటి రూపాయలు శాలరీ దక్కించుకోగా.. వార్షిక వేతనం రూ.1.68కోట్లని ఐఐటీ బాంబే అధికారులు తెలిపారు. సీటీసీ ఎంతంటే క్యాంపస్ ఇంటర్వ్యూలో సంవత్సరానికి యావరేజ్గా రూ.25లక్షలు జీతంగా అందుకోనున్నట్లు ఐఐటీ బాంబే తెలిపింది. ఫైనాన్షియల్ సెక్టార్లో యావరేజ్ శాలరీ రూ.28.4లక్షలు, ఐటీ-సాఫ్ట్వేర్ రంగంలో రూ.27.05లక్షలు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్టార్లో (ఆర్డీ) రూ.25.12లక్షలు, కన్సల్టింగ్ సెక్టార్లో యావరేజ్ శాలరీ రూ.18.02గా ఉన్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయిలో ఇక విదేశాలకు చెందిన కంపెనీలు భారతీయ విద్యార్ధులు ఎంపిక చేసుకోవడంలో పోటీ పడుతున్నట్లు తేలింది. ఐఐటీ బాంబే యూనిర్సిటీలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో 45 అంతర్జాతీయ కంపెనీలు విద్యార్ధుల్ని సెలక్ట్ చేసుకోనేందుకు వచ్చినట్లు యూనివర్సిటీ ప్రతినిధులు చెప్పారు. వాటిలో యూఎస్, జపాన్, యూఏఈ, సింగపూర్, నెదర్లాండ్, హాంకాంగ్, తైవాన్ కంపెనీలు ఉన్నాయి. చదవండి: కరోనా లేదు, ఒమిక్రాన్ లేదు..2 లక్షలకు పైగా ఉద్యోగాలు రెడీగా ఉన్నాయ్ -
ఉబర్లో జాబ్.. ఏడాదికి వేతనం రూ.2 కోట్లకు పైనే
IIT Bombay Student Gets More Than 2 Crore Rupees Job Offer From Uber: ఐఐటీలు, ఐఐఎంలు అంటేనే ప్రతిభకు పట్టుగొమ్మలు. అందుకే మల్టీ నేషనల్ కంపెనీలు ఐఐటీయన్స్కి ఏడాదికి కోట్లలో జీతం చెల్లించడానికి కూడా వెనకాడవు. తాజాగా ఈ జాబితాలోకి ట్యాక్సీ రైడ్ దిగ్గజ సంస్థ ఉబర్ టెక్నాలజీస్ చేరింది. ఓ ఐఐటీ విద్యార్థికి ఏడాడికి రూ. 2.5 కోట్ల ప్యాకేజీతో తమ కంపెనీలో ఉద్యోగం ఇచ్చింది. ఆ వివరాలు.. (చదవండి: హ్యాట్సాఫ్ ఆర్య: ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న తండ్రికూతుళ్లు) ఐఐటీ బాంబే విద్యార్థి ప్రతిభకు ఉబర్ ఫిదా అయ్యింది. అందుకే ఏడాదికి ఏకంగా 2 కోట్ల రూపాయలకు పైగా వేతనం చెల్లించేందుకు ముందుకు వచ్చింది. అలానే ఐఐటీ గుహవటి విద్యార్థికి ఏడాదికి సుమారు 2 కోట్ల రూపాయల వేతనం ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇది మాత్రమే కాక, నివేదికల ప్రకారం ఈ ఏడాది 11 మంది ఐఐటీ రూర్కీ విద్యార్థులు సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ వేతనంతో వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. (చదవండి: ఆమె కోపం.. రూ.8కోట్లు తెచ్చింది) ఈ ఆఫర్లు గత ఏడాదితో పోలిస్తే చాలా ఎక్కువ. ఉదాహరణకు, 2020లో ఐఐటీ బాంబే విద్యార్థి అందుకున్న అత్యధిక ప్యాకేజీ రూ. 1.54 కోట్లు మాత్రమే. గతేడాది కరోనావైరస్, ప్రపంచవ్యాప్త లాక్డౌన్.. వ్యాపారలపై భారీ ప్రభావం చూపింది. ఈ గందరగోళాలన్ని ముగిసి ప్రస్తుతం మార్కెట్లు స్థిరంగా ఉండటమే భారీ ప్యాకేజ్ ఆఫర్కి కారణమని నిపుణులు భావిస్తున్నారు. చదవండి: లేడీ కస్టమర్కు షాకిచ్చిన డెలివరీ బాయ్ -
Employability Rankings: ప్రపంచంలో ఎక్కువ ఉద్యోగార్హత ఈ యూనివర్సిటీవాళ్లదే!
Times Higher Education (THE) Graduate Employability Rankings 2021: ఉద్యోగవకాశాలు కల్పించడంలో సాంకేతిక విద్యాలయాల పాత్ర ఎంతో ప్రముఖమైంది. అయితే ఈ ఏడాది మన దేశంలోని ప్రముఖ విద్యాలయాలు గ్లోబల్ స్థాయిలో సత్తా చాటాయి. ఏకంగా 27వ స్థానంతో టైమ్స్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్లో నిలిచింది ఐఐటీ ఢిల్లీ. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్ 2021లో ఢిల్లీ యూనివర్సిటీ.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బర్కిలీ 32వ ర్యాంక్), యూనివర్సిటీ ఆఫ్ చికాగో(33వ ర్యాంక్)లను సైతం వెనక్కి నెట్టేసింది. ప్రపంచంలో ఉద్యోగాలకు అర్హత ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎక్కువమందిని ఢిల్లీ ఐఐటీ అందిస్తోందన్నమాట. ఇక ఈ లిస్ట్లో టాప్-100లో బెంళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc(61), ఐఐటీ బాంబే(97) కూడా చోటు దక్కించుకున్నాయి. గతంలో వీటి ర్యాంక్స్ 71, 128గా ఉండగా.. ఈ ఏడాది ర్యాంకింగ్స్ను మెరుగుపర్చుకున్నాయి. ఐఐఎం అహ్మదాబాద్(162), ఐఐటీ ఖరగ్పైర్ (170), అమిటీ యూనివర్సిటీ(225), బెంగళూరు యూనివర్సిటీ(249) స్థానాల్లో నిలిచాయి. ఇక క్యూఎస్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్ టాప్ 150లో ఢిల్లీ, బాంబే ఐఐటీలు స్థానం దక్కించుకున్నాయి. ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్ను ఉద్యోగుల సబ్జెక్ట్ స్పెషలైజేషన్, గ్రాడ్యుయేట్ స్కిల్స్ను పరిగణనలోకి తీసుకుంటారు. యూనివర్సిటీలకు సంబంధించి అకడమిక్ ఎక్సలెన్స్, డిజిటల్ పర్ఫార్మెన్స్, ఫోకస్ ఆన్ వర్క్, సాఫ్ట్ స్కిల్స్-డిజిటల్ లిటరసీ, ఇంటర్నేషనలిజం, స్పెషలైజేషన్.. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటారు. THE Graduate Employability Rankings 2021 లో మాసెచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(అమెరికా) టాప్ ప్లేస్లో ఉంది. ఆసియా నుంచి టోక్యో యూనివర్సిటీ(6), సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ (9) మాత్రమే టాప్ టెన్లో చోటు సంపాదించుకున్నాయి. చదవండి: జీవిత భాగస్వాములపై నిఘా..! సంచలన విషయాలు వెల్లడి..! -
Elon Musk: రూ.1.86 కోట్ల గ్రాంట్ గెలుచుకున్న ముంబై స్టూడెంట్స్
ఎలన్ మస్క్ స్థాపించిన ఎక్స్ప్రైజ్ సంస్థ నుంచి భారీ గ్రాంటుని సాధించారు ముంబైకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు. యూకేలోని గ్లాస్కోలో జరుగుతున్న కాప్ 26 సదస్సులో ఈ విద్యార్థుల ప్రజెంటేషన్కి ఈ గ్రాంట్ దక్కింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబైకి చెందిన శ్రీనాథ అయ్యర్, అన్వేష బెనర్జీ, సృష్టి భామరే, శుభంకుమార్లు కాలుష్యాన్ని తగ్గించే ట్రై మాడ్యులర్ టెక్నాలజీ సాస్ఐఐటీబీ (SASIITB) కాన్సెప్టును గ్లాస్కోలో ప్రదర్శించారు. వీరి కాన్సెప్టు ప్రకారం.. కార్బన్ డై ఆక్సైడ్ విడుదలయ్యే చోట ట్రై మాడ్యులర్ని ఉంచినట్టయ్యితే కార్బన్ డై యాక్సైడ్ ఉప్పుగా మారుతుంది. గ్లాస్కోలో జరిగే సదస్సులో కార్బన్ రిమూవల్ స్టూడెంట్స్ కాంపిటిషన్ను నిర్వహించారు. ఇందులో కార్బన్ని తగ్గించే ఫ్యూచర్ టెక్నాలజీ అందించిన స్టూడెంట్స్కి 5 మిలియన్ డాలర్లు ప్రైజ్మనీగా నిర్ణయించారు. మొత్తం 23 కాన్సెప్టులో ఇందులో బహుమతులు, గ్రాంట్లు గెలుచుకున్నాయి. ఇందులో ఐఐటీ ముంబై టీం 2,50,000 డాలర్ల గ్రాంట్ని నవంబరు 11న అందుకుంది. ఇండియన్ కరెన్సీలో ఈ గ్రాంటు రూ.1.86 కోట్లుగా ఉంది. ఈ గ్రాంటుతో సాస్ఐఐటీబీ బృందం స్టార్టప్ను నెలకొల్పే అవకాశం ఉంది. చదవండి:ఎలన్ మస్క్ దెబ్బకు.. వారంలో రూ.13 లక్షల కోట్లు ఆవిరి -
ఆర్యభట్ట మ్యాథ్స్ కాంపిటీషన్; మొదటి విజేతకు లక్షన్నర
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ స్కిల్ డవలప్మెంట్(ఏఐసీటీఎస్డీ), ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థులతో కలిసి ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్ను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. మ్యాథమెటిక్స్లో ప్రతిభావంతులను గుర్తించి.. భవిష్యత్ టెక్నాలజీ సైంటిస్ట్లుగా ఎదిగేలా ప్రోత్సహించేందుకు ఈ పరీక్ష జరుపుతోంది. ఈ ఏడాదికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్కు అర్హతలు, ప్రయోజనాలు, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం.. అర్హతలు దేశంలోని ఏదైనా కళాశాల, లేదా పాఠశాల విద్యార్థులు ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 10ఏళ్ల నుంచి 24ఏళ్లలోపు ఉండాలి. జాతీయ స్థాయి పోటీలో తమ మ్యాథమెటిక్స్ నైపుణ్యాలను ప్రదర్శించాలనే అభిలాష ఉండాలి. ప్రయోజనాలు పరీక్షలో ప్రతిభ చూపిన టాప్ 20 మందిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో టాప్ –3ని విజేతలుగా ప్రకటిస్తారు. మొదటి విజేతకు రూ.1.5 లక్షలు, రెండో విజేతకు రూ.50 వేలు, మూడో విజేతకు రూ.పదివేలు అందిస్తారు. దీంతోపాటు ఏఐసీటీఎస్డీ ధ్రువపత్రం, నేషనల్ మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ ట్రోఫీ ఇస్తారు. అదేవిధంగా రోబోటిక్స్ ఆటోమేషన్, సాఫ్ట్వేర్స్ విత్ ఇండస్ట్రియల్ ప్రొఫెషనల్స్లో ఉచిత శిక్షణ లభిస్తుంది. అంతేకాకుండా ఏఐసీటీఎస్డీ నిర్వహించే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కూడా పొందొచ్చు. స్కాలర్షిప్కు కూడా అవకాశం ఉంది. పరీక్ష విధానం! పరీక్ష ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. ఇంటి నుంచే రాయొచ్చు. ప్రశ్న పత్రం ఆబ్జెక్టివ్ విధానం(ఎంసీక్యూ)లో ఉంటుంది. 30 ప్రశ్నలకు– 60 మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం 45 నిమిషాలు. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత వేస్తారు. ల్యాప్ట్యాప్ లేదా పీసీ ద్వారా పరీక్షకు హాజరుకావచ్చు. రాత పరీక్షలో ప్రతిభ చూపిన టాప్ 20 మందికి ఆన్లైన్ లైవ్ ఇంటర్వ్యూ ఇంటి నుంచే హాజరుకావచ్చు. ► పది నుంచి పదమూడేళ్ల వయసు విద్యార్థులకు గ్రూప్–1 విభాగం పరీక్ష; 14ఏళ్ల నుంచి 17 ఏళ్ల వయసు విద్యార్థులకు గ్రూప్–2 విభాగం పరీక్ష; 18ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసు విద్యార్థులకు గ్రూప్–3 విభాగం పరీక్ష ఉంటుంది. ఆయా విభాగం పరీక్షలకు సిలబస్ భిన్నంగా ఉంటుంది. ► గ్రూప్–1 విభాగం విద్యార్థులకు చైన్ రూల్, పర్సంటేజెస్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్, నంబర్ సిస్టమ్, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ క్యాలెండర్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ► గ్రూప్–2 విభాగం విద్యార్థులకు కంపేరింగ్ క్వాంటిటీస్, ఏజెస్, ట్రైన్స్, టైమ్ అండ్ వర్క్, ట్రూ డిస్కౌంట్, చైన్ రూల్, హెచ్సీఎఫ్ అండ్ ఎల్సీఎం, ప్రాఫిట్ అండ్ లాస్ అంశాలపై ప్రశ్నలు ఎదురవుతాయి. ► గ్రూప్–3 వి«భాగం విద్యార్థులకు ప్రాఫిట్ అండ్ లాస్,రేషియో అండ్ ప్రపోర్షన్,స్పీడ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంటరెస్ట్, టైమ్ అండ్ వర్క్, ట్రైన్స్, చైన్ రూల్, ఏజెస్పై ప్రశ్నలు అడుగుతారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.290. మొదట దరఖాస్తు చేసిన పదివేల మందిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ► దరఖాస్తులకు చివరి తేది: 20.05.2021 ► ఆన్లైన్ పరీక్ష తేది: 10.06.2021 ► తుది ఫలితాల వెల్లడి: 30.06.2021 ► వెబ్సైట్: https://www.aictsd.com/aryabhatta-national-maths-competition After 10th Class: టెన్త్.. టర్నింగ్ పాయింట్! -
నైట్రోజన్ యంత్రాలతో ఆక్సిజన్ ఉత్పత్తి!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు ఐఐటీ బాంబే శాస్త్రవేత్తలు వినూత్నమైన పరిష్కారం కనిపెట్టారు. నైట్రోజన్ వాయువును కేంద్రీకరించే యంత్రాన్ని ఆక్సిజన్ కాన్సంట్రేటర్గా మార్చారు. నమూనా యంత్రం ఇప్పటికే విజయవంతంగా పరీక్షలు ముగించుకుంది. ‘ప్రెషర్ స్వింగ్ అడ్సాప్షన్’(పీఎస్ఏ) టెక్నాలజీ తోనే ఈ యంత్రం పనిచేస్తుంది. ఈ యంత్రంతో వాతావరణ పీడనానికి 3.5 రెట్లు ఎక్కువ పీడనంతో, 93 నుంచి 96 శాతం స్వచ్ఛతతో ఆక్సిజన్ను ఉత్పత్తి చేయొచ్చు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు.. జియోలైట్ అనే పదార్థం సాయంతో నైట్రోజన్, ఇతర వాయువులను తొలగించి ఆక్సిజన్ను కేంద్రీ కరిస్తుంది. నైట్రోజన్ను కేంద్రీకరించే యంత్రాల్లో జియోలైట్ స్థానంలో కార్బన్ను ఉపయోగిస్తారు. దేశంలోని నైట్రోజన్ ప్లాంట్లను ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలుగా మార్చగలిగితే సులువుగా ఆక్సిజన్ ఉత్పత్తి చేయొచ్చని పరిశోధన లకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మిలింద్ ఆత్రే తెలిపారు. చదవండి: కాన్సన్ట్రేటర్లకు ఎందుకంత డిమాండ్ ? రెమిడెసివర్ కొరత: కేంద్రం కీలక నిర్ణయం -
ఈ షాలూ.. మస్తు చాల్.. తెలుసా!
