Indian Constitution
-
నకలు కాదు... సిసలు రాజ్యాంగం!
భారత స్వాతంత్య్ర సంగ్రామం చివరికి ఉపఖండం భారత్ (India), పాకిస్తాన్లుగా విభజితమవ్వడంతో ముగిసింది. బ్రిటిష్ రాణి 1947 జూలైలో ‘భారతీయ స్వాతంత్య్ర చట్టం–1947’ను ఆమోదించారు. ‘3వ జూన్ ప్లాన్’ పేరున ‘మౌంట్ బాటెన్ ప్రణాళిక’కింద రెండు (భారత్–పాక్) డొమినియన్ల సృష్టి జరిగింది. అవి స్వతంత్ర దేశాలని అనుకుంటున్నాం కాని, బ్రిటిష్ రాణి (British Queen) దయవల్లనే వాటికి డొమినియన్ స్థాయిని ఇచ్చారు (ఇది దానం వలె ‘ఇచ్చింది’ అని అర్థం చేసుకోవాలి). స్వాతంత్య్ర చట్టం ఆమోదానికి ముందే మన రాజ్యాంగాన్ని రాయడానికి రాజ్యాంగ సభ (1946) ఏర్పడింది. మొత్తం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు మన రాజ్యాంగ నిర్మాణం సాగి 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. అయితే మన రాజ్యాంగం (Indian Constitution) కాపీ కొట్టిన రాజ్యాంగం అనే అపప్రథను మూట కట్టుకుంది. ఇప్పటికీ ఆ విమర్శ ఉంది. బ్రిటిష్ వాళ్లు చేసిన ‘భారత ప్రభుత్వ చట్టం–1935’ను మక్కీకి మక్కీ నకలు చేశారంటారు. అలాగే అనేక ప్రపంచ దేశాల నుంచి నచ్చిన అంశాలను గ్రహించి మన రాజ్యాంగంలో చేర్చారు. మనకు ఉన్న దేశాధ్యక్షుడు (రాష్ట్రపతి), మంత్రి వర్గం, పార్లమెంట్, న్యాయవ్యవస్థ వంటివి ప్రపంచంలో అనేకానేక ప్రజాస్వామ్య దేశాల్లో ఉన్నవే. ప్రజా స్వామ్య వ్యవస్థలో ఇవన్నీ సాధారణ అంశాలు (భాగాలు) కాబట్టి అది నకలు అనడానికి వీల్లేదు. మనం ప్రజాస్వామ్య విధానం పాటిస్తున్నాం కాబట్టి మనకు నచ్చిన అంశాలను స్వీకరించడం తప్పుకాదు కదా. ఇక ఏ ఏ అంశాలను ఎక్కడి నుంచి స్వీకరించామనే విషయానికి వస్తే... బ్రిటన్ నుంచి పార్లమెంటరీ ప్రభుత్వ పరి పాలన, రూల్ ఆఫ్ లా, శాసన ప్రక్రియ, క్యాబినెట్ పద్ధతిలో ప్రజాస్వామ్యం, ప్రభుత్వ నిర్వహణలో న్యాయరంగంలో ఆజ్ఞల పాత్ర (రిట్ గొప్పతనం) వంటివి ఉన్నాయి.ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నికల పద్ధతి, రాష్ట్రపతి రాజ్యసభలో సభ్యులను ఎంపిక చేసే పద్ధతిని స్వీకరించాము. అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించినవాటిలో అధికారం నుంచి రాష్ట్రపతిని తొలగించడం (మహా అభిశంసనం), రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు అధికారాలను నిర్వహించే విధానం, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు, ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్షాధికారం, న్యాయ స్వతంత్రత, రాజ్యాంగ పీఠిక ఉన్నాయి. సమాఖ్య తరహా అధికారిక కేంద్రీకరణ... అంటే రాష్ట్రాలతో పోల్చితే బలమైన కేంద్రం, రాష్ట్రాలకు ఇచ్చిన అధికారాలు కాక మిగిలిన అన్ని అధికారాలను కేంద్రానికి అప్పగించడం, కేంద్రానికి రాష్ట్రాల గవర్నర్ (రాజ్ పాల్) నియామక అధికారం, సుప్రీంకోర్టుకు సలహా ఇచ్చే అధికారం వంటి వాటిని కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించాం. ఆస్ట్రేలియా నుంచి కేంద్రం, రాష్ట్రాలు రెండూ చట్టాలు చేయగలిగిన అంశాల జాబితా (ఉమ్మడి జాబితా), లోక్సభ, రాజ్యసభల ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించడంవంటి అంశాలు; సోవియట్ యూనియన్ నుండి ప్రాథమిక విధులు, సామాజిక, ఆర్థిక, రాజకీయ లక్ష్యాలను పీఠికలో చేర్చడం; ఫ్రాన్స్ నుండి గణతంత్ర లక్షణం, స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వాలను పీఠికలో చేర్చడం వంటివాటిని స్వీకరించాం. అలాగే జర్మనీ నుంచి ఎమర్జన్సీలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసే (సుషుప్తావస్థలో ఉంచే) విధానాన్ని, దక్షిణ ఆఫ్రికా నుంచి రాజ్యసభ ఎన్నికల విధానం, రాజ్యాంగ సవరణవంటివి మనం తీసుకున్నాం. ఈ లక్షణాలన్నీ వివేకంగా ఉపయోగించుకోవచ్చు అని రాజ్యాంగ నిర్ణాయక సభలో నిర్ణయించారు. అంతకుముందు బీఎన్ రావ్ ఒక ముసాయిదా రాశారు. అయితే అది పూర్తిగా మారిపోయింది. పోల్చుకోవడం కూడా సాధ్యం కాని విభిన్నమైన ప్రజాస్వామ్యాల నుంచి అనేక అంశాలు, కీలకమైన కొన్ని విధానాలు చేర్చ వలసి ఉందని ఆయనే స్పష్టంగా చెప్పారు.చదవండి: బాలయ్య మాటల్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలంటే..అందుకు తగినట్లే అనేక రాజ్యాంగాల నుంచి తగిన విషయాలను స్వీకరించడం జరిగింది. కానీ ఇప్పటికీ కొందరు పెద్దలు అసలు మొదటి రాజ్యాంగం రాసింది రావ్ గారే తెల్సా అని తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు. మన తాజా దేశభక్తులు కూడా ఇదే వాదన చేస్తుంటారు. విధిలేక అంబేడ్కర్ను ఈ భక్తులు మొక్కుతున్నారు గాని రాజ్యాంగ నిర్ణాయక సభ (లేదా రాజ్యాంగ నిర్మాణ పరిషత్)లోని సప్త రుషులవంటి ఏడుగురు రాజనీతిజ్ఞుల అవిరళ కృషి, మార్గదర్శకాలతో తొలి డ్రాఫ్ట్ రూపొందింది. తరువాత ఆ ఏడుగురిలో ముసాయిదా కమిటీ అధ్యక్షుడైన అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాణం చేశారని అర్థం చేసుకోవాలి. ప్రతి నియమానికి నానా కష్టాలు పడి, చర్చించి, ఒప్పించి, అందరూ ఏకాభిప్రాయం సాధించిన తరువాత ఈ రాజ్యాంగం ఏర్పడిందని గ్రహించాలి.-మాడభూషి శ్రీధర్, మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’ ప్రొఫెసర్ -
మన రాజ్యాంగం బలమైనదేనా?
మీకు తెలుసా? ప్రపంచ దేశాలన్నింటి రాజ్యాంగాల సగటు ఆయుష్షు 19 ఏళ్లు మాత్రమేనని! భారతదేశం మాత్రం 75 ఏళ్ల పాటు తన రాజ్యాంగాన్ని కాపాడుకుంది. దీనికి సంతోషపడదాం. గర్వంగా ఫీల్ అవుదాం. దేశ చరిత్రలోనే కీలకమైన ఈ ఘట్టాన్ని గత వారమే చూశాం. అయితే, సమీక్షకు తగిన సమయం కూడా ఇదే! డెబ్ఫై ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారత రాజ్యాంగం ఎదుర్కొన్న సవాళ్లు, ప్రశ్నలేమిటన్నది చూద్దాం.మన రాజ్యాంగం వలసవాదులదని చాలామంది మేధావులు విమర్శిస్తూంటారు. భారతీయ మూలాలు ఉన్నది కాదని ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యానిస్తూ ఉండేది. అలాంటప్పుడు ఇది ఏ విధంగా మనకు మంచిది?ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించిందనేది ఒక సమాధానం. అలాగే ఏకకాలంలో అర్హులందరికీ ఓటుహక్కు కల్పించిన రాజ్యాంగం కూడా మనదే. కానీ దీనివల్ల అందరూ సమానంగా లాభ పడ్డారా? లేక... ముస్లింలు, ఆదివాసీలు, దళిత మహిళలు లాభ పడలేదా? డెబ్భై ఏళ్ల ప్రయాణంలో మన రాజ్యాంగం ఇప్పటివరకూ 106 సార్లు మార్పులకు గురైంది. ఇది మన శక్తికి ప్రతీకా? ఎందుకంటే, అవసరమైనప్పుడు తగు విధంగా మార్పులు, చేర్పులు చేసుకునే వీలుతో రాజ్యాంగం ఉంది. లేదా ఇది బలహీనతా? అగ్రరాజ్యం అమెరికాలో 1789 నుంచి జరిగిన సవరణలు కేవలం 27 మాత్రమే.శాసనాలు చేసే ప్రజా ప్రతినిధుల వ్యవస్థ కంటే కార్యనిర్వాహక వర్గాన్ని రాజ్యాంగం ఎక్కువ బలోపేతం చేసిందని చెబుతారు. అసెంబ్లీ స్పీకర్ల పనితీరు, రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ఈ పరి స్థితిని మరింత దిగజార్చాయి. ఫలితంగా ఎంపీలు పార్టీ నాయకత్వా నికి సబార్డినేట్లుగా మారిపోయారు. స్పీకర్లకు హౌస్ ఆఫ్ కామన్ ్స (యూకే) మాదిరిగా వారిపై అధికారం ఏదీ ఉండదు. ఈ విమర్శను ఇప్పటివరకూ ఎవరూ సవాలు చేయలేదు కూడా! అయితే దీని వెనుక ఏముందన్నది నిశితంగా పరిశీలించాల్సిన అంశం. ‘‘భారతీయ రాజ్యాంగం అడ్డుగోడలు నిర్మించకుండా... కార్యనిర్వాహక వర్గానికి ఎక్కువ అధికారాలు ఇచ్చింది. అంతేకాకుండా ఈ వర్గం తన అధికారాన్ని పూర్తిస్థాయిలో చలాయిస్తుందని విశ్వసించింది’’ అంటారు గౌతమ్ భాటియా. పాలకులందరూ మంచివారనీ, రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తారని రాజ్యాంగ నిర్మాతలు భావించారా? ఊహూ, అలా అనుకోలేదని స్పష్టంగా చెప్పవచ్చు. ఒక ఉదాహరణ – ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి. ఇది రాజ్యాంగాన్ని సుప్తచేతనావస్థలో పెట్టడం వల్లనో, రాజ్యాంగా నికి అతీతంగా పోవడం వల్లనో అమలు కాలేదు. దాంట్లో భాగమైన వ్యవస్థలతోనే జరిగింది. ఇది మన రాజ్యాంగం బలహీనత లేదా లోపాన్ని ఎత్తిచూపింది. రాజ్యాంగ పరమైన నైతికత లేని విషయాన్ని ఎమర్జెన్సీ పరిస్థితి ఎత్తి చూపిందని చెప్పవచ్చు. ఈ నైతికత అనేది రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు పనిచేస్తాయా, లేదా అన్నదాన్ని నిర్ణయిస్తుంది. గవర్నర్లు, ఎన్నికల కమిషనర్లు తరచూ ఈ రాజ్యాంగ నైతికతను తప్పుతుంటారని మనకు తెలుసు. కానీ వాటిపై వ్యాఖ్యా నించడం కంటే ఎక్కువేమీ చేయలేము – ఈ అంశాలపై మనఆందోళన, విమర్శ ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ! రాజ్యాంగంలో ఉన్న మరో లోటు ఇదేనా?రాజ్యాంగం సమాఖ్య నిర్మాణానికి ఏర్పాటు చేసింది. కానీ ఆర్థికాంశాలతో పాటు పరిపాలనకు సంబంధించిన విషయాల్లోనూ రాష్ట్రాలపై పెత్తనం చలాయించే అధికారం కేంద్రానికి కట్టబెట్టింది. సమాఖ్య స్వరూపాన్ని మార్చే అధికారం, శక్తి కూడా కేంద్రానిదే. స్వాతంత్య్రం లభించిన సమయంలో దేశం బలహీనంగా, ముక్కలు ముక్కలుగా విడిపోయింది కాబట్టి... ఆ పరిస్థితుల్లో ఇలాంటి ఏర్పాట్లు చేశారని అనుకున్నా మూడు సిల్వర్ జూబ్లీల కాలం గడచిన ఈ తరుణంలోనైనా మార్పులు చేయడం అనవసరమా? భారతీయ పౌరులకు రాజ్యాంగం బోలెడన్ని ప్రాథమిక హక్కు లను కల్పించింది. అయితే భావ ప్రకటన, వ్యక్తీకరణపై పూర్తిస్థాయి స్వాతంత్య్రం మాత్రం లేకుండా పోయింది. నిజానికి ఈ ‘ఫ్రీ స్పీచ్’ను నైతికత, పరువునష్టం వంటి రెండు సందర్భాల్లో మాత్రమే నియంత్రించాల్సి ఉంటుంది. మహా అయితే... విదేశాలతో మన సంబంధాలు దెబ్బతినే పరిస్థితులకూ పొడిగించవచ్చు. కానీ... మనకున్న నియంత్రణలు చాలా ఎక్కువగా లేవూ?1973లో రాజ్యాంగంపు మౌలిక స్వరూపాన్ని కాపాడే లక్ష్యంతో సుప్రీంకోర్టు కొన్ని విధి విధానాలను సిద్ధం చేసింది. ఇదో చారిత్రక నిర్ణయం. అయితే దాదాపుగా అదే సమయంలో జబల్పూర్ అడిష నల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఎమర్జెన్సీ విషయంలో శాసనకర్తల ఒత్తిడికి లొంగిపోయారు. అయోధ్య విషయంలోనూ ఇదే జరిగిందన్నది చాలామంది అభిప్రాయం. అలాగే జమ్మూ–కశ్మీర్కు ఉన్న రాష్ట్ర హోదాను కూడా రాజ్యాంగం కాపాడలేకపోయింది. కాబట్టి... రాజ్యాంగ సంరక్షణ చేయాల్సిన న్యాయస్థానాలు తమ నిర్ణయాల్లో అసందిగ్ధతతో వ్యవహరిస్తున్నాయి. లేదంటే అవసరమైనంత చేయడం లేదు. రాజ్యాంగం మనకు ఎన్నికల కమిషన్ , కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్), ఇన్ఫర్మేషన్ కమిషన్ వంటి ఎన్నో వ్యవస్థలను కల్పించింది. కానీ... ఇవి పాలకవర్గానికి అతీతంగా స్వతంత్రంగా పని చేసేలా మాత్రం చేయలేకపోయింది. ఆ యా సంస్థల ఉన్నతాధి కారుల నియామకాల విషయంలో ఇది మరింత సత్యమని చాలా మంది చెబుతారు. చివరగా... రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన రాజకీయ నేతలు, సంస్థల అధినేతలు ఆ పని ఎంత వరకూ సక్రమంగా నిర్వర్తించారు? అలాగే రాజ్యాంగ సంరక్షణ బాధ్యతను న్యాయమూర్తులు ఎంత సమర్థంగా నిర్వహించారు? సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్ను ఇదే ప్రశ్న అడిగితే... ‘‘భారత్కు మంచి రాజ్యాంగం ఉంది. కీలక సందర్భాల్లో రాజకీయ నేతలు, న్యాయమూర్తులు దీని ప్రతిష్ఠను దిగజార్చారు. పాలకవర్గం మాత్రమే కాదు... పార్లమెంటు కూడా ఇందులో భాగస్వామే’’ అన్నారు. ఇందులో అంగీకరించక పోయేందుకు ఏమీ లేదన్నది నా అభిప్రాయం!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మన అడుగులు ఎటువైపు?!
భారత రాజ్యాంగానికి శతాబ్దాల ముందు.. ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు, యూదులను భారతదేశపు మట్టిలో చట్టబద్ధమైన భాగస్వాములుగా మన దేశ మూలవాసులు అంగీకరించారు. మన పూర్వీకులు మానవత్వాన్ని ఒకే కుటుంబంగా అర్థం చేసుకున్నారు. ప్రాచీన సంస్కృత పదబంధమైన ‘వసుధైక కుటుంబం’, ప్రాచీన తమిళ పద్యమైన ‘యాదుం ఊరే యావరం కేళిర్’ అర్థం కూడా ఇదే! కానీ ఇప్పటి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. సహజీవనంతో భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడం కంటే నిన్నటి రోజుని పునర్నిర్మించడానికే ప్రయత్నాలు జరుగుతున్నట్లనిపిస్తోంది. గతాన్ని మార్చలేము. గతం నుంచి కేవలం నేర్చుకోగలం. గతాన్ని పునర్వ్యవస్థీకరించే ప్రచారాలు వర్తమానాన్ని గాయపరుస్తాయనేది చరిత్ర నేర్పిన పాఠం.భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్ కుమార్, కేవీ విశ్వనాథన్ లు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టంతో ముడిపడిన పిటిషన్ లను తిరిగి విచారించినప్పుడు, మీడియా మరోసారి పిటిషన ర్లను ‘హిందూ’ లేదా ‘ముస్లిం’ అనే రెండు పక్షాలుగా పేర్కొంటుంది. సీజేఐ, ఆయన తోటి న్యాయమూర్తులు తమ తీర్పును ఇచ్చిన తర్వాత, మీడియా ‘విజయం సాధించిన పక్షం’ అనే శీర్షికను పెడు తుంది. నిజానికి, ఆ తీర్పు విజయాన్ని మించి మరింత ప్రాముఖ్యం కలిగినది. ఇది రెండు సంఘర్షణాత్మక దృక్పథాల మధ్య ప్రభావం చూపుతుంది, ఒకటి భారతదేశంలో సమానత్వంతో కూడిన ప్రజాస్వా మ్యాన్ని కోరుకుంటుంది, మరొకటి మెజారిటీ ఆధిపత్యాన్ని వాగ్దానం చేస్తుంది. ఆ తీర్పు హిందూ మతంపై ప్రపంచ అవగాహనను కూడా ప్రభావితం చేస్తుంది.చికాగోలో 1893లో జరిగిన ప్రపంచ సర్వ మత మహాసభముందు స్వామి వివేకానంద పేర్కొన్న ప్రఖ్యాతిగాంచిన మాటలు హిందూ మతానికి ప్రపంచవ్యాప్త ప్రతిష్ఠ తేవడంలో సాయపడ్డాయి: ‘‘సహనం, సార్వత్రిక అంగీకారం రెండింటినీ ప్రపంచానికి బోధించిన మతానికి చెందినందుకు నేను గర్విస్తున్నాను. మేము విశ్వవ్యాప్తసహనాన్ని మాత్రమే నమ్ముతాము, మేము అన్ని మతాలూ నిజమని అంగీకరిస్తాం’’ అన్నారు. తిరిగి 1896లో లండన్లో... ‘‘భారతీయులు ప్రజాస్వామ్యాన్ని హత్తుకుంటారు. ఐక్యతను, సమానత్వాన్ని ప్రతిష్ఠి స్తారు’’ అని పునరుద్ఘాటించారు. భారతదేశం ఆలింగనం చేసుకోవాలని వివేకానంద ఆశించిన ప్రజాస్వామ్యం, భారత గడ్డపై ప్రతిష్ఠించాలని ఆయన కోరుకున్న ఐక్యత, నాటాలనుకున్న సమానత్వపు మొక్కలు.. భారత రాజ్యాంగం అమోదం పొందిన 1949 నాటి నుండి కనిపించాయి. దాని పీఠిక సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం; ఆలోచన, వ్యక్తీకరణ,నమ్మకం, విశ్వాసం, ఆరాధనా స్వేచ్ఛ; హోదా, అవకాశాల సమా నత్వం; అలాగే... సోదరత్వం, వ్యక్తి గౌరవం, దేశ ఐక్యత, సమగ్ర తలకు హామీ ఇస్తోంది. తదుపరి 75 సంవత్సరాలలో, కొన్ని తీవ్రమైన మినహాయింపులను పక్కన పెడితే, భారతదేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆదేశాలను ఉల్లంఘించకుండా చాలా వరకు దూరంగా ఉన్నాయి. అయితే, ఆగ్రహం పెద్ద సంఖ్యలో ప్రజలను ఉత్తేజపరిచినప్పుడు, హింసను నియంత్రించడానికి అధికారులు నిరాకరించినప్పుడు రాజ్యాంగ వాగ్దానాలు మృతప్రాయంగా మారటం తెలిసిందే. సుప్రీంకోర్టు తన 2019 నాటి అయోధ్య తీర్పులో పేర్కొన్నట్లుగా, 1992 డిసెంబర్లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఇదే జరిగింది. 2019 నాటి ఆ తీర్పులో, మసీదు ఉన్న మైదానంలో రామమందిరాన్ని నిర్మించడానికి సుప్రీంకోర్టు అధికారం ఇచ్చింది. ఆ మసీదును ప్రార్థనా స్థలాల చట్టం–1991 నుండి జాగ్రత్తగా మినహాయించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇతర మసీదుల పునాదులపైన కూడా మును పటి హిందూ పుణ్యక్షేత్రాల చిహ్నాల కోసం శోధించడాన్ని అనుమతిస్తే, ఆ చట్టానికి అర్థమే లేకుండా పోతుంది. పైగా, అటువంటి తీర్పు... హిందూ మతం అసహనంతో, ఆగ్రహంతో కూడుకున్నదనీ; వివేకా నంద, ఆయనతో ఏకీభవించిన నాలుగు తరాల హిందూ ఆలోచనా పరులు ఆనాడు వాస్తవాన్ని గ్రహించలేకపోయారనీ ప్రపంచానికి చాటి చెబుతుంది.అతని లేదా ఆమె పూర్వీకుడు నా పూర్వీకుడికి హాని కలిగించినందున నేను ఎవరినైనా గాయపరచడం చట్టబద్ధం కాదని ఆధునిక ప్రపంచం అంగీకరిస్తుంది. మూలవాస ఆఫ్రికన్లు, అమెరికన్లు, కెనడి యన్లు, ఇంకా ఆస్ట్రేలియన్లు స్వదేశీ అనుమతి లేకుండా తమ భూమిలో స్థిరపడిన బయటివారి (భారతదేశం నుండి వచ్చిన వ్యక్తులు సహా) వారసులను బహిష్కరించాలని డిమాండ్ చేయరు. ఈ ‘అంగీకారాన్ని’ మనం మానవత్వం, ఇంగితజ్ఞానం, వ్యావహారిక సత్తా వాదం లేదా మరొకదాని ఘనతగా పేర్కొన్నప్పటికీ, అది మనప్రపంచ పురోగతి గాథను గుర్తించింది.భారత రాజ్యాంగానికి శతాబ్దాల ముందు.. ముస్లింలు, క్రైస్త వులు, పార్సీలు, యూదులను భారతదేశపు మట్టిలో చట్టబద్ధమైన భాగస్వాములుగా మన దేశ మూలవాసులు అంగీకరించారు. మన పూర్వీకులు మానవత్వాన్ని ఒకే కుటుంబంగా అర్థం చేసుకున్నారు. ప్రాచీన సంస్కృత పదబంధమైన ‘వసుధైక కుటుంబం’, ప్రాచీన తమిళ పద్యమైన ‘యాదుం ఊరే యావరం కేళిర్’ అర్థం కూడా ఇదే.నేను 1999లో రాసిన పుస్తకం, ‘రివెంజ్ అండ్ రీకన్సిలియేషన్: అండర్స్టాండింగ్ సౌత్ ఏషియన్ హిస్టరీ’లో పేర్కొన్నట్లుగా, బుద్ధుడు ప్రబోధించిన సోదరభావానికీ, మహా భారత కథలో ఆధిపత్యం వహించిన ప్రతీకారానికీ మధ్య ఏదో ఒక దానిని మన ఉపఖండంలోని ప్రజలు ఎంచుకోవాల్సి వచ్చింది.ప్రతీకారం సూత్రంగా, సర్వత్రా సంహారమే పరాకాష్ఠగా కనిపించే మహాభారతంలో కూడా, సయోధ్య స్ఫూర్తి, పాఠకుల హృద యాన్ని సాంత్వనపరిచే శక్తిమంతమైన మినహాయింపులు ఉండటం కనిపిస్తుంది. భారత ఇతిహాసంలోని అత్యంత నాటకీయ సన్నివేశా లలో, యుద్ధం ముగిసిన తర్వాత, దాదాపు ప్రతి కథానాయకుడు మరణానికి గురైన తరువాత, దుఃఖంలో ఉన్న స్త్రీలను, జీవించి ఉన్న కొంతమంది యువరాజులను పురాణకర్త వ్యాసుడు ఓదార్చాడు. వ్యాసుడు అప్పుడప్పుడు కథా సన్నివేశాలలోకి ప్రవేశిస్తాడు. ‘నేను మీ దుఃఖాన్ని పోగొడతాను’ అని దుఃఖిస్తున్న వారితో చెబుతూ, వ్యాసుడు చనిపోయిన వారిని భాగీరథీ నదీ జలాల నుండి బయటకు వచ్చేలా చేశాడు: ద్వేషం అసూయ నుండి ప్రక్షాళన కాబడినది / తండ్రిని తల్లిని కొడుకు కలిసాడు / భార్య భర్తను కలుసుకున్నది / స్నేహితుడు స్నేహితుడిని పలకరించాడు/ పాండవులు కర్ణుడిని కలి శారు/ అతడిని కౌగిలించుకున్నారు/ అని రాశాడు. అది సయోధ్యకు సంబంధించిన దృశ్యం. అక్కడ దుఃఖం లేదు, భయం లేదు, అను మానం లేదు, నిందలు లేవు. అది ప్రేమించే మనసుల కలయిక తప్ప మరేమీ కాదు. (పి లాల్ వ్యాఖ్యానం). అయితే తెల్లవారుజాము నాటికి, ఆ కలయిక కల ముగిసింది. జీవం పోసుకున్న వారు భాగీరథీ నదీ జలాల లోతుల్లోకి తిరిగి వెళ్లి పోయారు. పాండవుల ఆధిపత్యాన్ని ప్రకటించడానికి అర్జునుడు సాగించిన యుద్ధానంతర ఉపఖండ దండయాత్ర సమయంలో మరొక సయోధ్య దృశ్యం మనకు కనిపిస్తుంది. సైంధవ భూభాగంలో (సింధ్లో) ఓడిపోయిన కౌరవుల సోదరి దుశ్శల, ఒక బిడ్డతో కలిసి అర్జునుడిని కలుస్తుంది. అర్జునుడు అన్యాయంగా చంపిన కౌరవ పక్ష యోధుడైన జయద్రథుడిని దుశ్శల వివాహం చేసుకుంది. అర్జునుడు ఆమె కొడుకు సురథుడి గురించి దుశ్శలను అడుగుతాడు. ‘అతను చనిపోయాడు,’ అని ఆమె చెబుతుంది, ‘అతను విరిగిన హృదయంతో మరణించాడు, ఎందుకంటే నీవు అతని తండ్రిని చంపావని సురధు నికి తెలుసు. నేను ఇప్పుడు సురథుడి కొడుకును నీ వద్దకు తీసుకు వస్తాను. నేను నీ రక్షణను కోరుతున్నాను’’ అంటుంది. అర్జునుడు దుశ్శలని అక్కున చేర్చుకుని తన రాజభవనానికి రావాలని ఆమెను కోరాడు. తర్వాత అర్జునుడు సైంధవులతో సంధి చేసుకున్నాడు.మనం ఇప్పుడు ఒకటే ప్రశ్నించాలి. ఈరోజు భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడం కంటే నిన్నటి రోజుని పునర్నిర్మించడానికి ప్రయత్నించడం ముఖ్యమా? అని. గతం ముగిసిపోయింది. మనం దానిని మార్చలేం. జరిగిపోయిన దాన్ని పునరుద్ధరించలేము. అవును, మనం చరిత్ర నుండి కేవలం నేర్చుకోగలం. గతాన్ని పునర్వ్యవస్థీకరించే ప్రచా రాలు వర్తమానాన్ని గాయపరుస్తాయనేది చరిత్ర నేర్పే పాఠాలలో ఒకటి.- వ్యాసకర్త సంపాదకుడు, ప్రముఖ రచయిత- రాజ్మోహన్ గాంధీ -
రాజ్యాంగంపై చర్చ.. కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన నిర్మలా సీతారామన్
ఢిల్లీ: రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సమయంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, కాంగ్రెస్పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. పౌర హక్కులను పరిమితం చేయడానికి కాంగ్రెస్ పదే పదే రాజ్యాంగాన్ని సవరించిందని ఆరోపించారు.రాజ్యసభలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘గత ఏడు దశాబ్దాలలో మన రాజ్యాంగంలో అనేక సవరణలు జరిగాయి. నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో రాజ్యాంగంలో వాక్ స్వాతంత్య్రాన్ని అరికట్టేలా మొదటి సవరణ జరిగింది. మీడియా సంస్థలు ముఖ్యంగా రాజకీయంతో సంబంధం ఉన్న కీలక అంశాలపై లోతుగా విచారణ జరపరడాన్ని నెహ్రూ వ్యతిరేకించారని, పత్రికా స్వాతంత్య్రాన్ని తగ్గించేందుకు రాజ్యాంగాన్ని ఆమోదించిన ఏడాదిలోపే రాజ్యాంగాన్ని సవరించారని పేర్కొన్నారు.Constitution Debate | In Rajya Sabha, Union Finance Minister Nirmala Sitharaman says, "...The Congress party brazenly kept amending the Constitution to help the family and dynasty... These amendments were not to strengthen democracy but to protect those in power, the process was… pic.twitter.com/lSRyqS4FX5— ANI (@ANI) December 16, 2024 గత వారం లోక్సభలో రెండు రోజులపాటు జరిగిన వాడివేడి చర్చల తర్వాత ఇవాళ సీతారామన్ రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చను ప్రారంభించారు . ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్పై ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్చ జరిగింది.పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు కీలక డిమాండ్ చేశాయి. దీంతో పాటు అదానీ వివాదం, జార్జ్ సోరోస్ ఆరోపణలు , ఉపరాష్ట్రపతి,రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసు వంటి అంశాలు ఉభయ సభల్లో గందరగోళానికి దారి తీశాయి. -
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగంపై దుమారం
-
సంవిధాన్.. సంఘ్ కా విధాన్ కాదు
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగం అంటే సంఘ్ విధానం కాదన్న సంగతి ప్రధాని నరేంద్ర మోదీ అర్థం చేసుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ వాద్రా అన్నారు. భారత్ కా సంవిధాన్ సంఘ్ కా విధాన్ కాదని తేల్చిచెప్పారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఆమె శుక్రవారం లోక్సభలో 32 నిమిషాలపాటు హిందీ భాషలో మాట్లాడారు. రాజ్యాంగంపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. బీజేపీపై విరుచుకుపడ్డారు. న్యాయం, ఐక్యత, భావప్రకటనా స్వేచ్చకు రాజ్యాంగం ఒక రక్షణ కవచమని ఉద్ఘాటించారు. అలాంటి మహోన్నత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేసిందని ధ్వజమెత్తారు. ప్రియాంక ఇంకా ఏం మాట్లాడారంటే... నెహ్రూ పాత్రను ఎవరూ చెరిపేయలేరు ‘‘ఆర్థిక న్యాయానికి, రైతులకు, పేదలకు భూములు పంపిణీకి చేయడానికి మన రాజ్యాంగమే పునాది వేసింది. బీజేపీ నేతలు తరచుగా జవహర్లాల్ నెహ్రూను వేలెత్తి చూపుతున్నారు. వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నెహ్రూపై నిందలు వేస్తున్నారు. దేశం కోసం మీరేం చేస్తున్నారో చెప్పకుండా నెహ్రూను విమర్శిస్తే లాభం లేదు. గతంలో అది జరిగింది, ఇది జరిగింది అని బీజేపీ సభ్యుల విమర్శలు చేస్తున్నారు. రాజకీయ న్యాయం గురించి మాట్లాడుతున్నారు. డబ్బు బలంతో ప్రభుత్వాలను పడగొట్టింది మీరు కాదా? మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్లో రాజ్యాంగం అమలు కాలేదు. బీజేపీకి నిజంగా ధైర్యం ఉంటే బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి. అప్పుడు అసలు నిజం ఏమిటో బయటపడుతుంది. మోదీకి ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు గతంలో రాజులు మారువేషాల్లో ప్రజల్లోకి వెళ్లేవారని చదువుకున్నాం. తమ పనితీరు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో రాజులు స్వయంగా తెలుసుకొనేవారట. తమపై ప్రజల ఆరోపణలు ఏమిటో గ్రహించేవారట. ఇప్పటి రాజు(నరేంద్ర మోదీ) వేషాలు మార్చేయడంలో ఆరితేరిపోయారు. కానీ, ప్రజల్లో వెళ్లే ధైర్యం గానీ, ఆరోపణలు వినే ధైర్యం గానీ ఆయనకు లేదు. మన ప్రధానమంత్రి రాజ్యాంగం ఎదుట తలవంచి నమస్కరించారు. రాజ్యాంగానికి నుదురు తాకించారు. సంభాల్, హథ్రాస్, మణిపూర్లో న్యాయం కోసం ఆక్రోశించినప్పుడు ఆయన మనసు చలించలేదు. ఆయన నుదుటిపై చిన్న ముడత కూడా పడలేదు. రాజ్యాంగాన్ని మోదీ అర్థం చేసుకోలేదు.భయాన్ని వ్యాప్తి చేసినవారు భయంతో బతుకుతున్నారు దేశంలో కుల గణన జరగాలన్నదే ప్రజల అభిమతం. అందుకోసం వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన ప్రారంభించాలి. కేవలం ఒక్క బిలియనీర్(గౌతమ్ అదానీ) కోసం దేశ ప్రజలంతా కష్టాలు అనుభవించాలా? దేశంలో అసమానతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. బ్రిటిష్ పాలనలో ఉన్నట్లుగానే నేడు భయం అంతటా ఆవహించింది. స్వాతంత్య్రం కోసం పోరాడిన గాం«దీజీ భావజాలం కలిగిన వ్యక్తులు ఒకవైపు, బ్రిటిషర్లతో అంటకాగిన భావజాలం కలిగిన వ్యక్తులు మరోవైపు ఉన్నారు. భయానికి ఒక లక్షణ ఉంది. భయాన్ని వ్యాప్తి చేసేవారే ఆదే భయానికి బాధితులవుతారు. ఇది సహజ న్యాయం. నేడు దేశంలో భయాన్ని వ్యాప్తి చేసినవారు అదే భయంతో బతుకున్నారు. చర్చకు, విమర్శకు భయపడుతున్నారు’’ అని ప్రియాంక అన్నారు. -
రాజ్యాంగం అంటే డాక్యుమెంట్ కాదు : ప్రధాని మోదీ
ఢిల్లీ : రాజ్యాంగం అంటే డాక్యుమెంట్ కాదు’ అని అన్నారు ప్రధాని మోదీ. సుప్రీంకోర్టులో దేశ 75వ రాజ్యాంగ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యాంగంపై ప్రసంగించారు. రాజ్యాంగం అంటే డాక్యుమెంట్ కాదు. రాజ్యాంగం అంటే స్పూర్తి అని అన్నారు. Addressing a programme marking #75YearsOfConstitution at Supreme Court. https://t.co/l8orUdZV7Q— Narendra Modi (@narendramodi) November 26, 2024 -
రాజ్యాంగంలో సావర్కర్ స్వరం ఉందా?: రాహుల్ గాంధీ
సాక్షి, ఢిల్లీ: రాజ్యాంగం అనేది కేవలం ఒక పుస్తకం కాదు. అది వేల సంవత్సరాల భారతదేశ ఆలోచనల సమాహారమని చెప్పుకొచ్చారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఇదే సమయంలో తెలంగాణలో కులగణన చరిత్రాత్మక అడుగు అని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ సంవిదాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ..‘రాజ్యాంగం అనేది కేవలం ఒక పుస్తకం కాదు. అది వేల సంవత్సరాల భారతదేశ ఆలోచనల సమాహారం. సత్యం, అహింసలతో ముడిపడి ఉంది. రాజ్యాంగంలో సావర్కర్ జీ స్వరం ఉందా? అని ప్రశ్నించారు. హింసకు గురిచేయాలి, మనుషులను చంపాలి, అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడపాలి అని ఎక్కడైనా రాసిందా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.#WATCH | Delhi: At the Constitution Day program at Talkatora Stadium, Lok Sabha LoP & Congress MP Rahul Gandhi says, "Does it (Constitution) have Savarkar ji's voice? Is it written somewhere in it that violence should be used, people should be killed or that the govt should be… https://t.co/tYELczHI6E pic.twitter.com/vIaY4TRBXY— ANI (@ANI) November 26, 2024ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ మాట్లాడుతూ..‘తెలంగాణలో కులగణన చరిత్రాత్మక అడుగు. అక్కడ కుల గణన మొదలు పెట్టాం. కుల గణనలో అడిగే ప్రశ్నలు ఒక గదిలో కూర్చొని 15 మంది రూపొందించలేదు. కులగణనలో అడిగే ప్రశ్నలు తెలంగాణ ప్రజలే డిజైన్ చేశారు. ఇది ప్రజా ప్రక్రియ. భవిష్యత్లో కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కుల గణన చేస్తాం.బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏం చేసినా సరే కుల గణన ద్వారా రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితి ఎత్తివేస్తాం. కుల గణన అనేది నేను పార్లమెంట్లో రాజ్యాంగంపై చేసిన హామీ. కుల గణనను పాస్ చేసి చూపిస్తా. అందరికీ సమాన హక్కు కోసం పోరాడుతున్నాం. కుల గణన ద్వారా ప్రజా సమాచారం తెలుస్తుంది. దీని ద్వారా పాలసీలు నిర్ణయించబడతాయి. ఐదు ఆరు శాతం ఉన్న వారు దేశాన్ని కంట్రోల్ చేస్తున్నారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కులగణన జరుగుతోంది. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యం. అందుకే కులగణన సర్వే చేపట్టాం. దేశవ్యాప్తంగా కుల గణన అనేది కాంగ్రెస్ ఆధ్వర్యంలో సాధించే సామాజిక న్యాయం. ఇది మూడో ఉద్యమం. దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, బ్యాంకుల జాతీయం వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం మొదటి దశ సాధిస్తే... రాజీవ్ గాంధీ హయాంలో 18 ఏళ్లకే ఓటు హక్కు.. మండల్ కమిషన్ నివేదిక వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం 2.0 పూర్తయింది. ఇప్పుడు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీల ఆధ్వర్యంలో కుల గణనకు సామాజిక న్యాయం 3.0 ప్రారంభమైంది. సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ మహా యుద్ధం ప్రకటించారు. ఆయన బాటలో నడుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సామాజిక, ఆర్థిక, కుల సర్వే మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో సర్వే 92 శాతం పూర్తయింది.పదేళ్లుగా దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, రాజ్యాంగ రక్షణకు రాహుల్ గాంధీ దేశ వ్యాప్త ఉద్యమం చేపట్టారు. రాహుల్ చేపపట్టిన ఉద్యమంలో ప్రజలు భాగస్వాములైనందునే మోదీ 400 వందల సీట్లు అడిగితే ప్రజలు కేవలం 240 సీట్లకు పరిమితం చేశారు. దేశవ్యాప్తంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో మోదీని ప్రజలు ఓడిస్తున్నారు.. ఇందుకు వయనాడ్, నాందేడ్ లోక్సభ ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం. మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలిస్తే, జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి గెలిచింది. రాజ్యాంగ రక్షణ ఉద్యమం కేవలం రాహుల్ గాంధీకి పరిమితమైన అంశంగా అనుకోవద్దు. మనమంతా అందులో భాగస్వాములు కావాలి. ప్రస్తుత పోరాటం రాజ్యాంగ రక్షకులు.. రాజ్యాంగ శత్రువుల మధ్యనే ఉందని గుర్తుంచుకోవాలి. మహాత్మా గాంధీ పరివార్ రాజ్యంగ రక్షణకు పూనుకుంటే.. మోదీజీ పరివార్ అంటే సంఘ్ పరివార్ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని విమర్శించారు.ఇక, అంతకుముందు వయనాడ్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని కలిసి సీఎం రేవంత్, భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. -
రాజ్యాంగ నిర్మాతలకు వందనం
భారతీయ విలువలు, ఆదర్శాలను ప్రతిబింబించేలా పరమ పవిత్రమైన భారత రాజ్యాంగాన్నిరూపొందించుకుని, 1949 నవంబర్ 26 నాడు ఆమోదించుకున్న రోజు దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చింది. ఆ రోజునే మనం ‘సంవిధాన్ దివస్’ (రాజ్యాంగ దినోత్సవం)గా జరుపుకొంటున్నాం. నేడు 75వ రాజ్యాంVýæ దినోత్సవం కావడం విశేషం. అయితే, రాజ్యాంగ నిర్మాణం చిన్న విషయం కాదు. సిద్ధాంత రాద్ధాంతాల సంఘర్షణ నుంచి వచ్చిన ఇది... ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్. భారతదేశ పురోగతి, ప్రజల సంక్షేమాలకు ఇది తోడ్పాటునందిస్తోంది. ఎప్పటికప్పుడు వ్యవస్థను పటిష్ఠపరుస్తూ ‘సజీవ పత్రం’గా నిరంతర మార్గదర్శనం చేస్తోంది.రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టిభారతదేశ చరిత్రలో స్వాతంత్య్ర సిద్ధి ఓ ప్రత్యేకమైన సందర్భం. భారతీయుల భవిష్యత్తును నిర్దేశించిన రోజది. రాజకీయంగా స్వాతంత్య్రాన్ని పొందాం. కానీ, భారతీయ విలువలకు అనుగుణంగా స్వపరిపాలన జరగాలన్న బలమైన ఆకాంక్ష భారతీయుల్లో వ్యక్తమైంది. దీనికి ప్రతిరూపంగానే, భారతీయ విలువలు, ఆదర్శా లను ప్రతిబింబించేలా పరమ పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించుకుని, 1949 నవంబర్ 26 నాడు ఆమోదించుకున్న రోజు దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చింది.నాటి నుంచి గత 75 ఏళ్లుగా భారతదేశంలో మూలవిలువలు, సామాజికస్పృహలను ‘భారత రాజ్యాంగం’ సంరక్షిస్తోంది. మారుతున్న కాలానికి అను గుణంగా, ఎప్పటికప్పుడు వ్యవస్థను పటిష్ఠపరుస్తూ ‘సజీవ పత్రం’గా నిరంతర మార్గదర్శనం చేస్తోంది. భారతీయ ఆత్మను, అస్తిత్వాన్ని సంరక్షించడం అనే రెండు అంశాల అద్భుత సమ్మేళనంగా మన రాజ్యాంగం ముందుకు నడిపిస్తోంది. రాజ్యాంగ నిర్మాతల ఈ ముందుచూపే రాజ్యాంగ సభ చర్చల్లో ప్రతిబింబించింది.1949 సెప్టెంబర్ 18 నాడు భారత రాజ్యాంగ సభలో చర్చ సందర్భంగా... స్వాతంత్య్ర సమర యోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు కల్లూరు సుబ్బారావు తన తొలి ప్రసంగంలో, రుగ్వేదంలో భారత్ అనే పదాన్ని వాడిన విషయాన్ని, వాయు పురాణంలో (45వ అధ్యాయం 75వ శ్లోకం) భారతదేశ సరిహద్దుల గురించి ఉన్న వివరణను తెలియజేశారు. ఇదంతు మాధ్యమం చిత్రం శుభాశుభ ఫలోదయం, ఉత్తరం యత్ సముద్రస్య హిమవన దక్షిణం చ యత్’... హిమాలయాల దక్షిణం వైపు, సముద్రానికి ఉత్తరం వైపున్న పవిత్ర భూమే భారతమాత అని అర్థం. భారత్ అనేది కేవలం ఒక పదం కాదు, వేలాది సంవత్సరాల ఘనమైన వార సత్వ విలువలకు సజీవ రూపం అని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఆనాటి కాంగ్రెస్ సిద్ధాంతంలో, నేటి కాంగ్రెస్ ఆలోచనలో నక్కకూ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది. వారు తరచుగా భారతదేశపు నాగరిక విలువలను అవమానించేలా, దేశాన్ని ‘నెగోషి యేటెడ్ సెటిల్మెంట్’ అని వ్యాఖ్యానిస్తున్నారు.1948 నవంబర్ 4న రాజ్యాంగ సభ చర్చలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాట్లాడుతూ... భారతదేశం ఓ అవిభాజ్య భూఖండం అనీ, దేశం పరిపాలనా సౌలభ్యం కొరకు వేర్వేరు రాష్ట్రాలుగా విభజించబడి నప్పటికీ... ఈ దేశ అధికారం ఒకే మూలం నుంచి ఉద్భవిస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగ పీఠికలో ‘సోషలిస్ట్’ అనే పదాన్ని చేర్చాలన్న చర్చను అంబేడ్కర్ వ్యతిరేకించారు. ‘రాజ్యా నికి సంబంధించిన విధానం ఎలా ఉండాలి? సామాజిక, ఆర్థిక కోణంలో సమాజ నిర్వహణ ఎలా జరగాలి? వంటి అంశాలను సమయానుగుణంగా ప్రజలే నిర్ణయించుకోవాలి’ అని స్పష్టం చేశారు. రేపటి రోజు సోషలిజం కంటే మంచి విధానాలు వస్తే, వాటిని రాజ్యాంగంలో చేర్చుకుని, అమలుచేసుకునే అవకాశం రానున్న తరాలకు ఉండాలనేది అంబేడ్కర్ భావన. ఈ సౌలభ్య విధానాన్ని సద్వినియోగం చేసుకుంటూ... 1991లో లైసెన్స్ రాజ్ నుంచి... ఉదారవాద, సరళీకృత ఆర్థిక వ్యవస్థకు బాటలు పడ్డాయి. నాడు రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ సభ వేదిక ద్వారా చేసిన సమగ్రమైన చర్చలు... నేటికీ వివిధఅంశాలపై లోతైన అవగాహనను కల్పిస్తున్నాయి. రాజ్యాంగ సభలో అంబేడ్కర్ మాట్లాడుతూ... రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా సౌభ్రాతృత్వం, సమానత్వం పదాలు సరిగ్గా అమలై అందరికీ అభివృద్ధి ఫలాలు అందినపుడే, నిజమైన జాతిగా మనం పురోగతి సాధించినట్లుగా భావించాలన్నారు. 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంత్యోదయ నినాదంతో, ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ విధానంతో సమగ్ర సాధికారత కోసం పనిచేస్తున్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచే క్రమంలో... సాధికారత అనేది ప్రతి పౌరుడి సహజమైన జీవన విధానంగా, భారతదేశ పురోగతిలో అంతర్లీనంగా ఉన్నటువంటి అంశంగా మారిపోయింది.ముద్ర యోజన, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలు, స్వచ్ఛభారత్, బేటీ బచావో–బేటీ పఢావోవంటి సామాజిక ఉద్యమాలు దేశం నడుస్తున్న దిశను పునర్నిర్వచించాయి. ప్రభుత్వ నియంత్రణలో ఉండే సోషలిజం అనే భావన నుంచి ఏనాడో బయటకు వచ్చి, అందరి సంక్షేమం కోసం సామాజిక న్యాయమనే నినాదంతో ప్రతి ఒక్కరికీ విస్తృతమైన అవకాశాలు కల్పిస్తున్నాం. వందకుపైగా యూనికార్న్స్ (1 బిలి యన్కు పైగా పెట్టుబడులున్న కంపెనీలు)తో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా నిలిచింది. వ్యాక్సిన్ సప్లయ్, రక్షణ రంగ ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్గా మన్ననలు అందుకుంటోంది. దేశంలో సెమీకండక్టర్ల తయారీ ఉద్యమం ఊపందుకుంది. ఫి¯Œ టెక్, హెల్త్ టెక్ సంస్థలు అంతర్జాతీయ వేదికపై భారత గౌరవాన్ని ఇనుమ డింపజేస్తున్నాయి. త్వరలోనే ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది.దేశం ఇలా అన్ని రంగాల్లో అగ్రదేశాల సరసన నిలుస్తున్న సందర్భంలో, భారతీయుల సామర్థ్యంపై విశ్వాసాన్ని ఉంచకుండా, సమాజాన్ని విభజించేందుకు, సంపదను అందరికీ పంచేవిషయంలో అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నాలు జరగడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వెళ్లడమే అవుతుంది. ప్రతి భారతీ యుడి శక్తి సామర్థ్యాలపై విశ్వాసం ఉంచి, అందరికీ కలుపుకొని ముందుకెళ్తూ, వికసిత భారత లక్ష్యాలను చేరుకోవాలని సంకల్పించుకున్న ‘అమృత కాల’మిది. వ్యక్తులకు సాధికారత కల్పించినపుడే, సుసంపన్నమైన దేశంగా ఎదగడానికి, ప్రపంచానికి మరోసారి విశ్వగురుగా మారడానికి విçస్తృత అవకాశాలుంటాయి. -జి. కిషన్ రెడ్డి, వ్యాసకర్త కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి; బీజేపీ తెలంగాణ అధ్యక్షుడుమన రాజ్యాంగ నిర్మాతలుభారత రాజ్యాంగ నిర్మాణం పూర్తయిన రోజు నవంబర్ 26. కొన్ని అత్యవస రమైన అధికరణాల అమలు వెంటనే మొదలైంది. రెండు నెలల తరువాత పూర్తి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అదే గణతంత్ర దినోత్సవం. రాజ్యాంగ నిర్మాణం చిన్న విషయం కాదు. సిద్ధాంత రాద్ధాంతాల సంఘర్షణ నుంచి వచ్చిన ఇదొక భగవద్గీత, బైబిల్, ఖురాన్. దీని రచనలో భాగస్వాములైన మహానుభావు లను తలుచుకోవడం మన కర్తవ్యం.బాబాసాహెబ్ బి.ఆర్.అంబేడ్కర్: అధికరణం 32 లేకపోతే రాజ్యాంగమే లేదు. నాయకుల నియంతృత్వం తప్ప స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం వంటి మాటలే ఉండక పోయేవి. కీలకమైన ఆర్టికల్ 32 రాసింది అంబేడ్కర్. ఆయన ఒక న్యాయవేత్త, ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, సంఘ సంస్కర్త. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటి న్యాయశాఖ మంత్రి. పౌర హక్కులకు కీలకమైన ఆర్టికల్ 32 మొత్తం రాజ్యాంగాన్ని బతికించే శక్తి కలిగినది. ఏ అన్యాయం జరిగినా నేరుగా సుప్రీంకోర్టునే అడిగే హక్కును ఇచ్చిన ఆర్టికల్ ఇది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)కు పునాది ఇదే. ‘‘భారత రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన ఆర్టికల్ ఏదని అడిగితే, ‘ఆర్టికల్ 32’ అని చెబుతాను. అది లేకుండా ఈ రాజ్యాంగం శూన్యం అవుతుంది... ఇది రాజ్యాంగ ఆత్మ, హృదయంవంటిది’’ అని అంబేడ్కర్ 1948 డిసెంబర్ 9న జరిగిన రాజ్యాంగ సభ చర్చల్లో ప్రకటించారు.అసమానతలను, వివక్షను అంతం చేసేందుకు అంబేడ్కర్ రాజ్యాంగ రూపకల్పనలో తానూ ఉండాలని అనుకున్నారు. మొత్తం భారత రాజ్యాంగ సంవిధానా నికి నిర్మాత అయినారు. 8 పనిగంటలు మొదలుకొని, ప్రసూతి సెలవుల వరకు కారణం ఆయనే. సమాన హక్కులు, సమాన అవకాశాలు అంబేడ్కర్ సిద్ధాంతం. భారతీయ రిజర్వ్ బ్యాంకు స్థాపనలో అంబేడ్కర్ ఆర్థిక సిద్ధాంతాలు కీలకపాత్ర పోషించాయి.దేవీ ప్రసాద్ ఖైతాన్: న్యాయవాది, స్వాతంత్య్ర సమర యోధుడు, రాజకీయవేత్త. కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యార్థి. ‘ఖైతాన్–కో’ లా ఫర్మ్ వ్యవస్థాప కులు. 1925లో ఏర్పడిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహ వ్యవస్థాపకులు. రచనా కమిటీ సభ్యు డిగా కొద్దికాలం పనిచేశారు. 1948లో మరణించడం వల్ల ఆ స్థానంలో టీటీ కృష్ణమాచారి వచ్చారు.సర్ సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా: న్యాయవాది, అస్సాం ముస్లిం లీగ్ నాయకుడు. 1936లో బ్రిటిష్ ఇండియాలో కాంగ్రెసేతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేసి అస్సాంకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి రాజ్యాంVýæ ముసాయిదా రూపకల్పన కమిటీకి ఎన్నికైన ఒకే ఒక్క సభ్యుడు. రాజ్యాంగ రచనలో పాలుపంచుకున్న ఒకే ఒక్క ముస్లిం లీగ్ సభ్యుడు కూడా. అస్సాం ఆర్థిక స్థిరత్వం, మైనారిటీ హక్కులను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్: తమిళ కుటుంబానికి చెందిన అయ్యర్ నెల్లూరులో పుట్టారు. ఈ ప్రాంతం అప్పట్లో మద్రాస్ స్టేట్లో ఉండేది. ఆయన అపారమైన జ్ఞానం కలిగిన గొప్పవాడని అంబేడ్కర్ స్వయంగా అంగీకరించారు. రాజ్యాంగంలో చేర్చవలసిన పౌరసత్వ హక్కులు, ప్రాథమిక హక్కుల గురించి బలంగా వాదించారు. ‘మన విధానాలు, నిబద్ధత విషయంలో జాతి, మతం లేదా ఇతర ప్రాతిపదికన వ్యక్తుల మధ్య లేదా వర్గాల మధ్య భేదాలు చూపకూడ’దని లౌకికరాజ్యం ఎందుకు అవసరమో చెప్పారు. సర్ బెనెగల్ నర్సింగ రావ్: మంగళూరు(కర్ణాటక)లో జన్మించిన బీఎన్ రావు బ్రిటిష్ ప్రభుత్వంలోఇండియన్ సివిల్ సర్వెంట్గా చేరారు. అనేక కోర్టులలో జడ్జిగా పనిచేశారు. బ్రిటిష్ ప్రభుత్వంలో పలు కమిటీలలో, పలు ముసాయిదాల తయారీలో ప్రముఖమైన వ్యక్తి. అంతర్జాతీయ న్యాయస్థానంలో జడ్జిగా, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ ప్రతినిధిగా ఉన్నారు. ఇప్పటికీ కొందరు భారత రాజ్యాంగాన్ని రచించింది అంబేడ్కర్ కాదనీ, బి.ఎన్.రావ్ అనీ వాదించే వాళ్లున్నారు. ఆయన బ్రిటిష్ పాలనలో తయారు చేసిన ‘భారత ప్రభుత్వ చట్టం 1935’ రాజ్యాంగానికి మూల రూపమని అనేవారూ ఉంటారు.సర్ బ్రజేంద్రలాల్ మిట్టర్: పశ్చిమ బెంగాల్కి చెందిన మిట్టర్ బరోడా దివా¯Œ గా వ్యవహరించారు. భారత్ రాజ్యాంగ రచనలో భాగంగా, దేశంలో సంస్థానాలు విలీనం కావడానికి నియమాలు, దేశ, రాష్ట్ర, జిల్లా పాలనకు సంబంధించిన అంశాలపై పనిచేశారు. (అనారోగ్యం కారణంగా మిట్టర్ రాజీనామా చేయ డంతో ఆ స్థానంలో ఎన్.మాధవరావు వచ్చారు.)కె.ఎమ్. మున్షీ: కన్నయ్యలాల్ మాణిక్లాల్ గుజరాత్లో జన్మించారు. న్యాయవాది, జాతీయోద్యమ నాయకుడు. ఘనశ్యామ్ వ్యాస్ కలంపేరుతో అద్భుతమైన రచనలు చేసిన వ్యక్తి. 1938లో గాంధీ సహాయంతో ‘భారతీయ విద్యా భవన్’ స్థాపించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురు కుగా పాల్గొన్నారు. రాజ్యాంగ రచనలో భాగంగా ప్రాథమిక హక్కులు, పౌరసత్వం, మైనారిటీ హక్కుల చర్చల్లో కీలక పాత్ర పోషించారు.సర్ నరసింహ గోపాలస్వామి అయ్యంగార్: ఆయన్ని ఎన్.జి.ఏ. అని పిలిచేవారు. మద్రాస్ నుంచి సివిల్ అధికారిగా పనిచేశారు. 1937లో జమ్మూ కశ్మీర్ ప్రధాన మంత్రిగా వ్యవహరించారు. వాక్ స్వాత్రంత్య్రం, భూములు సేకరిస్తే నష్టపరిహారాలు ఇవ్వడం, శాసనసభతో మరో మండలి ఉండాలని వాదించిన వారు. ఆంగ్లేయ రాజులు ఇచ్చిన గొప్ప పురస్కారాలను తిరస్కరించిన దేశభక్తుడు. కశ్మీర్కు సంబంధించి ఆర్టికల్ 370 రచించిన ముఖ్యుడు.ఎన్. మాధవ్ రావ్: మైసూర్ సివిల్ అధికారి. తరువాత ఆ రాజ్యానికి దివాన్ అయ్యారు. ఒరిస్సానుంచి సంస్థాన రాజ్యాల పక్షాన రాజ్యాంగ సభలో ప్రతినిధులైనారు. గ్రామపంచాయతీలు, సమాఖ్యలగురించి అడిగేవారు. ఇంక ఎంతోమంది మహానుభావులు రాజ్యాంగ నిర్మాణంలో పనిచేశారు. అందులో జగ్జీవన్ రామ్, జిరోమ్ డిసౌజా, మృదులా సారాభాయ్ వంటి పెద్దలున్నారు. వారందరికీ వందనాలు!మాడభూషి శ్రీధర్ , వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ -
మా మకుటం... సత్యమేవ జయతే!