హోలా.. మర్హబా.. నిహావో.. సలూట్.. ఓయ్.. స్వస్ది.. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా..? పలు విదేశీ భాషల్లో నమస్కారం అని అర్థం. ఈ ఫొటోలో ఉన్న బొమ్మ చూశారా.. ఇదో రోబో.. పేరు ‘షాలు’. ‘సోఫియా’రోబో తెలుసు కదా.. అచ్చు అలాంటిదే ఇది. ఈ షాలు దాదాపు 38 విదేశీ భాషలు మాట్లాడగలదు. భారత్లోని దాదాపు 9 భాషల్లో మాట్లాడుతుందట. ఈ రోబోను తయారు చేసింది దినేశ్పటేల్ అనే కంప్యూటర్ సైన్స్ టీచర్. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్కు చెందిన దినేశ్ పటేల్ ఐఐటీ బాంబేలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాడు. రజనీకాంత్ ‘రోబో’ సినిమా స్ఫూర్తితో ఈ రోబోను తయారు చేశాడట. పైగా ఈ రోబోను పూర్తిగా ప్లాస్టిక్, అల్యూమినియం, కార్డుబోర్డు వంటి వ్యర్థ పదార్థాలతో తయారుచేశాడు. ఈ రోబో వ్యక్తులను గుర్తుపట్టడంతో పాటు, భావోద్వేగాలు వ్యక్తపరచడం, వార్తాపత్రికలు చదవడం తదితర కార్యకలాపాలు చేస్తుందని దినేశ్ చెబుతున్నాడు. ఈ రోబోను స్కూల్ టీచర్గా కాని, రిసెప్షనిస్టుగా కానీ నియమించుకోవచ్చని పేర్కొంటున్నాడు. షాలు.. ఏకంగా 47 భాషల్లో (38 విదేశీ భాషలు, 9 స్థానిక భాషలు) మాట్లాడగలుగుతుందట. ఈ రోబో పలు భాషల్లో మాట్లాడుతుండగా వీడియోలు తీసి దినేశ్ ‘అప్నీ రోబో షాలు’అనే యూట్యూబ్ చానెల్లో పెడుతున్నాడు. దీంతో ఈ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. -
సిద్ధాంత్కు సీటివ్వండి!
న్యూఢిల్లీ: జేఈఈ పరీక్షలో మంచి ర్యాంకు సంపాదించినా ఒక్క రాంగ్ క్లిక్తో ఐఐటీ సీటు కోల్పోయిన సిద్ధాంత్ బత్రాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బత్రాకు మధ్యంతర ప్రవేశం కల్పించాలని కోర్టు ఐఐటీ బాంబేని ఆదేశించింది. జస్టిస్ ఎస్కే కౌల్ ఆధ్వర్యంలోని బెంచ్ ఈ కేసును విచారించింది. ముందుగా బత్రాకు అడ్మిషన్ ఇవ్వాల్సిందిగా ఐఐటీని ఆదేశించి తదుపరి విచారణను శీతాకాలం సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. ప్రస్తుతం బత్రాకు ఇచ్చే అడ్మిషన్ తుది తీర్పునకు లోబడి ఉంటుందని తెలిపింది. ఆగ్రాకు చెందిన సిద్ధాంత్ బత్రాకు జేఈఈలో 270వ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో సీటు సంపాదించాడు. అయితే అక్టోబర్ 31న తన రోల్ నంబర్పై అప్డేట్ల కోసం నెట్లో బ్రౌజ్ చేస్తుండగా ఒక లింక్ను అనుకోకుండా క్లిక్ చేశాడు. ‘‘విత్ డ్రా ఫ్రం సీట్ అలకేషన్ అండ్ ఫర్దర్ రౌండ్స్’ అని ఉన్న లింక్ను తను క్లిక్ చేశాడు. ఇప్పటికే తనకు సీటు దొరికినందున ఇకపై ఎలాంటి అడ్మిషన్ రౌండ్లు ఉండవన్న నమ్మకంతో ఈ లింక్ను క్లిక్ చేసినట్లు బత్రా చెప్పారు. అయితే నవంబర్ 10న విడుదలైన 93మంది విద్యార్దుల తుది జాబితాలో బత్రా పేరు లేదు. దీంతో ఆయన బొంబాయి హైకోర్టులో పిటీషన్ వేశారు. 19న పిటిషన్ విచారించిన కోర్టు రెండురోజుల్లో బత్రా పిటిషన్ను ఆయన విజ్ఞాపనగా పరిగణించమని ఐఐటీని ఆదేశించింది. అయితే విత్డ్రా లెటర్ను రద్దు చేసే అధికారం తమకు లేదంటూ ఐఐటీ గత నెల 23న బత్రా అప్పీలును తిరస్కరించింది. నిబంధనలు అతిక్రమించి ఏమీ చేయలేమని తెలిపింది. అడ్మిçషన్లన్నీ జేఒఎస్ఎస్ఏ చూసుకుంటుందని ఐఐటీ రిజిస్ట్రార్ చెప్పారు. ప్రస్తుతం తమ వద్ద ఖాళీ సీటు లేదన్నారు. వచ్చేఏడాది జేఈఈకి బత్రా అప్లై చేసుకోవచ్చన్నారు. ఐఐటీ వాదనతో ఏకీభవించిన బాంబే హైకోర్టు తన అభ్యర్థనను కొట్టివేయడంతో బత్రా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన అభ్యర్థనను మానవతా ధృక్పథంతో పరిశీలించాలని, తనకోసం అదనపు సీటు సృష్టించాలని విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు విద్యార్ధికి అడ్మిషన్ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. -
ఒక్క క్లిక్తో ఐఐటీ సీటు ఢమాల్!
ముంబై: ఆల్ ఇండియా జేఈఈ పరీక్షలో 270వ ర్యాంకు పొందిన ఒక యువకుడు ఒక్క తప్పిదంతో ప్రఖ్యాత ఐఐటీలో ఇంజనీరింగ్ సీటు కోల్పోయాడు. ఆగ్రాకు చెందిన సిద్ధాంత్ బత్రాకు తల్లీ తండ్రీలేరు. కష్టపడి చదవి జేఈఈలో మంచి ర్యాంకు సంపాదించాడు. ఐఐటీ బోంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో సీటు సైతం సంపాదించాడు. అయితే అక్టోబర్ 31న తన రోల్నెంబర్పై అప్డేట్ల కోసం నెట్లో బ్రౌజ్ చేస్తుండగా ఒక లింక్ను అనుకోకుండా క్లిక్ చేశాడు. ‘‘విత్ డ్రా ఫ్రం సీట్ అలకేషన్ అండ్ ఫరదర్ రౌండ్స్’ అని ఉన్న లింక్ను తను క్లిక్ చేశాడు. ఇప్పటికే తనకు సీటు దొరికినందున ఇకపై ఎలాంటి అడ్మిషన్ రౌండ్లు ఉండవన్న నమ్మకంతో ఈ లింక్ను క్లిక్ చేసినట్లు బత్రా చెప్పారు. దీంతో ఆయనకు నవంబర్ 10న విడుదలైన అడ్మిటెడ్ స్టూడెంట్స్ లిస్టు చూశాక షాక్ తగిలింది. ఆయన పేరు 93మంది విద్యార్దుల తుది జాబితాలో లేదు. దీంతో ఆయన బాంబే హైకోర్టులో పిటీషన్ వేశారు. 19న పిటిషన్ విచారించిన కోర్టు రెండురోజుల్లో బత్రా పిటిషన్ను ఆయన విజ్ఞాపనగా పరిగణించమని ఐఐటీని ఆదేశించింది. అయితే విత్డ్రా లెటర్ను రద్దు చేసే అధికారం తమకు లేదంటూ ఐఐటీ ఈ నెల 23న బత్రా అప్పీలును తిరస్కరించింది. నిబంధనలు అతిక్రమించి ఏమీ చేయలేమని తెలిపింది. అడ్మిషన్లన్నీ జేఒఎస్ఎస్ఏ చూసుకుంటుందని ఐఐటీ రిజిస్ట్రార్ చెప్పారు. ప్రస్తుతం తమ వద్ద ఖాళీ సీటు లేదన్నారు. వచ్చేఏడాది జేఈఈకి బత్రా అప్లై చేసుకోవచ్చన్నారు. దీంతో ఈ విషయంపై బత్రా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనకు జరిగిన నష్టం పూడ్చేందుకు అదనపు సీటు కేటాయించాలని కోరుతున్నారు. తాను కేవలం సీటు దొరకడం వల్ల ఇకపై అడ్మిషన్ ప్రక్రియ ఉండదన్న అంచనాతో ఫ్రీజ్ లింక్ను క్లిక్ చేశానని కోర్టుకు చెప్పారు. అయితే విత్డ్రా చేసుకోవడం రెండంచెల్లో జరుగుతుందని, విద్యార్థి ఇష్టపూర్వకంగానే సీటు వదులుకున్నట్లు భావించాలని, ఆ మేరకు సదరు విద్యార్థ్ధికి రూ.2వేలు మినహాయించుకొని సీటు కోసం తీసుకున్న ఫీజు రిఫండ్ చేస్తామని ఐఐటీ పేర్కొంది. సీట్లు వృథా కాకుండా ఈ విధానం తెచ్చినట్లు తెలిపింది. తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. -
ఈ చెత్తనంతా భరించలేం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఐఐటీ బాంబే తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రాజధానిలో ‘స్మోగ్ టవర్’నిర్మిస్తామన్న ఒప్పందం నుంచి వైదొలగడాన్ని తప్పుబట్టింది. తమ ఆదేశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి కోర్టు ధిక్కారానికి పాల్పడిందని మండిపడింది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశం పట్ల బాధ్యతారాహిత్యంగా ఉన్నందుకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా న్యూఢిల్లీలో వాయు కాలుష్య స్థాయిని తగ్గించేందుకు స్మోగ్ టవర్(వాతావరణంలోని కాలుష్య కణాల్ని పీల్చుకుని స్వచ్ఛమైన గాలిని విడుదల చేసేవి) ఏర్పాటు చేయాల్సిందిగా గతేడాది డిసెంబరులో సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. బిజినెస్, ఫినాన్షియల్ హబ్గా పేరొందిన కనాట్ ప్లేస్లో మూడు నెలల్లోగా ఈ నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు స్పందించిన ప్రభుత్వాలు తమకు కనీసం ఆరు నెలల గడువు ఇవ్వాల్సిందిగా కోరాయి.(‘దిశ’ ఘటన ఎన్కౌంటర్ విచారణ గడువు పొడిగింపు ) ఈ క్రమంలో స్మోగ్ టవర్ నిర్మాణానికై కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ), ఐఐటీ బాంబే, టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అధికారుల మధ్య జనవరిలో ఒప్పందం కుదిరింది. అయితే ఇంతవరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు పూర్తికాలేదు సరికదా.. ఎంఓయూలో ఉన్న షరతులను తాము ఆమోదించలేమంటూ ఐఐటీ బాంబే జూలై 14న ఇ- మెయిల్ ద్వారా స్పష్టం చేసింది. సీపీసీబీ, టాటా ప్రతినిధులతో సమావేశం జరిగిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ విషయంపై స్పందించిన సుప్రీంకోర్టు ఉన్నత విద్యా సంస్థ తీరుపై మండిపడింది. ఈ చెత్తనంతా భరించడం తన వల్ల కాదంటూ జస్టిస్ అరుణ్ మిశ్రా అసహనం వ్యక్తం చేశారు.(ఆర్మీలో మహిళా అధికారుల శాశ్వత కమిషన్). 15 నిమిషాల్లో వాళ్లిక్కడ ఉండాలి ‘‘కోర్టు ఆదేశాల అమలులో జాప్యం చేస్తున్న ఐఐటీ బాంబేపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆరు నెలల తర్వాత ఇలా ఎలా వెనక్కి వెళ్తారు? ప్రభుత్వ ప్రాజెక్టు నుంచి ఎలా వైదొలగుతారు? కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాల్సిందే’ ’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక 30 నిమిషాల్లో ఐఐటీ బాంబే అధికారులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టాల్సిందిగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించారు. ఇందుకు స్పందించిన మెహతా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అక్కడ ఎవరైనా ఉన్నారో లేదో కూడా తనకు తెలియదని సమాధానమిచ్చారు. దీంతో మరోసారి అసహనానికి గురైన జస్టిస్ మిశ్రా.. ‘‘నాన్సెన్స్. మరో 15 నిమిషాల్లో వాళ్లిక్కడ ఉండాలి’’ అని స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. ‘‘15 నిమిషాల్లో ఏమీ చేయలేను. నాకు 24 గంటలు ఇవ్వండి. ఒక్కరోజులో ఏమీ మారిపోదు కదా. నా పరిస్థితిని అర్థం చేసుకోండి’’అని న్యాయమూర్తికి విన్నవించారు. అయితే జస్టిస్ మిశ్రా మాత్రం మరోసారి ఐఐటీ బాంబే తీరును తప్పుబట్టారు. ‘‘ఆ సంస్థను కాపాడేందుకు ఎందుకింత ప్రయత్నం చేస్తున్నారు, వాళ్లు ఇప్పటికే కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన అంశంలో ఇంత నిర్లక్ష్యమా? షాకింగ్గా ఉంది. ప్రభుత్వ తీరుతో మేమెంత మాత్రం సంతోషంగా లేము. ఇప్పటికైనా సమాధానం చెప్పకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం’’అని మండిపడ్డారు. కాగా ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 18.52 కోట్ల నిధులు విడుదల చేసినట్లు సమాచారం. -
ఆన్లైన్లోనే సెమిస్టర్లు
న్యూఢిల్లీ: కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు ఇకపై పూర్తిగా ఆన్లైన్ ద్వారానే సెమిస్టర్లను నిర్వహించాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)– బాంబే నిర్ణయించింది. విద్యాసంవత్సరం ఆలస్యం కాకుండా ఆన్లైన్ ద్వారానే తరగతులు ప్రారంభించేందుకు యత్నిస్తున్నట్లు వెల్లడించింది. దేశంలోని మిగతా ఐఐటీలు ఇదే విధానాన్ని అనుసరించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఐఐటీ–బాంబే డైరెక్టర్ సుభాశీశ్ ఛౌధురి గురువారం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ‘సంస్థ సెనేట్లో చర్చించాక.. వచ్చే సెమిస్టర్ను ఆన్లైన్లోనే చేపట్టాలని నిర్ణయించాం. విద్యార్థుల ఆరోగ్యం, రక్షణ విషయంలో రాజీ పడబోం’అని తెలిపారు. తమ విద్యాసంస్థలో ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నందున ఆన్లైన్లో చదువుకునేందుకు అవసరమైనవి సమకూర్చుకునేందుకు వారికి దాతలు ముందుకువచ్చి, సాయం చేయాలని ఛౌధురి కోరారు. విద్యాసంవత్సరం క్యాలెండర్ను సమీక్షిం చేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ సంప్రదింపులు జరుపుతున్న సమయంలో ఐఐటీ–బోంబే ఈ నిర్ణయం తీసుకుంది. జూలై నుంచి డిసెంబర్ వరకు సాగే సెమిస్టర్కు మిగతా ఐఐటీలు అనుసరించే చాన్సుంది. ఈ విషయమై ఐఐటీ–ఢిల్లీకి చెందిన ఒక అధికారి స్పందించారు. ‘విద్యాసంవత్సరాన్ని ఆలస్యం చేయడం తెలివైన పనికాదు. ఎంతకాలం క్యాంపస్లో విద్యార్థులు సురక్షితంగా ఉండగలరనేది మనకు తెలియదు. అందుకే, కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యం లేని విద్యార్థులు వాటిని సమకూర్చుకునేందుకు సాయపడుతూ విద్యా సంవత్సరాన్ని మొదలు పెట్టడమే మంచిది’ అని అభిప్రాయపడ్డారు. -
ఐఐటీ ముంబై కీలక నిర్ణయం
సాక్షి, ముంబై : రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఐఐటీ ముంబై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం మొత్తం ముఖాముఖి క్లాసులను రద్దు చేసింది. ఇకపై ఆన్లైన్ ద్వారానే క్లాసులు నిర్వహించాలని నిశ్చయించుకుంది. విద్యార్థుల ఆరోగ్యమే అత్యంత ముఖ్యమని భావించిన ఐఐటీ ముంబై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ ద్వారా క్లాసులు వినేందుకు పేద విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని దాతలను కోరింది. వారు ఆన్లైన్ చదువులు కొనసాగించటానికి అవసరమైన ల్యాప్టాప్స్, ఇంటర్నెట్ కనెక్షన్లు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి దాదాపు ఐదు కోట్ల రూపాయలు అవసరమవుతాయని దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని విన్నవించింది. చదవండి : 24గంటల్లో.. 16, 922 కరోనా కేసులు -
మే 15 నాటికి 38,220 మరణాలు?
దేశంలో కరోనా బాధితుల మరణాలు, కేసులు భారీగా పెరగనున్నాయా అనే ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతున్నాయి ప్రముఖ సంస్థలు. మే 15వ తేదీ నాటి కల్లా కరోనా వైరస్తో మరణించే వారి సంఖ్య 38,220కు చేరుకుంటుందని, మొత్తం కేసులు 30 లక్షలకు చేరుకోనుందని ఇవి అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు 76 వేల ఐసీయూ బెడ్లు అవసరం ఉంటాయని లెక్కలు తేల్చాయి. ఇప్పటి వరకు ఇటలీ, న్యూయార్క్ల్లో కరోనా మరణాలు, కేసులపై వేసిన అంచనాలు దాదాపు నిజమయ్యాయని తెలిపాయి. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(బెంగళూరు), ఐఐటీ బోంబే, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ(పుణె)ఈ మేరకు ‘కోవిడ్–19 మెడ్ ఇన్వెంటరీ’ పేరుతో ఈ అంచనాలు రూపొందించాయి. -
హై రిస్క్ మహా నగరాలకే..!
సాక్షి, సిటీబ్యూరో: మహానగరాలకే కోవిడ్–19 ముప్పు అత్యధికంగా ఉందని ఆయా నగరాల ప్రజలు భావిస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. మెట్రో నగరాల్లో నివసిస్తున్న వారికే కోవిడ్–19పై అవగాహన అత్యధికంగా ఉందని ఈ అధ్యయనం వెల్లడించింది. ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ బాంబేలు సంయుక్తంగా నిర్వహించిన ఆన్లైన్ సర్వే ఈ అంశాలను తెలిపింది. సుమారు 1900 మంది నెటిజన్ల అభిప్రాయాలను స్వీకరించారు. ఆన్లైన్లోనేప్రశ్నావళి రూపొందించి ..వారి ప్రయాణం, విజిట్ తదితర అంశాలపై వారి అభిప్రాయాలను సేకరించారు. లాక్డౌన్కు ముందు, లాక్డౌన్ విధించిన తర్వాత పరిస్థితిపై వారి అభిప్రాయాలను సేకరించారు. అయితే తాము రూపొందించిన ప్రశ్నావళికి టైర్–1 నగరాలైన ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పూణే మెట్రో సిటీల నుంచి సుమారు 63.6 శాతం మంది స్పందించినట్లు అధ్యయనం పేర్కొంది. ఇక టైర్–2 నగరాలు అంటే విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల నుంచి కేవలం 20.6 శాతం మంది స్పందించినట్లు తెలిపింది. ఇక టైర్–3 నగరాలు అంటే దేశంలోని పలు జిల్లాల హెడ్క్వార్టర్స్ నుంచి కేవలం 15.8 శాతం మంది ప్రతిస్పందించినట్లు పేర్కొంది. కోవిడ్–19 నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ పాటించడం, ప్రజారవాణాను వినియోగించకుండా వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించేందుకు మహానగరాల సిటీజన్లు ప్రాధాన్యతనిస్తున్నట్లు తమ అధ్యయనం ద్వారా తేటతెల్లమైందని తెలిపింది. ఇక కోవిడ్ కలకలం..లాక్డౌన్ ప్రకటించిన అనంతరం మెట్రో నగరాల(టైర్–1) సిటీజన్లలో 12 శాతం మంది బయటకు వెళ్లేందుకు తమ వ్యక్తిగత వాహనాలను ఆశ్రయించినట్లు తెలిసింది. ఇక టైర్–2 నగరాల్లో వ్యక్తిగత వాహనాలను ఆశ్రయించిన వారు 9 శాతం మంది ఉన్నట్లు వెల్లడించింది. ఇక టైర్–3 నగరాల్లో ఈ శాతం 7 శాతానికే పరిమితమైందని తెలిపింది. ఇక మొత్తంగా అన్ని నగరాల్లో కలిపి 48 శాతం మంది లాక్ డౌన్ ప్రకటించిన మార్చి 3వ వారంలో ఇళ్లకే పరిమితమయ్యామని..అత్యవసరమైతే మినహా బయటకు వెళ్లలేదని తెలిపారు. మరో 28 శాతం మంది తమ పనుల నిమిత్తం బయటకు వెళ్లినట్లు తెలిపారట. మరో 18 శాతం మంది తమ స్వదేశీ,విదేశీ విమాన ప్రయాణాలను రద్దు చేసుకున్నట్లు తెలిపారని ఈ అధ్యయనం వెల్లడించింది. కాగా ఈ అధ్యయనాన్ని ఐఐటీ హైదరాబాద్ సివిల్ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు దిగ్విజయ్ ఎస్.పవార్, ప్రతిమా ఛటర్జీ, ముంబయి ఐఐటీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం నుంచి ప్రొఫెసర్లు నాగేంద్ర వెలగ, అంకిత్ కుమార్ యాదవ్లు కలిసి నిర్వహించినట్లు తెలిపారు. -
భారత్ @ 158
న్యూఢిల్లీ/బెంగళూరు: భారత్లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య బుధవారానికి 158కి చేరింది. మంగళవారం నుంచి కొత్తగా 14 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. వారిలో ఒక సైనికుడు కూడా ఉన్నారు. లద్దాఖ్ స్కౌట్ రెజిమెంట్కు చెందిన 34 ఏళ్ల సైనికుడికి కోవిడ్–19 పాజిటివ్గా నిర్ధారణ అయిందని భారత సైన్యం ప్రకటించింది. ఇరాన్ నుంచి ఫిబ్రవరి 20న ఎయిర్ ఇండియా విమానంలో భారత్ తిరిగొచ్చిన తన తండ్రి నుంచి ఆ సైనికుడికి ఆ వైరస్ సోకిందని, అతడి తండ్రికి కూడా కోవిడ్ నిర్ధారణ అయిందని వెల్లడించింది. వారు లేహ్లోని చౌహత్ గ్రామానికి చెందినవారని తెలిపింది. ఆ సైనికుడి సోదరుడికి కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా ఆర్మీ చర్యలు ప్రారంభించింది. సెలవుపై వెళ్లి వచ్చిన సైనికులకు వైరస్ నిర్ధారణ పరీక్షలు జరపడం, ఫ్లూ లక్షణాలు ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టడం, అనవసర ప్రయాణాలను, అన్ని శిక్షణ కార్యక్రమాలను, సదస్సులను రద్దు చేయడం.. తదితర చర్యలు చేపట్టింది. ఈ వైరస్ సోకిన 158 మందిలో ముగ్గురు మృతులు, 25 మంది విదేశీయులు ఉన్నారు. ఏకాంతవాస కేంద్రాల(క్వారంటైన్ సెంటర్స్)ను సందర్శించి, అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ బాధితులతో సన్నిహితంగా ఉన్న దాదాపు 5700 మందిని వివిధ క్వారంటైన్ సెంటర్లలో ఉంచి, వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బుధవారం వరకు మహారాష్ట్రలో అత్యధికంగా 42, కేరళలో 27, ఉత్తరప్రదేశ్లో 16, కర్ణాటకలో 11, ఢిల్లీలో 10, లద్దాఖ్లో 8, తెలంగాణలో 13 కేసులు నమోదయ్యాయి. హరియాణాలో కోవిడ్ బారిన పడిన 17 మందిలో 14 మంది విదేశీయులే కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా చికిత్స అనంతరం కోలుకుని 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల సౌదీ అరేబియా వెళ్లి వచ్చిన బీజేపీ ఎంపీ సురేశ్ ప్రభు స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. విదేశాల్లోని భారతీయులకు.. విదేశాల్లోని భారతీయుల్లో 276 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని విదేశాంగ శాఖ సహాయమంత్రి వీ మురళీధరన్ బుధవారం లోక్సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. వారిలో ఇరాన్లోని 255 మంది, యూఏఈలోని 12 మంది, ఇటలీలోని ఐదుగురు, శ్రీలంక, కువైట్, రువాండా, హాంకాంగ్ల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారన్నారు. యూఏఈలో 8 మంది భారతీయులను క్వారంటైన్ చేసినట్లు వెల్లడించారు. ఇరాన్లో సుమారు 6 వేల మంది భారతీయులున్నారన్నారు. వారిలో జమ్మూకశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట్రల నుంచి పుణ్యక్షేత్ర సందర్శనకు వెళ్లిన 1100 మంది, కేరళ, ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లిన 1000 మంది మత్స్యకారులు, జమ్మూకశ్మీర్ సహా పలు రాష్ట్రాల నుంచి వెళ్లిన 300 మంది విద్యార్థులు ఉన్నారని వెల్లడించారు. ఇప్పటివరకు