మీరు గుడ్లురిమితే గుండెలు జారిపోవడానికి ఇక్కడ భీరువులెవరూ లేరు. మీరంతటి వీర వరేణ్యులు కూడా కారు! మీరు కళ్లెర్రజేస్తే కాలి బూడిదయ్యే కొంగలేమీ ఇక్కడ లేవు. తమరు తపోధనులైన కౌశికులు ఎంతమాత్రం కారు. మీ అధికారం సర్వంసహాధికారం కాదు. మీరు థామస్ హాబ్స్ ప్రతిపాదించిన ‘లెవయధాన్’ వంటివారు కారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన పరిమితులతో కూడిన అధికారం మాత్రమే మీ చేతిలో ఉన్నది. అదే రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు మాకు అండగా ఉన్నవి. ఆ హక్కుల్ని రక్షించడానికి న్యాయస్థానాలు దన్నుగా ఉన్నవి.రెండు వారాల కిందనే సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పిందో ఒకసారి గమనించండి. అచ్చం మీ సర్కారుకు మల్లేనే యూపీలోని యోగీబాబా సర్కార్ కూడా ఓ జర్నలిస్టుపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించింది. కేసు సుప్రీంకోర్టు తలుపు తట్టింది. జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం చేసిన వ్యాఖ్యానమేమిటో మళ్లీ ఒకసారి పరిశీలించండి. ‘‘ప్రజల భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని ప్రజాస్వామ్య దేశాలు గౌరవించాలి. భారత రాజ్యాంగంలోని 19 (1) (ఏ) అధికరణం పాత్రికేయుల హక్కులకు రక్షణ కల్పి స్తున్నది. పాత్రికేయుడు రాసిన వార్తా కథనం విమర్శనాత్మకంగా ఉన్నదనే నెపంతో అతడిపై క్రిమినల్ కేసులు పెట్టడానికి వీల్లేదు.’’సర్వోన్నత న్యాయస్థానం ఇంత స్పష్టంగా తేటతెల్లం చేసిన అంశంపై ఏపీ ప్రభుత్వ యంత్రాంగం కళ్లు మూసుకొని వ్యవహరిస్తున్నది. విజయవాడలో వరద సహాయక చర్యల్లో జరిగిన అవకతవకలను ‘సాక్షి’ పత్రిక ఎత్తిచూపింది. బాధ్యత గల ఫోర్త్ ఎస్టేట్గా అది దాని విద్యుక్త ధర్మం. ‘ముంపులోనూ మేసేశారు’ అనే శీర్షికతో ఏలినవారి ఆగ్రహానికి గురైన కథనాన్ని ప్రచురించాము. దానికి కట్టుబడి ఉన్నాము. మీ ప్రభుత్వ అధి కార నివేదికల ఆధారంగానే మేమా కథనాన్ని రాశాము. మేము స్వయంగా వండి వార్చిన కథనం కాదు. వరద సహాయ కార్య క్రమాల సమీక్ష పేరుతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశం సందర్భంగా రెవెన్యూ శాఖ ఇచ్చిన ప్రెజెంటేషన్లో పేర్కొన్న విషయాల్నే ‘సాక్షి’ ఉటంకించింది.కోటిమంది భోజనాల కోసం 368 కోట్లు ఖర్చు చేశామనీ, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు వగైరాలకు 23 కోట్లు ఖర్చయ్యాయనీ, వాటర్ బాటిల్స్కు 26 కోట్లు వెచ్చించామనీ, మొత్తం 534 కోట్లు పునరావాస సహాయ శిబిరం కోసం ఖర్చయినట్టు ఆ ప్రెజెంటేషన్లో ఉన్నది. ఈ లెక్కల్లోని అనౌచిత్యాన్ని ప్రజలు ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. సీపీఎం నేత బాబూ రావు ప్రజల సమక్షంలోనే ప్రభుత్వాన్ని నిలదీసిన వీడియో విస్తృతంగా సర్క్యులేషన్లో ఉన్నది. సరిగ్గా ఆ గణాంకాలనే పేర్కొంటూ, అవే ప్రశ్నల్ని ‘సాక్షి’ కూడా వేసింది.రెవెన్యూ శాఖ అధికారులు ప్రజంటేషన్ ఇచ్చినప్పుడు ఇవే అంకెల్ని చూసిన పెద్దలకు కోపం రాలేదు. జనంలో చర్చ జరుగు తున్నప్పుడు కూడా అంత కోపం రాలేదు. కానీ, ‘సాక్షి’లో కథనం రాగానే సుర్రున ప్రకోపించింది. ఆ కథనాన్ని ఖండ ఖండాలుగా ఖండించే బాధ్యతను ఇద్దరు మంత్రులకు అప్పగించారు. ఆ కార్యనిర్వహణ వారి వశం కాలేదు. వెంటనే కూటమిలోని ఒకటో నెంబరు పత్రిక రంగంలోకి దిగింది. అబ్బెబ్బే... సహాయ పునరావాస కార్యక్రమాలకు 139 కోట్లు మాత్రమే ఖర్చయింది. 534 కోట్లు అనే మాట అబద్ధమని ఆ పత్రిక తేల్చేసింది. అదే నిజమైతే కేంద్ర పరిశీలక బృందానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన నివేదికలో రిలీఫ్ క్యాంప్ ఖర్చు పేరుతో 534 కోట్లు ఎందుకు చూపెట్టారు? సదరు పత్రిక ఈ నివేదికను చూడలేదా? ప్రజల కళ్లకు గంతలు కట్టడ మనేది వారికి పెన్నుతో పెట్టిన విద్యగా చాలాసార్లు నిరూపణ అయింది.ఏ కొద్దిమందికో పులిహోర పొట్లాలు పంచి, కోటిమందికి పైగా పంచినట్టు లెక్క చూపడమేమిటి? ఆ పులిహోరకు ఒక్కో ప్లేటుకు 370 రూపాయల ఖర్చేమిటి? ఇటువంటి దగుల్బాజీ లెక్కలు చూసిన జనంలో ప్రభుత్వ ప్రతిష్ఠ బాగా పలుచబారింది. ఈ ప్రభుత్వ వ్యతిరేక వరదను ప్రతిపక్షంపైకి మళ్లించాలనే ఉద్దేశంతోనే తిరుపతి లడ్డూ వివా దాన్ని ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చారనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో అప్పుడే పొడసూపింది. కానీ, ఈ డైవర్షన్ స్కీమ్ ఫలితమివ్వకపోగా సర్కారుపైకే ఎదురు తిరిగింది.ఐదేళ్లు పరిపాలించడం కోసం గద్దెనెక్కిన ప్రభుత్వం ఐదు మాసాలు కూడా నిండకముందే ఒక ‘విఫల ప్రభుత్వం’గా ముద్ర వేయించుకోవడం ఒక అరుదైన సందర్భం. ఇటువంటి అప్రతిష్ఠను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూటగట్టుకున్నది. ఏ గడ్డి కరిచైనా అధికారంలోకి రావాలనే సంకల్పంతోనే ఎన్డీఏ కూటమి అలవికాని హామీలను ఇచ్చిందనే అభిప్రాయం ఆ రోజుల్లోనే రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది. అందువల్లనే మేనిఫెస్టో విడుదల రోజున బీజేపీ ప్రతినిధి దాని ప్రతిని పట్టుకోవడానికి నిరాకరించారనే వార్తలు వచ్చాయి. అటువంటి అంచనాలకు తగి నట్టుగానే ఈ నాలుగు నెలల పైచిలుకు కాలాన్ని కూటమి సర్కార్ నెట్టుకొచ్చింది.మేనిఫెస్టోలో హైలైట్గా వారు చెప్పుకున్న ‘సూపర్ సిక్స్’లో ఒక్క పథకం జోలికి ప్రభుత్వం వెళ్లలేకపోయింది. ఖజానాపై పెద్దగా భారం పడని ఉచిత గ్యాస్ సిలిండర్ల (ఏడాదికి మూడు) పంపిణీని ఈ దీపావళి నుంచి ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. మిగిలిన ఐదు పథకాల అమలు సంగతి దేవుడెరుగు. ఫలానా రోజు నుంచి వాటిని ప్రారంభిస్తామనే ఒక కనీస షెడ్యూల్ను కూడా ప్రభుత్వం విడుదల చేయలేకపోయింది.బుడమేరు వరదల సందర్భంగా ప్రభుత్వ నిష్క్రియా పరత్వం కొట్టొచ్చినట్టు కనబడింది. ముందుచూపు లేకపోవడం, వ్యూహరాహిత్యం వల్ల నలభై నిండు ప్రాణాలను బలి పెట్టవలసి వచ్చింది. మూడు లక్షలమంది తమ సర్వస్వాన్ని కోల్పోయారు. తమ యావజ్జీవిత ఆర్జితాన్ని గంగపాలు చేసు కోవలసి వచ్చింది. వారి జీవిత చక్రాన్ని వెనక్కు తిప్పడం సాధ్యమయ్యే పనేనా? ముందుగా హెచ్చరికలు జారీ చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారి విలువైన సామగ్రిని భద్రపరచుకునేందుకు దోహదపడి వుంటే ఇంత దుఃస్థితి ఏర్పడేది కాదు. అందుకే దీన్ని ‘విఫల ప్రభుత్వం’అంటున్నారు. రెగ్యులర్ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టలేక ఇంత కాలం నెట్టుకొచ్చిన ఏకైక ప్రభుత్వం కూడా ఈ దేశంలో ఏపీ కూటమి ప్రభుత్వమే! నాలుగున్నర నెలల కాలంలో 32 వేల కోట్లు అప్పు తెచ్చినందుకు, ప్రపంచ బ్యాంకు వాళ్లు నేడో రేపో విడుదల చేస్తారని చకోర పక్షుల్లా 15 వేల కోట్ల అప్పు కోసం ఎదురు చూస్తున్నందుకు ‘అప్పుల సర్కార్’ అని కూడా అనవచ్చు. ఇసుక రీచుల్లో, మద్యం షాపుల వేలాల్లో, ఉద్యోగుల బదిలీల్లో లంచాల దుర్గంధాన్ని వెదజల్లుతున్నందుకు ‘అవినీతి సర్కా ర్’గా పరిగణించాలి. తమ సంఖ్యా బలంపై ఆధారపడిన ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నా, ఆ సర్కార్లో తమకూ భాగ మున్నా సొంత రాష్ట్రానికి కించిత్ మేలును కూడా చేసుకోలేక పోయినందుకు ‘అసమర్థ ప్రభుత్వం’గా భావించాలి.సాధారణంగా కొత్త ప్రభుత్వాలపై ఇంత త్వరగా జనంలో వ్యతిరేకత వ్యక్తం కాదు. ఏపీ పరిణామం మాత్రం అసాధా రణమైనదే. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత బహిరంగంగా కనిపి స్తున్నది. కొత్త సర్కార్ తన హామీలు అమలు చేయకపోగా, జగన్ సర్కార్ అందిస్తున్న పథకాలను చేజార్చుకొని మోస పోయామన్న ఆవేదన ప్రజల్లో కనిపిస్తున్నది. హామీలు, స్కీముల సంగతి పక్కనబెట్టినా సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు కూడా దిగజారాయి. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను కొత్త ప్రభుత్వం గాలికొదిలేసింది. గ్రామీణ ఆరోగ్యం పడకేసింది. ప్రభుత్వ స్కూళ్ల నుంచి మళ్లీ ప్రైవేట్ బడులకు విద్యార్థుల వలస మొదలైంది. ఐదేళ్ల తర్వాత ఎరువుల కోసం, విత్తనాల కోసం రైతులు క్యూలైన్లలో నిలబడవలసి రావడాన్ని చూస్తున్నాము. ఇటువంటి అనేక కారణాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నాయి.క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలన్నీ బయటికొస్తే అసంతృప్తి మరింత పరివ్యాప్తమవుతుంది. అందుకే మాట వినని మీడియాను దండోపాయంతో దారిలోకి తెచ్చుకోవాలని భావిస్తున్నట్టుంది. ఆ ఉపాయంతోనే ‘సాక్షి’ మీద విజయవాడ పోలీస్ స్టేషన్లో ఒక అక్రమ కేసును బనాయించారు. మీడియాలో వచ్చిన వార్తలపై అభ్యంతరాలు ఉండటంలో తప్పులేదు. దాని మీద వివరణ ఇవ్వవచ్చు. దాన్ని ప్రచురించక పోతే అప్పుడు న్యాయస్థానానికి వెళ్లడం సదరు వ్యక్తులు లేదా వ్యవస్థలు చేయవలసిన పని. కానీ ఎకాయెకిన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం భావ వ్యక్తీకరణ హక్కుపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. రోజులు గడుస్తున్నకొద్దీ పరిణతి సాధించవలసిన ప్రజాస్వామ్యంలో ఇటువంటి దండనాథులు తలెత్తడం ఒక విషాదం.‘‘నీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ,నీ అభిప్రాయం వెల్లడించే హక్కు కోసం నా ప్రాణాలైనా ఇస్తా’’ అనేది మూడు శతాబ్దాల కిందటి ఫ్రెంచ్ ప్రజాస్వామిక నినాదం. ఇంత చరిత్ర ఉన్నది కనుకనే ప్రజాస్వామిక ‘హక్కు’ను ఏ పాలకుడూ చిరకాలం అణచిపెట్టి ఉంచలేడు. ‘‘కుటిలాత్ముల కూటమికొక త్రుటికాలపు విజయమొస్తే, విశ్వసృష్టి పరిణామం విచ్ఛిన్నం అవుతుందా?’’ అన్నారు గుంటూరు శేషేంద్రశర్మ. ఏమీ కాదు! ఈ దాదాగిరి త్రుటికాలమే. అక్రమ కేసులకు భయ పడేది లేదు. ప్రజల పక్షాన నిలబడకుండా కాడి వదిలేసేదీ లేదు. నిశ్చయంగా, నిర్భయంగా జనం గుండె గొంతుకై ‘సాక్షి’ ప్రతిధ్వనిస్తుంది. ‘సాక్షి’ పత్రిక మీద కనిపించే మకుటమే ‘సత్యమేవ జయతే’!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
జాతీయవాదమా? జాతీయోన్మాదమా?
ఇవాళ వ్యక్తులుగా పౌరులూ, సమాఖ్యలో భాగంగా ఉన్న రాష్ట్రాలూ తమ హక్కులను కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. జాతీయవాదం పేరుతో జాతీయోన్మాదాన్ని పాలకులు ప్రేరేపిస్తున్నారు. భిన్నాభిప్రాయాలను దేశ వ్యతిరేకమైనవిగా ముద్ర వేస్తున్నారు.రాజకీయ వ్యతిరేకతను, పౌర సమాజంలో భిన్నాభిప్రాయాలను కలిగివుండి, పాలనను విమర్శించే ప్రతి ఒక్కరినీ ప్రస్తుత భారత పాలక వ్యవస్థ తరచుగా దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించింది. ఈ ద్వేషభావం... అసలు జాతీయవాదం అంటే ఏమిటి, నిజమైన జాతీయవాది ఎవరు అనే మౌలిక ప్రశ్నలను లేవనెత్తింది. జాతీయవాదం అనే పదం విభిన్న రాజకీయ తత్త్వశాస్త్రాల ద్వారా ప్రత్యేకంగా గుర్తించబడింది.జాతీయవాదంపై వలసవాద వ్యతిరేక దృక్పథం... కుల, మత, వర్గ, ప్రాంతీయ అనుబంధాలతో సంబంధం లేకుండా నిర్దిష్ట రాజకీయ భౌగోళిక ప్రాంతంలో నివసించే ప్రజలందరినీ తప్పనిసరిగా కలుపుతుంది. శక్తిమంతమైన వలస పాలకుల నుండి భార తదేశం విముక్తి పొందేందుకు అటువంటి జాతీయవాద దృక్పథం చాలా అవసరం. ఆ విధంగా, స్వాతంత్య్ర పోరాటంలో అందరినీ కలుపుకొని పోవడం వల్ల జాతీయవాదపు రాజ్యాంగ దార్శనికత అభివృద్ధి చెందింది. ఇతర సంకుచిత గుర్తింపుల కన్నా మిన్నగా అది పౌరుల ప్రాధాన్యాన్ని గుర్తిస్తుంది.మతం లేదా జాతి వంటి వివాదాస్పద పరిగణనలపై ఆధారపడిన జాతీయవాద విభజన దృక్పథం తన లోపలే ఒక శత్రువును కనుగొంటుంది. విభజించి పాలించే వలస రాజ్యాల ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకున్న బ్రిటిష్ వలసవాద వారసత్వపు కమ్యూనల్ అవార్డు చరిత్ర దృష్ట్యా, భారతదేశంలోని మతపరమైన మెజారిటీ శక్తులు ఇప్పుడు ముస్లింలను లోపలి శత్రువుగా ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముస్లిం, ముజ్రా, మంగళసూత్ర, మందిర్ వంటివి సార్వత్రిక ఎన్నికలలో అధికార పార్టీ విభజిత ఎన్నికల చర్చలో ఆధిపత్యం చలా యించాయి. కానీ, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఇతర జీవనోపాధి సమస్యలు దాని పాలనను సవాలు చేశాయి.జాతీయవాదపు వలసవాద వ్యతిరేక దృక్పథంలోని మరొక కోణం ఏమిటంటే... వైవిధ్యాన్ని వేడుకగా జరుపుకోవడమే! నిజానికి, భారత రాజ్యాంగం, దానిలోని అనేక నిబంధనలు, దేశ న్యాయశాస్త్రం అనేవి భిన్నత్వంలో ఏకత్వాన్ని ఎల్లప్పుడూ ఆధునిక భారత జాతీయవాదపు కొనసాగుతున్న ఇతివృత్తంగా సమర్థించాయి. దేశం దైవపరిపాలనచే నడుస్తోందనే దృష్టి కోణం ఉద్దేశపూర్వకంగా దేశం, దాని ప్రజల సజాతీయ దృక్పథాన్ని ప్రోత్సహించడం ద్వారా వైవిధ్యాన్ని అణిచివేస్తుంది. జాతీయతలోని అనేక ఉపజాతి విధేయతలు తప్పనిసరిగా పరస్పర విరుద్ధమైనవి కానప్పటికీ, వాస్తవానికి అవి పరి పూర్ణమైనవి అనే వాస్తవాన్ని గుర్తించడానికి ఇది నిరాకరిస్తుంది. ఉదాహరణకు, భాషాపరమైన గుర్తింపులు జాతీయ గుర్తింపుతో విభేదించాల్సిన అవసరం లేదు. స్వాతంత్య్ర పోరాటం భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పోరా టాన్ని హృదయపూర్వకంగా స్వీకరించింది, దాని చట్టబద్ధ మైన ప్రజాస్వామ్య స్వభావాన్ని గుర్తించింది. కానీ, భిన్న త్వానికి విరుద్ధమైన వారు విస్తృతమైన జాతీయ గుర్తింపు పేరుతో సమాజంపై ఏకరూప దృక్పథాన్ని రుద్దడానికి ప్రయ త్నిస్తారు. ఒక దేశం – ఒకే మార్కెట్, ఒక దేశం – ఒకటే భాష, ఒక దేశం – ఒకేసారి ఎన్నికలు, ఒక దేశం – ఒకటే పన్ను అలాంటి అసహన ప్రయత్నాలకు ఉదాహరణలు. ప్రస్తుత పాలక జాతీయవాద కథనం ప్రజల సామాజిక, ఆర్థిక శ్రేయస్సుతో కూడిన చిహ్నాలతో దేశం గురించిన నైరూప్య ఆలోచనను స్పృహతో ప్రోత్సహిస్తుంది. సాంఘిక, ఆర్థిక అసమానతలను సాధారణ మనిషికి హాని కలిగించేలా చేస్తుంది. కార్పొరేట్ సంపదలో పెరుగుదలను అసహజమైన అసమానతలపై జాతీయ గర్వకారణంగా చూపుతుంది. ఈ దృక్పథం అంతిమంగా కులం, వర్గం, అటువంటి ఆధిపత్య ధోరణులన్నింటినీ శాశ్వతంగా కొనసాగించే లక్ష్యానికే ఉపయోగపడుతుంది.జాతీయవాదానికి సంబంధించి పైన పేర్కొన్న వక్రీకృత దృక్పథం స్వభావం ఏమిటంటే, ప్రక్రియ దిద్దు బాటును ప్రభావితం చేసే లక్ష్యంతో వాస్తవికతపై విమర్శనాత్మక ప్రశంసలను నిరోధిస్తూనే, గతం లేదా వర్తమానాన్ని విమర్శారహితంగా కీర్తించడం! అటువంటి విమర్శనాత్మక దృక్పథాన్ని వృత్తిపరమైన నిరాశా వాదంగా కొట్టివేయడం జరుగుతుంది. కానీ, ఇది యథాతథ స్థితిని మాత్రమే ప్రోత్సహిస్తుంది. దేశ పురోగతిని అడ్డుకుంటుంది. నిరంకుశ జాతీయవాద ఉద్దేశ్యం స్వార్థ ప్రయోజనాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఉంది. అందు వల్ల, భారతదేశ నాగరికత వారసత్వంగా ఉన్న వాదనా విధానం అణచివేయబడింది. దేశద్రోహం వంటి ప్రాచీన చట్టాల బలిపీఠం వద్ద వాక్ స్వాతంత్య్రాన్ని త్యాగం చేశారు. భిన్నాభిప్రాయాలను దేశ వ్యతిరేకమైనవిగా ముద్ర వేస్తారు. పౌర హక్కులు, స్వేచ్ఛ వంటివి జాతీయవాద ప్రాజెక్టుకు సహించరానివిగా చిత్రీకరించబడ్డాయి. నిజమైన జాతీయవాదం దాని సొంత గుర్తింపును మాత్రమే ప్రోత్సహిస్తుంది, ఆత్మగౌరవాన్ని వేడుక చేసు కుంటుంది. కానీ, జాతీయోన్మాదం బలవంతంగా, అసంకల్పితంగా అటువంటి స్వీయ అహంకారాన్ని దాని పౌరులపై మోపుతుంది. అటువంటి జాతీయోన్మాదాన్ని ప్రశ్నించే ఎవరైనా దేశం పట్ల అసంతృప్తిని ప్రదర్శించే వ్యక్తిగా పరిగణించబడతారు. నిజానికి అసమ్మతి అనేది ప్రజాస్వామ్యంలో ఓ అంతర్భాగం. కానీ, మెజారిటీ ప్రాజెక్ట్ను వ్యతిరేకించే సామాజిక, రాజకీయ శక్తులు చట్టబద్ధమైన జాతీయ గర్వాన్ని తగినంతగా ప్రకటించనప్పుడు జాతీయోన్మాదం విశ్వసనీయతను పొందుతుంది. ఆధునిక భారతీయ జాతీయవాదాన్ని ప్రజాస్వామ్యం, భాష, మతపరమైన బహుళత్వం, వైవిధ్యం, సమాఖ్యవాదం, లౌకికవాదం, సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం మొదలైన రాజ్యాంగ విలువలపై తిరుగులేని నిబద్ధతతో నిర్వచించాలి. అందువల్ల రాజ్యాంగ జాతీయవాదం ఆధునిక ప్రజాస్వామ్యాలలో అభివృద్ధి చెందిన పౌరసత్వ భావనపై కేంద్రీకృతమై ఉంది. దీనికి విరుద్ధంగా, విభజన గుర్తింపులపై ఆధారపడిన జాతీయవాదం... రాజ్యాంగవాదానికి వ్యతిరేక సిద్ధాంతం. అందువల్ల, మెజారిటీ గుర్తింపుపై ఆధారపడిన జాతీయవాద కథానాయకుడు రాజ్యాంగపు ప్రాథమిక నిర్మాణాన్ని ద్వేషిస్తాడు. అటువంటి మెజారిటీ జాతీయ వాదం అసంపూర్తిగా ఉన్న ప్రజాస్వామిక ప్రాజెక్టులో కొనసాగుతున్న సామాజిక దోష రేఖలను ఉపయోగించు కోవడం ద్వారా అభివృద్ధి చెందుతుంది.అంబేద్కర్ ‘రాజ్యాంగ నైతికత అనేది సహజమైన భావన కాదు, ఎవరికి వారు పెంపొందించుకోవాల్సినది’ అని గమనించారు. అందువల్ల, మెజారిటీ జాతీయవాదానికి వ్యతిరేకంగా పోరాటం కేవలం నైతిక లేదా నైతిక విమర్శ కాదు. రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో నేటికీ కొనసాగుతున్న సామాజిక లోపాలను సరిదిద్దడానికి కఠిన ప్రయత్నం అవసరం. కొందరిని అతి శక్తిమంతుల్ని చేసే ఘనత వహించిన జాతీయవాదంపై తద్వారానే పోరాడ వచ్చు. కానీ జాతీయవాదపు లౌకిక, ఉదారవాద విమర్శ మెజారిటీ జాతీయవాద సాంస్కృతిక అంశాలపై దృష్టి పెడుతోంది. అసలు జాడ్యాన్ని విడిచిపెట్టి, దాని లక్షణాలపై మాత్రం ఇలాంటి పోరాటం చేస్తే, అది స్వీయ ఓటమినే మిగులుస్తుంది. దానికి బదులు అటువంటి వక్రీకృత జాతీయవాద ప్రపంచ దృక్పథానికి జవజీవాలను అందించే సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక దోష రేఖలకు వ్యతిరేకంగా నిరంతర పోరాటం సాగించడమే మార్గం. ప్రొ‘‘ కె నాగేశ్వర్ వ్యాసకర్త ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు -
రాజ్యాంగ స్ఫూర్తే రణ దుందుభి
అంబేద్కర్ను తలుచుకునే ప్రతి సందర్భంలోనూ మనకు భారత రాజ్యాంగం తలపునకొస్తూనే ఉంటుంది. నాలుగు వేదాల్లోని సారమెల్లా మహాభారతంలో ఉన్నదని ప్రతీతి. మానవ హక్కులకు పట్టం కట్టిన ప్రతి చారిత్రక పత్రంలోని సారాంశమంతా మన రాజ్యాంగంలో ఉన్నది. ఎనిమిది శతాబ్దాల కిందటి ‘మాగ్నాకార్టా’ దగ్గరి నుంచి ఎనిమిది దశాబ్దాల నాటి ‘విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన’ (యుఎన్) వరకు ఆయా కాలాల్లోని డిక్లరేషన్లు ప్రజాస్వామ్య వ్యవస్థలకు ప్రాణ ప్రతిష్ఠ చేశాయి. ఈ డిక్లరేషన్లన్నిటిలోకి నిస్సందేహంగా అగ్రగణ్యమైనది, అత్యున్నతమైనది భారత రాజ్యాంగం. మానవ హక్కుల కథా గమనంలో పంచమవేదంలా పుట్టిన మహాకావ్యం భారత రాజ్యాంగం. దేశంలో సాధారణ ఎన్నికల వడగాడ్పుల సందర్భం కూడా ఇది. రాజ్యాంగాన్ని మార్చడం అనే అంశంపై చెలరేగుతున్న వాదోపవాదాలు కూడా ఈ సందర్భాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. రెండేళ్ల కిందట కావచ్చు, అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఆయనకా అవకాశం ఇవ్వలేదు. ఆయన్నే మార్చే శారు. కాలపరిస్థితులను బట్టి రాజ్యాంగంలో స్వల్ప సవరణలు సహజమే. కానీ దాని మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం ఎవ్వరికీ లేదని ఇప్పటికే భారత సర్వోత్తమ న్యాయస్థానం ఘంటాపథంగా చాటిచెప్పింది. మౌలిక స్వరూపం అంటే ఏమిటో దాని పీఠికలో ఉన్న ఆరు వాక్యాలు చదివితే అర్థమవుతుంది. బీజేపీ నాయత్వంలోని ఎన్డీఏ కూటమి మరోమారు గెలిస్తే రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చేస్తుందని ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరో పణల్ని బీజేపీ వాళ్లు మొక్కుబడిగా మాత్రమే ఖండి స్తున్నారు. అనంత హెగ్డే వంటి కొందరు నాయకులు బహిరంగంగానే రాజ్యాంగం మార్పుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. బీజేపీ అనే రాజకీయ వేదికకు సొంతదారైన ఆరెస్సెస్కు మన రాజ్యాంగం పట్ల మొదటి నుంచీ సదభిప్రాయం లేదన్నది సత్యదూరం కాదు. పైగా ఈసారి బీజేపీ వాళ్లు 400 సీట్లలో తమ కూటమి గెలవాలని తెగ ఆరాటపడుతున్నారు. ఈ ఆరాటం వెనుక ఉన్న మహ త్కార్యం రాజ్యాంగ మౌలిక మార్పులేనన్నది విమర్శకుల అభిప్రాయం. భారత రాజ్యాంగంలో ధ్వనించే సమతా నినాదం సంఘ్ పరివార్కు ఏమాత్రం కర్ణపేయం కాదు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వపు పదేళ్ల పదవీకాలంలో 40 శాతం దేశ సంపద ఒక్క శాతం కుబేరుల గుప్పెట్లోకి చేరిపోవడమే ఇందుకు ఉదాహరణ. వ్యవసాయరంగం నుంచి రైతు కూలీలను తరిమికొట్టి చీప్ లేబర్తో మార్కెట్లను నింపడం ఈ కూటమి విధానం. అందుకోసం తీసుకొచ్చిన వ్యవ సాయ చట్టాల ప్రహసనం తెలిసిందే. బీజేపీకి భారీ మెజారిటీ వస్తే పీఠికలోని సెక్యులర్, సోషలిస్టు పదాలు గ్యారంటీగా ఎగిరిపోతాయని చాలామంది భావన. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ఈ పదాలను జొప్పించారు. ఈ పదాలను తొలగించినప్పటికీ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లోని 39 అధికరణాల రూపంలో వాటి పునాదులు బలంగానే ఉంటాయి. అయితే ఆ పునాదులనే పెకిలించే అవకాశాలుండవచ్చని దేశంలోని బుద్ధిజీవులు భయపడుతున్నారు. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయని సామెత. పెత్తందారీ వర్గాల తాబేదారు పాత్రలో జీవితాన్ని తరింప జేసుకుంటున్న చంద్రబాబు నాయుడు బీజేపీకి సహజ మిత్రుడు. ప్రస్తుత ఎన్నికలతో కలిసి గడిచిన ఆరు సాధారణ ఎన్నికల్లో నాలుగుసార్లు ఆయన బీజేపీ కూటమిలోనే ఉన్నారు. రెండుసార్లు మాత్రమే దూరంగా ఉన్నారు. బీజేపీపై జనంలో వ్యతిరేకత ఉందన్న అభిప్రాయంతో మాత్రమే ఆయన రెండుసార్లు దూరం జరిగారు. కాకుల్ని కొట్టి గద్దలకు వేసే ఆర్థిక విధానాల్లో ఆయన బీజేపీ కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. పేద ప్రజల పట్ల, బలహీన వర్గాల పట్ల తన ఏహ్యభావాన్నీ, అసహ్యాన్నీ దాచుకునే ప్రయత్నం కూడా చంద్రబాబు పార్టీ చేయదు. పేద ప్రజలకు రాజధాని ప్రాంతాల్లో ఇళ్లు కేటాయిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కేసులు వేసి గుడ్డలూడదీసుకున్న వారి గురించి ఇంకేం మాట్లాడాలి? కుల, మత, ప్రాంత, రాజకీయ, లింగ వివక్షలేవీ లేకుండా నాణ్యమైన అంతర్జాతీయ స్థాయి విద్యను ప్రజలందరికీ అందజేయాలనే ఒక బృహత్తరమైన యజ్ఞాన్ని జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. చంద్రబాబు కూటమి ఈ యజ్ఞాన్ని చూసి కళ్లలో నిప్పులు పోసుకోవడం తెలిసిందే. ఇంగ్లిషు మీడియం విద్యకు వ్యతిరేకంగా, అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులకు వ్యతిరేకంగా, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు వ్యతిరేకంగా యెల్లో పెత్తందార్లు నడిపిన కుట్రల సంగతి కూడా తెలిసిందే. అన్ని రంగాల్లోనూ ఇదే తంతు. పేద వర్గాలను, మహిళలను వారి కాళ్లపై నిలబెట్టడానికి జగన్ సర్కార్ చేస్తున్న ప్రతి ప్రయత్నాన్నీ యెల్లో పెత్తందార్లు వ్యతిరేకిస్తున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ ఎంత పెరిగితే అంతగా పారదర్శకత పెరుగుతుంది. అచ్చమైన ప్రజాస్వామ్యానికి ఇది సిసలైన లక్షణం. జగన్ ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట వేసింది. ప్రభుత్వ పాలనను ప్రజల ఇంటి గడప వద్దకు చేర్చింది. వికేంద్రీకరణకు పెత్తందార్లు ఎప్పుడూ వ్యతిరేకమే. పాలనా వ్యవహారాలన్నీ వారి గుప్పెట్లోనే ఉండాలి. పారదర్శకత అనే పదం వారి డిక్షనరీలోనే ఉండదు. మాదాపూర్లో ఐటీ పార్క్ రాబోతున్నదనే రహస్యం వారికి మాత్రమే తెలియాలి. చుట్టూరా భూములన్నీ వారి వర్గంవారే కొనుగోలు చేయాలి. ఆ తర్వాతనే పార్క్ ప్రకటన రావాలి. రాజధాని ఎక్కడ వస్తుందో వారికి మాత్రమే తెలియాలి. వారి వర్గం అక్కడి భూములన్నీ కొనుగోలు చేయాలి. ఆ తర్వాతనే రాజధాని ప్రకటన చేయాలి. ఈలోగా ఇతర వర్గం ఔత్సాహికులను తప్పుదారి పట్టించడానికి తప్పుడు లీకులు వదలాలి. చంద్రబాబు నాయకత్వంలోని పెత్తందార్ల కూటమి అనుసరిస్తున్న ఈ తరహా రియల్ ఎస్టేట్ వ్యాపారానికే వారు అభివృద్ధి అనే ముద్దు పేరు పెట్టుకున్నారు. భారత రాజ్యాంగం ప్రవచించిన ఆదేశిక సూత్రాలను శిరసావహించినందుకు జగన్ పాలన విధ్వంసకర పాలనని మన తోలుమందం పెత్తందార్లు ప్రచారం చేస్తున్నారు. యావత్తు ప్రపంచం వాంఛిస్తున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఆదర్శంగా పెట్టుకున్నందుకు జగన్ పరిపాలన వారికి వినాశకరమైనదిగా కనిపిస్తున్నదట! దశాబ్దాలు గడిచిపోతున్నా అధికార పదవుల్లో ఆవగింజంత వాటా కూడా దొరకని వర్గాలను సమీకరించి సామాజిక న్యాయం బాట పట్టినందుకు జగన్ సర్కార్కు కొమ్ములు మొలిచా యట! కొవ్వు బలిసిన పెత్తందారీ వర్గాల ప్రచారం తీరు ఇది. ఎన్డీఏ పదేళ్ల ఏలుబడిలో నిరుద్యోగ సమస్య జడలు విప్పి నర్తిస్తున్నది. మన తెలుగు పెత్తందార్లకు ఆ జడల దయ్యం ముద్దొస్తున్నది. ఐదేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు లక్షల మంది ఉంటే జగన్ సర్కార్ హయాంలో వారి సంఖ్య ఆరున్నర లక్షలకు పెరిగింది. ఎకాయెకిన యాభై శాతం ఉద్యోగాలు అదనంగా కల్పించిన జగన్ ప్రభుత్వం వారికి విలన్గా కనిపిస్తున్నది. ఈ సంఖ్యలో వలంటీర్లను చేర్చలేదు సుమా! పరిశ్రమల స్థాపనలోగానీ, మౌలిక వసతుల కల్పనలోగానీ, ఉపాధి కల్పనలోగానీ, సంక్షేమ కార్యక్రమాల అమలులోగానీ గణాంకాల ఆధారంగా జగన్ సర్కార్తో పోల్చడానికి ఈ పెత్తందార్లు ముందుకు రావడం లేదు. కేవలం విధ్వంసం, వినాశనం, సర్వనాశనం అనే పడికట్టు మాటలతో శాపనా ర్థాలు పెడుతూ పూట గడుపుకొస్తున్నారు. యెల్లో మీడియా అనుసరిస్తున్న ఈ తరహా ఊకదంపుడు గోబెల్స్ ప్రచారం కాలం చెల్లిన చీప్ ట్రిక్. ప్రజల చైతన్యస్థాయి పెరిగింది. సమాచార మాధ్యమాలు పెరిగాయి. ఎవరు మిత్రుడో, ఎవరు శత్రువో గుర్తించగలిగే వివేచనా శక్తి జనంలో పెరిగింది. రాజ్యాంగబద్ధమైన తమ హక్కులను రక్షించుకోవడానికి ప్రజలు సంఘటితమవు తున్నారు. కేంద్రంలో ఒక విశ్వసనీయమైన ప్రతిపక్షం, విశ్వసనీయ ప్రతిపక్షనేత అందుబాటులో లేకపోవడం అనే ఒకే ఒక్క కారణం మరోసారి ఎన్డీఏను గద్దెనెక్కించవచ్చు. అదీ బొటాబొటీ మెజారిటీతో మాత్రమే! కూటమి ఆశిస్తున్నన్ని సీట్లు గెలవడం అసంభవం. పెత్తందారీ వర్గాలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడి రాజ్యాంగ లక్ష్యాల అమలుకు ప్రయత్నిస్తున్న జగన్ సర్కార్ బలంగా ఉన్నందువల్ల ఆంధ్రప్రదేశ్లో పేదవర్గాల జైత్రయాత్ర కొనసాగు తుందని అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తం 25 లోక్సభ స్థానాలతో పాటు నూటాయాభైకి పైగా అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకున్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
రాజ్యాంగ స్ఫూర్తికి ప్రమాదం
ఎన్నికల వేళ దేశంలో అధికార–ప్రతిపక్ష కూటములు పోటాపోటీగా ప్రకటనలు చేస్తూ తమ విధానాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే సమయంలో అధికార బీజేపీ ఏకంగా బలమైన ప్రతిపక్ష నాయకులపై కేసులు బనాయించి జైళ్లలోనూ పెడుతోంది. ఇందుకు కేజ్రీవాల్ అరెస్ట్ ఉదంతంతాజా ఉదాహరణ. దీనిపై ప్రతిపక్ష కూటమి భగ్గుమంటోంది. బీజేపీ ఈ సారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దుచేసినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదని వారు అంటున్నారు. ఉత్తరప్రదేశ్తో సహా దేశంలో అనేక చోట్ల దళితులపై జరుగుతున్న దాడులూ, కర్నాటక బీజేపీ నాయకుడు అనంత కుమార్ హెగ్డే ‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం’ అని ప్రకటించడం వంటివన్నీ చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. ప్రతిపక్షాల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కేంద్రం అరెస్టు చేసింది. ఎన్నికల ముందు ఇలా ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం గురించి ప్రపంచ దేశాలు విస్తుబోయాయి. ఇది కేవలం రాజకీయ కక్షతో చేసిన అరెస్టేనని ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా, జపాన్లు వ్యాఖ్యానించటం గమనార్హం. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఢిల్లీ ర్యాలీలో మాట్లాడుతూ ‘దళితులు, గిరిజనులు, వెనకబడిన వర్గాలకు మేలు చేయబట్టే నా మీద బీజేపీ దాడులకు దిగింద’ని వక్కాణించారు. కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీ వాల్ ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగిన సభలో మాట్లాడుతూ... నిర్విరామ విద్యుత్ సరఫరా, పేదలకు ఉచిత విద్యుత్తు, ప్రభుత్వ బడులు బలోపేతం, మొహల్లా క్లినిక్లు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, రైతులకు కనీస మద్దతు ధర, ఢిల్లీకి రాష్ట్ర హోదా వంటి అనేక హామీలతో కేజ్రీవాల్ జైలు నుంచి ఒక లేఖ పంపినట్టు ప్రకటించారు. ఇటువంటి హామీలను బీజేపీ ప్రభుత్వం ఇవ్వగలదా అని ప్రశ్నించారు. బీజేపీ 400 సీట్లు వస్తాయని బీరాలు పలుకుతుందనీ, 180 సీట్లన్నా తెచ్చుకోగలదా? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుతంత్రంలో భాగంగా ఈ ఎన్నికలు జరుగుతున్నా యని, మాట్లాడే స్వేచ్ఛను కాలరాయడం, నియంతృత్వ రాజ్యాన్ని తీసుకురావడం, ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు పరచడం వంటివి బీజేపీ వ్యూహమనీ ఆయన అన్నారు. నియంతలను గద్దె దించటం ఎలాగో ప్రజలకు తెలుసనీ పేర్కొన్నారు. నిజానికి బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల మీద... ముఖ్యంగా తమిళనాడు సామాజిక సాంస్కృతిక అస్తిత్వం మీద దాడిచేస్తోంది. కులాంతర వివాహాలకు రక్షణ కల్పించడం, 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడం మీద బీజేపీ అసహనంగా ఉంది. సనాతన ధర్మాన్ని నిరాకరించి అధునాతన ధర్మానికీ,రాజ్యాంగ పరిరక్షణకూ పూనుకునే కార్యక్రమాలు నిర్వహించడం మీద బీజేపీ ఆగ్రహంగా ఉంది. ఎన్నికల వేళ నరేంద్ర మోదీ ‘కచ్చతీవు’ అంశాన్ని ప్రస్తావించడంపై కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్య దర్శి జయరాం రమేష్లు తగిన విధంగా స్పందించారు. 1974లో కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చతీవు (దీవి)ని శ్రీలంకకు అప్పగించిందని మోదీ ఆరోపించారనీ, మరి 2015లో బంగ్లాదేశ్తో ఎన్డీఏ ప్రభుత్వం చేసుకున్న భూమి సరిహద్దు ఒప్పందంలో భాగంగా 1051 ఎకరాల భారత భూభాగం కోల్పోవాల్సి వచ్చింది కదా అని జయరాం రమేష్ గుర్తు చేశారు. మొత్తం 17,161 ఎకరాల భారత భూభాగంలో 7,110 ఎకరాలు మాత్రమే మనకు వచ్చాయి అన్నారు. ఆ సమయంలో మోదీపై ఆరోపణలు చేయకుండా పార్లమెంటు ఉభయసభల్లో బిల్లుకి కాంగ్రెస్ మద్దతునిచ్చిందని వెల్లడించారు. తమిళనాడులో వారికి ఒక్క సీటు కూడా రాకపోవడం బీజేపీ వర్గాలను కలవరపెట్టిందని విమర్శించారు. తమిళనాడులో వస్తున్న సామాజిక ఆర్థిక పరిణామాలను తట్టుకోలేక మోదీ ‘కచ్చతీవు’ ప్రస్తావన తెచ్చారని అన్నారు. 1974లో సిరిమావో బండారు నాయకే– ఇందిరా గాంధీ మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా శ్రీలంక నుండి ఇందిరా గాంధీ చాతుర్యం వల్ల ఆరు లక్షల మంది తమిళ భారతీయులు స్వదేశానికి రాగలిగారని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం దక్షిణ భారతదేశంలో వస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల చైతన్యానికి బెదిరి ఎప్పటివో సరిహద్దు విషయాలను ముందుకు తెచ్చి లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. బిహార్ ఓబీసీ రాజకీయ నాయకులు తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఓబీసీ నాయకుల్ని బతకనివ్వటం లేదనీ, తన తల్లి, తండ్రి, తోబుట్టువులపై కేసులు పెట్టి వేధిస్తున్నారనీ, ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రకారం ఓబీసీలు అంటే శూద్ర బానిసలనీ, వారు రాజ్యపాలనకు పనికిరారనేది వారి భావ జాలం అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏ గిరిజనుల, దళితుల, బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తోందో, మాట్లాడుతోందో వారే నిజానికి సామా జిక ఉత్పత్తి శక్తులు. భారతీయ గిరిజనులు మన ప్రకృతినీ, సంస్కృతినీ రక్షించినవారు. దళితులు నదీ నాగరికతను సృష్టించినవారు. వీరి శ్రమ లేనిదే భారతదేశ సంపద లేదు. ఎవరు సంపద సృష్టిస్తున్నారో వారి రక్షణ కోసమే భారత రాజ్యాంగం రాయబడింది. ప్రధాని దేశంలో సామాజిక, సాంస్కృతిక, పారిశ్రామిక, విద్యా వ్యవస్థలను విస్తృతం చేయాలనే పథకాలను రూపొందించుకోలేక పోతున్నారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనా విభాగం సీట్లన్నీ తగ్గించేశారు. ఎస్సీలకు ఇస్తున్న ఉపకార వేతనాలను తగ్గించేశారు. ఇకపోతే మహిళా సంక్షేమ పథకాల అమలులో మోదీ ప్రభుత్వం ఈ పదేళ్ళ కాలంలో ఘోరంగా విఫలమయ్యింది. బడ్జెట్లోనూ మోదీ ప్రభుత్వం మహిళల సంక్షేమ పథకాల కేటాయింపును తగ్గించింది. 5 కీలక మహిళల సమస్యల పరిష్కారంలో విఫలమైంది. 2023 – 24 కేంద్ర బడ్జెట్లో అంగన్వాడీ కేంద్రాలు, మహిళల భద్రత, శిశు సంరక్షణ సంస్థలకు బీజేపీ ప్రభుత్వం కేవలం 0.55 శాతం నిధులు మాత్రమే కేటాయించింది. వాచాలత్వం నుండి, ఆధిపత్యం నుండి, అణచివేత నుండి, హింస నుండి ఉత్పత్తి జరగదు. ఉత్పత్తి జీవులు అయిన గిరిజనులు, దళితులు చెట్టును ప్రేమిస్తారు, నదిని ప్రేమిస్తారు, భూమిని ప్రేమిస్తారు, గాలిని ప్రేమిస్తారు. భారతదేశం ప్రకృతి జీవులది. పెట్టుబడి దారీ సామ్రాజ్యవాద శక్తులు వీరి శ్రమను దోపిడీ చేసి అభివృద్ధి చెందుతున్నాయి. ఎవరి శ్రమ దోచుకుంటున్నారో వారిపై అరాచకాలు చేస్తు న్నారు. బీజేపీ పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్లో ఇటీవల ఆరు గురు యువకులు ఒక దళిత బాలికపై (16 ఏళ్ళు) లైంగిక దాడి చేశారు. వారిపై కేసు పెట్టినందుకు ఆమెను వారు అగ్నిలో దహించారు. ఇటు వంటి పాలకులను అందిస్తున్న బీజేపీకి చెందిన కర్నాటక నాయకుడు అనంత కుమార్ హెగ్డే ‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం’ అని ప్రకటించడం ముందు ముందు ఏమి జరగను న్నదనే సంగతిని సూచిస్తోంది. ఇకపోతే ఇండియా కూటమి కూడా అంబేడ్కర్ని ముందు పెట్టుకోకుండా వెళితే రాజ్యాంగాన్ని రక్షించలేదు. భావ ప్రకటనా స్వేచ్ఛ ఇక ప్రజలకు ఉండదు. రాజ్యాంగంలోని ‘ప్రవేశిక’ ‘భారత దేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం’గా ప్రకటించింది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ దూకుడు చూస్తుంటే ఈ లౌకిక, ప్రజాస్వామ్య భావనలు ప్రమాదంలో పడబో తున్నట్లనిపిస్తోంది. రాజ్యాంగం ప్రాథమిక హక్కులను మనకు ప్రసాదించింది. ఇప్పుడు అవీ ప్రమాదంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. రాజ్యాంగ 11వ అధికరణం ప్రాథమిక హక్కులను హరించే ఏ శాసనం చెల్లదని చెప్పడం కొంత ఊరటనిస్తోంది. అంబేడ్కర్ ఈ రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి దళిత, బహుజన, ఆదివాసీ మీదా ఉంది. ఇప్పుడు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన కులతత్వ, మత తత్వవాది. ఇవాళ దక్షిణ భారతదేశం మొత్తం తన అస్తిత్వం కోసం పోరాడుతోంది. ఈ దశలో అంబేడ్కర్ ఆలోచనలతో లౌకిక భారత పునరుజ్జీవనం కోసం బడుగు వర్గాలు, లౌకికవాదులం ఏకమై రాజ్యాంగ స్ఫూర్తినీ, చైత న్యాన్నీ, ప్రతిష్ఠనూ, వ్యక్తిత్వాన్నీ కాపాడే పోరాటంలో భాగస్వాముల మవుదాం. విజయం సాధిద్దాం! డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
మారుతున్న ఢిల్లీ రాజకీయాలు.. ఎల్జీ నిర్ణయంపై ఉత్కంఠ
దేశ రాజకీయాల్లోనే పెను సంచలనం చోటు చేసుకుంది. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. అదీ అవినీతి ఆరోపణల మీద ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం రాత్రి అరెస్టు చేసింది. తద్వారా పదవిలో ఉండగా అరెస్టయిన మొదటి ముఖ్యమంత్రిగా నిలిచారాయన. అయితే ఆయన అరెస్ట్ నేపథ్యంలో.. ఢిల్లీకి నెక్ట్స్ సీఎం ఎవరనే చర్చ సాధారణంగానే తెరపైకి వచ్చింది. ఆప్ మాత్రం మరో మాట చెబుతోంది. ‘‘అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పూర్తిగా రాజకీయ కుట్ర. ఢిల్లీకి కేజ్రీవాలే ముఖ్యమంత్రి. ఆయనే మా పార్టీ కన్వీనర్గా కొనసాగుతారు. జైలుకు వెళ్లినా అక్కడి నుంచే ఆయన పాలన కొనసాగిస్తారు. ఆప్ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదు..’’ ఇది ఇప్పుడు ఆప్ కీలక నేతలు చెబుతున్న మాట. ఇప్పుడే కాదు.. గత నవంబర్లో లిక్కర్ స్కాంలో తొలిసారి ఈడీ కేజ్రీవాల్కు సమన్లు ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన అరెస్ట్ అవుతారనే ప్రచారం నడుస్తూ వచ్చింది. అయితే ఆ సమయంలోనూ ఆప్ ఒక్కటే ప్రకటన చేసింది. కేజ్రీవాల్ ఎట్టిపరిస్థితుల్లో రాజీనామా చేయబోరని.. అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లినా ఆయనే సీఎంగా పాలన కొనసాగిస్తారని. అంతేకాదు ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే గనుక రాజీనామా చేయాలా? లేదంటే సీఎంగా కొనసాగొచ్చా? అంటూ.. ‘మై బీ కేజ్రీవాల్’ పేరుతో ఈ జనవరిలో ఏకంగా ఓ పబ్లిక్ సర్వేను సైతం చేపట్టింది ఆప్. అయితే.. ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యి ముఖ్యమంత్రి హోదాలో జైలు నుంచే పాలన నడిపించేందుకు వీలుందా?అందుకు భారత రాజ్యాంగం అనుమతిస్తుందా? చట్టాలు ఏం చెబుతున్నాయి?.. రాష్ట్రపతి, గవర్నర్ పోస్టులు మాత్రమే రాజ్యాంగం పరిధిలోని పోస్టింగులు. చట్టం ప్రకారం.. వీళ్లకు మాత్రమే అరెస్ట్ నుంచి రక్షణ ఉంటుంది. వాళ్ల పదవీకాలం ముగియడం లేదంటే స్వచ్ఛందంగా రాజీనామా చేసేదాకా వాళ్లకు ఊరట లభిస్తుంది. అప్పటిదాకా ఆర్టికల్ 361 ప్రకారం వాళ్లకు కల్పించిన రక్షణ ప్రకారం.. న్యాయస్థానాలకు వాళ్లు జవాబుదారీలుకారు. అయితే.. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి లాంటి పదవులకు మాత్రం ఎలాంటి రక్షణ ఉండదు. అందుకే ఢిల్లీ హైకోర్టు సైతం కేజ్రీవాల్కు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు విముఖత వ్యక్తం చేసింది. అలాగని కేవలం అరెస్ట్ అయినంత మాత్రానా వాళ్లు(పీఎం, సీఎంలాంటి పదవుల్లో ఉన్నవాళ్లు) ఆ పదవులకు అనర్హులైపోరు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం కచ్చితంగా శిక్ష పడితేనే పదవుల్ని కోల్పోతారు. కేజ్రీవాల్కు జైలుకెళ్తే.. తాజా పరిణామాల్ని పరిశీలిస్తే.. జైలు నుంచి కేజ్రీవాల్ ఢిల్లీని పాలించడాన్ని ఏ చట్టం అడ్డుకోదు. ఒకవేళ ఆయనకు శిక్ష పడితే మాత్రం అనర్హతకు గురవుతారు. ఇప్పటివరకైతే ఆయనకు శిక్ష పడలేదు. కాబట్టి ఆయన పాలన కొనసాగించేందుకు ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అలాగని జైలు నుంచే సీఎంగా బాధ్యతలు నిర్వర్తించడం అంత సులువైన పనీ కాదని కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకు జైలు అధికారులు ఆయనకు పలు సడలింపులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు అక్కడి జైళ్ల శాఖ నిబంధనలపై స్పష్టత రావాల్సి ఉంది. స్వచ్ఛందంగా రాజీనామాను మినహాయిస్తే ఒక ముఖ్యమంత్రి తన పదవిని కోల్పోయేది అసెంబ్లీలో మెజారిటీని కోల్పోవడమో లేదంటే అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడం వల్లనో. కేజ్రీవాల్కు కలిసొచ్చే మరో అంశం ఏంటంటే.. ఇప్పటి వరకు ఆప్ మంత్రులు ఇద్దరు మనీశ్ సిసోడియా , సత్యేందర్ జైన్ అరెస్టై జైలుకు వెళ్లారు. కానీ, కేజ్రీవాల్ కేవలం ముఖ్యమంత్రిగానే ఉన్నారు. ఆయన వద్ద ఎలాంటి పోర్ట్ఫోలియో లేదు. లెఫ్టినెంట్ గవర్నర్దే నిర్ణయం? ప్రస్తుతం ఉన్న ఢిల్లీ అసెంబ్లీ కాలపరిమితి వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. అయితే.. ఢిల్లీ అధికార నిర్మాణం చాలా భిన్నంగా ఉంటుందన్నది తెలిసిందే. ప్రజలు ఎన్నుకునే ముఖ్యమంత్రి.. కేంద్రం ఎంపిక చేసే లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఢిల్లీ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనా ఉన్నారు. ఆయనతో కేజ్రీవాల్ సర్కార్కు అంత సత్సంబంధాలు కూడా ఏం లేవు. దీంతో.. ఇప్పుడు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? లేదా?.. ఎల్జీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. రాజధాని రీజియన్లోని ఢిల్లీకి మాత్రమే వర్తించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 ఏఏ ప్రకారం.. కేజ్రీవాల్ జైలుకు వెళ్తే గనుక ఆయన్ని అధికారం నుంచి తొలగించమని ఎల్జీ రాష్ట్రపతిని కోరేందుకు అవకాశం లేకపోలేదు. ఒకవేళ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ జైలుకు గనుక వెళ్లాల్సి వస్తే.. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని పేర్కొంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేయించొచ్చు. ఆర్టికల్ 239ఏబీ ప్రకారం ఎల్జీ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయవచ్చు. తద్వారా బలవంతంగా అయినా కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సి వస్తుంది. అప్పుడు రాష్ట్రపతి పాలన కింద ఢిల్లీ కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. రిమాండ్ పిటిషన్పై తీర్పు, బెయిల్ ఏదో ఒకటి వచ్చేదాకా ఎదురుచూసే అవకాశం లేకపోలేదు. -
రాజ్యాంగ విలువలు అమలవుతున్నాయా?