ఇరాన్ నుంచి 389 మందిని వెనక్కు తీసుకువచ్చామన్నారు. రాజ్యసభలో మాస్కుల కలకలం రాజ్యసభకు తొలిసారి ఎంపీ డెరెక్ ఓ బ్రేన్ సహా నలుగురు టీఎంసీ సభ్యులు మాస్క్లతో వచ్చారు. సభా నిబంధనల ప్రకారం సభ్యులు మాస్క్లు ఉపయోగించరాదని సభ చైర్మన్ వెంకయ్యనాయుడు తొలుత అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, కరోనా ముప్పు నేపథ్యంలో మాస్క్ల వినియోగం తప్పనిసరి అని, దీనిపై ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా జారీ చేసిందని, అందువల్ల మాస్క్లను అనుమతించాలని కాంగ్రెస్ సభ్యుడు చిదంబరం కోరడంతో, వెంకయ్యనాయుడు అంగీకరించారు. కరోనా ముప్పు పొంచి ఉందని, అందువల్ల బడ్జెట్ సమావేశాలను కుదించాలని కాంగ్రెస్ సహా పలు పార్టీల సభ్యులు అభ్యర్థించారు. వివిధ వర్గాల ప్రజలను కలుసుకుంటూ ఉంటామని, అందువల్ల ఎంపీలకు వైరస్ ముప్పు అధికంగా ఉంటుందని, ఎంపీలమైనందువల్ల ఆ వైరస్ మన జోలికి రాదని అనుకోకూడదని కాంగ్రెస్ సభ్యుడు రాజీవ్ గౌడ వ్యాఖ్యానించారు. అయితే, ఈ అభ్యర్థనను ప్రభుత్వం తోసిపుచ్చింది. సబ్బుల ధరలపై కేంద్రం దృష్టి న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్న నిత్యావసరాలైన సబ్బులు, నేలలు తుడిచే క్లీనర్లు, థర్మల్ స్కానర్ల ధరలను కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. సాధారణంగా ఈ శాఖ దేశవ్యాప్తంగా 22 నిత్యావసరాల ధరలను పర్యవేక్షిస్తుంటుంది. తాజాగా ఫేస్ మాస్క్లు, చేతి శానిటైజర్లను ఆ జాబితాలో చేర్చింది. ‘కోవిడ్ కారణంగా డిమాండ్ పెరిగిన సబ్బులు, లైజాల్, డెటాల్ వంటి చేతులు, నేలలు శుభ్రపరిచే క్లీనర్ల ధరలను మేం పర్యవేక్షిస్తున్నాం’అని కేంద్ర మంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న 114 కేంద్రాల ద్వారా ఈ ఉత్పత్తుల ధరలను కేంద్రం పర్యవేక్షిస్తోంది. 22 నిత్యావసర వస్తువుల్లో బియ్యం, గోధుమలు, గోధుమ పిండి, పప్పు ధాన్యాలు, నూనెలు, కూరగాయలు, చక్కెర, పాలు, టీ, ఉప్పు తదితరాలు ఉన్నాయి. కోవిడ్పై ప్రజల్లో అవగాహన పెరగడంతో వేరే దేశాలతో పోలిస్తే భారత్లో తక్కువగా వ్యాపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఐఐటీ బాంబే బంద్ ► కరోనా ముప్పు నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు ఎలాంటి సామూహిక కార్యక్రమాలు నిర్వహించకూడదని బీజేపీ నిర్ణయించింది. ► మా పరుపులు వాడితే కరోనా వైరస్ రాదని ప్రచారం చేస్తున్న ఒక వ్యాపారిపై మహారాష్ట్రలోని థానేలో కేసు నమోదైంది. ► కోవిడ్–19 లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయొద్దని, బాధ్యతాయుతంగా ప్రవర్తించి, వెంటనే వైద్యుల పర్యవేక్షణలోకి వెళ్లాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనాపై నకిలీ వార్తలు ప్రచారం చేసేవారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ► కరోనా వైరస్ నుంచి రక్షిస్తుందని పేర్కొంటూ గో మూత్రాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని నారాయణ చటర్జీ అనే బీజేపీ కార్యకర్త కోల్కతాలో మంగళవారం నిర్వహించారు. ఆ గోమూత్రం సేవించి, అనారోగ్యం పాలయిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చటర్జీని అరెస్ట్ చేశారు. ► ఐఐటీ బాంబే క్యాంపస్ను మార్చి 31 వరకు మూసేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ► లండన్లో వేలాదిగా ఉన్న భారతీయులు ఇండియాకు తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై అక్కడి హైకమిషన్ను అభ్యర్థిస్తున్నారు. అయితే, బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులపై మార్చి 31 వరకు భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. బ్రిటన్లో కోవిడ్ కారణంగా 104 మంది చనిపోగా, దాదాపు 2 వేల మందికి ఈ వైరస్ సోకింది. ► పారా మిలటరీ సిబ్బందికి సంబంధించిన అన్ని అత్యవసరం కాని సెలవులను రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పార్లమెంట్ వద్ద ఉపరాష్ట్రపతి వెంకయ్యకు థర్మల్ స్క్రీనింగ్ దృశ్యం -
ఐఐటీ బాంబే విద్యార్ధులకు గైడ్లైన్స్..
ముంబై : దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్న క్రమంలో ఎలాంటి దేశ వ్యతిరేక నిరసనల్లో పాలుపంచుకోరాదని ఐఐటీ-బాంబే హాస్టల్ విద్యార్దులకు ఇనిస్టిట్యూట్ విద్యార్థి వ్యవహారాల డీన్ సూచించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాల్లోనూ పాల్గొనరాదని విద్యార్ధులకు పంపిన ఈమెయిల్లో కోరిన అధికారులు జాతి వ్యతిరేక కార్యకలాపాలపై పూర్తి వివరణను ఇవ్వలేదు. పౌర చట్టాన్ని వ్యతిరేకిస్తున్న విమర్శకులను కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు జాతి విద్రోహులుగా అభివర్ణిస్తున్న నేపథ్యంలో ఐఐటీ బాంబే డీన్ విద్యార్ధులకు పంపిన ఈమెయిల్ కలకలం రేపింది. క్యాంపస్లో ఎలాంటి ప్రసంగాలు ఇవ్వరాదని, నాటకాలు ప్రదర్శించడం, మ్యూజిక్ను ప్లేచేయడం, కరపత్రాలు పంపిణీచేయడం నిషేధించామని లేఖలో పేర్కొన్నారు. ఈమెయిల్లో పొందుపరిచిన 15 అంశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. కాగా ఢిల్లీలోని జేఎన్యూలో ముసుగు దుండగుల దాడిని నిరసిస్తూ ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా వద్ద జరిగిన నిరసనల్లో ఐఐటీ-బాంబే విద్యార్ధులు పాల్గొనడం గమనార్హం. చదవండి : సీఏఏ కష్టాలకు రాఖీ సొల్యూషన్ ఇదే.. -
అమితాబ్కి బిగ్ ఫ్యాన్ని
ముంబై: ముంబైలోని ఐఐటీ బాంబే కాన్వకేషన్ హాలు. అక్కడ వార్షిక శాస్త్ర, సాంకేతిక ఫెస్టివల్ జరుగుతోంది. అందులో ఒక రోబో అందరి దృష్టినీ ఆకర్షించింది. 5వేలకు పైగా టెక్నాలజీ ప్రేమికులు మానవ లక్షణాలున్న ఆ రోబోను చూసి ఫిదా అయ్యారు. అదేమీ అల్లాటప్పా రోబో కాదు. ఆ రోబో ఒక మహా నటుడు. 5 అడుగుల 9 అంగుళాలున్న ఆ రోబో బరువు 33 కేజీలు. బోంబే ఐఐటీ సైన్స్ ఫెస్టివల్లో ఆ రోబో అచ్చంగా మనిషి మాదిరిగా అన్నీ చేస్తూ ఉండడం చేసి ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యారు. ఈ రోబో ప్రేక్షకులతో మాట్లాడడమే కాదు, వారు అడిగిన ప్రశ్నలకూ సమాధానం ఇచ్చాడు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తనకెంతో ఇష్టమని చెబుతూనే రోబో పాత్రల్ని వేసిన రజనీకాంత్, అక్షయ్కుమార్లను గుర్తు చేసుకున్నాడు. ఎప్పటికైనా ఆస్కార్ అవార్డు సాధిస్తానని ధీమాగా చెప్పాడు. హుందాగా నడవడం, స్టెప్పులేసినప్పుడు మనిషిలా శరీరాన్ని వంపులు తిప్పడం, ఎస్సీడీ కళ్లతో హావభావాల్ని పలికిస్తూ ప్రేక్షకుల్ని ఈ రోబో కట్టి పడేసింది. తన టెక్నికల్ స్పెసిఫికేషన్లను చెప్పేయడంతో హాలంతా చప్పట్లతో మారుమోగింది. -
అటెండెన్స్ ప్లీజ్! అంటున్న ఆవు
ముంబై: అటెండెన్స్ ఇవ్వడానికి ఆలస్యమైపోతున్న విద్యార్థిలా ఓ ఆవు నేరుగా తరగతి గదిలోకే వెళ్లింది. ఈ హఠాత్పరిణామానికి అక్కడి విద్యార్థులు షాక్ అవగా.. ఆవు మాత్రం ఉపాధ్యాయిలా దర్జాగా క్లాస్ రూమ్ అంతా తిరిగి ఇన్విజిలేటర్లా బయటకు వెళ్లిపోయింది. విద్యార్థులు దాన్ని తరిమే ప్రయత్నం చేసినప్పటికీ అది ఆ గది చుట్టూనే తిరుగుతూ ప్రదక్షిణలు చేయసాగింది. ఈ అరుదైన ఘటన ఐఐటీ బాంబే క్యాంపస్లో జరిగింది. బయట తీవ్ర వర్షం కురుస్తుండటంతో దానికి ఎటు వెళ్లాలో తెలీక సరాసరి క్యాంపస్ గదిలోకే వచ్చిందని అక్కడి విద్యార్థులు చెప్తున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారిన ఈ వీడియోకి సరదా కామెంట్లు వెల్లువెత్తాయి. ‘జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఇదెలా పాసయిపోంది’ అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘పరీక్ష రాయకుండా దీన్ని ఎలా రానిచ్చారు’ అంటూ నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. ఐఐటీలో ఇలాంటి ఘటనలు జరగడం వింతేమీ కాదు! గతంలో పశువుల మంద ఐఐటీ క్యాంపస్లో సంచరించగా, ఓ చిరుతపులి సైతం వర్షానికి జడిసి ఐఐటీలో ఆశ్రయం పొందిన సంగతి విదితమే..! Cow entering IIT BOMBAY without clearing JEE Advanced?? 🐄🐄🐄. A cow entering an IIT Bombay classroom 😂 pic.twitter.com/i7taJ2TPOd — Mayur Borkar (@imayurborkar) July 29, 2019 -
క్యూఎస్ ర్యాంకింగ్స్లో ఐఐటీ బాంబే, ఢిల్లీ
న్యూఢిల్లీ: క్వాక్వరెల్లి సైమండ్స్ (క్యూఎస్) వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్స్ బుధవారం విడుదలవ్వగా ఐఐటీ–బాంబే(152), ఐఐటీ–ఢిల్లీ(182), ఐఐఎస్సీ–బెంగళూరు(184)లకు టాప్– 200లో స్థానం లభించింది. ఐఐటీ–మద్రాస్, ఐఐటీ–ఖరగ్పూర్, ఐఐటీ–కాన్పూర్, ఐఐటీ–రూర్కీలకు టాప్–400లో చోటు దక్కింది. క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్స్ 2020ని లండన్లో విడుదల చేశారు. భారత్ నుంచి ఓపీ జిందాల్ టాప్–1,000లో చోటు సంపాదించిన అత్యంత కొత్త యూనివర్సిటీగా నిలిచింది. జామియా మిలియా ఇస్లామియా, జాదవ్పూర్ యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీ తదితరాలకు కూడా ర్యాంకులు దక్కాయి. -
సివిల్స్ టాపర్ కటారియా
న్యూఢిల్లీ: ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి, జైపూర్కు చెందిన కనిషక్ కటారియా సివిల్స్–2018 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో టాపర్గా నిలిచారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం ఈ ఫలితాలను విడుదల చేసింది. జైపూర్కే చెందిన అక్షత్ జైన్ రెండో ర్యాంకు సాధించారు. భోపాల్కు చెందిన సృష్టి జయంత్ దేశ్ముఖ్ మహిళల్లో తొలి స్థానం, మొత్తంమీద ఐదో ర్యాంకు దక్కించుకున్నారు. తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన కర్నాటి వరుణ్రెడ్డికి 7వ ర్యాంకు దక్కింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ప్రతిష్టాత్మక సర్వీసులకు మొత్తం 759 మంది అర్హత సాధించారని, అందులో 182 మంది మహిళలు, 36 మంది దివ్యాంగులు ఉన్నారు. టాప్–25 ర్యాంకర్లలో 15 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. జనరల్ కేటగిరీలో 361 మందికి, ఓబీసీ వర్గంలో 209 మందికి, ఎస్సీల్లో 128 మందికి, ఎస్టీల్లో 61 మందికి ర్యాంకులు వచ్చాయి. గత జూన్లో ప్రాథమిక పరీక్షకు 5 లక్షల మంది హాజరవగా, 10,468 మంది మెయిన్స్కు అర్హత పొందారు. 1994 మంది మెయిన్స్లో ఉత్తీర్ణులు కాగా, వారికి ఫిబ్రవరి, మార్చి నెలల్లో ముఖాముఖి నిర్వహించి తుది ఫలితాలు ప్రకటించారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లదే హవా.. ఎస్సీ వర్గానికి చెందిన టాపర్ కటారియా తన ఆప్షనల్గా మేథమేటిక్స్ ఎంచుకున్నారు. ఆయన ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చదివారు. ఐదో ర్యాంకర్ దేశ్ముఖ్ భోపాల్లోని రాజీవ్ గాంధీ ప్రౌద్యోగికి విశ్వవిద్యాలయలో కెమికల్ ఇంజనీరింగ్లో బీఈ చేశారు. తనపై ఉన్న నమ్మకంతోనే తొలి ప్రయత్నంలోనే సివిల్స్ పరీక్షలో విజయం సాధించానని దేశ్ముఖ్ చెప్పారు. ఆమె తండ్రి ఇంజనీర్ కాగా, తల్లి ప్రిస్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు. రెండో ర్యాంకు సాధించిన అక్షత్ జైన్ ఐఐటీ గువాహటిలో ఇంజనీరింగ్ చదివారు. అక్షత్ తండ్రి ఐపీఎస్ అధికారి కాగా, తల్లి ఐఆర్ఎస్ అధికారిగా సేవలందిస్తున్నారు. సొంత రాష్ట్రం రాజస్తాన్లోనే ఐఏఎస్గా సేవలందించాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. టాప్–25లో నిలిచిన అభ్యర్థులంతా ఐఐటీలు, ఎన్ఐటీలు, బిట్స్ పిలానీ, ఎన్ఎల్యూ, డీయూ, ముంబై యూనివర్సిటీ, అన్నా వర్సిటీ లాంటి విద్యా సంస్థల్లో అభ్యసించారు. -
ఐఐటీ విద్యార్థి నిర్వాకం.. స్నానాలు చేస్తుండగా ఫోటోలు
ముంబై : ఓ మహిళ స్నానం చేస్తుండగా ఫోటోలు తీయడానికి ప్రయత్నించిన ఓ ఐఐటీ స్టూడెంట్ని థానే పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. బాంబే ఐఐటీలో చదువుతున్న అవినాష్ కుమార్ యాదవ్ థానేలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే అతని బుర్రలో ఏ పురుగు దూరిందో తెలీదు కానీ.. పక్క ప్లాట్ బాత్రూమ్లో మొబైల్ ఫోన్ను అమర్చాడు. ఈ క్రమంలో సదరు ప్లాట్లో నివాసం ఉంటున్న మహిళ స్నానం చేయడానికి వెళ్లినప్పుడు బాత్రూమ్ కిటికిలో సెల్ఫోన్ ఉండటాన్ని గమనించింది. వెంటనే ఆమె ఈ విషయాన్ని భర్తకు తెలిపింది. ఆ సమయంలో అవినాష్ అక్కడే తచ్చాడుతుండటంతో అనుమానం వచ్చి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా పరారయ్యాడు. మొబైల్ను స్వాధీనం చేసుకుని చూడగా ... అపార్ట్మెంట్కు చెందిన మహిళలతో పాటు స్నానం చేస్తున్న పురుషుల ఫోటోలు కూడా ఉన్నాయి. దాంతో వారు పోలీస్ స్టేషన్కు వెళ్లి అవినాష్ మీద ఫిర్యాదు చేయగా, సెక్షన్ 354 కింద పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. -
టాప్ 200లో 49 భారతీయ వర్సిటీలు
లండన్: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) 2019 సంవత్సరానికి విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్లు ప్రకటించింది. 43 దేశాలకు చెందిన 450 విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్లు ప్రకటించగా భారత్కు చెందిన 49 వర్సిటీలు టాప్ 200లో స్థానం సంపాదించాయి. ర్యాంకింగ్స్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగుళూరు) 14వ స్థానం, ఐఐటీ (బొంబాయి) 27వ స్థానం, ఐఐటీ (రూర్కీ) 35వ స్థానం, ఐఐటీ (ఇండోర్) 61వ స్థానం, జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 64వ స్థానంలో నిలిచాయి. సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్సిటీ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, అమృతా యూనివర్సిటీ ఈసారి టాప్ 150లో స్థానం సంపాదించాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పూణే, ఐఐటీ(హైదరాబాద్) తొలిసారిగా ర్యాంకింగ్లో చోటు సంపాదించాయి. 2018లో భారత్ నుంచి 42 వర్సిటీలు స్థానం సంపాదించగా ఈసారి అది 49కి పెరిగింది. టాప్లో చైనా వర్సిటీలు చైనాకు చెందిన నాలుగు వర్సిటీలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. జాబితాలో మొత్తం 72 వర్సిటీలతో చైనా అగ్రస్థానంలో ఉంది. భారత వర్సిటీల్లో విద్యాబోధన మెరుగుపడినా ప్రమాణాలతో పోలిస్తే వెనకబడే ఉన్నాయని టీహెచ్ఈ ఎడిటర్ ఎల్లీ బోత్వెల్ తెలిపారు. -
ఆ ఐఐటీ దేశంలోనే టాప్
సాక్షి, న్యూఢిల్లీ : విద్యా, ఉద్యోగ కల్పనల్లో ఐఐటీ-బాంబే యూనివర్సిటీ మెరుగ్గా ఉందని క్వాక్వారెల్లి సిమండ్స్ (క్యూఎస్) ర్యాకింగ్స్ సంస్థ వెల్లడించింది. 2019 సంవత్సరానికి గాను దేశంలోని ఉన్నత విద్యా సంస్థలపై నిర్వహించిన సర్వేలో ఐఐటీ బాంబే అధిక పాయింట్లు సాధించి టాప్లో నిలిచిందని తెలిపింది. ఇక ఐఐఎస్సీ బెంగుళూరు సైన్స్ విభాగంలో టాప్లో నిలవగా... ఓవరాల్గా రెండో స్థానంలో ఉంది. విద్యా ప్రమాణాలు, ఉద్యోగ అవకాశమిచ్చే సంస్థల ప్రతిష్ట ఆధారంగా సర్వే నిర్వహించినట్టు క్యూఎస్ ర్యాకింగ్స్ తెలిపింది. టాప్టెన్ యూనివర్సిటీలకు క్యూఎస్ సర్వే ర్యాంకులు ప్రకటించింది. మూడు, నాలుగు స్థానాల్లో ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ ఉండగా.. ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ కాన్పూర్ 5, 6 స్థానాల్లో ఉన్నాయి. ఇక, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏడో స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఎనిమిదో స్థానాల్లో నిలిచాయి. ఐఐటీ రూర్కే తొమ్మిదో స్థానంలో, ఐఐటీ గువాహటి పదో స్థానాల్లో ఉన్నాయి. -
తినే ఉప్పులోనూ ప్లాస్టిక్ భూతం
ముంబై: మనం ఆహారంలో భాగంగా తీసుకుంటున్న ఉప్పు స్వచ్ఛమైనది కాదా? ప్రముఖ కంపెనీలకు చెందిన ఉప్పు ప్యాకెట్లలో సైతం ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయా? అంటే నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. ఐఐటీ బాంబేలోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ విభాగం(సీఈఎస్ఈ) చేపట్టిన ఈ పరిశోధనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. సీఈఎస్ఈ చేపట్టిన పరిశోధనలో 8 కంపెనీలకు సంబంధించిన ఉప్పు ప్యాకెట్లను పరిశీలించగా వాటిలో 626 ప్లాస్టిక్ రేణువులు లభ్యమయ్యాయి. ఈ ప్లాస్టిక్ రేణువుల సగటు పరిమాణం 5 మిల్లీమీటర్లుగా ఉంది. నదులు, కాలువల ద్వారా సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్ కాలక్రమేణా విచ్ఛిన్నం కావడంతో ఈ సూక్ష్మ రేణువులు ఏర్పడ్డాయని ఈ పరిశోధనలో పాల్గొన్న ప్రొ. అమ్రితాన్షు శ్రీవాత్సవ్, చందన్కృష్ణ సేత్ తెలిపారు. ఈ కలుషిత నీటితో ఉప్పును తయారుచేయడంతో ప్లాస్టిక్ రేణువులు ఇంటింటికి చేరాయని వెల్లడించారు. పరిశోధన సాగిందిలా.. ఇందులో భాగంగా పరిశోధకులు తొలుత ముంబైలోని సూపర్మార్కెట్లు, దుకాణాల్లో 8 కంపెనీలకు చెందిన 24 ఉప్పు ప్యాకెట్లను(ఒక్కో బ్రాండ్కు మూడు చొప్పున) కొనుగోలు చేశారు. ఇవన్నీ ఒకే నెలలో తయారైనవి కాకుండా జాగ్రత్త తీసుకున్నారు. అలాగే ఈ 8 సంస్థల్లో ఆరు గుజరాత్కు చెందినవి కాగా, కేరళకు చెందిన రెండు కంపెనీలు, మహారాష్ట్రకు సంబంధించి ఓ కంపెనీ ఉంది. వీటిని ప్రయోగశాలలో పరీక్షించగా.. మొత్తం 626 సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు బయటపడ్డాయి. ఈ ప్లాస్టిక్లో 63 శాతం చిన్నచిన్న రేణువుల రూపంలో, మిగిలింది ప్లాస్టిక్ ఫైబర్ రూపంలో ఉన్నాయి. ఈ ఉప్పు ప్యాకెట్లలో లభ్యమైన ప్లాస్టిక్లో 80 శాతం రేణువులు 2 మి.మీ కంటే తక్కువ పరిమాణంలో ఉండటాన్ని పరిశోధకులు గుర్తించారు. ఈ లెక్కన ప్రతిఏటా 0.117 మిల్లీగ్రాముల ప్లాస్టిక్ను భారతీయులు తమకు తెలియకుండా ఆహారంలో తీసుకుంటున్నట్లు నిర్ధారించారు. ఈ ఫలితాలు హెచ్చరికే.. ఉప్పులో సూక్ష్మ ప్లాస్టిక్ రేణువుల జాడ కన్పించడం అన్నది అన్నిదేశాలకు హెచ్చరికేనని ప్రొ.శ్రీవాస్తవ తెలిపారు. సముద్రపు నీటిలో కాలక్రమేణా విచ్ఛిన్నమవుతున్న ప్లాస్టిక్ రేణువులు.. ఉప్పు, ఇతర సముద్ర ఉత్పత్తుల రూపంలో మనుషుల ఆహారపు గొలుసులోకి చేరుతున్నాయని వెల్లడించారు. గృహ, పారిశ్రామిక అవసరాల కోసం ఉప్పును తయారుచేస్తున్న దేశాల్లో చైనా, అమెరికాల తర్వాత భారత్ మూడోస్థానంలో ఉన్న నేపథ్యంలో ఈ పరిశోధన చేపట్టినట్లు శ్రీవాత్సవ పేర్కొన్నారు. సముద్రాల్లోకి దేన్ని, ఎంత మొత్తంలో పారేస్తున్నామన్న విషయమై ఎలాంటి తనిఖీలు లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమయిందని అభిప్రాయపడ్డారు. సాధారణ వడపోత పద్ధతుల ద్వారా ఈ నీటిలోని 85 శాతం ప్లాస్టిక్ రేణువులను తొలగించవచ్చని వెల్లడించారు. భారత్కే పరిమితం కాదు.. ప్లాస్టిక్ భూతం అన్నది కేవలం భారత్కే పరిమితం కాలేదనీ, చైనా, స్పెయిన్, టర్కీ, యూకే, ఫ్రాన్స్, యూఎస్ సహా పలుదేశాల సముద్ర జలాలు దీనితో కలుషితమయ్యాయని ప్రొ.శ్రీవాస్తవ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఐదు ట్రిలియన్ల కంటే ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో చేరినట్లు 2014లో ఓ సైన్స్ జర్నల్ కథనాన్ని ప్రచురించిందన్నారు. ‘సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులతో కలుషితమవుతున్న భారత సముద్రజలాలు– అరికట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహం’ పేరుతో తాము చేపట్టిన అధ్యయనంలో భారతీయులు ప్లాస్టిక్ ఉన్న ఉప్పును ఆహారంగా తీసుకుంటున్నట్లు తేలిందన్నారు. ఈ పరిశోధన ‘ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ పొల్యూషన్ రీసెర్చ్’ అనే ప్రఖ్యాత జర్నల్లో ప్రచురితమైందని శ్రీవాస్తవ వెల్లడించారు. -
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన ప్రధాని మోదీ!