రాజ్యాంగ నిర్మాతలు జాతి లక్ష్యాలనూ వాటిని సాధించేందుకు అవసరమైన వ్యవస్థలనూ, ప్రక్రియలనూ రాజ్యాంగంలో పొందు పర చారు. జాతి సమైక్యత, సమగ్రత, ప్రజాస్వామిక సమాజం ఏర్పాటు అనేవి జాతి లక్ష్యాలుగా ఉద్దేశించబడ్డాయి. వీటిని సాధించేందుకు ప్రజాస్వామిక స్ఫూర్తితో రాజ్యాంగ ప్రజాస్వామిక వ్యవస్థలను విని యోగించుకుంటూ సామాజిక, ఆర్థిక విప్లవం ద్వారా నూతన సమాజాన్ని నిర్మించవలసి ఉంటుందని భావించారు. రాజ్యాంగ వ్యవస్థలు వాటికి అవే పనిచెయ్యవు. ఆ వ్యవస్థ ద్వారా ఎంపిక కాబడ్డ రాజకీయ యంత్రాంగం నడిపించాల్సి ఉంటుంది. ప్రముఖ న్యాయమూర్తి జాన్ మార్షల్ అన్నట్లు ‘రాజ్యాంగం అనేది భావితరాల కోసం రూపొందించ బడుతుంది, కానీ దాని నిర్దిష్ట క్రమం ఎప్పుడూ ఒడుదొడుకులు లేకుండా ఉండదు’. రాజ్యాంగం అంటే ఒక జాతి సామాజిక లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగించే దిక్సూచిలాగా భావించాలి. నిజానికి నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ పరిష్కార మార్గం ఏ రాజ్యాంగంలోనూ లభించదు. వాటిని రాజ్యాంగ సూత్రాల పరిధిలో పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలకూ, చారిత్రక అసమా నతల మీద ఏర్పడ్డ సామాజిక వ్యవస్థకూ భిన్నత్వం ఉంది. ఈ వైరుద్ధ్యాల నడుమనే భారత రాజకీయ వ్యవస్థ రాజ్యానికీ, వ్యక్తుల హక్కు లకూ మధ్య సమన్వయం సాధిస్తూ ముందుకు సాగాలి. వ్యక్తి స్వేచ్ఛ, పౌరస్వేచ్ఛ ప్రధానమైనవిగా భావించాలి. అంబేడ్కర్ చెప్పిన ‘చట్టం ముందర సమానత్వం’ భావన కేవలం సూత్రప్రాయంగా కాక ‘రూల్ ఆఫ్ లా’ ప్రాతిపదికన ముందుకు సాగాలి. వర్తమానంలో రాజ్యాంగానికి ఆవల ఉండే పద్ధతుల్లో ఎన్నో విధ్వంసకర విధానాలు ‘సర్వసమ్మతి’ పేరున జరుగుతున్నాయి. 1990ల్లో వచ్చిన నయా ఉదారవాద విధానాల నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులు పెరిగాయి. దీనితో ‘సంక్షేమ రాజ్య’ స్థాపన లక్ష్యానికి గండిపడింది. సామాజిక సంక్షేమం సందిగ్ధంలో పడింది. ఫలితంగా సమాజ సంక్షేమం స్థానే మార్కెట్ ప్రయోజనాలే ముందుకొచ్చాయి. వరల్డ్ బ్యాంక్ విధానాలు స్థానిక ప్రభుత్వాలను సైతం దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలోనే నేడు దేశంలో ‘విశ్వాసమే’ ప్రధానం అనే భావనను సర్వసమ్మతి పేరున రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రాన్నీ భిన్న అభిప్రాయాలనూ, నేర పూరిత కుట్రగా చలామణీ చేస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న దేశంలో నేడు ఏకతా సూత్రాల దిశగా దేశాన్ని నడిపిస్తున్నారు. ఆహార నియమాల పట్ల కూడ ప్రత్యక్ష ఆంక్షలు తలెత్తుతున్నాయి. చట్ట ప్రకారం పరిపాలన కంటే విశ్వాసమే చట్టంగా పాటించాల్సిన పరిస్థితుల్లోకి ప్రజలు నెట్టబడుతున్నారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే దేశ వ్యతిరే కిగా, దేశద్రోహిగా కేసులు వస్తున్నాయి. ఎమర్జెన్సీ తరువాత వచ్చిన 42వ రాజ్యాంగ సవరణలో సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పార్లమెంట్ కూడా మార్చలేదని చెప్పిన తీర్పు స్పష్టంగానే ఉంది. రాజ్యాంగ బద్ధంగా పరిపాలిస్తామని రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వాళ్ళే ’విశ్వాసమే’ ప్రధానం అనే భావజాలాన్ని ముందుకు తెస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగ విలువల సాక్షిగా ప్రజలు తమ హక్కులకు, జీవితాలకు, రాజ్యాంగ రక్షణకు, తామే నిబద్ధులుగా వ్యవహరించాల్సిన, కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. భారతదేశంలో ‘చట్టబద్ధ పాలన’ (రూల్ ఆఫ్ లా) సజాపుగా సాగాలంటే దేశ పౌరసమాజం ద్వారా మాత్రమే రూల్ ఆఫ్ లాను పొందగలరు. – డా‘‘ నూతక్కి సతీష్, నాగార్జున విశ్వవిద్యాలయం డా‘‘ బి.ఆర్. అంబేడ్కర్ స్కూల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ – రీసెర్చ్లో గెస్ట్ ఫ్యాకల్టీ -
అస్తమించని మేధా సూర్యుడు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యులు. భారతదేశ పునర్నిర్మాణ దృష్టితో రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆయన చెక్కిన రాజ్యాంగ శిల్పంలో ప్రపంచ మానవతా సూత్రాలన్నీ ఇమిడి ఉన్నాయి. లౌకిక భావన, ప్రజాస్వామ్య వ్యవస్థలలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను భారత ప్రజలకు లభించడానికి తీవ్రంగా కృషి చేశారు. ఆయన విశుద్ధంగా, వినిర్మలంగా, ద్వేష రహితంగా జీవించారు. అదే జీవన విధానం అందరికీ ఆచరణీయం. ఆయన సిద్ధాంతాలైన కుల నిర్మూలన, అస్పృశ్యతా నివారణ , ఆర్థిక సమత, మానవ హక్కులు, బహుజన సాధికారితలను సాధించడానికి మనందరం ముందుకెళ్ళాల్సిన చారిత్రక సందర్భమిది. అంబేడ్కర్కి పూర్వం, అంబేడ్కర్ తర్వాత అని భారతదేశ చరిత్రను మనం లిఖించాల్సి ఉంటుంది. అంబేడ్కర్కి పూర్వం భారతదేశం మనుస్మృతి రాజ్యం, వర్ణ వ్యవస్థ రాజ్యం, బ్రాహ్మణాధిపత్య రాజ్యం, లౌకికేతర రాజ్యం, అప్రజాస్వామిక రాజ్యం, నియంతృత్వ రాజ్యం. అంబేడ్కర్ భారత దేశం రూపురేఖలను మార్చారు. లౌకిక ప్రజాస్వామిక దేశంగా చేశారు. ఆయన భారత రాజ్యాంగ శిల్పంలో ప్రపంచ మానవతా సూత్రాలన్నీ ఇమిడి ఉన్నాయి. లౌకిక భావన ప్రజాస్వామ్య వ్యవస్థలలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను భారత రాజ్యాంగం ద్వారా భారత ప్రజలకు లభించడానికి కారకులయ్యారు. కులాతీత, మతాతీత రాజ్యాంగాన్ని రూపొందించి భారతదేశానికి కానుకగా సమ ర్పించారు. భారత దేశ భవిష్యత్తుకు ఆ రాజ్యాంగమే దిక్సూచి. అంబేడ్కర్ ప్రపంచంలోనే పేరెన్నిక గన్న మేధావి. తత్వవేత్త, దార్శనికుడు అని ఎవరిని అంటారు? ప్రపంచ గమన సూత్రాలను మార్చ గలిగిన వారినే అంటారు. అంబేడ్కర్కు ముందు ఒక బుద్ధుణ్ణి, ఒక మార్క్స్ను ప్రజలు తత్వవేత్తగా కొనియాడారు. ఆయన బుద్ధుని కంటే, మార్క్స్ కంటే కూడా విశిష్ట లక్షణాలు ఉన్న మేధావి. భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న కుల సమస్యకు, అçస్పృశ్యతా నిర్మూలనకు నిర్మాణాత్మకమైన సిద్ధాంతాలు, సూత్రాలు అందించారు. అణగారిన ప్రజల హక్కుల సిద్ధాంతానికి కర్త అయ్యారు. అంతే కాక, దానికి చట్ట రూపాన్ని తీసుకొచ్చిన నిర్మాణ కర్త ఆయన. అంబే డ్కర్ పరినిర్వాణం 67వ ఏట అడుగు పెడుతున్నా ఆయన కీర్తి తరగ లేదు. ఆయన సిద్ధాంతాలు విశ్వవ్యాప్తమవ్వడానికి కారణం, ఆయన జీవితం అంతా అనంత పరిశోధన చేసి, కుల నిర్మూలన, అస్పృశ్యతా నిర్మూలనం, ఆర్థిక అసమానతల నిర్మూలనకు బాటలు వేయడమే. ఆయనలా విశుద్ధంగా, నిర్మలంగా, ద్వేష రహితంగా జీవించిన మేధావులు అరుదు. ఆయన భారత రాజ్యాంగ నిర్మాణాన్ని భారతదేశ పునర్నిర్మాణ దృష్టితో రూపొందించారు. అందుకు ఆయన తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు. ఆయన విద్యార్జన గమ్యం అçస్పృశ్యుల ఉద్ధరణ. అదీ దళిత విద్యావంతులలో ఉండాల్సిన ఆదర్శం. దళిత విద్యార్థులు ఆ నిర్దేÔè కత్వం నుండి తప్పితే అంబేడ్కర్ మార్గాన్ని నిరోధించిన వారే అవు తారు. ఈ సత్యాన్ని ప్రతి అంబేడ్కర్వాది గుర్తుంచుకోవాలి. ఆయన లండన్లో ఉన్నప్పుడు కూడా తన మనస్సు మాత్రం భారతదేశ అస్పృశ్య సమాజం మీదే ఉండేది. భారతదేశంలో అస్పృశ్యుల కోసం పని చేస్తున్న సంఘాలు ఏమి చేస్తున్నాయా అని ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ ఉండేవారు. అంబేడ్కర్ విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను సంతరించుకున్నారు. నాయకుడు కేవలం తన వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడు. తన జాతి గురించే ఆలోచిస్తాడు. త్యాగపూరితంగా పనిచేయడం ద్వారా తన జాతీయుల మనసులను చూరగొంటాడు. నాయకుడు తన భావజాలాన్ని జాతికి అందించడానికి వాహికను రూపొందించుకుంటాడు. అది ఉత్తరాల ద్వారా కావచ్చు, పత్రికల ద్వారా గావచ్చు, సభలు, సమావేశాల ద్వారా గావచ్చు. ఆయన చేసిందీ అదే! ఆయన అనేక పత్రికల్లో రాయడమే కాక స్వయంగా ‘మూక్ నాయక్’, ‘బహిష్కృత్ భారత్’, ‘జనత’, ప్రబుద్ధ భారత్’ వంటి పత్రికలు స్థాపించి వాటి ద్వారా తాను చెప్పాలనుకున్నది నిర్భ యంగా, కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎన్నో సభల్లో ఉపన్యసించి అణగారిన వర్గాలను ఉత్తేజితులను చేశారు. నాటి ప్రభుత్వ పెద్దలకూ, రాజకీయ నాయకులకూ ఆయన రాసిన ఉత్తరాలు ఇప్పటికీ చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. అంబేడ్కర్ నిశిత పరిశీలకుడు. ముఖ్యంగా ఆయన పోరాటానికి పునాది పూర్తి కుల త్యాగ నిరతి. అందుకే పూర్వీకుల వీరోచిత గాథ లను వర్ణించారు. ఆయన క్రమశిక్షణతో కూడిన నిర్భయత్వాన్ని ప్రద ర్శిస్తూ వీరోచితమైన సాహసాన్నీ, మొక్కవోని నిబ్బరాన్నీ, ధైర్యాన్నీ కొనియాడదగిన నిశ్చితత్వాన్నీ ప్రదర్శించిన మహర్ సైనికులకు శాశ్వతమైన గుర్తింపును తెచ్చారు. ‘ఇద్దరిలో ఎవరి కీర్తి గొప్పదో చెప్పడం కష్టం. అది భారతీయ సైనికులదో లేక అంతటి విధేయతను, విశ్వాసాన్ని పొందేలా వ్యవహరించిన బ్రిటిష్ ఆఫీసర్లదా?’ (భారతీయ సైనికులలో అధికులు మహర్లు) అంటూ మేజర్ జె.టి. గోర్మన్ తన ‘హిస్టారికల్ రికార్డ్ ఆఫ్ ది సెకండ్ బెటాలియన్ ఫోర్త్ బాంబే గ్రెనెడీర్స్, 1796–1933’లో పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం. అనతికాలంలోనే కోరెగాంవ్ చర్యకున్న ప్రాముఖ్యతను గుర్తించారు. కోరెగాంవ్లో మొదటి తూటా పేలిన స్థలంలో 65 అడుగుల ఎత్తు, 32 చదరపు అడుగుల వెడల్పు ఉన్న స్మృతి చిహ్నాన్ని నిర్మించాలని తల పెట్టారు. దీనికి 1821 మార్చి 26న పునాది రాయి వేశారు. ఈ దళం సాహసానికి స్మృతిగా ఈ స్తూపాన్ని నిర్మించారు. ఈ సాహసాన్ని కొనసాగించే ఉద్దేశంతో దీనిని నెలకొల్పారు. అస్పృశ్యులు అనబడినవారు వీరోచితమైన జాతులు అని అంబేడ్కర్ తన అస్పృశ్యుల వాడలో నిరూపించారు. పల్నాటి యుద్ధంలో తెలుగు నేలలో దళితులే పాల్గొన్నారు. కృష్ణదేవరాయల సైన్యంలో ఏనుగులను, గుర్రాలను నడిపింది దళితులే. ముఖ్యంగా పల్నాటి వీర చరిత్రలో కన్నమదాసు సైన్యాధ్యక్షుడు. ఆయన ఉపయోగించిన కత్తి ఇప్పటికీ కారంపూడిలో ఉంది. డా‘‘ అంబేడ్కర్ కృషి వలన అస్పృశ్యత ఒక నేరంగా రాజ్యాంగం పరిగణిస్తూ ఉంది. కాని భారతదేశంలో లక్ష లాది గ్రామాలలో ఇంకా అస్పృశ్యత వెన్నాడుతోంది. ఎన్నో హోట ళ్ళలో గ్లాసులు అస్పృశ్యులకు వేరుగా ఉంచుతున్నారు. కొన్ని ప్రభు త్వాలు ఊరికి దూరంగా ఇళ్ళు కట్టిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 21వ ఆర్టికల్ను వివరిస్తూ డా‘‘ అంబే డ్కర్ ‘ప్రభుత్వ సొమ్మును మత బోధకులకు, మత కార్యకలాపాలకు ఉపయోగించరాదు. మత బోధలకు సంబంధించి స్వయంగా లేక ప్రయివేటు సంస్థల ద్వారా ప్రభుత్వం ఖజానా డబ్బును ఖర్చు చేయ డానికి వీలులేదు’ అని స్పష్టం చేశారు. దీనికి పూర్తిగా, భిన్నంగా ఈనాడు జరుగుతూ ఉంది. ప్రభుత్వ ప్రచార సాధనాలయిన రేడియో, టీవీ వంటివాటిలో మత ప్రచారం చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఆనాడు అంబేడ్కర్ వివరించిన దానికి పూర్తి భిన్నంగా జరుగుతూ ఉంది. సెక్యులరిజం అంటే ‘మత ప్రమేయం లేని రాజ్యం’ అని అర్థం. ఈనాడు ప్రభుత్వం పూర్తిగా మతపరంగా వ్యవహరిస్తూ వుంది. ఇది భారత రాజ్యాంగ శిల్పి అంబేడ్కర్కూ, ఆయన ఆలోచనలకూ పూర్తిగా వ్యతిరేకమయిన విషయం. అందుకే రానురానూ అంబేడ్కర్ అవసరం పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అంబేడ్కర్ మేధావిగా గుర్తింపు పొందారు. లండన్లోని ‘ఇండియా హౌస్’లో ఆయన బంగారు విగ్రహం ఉంది. బ్రిటిష్ పార్లమెంట్ ఎదురుగా ఆయన నిలువెత్తు విగ్రహం ఉంది. ఇక భారత్లో సరేసరి. ఇండియన్ పార్లమెంట్ ఎదురుగా ఆయన సము న్నత విగ్రహం వుంది. ఇవాళ హైద్రాబాద్ నడిబొడ్డులో అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం వెలుగులీనుతోంది. విజయవాడలో 125 అడుగుల విగ్రహం జనవరిలో ఆవిష్కరించబడుతుంది. ఆయన రాజ్యాంగ నిర్మాణ దక్షత, ప్రతిభా సామర్థ్యాలను గుర్తిస్తూ కశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఆయన విగ్రహాలు నిరంతరం వెలుస్తూనే ఉన్నాయి. ఈనాడు ఆయన భావజాల అవసరం చాలా ఉంది. మన మందరం ఆయన వర్ధంతికి నివాళిగా ఆయన సిద్ధాంతా లైన కుల నిర్మూలన, అస్పృశ్యతా నివారణ, ఆర్థిక సమత, మానవ హక్కుల పోరాట దీక్షలతో బహుజన సాధికారిత రాజ్యాధికార భావనలతో ముందుకెళ్ళాల్సిన చారిత్రక సందర్భమిది. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 (రేపు డా‘‘ బి.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి) -
రాజ్యాంగంలో ఆ 'రెండు' పదాలు మిస్సింగ్: అధిర్ రంజన్ చౌదరి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన ప్రత్యేక పార్లమెంట్ సెషన్లలో భాగంగా మొదటిరోజు పాత పార్లమెంటుకు వీడ్కోలు పలకగా రెండో రోజు సభ్యులంతా కొత్త పార్లమెంటు భవనంలో అడుగు పెట్టారు. ఈ సందర్బంగా ఎంపీల చేతికి ఇచ్చిన భారత రాజ్యాంగం ప్రతుల్లో భారత రాజ్యాంగం ముందుమాటలో సాంఘిక, లౌకిక పదాలు లేకపోవడంపై కాంగ్రెస్ నేత అధిర్ రంజాన్ చౌదరి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఎంపీలంతా కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో వారి చేతికి భారత రాజ్యాంగ ప్రతులను అందించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తమకు ఇచ్చిన రాజ్యాంగ ప్రతుల్లోని పీఠికలో పొరపాట్లు ఉన్నాయన్నారు. అధిర్ రంజాన్ చౌదరి మాట్లడుతూ.. మాకు అందిచ్చిన రాజ్యాంగ ప్రతుల ప్రవేశికలో సాంఘిక, లౌకిక అన్న పదాలు ముద్రించలేదన్నారు. ఆ పదాలు రాజ్యాంగ పుస్తకంలో అంతకు ముందు లేవని 1976లో రాజ్యాంగ సవరణ తరవాతే ఆ పదాలను రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచారన్న విషయం నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఎవరైనా మన చేతికి రాజ్యాంగం అందించి అందులో ఈ పదాలు కనిపించకపోతే ఆందోళన చెందాల్సిందేనన్నారు. నాకు మాత్రం ఈ విషయం ఆందోళన కలిగించేదే. వారి ఉద్దేశ్యం చూస్తే నాకు అనుమానం కలుగుతోందన్నారు. నాకు ఈ విషయంలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. లేదంటే ఈ అంశం గురించి కచ్చితంగా ప్రస్తావించేవాడినని అన్నారు. ఇక ఇండియా పేరును 'భారత్'గా మార్చే అంశంపై మాట్లాడుతూ.. 'ఇండియా' 'భారత్' పేర్లలో ఏదైనా ఒక్కటే.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ఇండియాగా పిలవబడే భారత్, రాష్ట్రాల సమూహం అని కూడా సంబోధించారు. నా దృష్టిలో రాజ్యాంగం బైబిల్, ఖురాన్, భగవత్గీత గ్రంధాలకు ఏమాత్రం తక్కువకాదు. ఆ విషయంలో ఎవ్వరూ ఎటువంటి సమస్యను సృష్టించకుండా ఉంటే బాగుంటుందని అన్నారు. అధిర్ రంజాన్ చౌదరి, భారత రాజ్యాంగం, సాంఘిక, లౌకిక, రాజ్యాంగ పీఠిక ఇది కూడా చదవండి: పొలిటికల్ మైలేజి కోసమే బిల్లు పెట్టారు: కపిల్ సిబాల్ -
పరిషత్తులో అంబేడ్కరే లేకుంటే?!
‘‘స్వాతంత్య్ర పోరాటంలో అంబేడ్కర్ పోషించిన పాత్రేమీ లేకపోవడం ఆయన అద్భుతమైన జీవన ప్రగతిలో అత్యంత వివాదాస్పదమైన అంశం’’ అంటాడు అశోక్ లాహిరి. ఇదొక్కటే కాదు లాహిరి పుస్తకం ‘ఇండియా ఇన్ సెర్చ్ ఆఫ్ గ్లోరీ’ అంబేడ్కర్ గురించి వెల్లడించిన నమ్మశక్యం కాని నిజం. రాజ్యాంగ పరిషత్తుకు అంబేడ్కర్ ఏనాడూ నేరుగా ఎన్నికవలేదన్నదీ అలాంటి వాస్తవమే. 1945–46 ఎన్నికల్లో అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నిక కాలేకపోయినప్పుడు ఆయనకు స్థానం కల్పించడం కోసం ముస్లిం లీగ్ శాసనసభ్యుడు జోగేంద్రనాథ్ మండల్ తన స్థానాన్ని త్యాగం చేశారు. అంబేడ్కర్ ఆనాడు పరిషత్తు సభ్యుడిగా లేకుంటే భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం తయారై ఉండేదో ఊహించండి. ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి అని మనం నేడు చెప్పుకుంటున్న దేశం తన రాజ్యాంగ పితను కోల్పోయి ఉండేది. మన జాతిరత్నాల గురించి నిజంగా మనకు తెలుసునా? వాళ్లను మనం పీఠాలపై ప్రతిష్ఠించుకుని గౌరవించుకుంటాం. వారి గురించి తరచుగానూ, అనర్గళంగానూ మాట్లాడు కుంటూ ఉంటాం. వాళ్ల మాటల్ని కూడా యథాతథంగా స్వీకరించి మన జీవితాలకు బాటలు పరుచుకుంటాం. అయితే అదంతా వేరు, వాళ్ల గురించి తెలియడం వేరు. ఇటీవల నేను చదివిన ఒక పుస్తకం బి.ఆర్.అంబేడ్కర్ గురించి నాకు తెలియని అనేకమైన విషయాలను వెల్లడించింది. అవేవీ వాస్తవ విరుద్ధమైనవి కావు. అలాగే సుప్రసిద్ధమైనవి కూడా! అయితే అవి అందరికీ తెలిసిన మనిషిగా అంబేడ్కర్లో భాగమై ఉన్నవి కావు. ఎలాంటివంటే, నిజంగా ఆయనొక స్వాతంత్య్ర సమరయోధుడు కాదని మీకు తెలుసా? 1942 నుండి 1946 వరకు ఆయన వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. అంతకు ముందు, 1931లో ఆయన: ‘‘బ్రిటిష్ వారి నుండి భారత ప్రజలకు తక్షణ అధికార మార్పిడి జరగాలని అణగారిన వర్గాలవారు (అప్పుడు షెడ్యూల్డ్ కులాలు అని పిలిచేవారు) నిరసించలేదు. నినదించలేదు. ఉద్యమించలేదు’’ అని వ్యాఖ్యానించి ఉన్నవారు. ఈ విషయాన్ని నేను అశోక్ లాహిరి పుస్తకం ‘ఇండియా ఇన్ సెర్చ్ ఆఫ్ గ్లోరీ’ నుంచి గ్రహించాను. ‘‘స్వాతంత్య్ర పోరాటంలో అంబేడ్కర్ పోషించిన పాత్రేమీ లేకపోవడం అన్నది ఆయన అద్భుతమైన జీవన ప్రగతిలో అత్యంత వివాదాస్పదమైన అంశం’’ అంటాడు అశోక్ లాహిరి. అది నన్నెంతో విస్మయానికి గురి చేసిందని నేను ఒప్పుకొని తీరాలి. అయితే ఇదొక్కటి మాత్రమే కాదు లాహిరి పుస్తకం బహిర్గతం చేసిన నమ్మలేని నిజం. అంబేడ్కర్ అసలు రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికే కాలేదని తెలుస్తోంది. 1945–46 ఎన్నికల్లో ఆయన పార్టీ ‘ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్’ (ఎస్.సి.ఎఫ్.) 151 రిజర్వుడు సీట్లలో కేవలం రెండింటిని మాత్రమే గెలుచుకుంది. ‘బాంబే ప్రొవిన్షి యల్ అసెంబ్లీ’ నుంచి ఎస్.సి.ఎఫ్. ఒకే ఒక్క సీటును గెలుచుకున్న ఫలితంగా అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు కాలేకపోయారు. దాన్ని మించిన పరాజయం... అంబేడ్కర్కు మద్దతు ఇచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేకపోవడం! ‘‘డాక్టర్ అంబేడ్కర్కు రాజ్యాంగ పరిషత్తు తలుపులతో పాటుగా కిటికీలు కూడా మూసి వేయబడ్డాయి’’ అని సర్దార్ పటేల్ ప్రకటించారు. ‘‘చూద్దాం... రాజ్యాంగ పరిషత్తులోకి అతడెలా ప్రవేశిస్తాడో’’ అని కూడా అన్నారు. ఆ పరిస్థితుల్లో ముస్లిం లీగ్ శాసన సభ్యుడు జోగేంద్రనాథ్ మండల్ కాస్తా అంబేడ్కర్ వైపు నిలబడ్డారు. అంబేడ్కర్ కోసం తన సీటును త్యాగం చేశారు. అలా మండల్తో పాటు ఒకరిద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు, ఒకటీ లేదా రెండు ఆంగ్లో–ఇండియన్ ఓట్లతో బెంగాల్ నుంచి అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికయ్యారు.1947 జూలైలో మళ్లీ ఆయన ఇబ్బందుల్లో పడ్డారు. బ్రిటిష్ పార్లమెంటు భారత స్వాతంత్య్ర చట్టాన్ని ఆమోదించిన తర్వాత ఇండియాకు ఒకటి, పాకిస్థాన్కు ఒకటిగా రాజ్యాంగ పరిషత్తు విభజన జరిగింది. పర్యవసానంగా బెంగాల్ నుంచి అనేకమంది సభ్యులు తమ భారత రాజ్యంగ పరిషత్తు సభ్యత్వాన్ని కోల్పోయారు. వారిలో అంబేడ్కర్ ఒకరు. అయితే మళ్లొకసారి ఆయన్ని ఊహించని అదృష్టం కాపాడింది. కాంగ్రెస్ పార్టీతో విభేదాల కారణంగా ఎం.ఆర్. జయకర్ రాజీనామా చేయడంతో ఆయన స్థానం ఖాళీ అయింది. అంతేకాదు... ఈసారి భారతదేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు అంబేడ్కర్ సభ్యత్వా నికి తోడ్పాటును అందించేందుకు íసిద్ధమయ్యారు. వారిలో రాజ్యాంగ పరిషత్తు చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ ఒకరు. అప్పటి బొంబాయి ప్రధానమంత్రి బి.జి.ఖేర్కు ఆయన లేఖ రాశారు. ‘‘ఏ ఇతర పరిగణనలతోనూ నిమిత్తం లేకుండా తన సేవలను ఎవరూ వదులుకోలేని విధంగా ఉన్న ఆయన పనితీరును మాత్రమే గుర్తిస్తూ రాజ్యాంగ పరిషత్తులో, వివిధ కమిటీలలో ఆయన నియామకానికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఆయన బెంగాల్ నుంచి ఎన్నిక య్యారని మీకు తెలిసిందే! ఆ ప్రావిన్సు విభజన వల్ల 1947 జూలై 14 నుంచి ఆయన తన రాజ్యాంగ పరిషత్తు సభ్యత్వాన్ని కోల్పోవలసి వచ్చింది కనుక వెంటనే ఆయనను ఎన్నుకోవలసిన అవసరం ఉంది’’ అని అంబేడ్కర్కు ఆసరాగా నిలిచారు. చివరికి పటేల్ కూడా అంబేడ్కర్ పట్ల తన వైఖరి మార్చు కున్నారు. అంబేడ్కర్కు సభ్యత్వం ఇప్పించేందుకు ఖేర్ను ఒప్పించడంతో పాటు, జయకర్ రాజీనామా వల్ల ఏర్పడిన ఖాళీని భర్తీ చేయ బోయిన జి.వి. మావలంకర్కు నచ్చజెప్పి, ఆయన్ని పక్కకు తప్పించ డంలో పటేల్ కీలకమైన పాత్ర పోషించారని లాహిరి రాశారు. అంటే దేశానికి ఇది త్రుటిలో తప్పిన ముప్పు. అంబేడ్కర్ కనుక ఆనాడు రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడిగా లేకపోయుంటే ఎలాంటి రాజ్యాంగం తయారై ఉండేదో ఊహించండి. ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి అని మనం నేడు చెప్పుకుంటున్న దేశం తన రాజ్యాంగ పితను కోల్పోయి ఉండేది. ఈ పుస్తకంలోని నమ్మశక్యం కాని వాస్తవాలు నాలా మీలోనూ జనింపజేసే అవకాశం ఉన్న ఒక ప్రశ్నను లేవనెత్తడం ద్వారా నేను ఈ వ్యాసాన్ని ముగిస్తాను. అంబేడ్కర్కు, బహుశా భారతదేశానికి కూడా మార్గనిర్దేశం చేసిన హస్తం ఏదైనా ఉండిందా? అంబేడ్కర్ మన రాజ్యంగ పరిషత్తులో భాగం అని నిర్ధారించడానికి ఎవరిదైనా, లేదా ఏదైనా గట్టిగా ప్రభావం ఉన్నట్లు కనిపిస్తోంది. వాళ్లెవరు? అది ఏమిటి? అన్నదే ఆ ప్రశ్న. వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు, పార్లమెంట్ కంటే.. రాజ్యాంగమే సర్వోన్నతం
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు, పార్లమెంట్ కంటే రాజ్యాంగమే సర్వోన్నతమైనదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ అన్నారు. ఓ లీగల్ వెబ్సైట్ ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘పార్లమెంటు చట్టాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయా, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయా అనే తనిఖీ బాధ్యతను రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు అప్పగించింది. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ వల్ల న్యాయవ్యవస్థకు స్వతంత్రత పోతుందనే భావనతో దాన్ని రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ప్రకటించారని భావించరాదు’’ అని చెప్పారు. నిర్దిష్ట చట్టం, లేదా రాజ్యాంగ సవరణ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘిన్నాయా, లేదా అనేది న్యాయ వ్యవస్థ నిర్ణయించాలని జస్టిస్ లోకూర్ అభిప్రాయపడ్డారు. వ్యవస్థలన్నింటిలోనూ పార్లమెంటే అత్యున్నతమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో జస్టిస్ లోకూర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
అధికారంలో ఔన్నత్యం చాటుకోవాలి
షెడ్యూల్డ్ ఏరియాల్లో జరుగుతున్న సంక్షేమ విధానాలకు సంబంధించి రాష్ట్రపతి ఎప్పుడు అడిగినా, ఆయా రాష్ట్రాల గవర్నర్లు వెంటనే నివేదికలు అంద జేయాల్సి ఉంటుంది. అంటే ఆదివాసీలు నివసించే ప్రాంతాలలో జరుగుతున్న ఎటువంటి కార్యక్రమాలనైనా రాష్ట్రపతి పర్యవేక్షించవచ్చు. రోజురోజుకీ పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ఆదివాసీలను కుంగుబాటుకు గురిచేస్తున్నాయి. అందుకే ఒక ఆదివాసీ బిడ్డగా, ఒక నాయకురాలిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారాలను సంపూర్ణంగా వినియోగిస్తే ఆదివాసుల జీవితాల్లో కొంతైన వెలుగు రాకపోతుందా అన్న ఆశ ఆదివాసీలు, ప్రగతిశీల వాదుల్లో ఉంది. అలా జరిగితే ఓ మూలవాసీ మహిళ రాష్ట్రపతిగా ఎంపికవడమనే విషయానికి ఓ ఔన్నత్యాన్ని తీసుకొస్తుంది. ‘ఈ ఆర్టికల్ రాజ్యాంగంలోని అన్నింటి కన్నా ముఖ్యమైనది. అణగారిన వర్గాలకు సంబంధించి మనం కేవలం రిజర్వేషన్ల వరకే పరిమితమయ్యాం. కానీ అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను పరిష్క రించడానికి ఈ ఆర్టికల్ అవకాశం ఇస్తుంది. దీనిని సమర్థవంతంగా అమలు చేయడానికి రాష్ట్రపతికి శక్తి మంతమైన అధికారాలిచ్చే విధంగా ఈ ఆర్టికల్ను పొందుపరచాలి’’ అంటూ రాజ్యాంగ సభ సభ్యుడు పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ చేసిన వ్యాఖ్యలివి. భారత రాజ్యాంగ సభలో జూన్ 16, 1949న బాబాసాహెబ్ అంబేడ్కర్ ముసాయిదా రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా పండిట్ భార్గవ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాజ్యాంగ ముసాయిదాలో 301 నంబర్తో ఉన్న ఆర్టికల్ రాజ్యాంగ సభ ఆమోదం పొందిన రాజ్యాంగంలో 340గా పొందు పరి చారు. ‘‘భారత దేశంలో ఉన్న వెనుకబడిన తరగతులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక విద్యా విషయాలను పరిశోధించడానికి, పరిశీ లించడానికి రాష్ట్రపతి ఒక కమిషన్ను ఏర్పాటు చేయవచ్చును.’’ ఇది ఆర్టికల్ 340 సారం. అయితే ఇప్పటి వరకూ రాష్ట్రపతి పదవిని పొందిన చాలామంది ఇటువంటి ప్రయత్నాలు చేయలేదు. పదవ రాష్ట్రపతిగా పనిచేసిన డా.కె.ఆర్.నారాయణన్ మినహాయింపు. 2000 జూలై 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగిన గవర్నర్ల సదస్సులో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రత్యేకించి బడ్జెట్ కేటాయింపులు, విని యోగం, దారిమళ్ళింపు సమస్యలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అత్యాచా రాల నిరోధక చట్టం అమలును గురించి అధ్యయనం చేయడానికి ఏడుగురు గవర్నర్లతో ఒక కమిటీని నియమించారు. అప్పటి మహా రాష్ట్ర గవర్నర్ పి.సి. అలెగ్జాండర్ అధ్యక్షతన, మేఘాలయ గవర్నర్ ఎం.ఎం. జాకబ్, కేరళ గవర్నర్ ఎస్.ఎస్. కాంగ్, కర్ణాటక గవర్నర్ వీఎస్ రమాదేవి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ సూరజ్ భాను, ఒడిషా గవర్నర్ ఎం.ఎం. రాజేంద్రన్, హరియాణా గవర్నర్ బాబు పరమా నంద్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 2000 ఆగస్టు 8న ఏర్పడిన కమిటీ, 2001 ఏప్రిల్ 28న తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. ఈ నివేదికలో భూ పంపిణీ, విద్య, గృహ వసతి, ప్రజారోగ్యం, వృత్తి, వ్యాపార అభివృద్ధి పథ కాలు, వీటన్నింటితో పాటు ఈశాన్య రాష్ట్రాల ప్రగతిపైనా ఎన్నో సిఫారసులు చేసింది. నిజానికి స్వాతంత్య్రానంతరం ఎస్సీ, ఎస్టీల సమస్యలపై అత్యున్నతమైన స్థానంలో ఉన్న గవర్నర్లు అన్ని రాష్ట్రాలు తిరిగి, సంబంధిత మంత్రులు, అధికారులు, సామాజిక వర్గాల సంస్థలు, సంఘాలతో సమావేశం కావడం విశేషం. అయితే అప్పటి ఎన్డీయే ప్రభుత్వం ఈ నివేదికను పట్టించుకోలేదు. కానీ ఈ కమిటీ ప్రయత్నం ఊరికేపోలేదు. ఎస్సీ, ఎస్టీల సమస్య పరిష్కారం కోసం పనిచేసే సంస్థలకు ఒక ఆయుధమై నిలిచింది. ఎన్నో రాష్ట్ర ప్రభు త్వాలు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్నాయి. ఈ విషయాలను ప్రస్తావించడానికి ఇప్పుడొక సందర్భం వచ్చింది. 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు కావస్తోంది. దక్షిణ భారతదేశ విడిది హైదరాబాద్లో ప్రస్తుతం రాష్ట్రపతి మొదటిసారి ఉంటున్నారు. రాష్ట్రపతికి ప్రభుత్వా లను కాదని, మార్పులు చేయగలిగే అధికారం లేకపోయి ఉండవచ్చు. కానీ 339, 340 ఆర్టికల్స్ ప్రకారం, అదేవిధంగా 5వ షెడ్యూల్లో షెడ్యూల్ తెగల కమిటీల రక్షణ విషయంలో రాష్ట్రపతి అధికారాలను, చొరవను రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. రాజ్యాంగ పరిధిలో, అది అందించిన అధికారాలను ఉపయోగించి ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం రాష్ట్రపతికి ఉంటుంది. దేశంలోని ఒక ప్రధాన ఆదివాసీ తెగౖయెన సంథాల్ సమూహానికి చెందిన మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ విషయంలో నారాయణన్ చూపిన చొరవను చూపాలనే ఆకాంక్షతోనే వీటన్నింటినీ ప్రస్తావిం చాల్సి వస్తోంది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 339 ప్రకారం, క్లాజు ఒకటి చెపుతున్న ఒక చట్టబద్ధమైన కమిషన్ ఇప్పటికే అమలులో ఉంది. ఆర్టికల్ 339 క్లాజు–2 కూడా రాష్ట్రపతికి ఎస్టీల సంక్షేమ కార్య క్రమాల రూపకల్పన, సమీక్ష విషయాలలో అధికారాలను ఇచ్చింది. ‘‘రాష్ట్రాల్లో ఎస్టీ సంక్షేమ కార్యక్రమాలను రూపొందిస్తున్న తీరును పరిశీలించి, వారికి తగు నిర్దేశకత్వం ఇవ్వవచ్చు’’ అనే క్లాజు ఒక ముఖ్యమైన అంశం. అదేవిధంగా 5వ షెడ్యూల్ కేవలం ఆదివాసీల రక్షణకు ఉద్దే శించిన హక్కుల పత్రం. ఐదవ షెడ్యూల్లో పేర్కొన్న హక్కుల రక్షణలో రాష్ట్రపతి పర్యవేక్షణ ప్రధానమైనది. ఐదవ షెడ్యూల్ పార్ట్ (ఎ)లో పేర్కొన్న మూడవ అంశం గురించి ప్రస్తావించుకుందాం. ఆదివాసీలు నివసించే ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాగా గుర్తించాలి. అక్కడ అమలు జరుగుతున్న సంక్షేమ విధానాలకు సంబంధించి ప్రతి సంవత్సరం లేదా రాష్ట్రపతి ఎప్పుడు అడిగినా, దేన్ని గురించి అడిగినా ఆయా రాష్ట్రాల గవర్నర్లు వెంటనే నివేదికలు అందజేయాలని నిర్దేశించారు. అంటే ఆదివాసీలు నివసించే ప్రాంతాలలో జరుగుతున్న ఎటువంటి కార్యక్రమాలనైనా రాష్ట్రపతి పర్యవేక్షించవచ్చు. తగు సూచ నలు, సలహాలు చేయవచ్చు. అదేవిధంగా పార్ట్(బి)లో 4వ అంశం ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్(టీఏసీ)కు విస్తృతమైన అధికారాలున్నాయి. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా లన్నా, ఆదివాసీలకు సంబంధించి ఎటువంటి చట్టాలు చేయాలన్నా, ఆ ప్రాంతాల్లో ఏదైనా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలన్నా, ట్రైబల్ అడ్వై జరీ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పా టుకు సంబంధించి కూడా నిర్దిష్టమైన విధానాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. టీఏసీలో 20 మంది సభ్యులకు మించి ఉండ కూడదనీ, వీరిలో 3/4వ వంతు ఆ రాష్ట్ర ఎస్టీ ఎమ్మెల్యేలు ఉండాలనీ నిబంధన కూడా ఉంది. ఆదివాసుల హక్కుల కోసం అన్ని రకాల చట్టాల అమలును పర్యవేక్షించడం, రాజ్యాంగ హక్కులను కాపాడడం టీఏసీ బాధ్యత. అయితే ప్రస్తుతం చాలా రాష్ట్రాలలో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అస్తిత్వం నామమాత్రంగానే మిగిలిపోవడవం బాధాకరం. చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ సలహా మండలిని పట్టించుకున్న పాపానపోలేదు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న ఆర్థిక, సామాజిక స్థితిగతులు, ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు ఆదివాసీ ప్రాంతాల్లో చేపడుతున్న ప్రాజెక్టుల తీరుచూస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సలహా మండళ్లను సంప్రదిస్తున్న దాఖలాలే లేవు. ఇటువంటి సందర్భంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాత్ర కీలకమౌతోంది. ఒక మహిళగా, ఆదివాసీ బిడ్డగా, అడవిబిడ్డల పేగు తెంచుకొని పుట్టిన ఒక నాయకురాలిగా రాజ్యాంగంలో పొందుపరిచిన రాజ్యాంగ అధికారాలను సంపూర్ణంగా వినియోగిస్తే ఆదివాసుల జీవితాల్లో కొంతైన వెలుగు రాకపోతుందా అన్న ఆశ ఆదివాసీలు, ప్రగతిశీల వాదుల్లో ఉంది. రోజు రోజుకీ పెరుగుతున్న ఆర్థిక అసమా నతలు, సామాజిక వ్యత్యాసాలు ఆదివాసీలను మరింత వెనుకబాటు తనానికి గురిచేస్తున్నాయి. ఆదివాసీల స్థితి గతులపై ఒక అధ్యయనం జరిపి, వారి సమస్యలకు ఒక సమగ్ర పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తే, ద్రౌపది ముర్ములాంటి ఓ మూలవాసీ మహిళ రాష్ట్రపతిగా ఎంపికవడమనే విషయానికి ఓ ఔన్నత్యాన్ని తీసుకొస్తుంది. అణచి వేతకు గురౌతున్న ఆయా వర్గాల ప్రాతినిధ్యం అక్షరాలా సరైనదని రుజువవుతుంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 81063 22077 -
Constitution Day: ప్రాథమిక విధులే ప్రాథమ్యం
న్యూఢిల్లీ: ప్రాథమిక విధుల నిర్వహణే పౌరుల ప్రథమ ప్రాథమ్యంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అప్పుడే దేశం ఉన్నత శిఖరాలకు చేరుతుందన్నారు. వాటిని పూర్తి అంకితభావంతో, చిత్తశుద్ధితో పాటించాలని పిలుపునిచ్చారు. నాడు గాంధీ మహాత్ముడు కూడా ఈ మేరకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం సుప్రీంకోర్టులో జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. అన్ని రంగాల్లోనూ వృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతున్న భారత్వైపే ప్రపంచమంతా చూస్తోందన్నారు. వచ్చే ఏడాది జీ 20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్షత వహించనుండటాన్ని ప్రపంచ శ్రేయస్సులో మన పాత్రను అందరి ముందుంచేందుకు అతి గొప్ప అవకాశంగా అభివర్ణించారు. ‘‘ప్రపంచం దృష్టిలో దేశ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు మనమంతా కలసికట్టుగా కృషి చేయాలి. ఇది మనందరి బాధ్యత. కేంద్రం అనుసరిస్తున్న ప్రజానుకూల విధానాలు పేదలను, మహిళలను సాధికారత దిశగా నడుపుతున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రాచీనకాలం నుంచి వస్తున్న విలువలను కొనసాగిస్తూ ప్రజాస్వామ్యానికి మాతృకగా భారత్ అలరారుతోంది. ఈ గుర్తింపును మరింత బలోపేతం చేయాలి’’ అని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రానంతరపు కాలంలో జాతి సాంస్కృతిక, నైతిక భావోద్వేగాలన్నింటినీ మన రాజ్యాంగం అద్భుతంగా అందిపుచ్చుకుందని కొనియాడారు. స్వతంత్ర దేశంగా భారత్ ఎలా మనుగడ సాగిస్తుందోనన్న తొలినాటి అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ భిన్నత్వమే అతి గొప్ప సంపదగా అద్భుత ప్రగతి సాధిస్తూ సాగుతోందన్నారు. ‘‘వందేళ్ల స్వతంత్ర ప్రస్థానం దిశగా భారత్ వడివడిగా సాగుతోంది. ఇప్పటిదాకా నడిచింది అమృత కాలమైతే రాబోయే పాతికేళ్లను కర్తవ్య కాలంగా నిర్దేశించుకుందాం. ప్రాథమిక విధులను పరిపూర్ణంగా పాటిద్దాం. రాజ్యాంగంతో పాటు అన్ని వ్యవస్థల భవిష్యత్తూ దేశ యువతపైనే ఆధారపడి ఉంది. రాజ్యాంగంపై వారిలో మరింత అవగాహన పెంచాల్సిన అవసరముంది. అప్పుడే సమానత్వం, సాధికారత వంటి ఉన్నత లక్ష్యాలను వారు మరింతగా అర్థం చేసుకుని ఆచరిస్తారు’’ అని చెప్పారు. రాజ్యాంగ పరిషత్తులో మహిళా సభ్యుల పాత్రకు తగిన గుర్తింపు దక్కలేదని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘అందులో 15 మంది మహిళలుండేవారు. వారిలో ఒకరైన దాక్షాయణీ వేలాయుధన్ అణగారిన వర్గాల నుంచి వచ్చిన మహిళామణి’’ అని గుర్తు చేశారు. దళితులు, కార్మికులకు సంబంధించి పలు ముఖ్యమైన అంశాలు రాజ్యాంగంలో చోటుచేసుకునేలా ఆమె కృషి చేశారన్నారు. 26/11 మృతులకు నివాళి 2008 నవంబర్ 26న ముంబైపై ఉగ్ర దాడికి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వాటిలో అసువులు బాసిన వారిని మోదీ గుర్తు చేసుకున్నారు. వారికి ఘనంగా నివాళులర్పించారు. ఇ–కోర్టు ప్రాజెక్టులో భాగంగా తీసుకొచ్చిన వర్చువల్ జస్టిస్ క్లాక్, జస్ట్ఈజ్ మొబైల్ యాప్ 2.0, డిజిటల్ కోర్ట్, ఎస్3వాస్ వంటి సైట్లు తదితరాలను ప్రారంభించారు. వీటిద్వారా కక్షిదారులు, లాయర్లు, న్యాయవ్యవస్థతో సంబంధమున్న వారికి టెక్నాలజీ ఆధారిత సేవలందించేందుకు వీలు కలగనుంది. వేడుకల్లో కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
Constitution: పౌరులకు పట్టం కట్టిన పత్రం