న్యూఢిల్లీ: రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని.. అంబేడ్కర్ కలలుగన్న సమాజాన్ని నిర్మించేంతవరకు రిజర్వేషన్లు తొలగించబోమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దీనిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొదన్నారు. జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) విషయంలో విపక్షాలు ఆత్మరక్షణలో పడే ఆరోపణలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శనివారం ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాధి కల్పన, జీఎస్టీ, ఎన్నార్సీ, మహిళా సాధికారత, భారత్–పాక్ సంబంధాలు తదితర అంశాలపై మోదీ మాట్లాడారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► దేశంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. రోడ్లు, రైల్వే లైన్లు, సోలార్ పార్కులు తదతర మౌలికవసతుల ప్రాజెక్టులు వేగగతిన రూపుదిద్దుకుంటున్నాయి. వీటి ద్వారా భారీగా ఉపాధి కల్పన జరుగుతోంది. పెరుగుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సానుకూల ప్రభావం ఉద్యోగ కల్పన రూపంలో కనబడుతుంది. ► గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు యూపీఏ రూపొందించిన జీఎస్టీని వ్యతిరేకించాననడం అర్థరహితం. అప్పుటి ఆర్థిక మంత్రి (పి.చిదంబరం) రాష్ట్రాల సమస్యలను వినేందుకు విముఖత చూపారు. మేం రాష్ట్రాల అభిప్రాయాలను, ఆందోళనలను పరిగణనలోకి తీసుకునే జీఎస్టీ చట్టాన్ని అమల్లోకి తెచ్చాం. తమ చుట్టూ దోపిడీ ముఠాను పెట్టుకున్న వారే జీఎస్టీని గబ్బర్ టాక్స్ అంటున్నారు. ► సుప్రీంతీర్పు ఆదేశాలతో రూపొందిన ఎన్నార్సీని వ్యతిరేకించడంలో అర్థం లేదు. తమపై తమకు, ఉన్నత రాజ్యాంగ సంస్థలపై నమ్మకం లేనివారంతా ఆత్మరక్షణలో పడి ఈ ఆరోపణలు చేస్తున్నారు. 2005లో పార్లమెంటులో తనేం చెప్పారో మమత గుర్తుతెచ్చుకోవాలి. ఎన్నార్సీపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోంది. ► దేశవ్యాప్తంగా జరుగుతున్న మూకోన్మాద ఘటనలు, మహిళలపై నేరాలు బాధాకరం. కానీ ఈ ఘటనలపై కొందరు రాజకీయాలు చేయడం దురదృష్టకరం. మహిళలపై నేరాలు, మూకోన్మాద చర్యల విషయంలో కఠినమైన చట్టాలు తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ► మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశ ప్రగతినీ ఊహించలేం. అందుకే మహిళల నేతృత్వంలో అభివృద్ధి జరిగేలా మేం చర్యలు తీసుకుంటున్నాం. చాలా పథకాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం. ► అంబేడ్కర్ కలలుగన్న రాజ్యాంగ లక్ష్యాలను ఇంకా చేరుకోలేదు. రిజర్వేషన్లు లేకుండా ఈ లక్ష్యాలను చేరుకోలేం. రిజర్వేషన్లపై ఎవరికీ అనుమానాలొద్దు. అంబేడ్కర్ ఆశయాల సాధనలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. సబ్కాసాథ్, సబ్కా వికాస్ మా నినాదం. బీజేపీ రిజర్వేషన్లు రద్దుచేస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారు. అవన్నీ అసత్య ప్రచారాలే. వీటిని నమ్మొద్దు. ► జమ్మూకశ్మీర్లో సుస్థిర ప్రభుత్వం మా అభిమతం. ముఫ్తీ మహ్మద్ సయీద్ ఉన్నంతవరకు పరిస్థితులు బాగానే ఉన్నాయి. తర్వాతే ఇబ్బందులు మొదలయ్యాయి. ► మా ప్రభుత్వానికి ప్రజాదరణ పెరుగుతోందనే విషషయం విపక్ష పార్టీలకు బాగా అర్థమైంది. అందుకే వారిపై వారికి నమ్మకం లేక అంతా కలిసి మాపై పోరాటానికి సిద్ధమయ్యారు. వీరు కుటుంబ పాలన, అవినీతిలో ఒకరిని మరొకరు మించిపోయారు. ఇప్పుడు ప్రజలు ఓటేయరని తెలిసి.. అనవసర అంశాలను వివాదం చేస్తూ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారు. ► పొరుగుదేశాలతో సాన్నిహిత్యాన్ని కోరుకుంటానని చాలాసార్లు చెప్పాను. ఈ దిశగా మేం చాలా చర్యలు తీసుకున్నాం. పాక్ కాబోయే ప్రధాని ఇమ్రాన్ఖాన్ను నేను అభినందించాను. సుస్థిర, ఉగ్రవాద రహిత పాకిస్తాన్ ఏర్పాటుకు మా సహకారం ఉంటుంది. యువ మస్తిష్కాలే సృజన కేంద్రాలు న్యూఢిల్లీ: గొప్ప ఆలోచనలు ప్రభుత్వ కార్యాలయాల్లోనో, విలాసవంతమైన భవంతుల్లోనో పుట్టవని, యువ మస్తిష్కాల్లోనే చిగురిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేసిన ఐఐటీలు మార్పునకు చోదకశక్తులుగా వెలుగొందుతున్నాయని కొనియాడారు. సృజన, అంకుర పరిశ్రమలే దేశాభివృద్ధికి మూల స్తంభాలని పేర్కొన్నారు. వినూత్నత, సృజనశీల దృక్పథాన్ని అలవరచుకోని సమాజాలు పురోగమించవని హెచ్చరించారు. శనివారం ఐఐటీ బాంబే క్యాంపస్లో జరిగిన 56వ స్నాతకోత్సవంలో మోదీ ప్రసంగించారు. ఐఐటీల వంటి విశిష్ట విద్యా సంస్థల్లో నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని మేధావులు, విద్యావేత్తలను కోరారు. ఈ సందర్భంగా ఐఐటీ బాంబేకు మోదీ రూ.వేయి కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ఐఐటీలు సాధించిన ఘనతలను ప్రశంసించిన మోదీ..దేశవ్యాప్తంగా ఎక్కువగా ఇంజినీరింగ్ కళాశాలలు స్థాపించడానికి ఐఐటీల విజయాలే స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. ‘నేడు ఐఐటీలంటే కేవలం సాంకేతిక విద్యను నేర్పించే విద్యాలయాలే కాదు. దేశంలో మార్పును తీసుకొచ్చే సాధనాలుగా కూడా ఎదిగాయి. ప్రపంచవ్యాప్తంగా దేశానికి బ్రాండ్ ఇమేజ్ కల్పించాయి. ఐఐటీ గ్రాడ్యుయేట్లు నడిపిస్తున్న స్టార్టప్లే దేశం ఎదుర్కొంటున్న చాలా సమస్యలను పరిష్కరించడంలో ముందున్నాయి. గొప్ప ఆలోచనలు ప్రభుత్వ కార్యాలయాల నుంచో, విలాసవంతమైన భవనాల నుంచో రావు. మీలాంటి యువ మెదళ్లలోనే అవి పుడతాయి’ అని మోదీ అన్నారు. -
6 విద్యా సంస్థలకు కిరీటం
న్యూఢిల్లీ: ఆరు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ‘ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ (ఐవోఈ)’ హోదా కల్పించింది. ఇందులో మూడు ప్రభుత్వ, మూడు ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలుగా తీర్చిదిద్దేందుకు వీటికి స్వయం ప్రతిపత్తి కల్పించడంతోపాటు, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేయనుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) బెంగళూరుతోపాటు ప్రైవేటు సంస్థలైన మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, బిట్స్ పిలానీ, రిలయన్స్ ఫౌండేషన్కు చెందిన జియో ఇన్స్టిట్యూట్ను కేంద్రం ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్గా గుర్తించింది. ఐవోఈ హోదా పొందిన ఈ మూడు ప్రభుత్వ సంస్థలకు వచ్చే ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్ల నిధులను కేంద్రం అందజేయనుంది. ప్రైవేటు సంస్థలకు మాత్రం ప్రభుత్వ నిధులు అందవు. మొత్తంగా 20 సంస్థలకు (10 ప్రభుత్వ, 10 ప్రైవేటు సంస్థలు కలిపి) ఐవోఈ హోదా ఇవ్వాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించింది. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామి నేతృత్వంలోని ఎంపవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ (ఈఈసీ).. తొలి దశలో 6 సంస్థలకు ఐవోఈ ప్రకటించింది. టాప్ 100లో ఒక్క వర్సిటీ లేదు ‘ఐవోఈ దేశానికి ఎంతో ముఖ్యం. దేశంలో మొత్తం 800 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 100 వర్సిటీల్లో ఒక్కటి కూడా చోటు దక్కించుకోలేదు. కనీసం టాప్ 200లో నిలవలేదు. తాజాగా తీసుకున్న నిర్ణయం ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఉపకరిస్తుంది’ అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు. ఐఓఈ హోదా కోసం తెలంగాణకు చెందిన ఉస్మానియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలతోపాటు 114 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 11 సెంట్రల్ యూనివర్సిటీలు, 27 టాప్ ఐఐటీలు, ఎన్ఐటీలు, రాష్ట్రాలకు చెందిన 27 వర్సిటీలు, పది ప్రైవేటు వర్సిటీలు, నాలుగు గ్రీన్ఫీల్డ్ సంస్థలు ఉన్నాయి. ఇంకా స్థాపించని సంస్థకు ఐఈవోనా? రిలయన్స్ సంస్థకు చెందిన జియో ఇన్స్టిట్యూట్ను ఇంకా స్థాపించనేలేదనీ, ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను కాదని జియో ఇన్స్టిట్యూట్కు ఐఈవో హోదా ఎలా ఇచ్చా రని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు జియో ఇన్స్టిట్యూట్ అనే విద్యా సంస్థ ఒకటి రాబోతోందని ప్రపంచానికి తెలిసిందే సోమవారమని అంటున్నారు. ‘జియో ఇన్స్టిట్యూట్కు క్యాంపస్ లేదు. వెబ్సైట్ లేదు. కానీ ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్పూర్ లేదా ప్రైవేట్ రంగంలోని అశోక వర్సిటీ, ఓపీ జిందాల్ గ్లోబల్ వర్సిటీ వంటి ప్రఖ్యాత సంస్థలనెన్నింటినో కాదని ఐఈవో హోదా జియోకు ఎలా దక్కింది?’ అని పలువురు విద్యావేత్తలు సహా అనేక మంది ట్వీటర్లో హెచ్చార్డీ మంత్రి ప్రకాశ్ జవడేకర్ను ప్రశ్నించారు. అయితే జియోకు ఐఈవో హోదా ఇవ్వడాన్ని యూజీసీ సమర్థించుకుంది. గ్రీన్ఫీల్డ్ ఇన్స్టిట్యూషన్స్ కేటగిరీలో జియోకు ఆ హోదా ఇచ్చామనీ, ఈ కేటగిరీ కింద మొత్తం 11 సంస్థలు దరఖాస్తు చేసుకోగా జియోను అవకాశం వరించిందని యూజీసీ పేర్కొంది. -
ఆ ఐఐటీలకు అందలం..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐఎస్సీ బెంగళూర్లకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సోమవారం ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ (ఐఓఈ) హోదా కల్పించింది. వీటితో పాటు ప్రైవేట్ రంగంలోని మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్, బిట్స్ పిలానీ, జియో ఇనిస్టిట్యూట్లకు కూడా ఎమినెన్స్ హోదాను వర్తింపచేసింది. ఐఓఈ హోదా కోసం జేఎన్యూ, ఢిల్లీ యూనివర్సిటీ సహా యూజీసీకి 100కు పైగా దరఖాస్తులు అందాయి. ఆయా సంస్థలకు ఐఓఈ హోదా కల్పించినట్టు కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్వీట్ చేశారు. ఈ హోదా లభించడంతో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు పూర్తి స్వయం ప్రతిపత్తి లభించినట్టు అవుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సంస్థలకు ఉన్నత విద్యా సంస్థలుగా లభించే నిధులతో పాటు ఐదేళ్లలో రూ 1000 కోట్లు అదనపు నిధులు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. ఐఓఈ హోదా దక్కిన సంస్థలు ఇతర ఉన్నత విద్యా సంస్థలతో పోలిస్తే పూర్తి స్వతంత్రంగా వ్యవహరించే వెసులుబాటు ఉంటుంది. దేశీయ, విదేశీ విద్యార్ధులకు ఫీజుల నిర్ణయంతో పాటు కోర్సు వ్యవధి, రూపకల్పన, విదేశీ విద్యాసంస్ధలతో ఒప్పందాల వంటి అంశాల్లో ప్రభుత్వ, యూజీసీ అనుమతులు లేకుండానే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. -
ట్విటర్ సీటీవోగా ముంబై ఐఐటీ పూర్వ విద్యార్థి
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ టాప్ ఎగ్జిక్యూటివ్గా ఎంపికయ్యారు. ఐఐటి-బొంబాయి పూర్వ విద్యార్ధి పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీవో)గా ఎంపికయ్యారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బొంబాయి (ఐఐటీ-బి) పూర్వ విద్యార్ధి పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. 2016 చివరలో రాజీనామా చేసిన అడాం మెసెంజర్ స్థానంలో అగర్వాల్ను కొత్తగా నియమించినట్టు ట్విటర్ ప్రకటించింది. సోషల్ మీడియాలో అబ్యూసింగ్ నివారణ, ట్వీట్ల ఔచిత్యాన్ని పెంచడానికి ప్రధాన ప్రయత్నంలో భాగంగా ఎఐ ప్లాట్ఫాంపై ఆయన పనిచేయనున్నారని ట్విటర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. సామాజిక నెట్వర్క్ దుర్వినియోగాన్ని నివారించడంలో సీటీవోగా అగర్వాల్ దృష్టి పెట్టనున్నారని ట్విటర్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా 2011లో స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీనుంచి కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ చేశారు. ఈ పదవికి ఎంపిక కాకముందు అగర్వాల్ ఏటి అండ్టీ, మైక్రోసాఫ్ట్, యాహూలలో ఇంటర్నషిప్గా పరిశోధనలు చేశారు. -
ఐఐటీ బాంబేలో నాన్వెజ్పై నిషేధం తొలగింపు
సాక్షి, ముంబయి : విద్యార్ధులు, ఫ్యాకల్టీల నుంచి తీవ్ర నిరసన ఎదురవడంతో క్యాంపస్లోని కేఫ్లో మాంసాహార వంటకాలపై నిషేదాన్ని ఐఐటీ బాంబే ఉపసంహరించింది. నాన్ వెజ్ ఐటెమ్స్ విక్రయంపై ఎలాంటి నియంత్రణలు లేవని..క్యాంపస్లోని సివిల్ కేఫ్లో తాజా ఆహారం అందుబాటులో ఉండాలని, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే తొలుత ఈ ఉత్తర్వులు జారీ చేశామని ఐఐటీ బాంబే ఓ ప్రకటనలో పేర్కొంది. ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ప్రాధాన్యత, వివక్ష చూపడం సంస్థ చేయబోదని స్పష్టం చేసింది. మరోవైపు కేవలం నాన్ వెజ్ వంటకాలనే నిషేధించడం పట్ల పలువురు విద్యార్దులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవే కారణాలపై శాఖాహార వంటకాలను ఎందుకు నిషేదించలేదని వారు నిలదీశారు. ఇక క్యాంపస్లో నాన్వెజ్ ఐటెమ్స్కు పేరొందిన సివిల్ కేఫ్లో నిషేధం ఎత్తివేసిన క్రమంలో మాంసాహార వంటకాలు తిరిగి అందుబాటులోకి వస్తాయని విద్యార్థులు పేర్కొన్నారు. జనవరి 20న క్యాంటిన్ కమిటీ సంబంధిత కేఫ్ కాంట్రాక్టర్కు నాన్ వెజ్ ఐటెమ్లు అందించరాదని కోరుతూ నోటీసులు ఇచ్చింది. -
అజ్ఞాతవాసిగా ఐఐటీ గ్రాడ్యుయేట్..