నేడు భారత రాజ్యాంగ దినోత్సవం. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన మన రాజ్యాంగం సంపూర్ణ ఆమోదం పొందింది. అందువల్లనే ఏడు దశాబ్దాల తర్వాత కూడా అది ఒక పవిత్రమైన డాక్యుమెంటులా నిలిచి ఉంది. రాజ్యాంగాన్ని ఎంత చక్కగా, వివరంగా రాసుకున్నప్పటికీ... సంస్థలు, ప్రజలతో అది సంకేతాత్మక బంధాన్ని నెలకొల్పుకోవడంలో విఫలమైతే అలాంటి రాజ్యాంగానికి అర్థమే లేదని మన రాజ్యాంగ నిర్మాతలు చక్కగా గుర్తించారు. అందుకే తరం తర్వాత తరంలో రాజ్యాంగానికి ఆమోదనీయత పెరుగుతూనే వస్తోంది. అలాగే భారత రాజ్యాంగంతో మనసా వాచా అవిచ్ఛిన్న బంధాన్ని నెలకొల్పుకున్న దేశ సామాన్య పౌరుడికి కూడా మనం సెల్యూట్ చేయాల్సిన సమయమిది. వలస పాలనలో దాదాపు 200 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం మగ్గిన తర్వాత భారత దేశం 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి స్వతంత్రదేశంగా మారింది. జాతి ఎంతో కష్టపడి సాధించిన ఈ స్వాతంత్య్రం, దీర్ఘకాలం కొనసాగిన పోరాట ఫలితమే. తమ ప్రాణాలను అర్పించిన లేదా తీవ్రమైన నిర్బంధాన్ని చవిచూసిన వేలాదిమంది మన దేశవాసులతో పాటు ఈ పురాతనమైన, ఘనమైన గడ్డమీది సాధారణ పౌరులు కూడా కన్న కలల ఫలితమే ఈ స్వాతంత్య్రం. వలస పాలనకు పూర్వ సహస్రాబ్దంలో అంతర్జాతీయ ఆర్థిక, సాంస్కృతిక శక్తి కేంద్రంగా భారతదేశం గుర్తింపు పొందుతూ వచ్చింది. కానీ, స్వాతంత్య్రం పొందిన నాటికి దారిద్య్ర భారతాన్ని వారసత్వంగా పొందాము. దీంతో భారత నవయువ రిపబ్లిక్తో దీర్ఘకాల ప్రయోగంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేకించి నిరక్షరాస్యత అలుముకున్న, దారిద్య్రం పేరుకున్న, ఆధునిక ప్రజాతంత్ర వ్యవస్థలు, సంస్థలు లేని మన జాతికి సార్వత్రిక వయోజన హక్కును కల్పించే విషయంలో, ప్రజాస్వామిక ఆదర్శ పాలనను చేపట్టడానికి సంబంధించిన ఆకాంక్షను వ్యక్తపరిచే విషయంలో పలు సందేహాలు అలుముకున్నాయి. అయితే రెండు వేల సంవత్సరాల క్రమంలో ఏర్పడుతూ వచ్చిన మన ప్రజాస్వామిక విలువలను లోతుగా అర్థం చేసుకున్న రాజ్యాంగ నిర్మాతలు... విధ్వంసం తప్పదని జోస్యం చెబుతున్న సంశయ వాదులను చూసి భయపడకుండా గట్టిగా నిలబడ్డారు. రాజ్యాంగ సభ సభ్యులు, మన గ్రామ గణతంత్రాలలో రూపు దిద్దుకుని ఉన్న సాంప్రదాయిక భాగస్వామ్య పాలనా రూపాలను లోతుగా అర్థం చేసుకున్నారు. అయితే అన్నిటికంటే మించి మన రాజ్యాంగ రూపకర్తలకు మార్గనిర్దేశం చేసిన ముఖ్యమైన విషయాన్ని చెప్పుకొని తీరాలి. సగటు భారతీయ పౌరుల ప్రజాస్వామిక సున్నితత్వంపై వారు సంపూర్ణ విశ్వాసం ఉంచారు. ఇది లేకుంటే భారత్ తనను తాను ఒక ప్రజాస్వామ్య మాతగా న్యాయబద్ధంగానే ప్రకటించుకోలేకపోయేది. ఆధునిక చరిత్రలో ‘అమృత్ కాల్’లోకి జాతి ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసేలా మన మార్గాన్ని ప్రకాశవంతం చేసేందుకు మన రాజ్యాంగ పునాదిని రూపొందించిన ఆదర్శాలు, మూల సూత్రాలు నేటికీ బలంగా కొనసాగుతున్నాయి. డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించిన రాజ్యాంగ సభ, బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్ అధ్యక్షత వహించిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ చేసిన నిర్విరామ ప్రయత్నాల వల్లే భారత రాజ్యాంగం మనకు వరప్రసాదమైంది. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన మన రాజ్యాంగం సంపూర్ణ ఆమోదం పొందింది. అందువల్లనే ఏడు దశాబ్దాల తర్వాత కూడా అది ఒక పవిత్రమైన డాక్యుమెంటులా నిలిచి ఉంది. ప్రత్యేకించి రాజ్యాంగాల జీవితకాలం తరచుగా తక్కువగా ఉంటున్న, కొత్తగా విముక్తి పొంది అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో భారత రాజ్యాంగం సాధించిన విజయం సామాన్యమైంది కాదు. భారత రాజ్యాంగం మనసా వాచా ఎల్లప్పుడూ పౌరులందరి ఆత్మగౌరవం, సంక్షేమం కోసం నిలబడింది. దేశంలో రాజ్యాంగ ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంలో ప్రభుత్వ అంగా లన్నీ దశాబ్దాలుగా దోహదం చేస్తూ వచ్చాయి. దీని కారణంగానే మన దేశం ఆకలి, నిరక్షరాస్యత, దారిద్య్రం, వెనుకబాటుతనం వంటి వాటిని నిర్మూలించి, సమగ్ర అభివృద్ధి, జవాబుదారీతనం, పారదర్శ కత వైపు అలుపు లేని ప్రయాణం సాగించడానికి వీలుపడింది. ఈ క్రమంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని, రాజకీయ సుస్థిరతను దేశం సాధించగలుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్వావలంబనను, సమానతను, దేశ పౌరులందరికీ నాణ్యమైన జీవితాన్ని కల్పించే కృషిని ప్రోత్సహిస్తున్న ఆధునిక సంక్షేమ రాజ్యంగా మారడానికి మన ప్రయాణాన్ని భారత రాజ్యాంగం సులభతరం చేసింది. రాజ్యాంగం అంటే ప్రకరణాలు, నిబంధనల సమాహారం మాత్రమే కాదు. భారత రాజ్యాంగపు అత్యంత ప్రధాన అంశం ఏమిటంటే, అది శిలాజం కాదు, ఒక సజీవ పత్రం. దీంట్లో మన జాతి ప్రాథమిక విలువలకు, నాగరికతకు ఆశ్రయమిచ్చే అనుల్లంఘనీయ మైన కేంద్రకం ఉంటుంది. అదే సమయంలో వేగంగా మారిపోతున్న ప్రపంచంలో ప్రజా ప్రయోజనాల డిమాండ్లకు ప్రతిస్పందించేలా ఎప్పటికప్పుడు మార్చుకోగల సరళమైన నిర్మాణాన్ని కూడా ఇది బల పరుస్తుంది. ఈ సరళత వల్లే పార్లమెంటు ఎప్పటికప్పుడు ప్రజా కేంద్ర కమైన రాజ్యాంగ సవరణలను చేయగలుగుతోంది. 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పూర్తి చేసుకున్న మనం ఒక జాతిగా ఇంత వరకు సాగించిన ప్రయాణం పట్ల, విభిన్న రంగాల్లో మనం సాధించిన విజయాల పట్ల గర్వపడవచ్చు. ‘అమృత్ కాల్’లోకి మనం ప్రవేశిస్తూ, స్వావలంబనతో కూడిన, బలమైన ఐక్యమైన మహా జాతిగా వచ్చే 25 సంవత్సరాల్లో మారాలనే మన స్వప్న సాకారం కోసం మనల్ని మనం పునరంకితం చేసుకుంటున్నాము కాబట్టి మన ప్రజల్లో, మన రాజ్యాం గంలో మన విశ్వాసాన్ని మరోసారి ప్రకటించుకునే తరుణం ఇదే. ‘అమృత్ కాల్’లో భాగమైన ‘పంచ ప్రాణ్’ అంటే అర్థం, వచ్చే పాతికేళ్లలో అభివృద్ధి చెందిన భారత్ గురించి మనం చేసుకున్న తీర్మానం మాత్రమే. వలసవాద ఆలోచనా తీరునుంచి బయట పడటం, మన వారసత్పం పట్ల గర్వపడటం, ఐక్యతను, సంఘీ భావాన్ని బలోపేతం చేసుకోవడం, పౌరుల్లో కర్తవ్య పరాయణత్వాన్ని పోషించడం వంటి లక్ష్యాలు... 1949 నవంబర్ 26న మనం చట్ట రూపంలోకి మార్చుకుని ఆమోదించిన రాజ్యాంగ ఆదర్శాలను గుర్తిం చడంలో నిస్సందేహంగా తోడ్పడతాయి. 1931లోనే మహాత్మా గాంధీ రాశారు: ‘‘నైతిక బానిసత్వం నుంచి, ఆధారపడటం నుంచి భారత్ను విముక్తం చేసే రాజ్యాంగం కోసం నేను పరితపిస్తాను. అత్యంత నిరు పేదలు సైతం ఇది నా దేశం అని భావించే భారత్ కోసం నేను కృషి చేస్తాను. అగ్రకులం, తక్కువ కులం అనే తేడా లేని భారత్ కోసం నేను శ్రమిస్తాను. అన్ని సామాజిక బృందాలు సామరస్యంతో కలిసి జీవించే భారత్ కోసం నేను కృషి చేస్తాను. అలాంటి భారతదేశంలో అంటరాని తనం అనే శాపానికి తావు ఉండకూడదు. దోపిడీకి గురికావడం కానీ, దోపిడీ చేయడం కానీ లేని ప్రపంచంలో శాంతియుతంగా ఉండగలం. ఇదే నా స్వప్నాల్లో ఉంటున్న భారతదేశం.’’ సామాన్యుడిని కేంద్రస్థానంలో ఉంచగల రాజకీయ సౌర్వభౌమా ధికారం కలిగిన రాజ్యాంగం కోసం స్వాతంత్య్ర సమరం కాలంలోని రాజకీయ నేతలు ప్రయత్నించారు. సామాన్యుడి సంక్షేమం, ఆత్మ గౌరవానికి రాజ్యాంగంలో కీలక స్థానం ఉంటోంది. ‘పంచ ప్రాణ్’ను తీసుకుని, దాని సాకారం కోసం మనస్ఫూర్తిగా పనిచేయగలగాలి. అప్పుడే మన ప్రజాస్వామిక నైతిక విలువలు సంపూర్ణ వికసనాన్ని చూస్తాయి. అసంఖ్యాక స్వాతంత్య్ర సమరయోధుల స్వప్నాలను, త్యాగాలను గుర్తిస్తాయి. అప్పుడు మాత్రమే రెండు సహస్రాబ్దాలుగా మనం న్యాయబద్ధంగానే సాధించుకుని ఉన్న అగ్రగామి ప్రపంచ దేశంగా భారతదేశాన్ని తిరిగి నెలకొల్పగలుగుతాము. రాజ్యాంగం ప్రజలకు అధికారం కట్టబెడుతున్నట్లే, ప్రజలు కూడా రాజ్యాంగానికి అధికారం కట్టబెడతారు. రాజ్యాంగాన్ని ఎంత చక్కగా, వివరంగా రాసుకున్నప్పటికీ, సంస్థలు, ప్రజలతో అది సంకేతాత్మకంగా బంధాన్ని నెలకొల్పుకోవడంలో విఫలమైతే అలాంటి రాజ్యాంగానికి అర్థమే లేదని మన రాజ్యాంగ నిర్మాతలు చక్కగా గుర్తించారు. రాజ్యాంగ సభలోని ఒక గొప్ప వ్యక్తి ముందుచూపు, మేధాతత్వం, చాతుర్యం అనేవి రాజ్యాంగానికి రూపురేఖలు దిద్ద డంలో తోడ్పడ్డాయి. తరం తర్వాత తరంలో రాజ్యాంగానికి ఆమోద నీయత పెరుగుతూనే వస్తోంది. అలాగే భారత రాజ్యాంగంతో మనసా వాచా అవిచ్ఛిన్న బంధాన్ని నెలకొల్పుకున్న దేశ సామాన్య పౌరుడికి కూడా మనం సెల్యూట్ చేయాల్సిన సమయమిది. గత ఏడు దశాబ్దాల మన ప్రయాణంలోని ప్రతి సంక్లిష్టమైన మలుపులోనూ సామాన్య పౌరులే రాజ్యాంగ ఉన్నతాదర్శాల పట్ల తమ విశ్వాసాన్ని, నిబద్ధతను పునరుద్ధరించుకుంటా వస్తున్నారు. ఓం బిర్లా, వ్యాసకర్త, లోక్సభ స్పీకర్ (నేడు భారత రాజ్యాంగ దినోత్సవం) -
రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర
భారత రాజ్యాంగం దానికదే ఒక విప్లవం. రెండు వేల సంవత్సరాలకు పైగా ఉన్న ఒక అసమాన వ్యవస్థ నిర్మాణాన్ని అది బద్దలు చేసింది. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ఒక్కటి చేయగలిగింది. అయితే కొంతకాలంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతియ్యడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగమే రాజ్యాంగ పీఠిక నుంచి ‘సోషలిస్టు’ (సామ్యవాద), ‘సెక్యులర్’ (లౌకికవాద) పదాలను తొలగించాలని సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం! పైగా తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి సోషలిస్టు భావనను వ్యతిరేకించినట్టుగా అంబేడ్కర్ మాటలను ఆయన ఉటంకించారు. ఇది అంబేడ్కర్ను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకోవడమే! భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవాలంటే, ‘భారత రాజ్యాంగం అమలుకు ముందు, అటు తర్వాత’ అని చూడాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగానికి ముందు ఈ దేశంలో మనుషులంతా ఒక్కటి కాదు. కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడివడి ఉన్నారు. కుల సమాజాన్ని సృష్టించి, పెంచి పోషించిన మనువాదం ఒక పరిపాలనాపత్రంగా, అదే శాసనంగా, అదే రాజ్యాంగంగా అమలు అవుతూ సమాజంలో అంత రాలను ఇంకా బలంగా వేళ్ళూనుకొనేలా చేసింది. అలాంటి సంద ర్భంలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ రాజ్యాంగం ఒక్కటి చేయగలిగింది. అప్పటి వరకు కులాన్ని బట్టి విలువ ఉండేది. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క విలువను మనువాదం ప్రబోధించింది. కానీ భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒకే విలువను కల్పించి, కనీసం దానిలోనైనా ఒక సమానత్వ ప్రపంచాన్ని అందించింది. అందుకే భారత రాజ్యాంగం దానికదే ఒక విప్లవం. రెండు వేల సంవత్సరాలకు పైగా ఉన్న ఒక అసమాన వ్యవస్థ నిర్మాణాన్ని అది బద్దలు చేసింది. అయితే కొంతకాలంగా భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తియ్యడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగం గానే గతవారం కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి రాజ్యాంగ పీఠిక నుంచి ‘సోషలిస్టు’(సామ్యవాద), ‘సెక్యులర్’ (లౌకిక వాద) పదాలను తొలగించాలని పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ సెప్టెంబర్ 23న విచారణకు రానున్నది. ఇదే విషయమై, 2020 జూలైలో న్యాయవాది విష్ణు శంకర్ కూడా పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నేతృత్వంలోని ధర్మాసనం ముందు దీన్ని విచారించనున్నారు. సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలు రాజ్యాంగ సభ ద్వారా ఆమోదించిన పీఠికలో లేవనీ, 1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వీటిని చేర్చారనీ, రాజ్యాంగ సభ చర్చలలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లాంటి వాళ్ళు కూడా వీటిని వ్యతిరేకించారనీ ఈ పిటిషన్లో పేర్కొ న్నారు. పిటిషనర్గా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ మాటలను ఉటం కించినట్టు కనిపిస్తున్నది. అయితే, అంబేడ్కర్ మాటలను పరిశీలిస్తే సుబ్రహ్యణ్యస్వామియే అంబేడ్కర్ను తప్పుగా అర్థంచేసుకున్నట్టు కనిపిస్తున్నది. ఆ రోజు సభలో అంబేడ్కర్ మాట్లాడుతూ... ‘‘రాజ్యాం గాన్ని మనం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రూపొందించు కోవాలి. భవిష్యత్లో ప్రజలు ఎటువంటి విధానాలను అవలంబించా లనుకుంటారో వారికి అవకాశం ఇవ్వాలి. అంతేగానీ ఇప్పుడే అన్ని విషయాలను ముగించకూడదు. అంతేకాకుండా, రాజ్యాంగంలోని నాలుగవ భాగమైన ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా సోషలిస్టు భావనలను సమర్థిస్తు్తన్నాయనే విషయాన్ని గుర్తుం చుకోవాలి’’ అంటూ రాజ్యాంగ సభకు కేటీ షా ప్రతిపాదించిన సవరణకు సమాధానమిచ్చారు. అంబేడ్కర్ ఎక్కడా, సోషలిస్టు భావనను వ్యతిరేకించింది లేదు. పైగా దాని సారాంశాన్ని ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచినట్టు పేర్కొన్నారు. సరిగ్గా ఇక్కడే అంబేడ్కర్ను అర్థం చేసుకోవడానికి రాజ్యాంగ సభలో మాట్లాడింది మాత్రమే సరిపోదు. ఒకరకంగా అది అప్పటి నాయకుల ఉమ్మడి అభిప్రాయం కూడా కావచ్చు. అయితే అంబేడ్కర్ మొదటినుంచీ సమానత్వ సమాజ స్థాపనకు పాటుపడిన వ్యక్తి. అంతేకాకుండా, రాజ్యాంగ సభలో తాను సభ్యుడిగా ఉంటానో లేదో నని భావించి, 1946లో రాజ్యాంగ సభకు ఒక మెమోరాండంను సమర్పించారు. దానినే ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’ అంటారు. అందులో ప్రభుత్వం సోషలిస్టు విధానాలను అనుసరించాలని, దానికి స్టేట్ సోషలిజం అనే మాటను కూడా ఆయన వాడారు. అందులో ఆర్థికపరమైన అంశాలను పేర్కొంటూ– దేశంలోని భారీ పరిశ్రమలను ప్రభుత్వమే నిర్వహించాలనీ, ఇన్సూరెన్స్ లాంటి ఆర్థిక సంస్థలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలనీ, దేశవ్యాప్తంగా ఉన్న భూములను జాతీయం చేయాలనీ ప్రతిపాదించారు. ఈ విషయాలన్నింటినీ రాజ్యాంగంలో పొందుపరచడానికి తన శాయశక్తులా కృషి చేశారు. అయినా సఫలం కాలేదు. అటువంటి సామాజిక మార్పును కోరుకుని, దాని కోసమే యావత్ జీవితాన్నే ప్రజలకు సమర్పించిన ఓ మహో న్నత వ్యక్తి వ్యాఖ్యలను తప్పుగా, తమ సోషలిస్టు వ్యతిరేక భావాలకు మద్దతుగా వాడుకోవడం విచారకరం. ఈ విషయం అట్లా ఉంచితే, 1976లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ïపీఠికలో ‘సోషలిస్టు, సెక్యులర్’ అనే పదాలను మాత్రమే కాకుండా, ఇంకా చాలా విష యాలను రాజ్యాంగంలో చేర్చారు. అయితే 1977లో జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా విషయాలను 43వ సవరణ ద్వారా తొలగించారు. అయితే రాజ్యాంగ పీఠికలోని ఆ రెండు పదాల జోలికి మాత్రం పోలేదు. ప్రస్తుత పిటిషనర్ సుబ్రహ్యణ్యస్వామి అప్పుడు జనతాపార్టీ లోక్సభ సభ్యుడిగా గెలిచారు. మరి అప్పుడు తన గొంతును ఎందుకు వినిపించలేదో ఆయనకే తెలియాలి. 2008లో ‘గుడ్ గవర్నెన్స్ ఇండియా ఫౌండేషన్’కు చెందిన సంజీవ్ అగర్వాల్ ఇదే విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ నాయకత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్ను తిరస్కరించింది. ‘‘సోషలిజం అనగానే అదేదో కమ్యూనిస్టులకు సొంతమైనట్టు అను కోవడం సరైనది కాదు. ప్రజల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం కూడా అందులో భాగమే’’ అని వ్యాఖ్యానించింది. అందు వల్ల ఆ పదాలను తొలగించాల్సిన అవసరమే లేదని భారత అత్యు న్నత న్యాయస్థానం ఆనాడు కుండ బద్దలుకొట్టింది. ప్రస్తుతం మళ్లీ ఎందుకు ఈ ప్రతిపాదన ముందుకుతెస్తున్నారనేది ప్రశ్న. దీనికి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, సామాజిక విధానాలు... సోషలిస్టు, సెక్యులర్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ పరిశ్రమలను, ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా మైనారిటీ మతాలను, వాటికి సంబంధించిన సంస్థలను వేధిస్తుండడం ఎక్కువైందని అంత ర్జాతీయ సంస్థలు ఎన్నో నివేదికల ద్వారా వెల్లడించాయి. ఎవరైనా ఈ విషయాలన్నింటినీ కోర్టుల్లో సవాల్ చేస్తారని ముందే ఊహించి, వాటిని తొలగిస్తే ఇక నైతికంగా కూడా తమకు ఎదురు ఉండదని భావించి అటువంటి పిటిషన్ను అధికార పార్టీ సభ్యుడే వేయడం జరిగి ఉండొచ్చనే అభిప్రాయానికి రావడవం తప్పేమీకాదు. అదే విధంగా భారత దేశంలో హిందూమతాన్ని అధికార మతంగా చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. దానికి రాజ్యాంగాన్నే మార్చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టు సా«ధువులు, సంతులు స్వయంగా ప్రకటించారు. అందుకనుగుణంగానే ఇప్పటికే ముప్ఫై పేజీల డాక్యుమెంటు రూపొందించినట్టు కూడా ప్రకటించారు. ఇటువంటి నేపథ్యం నుంచి ఈ పీఠికను చూడాల్సి ఉంది. నిజానికి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు సోషలిస్టు, సెక్యులర్ స్ఫూర్తిని బలపరచడమే కాకుండా నిర్దిష్టమైన మార్గాన్ని చూపుతున్నాయి. సోషలిస్టు, సెక్యులర్ పదాలు భారత రాజ్యాంగాన్ని మరింత శక్తిమంతం చేస్తున్నాయే తప్ప ఎటువంటి దుష్ప్రభావాన్నీ కలిగించడం లేదు. భారత రాజ్యాంగ రక్షణ ఈ దేశ సామాజిక ప్రగతికీ, మనుగడకూ ఒక తక్షణ అవసరంగా ఉంది. అందువల్ల రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే ఇటువంటి కుట్రలను భారత సమాజం సహించబోదని ఆశిద్దాం. (చదవండి: చరిత్రను పాతిపెట్టి ఏం బావుకుంటారు?) - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
ఆంగ్ల సహన పాఠం నేర్చుకుందామా?
బ్రిటన్ ఒకప్పుడు భారత దేశ వలసాధిపతిగా ఉండేది. కానీ ప్రస్తుతం భారత సంతతికి చెందిన ఒక కన్సర్వేటివ్ పార్టీ నాయకుడు బ్రిటన్ ప్రధానమంత్రి పదవి బరిలో ఉన్నారంటేనే ప్రపంచం ఎంతగా మారిపోయిందో బోధపడుతుంది. క్రైస్తవులకు ప్రాధాన్యత ఉన్న బ్రిటన్లో రిషీ సునాక్ తనది హిందూమతం అని చెబుతూ, ప్రధాని అభ్యర్థిగా బరిలో నిలబడుతున్నారు. అక్కడి ప్రతిపక్ష నేత లేదా ప్రధాని పదవికి పోటీచేస్తున్న ఆయన పార్టీకి చెందిన వారెవరూ కూడా సునాక్ మతాన్ని ప్రశ్నించడం లేదు. అతడి సంపదను ప్రశ్నిస్తున్నారు. కార్మికవర్గం పట్ల అతడి వైఖరిని ప్రశ్నిస్తున్నారు. కానీ అదే భారత్లో ఒక ముస్లిం, లేదా క్రిస్టియన్ని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించేవారు కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి బ్రిటన్... సహన భావం గురించి, సమానత్వం గురించి ఇండియాకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతోంది. భారత సంతతికి చెందిన బ్రిటిష్ రాజకీయ నేత రిషీ సునాక్ కన్సర్వేటివ్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం పోటీపడుతున్నారు. కొన్ని సంవత్స రాల క్రితం అమెరికన్ అధ్యక్ష పదవికి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆమె తర్వాత రాజకీయ ఉన్నత పదవిని అందుకోవడానికి పశ్చిమ దేశాల్లోని భారత సంతతి వలస ప్రజల్లో ఇటీవల వేగంగా దూసుకొచ్చిన వ్యక్తి రిషీ సునాక్. బ్రిటన్ ఒకప్పుడు భారత దేశ వలసాధిపతిగా ఉండేది. భారతీయ కోణం నుంచి చూస్తే బ్రిటిష్ ప్రధానమంత్రి అంటే దోపిడీ సామ్రాజ్యానికి చారిత్రాత్మకమైన రాజకీయ ప్రతినిధిగా మాత్రమే కనిపిస్తారు. అదే సమయంలో అది సంస్కరణల సామ్రాజ్యం కూడా అని గుర్తుంచుకుందాం. మరి బ్రిటిష్ వలస పాలనా కోణం నుంచి చూస్తే, దానికి వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం హక్కుల ప్రాతి పదికన పోరాటం చేసి ఉండకపోతే, భారతదేశం 1947లో ప్రజాస్వామిక, రాజ్యాంగబద్ధ రిపబ్లిక్ అయి ఉండేదికాదు. హిందూ లేదా బౌద్ధం... అది ఏదైనా కావచ్చు, మన ప్రాచీన నిర్మాణాలలోనే మన ప్రజాస్వామ్యానికి మూలాలు ఉన్నాయని మనం ఎంత గట్టిగా చెప్పుకున్నప్పటికీ. చర్చలో మతం లేదు మన స్వాతంత్య్ర పోరాటం, వలస జీవితానికి సంబంధించిన అన్ని కీలక అంశాలూ బ్రిటిష్ రాజకీయ వ్యవస్థతో అనుసంధానమై ఉండేవి. ప్రత్యేకించి 20వ శతాబ్ది ప్రారంభం నుంచి బ్రిటిష్ ప్రధాని అంటే వలసపాలనా చిహ్నంగానే భారతీయ ఆందోళనాకారులు భావించేవారు. దూషించడానికైనా, అభ్యర్థించడానికైనా బ్రిటిష్ ప్రధానే మన తలపుల్లో ఉండేవారు. ఈ చారిత్రక నేపథ్యంలో, ప్రస్తుతం భారత సంతతికి చెందిన ఒక కన్సర్వేటివ్ పార్టీ నాయకుడు బ్రిటిష్ ప్రధానమంత్రి పదవి కోసం బరిలో ఉన్నారంటేనే ప్రపంచం ఎంతగా మారిపోయిందో బోధపడుతుంది. హిందూ– జాతీయవాదం ప్రేరేపిస్తున్న వివక్షను భారత్ ఎదుర్కొంటున్న ఈ తరుణంలో క్రైస్తవులకు ప్రాధా న్యత ఉన్న బ్రిటన్లో ఒక వ్యక్తి తనది హిందూ మతం అని చెబుతూ, ప్రధాన మంత్రి పదవికి అభ్యర్థిగా బరిలో నిలబడుతున్నారు. బ్రిటన్ పార్ల మెంటు సభ్యుడిగా, తర్వాత ఆర్థిక మంత్రిగా ఆయన గతంలో భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేశారని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అదే హిందూ సునాక్... బ్రిటన్ ప్రధాని అధికారిక నివాస భవనమైన 10 డౌనింగ్ స్ట్రీట్కు వెళ్లాలని కోరుకుంటున్నారు. సునాక్ భార్య అక్షత హిందూ భారతీయ కోటీశ్వరుల కుమార్తె. సునాక్ సంపద ఇప్పుడు ప్రజల్లో చర్చించుకునే అంశమైంది. ఎందుకంటే ఆర్థిక, సామాజిక వర్గాలు చాలాకాలంగా బ్రిటిష్ రాజకీయాల్లో భాగంగా ఉంటున్నాయి. అయితే సునాక్ మతం మాత్రం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా కనిపించడం లేదు. బ్రిటన్ ఓటర్లు, రాజకీయ వర్గంలో గణనీయంగా గుర్తించదగిన బహుళ సాంస్కృతిక సహన స్థాయిని ఇది సూచిస్తోంది. ఈ కోణంలో, అమెరికా కంటే మరింత లౌకికమైన, బహుళ సాంస్కృతిక దేశం బ్రిటనే అని నేను అనుకుంటున్నాను. కమలా హారిస్ గనక తనను తాను హిందువు అని బహిరంగంగా చెప్పుకునివుంటే, డెమొక్రాటిక్ పార్టీ టికెట్ని గెల్చుకునేవారు కాదని నా అనుమానం. ఆంగ్లికన్ క్రిస్టియానిటీ బ్రిటన్ అధికార మతం. చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ హెడ్ ఎలిజబెత్ రాణి. అయినా సరే బ్రిటన్ ప్రధానమంత్రి కావాలన్న రిషీ సునాక్ కోరికను మత ప్రాతిపదికన అసంగతమైన అంశంగా అక్కడ ఎవరూ చూడటం లేదు. ఇదేనా సహనం? అదే భారతదేశం విషయానికి వస్తే, బ్రిటన్కు కాబోయే ప్రధానిగా అవకాశమున్న, దానికి అక్కడి సమాజ ఆమోదం పొందిన భారత సంతతి హిందువు గురించి ఆరెస్సెస్, బీజేపీ ఏమని ఆలోచిస్తాయో ఊహించగలరా? ఎందుకంటే వీళ్లు భారతీయ ముస్లింలను, క్రిస్టియన్లను మతపరమైన మెజారిటీవాద అజెండాతో అట్టడుగున పడేశారు. పార్లమెంటు ఉభయసభల్లో బీజేపీ తరపున ఒక్క ముస్లిం కూడా లేరు. అలాగే భారత ప్రభుత్వ మంత్రివర్గంలో ఒక్క ముస్లిం కూడా లేరు. (అదే బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని ఆయన మంత్రి వర్గంలో భారత్ కంటే ఎక్కువ ముస్లింలు ఉన్నారు.) హిందూయిజం ప్రపంచానికే విశ్వగురువుగా ఉందంటూ ఆరెస్సెస్, బీజేపీ శక్తులు పదేపదే ఎత్తిపడుతున్నాయి. ఇక ఆరెస్సెస్ సాహిత్యమంతా బ్రిటిష్ వారిపై, క్రిస్టియన్ నాగరికతా చరిత్రపై మతయుద్ధ వీరులు, వలసవాద విస్తరణవాదులు అంటూ దాడులతో నిండిపోయింది. దేశంలో ఇప్ప టికీ కొనసాగుతున్న కుల అంతరాలు, దళితులపై దౌర్జన్యాలు వంటి సామాజిక దుర్మార్గాలను ఏమాత్రం పట్టించుకోని ఈ కూటమి, ప్రపంచం లోనే అత్యంత సహనభావం కలిగినది హిందూ మతమేనని మాత్రమే గొప్పగా చెప్పుకుంటుంది. మరోవైపున వీరి తాజా చరిత్ర వర్ణనలో స్థానిక భారతీయ ముస్లింలను, క్రిస్టియన్లను కూడా శత్రువులుగా పరిగణిస్తున్నారు. నేడు బ్రిటన్లో హిందువులు చిన్న మైనారిటీగా ఉంటున్నారు. జనాభాలో వీరి వాటా 1.6 శాతం మాత్రమే. వీరు బ్రిటన్కి ఇటీవలే వలస వచ్చినవారు, వారి వారసులతో కూడి ఉన్నారు. అయినప్పటికీ మైనారిటీవాదం బ్రిటన్ ప్రజా స్వామిక పోటీలో ప్రధాన పాత్ర వహిస్తున్నట్లు కనిపించడం లేదు. అదే ఆరెస్సెస్, బీజేపీ భారత్లో గానీ, చివరకు గతకాలపు కాంగ్రెస్ హయాంలో గానీ ఒక ముస్లిం, లేదా క్రిస్టియన్ని ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా అంగీకరించేవారు కాదు. ఇలా హిందూయిజం సహనభావం గురించి చెప్పుకోవ లసింది చాలానే ఉంది మరి. ప్రజాస్వామ్యంలో అసలైన ప్రశ్నలు ఇవే... క్రిస్టియన్ వలసవాద సామ్రాజ్యాన్ని బ్రిటన్ సర్వవ్యాప్తం చేసింది. కానీ ఇప్పుడు అదే బ్రిటన్ అత్యున్నత పదవికి సునాక్ పోటీ చేయడాన్ని అనుమతిస్తోంది. బ్రిటన్లోని ప్రతిపక్ష నేత లేదా ప్రధాని పదవికి పోటీచేస్తున్న ఆయన పార్టీకి చెందిన వారెవరూ కూడా సునాక్ మతాన్ని ప్రశ్నిం చడం లేదు. అతడి సంపదను ప్రశ్నిస్తున్నారు. కార్మికవర్గం పట్ల అతడి వైఖరిని ప్రశ్నిస్తున్నారు. అతడి భార్య పన్ను ఎగవేత గురించి ప్రశ్నిస్తు న్నారు. ప్రజాస్వామ్యంలో సంధించవలసిన అసలు సిసలైన ప్రశ్నలు ఇవే. కానీ ఇలాంటి ప్రశ్నలు భారత్లో అరుదుగానే అడుగుతుంటారు. బ్రిటన్ ప్రధాని పదవికి రిషి సునాక్ వేసిన అభ్యర్థిత్వ ఫలితం పట్ల నేను అజ్ఞేయవాదిగానే ఉంటాను. బ్రిటన్ భావి ప్రధాని ఎంపికలో ఫలితాలు ఎలా అయినా ఉండనివ్వండి... కానీ పార్ల మెంటరీ ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి బ్రిటన్... సహన భావం గురించీ, సమానత్వం గురించీ భారతదేశానికి ఒక ముఖ్యమైన పాఠం నేర్పు తోందని నాకు తెలుసు. కానీ భారతదేశం మాత్రం ఆ పాఠాన్ని నేర్చుకునే దేశంగా మాత్రం ఉండటం లేదని నా భావన. వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
రాజ్యాంగంపై విమర్శలు: ఎట్టకేలకు మంత్రి సాజీ రాజీనామా
తిరువనంతపురం: భారత రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన.. కేరళ మత్స్యశాఖ మంత్రి సాజీ చెరియన్ తన పదవికి రాజీనామా చేశారు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారంటూ ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసే ఉంటుంది. ఈ తరుణంలో రాజకీయ ఒత్తిళ్ల మేరకు.. బుధవారం సాయంత్రం కేబినెట్ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వీలైనంత మంది సాధారణ ప్రజలను దోచుకునేలా మన రాజ్యాంగాన్ని రాశారని సాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పాతానమిట్ట జిల్లాలో జరిగిన సీపీఎం సమావేశాల్లో మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. చెరియన్ కామెంట్లపై రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చెరియన్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి విజయన్ ను గవర్నర్ కోరారు. మరోవైపు తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో చెరియన్ దిద్దుబాటు చర్యలకు దిగారు. తాను రాజ్యాంగాన్ని దూషించలేదని చెప్పారు. తనకు రాజ్యాంగంపై ఎంతో గౌరవం ఉందని అన్నారు. పాలనా వ్యవస్థ సరిగా లేదని, ఆ కోణంలోనే తాను మాట్లాడానని వివరణ ఇచ్చారు. అంతేకాదు, తాను చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) ఈ వ్యవహారంపై అసెంబ్లీలో వాయిదా తీర్మానాన్ని స్వీకరించడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో రాజ్యాంగాన్ని, రాజ్యాంగ రూపకర్తలను చెరియన్ అవమానించారంటూ వ్యతిరేక నినాదాలు చేశాయి విపక్షాలు. ఈ క్రమంలో చర్చ జరగకుండానే.. స్పీకర్ ఎంబి రాజేష్ సభను వాయిదా వేశారు. ఈ చర్యపై నిరసన వ్యక్తం చేస్తూ.. స్పీకర్ కార్యాలయంలో విపక్షాలు నిరసన చేపట్టాయి. చెరియన్ పై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోకుంటే కోర్టుకు వెళతామని హెచ్చరించాయి. బీజేపీ లేఖ రాయడం, చివరకు సొంత పార్టీ నేతల ఒత్తిళ్ల మేరకు ఆయనే రాజీనామా చేశారు. -
రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న మోదీ: భట్టి
ఎర్రుపాలెం: భారత రాజ్యాంగం, ప్రజా స్వామ్యాన్ని ప్రధాని మోదీ అపహాస్యం చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్ర మార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శనివారం ఎర్రుపాలెం మండలంలోని బనిగం డ్లపాడు, పెద్దగోపవరం, బంజర, కండ్రిక, తెల్లపాలెం, ఎర్రుపాలెం గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభల్లో భట్టి మాట్లాడుతూ అంబేడ్కర్ రాసిన రాజ్యాం గాన్ని కాకుండా మోదీ సొంత రాజ్యాంగం అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమ ర్శించారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికా రంలోకి రావడం ఖాయమని భట్టి ధీమా వ్యక్తం చేశారు. -
స్వతంత్ర భారతి: హిందూ వివాహ చట్టం
హిందూ వివాహ చట్టం 1955కి రూపకల్పన జరిగింది. అయితే ఈ చట్టం స్త్రీల పట్ల వివక్ష చూపుతోందనే విమర్శలూ ఉన్నాయి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 కింద సమానత్వానికి, ఆర్టికల్ 15 కింద వివక్షా రాహిత్యానికి హామీ ఇచ్చింది కానీ కుటుంబం లోపల వివాహ వ్యవస్థలో స్త్రీపై పురుషుడి ఆధిక్యత కొనసాగుతూనే ఉందన్నది కొందరు స్త్రీవాదుల పరిశీలన. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రూపొందిన 1955 నాటి హిందూ వివాహ చట్టాన్ని మనం పరిశీలించినప్పుడు వివక్ష అన్నది స్పష్టంగా కనిపిస్తుంది అని మహిళా హక్కుల న్యాయవాదుల అభిప్రాయం. ‘‘వివాహ వ్యవస్థ లోపల మహిళల ప్రతిపత్తి పురుషులతో పోలిస్తే చాలా వ్యత్యాసంతో ఉంటుంది. పురుషుడు సంపాదనాపరుడు, అతడి సంపాదనను ఆర్థిక పదబంధాలతో కొలుస్తారు. మహిళ గృహిణి. అంతే కాకుండా వివాహ వ్యవస్థ లోపల ఆమె అధీనురాలి స్థితిలో ఉంటుంది. ఆమె కుటుంబం, సమాజానికి చెందిన సాంస్కృతిక నియమాలను నిలబెట్టే స్థానంలో ఉంటుంది. అయితే వివాహ చట్టాల్లోపల వధూవరుల మధ్య ఉంటున్న ఈ అసమానతా స్థితిని ఎవరూ గుర్తించరు. ఇక విడాకులకు ప్రయత్నిస్తున్నప్పుడు స్త్రీపురుషులిరువురూ తమ పిటిషన్లను ఒకే నిర్దిష్ట భూమికపై సమర్పించాల్సి ఉంటుంది. అవేమిటంటే– వ్యభిచారం, పారిపోవడం, క్రూరత్వం! ఇందులో ఔచిత్యం లేదనిపిస్తుంది’’ అనే కోణం కూడా వారి అభిప్రాయంలో కనిపిస్తుంది. ఏమైనా హిందూ వివాహ చట్టంలో కొన్ని మార్పులైతే తప్పనిసరిగా జరగవలసి ఉందని ఇటీవలి కొన్ని కేసులలో మహిళల తరఫున వాదించే న్యాయవాదులు స్పష్టం చేశారు. అడ్డుపడుతున్న సెక్షన్ : విడాకుల పిటిషన్ కోర్టులో అపరిష్కృతంగా ఉన్న సమయంలో జరిగిన రెండో వివాహం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు 2018లో స్పష్టతనిచ్చింది. హిందూ వివాహ చట్టంలోని ‘వివాహ అనర్హత’ నిబంధన ద్వారా రెండో వివాహాన్ని రద్దుచేయలేమని ఆ కేసులో జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుల ధర్మాసనం తెలిపింది. విడాకుల పిటిషన్ పరిష్కృతమయ్యే వరకు రెండో వివాహంపై ఆంక్షలు విధించిన హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 15ను ఈ సందర్భంగా బెంచ్ ప్రస్తావించింది. ఇరు వర్గాలు (భార్యాభర్తలు) కోర్టు బయట సమస్యను పరిష్కరించుకుని, ఇక కేసును కొనసాగించొద్దని నిర్ణయించుకున్న సందర్భంలో సెక్షన్ 15 వర్తించదని తెలిపింది. అంతేకాదు, విడాకుల పిటిషన్ పెండింగ్లో ఉండగా జరిగిన వివాహం చెల్లదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. తన భార్యతో విడాకులు కోరుతూ దాఖలుచేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో పెండింగ్లో ఉన్న సమయంలోనే పిటిషన్ దారుడు మరో వివాహం చేసుకున్నారు. తొలి భార్యతో సమస్యను పరిష్కరించుకున్నానని, తమకు విడాకులకు అనుమతివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తన అప్పీల్ను వెనక్కి తీసుకోవడానికి అనుమతించాలని కోరారు. కానీ, విడాకుల పిటిషన్ పెండింగ్లో ఉండగా జరిగిన వివాహం చెల్లబోదని హైకోర్టు తీర్పునివ్వడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
మన రాజ్యాంగానికి కొత్త ప్రమాదం
భారత ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి చేసే ఏ ప్రయత్నమైనా ప్రమాదకరమే. అణచివేతకు గురైన, పీడిత వర్గాల ప్రజలు ఇంతకాలం పొందుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ దీంతో కోల్పోతారు. కులవ్యవస్థ, అంటరానితనం, ఆదిమతత్వం కారణంగానే భారతదేశంలో 1950కి ముందు సార్వత్రిక విద్య అనే భావనే ఉనికిలో లేదు. ప్రస్తుత రాజ్యాంగాన్ని అమలుపరచడం వల్లే పీడిత ప్రజలు అంతవరకు తమకు తెలీని ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకున్నారు. కాబట్టి ఏ రాజకీయ, సైద్ధాంతిక భావజాలం ఉన్న నాయకులైనా సరే... ఈ రాజ్యాంగాన్ని వెనక్కు నెట్టడాన్ని మనం ఎన్నటికీ అనుమతించకూడదు. భారత రాజ్యాంగం నిరవధికంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రెండు వ్యతిరేక రంగాల్లో పోరాటాన్ని ప్రారంభించారు. ఒకటి: బీజేపీ గద్దె దిగేంత వరకూ వారితో పోరా డుతూ ఉంటానన్నారు. రెండు: ఆరెస్సెస్, బీజేపీ వ్యతిరేకించిన 1950 నాటి రాజ్యాంగం స్థానంలో కొత్త రాజ్యాంగాన్ని ఆయన కోరు కున్నారు. పూర్తిగా విరుద్ధమైన రెండు యుద్ధరంగాలను అయన ఏక కాలంలో ఎందుకు ప్రారంభించినట్లు అనేది అసలు ప్రశ్న. ఆర్ఎస్ఎస్ మూలాలు సనాతన బ్రాహ్మణవాద ఆధ్యాత్మిక వ్యవస్థలో పాతుకుని ఉన్నాయి కాబట్టి దాన్నుంచి భారత రాజ్యాం గానికి ప్రమాదం ఉండేదనీ, ఇప్పటికీ ఉంటోందనీ మనకు తెలుసు. డాక్టర్ అంబేడ్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ముసాయిదా రచనా ప్రక్రియను రూపొందించడం ప్రారంభించినప్పటి నుంచి కూడా ఆరెస్సెస్ సిద్ధాంతకర్తలు, దాని సంస్థాపక నాయకులు... రాజ్యాంగ సభ భావనను అంగీకరించేవారు కాదు. భారతీయతపై వారి భావన కానీ, వారు సమ్మతిస్తున్న తరహా రాజ్యాంగం కానీ... వర్ణ కుల వ్యవస్థను బలపరుస్తాయి. భారతీయ కమ్యూనిస్టులు కూడా రాజ్యాంగసభ ఏర్పాటును తోసిపుచ్చి ప్రజాస్వామిక రాజ్యాంగ ముసాయిదాను వ్యతిరేకించడానికి ప్రయత్నించారు. అది ఒక బూర్జువా రాజ్యాంగ రచనకు ప్రయత్నమని వారి భావం. అదృష్ట వశాత్తూ వీరు కూడా తమ ప్రయత్నంలో విఫలమయ్యారు. చివరకు 1950 జనవరి 26న ప్రస్తుత రాజ్యాంగం ఉనికిలోకి వచ్చింది. రాజ్యాంగంలోని కొన్ని సెక్షన్లను మాత్రమే కాకుండా మొత్తం రాజ్యాంగాన్నే సమీక్షించడానికి అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వం లోని నాటి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం జస్టిస్ వెంకటాచలయ్య నేతృత్వంలో ఒక సమీక్షా కమిటీని ఏర్పర్చింది. కేవలం రాజ్యాంగాన్ని సవరించడం కాకుండా మారుతున్న సమాజ అవసరాలకు అను గుణంగా దాన్ని మార్చాలన్నదే నాటి ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఆ ప్రయ త్నాన్ని దేశంలోని పలు వర్గాల ప్రజలు తిరస్కరించారు. దీంతో రాజ్యాంగ సమీక్షా కమిటీ సహజంగానే మరుగున పడిపోయింది. (చదవండి: కాంగ్రెస్కు చన్నీ చూపిన బాట) తగని వైఖరి ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కె. చంద్రశేఖర రావు కేంద్ర బడ్జెట్ గురించి ఫిబ్రవరి 1న మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను మాత్రమే కాకుండా ప్రస్తుత రాజ్యాంగాన్ని కూడా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కొందరు మీడియా వ్యక్తులు దీన్ని పెద్దగా పట్టించుకోనప్పుడు, ఈ అంశంపై తాను చాలా సీరియస్గా ఉన్నట్లు నొక్కి చెప్పారు. ‘మొత్తం రాజ్యాంగాన్ని మార్చడంపై చర్చిద్దాం. మనకు ఇప్పుడు కొత్త రాజ్యాంగం కావాలి’ అన్నారు. ఒక చిన్న ప్రాంతీయ పార్టీ నేతకు దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి అనే ప్లాన్ ఉంటే దాన్ని ఎవరైనా పట్టించుకోవలసిన అవసరం లేదు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దీని గురించి మాట్లాడటమే కలవరపెడుతోంది. వాస్తవానికి కేసీఆర్లో అనేక రకాలుగా హిందుత్వ ఆలోచనా విధానం గూడుకట్టుకుని ఉంది. స్వతహాగా ఆయన మతావేశపరుడు. యాగాలు, యజ్ఞాలు, క్రతువులు, ఆలయాలపై మెండుగా ఖర్చు పెడ తారు. వైష్ణవ పీఠాధిపతి చిన జీయర్ని సకల వేళల్లో అనుసరిస్తారు. యాదగిరి ఆలయ పునరుద్ధరణకు రూ. 130 కోట్లు ఖర్చు పెట్టారు. పూర్తిగా మతపరమైన విశ్వాసాలతో కూడిన వ్యక్తిత్వం కాబట్టే ఇలా రాజ్యాంగ వ్యతిరేక ప్రకటనలకు కేసీఆర్ పాల్పడు తున్నారు. బీజేపీపై కేసీఆర్ చేస్తున్న పెనుదాడి తెలంగాణ మనోభావాలను తిరిగి ప్రేరేపిస్తుంది కాబట్టి ఇది ఆయనకు లబ్ధి చేకూర్చవచ్చు. కానీ ఆయన ప్రదర్శిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక వైఖరి అటు తెలంగాణ ప్రజలకు గానీ, ఇటు తన సొంత ప్రయోజనానికి గానీ ఏమాత్రం సమ్మతమైనది కాదు. ఎందుకంటే రాజ్యాంగం పట్ల వ్యతిరేకత అనేది నేరుగా ఆరెస్సెస్, బీజేపీతో ముడిపడి ఉన్న విషయం. ఇలాంటి పాలకులను, వ్యక్తులను సంస్కరించడమే భారత రాజ్యాంగ విధి. ఒక వ్యక్తిగా ఇలాంటి అభిప్రాయాలు కలిగి ఉండే హక్కు కేసీఆర్కు లేదని చెప్పలేం. కానీ రాజ్యాంగం ముందు ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అదే రాజ్యాంగాన్ని మార్చడానికి ఉద్యమాన్ని ప్రారంభించకూడదు. భారత స్వాతంత్య్రం కోసం మన దేశ నిర్మాతలు సంవత్సరాల కొద్దీ జైళ్లలో గడిపారు. వారు రాజ్యాంగ ముసాయిదాను రచించిన రాజ్యంగ సభలో భాగమయ్యారు. దేశం చారిత్రకంగా ఎదుర్కొన్న ప్రతి కీలక సమస్యపై సుదీర్ఘ చర్చ జరిపిన తర్వాతే వీరు రాజ్యాంగ ముసాయిదాను రచించారు. ఇన్నేళ్ల తర్వాత ప్రతి ముఖ్యమంత్రీ లేక మంత్రీ, దేశానికి సర్వశక్తులూ కల్పించిన భారత రాజ్యాంగాన్నే రద్దు చేయాలని మాట్లాడితే దేశం కల్లోలంలో కూరుకుపోక తప్పదు. రేపు ప్రధానమంత్రి, ఆయన మంత్రివర్గ సభ్యులు కూడా ప్రజాస్వామిక వ్యవస్థను సంస్థాగతం చేసిన రాజ్యాంగాన్ని త్యజించడం లేదా రద్దు చేయడం గురించి మాట్లాడటం మొదలెడితే, భారతదేశం ధ్వంసమై పోతుంది. ప్రస్తుత పాలకులను నాటి స్వాతంత్య్ర వీరులు, వారి త్యాగాలతో ఏమాత్రం సరిపోల్చలేమనే చెప్పాలి. (చదవండి: మూడో ఫ్రంట్ మనగలిగేనా?) గణరాజ్య వ్యవస్థ ఆచరణీయమేనా? మరో సందర్భంలో ఆరెస్సెస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్, ప్రాచీన గణరాజ్య వ్యవస్థలో ఉత్తమమైన ప్రజాస్వామ్యం ఉండేదని సూచించారు. ఇది జాతీయవాద ప్రచారంలో బాగా వ్యాప్తిలో ఉన్న కొత్త భ్రమ మాత్రమే. పైగా మనది వలసవాద రాజ్యాంగ నమూనా అంటూ చాలాసార్లు పరోక్షంగా వ్యాఖ్యానాలు చేశారు. ప్రాచీన గణ రాజ్యాలు చిన్న చిన్న గిరిజన విభాగాలు. స్థానిక విభాగాల స్థాయిలో గిరిజన సమానత్వ పంపిణీ పద్ధతిలో నడిచేవి. దీనికి చక్కటి ఉదా హరణ వజ్జియన్ గిరిజన గణరాజ్య ప్రజాస్వామ్యం. బుద్ధుడి జీవిత కాలంలోనే ఇది ఉనికిలో ఉండేది. మగధ రాజ్య ఆక్రమణ నుంచి బుద్ధుడు దీన్ని కాపాడాడు. ఇలాంటి గణరాజ్య ప్రజాస్వామ్యాన్ని ఆధునిక భారత రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగానూ పోల్చి చూడలేం (నా పుస్తకం ‘గాడ్ యాజ్ పొలిటికల్ ఫిలాసపర్ – బుద్ధాస్ ఛాలెంజ్ టు బ్రాహ్మిణిజం’లో నేను గతంలోనే దీన్ని చర్చించాను). మన రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని ప్రయోగమని చెప్పాలి. పైగా జనాభా అధికంగా ఉన్న ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఇంతటి బృహత్తర రాజ్యాంగం ఉనికిలో లేదు. ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని రద్దు చేయడానికి చేసే ఏ ప్రయత్నమైనా ప్రమాదకరమే. అణచివేతకు గురైన, పీడిత వర్గాల ప్రజలు ఇంత కాలం పొందుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ దీంతో కోల్పోతారు. కుల వ్యవస్థ, అంటరానితనం, ఆదిమతత్వం కారణంగానే భారత దేశంలో 1950కి ముందు సార్వత్రిక విద్య అనే భావనే ఉనికిలో లేదు. ప్రస్తుత రాజ్యాంగాన్ని అమలుపరచడం వల్లే పీడిత ప్రజలు అంతవరకు తమకు తెలీని ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలో భారత రాజ్యాంగ ముసాయిదా పూర్తి కావడం, దాన్ని మన దేశ నిర్మాతలు ఆమోదించినందుకు మనం ఎంతో అదృష్టవంతులం. కేసీఆర్ వంటి అధికార తృష్ణ కలిగిన నేతలు, హిందుత్వ భావజాలం ప్రభావంతో వ్యవహరిస్తున్నవారు లేక మరే ఇతర సైద్ధాంతిక దృక్పథం కలిగినవారైనా సరే ఈ రాజ్యాంగాన్ని వెనక్కు నెట్టడాన్ని మనం ఎన్నటికీ అనుమతించకూడదు. (చదవండి: పరాయీకరణ దిశలో మేడారం జాతర) ఒక దశలో నేను కూడా రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య రద్దు కోసం పనిచేస్తున్న వామపక్ష భావజాల శక్తుల్లో భాగంగా ఉండేవాడిని. అయితే చాలా త్వరగానే నేను వాస్తవం గుర్తించి, ‘నేను హిందువు నెట్లయిత’ పుస్తకాన్ని రచించిన 1980లలోనే, అలాంటి వామపక్ష శక్తులనుంచి బయటపడ్డాను. అందుకు నేను చాలా అదృష్టవంతుడిని. ఆ విధంగా రాజకీయ స్వీయ విధ్వంసక సైద్ధాంతిక క్రమం నుంచి నేను బయటపడ్డాను. అమెరికన్ రాజ్యాంగం వందల సంవత్సరా లుగా పనిచేస్తున్న విధంగా భారత రాజ్యాంగం కూడా నిరవధికంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగంపై కేసీఆర్ అభిప్రాయాలను తెలంగాణ ప్రజలు మొత్తంగా తిరస్కరించినం దుకూ, ప్రతిపక్ష పార్టీలు, సామాజిక సంస్థలు అలాంటి ఆలోచననే ఖండించినందుకూ నేనెంతో సంతోషపడుతున్నాను. - ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
సీఎం కేసీఆర్పై భరత్ వాఘ్మారే వివాదాస్పద వ్యాఖ్యలు
పంజగుట్ట: రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుక కోసిన వారికి కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానని ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ వాఘ్మారే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కి ధైర్యం ఉంటే తన పదవికి రాజీనామా చేసి రాజ్యాంగం మారుస్తాననే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లాలని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆ సంఘం జాతీయ ప్రధానకార్యదర్శి ఎమ్.విజయ్కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.నానులు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఈ ఏడేళ్లలో ఒక్కసారి కూడా జయంతి, వర్థంతుల సందర్భంగా ట్యాంక్బండ్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయలేదని, ఆయనకు అంబేద్కర్ అంటే గౌరవమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: మోదీ.. తెలంగాణ ద్రోహి) పరిస్థితులకు అనుగుణంగా సవరణ చేసుకోవచ్చని రాజ్యాంగంలోనే ఉందని, ఇప్పటివరకు 130 సార్లు సవరించారని, అలాంటిది ఏకంగా రాజ్యాంగాన్నే మారుస్తామనడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. వెంటనే అంబేడ్కర్ విగ్రహంవద్ద కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో తలారి గోపాల్, షర్మిల జాదవ్, వినోద్కుమార్, సురేందర్, లింగన్న పాల్గొన్నారు. (చదవండి: మాదకద్రవ్యాల వ్యవహారాన్ని ఆటకట్టించేలా ‘హెచ్–న్యూ’) -
మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే.. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుంది..
లక్నో: దేశంలో బీజేపీలో మరోసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ 2024లో మళ్లీ అధికారంలో వస్తే.. రాజ్యాంగాన్ని మరుస్తుందని, దేశం నాశనమైపోందని పేర్కొన్నారు. అందుకే అన్ని పార్టీలు ఏకమై బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని తెలిపారు. చదవండి: అధికారం కాదు... ప్రజాసేవే లక్ష్యం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని అన్నారు. అందుకే రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చూస్తుందని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తే.. రాజ్యాంగంతో పాటు దేశాన్ని కూడా రక్షించినవాళ్లమవుతామని చెప్పారు. కానీ, బీజేపీ ఓడించాలంటే మాత్రం అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. చదవండి: మహారాష్ట్రలో "ఒమిక్రాన్" వేరియంట్ కలకలం!! ఇదే విషయాన్ని గత నెల నుంచి తాను ప్రచారం చేస్తున్నానని తెలిపారు. అయితే బీజేపీ, ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింకు శత్రువులని మండిపడ్డారు. దేశంలో ముస్లింలు లేకుండా చేద్దామని వాళ్లు పని చేస్తున్నారని తీవ్రంగా వివర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒవైసీ బీజేపీతో కలిసి పని చేస్తాడని ఆరోపించారు. -
రాష్ట్రపతి నోట జీతం ప్రస్తావన.. రచ్చ రచ్చ
ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ల జీతం, సెలబ్రిటీల సంపాదన గురించి జనాల్లో ఒకరకమైన ఆసక్తి ఉంటుంది. ‘ఫలానా వాళ్లు ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవుతారు?’ లాంటి హెడ్డింగ్లకు దక్కే ఆదరణే అందుకు ఉదాహరణ. అయితే తమ జీతాలు, సంపాదన గురించి వాళ్లు బహిరంగంగా మాట్లాడే సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది రాష్ట్రపతి హోదాలో రామ్నాథ్ కోవింద్ తన జీతం, కట్టింగ్ల గురించి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. న్యూఢిల్లీ: తాజాగా ఓ న్యూస్ ఛానెల్ ద్వారా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురించి ట్విటర్ ఓ వీడియో వైరల్ అవుతోంది. ‘‘ దేశంలోనే అత్యధికంగా జీతం తీసుకుంటున్న వ్యక్తి నేను. నా నెల సంపాదన ఐదు లక్షలు. కానీ, అందులో 3 లక్షల దాకా ట్యాక్స్, కట్టింగ్ల రూపంలోనే పోతున్నాయి. ఆ లెక్కన నాకు మిగిలేది తక్కువే. అంటే మిగిలినవాళ్ల కంటే నేనేం బెటర్ కాదు. ఒక టీచర్ నాకంటే ఎక్కువే సేవింగ్స్ చేస్తున్నాడు’’ అంటూ సరదాగా నవ్వుతూ మాట్లాడారు ఆయన. అంతే.. राष्ट्रपति बोले- मुझे 5 लाख प्रति महीना तनख्वाह मिलती है जिसमें से पौने 3 लाख टैक्स चला जाता है, हमसे ज्यादा बचत तो एक टीचर की होती है#presidentkovind #UttarPradesh pic.twitter.com/D6MAgmFCZm — News24 (@news24tvchannel) June 27, 2021 రెండు వాదనలతో.. ఇక రాష్ట్రపతి జీతంలో ట్యాక్స్ కట్టింగ్లు ఉండవని, ఆ విషయం తెలియక ఆయన అలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని కొందరు ట్విటర్ ద్వారా హేళన చేస్తున్నారు. పైగా పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతరత్రా అలవెన్స్లు కూడా ఉంటాయని గుర్తుచేస్తున్నారు. మరికొందరేమో రాజ్యాంగంలోని ప్రతులంటూ కొన్ని ఆధారాలను ట్విటర్లో పోస్ట్ చేస్తున్నారు. పెన్షన్ యాక్ట్ 1951 ప్రకారం.. రాష్ట్రపతి జీతంపై పన్ను విధించరని చెప్తున్నారు. అయితే అదంతా ఉత్తదేనని, రాష్ట్రపతి జీతంలో కట్టింగ్లు ఉంటాయని వాదిస్తున్నారు. ఇంకొందరేమో మరి ఆ ట్యాక్స్ కట్టింగ్ల జీతం ఎటుపోతుందోనని ఇంటర్నెట్ ద్వారా ఆరా తీస్తున్నారు. ఈ వివాదం ఎటు నుంచి ఎటో వెళ్లి.. రాజకీయ దుమారానికి తెరలేపింది. ఇదిలా ఉంటే కిందటి ఏడాది కరోనా టైంలో జీతాల్లో కొంత వాటాను(30 శాతం దాకా) త్యాగం చేసినవాళ్లలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కూడా ఉన్నారు. చదవండి: రాష్ట్రపతి కాన్వాయ్ కోసం ఆగిన ఊపిరి! -
ఎన్నికల కమిషనర్ల నియామకంలో ఎగ్జిక్యూటివ్ పెత్తనమేంటి?
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల నియామకంలో కేవలం కార్యనిర్వాహక వర్గం (ఎగ్జిక్యూటివ్) మాత్రమే ముఖ్య పాత్ర పోషిస్తుండడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని స్వచ్ఛంద సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఆక్షేపించింది. కార్యనిర్వాహక వర్గం మాత్రమే సీఈసీని, ఎన్నికల కమిషన్లను నియమించడం ఏమిటని ప్రశ్నించింది. ఇలా చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీఈసీ, ఎన్నికల కమిషనర్ల నియామకానికి తటస్థంగా వ్యవహరించే స్వతంత్ర కొలీజియం/ సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. ఈ బాధ్యతను కార్యనిర్వాహక వర్గానికి కట్టబెడితే అధికారంలో ఉన్న పార్టీ విధేయులే ఎన్నికల సంఘం కమిషనర్లుగా నియమితులయ్యే ప్రమాదం ఉందని ఏడీఆర్ పేర్కొంది. దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలన్నా, ఆరోగ్యకరమైన ప్రజాస్వా మ్యం కొనసాగాలన్నా ఎన్నికల సంఘాన్ని కార్యనిర్వాహక వర్గం పరిధి నుంచి తప్పించాలని కోరింది. (చదవండి: కోవిడ్తో కన్నవారిని కోల్పోయిన చిన్నారులు) -
Imran Khan: కశ్మీర్పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటేనే..
ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే దాకా భారత్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ స్పష్టం చేశారు. ‘జమ్మూకశ్మీర్ ఐక్యరాజ్యసమితి ఎజెండాలో ఉంది. దీనిపై భద్రతా మండలి పలు తీర్మానాలు కూడా చేసింది. అందుకే కశ్మీర్ భారత్ అంతర్గత అంశం కాదు’అని ఆయన మీడియాకు తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూకశ్మీర్కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంతో పాటు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ భారత ప్రభుత్వం 2019లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఈ రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. (చదవండి: చైనా జనాభాలో స్వల్ప పెరుగుదల) -
‘రాజ్యాంగం వైఫల్యం’పై విచారణ నిరవధిక వాయిదా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా?.. అన్న అంశంపై విచారణ జరుపుతున్న జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను నిరవధికంగా వాయిదా వేసింది. రాజ్యాంగ వైఫల్యంపై హైకోర్టు జరుపుతున్న విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఉత్తర్వులు ఇవ్వడంతో ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది వైఎన్ వివేకానంద తెలియచేయడంతో జస్టిస్ రాకేశ్ ధర్మాసనం దీన్ని రికార్డు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి అనంతరం బెంచ్ దిగి వెళ్లిపోయింది. అంతకు ముందు ఉదయం 11.30 గంటలకు విచారణ ప్రారంభం కాగానే రాజ్యాంగ వైఫల్యంపై విచారణ జరుపుతామన్న హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశామని, అది కొద్దిసేపట్లో విచారణకు రానుందని ప్రభుత్వ న్యాయవాది వివేకానంద నివేదించారు. అందువల్ల ఈ వ్యాజ్యాల్లో విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరగా అందుకు జస్టిస్ రాకేశ్ ధర్మాసనం నిరాకరిస్తూ మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరుపుతామని పేర్కొంది. వాయిదా సమస్యే లేదు.. మధ్యాహ్నమే విచారణ శుక్రవారం మధ్యాహ్నం బదులు విచారణను సోమవారం చేపట్టాలని ఈ వ్యాజ్యాల్లో ప్రభుత్వం తరపున హాజరవుతున్న సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి కూడా అభ్యర్థించారు. రాజ్యాంగ వైఫల్యంపై విచారణ జరిపే నిమిత్తం జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన రీకాల్ పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఈ నెల 14న ఇచ్చిన ఉత్తర్వుల కాపీ తమకు అందలేదని తెలిపారు. రిజిస్ట్రీ సర్టిఫైడ్ కాపీ బదులు ఈ-మెయిల్ ద్వారా సాఫ్ట్ కాపీని పంపిందని, ఇది కోర్టు ఆదేశాలను అమలు చేయడం కిందకు రాదన్నారు. ఈ-మెయిల్ కాపీని తాము తదుపరి (పై కోర్టుల్లో సవాలు చేసేందుకు) వినియోగించడం సాధ్యం కాదని, అందువల్ల సర్టిఫైడ్ కాపీని ఇప్పించాల్సిన అవసరం ఉందని, విచారణ సోమవారం చేపట్టాలని నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. అయితే జస్టిస్ రాకేశ్ కుమార్ ఇందుకు నిరాకరిస్తూ మధ్యాహ్నమే విచారణ జరిపి తీరుతామని స్పష్టం చేశారు. వాయిదా వేస్తే మిన్ను విరిగి మీద పడదు... ఈ సమయంలో ప్రభుత్వం తరఫున హాజరవుతున్న మరో సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి స్పందిస్తూ మధ్యాహ్నం కాకుండా విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరారు. తనకు వ్యక్తిగతమైన ఇబ్బంది ఉందని, అందుకే వాయిదా అడుగుతున్నానని తెలిపారు. వాయిదా వేయడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదని, మిన్ను విరిగి మీద పడదని పేర్కొన్నారు. వ్యక్తిగత ఇబ్బంది ఉందని అభ్యర్థించినప్పుడు విచారణను వాయిదా వేయడం ఏపీ హైకోర్టు సంప్రదాయమని గుర్తు చేశారు. అయితే వాయిదా వేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని కలిగించాలి... ఈ సమయంలో మోహన్రెడ్డి, జస్టిస్ రాకేశ్ కుమార్ల మధ్య వాడివేడిగా వాదనలు జరిగాయి. మధ్యాహ్నం విచారించి తీరుతామని జస్టిస్ రాకేశ్ స్పష్టం చేయగా ఇది అన్యాయమని, న్యాయస్థానానికి ఎంతమాత్రం తగదని మోహన్రెడ్డి నివేదించారు. కోర్టు ప్రొసీడింగ్స్ అన్నింటినీ కోర్టు రికార్డింగ్ (బ్లూజీన్స్ యాప్ ద్వారా వీడియో రికార్డింగ్) చేస్తోందన్న విషయం తెలుసని, తన వాదన రికార్డు కావాలన్న ఉద్దేశంతోనే కోర్టు అన్యాయంగా వ్యవహరిస్తోందని చెబుతున్నానని మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే తనను విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారని జస్టిస్ రాకేశ్ పేర్కొనగా ప్రతి దానిని విచారించాల్సిన బాధ్యత మీపై (ధర్మాసనం) ఉందని మోహన్రెడ్డి గుర్తు చేశారు. అలాగే న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగించాలన్నారు. కోర్టుగా తాము తమ విధులను నిర్వర్తిస్తున్నామని జస్టిస్ రాకేశ్ వ్యాఖ్యానించగా ఎలాంటి పక్షపాతం లేకుండా, ముందస్తుగానే నిర్ణయానికి రాకుండా విచారణ జరపాల్సిన బాధ్యత మీపై ఉందని మోహన్రెడ్డి సమాధానమిచ్చారు. తాము తమ ప్రమాణం మేరకు నడుచుకుంటున్నామని, దాని నుంచి పక్కకు వెళ్లబోమని జస్టిస్ రాకేశ్ పేర్కొనగా మధ్యాహ్నం విచారణకు తాను హాజరుకాబోవడం లేదని, సోమవారం వాదనలు వినిపిస్తానని మోహన్రెడ్డి బదులిచ్చారు. వాయిదా కోరడం దుర్వినియోగం చేసినట్లా? ‘మీరు ఏం కావాలో అది చేసుకోండి... రాష్ట్ర ప్రభుత్వం రోజుకో న్యాయవాదిని నియమిస్తోంది’ అని జస్టిస్ రాకేశ్ వ్యాఖ్యానించగా.. ఎవరిని న్యాయవాదిగా నియమించుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఇదే రీతిలో కేసును వాయిదా వేయాలా? వద్దా? అన్నది తమ ఇష్టమని జస్టిస్ రాకేశ్ వ్యాఖ్యానించారు. మీరు కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయాలనుకుంటే చేయవచ్చని జస్టిస్ రాకేశ్ వ్యాఖ్యానించగా మోహన్రెడ్డి ఘాటుగా స్పందిస్తూ వ్యక్తిగత ఇబ్బందుల వల్ల విచారణ వాయిదా వేయాలని కోరడం కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడం ఎలా అవుతుందని ప్రశ్నించారు. న్యాయవాదుల అభ్యర్థనను కోర్టు ఇలా భావిస్తుంటే తాము చేయగలిగింది ఏమీ లేదన్నారు. తిరిగి మధ్యాహ్నం విచారణ ప్రారంభం కాగానే సుప్రీంకోర్టులో ఏం జరిగిందని జస్టిస్ రాకేశ్ కుమార్ ప్రశ్నించారు. రాజ్యాంగ వైఫల్యంపై ఈ ధర్మాసనం జరుపుతున్న విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ప్రభుత్వ న్యాయవాది వివేకానంద తెలిపారు. దీంతో దీన్ని రికార్డు చేసుకున్న జస్టిస్ రాకేశ్ ధర్మాసనం తమ ముందున్న వ్యాజ్యాలపై విచారణను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసి బెంచ్ దిగి వెళ్లిపోయింది. 31న పదవీ విరమణ.. ఈలోపే నిర్ణయం వెలువరించేలా! తమవారిని పోలీసులు అక్రమంగా నిర్భంధించారంటూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరుపుతూ వచ్చిన జస్టిస్ రాకేశ్, జస్టిస్ ఉమాదేవిల ధర్మాసనం అకస్మాత్తుగా రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అనే అంశాన్ని తేలుస్తామంటూ అక్టోబర్ 1న ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31న జస్టిస్ రాకేశ్ కుమార్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ వ్యాజ్యాలపై విచారణను ముగించాలన్న ఉద్దేశంతో ధర్మాసనం రోజూవారీ విచారణ ప్రారంభించింది. విచారణ సందర్భంగా జస్టిస్ రాకేశ్ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ వైఫల్యం జరిగిందని ఏ పిటిషనర్ పేర్కొనలేదని, పిటిషనర్లు కోరకుండా ఆ అంశంపై విచారణ జరపడం సరికాదని, అసలు ఆ అంశంపై విచారణ జరిపే పరిధి హైకోర్టుకు లేదని, అందువల్ల అక్టోబర్ 1న జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ను ఒక్క నిమిషంలో కొట్టివేసిన జస్టిస్ రాకేశ్ కుమార్ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ను వాదనలు వినిపించేందుకు, సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించేందుకు అనుమతించలేదు. కౌంటర్ దాఖలు చేసేందుకు సైతం అనుమతినివ్వలేదు. జస్టిస్ రాకేశ్ కుమార్ ఈ వ్యాజ్యంలో ఏ నిర్ణయం వెలువరించాలో ముందస్తుగానే ఓ నిర్ణయానికి వచ్చి విచారణ జరుపుతున్నారని, దీనివల్ల తమకు న్యాయం లభించదని భావిస్తూ విచారణ నుంచి జస్టిస్ రాకేశ్ తప్పుకోవాలంటూ (రెక్యూజల్) రాష్ట్ర ప్రభుత్వం ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. ఇదే సమయంలో జస్టిస్ రాకేశ్ ధర్మాసనం జారీ చేసిన అక్టోబర్ 1 నాటి ఉత్తర్వులను, రీకాల్ పిటిషన్ను కొట్టివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. -
ఆ వ్యాఖ్య రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధం
రాజ్యాంగంలోని అత్యంత ముఖ్యమైన అధికరణ ఏది అని ఎవరైనా నన్ను అడిగితే అది అధికరణ 32 అని చెబుతానని రాజ్యాంగ నిర్మాత డా‘‘ బి.ఆర్ అంబేడ్కర్ ఒకసారి అన్నారు. ఈ అధికరణ రాజ్యాంగానికి ఆత్మ, హృదయం లాంటిదని అన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే వాటికి రక్షణని ఇచ్చేది అధికరణ 32 మాత్రమే. రిపబ్లిక్ టీవీ అధినేత అర్ణబ్ గోస్వామికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం,, యూపీ పోలీసులు అరెస్టు చేసిన కేరళ జర్నలిస్టు కప్పన్ బెయిల్ పిటిషన్ని వారాల తరబడి వాయిదా వేయడం చర్చనీయాంశమైంది. రాజ్యాంగంలోని అధికరణ 32 ప్రకారం వ్యక్తులు దాఖలు చేస్తున్న దరఖాస్తులను ఇకనుంచి నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేస్తామని సుప్రీంకోర్టు బెంచి వ్యాఖ్యానించడం రాజ్యాంగ సూత్రాలకే విరుద్ధం. సిద్ధిక్ కప్పన్ కేరళ రాష్ట్రానికి చెందిన జర్నలిస్ట్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రస్లో జరిగిందని ఆరోపణలొచ్చిన ఓ సామూహిక మానభంగం, హత్య కేసులని రిపోర్టు చేయడానికి వెళ్తున్నపుడు ఆయన్ని ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఆ దరఖాస్తుని విచారిస్తున్న సుప్రీంకోర్టు బెంచి రాజ్యాంగంలోని అధికరణ 32 ప్రకారం వ్యక్తులు దాఖలు చేస్తున్న దరఖాస్తులను ఇకనుంచి నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేస్తామని వ్యాఖ్యానించింది. ఆ బెంచికి నేతృత్వం వహిస్తున్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. బాబ్డే.. రిపబ్లిక్ టీవీ అధినేత (యాంకర్) అర్ణబ్ గోస్వామికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినపుడే దేశ ప్రజల దృష్టి, మరీ ముఖ్యంగా మేధావుల దృష్టి అధికరణ 32 వైపు మరలింది. దేశమంతా ఈ వ్యాఖ్య మీద చర్చించడం మొదలు పెట్టారు. ఇంతకీ రాజ్యాంగంలోని అధికరణ 32 ఏం చెబుతుంది? ఈ అధికరణని రాజ్యాంగంలో పొందుపరిచేటపుడు రాజ్యాంగ నిర్మాతల అభిప్రాయం ఏమిటి? ఈ అధికరణ ప్రాముఖ్యత ఏమిటి? ఇవీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి జవాబులని వెతుక్కునేముందు ఇటీవల కాలంలో దేశంలో జరుగుతున్న సంఘటనలని, కేసులని పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా వుంది. వాటికీ ఈ అధికరణకీ ఉన్న సంబంధం ఏమిటీ? అన్న విషయాలను పరిశీలిద్దాం. అక్టోబర్ 5 వ తేదీన హాథ్రస్కి వెళ్తున్న సందర్భంలో పోలీసులు ముందుగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సె. 151 ప్రకారం కప్ప¯Œ ని ముందస్తు అరెస్టు చేశారు. ఎవరైనా నేరం చేస్తారని భావించినపుడు ఆ నేరాన్ని పోలీసులు మరో విధంగా నిలుపుదల చేయలేనపుడు ఈ అరెస్టుల్ని చేస్తారు. ఆ తరువాత రాజద్రోహం, ఇంకా యు.ఎ.పి.ఎ చట్టాలలోని కొన్ని సెక్షన్ల కింద కేసులని కూడా తనపై నమోదు చేశారు. ప్రముఖ విప్లవ కవి వరవరరావు (80) న్యూరోలాజికల్, యూరో లాజికల్ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ మధ్యే ఆయన్ని నిర్బంధించి రెండు సంవత్సరాలు దాటింది. సుధా భరద్వాజ్ (59) కూడా ఆగస్టు 2018 నుంచి నిర్బంధంలో ఉంటూ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. స్టాన్స్వామి (83) పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఆయన జైల్లోనే ఉన్నారు. వాళ్ల కేసుల్లో అత్యవసరం లేదు. కానీ అర్ణబ్ గోస్వామి కేసులో సుప్రీం కోర్టుకి అత్యవసరం కనిపించింది. అందులో తప్పు లేకపోవచ్చు. కొన్ని కేసుల్లో హైకోర్టుకి వెళ్లమని సుప్రీంకోర్టు అంటుంది. అలాంటి కేసులని సుప్రీంకోర్టు ఎంపిక పద్ధతిన విచారిస్తుంది. దీనిపై నిలకడ లేకపోవడం ఆందోళనకరం. చట్టం ఎందుకు అందరినీ ఒకే విధంగా చూడలేకపోతోంది? రాజ్యాంగంలోని 3వ విభాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అధికరణ 32 కూడా అందులో భాగం. తమ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినపుడు, లేదా వాటిని అమలు చేసుకోవ డానికి దేశం లోని ఏ వ్యక్తి అయినా అధికరణ 32ని ఆశ్రయించి సుప్రీంకోర్టు తలుపు తట్టవచ్చు. రాజ్యాంగంలోని అత్యంత ముఖ్యమైన అధికరణ ఏది అని ఎవరైనా నన్ను అడిగితే అది అధికరణ 32 అని చెబుతానని రాజ్యాంగ నిర్మాత డా‘‘ బి.ఆర్ అంబేడ్కర్ ఒకసారి అన్నారు. అది లేకుండా రాజ్యాంగాన్ని ఊహించలేం. దాన్ని తప్ప మరే అధికరణని నేను ఉదహరించలేను. ఈ అధికరణ రాజ్యాంగానికి ఆత్మ, హృదయం లాంటిదని అంబేడ్కర్ అన్నారు. రాజ్యాంగ నిర్మాతలు ఈ విధంగా కూడా అన్నారు. ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లితే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఉపశమనాలని పొందవచ్చు. అన్ని ప్రాథమిక హక్కులకి రక్షణని ఇచ్చేదీ.. ముఖ్యమైనదీ అధికరణ 32 మాత్రమే. సివిల్, క్రిమినల్ కేసుల్లో ఓడిపోయిన వ్యక్తి హైకోర్టులో అప్పీలుని దాఖలు చేసుకోవచ్చు. ఆ తరువాత సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు. అయితే ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లితే, బాధిత వ్యక్తి అధికరణ 32 ప్రకారం సుప్రీంకోర్టునీ, అధికరణ 226 ప్రకారం హైకోర్టునీ ఆశ్ర యించవచ్చు. హైకోర్టుని ముందుగా ఆశ్రయించి ఆ తరువాత సుప్రీం కోర్టుకి వెళ్ళాలన్న నియమం లేదు. బాధిత వ్యక్తి నేరుగా తన ప్రాథ మిక హక్కులకి భంగం వాటిల్లినపుడు, లేదా అమలు పరచుకోవ డానికి నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. అధికరణ 32 ప్రాథ మిక హక్కు. కానీ అధికరణ 226 ప్రాథమిక హక్కు కాదు. గతంలో పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఇప్పుడు సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న అంజనా ప్రకాశ్ అర్ణబ్ గోస్వామికి బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ వ్యాసంలో ఇలా అభిప్రాయపడ్డారు. నవంబర్ 11వ తేదీన సుప్రీం కోర్టు బెంచి ప్రత్యేకంగా సమావేశమై బెయిల్ మంజూరు చేయడం ద్వారా భారత సుప్రీంకోర్టు ప్రపంచంలోనే ఎంత శక్తివంతమైనదో మరోసారి ఈ కేసు ద్వారా రుజువైంది. సుప్రీంకోర్టు ఎంత శక్తివం తమైనది అనే అంశంపై న్యాయవాదులు ఏ విధంగా జోక్ చేస్తారో కూడా ఆవిడ తన వ్యాసంలో ప్రస్తావించారు. ఆడని మగగా, మగని ఆడగా మాత్రం సుప్రీంకోర్టు ప్రకటించలేదు. ఇది తప్ప సుప్రీంకోర్టు ఏదైనా చేయగలదని అన్నారామె. సెలవు రోజైన నవంబర్ 9న బొంబాయి హైకోర్టు అర్ణబ్ గోస్వామి కేసుని ఐదుగంటలపాటూ విన్నది. సుప్రీం కోర్టులో కూడా అర్ణబ్ దరఖాస్తుని దాఖలు చేశాడు. అది 11న లిస్ట్ అయింది. ఆ రోజంతా సుప్రీంకోర్టు వాదనలని విని అర్ణబ్ని విడుదల చేయాలని ఆదేశించింది. కోర్టులు చాలాసార్లు ఏకపక్షంగా, సహేతుకంగానే కేసుల్లో జోక్యం చేసుకుంటాయి. వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకి కోర్టు అత్యంత ప్రాధాన్యతలని ఇవ్వాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 22 దీన్నే చెబుతున్నాయి. అయితే ఆర్టికల్ 14ని కూడా మనం మరచిపోకూడదు. గోస్వామి కేసు వాదనలు ముగిస్తూ న్యాయవాది కపిల్ సిబల్ ఇలా అన్నారు. ‘కేరళ రాష్ట్రానికి చెందిన కప్పన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అధికరణ 32 ప్రకారం మేం కోర్టు తలుపు తట్టాం. కింది కోర్టుకి వెళ్ళండి అని 4 వారాల తరువాత ఆ కేసుని పోస్ట్ చేశారు’. కానీ ఈ వాదన మీద సుప్రీంకోర్టు ఎలాంటి వ్యాఖ్యానాన్ని చేయలేదు. అలా కప్పన్ కేసు మళ్ళీ సుప్రీంకోర్టు ముందుకు వచ్చినపుడు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే అధికరణ 32 ప్రకారం సుప్రీంకోర్టుకి రావడాన్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేస్తామని అన్నారు. ఈ వ్యాఖ్యతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అధికరణ 32 ప్రకారం వచ్చిన హక్కులని రాజ్యాంగం ప్రకారం మాత్రమే సస్పెండ్ చేయ వచ్చు. ఎల్. చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏడుగురు సభ్యులు గల సుప్రీంకోర్టు బెంచి అధికరణ 32 అనేది రాజ్యాంగంలోని మౌలిక అంశమని, అది అంతర్భాగమని వ్యాఖ్యానించింది. ఎమర్జెన్సీ కాలంలో ఏడీఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో సుప్రీంకోర్టు మరోవిధంగా అభిప్రాయ పడింది. ఎమర్జెన్సీలో ఈ హక్కు ఉండదని మెజారిటీ న్యాయ మూర్తులు అభిప్రాయపడ్డారు. ఆ తరువాత 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అభిప్రాయాన్ని పార్లమెంట్ సవరించింది. ఎమర్జెన్సీ కాలంలో కూడా అధికరణ 20, 21లలో పేర్కొన్న హక్కులకి భంగం వాటిల్లితే సుప్రీంకోర్టునీ అదేవిధంగా హైకోర్టునీ ఆశ్రయించవచ్చు. ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లితే సుప్రీంకోర్టు అధికరణ 32 ప్రకారం అవసరమైన ఉత్తర్వులని, రిట్స్ని జారీ చేయవచ్చు. అధికరణ 32 ప్రకారం దేశంలోని ప్రతి వ్యక్తికీ హక్కుల అమలుని నిరుత్సాహపరుస్తామని బహుశా పనిభారం వల్ల ప్రధాన న్యాయ మూర్తి అని అంటారు. సుప్రీంకోర్టు విపరీత పనిభారంతో ఉంది. ఆ మాటకొస్తే దేశంలోని ప్రతికోర్టూ పనిభారంతో నలిగిపోతున్నాయి. ఏది ఏమైనా ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలోని ఆంతర్యం బోధ పడలేదు. సుప్రీంకోర్టు పనిభారం తగ్గించడానికి కోర్టు ఆఫ్ అప్పీల్స్ అన్న వ్యవస్థ ఏర్పాటు చేసి దేశంలోని ఐదారు ప్రాంతాల్లో వీటి బెంచీలు ఏర్పాటు చేయాలని కొంతమంది న్యాయకోవిదులు సూచిం చారు. ఆ సూచనలు అలాగే ఉండిపోయాయి. ఆ విధంగా వాటిని ఏర్పాటు చేసినా, అధికరణ 32 ప్రకారం పనిభారం సుప్రీం కోర్టు పైనే ఉంటుంది. కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ లాంటి మరో వ్యవస్థ కన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచి దేశంలో నాలుగైదు బెంచీలు ఏర్పాటు చేయడం వల్ల ఈ సమస్యని కొంతమేరకు అధి గమించ వచ్చేమో. ఈ మధ్యన కోర్టు ధిక్కార కేసుల సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితికి అందరూ కారకులే. వీటి పరిష్కా రానికి మరో వ్యవస్థ రావాల్సి ఉంటుందా? ఆలోచించాలి. అంతేగానీ రాజ్యాంగ ఆత్మని చంపినా, తగ్గించినా రాజ్యాంగం నిరర్థకం అవు తుంది. వ్యాసకర్త మంగారి రాజేందర్ ఈ–మెయిల్ : rajenderzimbo@gmail.com -
ఈ నిశ్శబ్దానికి పునాది పూనా ఒడంబడిక
‘‘మీకు రాజకీయ అధికారాలను అందించడానికి ఎంతో ప్రయాసపడ్డాను. పార్లమెంటులోనూ, శాసనసభల్లోనూ మీకు సీట్లు రిజర్వు చేయించడానికి ముప్పై సంవత్సరాలు రాత్రీ, పగలూ శ్రమించాను. ఎవరైనా మిమ్మల్ని తమ రాజభవనంలోకి ఆహ్వానిస్తే సంతోషంగా వెళ్ళండి. కానీ, మీరు నివసించే చిన్న ఇల్లును తగులబెట్టుకొని మాత్రం అక్కడకు వెళ్ళకండి. కొన్ని రోజుల తర్వాత ఏదో రోజు మీకు మీమీద కోపం కలిగితే, మిమ్మల్ని గెంటివేస్తే ఎక్కడికి వెళతారు. మీరు అమ్ముడుపోవాలనుకుంటే అమ్ముడుపోండి. కానీ మీ సొంత బలాన్ని ధ్వంసం చేసుకొని మాత్రం వెళ్ళవద్దు’’ అంటూ బాబాసాహెబ్ అంబేడ్కర్ 1956 మార్చి 18న ఆగ్రాలో జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో చేసిన ఉపన్యాసంలోని కొంత భాగం ఇది. రిజర్వేషన్ల ద్వారా పదవులు చేపట్టిన ప్రజాప్రతినిధుల పనితీరును చూసి బాబాసాహెబ్ అన్న మాటలివి. మరోచోట, ‘‘మా ప్రజాప్రతి నిధులు ఆవులింత వస్తే తప్ప నోరు తెరవరు’’ అంటూ తన బాధను వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లోని శాసనసభల్లో 578 మంది ఎస్సీ సభ్యులు, 526 మంది ఎస్టీ శాసనసభ్యులు ఉన్నారు. పార్లమెంటులోని లోక్సభలో ఎస్సీ ప్రతినిధులు 84 మంది, ఎస్టీలు 47 మంది ఉన్నారు. లోక్సభలో ఇది దాదాపు నాల్గోవంతు. బాబాసాహెబ్ అంబేడ్కర్ కాంక్షించినట్లు వీరంతా ఐక్యంగా నిలబడి, ప్రజల పక్షం వహిస్తే, ప్రభుత్వాలు తల్లకిందులవుతాయి. 1956 నాడే కాదు, నేటికీ ఎస్సీ, ఎస్టీల ప్రజాప్రతినిధులు తమ స్వీయచిత్తంతో పనిచేస్తోన్న దాఖలాలు లేవు. అంబేడ్కర్ ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడానికి కారణమేమిటి? ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు అసమర్థులా? వేరే ఏదైనా కారణాలున్నాయా? ఎన్నో తిరస్కారాల నడుమ, మరెన్నో కుయుక్తులను ఎదుర్కొంటూ బాబాసాహెబ్ చేసిన యుద్ధ ఫలితమే ఈ రాజకీయ రిజర్వేషన్లు. 1919 నుంచి అంటరాని కులాలకు ఎన్నికల్లో ఓటింగ్ హక్కు కల్పించాలని, అప్పుడే వారికి పాలనలో భాగస్వామ్యం లభిస్తుందని, అందుకోసం సుదీర్ఘం పోరాటం చేశారు. మొదటిసారిగా 1919లో సౌత్బరో కమిటీ ఎదుట తన వాదనలను వినిపించారు. ‘‘అంటరాని కులాలకు స్వయం నిర్ణయాధికారం కావాలి. మా సమస్యలపైన దళితేతరులు కాకుండా, దళితులే మాట్లాడాలి అనే ప్రజాస్వామ్య సూత్రం అమలు జరగాలి. అగ్రవర్ణాల దయాదాక్షిణ్యాలకు దళితులను వదిలేయొద్దు’’అంటూ ప్రజాస్వామ్య భావనలోని సారాంశాన్ని బయట పెట్టారు. 1927లో భారత దేశానికి వచ్చిన సైమన్ కమిషన్ ముందు, ప్రాతినిధ్యం లేని వర్గాలు ప్రజాస్వామ్య దేశంలో పౌరులుగా ఉండలేరని తేల్చి చెప్పారు. 1930–32ల మధ్య జరిగిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లో సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. లండన్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో అంటరాని కులాలు హిందూ సమాజంలో భాగం కాదని, ముస్లింలు, క్రైస్తవులు, ఆంగ్లోఇండియన్స్, సిక్కులు మతపరమైన మైనారిటీలైనట్టే, నిమ్న వర్గాలు సామాజికంగా మైనారిటీలని, వీరికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని వాదించారు. అప్పటికే ముస్లింలకు, క్రైస్తవులకు ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ ప్రతినిధులు ఎవ్వరూ హాజరు కాలేదు. రెండో సమావేశానికి మహాత్మాగాంధీ హాజరయ్యారు. అంబేడ్కర్ వాదనను గాంధీ వ్యతిరేకించారు. దళితులను హిందూ సమాజం నుంచి వేరు చేసి చూస్తే సహించలేనని అభ్యంతరం తెలిపారు. అయితే అంబేడ్కర్ వాదనను బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించి కమ్యూనల్ అవార్డు పేరుతో ప్రత్యేక ఎన్నికల విధానంతో కూడిన ప్రత్యేక నియోజక వర్గాలను అంగీకరిస్తున్నట్టు ప్రకటించింది. గాంధీ నిరసనగా ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. దీనితో కాంగ్రెస్తోపాటు, హిందూ సంఘాలు, మహాత్మాగాంధీ ప్రాణాలు కాపాడమని అంబేడ్కర్ మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. ఒక్క గాంధీ కోసం తన జాతి భవిష్యత్తును ఫణంగా పెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ గాంధీకి ఏదైనా జరగరానిది జరిగితే, దీన్ని సాకుగా చూపెట్టి తన ప్రజలపై, హిందూ అగ్రకులాలు దాడులు చేసి, మారణహోమం సృష్టిస్తాయని ఆందోళన చెంది, గాంధీతో రాజీకి అంగీకరించారు. దానిపేరే పూనా ఒడంబడిక. సరిగ్గా ఇదే రోజున అంటే 1932 సెప్టెంబర్ 24న బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ఛాటింగ్లో అంటే తమ అభ్యర్థులను తామే ఎన్నుకునే విధానానికి స్వస్తి చెప్పి, సమాజంలోని అందరి ఓట్లతో జరిగే ఉమ్మడి ఎన్నిక విధానానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. అయితే 1937, 1946లో జరిగిన ఎన్నికల్లో వచ్చిన అనుభవంతో అంటే సమాజంలోని అన్ని కులాల ఓట్లతో ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు కాంగ్రెస్కు బాసటగా ఉన్నారని, దీనివల్ల ప్రయోజనం లేదని, మళ్ళీ ప్రత్యేక ఓటింగ్ విధానం (సపరేట్ ఎలక్టోరల్) కోసం ప్రయత్నం మొదలు పెట్టారు. ‘రాష్ట్రాలు–మైనారిటీలు’ అనే పేరుతో రా>జ్యాంగ సభకు సమర్పించిన నివేదికలో ప్రధానమైన అంశం ఈ సపరేట్ ఎలక్టోరేట్ విధానమే. రాజ్యాంగ సభ అంబేడ్కర్ ప్రతిపాదనను అంగీకరించలేదు. రిజర్వేషన్ల విధానాన్నే రద్దు చేయాలని చూశారు. ఇందులో ప్రధాన సూత్రధారి సర్దార్ వల్లభాయ్ పటేల్. అయితే అంబేడ్కర్ కూడా అదే స్థాయిలో సర్దార్ పటేల్ను ప్రతిఘటించారు. ఒకవేళ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను అంగీకరించకపోతే, తాను రాజ్యాంగ రచనా సంఘానికి రాజీ నామా చేస్తానని, రాజ్యసభలో తాను కొనసాగలేనని కరాఖండీగా చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీ దిగి వచ్చింది. అంటే 1919 నుంచి, 1949 నవంబర్ 25 వరకు అంబేడ్కర్ సాగించిన పోరాట ఫలితమే ఇప్పుడు అమలు జరుగుతున్న రాజకీయ రిజర్వేషన్లు. అయితే అంబేడ్కర్ ఆశించిన రాజకీయ రిజర్వేషన్లు రాలేదు. పూనా ఒడంబడిక ప్రభావమే నేటికీ ఎస్సీ, ఎస్టీ ప్రజా ప్రతినిధుల మీద ఉందన్నది వాస్తవం. ఎస్సీలు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడానికి నూటికి 60 నుంచి 80 శాతం వరకు దళితేతరుల ఓట్లు కావాల్సి ఉంటుంది. ఒకవేళ 1932లో బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక నియోజక వర్గాల పద్ధతి అమలు జరిగితే, ఈరోజు దళిత ప్రజల స్థితిగతులు వేరే విధంగా ఉండేవి. పూనా ఒడంబడిక కుట్రను, ఐఏఎస్ అధికారి, దళిత మేధావి డాక్టర్ రాజశేఖర్ ఉండ్రు తాను రాసిన ‘అంబేడ్కర్, గాంధీ, పటేల్’ పుస్తకంలో అద్భుతంగా అక్షరీకరించారు. సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి తెలుగులోకి అనువదించిన ఈ చారిత్రక నేపథ్యాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్నది రెండే మార్గాలు. కమ్యూనల్ అవార్డులో లాగా ప్రత్యేక నియోజకవర్గాల సాధనకు ఉద్యమించడం, ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా పనిచేయడానికి కావాల్సిన మార్గాలను అన్వేషించడం. పూనా ఒడంబడిక వల్ల నష్టపోయిన నేటి దళిత జాతి తమ భవిష్యత్ కోసమే కాదు, దళిత జాతి జాగృతి కోసం పోరాడాల్సిన తక్షణ ఆవశ్యకత ఉంది. వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య , సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
ప్రశ్నించడమే ప్రజాస్వామ్య సారం