సాక్షి, ముంబయి : ఐఐటీ బాంబే నుంచి కెమికల్ ఇంజనీరింగ్ డిగ్రీ..అత్యధిక వేతనంతో కూడిన ఉద్యోగం..సంప్రదాయ కుటుంబం.. అన్నిటినీ వదిలేసిన సంకేత్ పరేఖ్ భిన్న ప్రయాణాన్ని ఎంచుకున్నాడు. నిన్నమొన్నటి వరకూ అమెరికాలో పీజీ కోర్సు చేయాలని కలలుగన్న సంకేత్ తన సీనియర్తో చేసిన ఆన్లైన్ చాట్తో అన్నీ తలకిందులయ్యాయి. సర్వం త్యజించి ఈనెల 22న ముంబయిలో సంకేత్ జైనిజం స్వీకరించేందుకు ముహుర్తం ఖరారైంది. వైష్ణవ కుటుంబానికి చెందిన సంకేత్ ఐఐటీలో తన సీనియర్, 2013లో దీక్ష తీసుకున్న భవిక్ షా బాటలో జైనిజంలో అడుగుపెడుతున్నాడు. ఉద్యోగంలో కొనసాగదలుచుకుంటే తాను కోరుకున్నవన్నీ పొందేవాడిననీ..అయితే తనలో చెలరేగిన మానసిక సంఘర్షణ ఇప్పటికి శాంతించిందని సంకేత్ చెప్పుకొచ్చాడు. తాను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పటి నుంచీ సీనియర్ భవిక్తో చాట్ చేస్తుండేవాడినని, తమ సంభాషణలు క్రమంగా ఆత్మ, మనసు, శరీరం చుట్టూ తిరిగేవని, ఆ ఆలోచనలు తనను ఆత్మాన్వేషణ వైపు పురిగొల్పి..జైనిజం వైపు నడిపాయని అన్నాడు. ప్రస్తుతం సంకేత్ పరేఖ్ తన వస్తువులను చివరికి స్నేహితుడితో చాట్ చేసేందుకు ఉపయోగించిన కంప్యూటర్ను సైతం విడిచిపెట్టాడు. -
టాప్ 5 రిక్రూట్మెంట్ సంస్థలివేనట!
ముంబయి: ప్రఖ్యాత ఐఐటీ ముంబైలో భారీగా రిక్రూట్మెంట్స్ చేసిన సంస్థలో టాప్ లో 5 కంపెనీలు నిలిచాయి. ముఖ్యంగా ఇంటెల్ టెక్నాలజీస్ 29 మంది విద్యార్థులను, శాంసంగ్ ఆర్ అండ్ డి 28మంది , సిటీ కార్పోరేషన్ 20మంది , గోల్డ్మన్ సాచ్స్ 15, క్వాల్కమ్ 13మంది ఐఐటీ విద్యార్థులను ఎంపిక చేశాయి. అలాగే అంతర్జాతీయ ఆఫర్లు పరంగా అతిపెద్ద రిక్రూటర్లుగా యాహూ, ఎన్ఈసీ, మురత, మైక్రోసాఫ్ట్ నిలిచాయని ఐఐటీ ముంబై విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అత్యధిక ప్యాకేజీలు అమెరికా సంస్థలు చెల్లించనున్న అత్యధిక వేతన ప్యాకేజీలు ఉబెర్ 110,000డాలర్లు, మైక్రోసాఫ్ట్ 106,000డాలర్లు, ఒరాకిల్ 100,000 డాలర్లు గా ఉన్నాయి. జపనీస్ సంస్థలు వర్క్స్ అప్లికేషన్ ఏడాదికి రూ .60 లక్షలు , యాహూ రూ 37,52 లక్షలు, రాకుటేన్ 37. 20 లక్షలు, టోయో ఇంజనీరింగ్ రూ 35,16 లక్షలు చెల్లించనున్నాయి. దేశీయ కంపెనీల గరిష్ట ప్యాకేజీలు బ్లాక్ స్టోన్ రూ .35 లక్షలు, స్క్లూమ్బర్గర్ రూ 28 లక్షలు, వరల్డ్ క్వాంట్ రూ 25.2 లక్షలు, జిరాక్స్ రీసెర్చ్ రూ .22 లక్షలు గా ఉన్నాయి. అనేక రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్, కన్సల్టింగ్, ఫినాన్స్ అండ్ సాఫ్ట్ వేర్ సహా అన్ని రంగాలు సంస్థలు తమ విద్యార్థులను ఎంపిక చేసినట్టు తెలిపింది. ఉబెర్, పేటీఎం, ఓలా లాంటి స్టార్ట్ అప్ ల నుంచి కూడా నియామకాలు జరిగాయనీ, మరికొన్ని ప్రఖ్యాత విద్యాసంస్థలు , యూనివర్శిటీలు ఈ వారంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు ఐఐటీ ముంబై వివరించింది. -
దేశంలో ఐఐఎస్సీయే టాప్
లండన్: భారత్ విశ్వవిద్యాలయాల్లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే మంగళవారం విడుదలైన క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2016-17 జాబితాలో ఐఐఎస్సీ ర్యాంకు 152కు తగ్గింది. గత ఏడాది జాబితాలో దీనికి 147వ స్థానం లభించింది. తాజా జాబితాలోని తొలి 400 ర్యాంకుల్లో స్థానం దక్కిన ఇతర భారత ఉన్నత విద్యా సంస్థల్లో ఢిల్లీ ఐఐటీ(185), బాంబే ఐఐటీ(219), మద్రాస్ ఐఐటీ(249), కాన్పూర్ ఐఐటీ (302), ఖరగ్పూర్ ఐఐటీ (313), రూర్కీ ఐఐటీ(399) ఉన్నాయి. ఈ ప్రపంచ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ (2), హార్వర్డ్ యూనివర్సిటీ(3), యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్(4) తదితరాలున్నాయి. -
ఆ ఐఐటీ పిల్లలు రోజూ స్నానం చేయరట!
ఐఐటీ బాంబే విద్యార్థులలో ప్రతి పదిమందిలో ఆరుగురు వారానికి రెండు లేదా మూడుసార్లు మాత్రమే స్నానం చేస్తారట. ఇంకా కొంతమంది.. అంటే 10 శాతం మంది అయితే వారానికి ఒక్కసారి మాత్రమే స్నానం చేస్తారు. మరి ప్రతిరోజూ స్నానాలు చేసేవాళ్లు ఎంతమంది అంటే, కేవలం 30 శాతం మంది మాత్రమే!! స్వయంగా బాంబే ఐఐటీ విద్యార్థులే నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. అక్కడ చదువు పూర్తిచేసి బయటకు వెళ్లిన 332 మంది అభ్యర్థుల నుంచి ఈ తరహా ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలు తీసుకున్నారు. హాస్టళ్లలో తమ రూమ్మేట్లతో మరికొంత కాలం కలిసుంటే బాగుంటుందని 40 శాతం మంది భావిస్తుంటే, సొంత ఇళ్లకు వెళ్లిపోవాలని 27 శాతం మంది అనుకుంటున్నారు. ఒక్క శాతం మాత్రం ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు. ఇక చిన్ననాటి స్నేహితులతో సంబంధాల గురించి అడిగినప్పుడు 66 శాతం మంది చాలా మంచి సంబంధాలు ఉన్నాయని చెబితే 29.8 శాతం మంది మాత్రం తమ తల్లిదండ్రులతో కూడా అంతంతమాత్రంగానే మాట్లాడుతున్నారట. ఐఐటీలో చదివే సమయంలోనే 52.4 శాతం మంది స్నేహితులతో కలిసి గోవాకు వెళ్లొచ్చారట.70 శాతం మంది లోకల్ రైళ్లలో టికెట్లు లేకుండా వెళతే, 55.7 శాతం మంది ఏదో రకమైన జూదం ఆడారు. మరో ఐదేళ్ల వరకు పెళ్లి చేసుకోవాలని లేదని 31 శాతం మంది ఏమీ చెప్పలేమని, 21.4 శాతం మంది మూడు నుంచి ఐదేళ్ల మధ్యలో చేసుకుంటామన్నారు. సర్వేలో పాల్గొన్నవాళ్లలో 70.5 శాతం మంది బీటెక్ చదవగా, 33.75 శాతం మంది దాంతోపాటు మరో ఆనర్స్ డిగ్రీ కూడా చేశారు. -
9 కంపెనీలను బ్లాక్ లిస్ట్లో పెట్టిన ఐఐటీ బాంబే
ముంబయి: ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబే యూనివర్శిటీ 9 కంపెనీలను బ్లాక్లిస్ట్లో పెట్టింది. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన ఆ తొమ్మిది కంపెనీల వివరాలను గురువారం విడుదల చేసింది. ఇక మీదట కళాశాల ప్రాంగణాల్లో నియామకాలు చేపట్టకుండా ఆ తొమ్మిది కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లు ఐఐటీ-బి అధికార ప్రతినిధి ఫల్గుణి బెనర్జీ నేహ తెలిపారు. అధిక వేతనంతో జాబ్ ఆఫర్ చేస్తూ.. ప్రాంగణాల్లోనే నియామకాలు చేపడుతూ... అనంతరం ఉద్యోగాల్లో చేర్చుకోవడంలో జాప్యం చేస్తుండటం, ఫేక్ కంపెనీలు వంటి వరుస ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఏడాది పాటు ఈ కంపెనీలు ఐఐటీల్లో ప్లేస్ మెంట్లు నిర్వర్తించకుండా బ్లాక్ లిస్ట్ కొనసాగుతాయని తెలిపారు. కాగా బ్లాక్లిస్ట్ కంపెనీల జాబితాను ఐఐటీ బాంబే విడుదల చేయటం ఇదే తొలిసారి. కాగా ఆయా కంపెనీల ప్రతిస్పందన బట్టి భవిష్యత్లో నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. కాగా బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీల్లో జీపీఎస్కే, జాన్సన్ ఎలక్ట్రిక్ ఆఫ్ చైనా, పోర్టీ మెడికల్, పెప్పర్ టాప్, క్యాష్ కేస్ టెక్నాలజీస్ ఉన్నాయి. కాగా ఏడుగురు విద్యార్థులకు పోర్టియా అండ్ పెప్పర్ సంస్థ జాబ్ ఆఫర్లు ప్రకటించి, ఫిబ్రవరి మధ్యలో విత్ డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. -
ఐఐటీ బాంబే వైపు టాపర్ల చూపు
ఐఐటీ, ఎన్ఐటీల్లో మొదటి దశ ప్రవేశాలు ఖరారు సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ తదితర జాతీయ స్థాయి సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) గురువారం సీట్లు కేటాయించింది. ఆయా విద్యా సంస్థల్లో సీట్లు పొందిన విద్యార్థుల వివరాలను వెబ్సైట్లో ఉంచింది. జూలై 1 నుంచి 5 లోగా సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించి సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని వెల్లడించింది. వెరిఫికేషన్కు ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇక ఐఐటీల్లో చేరాలంటే జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకు వచ్చిన జనరల్, ఓబీసీ విద్యార్థులు ఇంటర్ బోర్డు నుంచి పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో టాప్ 20 పర్సంటైల్లోగా గానీ, ఇంటర్లో 75 శాతం మార్కులు(ఎస్సీ, ఎస్టీ, వికలాంగులైతే 70 శాతం) గానీ సాధించి ఉండాలన్న నిబంధన ఉంది. దీంతో వివిధ ఇంటర్ బోర్డుల వారీగా టాప్ 20 పర్సంటైల్ కటాఫ్ మార్కులను ప్రకటించింది. తెలంగాణ ఇంటర్ బోర్డులో జనరల్ అభ్యర్థుల్లో టాప్ 20 పర్సంటైల్ మార్కుల కటాఫ్ను 475గా వెల్లడించింది. ఓబీసీలకు 460, ఎస్సీలకు 445, ఎస్టీలకు 449, వికలాంగులకు 445 మార్కులు కటాఫ్ ప్రకటించింది. ఏపీలో జనరల్కు 470, ఓబీసీకి 457, ఎస్సీ 442, ఎస్టీ 439, వికలాంగులకు 439 మార్కులను టాప్-20 పర్సంటైల్ కటాఫ్ మార్కులుగా పేర్కొంది. 262 మందికి ఐఐటీ బాంబేలో సీట్లు టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఐఐటీ బాంబేలో చేరేందుకు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. 1000లోపు ర్యాంకు ఉన్న వారిలో 262 మందికి ఐఐటీ బాంబేలో సీట్లు వచ్చాయి. టాప్ 500 లోపు ర్యాంకు వచ్చిన వారిలో 164 మందికి, టాప్ 100 లోపు ర్యాంకు వచ్చిన వారిలో 67 మందికి సీట్లు ఖరారయ్యాయి. ఐఐటీ బాంబే తర్వాత ఐఐటీ ఢిల్లీలో ఎక్కువ మంది సీట్లు లభించాయి. సీట్ల కోసం ఏ ఆప్షన్లు ఇవ్వని విద్యార్థులు టాప్ 500 ర్యాంకులోపు ఇద్దరు, 1000 ర్యాంకులోపు 5 మంది ఉన్నారు. -
చదివింది ఐదారు గంటలే..!