పార్లమెంటులో ప్రశ్నలు సంధించడం అనేది చట్టసభ సభ్యుల రాజ్యాంగ హక్కు. ఈ హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 నుంచి దఖలుపడింది. ప్రశ్నోత్తరాల సమయం అంటే అమలులో ఉన్న ప్రత్యక్ష ప్రజాస్వామ్య వ్యక్తీకరణగానే చెప్పాలి. అయితే ప్రభుత్వంపై ప్రతిపక్షం ఆగ్రహించిన ప్రతి సందర్భంలోనూ మొట్టమొదటిగా బలయ్యేది ఈ ప్రశ్సోత్తరాల సమయమే. రాజకీయపార్టీలు తరచుగా ప్రశ్నోత్తరాల సమయంలోనే తమ సభ్యులను పోడియం ముందుకు వెళ్లి నిరసన తెలుపాలని ప్రోత్సహిస్తుంటాయి. దీనిద్వారా ప్రశ్నిచే హక్కును కోల్పోతున్నది తామే కానీ ప్రభుత్వం కాదనే విషయాన్ని చట్టసభ సభ్యులు గుర్తించరు. నిజానికి ఇది పార్లమెంటులోని ప్రతి సభ్యుడికీ, సభ్యురాలికీ కలిగే నష్టం మాత్రమే. సాంప్రదాయానుసారం, తప్పనిసరిగా కొనసాగించాల్సిన ప్రశ్నోత్తరాల సెషన్ లేకుండానే సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంటు సమావేశం కానుంది. సాధారణంగా ప్రతి పార్లమెంట్ సమావేశం కూడా ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతుంది. ఇది గంటసేపు కొనసాగుతుంది. ప్రభుత్వం తలపెడుతున్న వివిధ కార్యక్రమాలపై సమాచారం కోరుతూ పార్లమెంటు సభ్యులు ప్రశ్నలు సంధిస్తారు. పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సెషన్నే రద్దు చేసిన పక్షంలో దేశంలో ప్రభుత్వ పాలనకు సంబంధించిన కీలక అంశాలపై సమాచారం వెలికి రాకుండా నిలిచిపోతుంది. దీనివల్ల ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలను చట్టసభల సభ్యులు కోల్పోతారు. ప్రశ్నలు సంధించే హక్కును రాజ్యాంగంలోని 75వ ఆర్టికల్ కల్పిం చింది. మంత్రిమండలి సామూహికంగా చట్టసభ ప్రతినిధులకు జవాబుదారీగా ఉండాలని ఇది చెబుతోంది. ఈ సామూహిక బాధ్యతే ప్రభుత్వాన్ని పార్లమెంటుకు జవాబుదారీని చేస్తుంది. పన్నులు వసూలు చేసినప్పుడు లేక వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై డబ్బు ఖర్చు పెట్టినప్పుడు ప్రభుత్వం ఎంత మొత్తం పన్నులను వసూలు చేసింది, ఎంత డబ్బు ఖర్చు పెట్టింది అనే అంశాలను తెలుసుకునే హక్కు చట్టసభ సభ్యులకు ఉంటుంది. ప్రశ్నలు అడగడం ద్వారా, అందుబాటులో ఉన్న ఇతర ఉపకరణాల ద్వారా, పార్లమెంటరీ కమిటీలు రూపొందిం చిన సిస్టమ్స్ని ఉపయోగించడం ద్వారా చట్టసభ సభ్యులు ఈ హక్కును ఉపయోగించుకుంటారు. ప్రశ్నోత్తరాల సమయం.. ప్రత్యక్ష ప్రజాస్వామ్య వ్యక్తీకరణ పార్లమెంటులో ప్రశ్నలు సంధించడం అనేది చట్టసభ సభ్యుల రాజ్యాంగ హక్కు. ఈ హక్కు ఆర్టికల్ 75 నుంచి దఖలుపడింది. ఈ కోణంలోంచి చూస్తే పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రత్యేకంగా చూడాల్సి ఉంది. అదేమిటంటే ప్రశ్నోత్తరాల సమయం అనేది క్రియాశీలంగా ఉన్న ప్రత్యక్ష ప్రజాస్వామ్యపు వ్యక్తీకరణగానే చెప్పాలి. ఈ అర్థంలో చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉన్న వారు పాలనకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వాన్ని నేరుగా నిలదీస్తారు. వారు సంధించే ప్రశ్నలన్నింటికీ సమాధానాలు విధిగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తలెత్తే ప్రశ్న ఏమిటంటే, మొత్తం పార్లమెంటు సమావేశాల కాలంలో ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయాలని నిర్ణయిస్తుందా అన్నదే. చట్టసభ నిబంధనలు దానికి అనుమతించవు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీన్ని ఒక రోజుపాటు సస్పెండ్ చేయవచ్చు. అయితే ఆరోజు అప్పటికే జాబితాలో పొందుపర్చిన ప్రశ్నలను సభ్యులు సమాధానం ఆశిస్తున్న ప్రశ్నలుగా పరిగణిస్తారు. అంటే వీటికి కూడా రాతపూర్వకంగా సమాధానాలుండి వీటిని చట్టసభలో ఉంచారని అర్థం. అయితే మొత్తం పార్లమెంటు సెషన్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయడం అనేది పూర్తిగా భిన్నమైన విషయంగానే చూడాలి. చట్టసభ సంపూర్ణ ఆమోదం లేకుండా ప్రశ్నోత్తరాలను ఏకపక్షంగా రద్దు చేస్తూ నిర్ణయించే అధికారం కార్యనిర్వాహక వర్గానికి లేదన్నదే ఈ రచయిత అభిప్రాయం. చట్టసభ ఒక తీర్మానం ద్వారానే అలాంటి నిర్ణయానికి అనుమతిని ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుంటే తమ రాజ్యాంగబద్ధమైన హక్కును కార్యనిర్వాహకవర్గం తీసేసుకుందని సభ్యులు గుర్తించాలి. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో మొత్తం సెషన్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేయడం నిజమే. కానీ కార్యనిర్వాహక వర్గం తీసుకున్న అలాంటి నిర్ణయాలు రాజ్యాంగం ప్రకారం చూస్తే తప్పు. పైగా ప్రభుత్వం మెజారిటీని కలిగి ఉన్నందున చట్టసభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని తీర్మానం ద్వారా రద్దు చేయడం దానికి సులువు అనేది కూడా నిజమే. కానీ అలాంటి నిర్ణయం తీసుకోవడానికి తగిన కారణాన్ని ప్రభుత్వం తప్పకుండా అటు చట్టసభకూ, ఇటు యావద్దేశానికి వివరించాల్సిన అవసరం ఉంది. అప్పుడే.. ప్రభుత్వం దురుద్దేశంతో వ్యవహరిస్తోందా లేక నిజమైన కారణాలతోనే అలాంటి చర్యకు పాల్ప డిందా అని ప్రజలు తేల్చుకోగలరు. వాస్తవానికి, ప్రశ్నోత్తరాల సమయాన్ని మొత్తంగా రద్దు చేయడానికి నిజమైన కారణాలు అనేవి ఎన్నటికీ ఉండవనే చెప్పాలి. అదే పార్లమెంటులో ఇతర కార్యక్రమాలన్నీ సజావుగా జరుగుతున్నప్పుడు ప్రశ్నోత్తరాల సమయాన్ని నిర్వహించడంలో సమస్యలు ఏం ఉంటాయి? అందుకే ఈ అంశానికి సంబంధించినంతవరకు.. ప్రభుత్వాన్ని నడుపుతున్న వారి సాధారణ వైఖరిలోనే అసలు సమస్య కనపడుతుంది. ప్రభుత్వ యంత్రాంగం అన్ని వేళల్లో సభ్యులు సంధించిన ప్రతి ప్రశ్నను సేకరించి దానిపై పార్లమెంటుకు సమాధానాల రూపంలో సమర్పించిన సమాచారం సరిగ్గా ఉన్నట్లు నిర్ధా్దరించాల్సి ఉంది. అందుచేత, రాజకీయ విభేదాలకు తావిచ్చే కీలక అంశాలను ప్రజలకు వెల్లడించటానికి ప్రభుత్వం సమ్మతించనప్పుడు ఇలా ప్రశ్నోత్తరాలను పక్కనపెట్టే ధోరణి సాధారణంగా ఉంటూ వస్తోంది. ఏ ప్రభుత్వం కూడా పార్లమెంటుకు అబద్ధాలు చెప్పకూడదు. అలా చెప్పినట్లు దొరికిపోతే ప్రభుత్వంపై ప్రత్యేకాధికారంతో చర్య తీసుకునే సమస్యలు ఎదురవుతాయి. ఏది ఏమైనా చట్టసభలో ప్రభుత్వానికి మెజారిటీ ఉంటుంది కనుక తన మంత్రులను అది తప్పకుండా కాపాడుకుంటుంది. లేకుంటే వారు ప్రజా విమర్శను ఎదుర్కోవలిసి ఉంటుంది. కొంతమంది మంత్రులకు పార్లమెంటులో ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఏమంత సంతోషకరమైన విషయంగా ఉండదు. ప్రశ్నలు చికాకుపెట్టవు.. బాధించవు ప్రభుత్వానికి సంబంధించిన సమస్త కార్యకలాపాలపై పార్లమెంటులో సంధించే ప్రశ్నలు సమాధానం కోరతాయి. ఆ ప్రశ్నలకు తగినట్లుగా వివిధ ప్రభుత్వ శాఖలు విస్తారంగా సమాచారాన్ని సేకరించి ప్రభుత్వ వ్యవహారాలపై వెలుగును ప్రసరిస్తాయి. వాస్తవానికి పార్లమెంటులో సభ్యులు సంధించే ప్రశ్నల కారణంగా కొన్ని ప్రభుత్వ శాఖలు ఒక ప్రత్యేక సమస్యపై దృష్టి సారించి పరిష్కారాలపై దృష్టి పెట్టగలుగుతాయి. అలా ప్రశ్నించకుంటే కీలకమైన సమస్యలు ఆ విభాగాల దృష్టికి రాకుండా పోతాయి. వివిధ ప్రభుత్వ కమిటీలకు కూడా ఇదే వర్తిస్తుంది. వాస్తవానికి పార్లమెంటరీ తనిఖీ అనేది ప్రభుత్వానికి సాయపడుతుంది. అంతవరకు పరిష్కరించని సమస్యలపై ప్రభుత్వ విభాగాలు తీవ్రంగా దృష్టి సారించగలవు. అందుకే కరోనా మహమ్మారిపై సాగిస్తున్న యుద్ధం నుంచి ప్రభుత్వ దృష్టిని పార్లమెంటులో ప్రశ్నోత్తరాలు మళ్లిస్తాయనుకోవడం సరైంది కాదు. కాబట్టే పార్లమెంటు సమావేశాల మొత్తంలో ప్రశ్నోత్తరాలు లేకుండా చేయకూడదు. గత అయిదు నెలలుగా పార్లమెంటు సమావేశాలు, ప్రశ్నలు లేకుండానే దేశంలోని ప్రతి ప్రాంతానికి కరోనా మహమ్మారి విస్తరించింది. అందుకే ఈ అంశంపై పార్లమెంటులో సంధించే ప్రశ్నలు ప్రభుత్వాన్ని చికాకుపెట్టవు, ఇబ్బంది కలిగించవు కూడా. ప్రభుత్వ జవాబుదారీతనం కోణంలోంచి చూస్తే ప్రశ్నోత్తరాల సమయం అనేది పార్లమెంటు సమావేశాల్లోనే అత్యంత ఆసక్తికరమైన సమయం. ప్రశ్నోత్తరాల సమయం సభ నిర్వహించే అత్యంత ముఖ్యమైన కార్యకలాపాల్లో కీలకమైనది. పైగా ఇది అనేకసార్లు అంతరాయాలకు లోనయ్యే కార్యకలాపం కూడా. ప్రశ్నోత్తరాల సమయం అంతరాయాలకు గురికావడం చాలా మామూలు వ్యవహారం. ప్రశ్నోత్తరాల సమయాన్ని విచ్ఛిన్నపర్చడం అంటే సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగే తమ హక్కును తామే విచ్ఛిన్నపర్చుకోవడమే అని గుర్తించాలి. భారత రాజ్యాంగమే పార్లమెంటు సభ్యులకు ప్రశ్నించే హక్కును కల్పించింది. దాన్ని కాపాడుకోవడం వారి విధి మాత్రమే. విచారకరమైన విషయం ఏమిటంటే ప్రభుత్వంపై ప్రతిపక్షం ఆగ్రహించిన ప్రతి సందర్భంలోనూ మొట్టమొదటిగా బలయ్యేది ఈ ప్రశ్నోత్తరాల సమయమే. రాజకీయపార్టీలు తరచుగా ప్రశ్నోత్తరాల సమయంలోనే తమ సభ్యులను పోడియం ముందుకు వెళ్లి నిరసన తెలపాలని ప్రోత్సహిస్తుంటాయి. దీని ఫలితంగా చట్టసభ వాయిదా పడుతుంది. ప్రశ్నోత్తరాల సమయం గాలిలో కలిసిపోతుంది. దీనిద్వారా ప్రశ్నిచే హక్కును కోల్పోతున్నది తామే కానీ ప్రభుత్వం కాదనే విషయాన్ని చట్టసభ సభ్యులు గుర్తించరు. నిజానికి ఇది పార్లమెంటులోని ప్రతి సభ్యుడికీ కలిగే నష్టం మాత్రమే. సభ్యులు ఈ వాస్తవాన్ని గుర్తిస్తే ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎప్పటికీ విచ్చిన్నం చేయబోరు. లేక మొత్తం సమావేశాల్లో ప్రశ్నలను రద్దు చేయబోరు కూడా. ఈ విషయంలో అటు ప్రభుత్వానికి కానీ, ప్రతిపక్షానికి కానీ విభజన అనేది ఉండదు. ప్రశ్నోత్తరాల సమయం అందరికీ సంబంధించింది. దాన్ని కాపాడుకోవలసిన ఉమ్మడి బాధ్యత వీరిపై ఉంది. వ్యాసకర్త : పి.డి.టి ఆచార్య, వ్యాసకర్త లోక్సభ మాజీ ప్రధాన కార్యదర్శి -
‘కరోనా కంటే భయంకరంగా కల్వకుంట్ల కరోనా’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారని, ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఓయూ జేఏసీ, తెలంగాణ మాదిగ దండోరా, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ‘భారత రాజ్యాంగం– చట్టాల దుర్వినియోగం’ అనే అంశంపై సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఓయూ జేఏసీ ప్రతినిధి చారకొండ వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, తెలంగాణ మాదిగ దండోరా అధ్యక్షుడు దేవర సతీష్ మాదిగ, ప్రొఫెసర్ అన్సారీ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ కన్నా రాష్ట్రంలో కల్వకుంట్ల కరోనా భయంకరంగా ఆవరించిందన్నారు. ప్రశ్నించినందుకు గతంలో మంద కృష్ణను రెండు నెలలు జైలులో పెట్టారని, తర్వాత ఎంతో మంది విద్యార్థి నాయకులను, ప్రొఫెసర్లను మావోయిస్టు బూచి చూపి అరెస్టులు చేశారన్నారు. ప్రస్తుతం 111 జీవోలో అక్రమ కట్టడాలు బయటపెట్టినందుకు రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించినందుకు రేవంత్ను జైలులో పెడితే ఎన్నో వాగ్ధానాలు ఇచ్చి నెరవేర్చని ముఖ్యమంత్రిని కూడా జైలులో పెట్టాలన్నారు. రేవంత్ ఏమైనా తీవ్రవాదా..? స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసులో అక్రమంగా మరో 12 కేసులు బనాయించి బెయిలు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఒక జాతీయ పార్టీ ఎంపీని అక్రమంగా అరెస్టు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష ఎంపీలు ఎందుకు ప్రశ్నించడం లేదో అర్థం కావడంలేదన్నారు. ఒకే పార్టీకి చెందిన తోటి ఎంపీని అక్రమంగా అరెస్టు చేస్తే అదే పార్టీ నాయకులు ఎంపీకి వ్యతిరేకంగా మాట్లాడడం దుర్మార్గమని, మీరు అవలంభించిన విధానం వల్ల ఇకపై ఎవ్వరూ ఆ పార్టీలో చేరేందుకు జంకుతారని, ప్రస్తుతం పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ప్రశ్నార్థకంలో పడ్డారన్నారు. ఢిల్లీ నుంచి హైకమాండ్ ఒక న్యాయవాదిని పంపించారని, ఈ విషయమై రాష్ట్ర కాంగ్రెస్ సిగ్గుపడాలన్నారు. సమావేశంలో ఓయూ జేఏసీ నాయకులు దరువు ఎల్లన్న, దుర్గం భాస్కర్, రెడ్డి జాగృతి నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వివిధ సంఘాల నాయకులు దుర్గయ్య గౌడ్, రమేష్, రామ్మూర్తి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. (తెరపైకి మరోసారి ఓటుకు కోట్లు కేసు) -
తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలి: గవర్నర్
సాక్షి, హైదరాబాద్ : రాజ్భవన్లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన సందర్భంగా ప్రతి ఏటా నవంబర్ 26న ఈ వేడుకలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ హై కోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్. మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతోపాటు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం గాంధీ, అంబేద్కర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గవర్నర్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతీ పౌరుడికి మన రాజ్యాంగం రక్షణ కల్పిస్తోందని అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను గుర్తు చేసుకుంటూ.. ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాజ్యాంగం కల్పిస్తున్న చట్టాల గురించి నేటి యువతకు పూర్తి అవగాహన లేదని, ప్రతి ఒక్కరూ తమ హక్కులు, విధుల గురించి తప్పని సరిగా తెలుసుకోవాలని సూచించారు. దేశ, రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని.. ఎన్నాళ్లు బతుకున్నామో కాదు.. ఎలా బతుకుతున్నామన్నదే ముఖ్యమన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాజ్భవన్లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నందుకు గవర్నర్కు అభినందనలు తెలిపారు. భారత్ది డైనమిక్ రాజ్యాంగమని, అనేక మార్పులు, చేర్పులకు లోనైందని ప్రస్తావించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు రాజ్యాంగం అవకాశం కల్పిస్తోందన్నారు. రాజ్యాంగం 7 దశాబ్దలుగా పరిపుష్టంగా కొనసాగుతోందని, రాజ్యాంగ స్ఫూర్తితో మన కర్తవ్యాన్ని నిర్వహించుకుందాం. భారత రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. -
రాజ్యాంగం.. ఓ కరదీపిక
సాక్షి, ఖమ్మం : సుదీర్ఘకాలం పరాయి పాలనలో మనదేశం ఉన్నది. ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగ ఫలితాలతో 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర భారతంగా అవతరించింది. ఆ తర్వాత ప్రతి స్వతంత్ర దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి. రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపిక వంటిది. ఈ దీపస్తంభపు వెలుగుల్లో సర్వసత్తాక సార్వభౌమాధికార దేశంగా ప్రగతి వైపు అడుగులు వేయాలి. అందుకనే రాజ్యాంగానికి ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో అంతటి విశిష్టమైన స్థానముంది. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన దేశానికంటే ముందే అనేక దేశాలు రాజ్యాంగాలను రచించాయి. భారత రాజ్యాంగ రచన ఒక సంక్లిష్టం. దీనికి కారణం దేశంలో అనేక మతాలు, తెగలు, ఆదివాసీలు, దళితులు, అణగారిన, పీడనకు గురైన వర్గాలు ఉన్నారు. వీరి ఆకంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ రచన ఒక సవాల్ లాంటిది.ఈ నేపథ్యంలో భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ సారధిగా కమిటీ ఏర్పాటైంది. రాజ్యాంగ రూపకర్తఅంబేడ్కర్ భిన్నత్వ సమ్మిళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎంతగానో శ్రమించారు. కమిటీలోని ఆరుగురు సభ్యులు మేథోమధనం నిర్వహించి కోటి రూపాయల ఖర్చుతో ప్రపంచంలోనే పెద్దదైన రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. 1947 నవంబర్ 26న అప్పటి అసెంబ్లీ దీనిని ఆమోదించింది. కులాలు, విభిన్న మతాలు, రకరకాల ఆచార వ్యవహారాలు సంఘటిత భారతావనికి స్వపరిపాలనా రూపకల్పన రాజ్యాంగ బద్ధం చేశారు. అంబేడ్కర్ చైర్మన్గా ఉన్న కమిటీలో పండిత్ గోవింద్ వల్లభ్పంత్, కె.ఎం.మున్నీ, అల్లాడి కృష్ణస్వామిఅయ్యర్, ఎన్.గోపాలస్వామి, అయ్యంగార్, బీఎల్.మిట్టర్, ఎండీ సాదుల్లా, డీపీ.ఖైతావ్ సభ్యులుగా ఉండగా.. ఖైతావ్ మరణం అనంతరం టీటీ కృష్ణమాచారి పర్యవేక్షణలో రెండు సంవత్సరాల 11నెలల 11 రోజులు కష్టపడి తయారు చేసిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రతిపాదించి ప్రవేశపెట్టారు. 2015 నుంచి రాజ్యాంగ దినోత్సవం.. కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ప్రతి ఏటా నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో ఈ రోజు రాజ్యాంగం గురించి తెలిసిన అనుభవజ్ఞులచే ఉపన్యాసాలు, వ్యాసరచన తదితర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ రాజ్యాంగం ఏర్పడిన 66 ఏళ్ల తర్వాత తొలిసారిగా రాజ్యాంగం ఆమోదిత దినోత్సవాన్ని 2015, నవంబర్ 26న జరుపుకుంది. రాజ్యాంగం పీఠిక ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా మారాలి. అదే మన లక్ష్యం. మన రాజ్యాంగాన్ని మరింతగా తెలుసుకునేలా ఈ రోజు మనకు స్ఫూర్తినివ్వాలి. -
రాజ్యాంగం వేదమంత్రమా, కరదీపికా?
పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందే ద్రవ్యబిల్లును పొరపాటున తన ఆమోదం కోసం తీసుకువచ్చినప్పుడు రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎమ్. హిదయతుల్లా దాన్ని తిరస్కరించారు. ఆయన రాజ్యాంగాన్ని సంప్రదాయంగా కాకుండా, కార్యనిర్వాహక కరదీపికలాగా చూశారు. కానీ నేటి రాజకీయ నాయకత్వం రాజ్యాంగంలోని సూక్ష్మభేదాలను పట్టించుకోవడం లేదు. రాబర్ట్ బొర్క్ ప్రకారం, మనం రాజ్యాంగాన్ని చదవడం కాదు.. అసలు చదవాలా అన్నదే ప్రశ్న. నేడు మనం ‘రాజ్యాంగ నైతికత’ యుగంలోనూ, న్యాయ ధర్మ శాస్త్రాన్ని సీల్ట్ కవర్లో ఉంచేసిన యుగంలోనూ జీవిస్తున్నాం. భారత ప్రజాస్వామ్యాన్ని ఆ దేవుడే రక్షించుగాక..! అత్యంత శ్రద్ధాశక్తులతో, శ్రమకోర్చి రూపొం దించిన భారత రాజ్యాంగం.. రాజకీయ పవి త్రత కలిగిన శాసన పత్రం. నూతన గణతంత్ర వ్యవస్థ నిర్మాతలు పొందుపర్చిన ఆదర్శాలతో అది ప్రతిష్టితమైనది. కానీ దేశంలో 70 ఏళ్లుగా సాగుతున్న క్రమబద్ధ పాలనలో అది దాని ప్రాసంగికతను, ప్రగతిశీల స్వభావాన్ని కోల్పోయిందా అని నేను భీతిల్లుతున్నాను. ఏడు దశాబ్దాలలోపే మన రాజ్యాంగం సారాంశాన్ని లేక స్ఫూర్తిని కొనసాగించకుండా, దాన్ని కేవలం ఒక పూజనీయమైన పవిత్రగ్రంథం స్థాయికి కుదించివేశారు. నిజానికి అది రాజ్యాంగ పరిధిలో స్థాపించిన ప్రభుత్వానికి చెందిన మూడు విశిష్ట విభాగాల దుష్పరిపాలనకు వీలుకల్పించే అధికార వనరుగా మారిపోయింది. వివిధ రాజ్యాంగ సంబంధ కార్యాలయాలు తమ అసమర్థత కారణంగా రాజ్యాంగ ప్రతిని చదవటం కానీ లేక దాని సంవిధానాన్ని అర్థం చేసుకోవడం కాని చేయలేకపోతున్నాయి. తన మహోన్నతమైన ప్రయోజనాన్ని గుర్తించడానికి బదులుగా భారత ప్రజ లపై అధికారాన్ని చలాయించే వనరుగా మాత్రమే మన రాజ్యాంగం మారిపోయింది. వేదమంత్రాల స్థాయిలో రాజ్యాంగ అధికరణలను మతిహీనంగా జపిస్తున్నారు. రాజ్యాంగ న్యాయస్థానాల్లోని న్యాయమూర్తులే భారత రాజ్యాంగం అత్యున్నత పూజారులు. చాలాకాలం క్రితమే మృతిచెందిన ఇతర దేశాలకు చెందిన న్యాయవాదులు, న్యాయమూర్తులు ప్రయోగించిన సామెతలు, నిగూఢ పదబంధాలు, ఉల్లేఖనల ప్రస్తావనలతో వీరు సంతోష పడుతున్నారు. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త హైకోర్టు ఏర్పాటు అంశం దీనికి సంబంధించిన తాజా అభాసగా నిలుస్తోంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (1956 నుంచి 2014 వరకు మనుగడలో ఉండింది) ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 పేరిట పార్లమెంటు చేసిన చట్టం ద్వారా విభజనకు గురైంది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే రెండు రాష్ట్రాలను రూపొందించింది. రెండు కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అవసరమైన వివిధ అంశాలను ఈ చట్టంలో పొందుపర్చారు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకించి విడిగా హైకోర్టు ఉండాలని రాజ్యాంగంలోని 214 అధికరణ ఆదేశించి ఉన్నందున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా హైకోర్టును ‘ఏర్పాటు చేయాల్సిన’ అవసరముందని, హైదరాబాద్ పరిధిలోని హైకోర్టును, తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా మార్చాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 30, 31 ప్రకటించాయి. అయితే హైదరాబాద్ పరిధిలోని హైకోర్టు మునుపటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టే తప్ప మరొకటి కాదు. దాని ప్రాదేశిక అధికార పరిధి రెండు కొత్త రాష్ట్రాల సారాంశంగా ఉండేది. కానీ రెండు రాష్ట్రాల అధికార పరిధిని కలిగి ఉండిన ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రాదేశిక అధికార పరిధిని మాత్రమే కలిగి ఉంటోంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ‘ఏర్పర్చాల్సిన’ తేదీ గురించి పునర్వ్యవస్థీకరణ చట్టం మౌనం వహించింది. అలాగే ప్రత్యేక హైకోర్టును ఏర్పర్చాల్సిన విధివిధానం గురించి కూడా ఈ చట్టం మౌనం పాటిస్తోంది. దీన్ని వివరించడానికి మనం ఆంధ్రప్రదేశ్ చట్టం 1953, సెక్షన్ 28ని ప్రస్తావించాలి. 1956 జనవరి ఒకటవ తేదీన లేక రాష్ట్రపతి ప్రకటన ద్వారా నిర్దేశించిన అంతకు మునుపటి తేదీన కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఉండాలని ఇది నిర్దేశించింది. హైకోర్టు ప్రధాన పీఠం నెలకొల్పాల్సిన స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నిర్ణయించవచ్చని సెక్షన్ 28(3) ప్రకటించింది. జార్ఖండ్, చత్తీస్గఢ్, గుజ రాత్ రాష్ట్రాలను ఏర్పర్చిన బిహార్, మధ్యప్రదేశ్, బాంబే పునర్వ్యవస్థీకరణ చట్టాల్లో కూడా ఇదే విధమైన అంశాలను మనం చూడవచ్చు. పైన పేర్కొన్న చట్టాలన్నింటిలోనూ నూతనంగా ఏర్పర్చిన హైకోర్టు ఉనికిలోకి వచ్చే తేదీని నిర్ధారించే నిబంధనలను, హైకోర్టు ప్రధాన పీఠం ఎక్కడ ఉండాలో నిర్ణయించే రాజ్యాంగబద్ధ అధికారి గురించి నిర్దిష్టంగా సూచించడమైనది. నూతన హైకోర్టుకు చెందిన రాజ్యాంగబద్ధ ప్రాథమిక శాసనాధికారాన్ని పార్లమెంటు అత్యంత స్పష్టంగా నిర్దేశించింది. దురదృష్టవశాత్తూ, నూతన హైకోర్టు ఉనికిలోకి రావలసిన తేదీకి సంబంధించి 2014 చట్టంలో అలాంటి శాసనసంబంధమైన నిబంధనను మనం చూడలేం. లేక అలాంటి నిర్దిష్ట తేదీని ప్రకటించే అధికారాన్ని భారత రాష్ట్రపతి లేక మరెవరైనా రాజ్యాంగబద్ధ అధికారికి కట్టబెట్టిందీ లేదు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన హైకోర్టు ఏర్పాటు, భారత రాష్ట్రపతి సంతకం చేసిన 2018 డిసెంబర్ 26 నాటి భారత ప్రభుత్వ గెజెట్లో ప్రచురించిన ప్రకటన ద్వారా ఉనికిలోకి వచ్చింది. భారత ప్రభుత్వం వర్సెస్ బి. ధనపాల్ ఎస్ఎల్పి 298902018 మరియు రాష్ట్రాలకు చెందిన కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఈ ప్రకటన ప్రస్తావిస్తూ, ఆ తీర్పు స్ఫూర్తితో హైదరాబాద్ అధికార పరిధిలోని హైకోర్టును తెలం గాణ హైకోర్టుగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా విభజించే ప్రకటనను సంబంధిత సమర్థ అధికారి చేయగలరని పేర్కొంది. అయితే న్యాయపాలనా పవిత్ర సూత్రం పరిధిలో అలాంటి సమర్థ అధికారి ఎవరు, స్వయంగా రాజ్యాంగం ద్వారా లేక రాజ్యాంగం పరి ధిలో రూపొందించిన ఏదైనా చట్టం ద్వారా రాజ్యాంగ పాలన కలిగిన దేశంలో ఏదైనా ప్రభుత్వ చట్టం ద్వారా అలాంటి అధికారాన్ని చలాయిస్తారా అన్నదే ప్రశ్న. నేను ముందే చెప్పినట్లుగా హైకోర్టు ఏర్పాటు తేదీని ఎవరు నిర్ణయించాలి అనే అంశానికి సంబంధించి పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 పూర్తిగా మౌనం పాటిస్తోంది. కానీ రాష్ట్రపతి పేరుతో జారీ చేసే ప్రకటన ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని ప్రభుత్వం లేక దేశ పాలకులు విశ్వసిస్తున్నారు. అయితే ఒరిజనల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా ఉండి ఇప్పుడు మారిన తెలంగాణ హైకోర్టులో కుదించిన ప్రాదేశిక న్యాయాధికార పరిధితో కొనసాగనున్న జడ్జీలుకూడా తాజాగా ప్రమాణ స్వీకారం చేయడమే ఈ మొత్తం ఉదంతంలో ఉల్లాసం కలిగించే అంశం. అయితే తాజాగా ఎలాంటి నియమకాలకు చెందిన వారంట్లనూ జారీచేయలేదు. నా అభిప్రాయంలో ఇది సరైనదే. కానీ అదేసమయంలో, రాజ్యాంగ సంవిధా నాన్ని లేక రాష్ట్రపతి అధికారాలను విశ్లేషించి చూస్తే ఇలా కొత్తగా ప్రమాణం చేయవలసిన అవసరం లేదు. మాతృసంస్థ అయిన మద్రాసు హైకోర్టు నుంచి ప్రాదేశిక న్యాయాధికార పరిధిలో ఆంధ్ర హైకోర్టు 1953లో ఏర్పాటైన సందర్భంగా మదరాసు హైకోర్టులోనే ఉండిపోయిన న్యాయమూర్తులు కొత్తగా ప్రమాణం చేయలేదు. అలాగే గుజరాత్, జార్ఖండ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల నూతన హైకోర్టులను ఏర్పర్చిన సందర్భం లోనూ బాంబే, పాట్నా, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు కొత్తగా ఎలాంటి ప్రమాణం చేయలేదు. చెప్పుకుంటే ఇలాంటివి చాలా ఉదాహరణలు ఉంటాయి. అయితే ఇప్పుడు తెలంగాణ హైకోర్టుగా పిలుస్తున్న హైదరాబాద్ అధికార పరిధిలో కొనసాగుతున్న జడ్జీలు మాత్రం తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో ఇలాంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగినప్పుడు సుప్రీంకోర్టు మాజీ జడ్జీలు, ప్రస్తుత సిట్టింగ్ జడ్జీలు కూడా వాటికి హాజరవటం గమనార్హం. 1969లో నాటి రాష్ట్రపతి జకీర్ హుస్సేన్ పదవిలో ఉండగానే మరణించినప్పుడు, రాష్ట్రపతిగా వ్యవహరించిన ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తి దేశ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడానికి రాజ్యాంగం రీత్యా పరిస్థితి డిమాండ్ చేసిన నేపథ్యంలో నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎమ్ హిదయతుల్లా మరొకరి బదులుగా రాష్ట్రపతిగా అయ్యారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మనీ బిల్లును ఆయన పరిశీలనకు పంపించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 117(1) ప్రకారం, రాష్ట్రపతి ‘సిపార్సు’తో మాత్రమే పార్లమెంటులో మనీ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంది. పార్లమెంటు ఉభయసభల్లో ఈ బిల్లు నెగ్గినట్లయితే, దాన్ని మళ్లీ రాష్ట్రపతి ఆమోదానికి పంపాలి. ఇక్కడ సంక్లిష్ట పరిస్థితి ఏర్పడింది. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడానికే రాష్ట్రపతి సిఫార్సు చేస్తారు. రాష్ట్రపతి ఆమోదం ఆ బిల్లును శాసనంగా మారుస్తుంది. అయితే పార్లమెంటులో ఆ బిల్లు ప్రవేశపెట్టడానికి ముందుగా నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా ముందుకు పొరపాటున ఆ ద్రవ్య బిల్లును తీసుకెళ్లారు. హిదయతుల్లా రాజ్యాంగం గురించి మరిచిపోయి ఉంటే, లేక రాజ్యాంగం గురించి తెలియకుండా ఉంటే, లేక అహంభావంతో ప్రవర్తించి ఉంటే ఆ బిల్లుకు ఆమోదం తెలుపుతూ సంతకం పెట్టేవారు. దీంతో పార్లమెంటులో దాన్ని ప్రవేశపెట్టకుండానే ఆ బిల్లు భారత ప్రామాణిక శాసనంగా మారిపోయి ఉండేది. హిదయతుల్లా రాజ్యాంగానికి సేవ చేసిన విశిష్ట న్యాయవేత్త. ఆయన రాజ్యాంగాన్ని కార్యనిర్వాహక కరదీపికలాగా చూశారు. ఆయన కేవలం సంప్రదాయాలను గుడ్డిగా పాటించే అత్యున్నత పూజారి కాదు. అందుకే పార్లమెంటులో ప్రవేశపెట్టకుండానే తన వద్దకు వచ్చిన ఆ ద్రవ్యబిల్లును ఆమోదించడానికి ఆయన తిరస్కరించారు. దాంతో ఆయన కింది అధికారులు న్యాయమీమాంసకు సంబంధించిన ఒక పెను సంక్షోభాన్ని తప్పిస్తూ తమ తప్పును సరిదిద్దుకోవలసి వచ్చింది. హిదయతుల్లా ఇప్పుడు లేరు. కానీ నేటి రాజకీయ నాయకత్వం రాజ్యాంగంలో పొందుపర్చి ఉన్న సూక్ష్మభేదాల గురించి పెద్దగా విచారించడం లేదు. వారితోపాటు ప్రధాన పూజారులు కూడా వాటిని లెక్కబెట్టడం లేదు. ఈ సందర్భంగా నేను రాబర్ట్ బొర్క్ ప్రకటనను గుర్తు చేస్తాను– ఈరోజుల్లో రాజ్యాంగాన్ని ఎలా చదవాలన్నది కాదు.. చదవాలా వద్దా అన్నదే ప్రశ్న. ఇప్పుడు మనం ‘రాజ్యాంగ నైతికత’ యుగంలోనూ, న్యాయ ధర్మశాస్త్రాన్ని సీల్ట్కవర్లో ఉంచేసిన యుగం లోనూ జీవిస్తున్నాం. భారత ప్రజాస్వామ్యాన్ని ఆ దేవుడే రక్షించుగాక! జాస్తి చలమేశ్వర్ వ్యాసకర్త సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి -
రాజ్యాంగేతర పాలన పోవాల్సిందే!
భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారం లోకి వచ్చిన బీజేపీ, క్రమంగా విశ్వ హిందూ పరిషత్, ఆరెస్సెస్, భజ రంగ్దళ్ తదితర సంస్థల ద్వారా ఉన్మాద చర్యలను రెచ్చగొట్టి, లౌకికవాద పునాదుల నుంచి తప్పు కున్న కారణంగానే, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా ఛత్తీస్గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్లో చావుదెబ్బ తిన్నది. రాజ్యాంగం మీద విశ్వాసం లేని నరేంద్రమోదీ రాజ్యాంగేతర శక్తిగా మారారు. మనుస్మృతిలో వున్న భావజాలాన్ని నమ్మి విశ్వ విద్యాలయాల్లో దళితుల విద్యను ధ్వంసం చేయ డానికి పూనుకున్నారు. హేతువాదుల గొంతునొక్కి, మైనార్టీల హక్కులను కాలరాశారు. ప్రపంచం మొత్తం విజ్ఞానం వైపు పరుగులు తీస్తుంటే భారత్ మౌఢ్యంలో ఇరుక్కోవడానికి మోదీనే కారణం. ఒక వైపు ప్రపంచ విజ్ఞాన శాస్త్రం, వైద్య శాస్త్రం, మనిషి ఆయుప్రమాణాన్ని పెంచుతుంటే ఆరెస్సెస్. బీజేపీలు మంత్ర తంత్ర వ్యవస్థను విస్తరింపజేసి పూజలు, యాగాలు, యజ్ఞాలు, అభిషేకాలు ఫలాల నిస్తాయని వైద్యశాలలు, శస్త్రచికిత్సలు, వైద్య పరిశో ధనలు, భారతీయ వైద్య శాస్త్రానికి భిన్నమైనవని ప్రచారం చేస్తూ ప్రజల్ని యోగులకు, బాబాలకు, స్వాములకు బానిసలు చేస్తూ వెళ్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తూ వెళ్తు న్నారు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకంటే దేశంలో విద్య కోసం, విజ్ఞానం కోసం, చట్టరక్షణ కోసం ఎంతో ఖర్చు పెడుతున్నాం. ఇక ఈ వ్యవస్థ లన్నీ వ్యర్థం, కోడిగుడ్డు పస్తీ వేసి దొంగల్ని పట్టు కుంటాము అంటే రాజ్యాంగానికి అర్థమేముంది? మరోవైపున ఆర్థిక వ్యవస్థ కుదేలు అవ్వడానికి మోదీయే కారణం. దేశంలో ఆర్థిక పతనం పెరిగి పోయింది. రూపాయికి విలువ పోయాక ప్రపంచ స్థాయిలో మన దేశం ఎక్కడుంటుందని ఆర్థిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మనదేశంలో ప్రమాద కర సన్నివేశం ఆవిష్కృతమవుతోంది. రూపాయి విలువ రోజురోజుకూ దిగజారుతోంది. అవినీతి లేని దేశాల్లో ప్రజలు ఎంతో అభివృద్ధి చెందుతు న్నారు. వీరికితోడు బ్యాంకులకు డబ్బు ఎగవేసే పెట్టుబడి దారుల సంఖ్య పెరిగింది. రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసినప్పుడు ఒక్కసారిగా ప్రజలు విలవిలలాడారు. అప్పుడు కూడా ఆయన బాధపడలేదు, సమర్ధించుకున్నాడు. కూరగాయలు అమ్మేవాళ్ళు, చిన్న చిన్న కొట్లవాళ్ళు, రోజు కూలీలు, వృద్ధులు ఒక సందర్భంలో టీ నీళ్ళు లేక, తింటానికి అన్నం లేక పస్తులున్నారు. అయినా మోదీ బాధపడలేదు. ఇదంతా వారి కర్మ అనుకునే స్వభావం ఆయనది. మోదీలో ఈ నాలుగున్నర ఏళ్లలో ఎక్కడా మానవతా స్ఫూర్తి కనపడలేదు. స్త్రీలపై కనికరం కనబడలేదు. ఢిల్లీ నడిబొడ్డులో స్త్రీలు మానభంగాలకు గురయ్యారు. ఎన్నో పవిత్ర హత్యలు కులం పేరుతో జరిగాయి. నాయకులకు నీతి నిజాయితీ లోపించాయి. తాగుబోతులుగా, వ్యభిచారులుగా, జూదగాళ్ళుగా, దోపిడీదారులుగా రాజకీయ నాయకులు మారారు. ఇటువంటి శక్తుల న్నింటిని అమిత్షా, మోదీ ప్రోత్సహిస్తూ వచ్చారు. కాన్షీరావ్ు కాంగ్రెస్ను బ్రాహ్మణవాద పార్టీలో మొదటిదని, బీజేపీని బ్రాహ్మణవాద పార్టీలో రెండ వదని చెబుతూ ఉండేవారు. దళితులు, బహుజ నులు ఓటు శక్తిని తెలుసుకోవాలి. ఓటును అమ్ముకో వడం అంటే గుండెను అమ్ముకోవడమన్నంత చైత న్యం రావాలి. దళితులకు అంబేడ్కర్ ఇచ్చిన బంగారు కానుక ఓటు. దాన్ని కేవలం మందుకు, మాయమాటలకు, డబ్బుకు అమ్ముకోవడం దళి తుల వెనుకబాటుతనానికి నిదర్శనం. దళిత బహు జనులు తమ ఓటు తాము నిజాయితీగా వేసుకున్న రోజున వారికి సంపదలో భాగస్వామ్యం వస్తుంది. అంబేడ్కర్ బానిసత్వాన్ని వదిలించుకొనే శక్తి నీకే రావాలని బోధించాడు. ఇతరులు మీకు బానిస త్వాన్ని నేర్పుతారు. బానిసత్వాన్ని వదిలించరు. బానిసత్వం అనేది ఒక వ్యసనం. అలసత్వం అనేది ఒక వ్యాధి. ఈ రెండింటి నుంచి దళితులు బయ టపడాలి. అంబేడ్కర్ ఎంతో పోరాడి తెచ్చిన ఓటును వివేచనా రహితంగా అమ్ముకోవడం వల్ల భార తదేశంలో రాజకీయ పరిణామం ఆలస్యమైపో తుంది. అందుకే మహాత్మాఫూలే, అంబేడ్కర్ భావ జాలంతో కూడిన రాజ్యాధికార శక్తులు ముందుకు రావాలి. వామపక్షాలు వీరితో చేతులు కలపాలి. ఏది ఏమైనా చరిత్రలో మార్పు అనివార్యం. ప్రజలు ఆలోచిస్తున్నారనడానికి మోదీ తిరోగమనమే నిద ర్శనం. వ్యాసకర్త : డా‘‘ కత్తి పద్మారావు, సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు‘ 98497 41695 -
రాజ్యాంగమే రక్ష
దేశ చరిత్రలో నవంబర్ 26 చాలా ముఖ్యమైన తేదీ. అరవై ఎనిమిది సంవత్సరాల కిందట స్వతంత్ర భారతానికి రాజ్యాంగం రూపుదిద్దుకొని రాజ్యాంగసభ ఆమోదం పొందిన రోజు. సంవిధాన్ దివస్. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ముంబయ్ నగరంపైన దాడి చేసి 166 మందిని హత్య చేసి, సుమారు 300 మందిని గాయపరచిన దుర్దినం కూడా ఇదే కావడం విశేషం. లష్కరే తొయ్యబా, జమాత్–ఉద్–దవా అధినేత హఫీజ్ మహమ్మద్ సయీద్ నేతృత్వంలో పాకిస్తాన్లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు సముద్రమార్గంలో ముంబయ్ తీరానికి చేరుకొని దేశ ఆర్థిక రాజధానిపైన పైశాచికంగా దాడి చేసి అమాయకులను చంపివేసిన ఘటన జరిగి సరిగ్గా పదేళ్ళు. దేశ పరిపాలనకు దిక్సూచిగా సంవిధానం రచించుకొని, దాని ప్రాతిపదికగా దేశ సమైక్యతనూ, సమగ్రతనూ పరిరక్షించుకోవాలని సంకల్పం చెప్పుకున్న రోజే పాకిస్తాన్ ముష్కరులు దేశ ఆర్థిక రాజధానిపైన ఉగ్రపంజా విసరడం, విధ్వంసం సృష్టించడం దేశ ప్రజలను నిర్ఘాంతపరిచింది. ముంబయ్ దాడి నుంచి మనం ఎటువంటి గుణపాఠాలు నేర్చుకున్నామో సమీక్షించుకోవలసిన సందర్భం ఇది. అదే విధంగా రాజ్యాంగపాలన ఎంత సమర్థంగా సాగుతున్నదో పరిశీలించుకొని రాజ్యాంగస్పూర్తితో పరిపాలన నిరాఘాటంగా, జనామోదంగా సాగే విధంగా భవిష్యత్ చిత్రపటాన్ని ఆవిష్కరించవలసిన సమయం కూడా ఇదే. నిజానికి మన దేశ భద్రతకూ, సమగ్రతకూ అవినాభావ సంబంధం ఉన్నది. సమగ్రత సమైక్యతపైన ఆధారపడి ఉంటుంది. ముంబయ్పైన ఉగ్రదాడి జరిగిన తర్వాత మరోదాడి అంత స్థాయిలో జరగలేదు. కానీ పాకిస్తాన్ భూభాగంలో శిక్షణ పొందిన ఉగ్రవాదులు కశ్మీర్లో రక్తపాతం సృష్టిస్తూనే ఉన్నారు. భద్రతావ్యవస్థను బలోపేతం చేసుకోవడం పరమావధి. ఏడున్నర వేల కిలోమీటర్ల పొడవున్న కోస్తాతీరంలో భద్రత పెంపొందించడానికి చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చిన దాఖలా లేదు. కోస్తాను అనుకొని ఉన్న ఏడు రాష్ట్రాల, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకీ, దేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థకీ, కోస్టల్గార్డ్కీ, నావికాదళానికీ మధ్య సమన్వయం ఇప్పటికీ లేదని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ముంబయ్పైన దాడి చేయించిన సూత్రధారులకు పాకిస్తాన్ ప్రభుత్వం రక్షణ కల్పిస్తున్నదనేది వాస్తవం. హఫీజ్ను ఉగ్రవాదిగా పరిగణించాలని ఇండియాతోపాటు అమెరికా, తదితర దేశాలు తీర్మానిస్తే చైనా అందుకు అడ్డుతగిలి పాకిస్తాన్ను గుడ్డిగా సమర్థిస్తున్నది. ముంబయ్పైన దాడి చేయడానికి పథకం రచించినవారిని పట్టిచ్చినవారికి భారీ బహుమతి ఇస్తానంటూ అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. బ్యాంకులను నట్టేట ముంచిన ఆర్థిక నేరస్తుల అరాచకాలను లండన్ కోర్టులో నిరూపించడానికి ప్రయత్నిస్తున్నట్టే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న విషయాన్ని చైనాకు వివరించడానికీ, అంతర్జాతీయ వేదికలపైన చర్చనీయాంశం చేయడానికి విశేషమైన కృషి జరగవలసిన అవసరం ఉన్నది. కశ్మీర్లో శాంతి పునరుద్ధరణ అత్యవసరం. దౌత్య యంత్రాంగాన్ని పటిష్టం చేయవలసిన అగత్యం ఉంది. దేశంలో పెరుగుతున్న ఆరాచక వాతావరణం ఆందోళన కలిగిస్తున్నది. రాజ్యాంగస్పూర్తిని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్య ప్రియులందరూ ప్రయత్నించాలి. రాజ్యాంగస్పూర్తికి విఘాతం కలిగించే ధోరణులను అరికట్టడానికి సర్వశక్తులూ వినియోగించాలి. మతం, కులం, ప్రాంతం, భాష పేరుతో సమాజంలో చీలికలు తెచ్చే దుర్మార్గపుటాలోచనలను ప్రతిఘటించాలి. ‘ధర్మసభ’ పేరుతో సోమవారంనాడు అయోధ్యలో సుమారు 50 వేల మంది గుమికూడటం, అక్కడ ఆయుధబలగాలను మోహరించడం, 1992లో బాబ్రీమసీదు విధ్వంసం తర్వాత జరిగినట్టు హింసాకాండ జరుగుతుందనే భయంతో ముస్లిం కుటుంబాలు కొన్ని అయోధ్య ప్రాంతం నుంచి పారిపోయి ఎక్కడో తలదాచుకోవడం ఆందోళన కలిగిస్తున్న పరిణామాలు. మందిర వివాదంలో న్యాయవ్యవస్థపైన వ్యాఖ్యలు చేయడం కూడా సమర్థనీయం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి ఎవరు పూనుకున్నప్పటికీ అది క్షమార్హం కాని నేరమే. ప్రజాస్వామ్య సౌధాన్ని నిలబెట్టే నాలుగు స్తంభాలూ బీటలు వారాయి. ప్రజాస్వామ్య వ్యవస్థను ఉపయోగించుకొని ఉన్నత పదవులు పొందినవారే అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నారు. తాము స్వయంగా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్నీ, దేశాన్నీ రక్షిస్తామంటూ బయలు దేరిన బూటకపు ప్రజాస్వామ్యవాదుల నిజస్వరూపం బయటపెట్టడమూ అవసరమే. ఇతర పార్టీల టిక్కెట్లపైన ఎన్నికలలో గెలిచినవారిని కొనుగోలు చేసి పార్టీ ఫిరాయింపుల చట్టాన్న కుళ్ళపొడిచినవారిని తప్పుపట్టని, శిక్షించని వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకం కావడంలో ఆశ్చర్యం ఏమున్నది? ఎన్నికల సమయంలో మర్యాదలు మట్టికరుస్తున్నాయి. రాజ్యాంగ విలువలను పునరుద్ధరించేందుకు ప్రజలు కంకణబద్ధులు కావాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లితే విచ్ఛిన్నకరశక్తులు వీరంగం వేస్తాయి. అధికారంలో ఉన్నవారే రాజ్యాంగస్పూర్తిని తు.చ. తప్పకుండా పాటించాలి. రాజ్యాంగ సంస్థలనూ, ప్రక్రియలనూ గౌరవించడం ద్వారా శాంతిసుస్థిరతలకు దోహదం చేయాలి. అధికారాలు మాత్రమే కాకుండా బాధ్యతలు గుర్తెరిగి ప్రజలందరూ వ్యవహరిస్తేనే 130 కోట్లకు పైగా జనాభా కలిగిన దేశం ప్రశాంతంగా ఉంటుంది. అనేక మతాలూ, కులాలూ, సంస్కృతులూ, భాషలూ, ప్రాంతాలూ కలిగి భిన్నత్వంలో ఏకత్వం సిద్ధాంతంపైన మనుగడ సాగిస్తున్న దేశాన్ని రాజ్యాంగం మాత్రమే సమైక్యంగా ఉంచగలదు. రాజ్యాంగమే రక్ష. రాజ్యాంగాన్ని పవిత్రగ్రంథంగా భావించి శిరసావహించాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజిత్ గొగోయ్ చెప్పినట్టు రాజ్యాంగం అర్భకులకు రక్షణ కల్పించే కవచం. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్నూ, ఆయన సామాజిక–రాజకీయ దృక్పథాన్నీ అర్థం చేసుకొని ప్రచారం చేస్తామనీ, రాజ్యాంగస్పృహను పెంపొందిస్తామని దేశ ప్రజలు ప్రతిజ్ఞ చేయవలసిన సందర్భం ఇది. -
కేంద్ర ఎన్నికల సంఘం @ 68 ఏళ్లు..!
సాక్షి, ఆలేరు : కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ ఏడాది ఎన్నికల నిర్వహణతో 68 ఏళ్లు పూర్తయ్యాయి. 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పడింది. దీనికి తొలి కమిషనర్గా సుకుమార్సేన్ నియమితులయ్యారు. ఆయన 1950 మార్చి 21 నుంచి 1958 డిసెంబర్ 19 వరకు కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటి వరకు ఇద్దరు తెలుగువారు కమిషనర్లుగా వ్యవహరించారు. వీరిలో ఆర్వీ పేరిశాస్త్రీ 1986 జనవరి 1 నుంచి 1990 నవంబర్ 25 వరకు పనిచేశారు. ఆయన తదనంతరం వీఎస్ రమాదేవి 1990 నవంబర్ 26 నుంచి అదే ఏడాది డిసెంబర్ 12 వరకు అంటే 15 రోజుల పాటు కమిషనర్గా పనిచేశారు. కాగా ఎన్నికల సంఘం ఏర్పడి 50 ఏళ్లు పూర్తయినందుకు గాను 2001లో గోల్డెన్ జూబ్సీ ఉత్సవాలు, ఆ తర్వాత 2010లో డైమండ్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించారు. డైమండ్ జూబ్లీ ఉత్సవాల సందర్భంలో ఎన్నికల సంఘం పోస్టల్ స్టాంప్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఛీప్ ఎలక్షన్ కమిషనర్గా ఓంప్రకాశ్రావత్ పనిచేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఇలా.. దేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పర్యవేక్షణ, మార్గదర్శకత్వం, ఓటర్ల జాబితా తయారీ, భారత పార్లమెంటుకు, రాష్ట్రాల శాసనసభలకు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులకు సంబంధించిన మొత్తం వ్యవహారాలు చూసే బాధ్యతల్ని భారత రాజ్యాంగం ఒక కమిషన్కు అప్పగించింది. దానినే భారత ఎన్నికల కమిషన్గా వ్యవహరిస్తారు. ఎన్నికల కమిషన్లో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటు భారత రాష్ట్రపతితో నిర్దేశించబడిన సంఖ్య ప్రకారం కొందరు ఎన్నికల కమిషనర్లుగా ఉంటారు. ప్రధాన ఎన్ని కల కమిషనర్ ఎన్నికల కమిషన్కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. -
తప్పుడు కేసుకూ శిక్ష ఉండాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ : ఏ చట్టం కిందనైనా, ఎవరినైనా తప్పుడు కేసు బనాయించి విచారిస్తే అందుకు వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలి. పునరావాసం కల్పించాలి. ఇది మానవ హక్కులు, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒప్పందంలోని 14వ అధికరణలోని ఆరో సెక్షన్ తెలియజేస్తోంది. ఈ ఒప్పందాన్ని ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు ఆమోదించగా, భారత దేశమే ఇంకా ఆమోదించలేదు. రాజ్యం అంటే, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎవరి ప్రాణాన్నైనా, స్వేచ్ఛనైనా అనవసరంగా హరించి నట్లయితే అందుకు కచ్చితంగా పరిహారం ఉండాలనే ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ ఒప్పందాన్ని తీసుకొచ్చారు. భారత రాజ్యాంగంలోని 21వ అధికరణం భారతీయుడికి జీవించే హక్కును, స్వేచ్ఛ హక్కును ప్రసాదిస్తున్న కారణంగా ఇంతవరకు ఈ అంతర్జాతీయ చట్టాన్ని ఆమోదించలేదు. కానీ దేశంలో ఎవరి ప్రాణాన్నైనా, స్వేచ్ఛనైనా అనవసరంగా హరించినట్లయితే రాజ్యం తిరిగి ఇచ్చే ప్రసక్తి ఎలా ఉంటుంది? ఉండదుకనుక భారతీయ పౌరులు తప్పుడు కేసులకు బలవుతున్నారు. అందుకని బాధితులకు నష్టపరిహారం ఇచ్చి వారికి పునరావాసం కల్పించే అవకాశం ఉండాలని భారత లా కమిషన్ అభిప్రాయపడింది. ఈ మేరకు ఓ చట్టాన్ని కూడా తీసుకరావాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన 277వ నివేదికలో సిఫార్సు చేసింది. అమాయకులపై తప్పుడు కేసులను బనాయించిన అధికారులను ప్రాసిక్యూట్ చేసే చట్టం కూడా ఉండాలని లా కమిషన్ సూచించింది. ఇస్రో సైంటిస్ట్పై కేరళ పోలీసులు గూఢచర్యం కింద తప్పుడు కేసును బనాయించి సుదీర్ఘకాలం విచారించడం, ఈ కేసును సుప్రీం కోర్టు కొట్టివేడం, బాధిత సైంటిస్ట్ నష్టపరిహారం కోసం కోర్టుకెక్కడం, ఆయనకు 25లక్షల రూపాయలను చెల్లించాల్సిందిగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం తదతిర పరిణామాల నేపథ్యంలో లా కమిషన్ సిఫార్సు ప్రాధాన్యతను సంతరించుకుంది. -
వివక్ష అంతమే కీలకం
లా కమిషన్ తన తన పదవీకాలం పూర్తయిన చివరిరోజున అనేక ప్రధానాంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఇటీవలికాలంలో తరచు చర్చనీయాంశం అవుతున్న ఉమ్మడి పౌర స్మృతి ప్రతిపాదనపై 185 పేజీల సమాలోచన పత్రాన్ని విడుదల చేసింది. పౌర స్మృతి అవసరం ఇప్పుడు లేదని, వర్తమాన పరిస్థితుల్లో దాన్ని తీసుకురావడం వాంఛనీయం కూడా కాదని కమిషన్ అభిప్రాయపడింది. ఇప్పుడున్న వివిధ వైయక్తిక(పర్సనల్) చట్టాల్లో ఉన్న వివక్షను అంత మొందించి వాటన్నిటిలో సమానతకు తావిచ్చేలా మార్పులు చేయొచ్చునని కూడా సూచించింది. మన రాజ్యాంగం పౌరులందరినీ సమానంగా పరిగణించింది. కుల, మత, లింగ ప్రాతిపదికన ఎవరిపైనా వివక్ష ప్రదర్శించకూడదని నిర్దేశించింది. కానీ విషాదమేమంటే... వేర్వేరు మతాలకు చెందిన వైయక్తిక చట్టాల్లో ఏదో మేర ఈ వివక్ష కొనసాగుతోంది. లా కమిషన్ చెప్పినట్టు వీటిని సవరిస్తే నిజానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరమే ఉండదు. ఉమ్మడి పౌర స్మృతిపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ చెప్పిన మాటలైనా, రాజ్యాంగంలోని 44వ అధికరణను చూసినా లా కమిషన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు సరికాదన్న అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది. ఏదో ఒకనాటికి దేశం ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించుకోగలదన్న ఆశాభావాన్ని డాక్టర్ అంబేడ్కర్ అప్పట్లో వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరికీ ఉమ్మడి పౌర స్మృతిని రూపొందించాలని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఒకటైన 44వ అధికరణ నిర్దేశిస్తున్నది. ఇప్పుడు లా కమిషన్ సూచనలు ఈ స్ఫూర్తికి భిన్నమైనవిగా అనిపించినా సామాజికంగా, సాంస్కృతికంగా అనేక వైవిధ్యతలతో నిండిన మన దేశంలో అందరికీ ఉమ్మడిగా వర్తించే వైయక్తిక చట్టాలు ఉండాలనుకోవటం సరికాదు. సమస్య ఆ చట్టాల్లోని వివక్షదే అయినప్పుడు దాన్ని పారదోలగలిగితే తమ తమ వ్యక్తిగత విశ్వాసాలకు అను గుణంగా ఎవరు ఏ వైయక్తిక చట్టం అనుసరించినా సమస్య ఉండదు. నిజానికి రాజ్యాంగసభలో 44వ అధికరణపై చర్చలు తీవ్రంగా జరిగాయి. సభ్యులంతా మత ప్రాతిపదికన విడిపోయారు. ఆ సమయంలో డాక్టర్ అంబేడ్కర్ ఈ అధికరణను మైనారిటీలపై రుద్దే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. వివిధ మతస్తులకు వారి వారి సంప్రదాయాలు, విశ్వాసాల ఆధారంగా వేర్వేరు వైయక్తిక చట్టాలున్నాయి. వివాహం, విడాకులు, పునర్వివాహం, దత్తత, వారసత్వం, గార్డియన్షిప్ వగైరా అనేక అంశాలను ఈ చట్టాలు నిర్దేశిస్తున్నాయి. ఏ మతాచారాలైనా, విశ్వాసాలైనా రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు, లింగ సమానత్వాన్ని నిరాకరిస్తున్నప్పుడు వాటిని రద్దు చేయాల్సిందేనని లోగడ సుప్రీంకోర్టు చెప్పింది. మన చట్టాలు వివిధ మతాలకుండే వైయక్తిక చట్టాలను గుర్తించాయి. కానీ ఆ చట్టాలన్నీ రాజ్యాంగానికి లోబడి ఉన్నప్పుడే చెల్లుబాటవుతాయన్నది సర్వోన్నత న్యాయస్థానం భావన. స్త్రీల పట్ల వివక్ష చూపుతున్న ఏకపక్ష తలాక్ విధానాన్ని, నికా హలాలా, బహుభార్యత్వ ఆచారాలను రాజ్యాంగవిరుద్ధమని ప్రకటించాలని, వాటిని నిషేధించాలని రెండేళ్లక్రితం కొందరు ముస్లిం మహిళలు సుప్రీంకోర్టు తలుపుతట్టారు. అంతక్రితమే ఉమ్మడి పౌరస్మృతిపై అడపా దడపా చర్చలు జరుగుతున్నా ఆ కేసు సందర్భంగా అది మరింతగా చర్చలోకొచ్చింది. ఆ సమయంలోనే కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ‘ఉమ్మడి పౌరస్మృతి’కి సంబంధించిన వివిధ అంశాలను పరి శీలించాల’ని లా కమిషన్ను కోరింది. ఉమ్మడి పౌరస్మృతి అంశంపై కమిషన్ విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. చాలా అంశాలను లోతుగా పరిశీలించింది. మహిళల పట్ల వివక్ష అన్నది కేవలం ముస్లిం వైయక్తిక చట్టాల్లో మాత్రమే ఉందనుకోనడం పొరపాటు. హిందూ, పార్సీ వైయక్తిక చట్టాల్లో సైతం ఇలాంటి ధోరణులున్నాయి. దాంపత్య పునరుద్ధరణ హక్కులు, సహభాగిత్వం, వివాహేతర సంబంధాల్లో జన్మించిన పిల్లల హక్కులు, దత్తత, సంరక్షకత్వం వగైరా అంశాల్లో ఎన్నో లోపాలున్నాయి. పార్సీ చట్టాల్లో కూడా కొన్ని సమస్యలున్నాయి. అన్యమతస్తుల్ని పెళ్లాడే పార్సీ మహిళకు వారసత్వ హక్కు లేదు. పిల్లల సంరక్షణకు సంబంధించి కూడా వివిధ వైయక్తిక చట్టాల్లో వేర్వేరు విధానాలున్నాయి. బహు భార్యత్వం, వైవాహికేతర సంబంధాలు, నికా హలాలా వంటి అంశాలు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నాయి. అలాగే ఓటేయడానికి 18 ఏళ్ల అర్హత చాలన్నప్పుడు పెళ్లికి మాత్రం మగవాడి వయసు కనీసం 21 ఏళ్లుండాలని, ఆడపిల్లకు 18 ఏళ్లు సరిపోతాయని నిర్దేశించటం అహేతుకమవుతుంది. దీనివల్ల భార్యాభర్తల్లో భార్య మగవాడికన్నా తక్కువ వయసు కలిగి ఉండాలనే అభిప్రాయం పౌరుల్లో స్థిరపడిపోయింది. వీటన్నిటిపైనా సమగ్రంగా, లోతుగా అధ్యయనం చేసి వివిధ వైయక్తిక చట్టాల్లో వివక్షకు తావిస్తున్న నిబంధనలను సవరిస్తే, ప్రజాస్వామిక అవగాహనకు అనుగుణమైన నిబంధనలు ఏర్పరిస్తే దానివల్ల మంచి ఫలితాలుంటాయి. అటువంటి ప్రయత్నం మున్ముందు ఉమ్మడి పౌరస్మృతికి బాటలు పరిస్తే మంచిదే. లా కమిషన్ చేసిన మరో మంచి సూచన రాజద్రోహ నేరానికి సంబంధించింది. ఈ నేరానికి సంబంధించిన ఐపీసీ 124ఏ సెక్షన్ దుర్వినియోగమవుతున్నంతగా మన దేశంలో మరేదీ కావటం లేదు. మాట, రాత, గీత, నినాదం... ఇలా ఏం చేసినా ఈ సెక్షన్ కింద కేసులు పెట్టడం ఈమధ్య కాలంలో ముదిరింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేయటం రాజద్రోహమ వుతోంది. అత్యంత కఠినమైన ఈ చట్టాన్ని న్యాయనిపుణులతో, భిన్నవర్గాలవారితో చర్చించి సవ రించాలని కమిషన్ వ్యక్తం చేసిన అభిప్రాయం ఎన్నదగినది. ప్రభుత్వ విధానాలపై నిర్మాణాత్మక విమర్శలకూ, అభిప్రాయాలకూ, ఆలోచనలకూ చోటీయకపోతే అది ప్రజాస్వామ్యం అనిపించుకో దని కూడా నిర్మొహమాటంగా చెప్పింది. వైయక్తిక చట్టాలు, రాజద్రోహం అంశాల్లో లా కమిషన్ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని తగిన మార్పులు తలపెడితే మన ప్రజాస్వామ్యానికి అర్ధం, పరమార్ధం ఉంటాయి. -
వివాహేతర సంబంధాలు: 497పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: వివాహేతర సంబంధాలను (ఆడల్టరీ) నేరంగా పరిగణించే ఇండియన్ పీనల్ కోడ్లోని 497వ సెక్షన్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయిన సమానత్వపు హక్కును ఈ సెక్షన్ ఉల్లంఘిస్తున్నట్టు ప్రాథమికంగా కనిపిస్తోందని రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. వివాహేతర సంబంధాల విషయంలో వివాహితలను మినహాయించి.. పెళ్లయిన పురుషుడిని మాత్రమే శిక్షించే సెక్షన్ 497ను రద్దు చేయాలంటూ జోసెఫ్ షైనీ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఈ ధర్మాసనంలో ఆర్ఎఫ్ నారీమన్, ఏఎం ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్, ఇందూ మల్హోత్రా తదితర న్యాయమూర్తులు ఉన్నారు. వివాహ వ్యవస్థ పవిత్రతను కాపాడేందుకు సెక్షన్ 497ను కొనసాగించాల్సిన అవసరముందన్న కేంద్రం వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఇదే వాదనను పాటించినట్టయితే ఇప్పుడున్న నేరం కన్నా తీవ్రమైన నేరంగా దీనిని పరిగణించాల్సి ఉంటుందని జస్టిస్ చంద్రచూడ్ వాదనల సందర్భంగా పేర్కొన్నారు. వివాహేతర లైంగిక సంబంధాలు ఉంటే.. ఆ పరిణామాలతో సంబంధం లేకుండానే.. పెళ్లి రద్దుకు దారితీసేవిధంగా ఈ చట్టం ఉందని ఆయన అన్నారు. సెక్షన్ 497 ప్రకారం.. పెళ్లయిన స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకున్న పురుషుడికి ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేక ఈ రెండూ గానీ ఉంటాయి. స్త్రీకు ఇవేమీ ఉండవు. ఆమె అసలు నేరస్తురాలే కాబోదు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం మతానికి, జాతికి, కులానికి, ప్రాంతానికి అతీతంగా స్త్రీ, పురుషులంతా చట్టం ముందు సమానమే అయినప్పుడు 497 సెక్షన్ కూడా ఆ ఆర్టికల్కు లోబడే ఉండాలని, కాబట్టి ఈ సెక్షన్ను చెల్లబోదని పిటిషనర్ వాదిస్తున్నారు. -
‘బయటి వారికి ఇదే మా హెచ్చరిక!’
సాక్షి, న్యూఢిల్లీ : ‘బయటి వారికి ఇదే మా హెచ్చరిక! మా గ్రామంలోకి అడుగు పెట్టొద్దు.....ఇక్కడి నేరు, నేల, అడవి మాది....1996 నాటి పంచాయతీ చట్టం ప్రకారం మాకు సంక్రమించిన హక్కులివిగో....’ అన్న ప్రకటనలు ఆ రాష్ట్రంలోని ఏ ఆదివాసి గ్రామానికి వెళ్లినా ఊరి పొలిమేరలోనే పాతిన ఓ రాతి పలక మీద కనిపిస్తాయి. ఇక ఊర్లోకి వెళితే కూడలి వద్ద మరో పెద్ద రాతి పలక కనిపిస్తుంది. దానిపైన ‘భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రకారం గ్రామ సభే అన్నింటికన్నా సుప్రీం. పార్లమెంట్, అసెంబ్లీ, మరే వ్యవస్థ కూడా దీనికి మించినది కాదు’ అని రాసి ఉంటుంది. జార్ఖండ్లోని కుంతీ జిల్లాలో 300లకుపైగా ఆదివాసీ గ్రామాల్లో ఈ హెచ్చరిక రాతి పలకలు కనిపిస్తాయి. రాష్ట్రంలోని ఆదివాసీలు తమ హక్కుల పరిరక్షిణలో భాగంగా ఈ నెలలో ‘పతాల్గడి’ ఉద్యమాన్ని నిర్వహించారు. ఆ ఉద్యమంలో భాగంగానే వారు ఈ రాతి పలకలను పాతారు. స్థానిక ముండూర్ భాషలో ‘పతాల్గడి’ అంటే రాతి పలకను నిలబెట్టడం. ఈ ఆదివాసీల గ్రామాల్లో మరో విశేషం కనిపిస్తుంది. హిందీలోకి అనువదించిన భారత రాజ్యాంగం ప్రతి వీధి కొక్కటైనా కనిపిస్తుంది. అక్కడ కాస్త చదువుకున్న ఏ యువకుడిని అడిగినా ఆదివాసీల హక్కుల గురించి, గ్రామ సభలకున్న హక్కుల గురించి అనర్గళంగా మాట్లాడుతారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చింది. చాలాకాలం తర్వాత రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు భావించారు. 2016 నుంచి రాష్ట్రంలో అశాంతి పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక ఆదివాసీల హక్కులను పరిరక్షిస్తున్న 1876 నాటి సంతాల్ పరగణ టెనెన్సీ యాక్ట్, 1908 చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్లను సవరిస్తూ జార్ఖండ్ అసెంబ్లీ సవరణలు తీసుకొచ్చింది. వాటి ఆమోదం కోసం రాష్ట్ర గవర్నర్కు పంపించింది. ఈ రెండు చట్టాల ప్రకారం ఆదివాసీలు తమ భూములను ఇతర ఆదివాసీలకు మాత్రమే అమ్మాలి. ఆదివాసీలు కాని వారికి అమ్మకూడదు, అమ్మినా చెల్లదు. రాష్ట్ర అభివద్ధి కార్యక్రమాల కోసం, వివిధ ప్రాజక్టుల కోసం వీటిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని, ఇతరులకు కేటాయించవచ్చంటూ బిల్లుల్లో సవరణలు తెచ్చారు. వాటిని రాష్ట్ర గవర్నర్ పునర్ పరిశీలనకు పంపగా ఆయన వాటిని పునర్ పరిశీలించాలని కోరుతూ 2017, ఆగస్టులో తిప్పి పంపారు. ఆ రెండు బిల్లులకు వ్యతిరేకంగా ఆదివాసీలు ఆందోళన చేయడంతో ఆ రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఆ తర్వాత ఆ బిల్లుల స్థానంలో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘భూసేకరణ బిల్లు–17’ను తీసుకొచ్చింది. దీన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించడంతో రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. రాష్ట్ర జనాభాలో ఇప్పటికీ 28 శాతం మంది ఉన్న ఆదివాసీలు ఈ తాజా బిల్లుకు వ్యతిరేకంగా ‘పతాల్గడ్’ ఆందోళన చేపట్టారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన 15 మంది ఆదివాసీ నాయకులను పోలీసులు ఆరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. వారిలో ఎక్కువ మందిపై ‘దేశద్రోహం’ కేసులు నమోదు చేశారు. ఉద్యమం సందర్భంగా ఆదివాసీలు మాజీ లోక్సభ స్వీకర్, బీజేపీ పార్లమెంట్ సభ్యుడు కరియా ముండా ముగ్గురు అంగరక్షకులను కిడ్నాప్ చేసి, ఆ తర్వాత విడిచి పెట్టారు. ఉద్యమ కాలంలోనే ఐదుగురు రంగస్థల కళాకారులపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో తమతోపాటు మావోయిస్టులను ఇరికించారని పోలీసులు కుట్ర పన్నారని ఆదివాసీ నాయకులు ఆరోపించారు. తమ ఆందోళనకు మద్దతు ఇస్తున్నారన్న అభియోగంతో మావోయిస్టులను కూడా కేసులో ఇరికించాలని చూస్తున్నారని, నిజంగా తమకు మావోయిస్టుల సానుభూతి తప్ప మద్దతు ఎక్కడా లేదని జార్ఖండ్ డిసోమ్ పార్టీ అధ్యక్షుడు సల్కాన్ ముర్మూ తెలిపారు. మావోయిస్టులు భారత రాజ్యాంగాన్ని విశ్వసించరని, తాము మాత్రం భారత రాజ్యాంగానికి నిక్కచ్చిగా కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు. ఆదివాసీలకు స్థానిక చర్చిలు మద్దతిస్తున్నాయన్న కారణంగా బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో మత మార్పిడుల వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆదివాసీల ఆందోళనతో తమకు సంబంధం లేదని, పైగా అభివద్ధిని కోరుకోని ఆందోళనలను తాము వ్యతిరేకిస్తామని ‘సెక్రటరీ జనరల్ ఆఫ్ ది క్యాథలిక్ బిషప్–కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా’ బిషప్ తియోదర్ మాస్కరెన్హాస్ చెప్పారు. తాము మాత్రం భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తామని సల్కాన్ ముర్మ హెచ్చరించారు. దేశంలో ప్రతి కోట్ల మందికిపైగా ఆదివాసీలు ఉన్నారని, వారంతా ఒక్కటైతే తమ ఆందోళన విజయవంతం అవుతుందని ఆయన చెప్పారు. లేనిపక్షంలో మణిపూర్ తరహా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీలు ఆదివాసీ ప్రజా ప్రతినిధులపై తిరుగుబాటు చేయడమే మణిపూర్ తరహా ఆందోళన. ఈ ఉద్యమం ఆదివాసీలు ఎక్కువగా ఉన్న చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి విస్తరిస్తే ప్రమాదమని, పైగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని బీజేపీ అధిష్టానంలో ఆందోళనలో పడింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో జార్ఖండ్లో 14 లోక్సభ స్థానాలకు 12 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఆదివాసీ ప్రాంతాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈ వారం అక్కడికి వెళుతున్నారు. -
సర్పంచ్ పాలనే!
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలయ్యే దాకా ఇప్పుడున్న సర్పంచులు, గ్రామ పాలక వర్గాలను యథాతథంగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఇదే ఉత్తమ మార్గమని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ప్రస్తుత సర్పంచులు, వార్డు సభ్యులను కొనసాగిస్తే పార్టీపై వారికి సానుకూల అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే ప్రత్యేకాధికారులు లేదా పర్సన్ ఇన్చార్జీలకు బాధ్యతలను అప్పగించడమే మేలని అధికారులు గట్టిగా వాదిస్తున్నారు. ఈ రెండు ప్రతిపాదనలపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. సహకార సంఘాలకు ఐదారు నెలల క్రితమే పదవీకాలం పూర్తయినా పాత పాలకవర్గాలను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ల విషయంలోనూ ఇదే తరహాలో ముందుకెళ్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని పరిశీలిస్తోంది. వాస్తవానికి ఈ నెలాఖరుతో గ్రామ పంచాయతీ పాలక వర్గాలకు పదవీకాలం పూర్తి కానుంది. ఆ లోగా పంచాయతీలకు ఎన్నికలు జరిగే అవకాశాలు లేనే లేవు. ఆ తర్వాత కూడా ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారన్న అంశంపై ప్రభుత్వానికి స్పష్టత లేదు. దీంతో ఆగస్టు 1 కల్లా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ప్రజలతో ఎన్నికైన ప్రతినిధులకే గ్రామ పాలన పగ్గాలు అప్పగించడమా? ప్రత్యేక అధికారులను నియమించడమా అన్న అంశంపై ప్రభుత్వం త్వరలోనే తేల్చనుంది. ఎన్నికలు ఇప్పటికిప్పుడు లేనట్టే! గ్రామ పంచాయతీ ఎన్నికలను జూలైలోనే పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కూడా చాలావరకు పూర్తి చేసింది. అయితే బీసీ రిజర్వేషన్లు, బీసీల్లో ఏ, బీ, సీ, ఈ కేటగిరీ వంటి వాటిపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. బీసీ జనాభా, రాజ్యాంగం ప్రకారమే రిజర్వేషన్లు పూర్తి చేసినట్టు ప్రభుత్వం వాదించింది. అయితే మళ్లీ బీసీల గణన పూర్తి చేసి, జనాభా ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలంటూ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఎన్నికలకు కళ్లెం పడినట్టైంది. బీసీల గణన పూర్తయ్యేనాటికి కనీసం మూడు నాలుగు నెలలు పట్టే అవకాశాలున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. బీసీ గణన, కులాల వారీగా లెక్కింపు పూర్తయి, రిజర్వేషన్లు కేటాయించే సరికి ఇంకొంత సమయం కావాల్సి ఉంటుందని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లోపు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగకపోవచ్చని అటు అధికార పార్టీ నేతలు, అధికార వర్గాలు భావిస్తున్నాయి. పాలక వర్గాలనే కొనసాగిద్దాం.. ప్రజలు నేరుగా ఎన్నుకున్నందున ప్రస్తుత గ్రామ పంచాయతీ పాలక వర్గాలకే బాధ్యతలు అప్పగించాలని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు కోరుకుంటున్నారు. ఎన్నికల ముందు పాలక వర్గాలకు వ్యతిరేకంగా, వారి మనసు నొప్పించేలా నిర్ణయాలను తీసుకోవడం సరికాదని వీరు అభిప్రాయపడుతున్నారు. అటు గ్రామ పంచాయతీ పాలక వర్గాలు కూడా తమ పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతున్నాయి. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. సహకార సంఘాలకు ఐదారు నెలల క్రితమే పదవీకాలం పూర్తయినా పాత పాలక వర్గాలనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమకూ అలాగే ఎన్నికలయ్యే వరకు పదవీ కాలాన్ని పొడిగించాలని సర్పంచులు కోరుతున్నారు. అయితే అధికారులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. పాలక వర్గాల పదవీకాలం పొడిగించడం వల్ల గ్రామస్థాయిలో రాజకీయాలు, వైషమ్యాలు, పంతాలు వంటి వాటితో అభివృద్ధి కార్యక్రమాలకు విఘాతం కలుగుతుందని వాదిస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ కార్యక్రమాలు సజావుగా నిర్వహించుకోవడానికి అధికారులతోనే గ్రామ పరిపాలన నిర్వహించాలని కోరుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లు, పరస్పర ఫిర్యాదులు లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు అమలు చేసుకోవచ్చునని వారు వాదిస్తున్నారు. రాజ్యాంగం ఏం చెబుతోంది? రాజ్యాంగంలోని 73వ సవరణ ప్రకారం గ్రామ పంచాయతీలకు ఐదేళ్ల పదవీ కాలం ఉంటుంది. ఐదేళ్ల లోపు కొత్త పాలక వర్గాలను ఏర్పాటు చేయడానికి ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితులు ఉంటే ఏం చేయాలన్న దానిపై రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఎలాంటి సూచనలు లేవని రాజ్యాంగ నిపుణులు వెల్లడించారు. గ్రామ పంచాయతీల పాలక వర్గాలను పొడిగించాలనుకున్నా, ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించాలనుకున్నా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని న్యాయ నిపుణులు వెల్లడించారు. ఈ విషయలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా రాజ్యాంగపరంగా అవరోధాలేమీ ఉండవంటున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. -
స్త్రివర్ణ పతాకం
జననీ జన్మభూమి అంటారు. మరి ఆ జన్మభూమిలో ఉన్న మహిళల్ని ఇవాళైనా స్మరించుకోవద్దా? స్వాతంత్య్రం.. రాజ్యాంగం... ఈ రెండడుగుల్లో అడుగడుగునా మహిళ భాగస్వామ్యం ఉంది. కృషి, దీక్ష, పట్టుదల ఉన్నాయి. ఎప్పుడూ ‘కంకణం కట్టుకున్న’ శబ్దమేనా? ఈసారి.. దేశ మహోన్నత ఉద్యమంలో గాజుల సవ్వడికి సలాం చేద్దాం రండి. మన దేశ స్వతంత్ర పోరాటంలో, భారత రాజ్యాంగ రూపకల్పనలో అవిశ్రాంతంగా కృషిచేసిన స్త్రీలెందరో చరిత్ర మరుగున పడిపోయారు. నేడు మనం 69వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగానైనా మన దేశ నిర్మాణంలో, రాజ్యాంగావిష్కరణలో ఎన్నో కీలక చర్చలు చేసి, దేశ భవిష్యత్తుకి పునాదులు వేసిన స్త్రీలను అందరూ కాకపోయినా, కొందరినైనా స్మరించుకోవడం మన ధర్మం. రాజ్కుమారి అమృత్ కౌర్ (1889–1964) రాజ్కుమారి అమృత్ కౌర్ ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో జన్మించారు. భారత దేశ తొలి ఆరోగ్యమంత్రి. స్వాతం త్య్రోద్యమంలో కదంతొక్కిన మహిళ. సామాజిక కార్యకర్త. బాల్యవివాహాలపైనా, స్త్రీల పరదా వ్యవస్థపైనా తిరుగుబాటు బావుటాని ఎగురవేసారు. దండి సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలోపాల్గొన్న రాజ్కుమారి కొంత కాలం కారాగారవాసం గడిపారు. 1927లో ఆల్ ఇండియా వుమన్స్ కాన్ఫరెన్స్ సహవ్యవస్థాపకురాలిగా ఉన్నారు. భారత రాజ్యాంగ సభ సభ్యురా లిగా ఎంతో కృషి చేసారు. అమ్ముకుట్టి స్వామినాథన్ (1894–1978) కేరళలోని పాల్ఘాట్ ప్రాంతానికి చెందిన అమ్ము స్వామినాథన్ భారత స్వాతంత్య్రోద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన వనిత. పెద్దగా చదువుకోలేదు. చిన్నతనంలో తండ్రిని కోల్పోయిన అమ్ముకుట్టి కుటుంబాన్ని ఆమెతల్లి అనేక కష్టాలకోర్చి పెంచి పెద్దచేసారు. 13 ఏళ్ళకే డాక్టర్ సుబ్బరామ స్వామినాథన్కిచ్చి అమ్ముకి పెళ్ళి చేసారు. అంచెలంచెలుగా సామాజిక కార్యకర్తగా, రాజకీయ ఉద్యమ కారిణిగా ఎదిగి రాజ్యాంగ సభ సభ్యులిరాలిగా ఎంపికయ్యారు. హన్స జివరాజ్ మెహత (1897–1995) హన్స జివరాజ్ మెహతాది గుజరాత్. గొప్ప సంస్కరణ వాది, సామాజిక కార్యకర్త, విద్యావేత్త. స్వాతంత్య్రోద్యమ కారిణి. పిల్లల సాహిత్యంపై ఎనలేని కృషి చేసారు. ఎన్నో ఆంగ్ల కథల ను గుజరాతీలోనికి అనువదించారు. యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు. భారత దేశంపై ఎగురవేసిన తొలి త్రివర్ణ పతాకాన్ని, ఆగస్టు 15, 1947 భారత స్వాతంత్య్ర తొలి ఘడియల్లో దేశ మహిళల పక్షాన తొలి ప్రధాని కి బహూకరించారు. దాక్షాయిని వేలాయుధన్ (1912–1978) 1946లో రాజ్యాంగ సభకు ఎన్నికైన ఏకైక తొలి దళిత మహిళ. ఈమె కేరళకి చెందినవారు. పులయ కులానికి అనే దళిత సామాజికవర్గానికి చెందిన దాక్షాయిని ఆమె కమ్యూనిటీలో జాకెట్ ధరించిన తొలి మహిళ. (ఆరోజుల్లో దళిత మహిళలకు పై వస్త్రాలు ధరించే హక్కు లేదు) కేరళలో కులోన్మాదానికి వ్యతిరేకంగా జరిగిన శ్రీనారాయణ గురు, అయ్యంకాళి ఉద్యమ ప్రభావం దాక్షాయినినిపై ఉంది. అస్పృశ్యతపైనా, దళితుల విద్యాలయాల ప్రవేశం కోసం ఆమె ఉద్యమించారు. కేరళ రాష్ట్రంలోనే తొలి డిగ్రీ సాధించిన దళిత మహిళ. రాజ్యాంగ సభలో దళితుల విద్యపై ఆమె ప్రసంగాలు ఒక సంచలనం. బేగం ఐజాజ్ రసూల్ (1908–2001) రాజ్యాంగ సభలో ఉన్న ఏకైక ముస్లిం సభ్యురాలు. ఉత్తర ప్రదేశ్లోని లక్నో ప్రాంతం. 1937 నుంచి 1940 వరకు కౌన్సిల్ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 1950–52 వరకు కౌన్సిల్ లో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. భారత దేశంలో ఈ పదవిని అలంకరించిన తొలి మహిళ, ప్రపంచంలోనే ఈ స్థాయికి ఎదిగిన తొలి ముస్లిం మహిళ. ఆమె ఒక జమీందారీ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ జమీందారీ వ్యవస్థ నిర్మూలనకు నడుంకట్టారు. దుర్గాబాయి దేశ్ముఖ్ (1909–1981) మన తెలుగు బిడ్డ. కాకినాడలో పుట్టారు. స్త్రీ విద్యకోసం తన జీవితమంతా అవిశ్రాంతంగా కృషి చేసారు. భారత స్వతంత్రోద్యమంలో చురుకుగా పనిచేయడమే కాకుండా దుర్గాబాయ్ దేశ్ముఖ్ సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. మహిళల అభ్యున్నతికి విద్యే ఆయుధం అని ఆమె విశ్వసించారు. అంబేడ్కర్ ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్లుని అందరూ వ్యతిరేకిస్తే దుర్గాబాయ్ దేశ్ముఖ్ దానికి మద్దతుగా దేశవ్యాప్తంగా సభలు ఏర్పాటు చేసి, హిందూ కోడ్ బిల్లు ప్రాధాన్యతను చాటిచెప్పారు. కమల చౌదరి (1908) ఈమె రాజ్యాంగ సభలోని 15 మంది మహిళా సభ్యుల్లో ఒకరు. ఈమె భారతదేశంలోని షార్ట్స్టోరీ రైటర్. హిందీ లో కథలు రాసేవారు. మూడవ లోక్సభలో హాపూర్ నుంచి పార్లమెంటు సభ్యురా లుగా పనిచేశారు. లీలా రాయ్ (1900–1970) లీలా రాయ్ది బెంగాల్లోని సిల్హెట్. ఇప్పుడది బాంగ్లాదేశ్లో ఉంది. స్వాతంత్య్ర సమర యోధురాలు. సామాజిక కార్యకర్త. భారత దేశంలో స్త్రీ విద్యకోసం పోరాడారు. లీలా రాయ్ ఫెమినిస్ట్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి సన్నిహితురాలు. భారత దేశ విభజనను వ్యతిరేకిస్తూ లీలా రాయ్ తన పదవికి రాజీనామా చేసారు. మాలతీ చౌదరి (1904–1998) మహాత్మాగాంధీ ‘తూఫాన్’గా పిలిచే మాలతీదేవి స్వాతంత్య్రసమరయోధురాలు. రాజ్యాంగ సభ సభ్యురాలు. సమాజంలో అణచివేతకు గురౌతోన్న షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం మాలతీ చౌదరి చేసిన కృషి మరువలేనిది. పూర్ణిమా బెనర్జీ (1911–1951) పూర్ణిమా బెనర్జీ బ్రిటిష్ వారి పెత్తనాన్ని పరాయి పాలననూ ధిక్కరించిన మహిళ. ఉత్తర ప్రదేశ్కి చెందిన వారు. సరోజినీ నాయుడు, సుచేతా కృపలానీ, విజయలక్ష్మి పండిట్లతో కలిసి పూర్ణిమా బెనర్జీ స్వాతంత్రోద్యమం లో పాల్గొన్నారు. ఆమె జైలులోనే జైలులోనే బిఎ డిగ్రీ పూర్తి చేశారు. ఉప్పు సత్యాగ్రహంలోనూ, క్విట్ ఇండియా ఉద్యమంలోనూ క్రియాశీలకంగా పనిచేశారు. ఆ తరువాత ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రేణుకా రాయ్ (1904–1997) రేణుకా రాయ్ గాంధీజీ స్ఫూర్తితో ఉద్యమంలోకి వచ్చారు. బ్రిటిష్ విద్యావిధానాన్ని బహిష్కరిం చాలన్న పిలుపునందుకొని కాలేజీ చదువుని వదిలివచ్చి ఉద్యమంలో చేరారు. ఆల్ ఇండియా వుమన్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షురాలిగా పనిచేశారు. మహిళè ల హక్కులకోసం, తల్లిదండ్రుల ఆస్తిలో వాటాకోసం, స్త్రీల ఆస్తి హక్కుకోసం ఉద్యమించారు. రాజ్యాంగ సభకి ఎంపికవక ముందు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి మహిళా ప్రతినిధిగా ఉన్నారు. భారత ప్రభుత్వం 1988లో రేణుకా రాయ్కి పద్మభూషణ్ అవార్డునిచ్చి సత్కరించింది. సరోజినీ నాయుడు (1879–1949) నైటింగేల్ ఆఫ్ ఇండియా. భారత స్వతంత్ర సంగ్రామంలో ముందు వరుసలో నిలిచిన ధీర వనిత. భారత దేశాన్ని అస్పృశ్యతా సంకెళ్ళనుంచి విముక్తి చేయాలని కంకణం కట్టుకొన్న సమానత్వ కాంక్షాపరురాలు. అస్పృశ్యతా నిర్మూలనకోసం ఉద్దేశించిన ఆర్టికల్ 17పై జరిగిన చర్చలో పాల్గొని దానిపై విస్త్రుతంగా చర్చించారు. వీరి స్వస్థలం బెంగాల్. హైదరాబాద్లోనే ఆమె జన్మించారు. జాతీయోద్యమంలో చేరి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎదిగి, ఉత్తరప్రదేశ్ (యునైటెడ్ ప్రావిన్సెస్) గవర్నర్గా ఎంపికయ్యారు. మహాత్మాగాంధీ బుల్బుల్గా పిలుచుకునే సరోజినీ నాయుడు స్వగృహం హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో భాగంగా ఉన్న గోల్డెన్ త్రెష్హోల్డ్. సుచేతా కృపలానీ (1908–1974) భారతదేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రి. కాంగ్రెస్ మహిళా విభాగం వ్యవస్థాపకురాలు. రాజ్యాంగం డ్రాఫ్ట్ సబ్కమిటీలో భాగస్వామిగా ఉన్నారు. విజయలక్ష్మీ పండిట్ (1900– 1990) భారత దేశ తొట్ట తొలి కేంద్ర మంత్రి. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి తొలి ఆసియా అధ్యక్షురాలు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ, ఇతర స్వంతంత్య్ర సంగ్రామంలోనూ అనేక పర్యాయాలు జైలుకెళ్ళారు. భారత దేశం రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనాలన్న బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్కి రాజీనామా చేసారు. జవహర్ లాల్ నెహ్రూ సోదరి. – అత్తలూరి అరుణ, సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బీజేపీకి దళిత యువ నేత సవాల్
పుణే : రాజ్యాంగాన్ని గౌరవించని నేతలకు చట్టసభల్లో కొనసాగే అర్హత లేదని దళిత నేత, యువ ఎమ్మెల్యే జిగ్నేష్ మెవానీ పేర్కొన్నాడు. అనంత కుమార్ హెగ్డే వ్యాఖ్యలను ఊటంకించిన జిగ్నేష్.. బీజేపీ పార్టీకి పెను సవాల్ విసిరాడు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య పద్ధతిని మారుస్తామని కొందరు ప్రకటనలు చేస్తున్నారు. దమ్ముంటే ఆ చేయండి. మా శక్తిని ఉపయోగించి దానిని ఎలా అడ్డుకోవాలో మాకు బాగా తెలుసు. ప్రజల అభిష్టం, వారి రక్షణ కోసం చట్టాల రూపకల్పన జరగాలి, అంతేకానీ, పార్టీలు, నేతలు తమ ఇష్టానుసారం మారుస్తామంటే కుదరదు అని జిగ్నేష్ తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లు గెలుచుకోనీయకుండా అడ్డుకోగలిగామని.. అన్నివర్గాలు ఏకమయితే 2019 ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించొచ్చని జిగ్నేష్ సభీకులను ఉద్దేశించి పిలుపునిచ్చాడు. కాగా, భీమ-కొరేగావ్ యుద్ధం స్మారకార్థం నిర్వహించిన ఆదివారం సాయంత్రం పుణేలో నిర్వహించిన ‘ఎల్గార్ పరిషత్’లో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఈ సభలో రోహిత్ వేముల తల్లి రాధిక, భీమ్ ఆర్మీ ప్రెసిడెంట్ వినయ్ రతన్ సింగ్, బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్(మాజీ ఎంపీ), జేఎన్యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ తదితరులు హజరుకాగా, పలు విద్యాలయాల నుంచి విద్యార్థులు, ప్రముఖ దళిత నేతలు హాజరయ్యారు. -
‘లౌకికవాదులకు వాళ్ల రక్తం ఏంటో తెలియదు’
కొప్పల్(కర్ణాటక) : భారత రాజ్యాంగం నుంచి ‘లౌకికతత్వం’ పదాన్ని తొలగించాలని కేంద్రం ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి అనంత్కుమార్ హెగ్డే వెల్లడించారు. కొప్పల్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. సెక్యులరిస్టులపై విరుచుకుపడ్డారు. లౌకికవాదులకు వాళ్ల రక్తం ఏంటో తెలియదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మేము సెక్యులరిస్టులం అని చెప్పుకోవడానికి రాజ్యాంగం ప్రజలకు అనుమతి ఇచ్చింది. రాజ్యాంగాన్ని పలుమార్లు సవరించారన్న విషయం గుర్తుంచుకోవాలి. మేం కూడా రాజ్యాంగాన్ని సవరించి లౌకికతత్వం అనే పదాన్ని తొలగిస్తాం. మేం అధికారంలోకి వచ్చింది అందుకే. మీరు ముస్లింలు, క్రైస్తవులు లేదా వేరే మతాలకు చెందిన వారు అయితే ఆ మతంతో, కులంతో సంబంధం కలిగివున్నందుకు గొప్పగా భావించండి. అంతేకానీ, అసలు ఎవరీ లౌకికవాదులు?. లౌకికవాదులకు తల్లిదండ్రులు లేరు’ అని వ్యాఖ్యానించారు అనంత్. అనంత కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది ఇస్లాం మతాన్ని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడినందుకు ఆయనపై కేసు నమోదైంది. ఈ ఏడాది నవంబర్లో జరిగిన టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆయన నిరాకరించారు. -
రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్తాం
- రిజర్వేషన్ల ప్రతిపాదనపై కేంద్ర సామాజిక న్యాయమంత్రి గెహ్లాట్ సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వేషన్ల వర్తింపు, పెంపునకు సంబంధించి రాజ్యాంగపరమైన ప్రక్రియకు లోబడి ముందుకెళ్తామని కేంద్ర సామాజిక న్యాయమంత్రి థావర్చంద్ గెహ్లాట్ పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ సామాజిక సంక్షేమ చర్యలపై కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలేతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో రిజర్వేషన్ల పెంపు అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితాలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తోందని, దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందని ప్రశ్నించగా.. ‘రిజర్వేషన్ల వర్తింపు, పెంపు ప్రక్రియ రాజ్యాంగ బద్ధంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాదనలు పంపిన తర్వాత వాటిని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు పంపుతాం. వారి వద్ద ఉన్న కులాల గణాంకాల లెక్కల ఆధారంగా వారి అభిప్రాయాన్ని మాకు పంపుతారు. ఆ జాబితాను ఎస్సీ, ఎస్టీ కమిషన్కు పంపుతాం. వారు సమ్మతిస్తే బిల్లు రూపకల్పన చేస్తాం. రూపకల్పన చేసిన బిల్లు ముందుగా మంత్రి మండలి ఆమోదం పొందిన తర్వాత దానిపై పార్లమెంటు తుది నిర్ణయం తీసుకుంటుంది.’అని పేర్కొన్నారు. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చే తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని మంత్రి స్పష్టం చేశారు. రాందాస్ అథవాలే మాట్లాడుతూ మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికలోనే సుమారు 80% ముస్లిం కులాలున్నాయని, ఆ కులాలు ఇప్పటికే బీసీ రిజర్వేషన్లు పొందుతున్నాయని తెలిపారు. -
స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం
1. ఏకీకృత విధానం: దేశ పాలనాధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండటం. ఇది ఏకకేంద్ర ప్రభుత్వ వ్యవస్థ ముఖ్య లక్షణం. ఉదా: బ్రిటన్. 2. సమాఖ్య విధానం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు స్పష్టంగా విభజితమై ఉండటం. ఉదా: అమెరికా, ఇండియా మొదలైనవి. 3. ఉభయ పద్దు (ఉమ్మడి జాబితా): ఇది కేంద్రానికి, రాష్ట్రాలకు ఉమ్మడిగా గల అధికారాలను తెలిపే అంశాల జాబితా. సమాఖ్య వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రాల మధ్య చట్టాలు చేసే అధికారాలు విభజితమై ఉంటాయి. ఉదా: భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో 47 అంశాలను తెలిపారు. 4పౌరసత్వం: దేశంలో నివసించే పౌరులకు దేశ అత్యున్నత రాజ్యాంగం ద్వారా చట్టబద్ధంగా ఇచ్చే గుర్తింపు. ఇండియాలో ఏక పౌరసత్వం, అమెరికాలో ద్వంద్వ పౌరసత్వం అమల్లో ఉంది. 5.అధ్యక్ష తరహా వ్యవస్థ: దేశ పరిపాలనాధికారాలన్నీ అధ్యక్షుడి చేతిలోనే ఉండే ప్రభుత్వ వ్యవస్థ. అధ్యక్షుణ్ని ప్రభుత్వాధినేత, దేశాధినేత అని కూడా పిలుస్తారు. అధ్యక్షుడు ప్రభుత్వ వాస్తవ కార్యనిర్వహణాధికారిగా ఉంటాడు. ఉదా: అమెరికా 6. పార్లమెంటరీ తరహా వ్యవస్థ: పార్లమెంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా మెజారిటీ సీట్లు పొందిన పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలను మంత్రిమండలి నిర్వర్తిస్తుంది. ఈ విధంగా శాసననిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖల అధికారాల సమన్వయంతో కూడిన వ్యవస్థను పార్లమెంటరీ తరహా ప్రభుత్వ వ్యవస్థ అంటారు. మంత్రిమండలి నాయకుడిని ప్రధానమంత్రి అంటారు. ఆయనే ప్రభుత్వాధినేతగా ఉంటారు. ఆయన సలహాలు, సూచనల మేరకే దేశాధినేత అయిన అధ్యక్షుడు (రాష్ట్రపతి) నడచుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థలో వాస్తవ కార్యనిర్వాహణాధికారి ప్రధానమంత్రి. ఉదా: బ్రిటన్, ఇండియా 7.సవరణ: రాజ్యాంగబద్ధంగా దేశ మౌలిక రాజ్యాంగంలో చేసే అవసరమైన మార్పు. దేశాభివృద్ధికి అవసరమైన రాజ్యాంగ సవరణలను చట్టసభలు ఆమోదిస్తాయి. సవరణ అంటే రాజ్యాంగంలో అప్పటికే ఉన్న అధికరణలను తొలగించవచ్చు లేదా మార్చవచ్చు, కొత్తవాటిని చేర్చవచ్చు. 4 మార్కుల ప్రశ్న 1.రాజ్యాంగంలో మౌలిక సూత్రాలుంటాయి. అయితే ప్రజలు వ్యవస్థతో తలపడినప్పుడే సామాజిక మార్పు వస్తుంది. ఈ వ్యాఖ్యతో మీరు ఏకీభవిస్తారా? మీ కారణాలను పేర్కొనండి? (సమకాలీన అంశాలపై ప్రతిస్పందన – ప్రశ్నించడం) lజవాబు: పై వ్యాఖ్యతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఏ దేశ రాజ్యాంగంలోఅయినా కొన్ని మౌలిక సూత్రాలుంటాయి. అవి.. రాజ్యాంగ స్వరూపాన్ని, ఉద్దేశాలను ప్రతిబింబిస్తాయి. రాజ్యాంగ ప్రవేశికలో పొందుపర్చిన మౌలిక సూత్రాల లక్ష్యాలకు అనుగుణంగా వ్యవస్థలో మార్పులు రావాలి. దీంతోపాటు ప్రజల ఆకాంక్షలు నెరవేరాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజలు రాజ్యాంగ పద్ధతిలో వ్యవస్థతో తలపడినప్పుడే ఈ సామాజిక మార్పు సాధ్యమవుతుంది. నేను ఈ వాస్తవాలతో ఏకీభవించడానికి కారణాలు.. దేశ సార్వభౌమాధికారం ప్రజల చేతిలో ఉంటుంది. ప్రజలే పాలకులు, ప్రజల కోసం ప్రజలే చట్టాలు చేసుకుంటారు. ప్రజలతో కూడిందే వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థలో అభివృద్ధి పూర్వక మార్పులకు ప్రజలు సిద్ధపడాలి. లౌకిక, సామ్యవాద సూత్రాలు జాతీయ సమైక్యతను, ప్రజల సంక్షేమాన్ని పెంపొందిస్తాయి. పాలనా వ్యవస్థ వీటిని అమలు చేయాలి. ప్రజలు జాగరూకులై అభివృద్ధి ఫలాలను అందుకోవాలి. పాలనా వ్యవస్థ ప్రజల కోరికలు, ఆకాంక్షలను పట్టించుకోనప్పుడు ప్రజలే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ∙రాజ్యాంగ సూత్రాల ప్రకారం పౌరులందరికీ సామాజిక, ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించాలి. అలాగే పౌరుల్లో సమానత్వం, సౌభ్రాతృత్వాలను పెంపొందించాలి. వీటి ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రజల జీవితాల్లో ఫలప్రదమైన మార్పులు సంభవిస్తాయి. తద్వారా సామాజిక మార్పును ఆశించవచ్చు. ∙రాజ్యాంగ మౌలిక సూత్రాలను పాలనా వ్యవస్థ విస్మరించినప్పుడు ప్రజలు సమూహంగా ఏర్పడి సామాజిక వ్యవస్థలో మార్పు కోసం ప్రజాప్రతినిధులతో కూడిన పాలనా వ్యవస్థతో తలపడాల్సి వస్తుంది. రాజ్యాంగం కూడా దీన్నే కోరుకుంటుంది. పాలనా వ్యవస్థకు సామాజిక వ్యవస్థే ఆధారం. 2 మార్కుల ప్రశ్నలు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామాలకు ఎలాంటి స్వయంప్రతిపత్తి కల్పించారో తెలపండి. (సమాచార సేకరణ నైపుణ్యం) జవాబు: భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న 40వ ప్రకరణ.. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు, గ్రామాలకు స్వయం పాలనాధికారాల గురించి ప్రస్తావించింది. దానికి అనుగుణంగా పార్లమెంట్ 1992లో 73వ రాజ్యాంగ సవరణ చేసింది. ఇది 1993, ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ.. గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తిని కల్పించింది. దీంతోపాటు గ్రామ స్వయంపాలనకు అవసరమైన అధికారాలు, విధులు, బాధ్యతలను పంచాయతీ వ్యవస్థలకు కల్పించింది. వాటిలో ముఖ్యమైనవి.. గ్రామసభ ఏర్పాటు, ప్రత్యక్ష ఎన్నికలు, సీట్ల రిజర్వేషన్, మూడంచెల వ్యవస్థ, రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు, నిర్దేశిత పదవీకాలం తదితరాలు. 2.భారత్, అమెరికా సమాఖ్య వ్యవస్థల మధ్య ముఖ్య భేదాలను పేర్కొనండి. (విషయావగాహన) జవాబు: అమెరికా, ఇండియాల్లో సమాఖ్య వ్యవస్థ అమల్లో ఉంది. ఈ దేశాల్లో అనుసరిస్తున్న సమాఖ్య విధానాల్లో స్పష్టమైన తేడాలున్నాయి. అవి.. భారత సమాఖ్య వ్యవస్థ: 1. ఏక పౌరసత్వం, ద్వంద్వ ప్రభుత్వాలు, ఏక న్యాయ వ్యవస్థ, 2. సివిల్, క్రిమినల్ చట్టాల్లో సారూప్యత, ఏక విధానం, 3. అఖిల భారత సర్వీసులు. అమెరికా సమాఖ్య వ్యవస్థ: 1. ద్వంద్వ పౌరసత్వం, ద్వంద్వ ప్రభుత్వాలు, ప్రత్యేక న్యాయ వ్యవస్థలు. 2. చట్టాల్లో సారూప్యత, ఏక విధానం లేదు 3. ప్రత్యేకంగా వేర్వేరు సర్వీసులు. -
రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య ఎంత?