ఐఐటీ సీటు పొందినవారిలో ఎక్కువ మంది చదివింది రోజూ 4-7 గంటలే సాక్షి, హైదరాబాద్: తెల్లవారకముందే పుస్తకాలతో కుస్తీ షురూ.. టిఫిన్ చేస్తూ, టీ తాగుతూ.. అటు బడిలో, ఇటు ఇంట్లో చదువులే చదువులు.. ర్యాంకుల కోసం ఉరుకులు పరుగులు.. ఆటల్లేవు, పాటల్లేవు.. రాత్రి నిద్రపోయేదాకా పుస్తకాలతోనే దోస్తీ... ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ విద్యార్థిని చూసినా ఇదే తంతు. కానీ దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటైన బాంబే ఐఐటీలో సీటు సంపాదించిన చాలా మంది విద్యార్థులు చదివింది రోజూ నాలుగు నుంచి ఏడు గంటలే! పొద్దంతా కుస్తీ పట్టడం కాకుండా.. చదివినంతసేపు శ్రద్ధగా చదివామని ఆ విద్యార్థులు ఐఐటీ నిర్వహించిన సర్వేలో వెల్లడించారు. బాంబే ఐఐటీలో ఎక్కువ మంది మహారాష్ట్ర విద్యార్థులుకాగా.. తెలంగాణ విద్యార్థులు నాలుగో స్థానంలో ఉన్నారు. తల్లిదండ్రులకూ టెన్షన్! తమ పిల్లలు ఐఐటీల్లో చదవాలన్నది ఎంతో మంది తల్లిదండ్రుల కల. పిల్లల్ని 6వ తరగతి నుంచే ఐఐటీ కోచింగ్ ఇచ్చే స్కూళ్లలో చేర్చుతున్నారు. ఆటపాటలు మాన్పించేసి, చదువుపైనే శ్రద్ధ పెట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. పదో తరగతి పూర్తయిందంటే చాలు.. ఈ చదువుల ఒత్తిడి మరింత పెరిగిపోతోంది. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా పుస్తకాలతో స్నేహమే. ఇలాంటి పరిస్థితులపై అభిప్రాయం తెలుసుకునేందుకు 2015-16 విద్యా సంవత్సరంలో తమ వద్ద చేరిన విద్యార్థులపై బాంబే ఐఐటీ ఓ సర్వే నిర్వహించింది. విద్యార్థుల ఆలోచనలు, ఆకాంక్షలు, ఐఐటీ కోసం ప్రిపేరైన తీరు, తల్లిదండ్రుల ఆలోచనలు, చదివించేందుకు వారు పడిన ఆరాటం.. ఇలా ప్రతి కోణంలో విద్యార్థుల మనసు తెలుసుకుంది. దానిని ‘ఇన్సైట్ ఫ్రెషర్స్ సర్వే’ పేరుతో విడుదల చేసింది. సహపాఠ్య కార్యక్రమాలపై ఆసక్తి తక్కువ జేఈఈ కోసం సిద్ధమయ్యే విద్యార్థులు ఆటపాటలు వంటి సహపాఠ్య కార్యక్రమాలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనికి తల్లిదండ్రుల ఒత్తిడి, ఎక్కువ సమయం చదవాలన్న ఆలోచనే కారణం. సర్వేలో పాల్గొన్నవారిలో 23.8 శాతం మంది అసలు ఆటపాటలపై దృష్టే పెట్టలేదని వెల్లడించారు. సహపాఠ్య కార్యక్రమాలకు గంట కంటే తక్కువ సమయం వెచ్చించిన వారు 31.5 శాతం, గంట నుంచి రెండు గంటలపాటు వెచ్చించిన వారు 28.2 శాతం ఉండగా... రెండు గంటల కంటే ఎక్కువ సమయం వెచ్చించిన వారు 16.5 శాతం మంది. ► జేఈఈకి సిద్ధమయ్యే వారికి మానసిక కౌన్సెలింగ్ అవసరమని 26.1 శాతం మంది విద్యార్థులు చెప్పగా, 73.9 శాతం మంది అవసరం లేదన్నారు. ► తమ ఆసక్తితో జేఈఈకి ప్రిపేరయ్యామని ఎక్కువ మంది చెబుతున్నా. తల్లిదండ్రుల ఒత్తిడితో సిద్ధమయ్యామని 18.8 శాతం, బంధువుల ఒత్తిడితో 16.5 శాతం మంది, ఉపాధ్యాయుల సూచనలతో 19.6 శాతం మంది జేఈఈ రాశారు. ► పాఠశాల విద్య స్థాయిలో 26 శాతం మంది ఏ దశలోనూ కాపీ కొట్టలేదని చెప్పారు. మిగతా 74 శాతం మంది ఏదో ఒక స్థాయిలో కాపీ కొట్టామని, టీచర్లు చెబితే రాశామని చెప్పారు. ► ఐఐటీల్లో సీట్లు పొందిన వారిలో 95.9 శాతం మంది జేఈఈ శిక్షణ పొందినవారు కాగా... 4.1 శాతం మంది శిక్షణ లేకుండానే సీట్లు సాధించారు. ► టాప్ 1000 ర్యాంకులు సాధించిన వారిలో 40 శాతం మంది రాష్ట్ర బోర్డులకు చెందినవారు.. 60 శాతం మంది సీబీఎస్ఈ బోర్డుకు చెందినవారు. సర్వేలోని ప్రధాన అంశాలు ► ఒకటి నుంచి 100 వరకు ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో 25%మంది రోజుకు 4 గంటల పాటే జేఈఈ అడ్వాన్స్డ్కు ప్రిపేరయ్యారు. 40 శాతం మంది 4 నుంచి 7 గంటల సమయం కేటాయించారు. 15 శాతం మంది 7 నుంచి 10 గంటలు, మరో 15 శాతం మంది 10 నుంచి 12 గంటల పాటు ప్రిపేరయ్యారు. అంతకుమించి చదివినవారు 5 శాతమే. ►101 నుంచి 1000 వరకు ర్యాంకులు సాధించిన వారిలో 4 గంటల కన్నా తక్కువ సమయం చదివినవారు 7 శాతంకాగా... నాలుగు నుంచి ఏడు గంటలపాటు చదివినవారు 47 శాతం. ఇక 7 నుంచి 10 గంటలపాటు చదివిన వారు 26 శాతం, 10 నుంచి 12 గంటలపాటు ప్రిపేరైన వారు 17 శాతం, అంతకంటే ఎక్కువ సమయం చదివినవారు 2%విద్యార్థులే. ► 1001 నుంచి 2,500 ర్యాంకు వరకు సాధించిన వారిలో చదవడం కోసం 37శాతం నాలుగు గంటలలోపే కేటాయించారు. 40 శాతం మంది నాలుగు నుంచి ఏడు గంటలపాటు సిద్ధమయ్యారు. 7-10 గంటలు చదివినవారు పది శాతం, 10-12 గంటలు చదివిన వారు 11 శాతం, అంతకంటే ఎక్కువ చదివిన వారు కేవలం ఒక శాతమే ఉన్నారు. ► 2501వ ర్యాంకు నుంచి ఐదు వేల ర్యాంకు వరకు వచ్చిన వారిలో 30 శాతం మంది నాలుగు గంటల పాటే చదివారు. 42 శాతం మంది 4 నుంచి 7 గంటల పాటు చదివారు. 16 శాతం మంది ఏడు నుంచి పది గంటలు, ఐదు శాతం మంది పది నుంచి 12 గంటలు, 7 శాతం అంతకంటే ఎక్కువ సమయం వెచ్చించారు. -
బులెటిన్ బోర్డ్
ఐఐటీ బాంబేలో ఉద్యోగాలు ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) బాంబే.. సీనియర్ ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సీనియర్ ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీలు: 08 ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఖాళీలు: 06 సీనియర్ ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఖాళీలు: 02 దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా చివరి తేదీ: మే 16, 2016 వెబ్సైట్: www.ircc.iitb.ac.in యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో ఖాళీలు యునైటె డ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. అడ్మినిస్ట్రేటివ్ (మెడికల్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీలు: 12 అర్హత: ఎంబీబీఎస్ డిగ్రీని లేదా తత్సమాన విదేశీ డిగ్రీని పొంది ఉండాలి. వయోపరిమితి: 21-30 ఏళ్లు దరఖాస్తు: నిర్దేశిత నమూనాలోని దరఖాస్తు ఫారాన్ని నింపి సంబంధిత డాక్యుమెంట్లను జతచేసి కింది చిరునామాకు పంపాలి. చిరునామా: ది డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్), హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్, యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, హెడ్ ఆఫీస్, 24, వైట్స్ రోడ్, చెన్నై- 600014. చివరితేదీ: మే 15, 2016. వెబ్సైట్: http://uiic.co.in -
750కిపైగా మార్కులొస్తేనే ఐఐటీలో సీటు
* ఇంటర్ కటాఫ్ మార్కులను ప్రకటించిన ఐఐటీ బాంబే * జనరల్, ఓబీసీ విద్యార్థులకు 750 మార్కులు * ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 700 మార్కులు రావాల్సిందే సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు ఇంటర్మీడియట్లో సాధించి ఉండాల్సిన కటాఫ్ మార్కులను ఐఐటీ బాంబే ప్రకటించింది. ఐఐటీ ప్రవేశాలకు వివిధ రాష్ట్రాల ఇంటర్ బోర్డుల్లో పరిగణనలోకి తీసుకునే కటాఫ్ మార్కులను వెల్లడించింది. బోర్డులవారీగా కటాఫ్ మార్కుల వివరాలను తమ వెబ్సైట్లో (http://jeeadv.iitb.ac.in) పొందుపరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డులు, రాజీవ్గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయాలకు (ఆర్జీయూకేటీ) చెందిన విద్యార్థులు సాధించాల్సిన మార్కులను పేర్కొంది. ఇదీ ప్రాతిపదిక.. ఐఐటీలో సీటు పొందాలంటే విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకుతోపాటు ఇంట ర్మీడియట్లో టాప్-20 పర్సంటైల్లో లేదా జనరల్, ఓబీసీ-నాన్ క్రీమీలేయర్ (ఎన్సీఎల్) విద్యార్థులు ఇంటర్లో 75 శాతం మార్కు లు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులైతే 70 శాతం మార్కులను సాధించి ఉండాలి. ఈ రెండింటిలో ఏ ఒక్కదాని పరిధిలో ఉన్నా చాలు. అలాంటి విద్యార్థులకే వారి జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతిలో ఒక్కో రకమైన మార్కుల విధానం ఉంది. కాబట్టి సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి మార్కులను (500) ప్రామాణికంగా తీసుకొని వివిధ ఇంటర్మీడియట్ బోర్డులలో ప్రతి 500 మార్కులకు టాప్-20 పర్సంటైల్ ఉండాల్సిన మార్కులను, 75 శాతం, 70 శాతంతో పరిగణనలోకి తీసుకునే మార్కులను వెల్లడించింది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్లో 1000 మార్కుల విధానం ఉంది. వాటి ప్రకారం కాకుండా ప్రతి 500 మార్కుల కు సాధించాల్సిన మార్కులను వెబ్సైట్లో పొందుపరించింది. అయితే రాష్ట్ర విద్యార్థులు ప్రకటిత మార్కులను రెట్టింపు చేసి లెక్కించుకోవాల్సి ఉంటుందని ఐఐటీ నిపుణుడు ఉమాశంకర్ తెలిపారు. అలా లెక్కించిన వివరాలివీ.. -
డిప్రెషన్తో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
ప్రఖ్యాత బాంబే ఐఐటీ క్యాంపస్లో కెమికల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థి జితేశ్ శర్మ (21) అనుమానాస్సద రీతిలో మరణించాడు. శనివారం రాత్రి హాస్టల్ టెర్రస్పై జితేశ్ మృతదేహాన్ని గుర్తించిన సహవిదర్యార్థు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీ చేయగా పాయిజన్ బాటిల్తోపాటు మృతుడు రాసిన సూసైడ్ నోట్ లభించాయి. గత కొంత కాలంగా డిప్రెషన్తో బాధపడుతోన్న జితేశ్ ఆ మేరకు చికిత్స కూడా తీసుకుంటున్నట్లు తెలిసింది. సరిగా చదవడంలేదని, గత నెలలో రాసిన పరీక్షల్లో ఫెయిల్ అవుతానని, క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగం పొందలేననే భయాందోళనతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు జితేశ్ సూసైడ్ నోట్లో రాశాడని పోలీసులు చెప్పారు. పోస్ట్మార్టం అనంతరం జితేశ్ మృతదేహాన్ని స్వస్థలం రోహ్తక్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.