ఇండియన్ పాలిటీ రాజ్యాంగం అంటే - ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాన్ని తెలిపే మౌలిక శాసనం. దేశ పాలనా విధానానికి మూలాధారం. రాజ్యాంగ లక్ష్యం - రాజ్యాధికార నియంత్రణ, వ్యక్తి స్వేచ్ఛ, హక్కుల పరిరక్షణ. చట్టాలు భారత రాజ్యాంగ అభివృద్ధికి తోడ్పడిన మొదటి చట్టం- 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. మొదటి గవర్నర్ జనరల్గా వారన్ హేస్టింగ్సను నియమించారు. ఇతనికి సాయపడేందుకు నలుగురు సభ్యులతో కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. ప్రధాన న్యాయమూర్తి, మరో ముగ్గురు న్యాయమూర్తులతో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. 1813 చార్టర్ చట్టం ద్వారా విద్యాభివృద్ధికి బడ్జెట్లో రూ.లక్ష కేటాయించారు. క్రిస్టియన్ మిషనరీలను భారత్లోకి అనుమతించారు. 1833 చార్టర్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. మొదటి గవర్నర్ జనరల్గా విలియం బెంటిక్ నియమితుడయ్యాడు. మెకాలే అధ్యక్షతన మొదటి ‘లా’ కమిషన్ను నియమించారు. 1853 చార్టర్ చట్టం ద్వారా పార్లమెంటరీ ప్రభుత్వానికి పునాదులు వేశారు. ఉద్యోగుల భర్తీకి పోటీ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టారు. 1858 విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా కంపెనీ పరిపాలన రద్దు చేసి, మహారాణి ప్రత్యక్ష పరిపాలన ప్రారంభించారు. గవర్నర్ జనరల్ను వైస్రాయ్గా మార్చి మొదటి వైస్రాయ్గా లార్ట కానింగ్ను నియమించారు. బ్రిటన్లో భారత వ్యవహారాల కార్యదర్శి పదవి ఏర్పాటు చేసి మొదటి కార్యదర్శిగా చార్లెస్ ఉడ్ను నియమించారు. 1861 కౌన్సిల్ చట్టం ద్వారా పోర్టఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆర్టినెన్సలను జారీచేసే అధికారాన్ని వైస్రాయ్కి కల్పించారు. బడ్జెట్ ప్రవేశపెట్టే విధానాన్ని ప్రారంభించారు. 1892 కౌన్సిల్ చట్టం ద్వారా కేంద్ర శాసన సభలో భారతీయుల ప్రాతినిధ్యాన్ని 6కి పెంచారు. బడ్జెట్ మినహా మిగిలిన అన్ని అంశాలపై ప్రశ్నించే అధికారం కల్పించారు. 1885లో ఎ.ఒ.హ్యూమ్ జాతీయ కాంగ్రెస్ను స్థాపించాడు. ఈ పార్టీ మొదటి సమావేశం 1885, డిసెంబర్లో బాంబేలో డబ్ల్యు.సి.బెనర్జీ అధ్యక్షతన జరిగింది. సూరత్ సమావేశం (1907)లో ఇందులోని వారు అతివాదులు, మితవాదులుగా చీలిపోయారు. ఈ సమావేశఅధ్యక్షుడు రాస్బిహారి ఘోష్. 1916 లక్నో సమావేశంలో వీరంతా తిరిగి కలిసిపోయారు. 1909 మింటో-మార్లే సంస్కరణల చట్టం రూపకల్పనలో భారత కార్యదర్శి మార్లే, గవర్నర్ జనరల్ మింటో ప్రముఖ పాత్ర పోషించారు. ఈ చట్టం ద్వారా పరిమిత ప్రాతిపదికన ఓటింగ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. శాసనసభ సభ్యుల సంఖ్యను 16 నుంచి 60కి పెంచారు. గవర్నర్ కార్యనిర్వాహక మండలిలోకి ఒక భారతీయుడిని సభ్యుడిగా (ఎస్.పి.సిన్హా) తీసుకున్నారు. ముస్లిం లకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. 1919 మాంటేగు-ఛెమ్స్ఫర్డ సంస్కరణల చట్టం రూపకల్పనలో భారత కార్యదర్శి మాంటేగు, గవర్నర్ జనరల్ ఛెమ్స్ఫర్డ ప్రముఖపాత్ర పోషించారు. ఈ చట్టం ద్వారా పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రాల్లో ద్వంద్వపాలన, కేంద్రంలో ద్విసభా విధానం, కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ర్ట బడ్జెట్ను వేరు చేయడం, సిక్కులకు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు, సర్వీస్ కమిషన్, ఆడిటింగ్ వ్యవస్థ ఏర్పాటు మొదలైనవి ప్రవేశపెట్టారు. సైమన్ కమిషన్ నివేదిక, రౌండ్ టేబుల్ సమావేశాలు, ఎం.ఎన్.రాయ్ డిమాండ్ ఆధారంగా 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొందించారు. ఇందులో 321 అధికరణలు, 10 షెడ్యూళ్లు, 14 భాగాలు ఉండేవి. ఈ చట్టం ద్వారా పూర్తి బాధ్యతాయుత ప్రభుత్వం, కేంద్రంలో ద్వంద్వపాలన, సమాఖ్య ప్రభుత్వం, కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన, కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ఫెడరల్ కోర్టు, ఫెడరల్ సర్వీసుల ఏర్పాటు, రాష్ట్రాల్లో ద్విసభా విధానం, ఎస్సీ, ఆంగ్లో ఇండియన్లకు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు, రిజర్వ బ్యాంక్ స్థాపన, ఇండియా నుంచి బర్మాను వేరు చేయడం, అడ్వకేట్ జనరల్ పదవి ఏర్పాటు మొదలైనవి ప్రవేశపెట్టారు. ‘మన దేశంలో నూతన బానిసత్వానికి ఈ చట్టం నాంది’ అని గాంధీ పేర్కొన్నారు. ‘పటిష్టమైన బ్రేకులు మాత్రమే ఉన్న, ఇంజన్లేని వాహనం’గా నెహ్రూ ఈ చట్టాన్ని విమర్శించారు. రాజ్యాంగ పరిషత్ 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. ఇందులో పాల్గొన్న బ్రిటన్ బలహీనపడింది. బ్రిటన్లో ఎన్నికలు జరిగి లేబర్ పార్టీ విజయం సాధించింది. లేబర్ పార్టీ నాయకుడు, బ్రిటన్ ప్రధాని లార్డ క్లెమెంట్ అట్లీ, భారత్కు పూర్తి స్వాతంత్య్రం ఇవ్వబోతున్నామని, స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ రూపక ల్పనలో సహకరిస్తామని ప్రకటించారు. ఇందు కోసం ముగ్గురు సభ్యులతో 1946, మార్చిలో క్యాబినెట్ మిషన్ ప్లాన్ను నియమించారు. దీని సలహా మేరకు 1946, నవంబర్లో రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య 389. వీరిలో 292 మంది బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి, 93 మంది స్వదేశీ సంస్థానాల నుంచి, నలుగురు బ్రిటిష్ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నియమితులయ్యారు. ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్ సభ్యులు వెళ్ళిపోగా మిగిలిన సభ్యుల సంఖ్య 299. వీరిలో ఎన్నికైన వారు 229 మంది, నియమితులైనవారు 70 మంది. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం 1946, డిసెంబర్ 9న సచ్చిదానంద సిన్హా అధ్యక్షతన జరిగింది. 1946, డిసెంబర్ 11న రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షులుగా హెచ్.సి.ముఖర్జీ, వి.టి.కృష్ణమాచారి, సలహాదారుగా బి.ఎన్.రావు ఎన్నికయ్యారు. 1946, డిసెంబర్ 13న లక్ష్యాలు, ఆశయాల తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టారు. రచనా సంఘం రాజ్యాంగ ముసాయిదాను తయారు చేయడానికి రచనా సంఘాన్ని 1947, ఆగస్టు 29న నియమించారు. అధ్యక్షుడితో కలిపి సభ్యుల సంఖ్య 7. అధ్యక్షుడు అంబేద్కర్, సభ్యులు గోపాలస్వామి అయ్యంగార్, కృష్ణస్వామి అయ్యర్, మహమ్మద్ సాదుల్లా, కె.ఎం. మున్షీ, మాధవరావు, వి.టి. కృష్ణమాచారి. రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్లో బి.ఎన్.రావు ప్రవేశపెట్టారు. ఇందులో 315 అధికరణలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి. రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ ముసాయిదాను 1949, నవంబర్ 26న ఆమోదించింది. అందువల్ల ఆ రోజు నుంచి పాక్షిక రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. పూర్తి రాజ్యాంగం 1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ రెండు నెలల ఆలస్యానికి కారణం.. 1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ ప్రవేశపెట్టిన సంపూర్ణ స్వరాజ్య తీర్మానం. భారత రాజ్యాంగంపై విమర్శలు భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం - ఐవర్ జెన్నింగ్స భారత రాజ్యాంగ ఒక అరువు తెచ్చుకున్న రాజ్యాంగం - ఐవర్ జెన్నింగ్స భారత రాజ్యాంగాన్ని పరిషత్గుర్తుకు అనుగు ణంగా రూపొందించారు - హెచ్.వి.కామత్ భారత రాజ్యాంగం 1935 చట్టపు జిరాక్స్ కాపీ - ప్రొ. కె.టి.షా భారత రాజ్యాంగ పరిషత్ కాంగ్రెస్ పార్టీ సభ - చర్చిల్ ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలు బ్రిటన్: పార్లమెంటరీ ప్రభుత్వం, శాసనప్రక్రియ, స్పీకర్ వ్యవస్థ, సమన్యాయపాలన, ఏక పౌరసత్వం, ఏకీకృత న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, కాగ్ వ్యవస్థ, అఖిల భారత సర్వీసులు. అమెరికా: ప్రజాస్వామ్యం, ఉపరాష్ర్టపతి వ్యవస్థ, రాజ్యాంగ ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, స్వయం ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థ, న్యాయ సమీక్ష, మహాభియోగ తీర్మానం. కెనడా: సమాఖ్య విధానం, అవశిష్ట అధికారాలు, గవర్నర్ వ్యవస్థ. ఐర్లాండ్: ఆదేశిక సూత్రాలు, రాష్ర్టపతి ఎన్నిక, రాజ్యసభ సభ్యుల నియామకం. దక్షిణాఫ్రికా: రాజ్యాంగ సవరణ, రాజ్యసభ సభ్యుల ఎన్నిక. ఆస్ట్రేలియా: పార్లమెంట్ ఉమ్మడి సభ సమావేశం, ఉమ్మడి జాబితా. ఫ్రాన్స: గణతంత్ర, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. రష్యా: ప్రాథమిక విధులు, సామ్యవాదం, న్యాయం, ప్రణాళికలు. జపాన్: జీవించే హక్కు జర్మనీ: అత్యవసర పరిస్థితి షెడ్యూళ్లు మొదటి షెడ్యూల్: కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల పేర్ల మార్పు. రెండో షెడ్యూల్: ప్రముఖుల జీతభత్యాలు. మూడో షెడ్యూల్: ప్రముఖుల పదవీ ప్రమాణ స్వీకారాలు. నాలుగో షెడ్యూల్: రాజ్యసభలో సీట్ల కేటాయింపు. ఐదో షెడ్యూల్: ఆదివాసి ప్రాంతాల ప్రత్యేక పరిపాలన. ఆరో షెడ్యూల్: అసోం, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక పరిపాలన. ఏడో షెడ్యూల్: కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికార విభజన. ఎనిమిదో షెడ్యూల్: మొదట 14 అధికార భాషలను గుర్తించారు. 1967లో 21వ సవరణ ద్వారా సింధి భాషను, 1992లో 71వ సవరణ ద్వారా మణిపురి, కొంకణి, నేపాలి భాషలను, 2003లో 92వ సవరణ ద్వారా మైథిలి, సంతాలి, డోగ్రి, బోడో భాషలను అధికార భాషలుగా గుర్తించారు. తొమ్మిదో షెడ్యూల్: భూ సంస్కరణలు. (1951లో ఒకటో రాజ్యాంగ సవరణ ద్వారా) పదో షెడ్యూల్: పార్టీ ఫిరాయింపు నిషేధ చట్టం. (1985లో 52వ సవరణ ద్వారా చేర్చారు) పదకొండో షెడ్యూల్: పంచాయతీరాజ్ చట్టం. (1992లో 73వ సవరణ ద్వారా చేర్చారు) పన్నెండో షెడ్యూల్: నగర పాలక చట్టం. దీన్ని 1992లో 74వ సవరణ ద్వారా చేర్చారు. -
చట్టాలకు భారత రాజ్యాంగం తల్లిలాంటిది
కర్నూలు(హాస్పిటల్): చట్టాలన్నింటికీ భారత రాజ్యాంగం తల్లిలాంటిదని జిల్లా న్యాయాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎంఏ సోమశేఖర్ అన్నారు. గురువారం ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెమినార్ హాలులో కళాబంధు కళాపరిషత్ సంస్థ ఆధ్వర్యంలో విద్యా విలువలు–మానవ హక్కులు అనే అంశంపై రెండో రోజు జాతీయ సదస్సు సంస్థ అధ్యక్షుడు ఎ. సర్దార్బాషా అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన న్యాయమూర్తి ఎంఏ సోమశేఖర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలని సూచించారు. లక్షలోపు ఆదాయం ఉన్న మహిళలకు న్యాయాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. మానవ విలువలతో కూడిన విద్యా విధానం ప్రస్తుత సమాజానికి అవసరమని చెప్పారు. ఎస్ఎస్టీ సంస్థ డైరెక్టర్ వి. ఆంజనేయులు మాట్లాడుతూ తల్లి గర్భం నుంచే శిశువు నిరంతర విద్యను అభ్యసించడం ప్రారంభమవుతుందన్నారు. విలువల అభ్యాసానికి మొదటి మెట్టు కుటుంబమని పేర్కొన్నారు. వ్యక్తులలో పూర్వపు ఆధ్యాత్మికత, సేవాతత్వం ప్రస్తుతం కనిపించడం లేదన్నారు. ఒక వ్యక్తి నీటిలో పడితే సెల్ఫీ ఫొటో తీస్తారని, కానీ హాస్పిటల్కు పంపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య వ్యక్తిత్వ వికాసానికి, సమాజ వికాసానికి, దేశాభివద్ధికి తోడ్పడాలని కోరారు. కార్యక్రమంలో రాయలసీమ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జి. రామకష్ణ, ఎస్టీబీసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీహెచ్ మనోరమ, సైకాలజిస్టు పి.లక్ష్మన్న, నందికొట్కూరు డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. బడేసాహెబ్, ఎస్ఆర్ఈఈ సంస్థ కార్యదర్శి కొమ్ముపాలెం శ్రీనివాసులు, న్యాయవాధి వాడాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
'అంబేద్కర్ వందేళ్లు ముందే ఊహించారు'
-
'అంబేద్కర్ వందేళ్లు ముందే ఊహించారు'
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంపై ప్రధాని నరేంద్రమోదీ సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. అందరిలో ఒకడిగా తాను రాజ్యాంగంపై స్పందిస్తున్నానంటూ మోదీ ప్రసంగం ప్రారంభించారు. 100ఏళ్ల తర్వాత కూడా ప్రపంచం ఎలా ఉండబోతుందో ఊహించి మహనీయుడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. అంబేద్కర్ ఆలోచనలు, బోధనలు తరతరాలకు అనుసరణీయం అని చెప్పారు. రాజ్యాంగంలోని ప్రతిపుటలో అంబేద్కర్ కనిపిస్తారని చెప్పారు. ఆయన అడుగడుగునా కష్టాలు ఎదుర్కొన్నారని అన్నారు. ఆయన ఆలోచనలు, అనుభవాలు ఎంతో విలువైనవని చెప్పారు. ఆయన పడ్డకష్టాల ప్రభావం భారత రాజ్యాంగంలో ఉందని చెప్పారు. భారత్వంటి పెద్ద దేశానికి రాజ్యాంగం రచించడం అంత సామాన్య విషయం కాదని అన్నారు. దేశపౌరుల గౌరవానికి, దేశ ఐక్యతకు మన రాజ్యాంగం ప్రతీక అని అన్నారు. మహానీయుల కృషివల్లే ప్రపంచంలో ఎక్కడా లేని రాజ్యాంగం మనకు సొంతమైందని చెప్పారు. రాజ్యాంగ నిర్మాతలు తపస్సు చేశారని అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఎంత గౌరవించినా, పొగిడినా తక్కువేనని అన్నారు. రాజ్యాంగంపై నిరంతరం చర్చ జరుగుతూ ఉండాలని, రాజ్యాంగంపై ప్రతి ఒక్క పౌరుడికి అవగాహన కల్పించాలని చెప్పారు. నేటి ప్రతి పౌరుడికి రాజ్యాంగం అర్ధమయ్యే రీతిలో అవకాశం కల్పించాలని, ప్రజల్లోకి కూడా రాజ్యాంగంపై చర్చను తీసుకెళ్లాలని అన్నారు. రాజ్యాంగ నిర్మాణం విషయంలో మహనీయుల కృషిని చర్చించిన అందరికీ ధన్యవాదాలని, ప్రతి ఒక్కరు చక్కటి అభిప్రాయాలను తెలిపారని మోదీ సభను ఉద్దేశించి అన్నారు. భారత దేశాభివృద్ధిలో ఎంతోమంది నాయకుల కృషి ఉందని అన్నారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన ప్రతి ఒక్కరూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి రాజ్యాంగ భావనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, విద్యాసంస్థల్లో కూడా రాజ్యాంగంపై చర్చ జరగాలని అన్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో ఏకాభిప్రాయం వలన బలం చేకూరుతుందని, సంఖ్యాబలంకన్నా ఏకాభిప్రాయం గొప్పదని చెప్పారు. -
రాజ్యాంగంలో ఏముంది.. అసలేం జరుగుతోంది?
'భారతీయులందరి శ్వాస'గా అభివర్ణించే రాజ్యాంగం ఏం చెబుతోంది. ఎన్నో హక్కులతో పాటు భావప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, సమాజంలో గౌరవప్రదంగా బతికే హక్కును కల్పిస్తోందని నాటి రాజ్యాంగ పరిషత్ సభ్యులైన జవహర్లాల్ నెహ్రూ, బీఆర్ అంబేద్కర్, సర్దార్ పటేల్, మౌలానా ఆజాద్ తదితరులు నిర్వచనం ఇచ్చారు. కులం, మతం, లింగ, పుట్టుక వివక్షతతో సంబంధం లేకుండా భిన్నత్వంలో ఏకత్వాన్ని విశ్వసిస్తూ అన్నివర్గాల ప్రజల సమష్టి మనోభావాలను గౌరవించాలని, సమానత్వం, న్యాయం, స్వాతంత్య్రం ప్రాతిపదిక భారతీయత అనే భావాన్ని పరిరక్షించేందుకు ప్రజల కోసం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కృషిచేయాలని రాజ్యాంగం చెబుతోంది. బీఆర్ అంబేద్కర్ 125 జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తొలిసారిగా గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రాజ్యాంగ లక్ష్యాలు, ఆదర్శాలను అమలు చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మోదీ దేశ ప్రజలకు ట్విట్టర్ సందేశం ఇచ్చారు. అసలు ఇప్పుడేం జరుగుతోంది? నీతులు వల్లిస్తున్న ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి, నియమావళికి కట్టుబడి పనిచేస్తోందా? కొన్ని నెలలుగా దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా ఉండటమే దీనికి సమాధానం. 2014 మే నుంచి 2015 మే వరకు మైనారిటీలకు వ్యతిరేకంగా దేశంలో 600 హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిలో ముస్లింలకు వ్యతిరేకంగా 406, క్రైస్తవులకు వ్యతిరేకంగా మిగతావి జరిగాయి. దాద్రి, ఉధంపూర్, ఉచెకాన్ మోయిబా తాంగ్కాంగ్ (మణిపూర్) సంఘటనలు వాటిలో మరీ తీవ్రమైనవి. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఓ మనిషి ప్రాణం తీసిన సందర్భాలూ ఉన్నాయి. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం చెలరేగుతున్న విషయం తెల్సిందే. ఈ అసహనం దళితులకు వ్యతిరేకంగా దాడులకు కూడా దారితీసింది. 2014లో దళితులకు వ్యతిరేకంగా 47,064 సంఘటనలు నమోదయ్యాయి. గత ఏదాడితో పోలిస్తే దళితులపై దాడులు 19 శాతం పెరిగాయి. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంఘ పరివారం ఈ దాడులకు పాల్పడిందన్న ఫిర్యాదులు ఉన్నాయి. రాజ్యాంగ విధుల ప్రకారం ఇలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా నివారించడం, జరిగిన కేసుల్లో దోషులకు శిక్ష పడేలా కఠినంగా వ్యవహరించడం అధికారంలో ఉన్న కేంద్రం బాధ్యత. శాంతిభద్రత పట్ల ప్రజలకు విశ్వాసం కలిగించడం కూడా ప్రభుత్వ ధర్మం. అయితే ఇప్పటి ప్రభుత్వం మౌనం వహిస్తూ బాధ్యతలను విస్మరిస్తోందన్నది విపక్షాల విమర్శ. సమాజంలోని కొన్ని శక్తులు రాజ్యాంగాన్ని విశ్వసించకపోవచ్చు. రాజ్యాంగ నియమ నిబంధనల పట్ల వారికి ఇసుమంత గౌరవం కూడా లేకపోవచ్చు. సాక్షాత్తు నరేంద్ర మోదీ తన గురువుగా చెప్పుకొనే ఎమ్మెస్ గోవాల్కర్ రాజ్యాంగ ప్రతిని తగులబెట్టమని ఓ సందర్భంలో పిలుపునిచ్చారు. దీనికి బదులు 'మనుస్మృతి'ని భారత రాజ్యాంగంగా చేస్తే అంగీకరించేవాడినని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన ప్రభుత్వాలకు మాత్రం రాజ్యాంగాన్ని తు.చ. తప్పక పాటించాల్సిన బాధ్యత ఉంది. సర్వమత సమానత్వానికి కృషిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. 'గురూజీ: ఏక్ స్వయం సేవక్' అనే పేరిట ఎమ్మెస్ గోవల్కర్ జీవితంపై 2010లో పుస్తకం రాసిన నరేంద్ర మోదీలో రాజ్యాంగ స్ఫూర్తి ఏ మేరకు ఉందో కాలమే చెప్పాలి! -
భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నం?
ప్రాక్టీస్ బిట్స్- భారత రాజ్యాంగం 1. భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు గురించి మొదటగా ప్రతిపాదించింది? ఎ) వేవేల్ ప్రణాళిక బి) క్రిప్స్ కమిషన్ సి) కేబినెట్ మిషన్ ప్లాన్ డి) మౌంట్బాటన్ ప్రణాళిక 2. భారత రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలను ఎప్పుడు నిర్వహించారు? ఎ) జూలై, 1946 బి) ఆగస్టు, 1946 సి) డిసెంబర్, 1946 డి) జనవరి, 1947 3. భారత రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగిన రోజు? ఎ) ఆగస్టు 15, 1946 బి) సెప్టెంబర్ 27, 1946 సి) నవ ంబర్ 15, 1946 డి) డిసెంబర్ 9, 1946 4. ఏ దేశ సాంప్రదాయాన్ని అనుసరించి సీనియర్ సభ్యుడైన సచ్ఛిదానందా సిన్హాను రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు? ఎ) బ్రిటన్ బి) ఫ్రెంచి సి) గ్రీక్ డి) అమెరికన్ 5. రాజ్యాంగ పరిషత్ రెండో సమావేశం (డిసెంబర్ 11, 1946)లో.. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికైంది? ఎ) జవహర్లాల్ నెహ్రూ బి) అంబేద్కర్ సి) రాజేంద్రప్రసాద్ డి) జేబీ కృపాలనీ 6. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్? ఎ) బూబు రాజేంద్రప్రసాద్ బి) అంబేద్కర్ సి) వల్లభాయ్ పటేల్ డి) నెహ్రూ 7. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సమావేశం ఏ రోజున మొదటిసారి జరిగింది? ఎ) ఆగస్టు 15, 1947 బి) ఆగస్టు 14, 1947 సి) ఆగస్టు 24, 1947 డి) ఆగస్టు 29, 1947 8. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యులు కానివారెవరు? ఎ) కె.ఎం. మున్షీ బి) సయ్యద్ సాదుల్లా సి) వల్లభాయ్ పటేల్ డి) ఎన్. మాధవ రావు 9. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యుల సంఖ్య (అధ్యక్షుడితో కలిపి)? ఎ) 6 బి)7 సి) 8 డి)9 10. కేబినెట్ మిషన్లో సభ్యులు కానివారెవరు? ఎ) మౌంట్బాటన్ బి) క్రిప్స్ సి) అలెగ్జాండర్ డి) ఫెథిక్ లారెన్స్ 11. భారత రాజ్యాంగాన్ని ఏ రోజున రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది? ఎ) జనవరి 26, 1950 బి) నవంబర్ 26, 1949 సి) జనవరి 26, 1949 డి) నవంబర్ 26, 1950 12. రాజ్యాంగాన్ని రాయడానికి పట్టిన కాలం? ఎ) 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు బి) 2 సంవత్సరాల 9 నెలల 21 రోజులు సి) 2 సంవత్సరాల 10 నెలల 24 రోజులు డి) 2 సంవత్సరాల 12 నెలల 9 రోజులు 13. భారత రాజ్యాంగ రూపకల్పనకు ప్రధాన ఆధారమైన చట్టం? ఎ) భారత స్వాతంత్య్ర చట్టం, 1947 బి) 1909, భారత ప్రభుత్వ చట్టం సి) 1919, మాంటేగ్ చెమ్స్ఫర్డ్ చట్టం డి) 1935, భారత ప్రభుత్వ చట్టం 14. భారత రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం జరిగిన రోజు? ఎ) జనవరి 24, 1950 బి) జనవరి 26, 1950 సి) నవంబర్ 26, 1949 డి) డిసెంబర్ 31, 1919 15. భారత్, పాకిస్థాన్లను ఏ ప్రణాళిక ప్రకారం విభజించారు? ఎ) కేబినెట్ మిషన్ ప్రణాళిక బి) లార్డ్లిన్లిత్గో ప్రణాళిక సి) సి.ఆర్.ఫార్ములా డి)మౌంట్బాటన్ ప్రణాళిక 16. భారత రాజ్యాంగాన్ని ‘అతుకుల బొంత’గా పేర్కొంది? ఎ) కె.సి. వేర్ బి) ఐవర్ జెన్నింగ్స్ సి) ఎ.వి.డైసీ డి) ఆస్టిన్ 17. భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నం? ఎ) పావురం బి)సింహం సి) పులి డి) ఏనుగు 18. భారత రాజ్యాంగం ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చింది? ఎ) ఆగస్టు 15, 1947 బి) నవంబర్ 26, 1950 సి) జనవరి 1, 1950 డి) జనవరి 26, 1950 19. భారతదేశానికి తాత్కాలిక గవర్నర్ జనరల్గా పని చేసిన భారతీయుడు? ఎ) నెహ్రూ బి) రాజేంద్రప్రసాద్ సి) రాజగోపాలచారి డి) జె.బి. కృపాలనీ 20. స్వతంత్ర భారత మొట్ట మొదటి హోం మంత్రి? ఎ) అబ్దుల్ కలామ్ ఆజాద్ బి) జగ్జీవన్ రామ్ సి) వల్లభాయ్ పటేల్ డి) నెహ్రూ 21. భారత రాజ్యాంగ ముఖ్య ఆధారాల ప్రకారం సరికాని జత? ఎ) ఐర్లాండ్ రాజ్యాంగం-ఆదేశిక సూత్రాలు బి) రష్యా రాజ్యాంగం-ప్రాథమిక విధులు సి) జపాన్ రాజ్యాంగం-జీవించే హక్కు డి) {బిటన్ రాజ్యాంగం-పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం 22. భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? ఎ) 8 బి) 10 సి)12 డి) 14 23. మన రాజ్యాంగ రూపకల్పన కోసం.. రాజ్యాంగ పరిషత్ సుమారు ఎన్ని దేశాల రాజ్యాంగాలను పరిశీలించింది? ఎ) 16 బి) 25 సి) 58 డి) 60 24. మన రాజ్యాంగం ప్రవేశికలో ప్రస్తావించిన తేదీ? ఎ) ఆగస్టు 15, 1947 బి) జనవరి 26, 1950 సి) నవంబర్ 26, 1949 డి) డిసెంబర్ 15, 1948 25. మన రాజ్యాంగాన్ని రచించడానికి సుమారు ఎన్ని రూపాయాలు ఖర్చయ్యాయి? ఎ) 10 లక్షలు బి) 64 లక్షలు సి) 78 లక్షలు డి) 86 లక్షలు 26. మన జాతీయ జెండా ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చింది? ఎ) ఆగస్టు 15, 1947 బి) జనవరి 26, 1950 సి) జూలై 22, 1947 డి) జనవరి 24, 1950 27. స్వతంత్ర భారత ప్రథమ ఉపరాష్ట్రపతి? ఎ) సర్వేపల్లి రాధాకృష్ణన్ బి) వల్లభాయ్ పటేల్ సి) జగ్జీవన్రామ్ డి) అనంతశయం అయ్యంగార్ 28. అంబేద్కర్ ఏ రాష్ట్రం నుంచి రాజ్యాంగ పరిషత్కు ఎన్నికయ్యారు? ఎ) బాంబే బి) బెంగాల్ సి) మద్రాస్ డి) వాయవ్య భారతదేశం 29. భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ‘రాజ్యాంగ లక్ష్యాల తీర్మానా’న్ని ప్రవేశపెట్టింది? ఎ) వల్లభాయ్ పటేల్ బి) నెహ్రూ సి) గాంధీజీ డి) అంబేద్కర్ 30. స్వతంత్ర భారత మొదటి లోక్సభ స్పీకర్? ఎ) మౌలంకర్ బి) సంజీవరెడ్డి సి) సర్దార్ బల్దేవ్ సింగ్ డి) ఎస్.పి. ముఖర్జీ 31. తాత్కాలిక ప్రభుత్వంలో అంబేద్కర్ నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ శాఖ? ఎ) న్యాయ బి) కార్మిక సి) విద్యా డి)ఏదీకాదు 32. భారత జాతీయ కాంగ్రెస్ ఏ రోజును ప్రతి సంవత్సరం పూర్ణ స్వరాజ్య దినోత్సవంగా నిర్వహించేది? ఎ) ఆగస్టు 15 బి) జనవరి 26 సి) అక్టోబర్ 2 డి) నవంబర్ 14 33. రాజ్యాంగ సవరణ విధానాలను ఏ రాజ్యాంగ నిబంధనల ఆధారంగా తీసుకున్నారు? ఎ) ఆస్ట్రేలియా బి) బ్రిటన్ సి) దక్షిణాఫ్రికా డి) కెనడా 34. రాజ్యాంగంలోని ప్రకరణలు (ఆర్టికల్స్)? ఎ) 395 బి) 398 సి) 408 డి) 424 35. కింది వాటిలో ఏక కేంద్ర లక్షణం కానిది? ఎ) అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఉండటం బి) ఏక పౌరసత్వం సి) అధృడ రాజ్యాంగం డి) స్వతంత్ర న్యాయ వ్యవస్థ 36. కింది వాటిలో సమాఖ్య లక్షణం? ఎ) రాష్ట్రపతి అత్యవసర అధికారాలు బి) ఉన్నత న్యాయస్థానం సి) లిఖిత రాజ్యాంగం డి) ప్రాథమిక హక్కులు 37. భారత రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాదం అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? ఎ) 24వ బి) 42వ సి) 44వ డి)48వ 38. 42వ (1976)రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక అనే పదంతోపాటు చేర్చిన మరో పదం? ఎ) ప్రజాస్వామ్యం బి) గణతంత్ర సి) సమగ్రత డి) సారభౌమత్వం 39. భారత రాజ్యాంగం ఏ మతాన్ని/మతాలను గుర్తించింది? ఎ) హిందూ-ముస్లిం-క్రిస్ట్టియన్ బి) హిందూ-ముస్లిం-క్రిస్టియన్-సిక్కు సి) అన్ని మతాలు డి) ఏదీకాదు 40. భారత రాజ్యాంగం ఎన్ని భాషలను గుర్తించింది? ఎ) 18 బి) 20 సి) 22 డి) 24 41. ఆస్తి హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు? ఎ) 42వ (1976) బి) 44వ (1978) సి) 46వ (1976) డి) 48వ (1978) 42. భారత రాజ్యాంగం ప్రకారం ఆస్తి హక్కు? ఎ) ప్రాథమిక హక్కు బి) మానవ హక్కు సి) చట్టబద్దమైన హక్కు డి) ఆర్థిక హక్కు 43. భారత రాజ్యాంగ సామ్యవాద స్ఫూర్తికి ఆధారాలు? ఎ) ఆదేశిక సూత్రాలు బి) ప్రాథమిక హక్కులు సి) ప్రాథమిక విధులు డి) స్థానిక సంస్థలు 44. మన రాజ్యాంగ ప్రవేశికలో ఈ విధంగా రాసి ఉంటుంది? ఎ) సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర, సామ్యవాద రాజ్యం బి) సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం సి) సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర, సామ్యవాద, లౌకిక రాజ్యం డి) సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామ్య రాజ్యం 45. గణతంత్ర రాజ్యమంటే? ఎ) రాష్ట్రపతిని ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు బి) రాష్ట్రపతిని పరోక్షంగా ఎన్నుకుంటారు సి) రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఎన్నుకుంటారు డి) పైవన్నీ 46. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం మన రాజ్యాంగాన్ని రాసిందెవరు? ఎ) రాజ్యాంగ పరిషత్ బి) రాజ్యాంగ ముసాయిదా కమిటీ సి) ప్రజలు డి) ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు 47. భారత రాజ్యాంగంలోని నాలుగో భాగం దేనికి సంబంధించింది? ఎ) ఆదేశిక సూత్రాలు బి) ప్రాథమిక హక్కులు సి) పౌరసత్వం డి) ప్రాథమిక విధులు 48. డెమోక్రసీ అనే పదాన్ని ఏ భాషా పదం నుంచి గ్రహించారు? ఎ) గ్రీక్ బి) ఫ్రెంచి సి) జర్మన్ డి) స్పానిష్ 49. ‘భారతదేశంలో సర్వసత్తాక సార్వభౌమాధికారం ప్రజలదే’... భారత జీవన స్రవంతిలో ఏ అంశం ఈ లక్షణాన్ని వర్ణిస్తుంది? ఎ) ప్రజాస్వామ్యం బి) లౌకికతత్వం సి) సామాజిక న్యాయం డి) పైవన్నీ 50. మనం ఫెడరేషన్ భావనను ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం? ఎ) ఐర్లాండ్ బి) ఆస్ట్రేలియా సి) జర్మనీ డి) కెనడా 51. 1946లో ఏర్పాటు చేసిన మధ్యంతర కేబినెట్ అధ్యక్షుడెవరు? ఎ) రాజేంద్రప్రసాద్ బి) నెహ్రూ సి) వల్లభాయ్ పటేల్ డి) రాజగోపాలాచారి 52. గాంధీ దృష్టిలో సంక్షేమ రాజ్యానికి కావాల్సినవి? ఎ) ఆదేశిక సూత్రాలు బి) ప్రాథమిక హక్కులు సి) ప్రాథమిక విధులు డి) అత్యవసర అధికారాలు సమాధానాలు: 1) బి; 2) ఎ; 3) డి; 4) బి; 5) సి; 6) బి; 7) డి; 8) సి; 9) బి; 10) ఎ; 11) బి; 12) ఎ; 13) డి; 14) ఎ; 15) డి; 16) బి; 17) డి; 18) డి; 19) సి; 20) సి; 21) డి; 22) సి; 23) డి; 24) సి; 25) బి; 26) సి; 27) ఎ; 28) బి; 29) బి; 30) ఎ; 31) డి; 32) బి; 33) సి; 34) ఎ; 35) డి; 36) సి; 37) బి; 38) సి; 39) డి; 40) సి; 41) బి; 42) సి; 43) ఎ; 44) బి; 45) డి; 46) సి; 47) ఎ; 48) ఎ; 49) ఎ; 50) డి; 51) బి; 52) ఎ. -
రాష్ట్రానికి, రాజ్యాంగానికి సంబంధం లేకుండా విభజన'
-
రాష్ట్రానికి, రాజ్యాంగానికి సంబంధం లేకుండా విభజన'
రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ఉమ్మడి రాజధాని చేస్తారని శైలజానాధ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలో శనివారం బిల్లుపై జరిగిన చర్చలో శైలజానాథ్ ప్రసంగిస్తూ... ఇరుప్రాంతాలలో రాజకీయ లబ్ధి కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు. విభజన విషయాన్ని రాజకీయ పార్టీలు తేలిగ్గా తీసుకున్నందు వల్లే ఇప్పుడు ఈ సమస్య జఠిలమైందని అన్నారు. తాను సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉన్నానని శైలజానాథ్ పునరుద్ఘాటించారు. హైదరాబాద్పై రిఫరెండం పెడదామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గతంలో వ్యాఖ్యలు చేశారని కానీ ఎప్పటిలానే కేసీఆర్ మాటా మార్చారని ఈ సందర్బంగా శైలజానాథ్ గుర్తు చేశారు. విభజన బిల్లును చూస్తుంటే మన రాష్ట్రానికి, రాజ్యాంగానికి సంబంధం లేనట్లుగా అనిపిస్తోందని శైలజానాథ్ వ్యాఖ్యానించారు. -
లెజిస్లేచర్ పరువుకు పరీక్ష
ఫెడరల్ స్ఫూర్తిని ధ్వంసం చేస్తూ విభజించి-పాలించే పాలకపక్షాలను అదుపు చేయడానికి ‘అధికరణ-3’కు స్పష్టమైన సవరణ తీసుకురావాలని 12వ తేదీ నుంచీ ప్రారంభమయ్యే ఆంధ్రప్రదేశ్ శాసనసభ (ఈ లోపు పాలకులు అవకాశవాదానికి పాల్పడకపోతే, గీతే) సమావేశాలు తీర్మానం ద్వారా స్పష్టం చేయాలి! ‘‘రాజ్యాంగబద్ధమైన నీతీ, ఏ ది సరైనది, ఏది కాదు అన్న విచ క్షణాయుతమైన నైతికత మని షికి స్వభావ సిద్ధంగా అబ్బే గు ణం కాదు. ఆ నీతిపాఠాన్ని ఆచ రణలో అలవరచుకోగల గాలి. మన ప్రజలూ, నాయకులూ ఇం కా ఆ నీతిని అలవరచుకోవలసి ఉంది! ప్రజాస్వామ్యం అనేది భారతభూమికి పైపై అలంకరణ మాత్రమే. ఎందుకంటే, భారతభూమి ప్రధానంగా ప్రజాస్వామ్య విరుద్ధ స్వభావం గల దేశం కాబట్టి!’’ - డా. బీఆర్ అంబేద్కర్ స్వాతంత్య్రానంతర భారతంలో ఏ అనుభవాలను ఊహించి రాజ్యాంగ నిర్మాతలలో అగ్రేసరుడైన డాక్టర్ అంబేద్కర్ ఇలాంటి అభిప్రాయానికి రావలసివచ్చిందో, 65 సంవత్సరాల తరవాత నేటి పాలక పక్షాల ఆచరణ చూస్తే తెలుస్తుంది. రాజ్యాంగ మౌలిక సూత్రాలలో (సమా ఖ్య) వ్యవస్థ అంతర్భాగమేనని రాజ్యాంగం ఘోషిస్తూ ఉంటుంది. ఆ సూత్రాన్ని పాలకపక్షాలు అడుగుడుగునా నిర్వీర్యం చేస్తూనే ఉన్నాయి. బ్రూట్ మెజారిటీ వల్లే... 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చాక, మొదట ఎని మిది,తొమ్మిది సంవత్సరాల వరకో తప్ప 1959 నుంచీ కాంగ్రెస్పార్టీ రాజ్యాంగ ఉల్లంఘనలకు బ్రూట్ మెజారి టీనే ఆశ్రయించింది! పార్లమెంటు, శాసనసభల అధికారా లను రాజ్యాంగ నిర్ణేతలు స్పష్టంగా విభజించినా పార్లమెం టులో ‘బ్రూట్’ మెజారిటీ చాటున కాంగ్రెస్ పాలకపక్షం (తర్వాత మితవాద బీజేపీ) రాష్ట్రాల జాబితాను క్రమంగా ‘చెదల’ మాదిరిగా తినేస్తూ వచ్చింది. అలాగే కేంద్రమూ - రాష్ట్రాలూ సమాన హోదాలో పంచుకోవలసిన పాలనాం శాల జాబితాలోకి కూడా పాలకపక్షాలు చొరబడి రాష్ట్ర ప్రభుత్వాల, రాష్ట్రాల లెజిస్లేచర్ల అధికార పరిధిని తొలుచు కుంటూ వచ్చాయి. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన బిల్లును పార్లమెంటు ఆమోదించ డానికి ముందు రాష్ట్రప తికి పంపించి, అక్కడి నుంచి శాసనసభల ఆమోదానికి లేదా చర్చకు లేదా ఓటింగ్ ద్వారా సభ్యుల అభిప్రాయా లను నమోదు చేయడానికి పంపించడం ప్రజాస్వామిక పద్ధతీ, రాజ్యాంగ నిర్దేశమూ! అప్పుడు జరిగింది ఇదే! కాని అదే కాంగ్రెస్ పాలనలో, అదే పార్లమెంటులో తన బ్రూట్ మెజారిటీ ద్వారా 1955 డిసెంబర్ 24న ఏం జరి గిందన్నది నేడు తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభ జన ప్రతిపాదన సందర్భంగా శాసనసభ్యులకు కనువిప్పు కావలసిన విషయమది. రాష్ట్ర శాసనసభ గౌరవ సభా పతిగా పనిచేసిన కిరణ్కుమార్కూ, ప్రస్తుతం రాష్ట్ర శాసన సభ గౌరవ స్పీకర్గా ఉన్న నాదెండ్ల మనోహర్ రాష్ట్ర విభ జన బిల్లుపై ఓటింగ్ జరుగుతుందనీ, కేవలం ‘అభిప్రా య’ ప్రకటనతోనే సరిపెట్టుకోబోమన్న భ్రమల్లో ఉన్నారు. అలాగే బోలెడంత ఖర్చుచేసి విద్యావంతుడై విదేశాల నుం చి వచ్చి శాసనసభ్యుడైన ఓ ఎన్ఆర్ఐ మిత్రుడికి కూడా 1995లో రాజ్యాంగంలోని ‘ఆర్టికల్-3’కి సంబంధించి వచ్చిన సవరణ ఏమిటో, ఆ రాజ్యాంగ సవరణకు ముం దున్న గౌరవమైన ్ర‘పోవిజో’ ఏమిటో ‘యాది’ ఉన్నట్లు కనిపించదు! ఆ సవరణకు ముందు... 1955 నాటి సవరణకు ముందున్న ‘ప్రొవిజో’లో ఏముం దో డాక్టర్ దుర్గాదాస్ బసు (భారత రాజ్యాంగం మీద పది సంపుటాల వ్యాఖ్యానం రాశారు) వెల్లడించేదాకా చాలా మంది అయోమయావస్థలోనే ఉండిపోయారు! 1955 డిసెంబర్ దాకా ఉన్న రాజ్యాంగంలోని ‘3వ అధికరణ’ తాలూకు ఆ ‘ప్రొవిజో’ (అంశం) ఏమిటి? కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆయా శాసనసభ లకు ‘ప్రస్తావన’గా పంపి, వాచా మాత్రమే అభిప్రాయం తెలుసుకోవడం కాదు. శాసనసభ ‘నిశ్చితాభిప్రాయా’న్ని (‘టు ఎసర్టయిన్’) పొందాలని ఆ ‘ప్రొవిజో’ నిర్దేశించిం ది. ‘నిశ్చితాభిప్రాయ’ ప్రకటనకు సభ్యుల ఓటింగ్ అనివా ర్యం! అయితే ఉత్తరోత్తరా కేంద్రం మైనారిటీలో పడిపోయే స్థితి తలెత్తినా, లేదంటే ఆ ‘ప్రొవిజో’ వల్ల శాసనసభలో ఓటింగ్ ఫలితంగా తన బిల్లు ఓడిపోయే స్థితికి వచ్చినా కేం ద్రంలో తన ఉనికికే ఎసరు వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కనుకనే ఆ ప్రొవిజోలోని ‘ఎసర్టైన్’ అన్న పదాన్ని తొలగించి 1955లో ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి శాసనసభకు బిల్లును ఉత్తుత్తిగా ‘ప్రస్తా వన’ (రిఫర్) చేస్తే చాలునన్న పదాన్ని చేర్చింది! నేడు తెలుగుజాతిని విచ్చిన్నం చేయడానికి శాసనసభకు ఈ నెల 12వ తేదీన వస్తుందని చెబుతున్న విభజన ముసాయిదా బిల్లును, ఆ కొత్త ప్రొవిజో ప్రకారమే పంపుతున్నారని మర వరాదు. అందువల్లనే రాజకీయ పాలనాశక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం రాజ్యాంగంలోని ‘3 అధికరణ’ను కూడా ఉపయోగించుకోవడానికి అలవాటుపడ్డారు.ఆ నాటి రాజకీయ నాయకత్వం ‘ఆర్టికల్-3’ ద్వారా మొరా యిస్తున్న సంస్థానాధీశులను నియంత్రించదలచింది! అంతేగాని భాషా రాష్ట్రాలుగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం ఏర్పడిన కమిషన్ పనినిగానీ, సిఫారసులను గానీ, భాషా రాష్ట్రాల ఏర్పాటును గాని చెక్కు చెదర్చడానికి, ముక్కలు చేయడానికి ఆ అధికరణను సృష్టించలేదని గమ నించాలి! కనుకే, కేంద్ర బిల్లులపైన ఓటింగ్ ద్వారా శాసనసభల ‘నిశ్చితాభిప్రాయా’న్ని తెలుసుకునేందుకు ‘అధికరణ-3’ను సవరించి తీరాలని ముక్తకంఠంతో కోరాలి! ఫలితం దారుణం బ్రూట్ మెజారిటీ ఆసరాగా ప్రవేశపెట్టిన 1955 రాజ్యాంగ సవరణ ద్వారా కాంగ్రెస్ పాలకులు తీసుకున్న తొలి చర్య - అఖండ మెజారిటీతో ఎన్నికై, పెక్కు ప్రజాతంత్ర సంస్క రణలతో వచ్చిన కమ్యూనిస్టు (నంబూద్రిపాద్) ప్రభు త్వాన్ని 1959లో బలిగొనడం! అంతకు మూడేళ్ల క్రితమే తెలంగాణ రైతాంగ పోరాటం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ (1956) ఏర్పడ్డమూ జరిగింది. 1953లో ఆంధ్రోద్యమ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండేళ్లకు రాష్ట్రా ల ఉనికికి ఎసరు తెచ్చేవిధంగా 1955లో కేంద్రం, పార్ల మెంటు అధికారాలను ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకంగా బలోపేతం చేయడం జరిగింది! ఈ పూర్వ రంగంలోనే డాక్టర్ డీడీ బసు సుప్రీంకోర్టును హెచ్చరిస్తూ కనీసం ‘రానున్న రోజుల్లోనైనా’ ప్రజాస్వామ్య విరుద్ధంగా శాసన సభ హక్కుల్ని హరించే ‘అధికరణ-3’లో చేర్చిన తప్పుడు ప్రొవిజోను పరిగణనలోకి తీసుకోవాలని విశిష్టమైన సలహా ఇచ్చారు కూడా! అంతేగాదు, 1955కు ముందున్న ఆ తప్పుడు ప్రొవిజో యూనియన్ పార్లమెంటుకున్న రాజ్యాంగ పరిమితుల్ని కూడా గుర్తు చేస్తోందనీ, ఈ ప్రొవిజో చాటున దాగి పార్లమెంటు ఫెడరల్ వ్యవస్థలో భాగంగా ఉన్న రాష్ట్రాల శాసనసభల ప్రతిపత్తిని కూడా దెబ్బ తీస్తోందనీ డాక్టర్ బసు వ్యాఖ్యానించవలసి వచ్చిం ది. (‘‘బసూస్ కామెంటరీ ఆన్ ది కాన్సిటిట్యూషన్ ఆఫ్ ఇండియా’’ 6వ ముద్రణ: వాల్యూం- ‘ఎ’-1982 పేజి: 176, 177)! సమగ్రతకే హామీ లేదు ‘మన రాజ్యాంగం కింద యూనియన్లో భాగమైన రాష్ట్రా ల ప్రాదేశిక / ప్రాంతాల భౌగోళిక సమగ్రతకు గ్యారంటీ లేదని కూడా బసు స్పష్టంగా ప్రకటించాడు! అదే సమ యంలో జమ్మూ-కాశ్మీర్ భూభాగాల్ని/రాష్ర్ట భూభా గంలోని ఒక ప్రాంతాన్ని మార్చాలంటే ఆ రాష్ర్ట శాసనసభ అనుమతి అనివార్యం! అదే సందర్భంగా డాక్టర్ బసు మరొక లొసుగును కూడా బయటపెట్టి ఖండించాల్సి వచ్చింది: రాష్ట్రపతి తన విధుల నిర్వహణలో ఆయనకు సహాయ, సహకారాలు అందించడానికి మంత్రిమండలి ఉండాలని రాజ్యాంగంలోని 74(1)వ అధికరణ నిర్దేశిస్తు న్నదే గాని - మంత్రి మండలి ఇచ్చే సలహా ప్రకారం మాత్రమే విధిగా నడుచుకోవాలని మన రాజ్యాంగంలోని ఏ ప్రొవిజనూ నిర్దేశించడం లేదని కూడా బసు (కామెం టరీ పే.46) గుర్తు చేశారు! స్వతంత్ర భారత తొలి రాష్ట్ర పతి అయిన డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఆనాటి రాజ్యాంగ నిర్ణయ సభలో మాట్లాడుతూ రాష్ట్రపతికి సలహా విషయం లో రాజ్యాంగం మౌనంగా ఉన్నప్పటికీ, ఒక మంచి సం ప్రదాయంగా రాష్ర్టపతిని అన్ని విషయాలలోనూ రాజ్యాం గ ప్రతినిధిగా వ్యవహరించాల్సి వస్తుందన్నాడు! అందుకే పలు విషయాలను రసవత్తరంగా చర్చించిన రాజ్యాంగ నిర్ణయ, సభా చర్చలను, అనుమానం వచ్చినప్పుడల్లా లెజిస్లేటర్లు విధిగా సంప్రతిస్తూ (రిఫర్) ఉండాలని, ‘ఆ సమాచార ఖనిని’ దఫదఫాలుగా శాసనకర్తలు తవ్వు కుంటూ విజ్ఞానవంతులు కావాలనీ రాజ్యాంగ నిపుణుడు ప్రొఫెసర్ ఎంపీ జైన్ సలహా ఇచ్చాడు! నేటి ప్రజాప్రతి నిధులకు ఇవేమీ పట్టవు. సవరణే ప్రధానం దేశ సమగ్రతలో భాగంగా ఏర్పడినవి భాషా రాష్ట్రాలు. తాత్కాలిక ప్రయోజనాల కోసం వాటిని విచ్చిన్నం చేసి, ఫెడరల్ స్ఫూర్తిని ధ్వంసం చేస్తూ విభజించి-పాలించే పాలకపక్షాలను అదుపు చేయడానికి ‘అధికరణ-3’కు స్పష్టమైన సవరణ తీసుకురావాలని 12వ తేదీ నుంచీ ప్రారంభమయ్యే ఆంధ్రప్రదేశ్ శాసనసభ (ఈ లోపు పాల కులు అవకాశవాదానికి పాల్పడకపోతే, గీతే) సమావేశాలు తీర్మానం ద్వారా స్పష్టం చేయాలి! 1955కు ముందు ఉన్న రాష్ట్రాల శాసనసభల ‘నిశ్చితాభిప్రాయ ప్రకటన’ను గౌర వించే సంప్రదాయాన్ని పునః ప్రతిష్టించాలని కూడా ఆ తీర్మానంలో పేర్కొనాలి. ‘భాషా రాష్ట్రాల సృష్టి ప్రజాభీష్టా నికే విజయం. ఆంధ్రులకు కన్నడిగులకు, ఒడిశా, మహా రాష్ట్ర ప్రజలకూ కుల, మతాల కన్నా భాష అనేది అత్యంత శక్తిమంతమైన అభివ్యక్తి అన్న విషయం’’ ఏనాడో స్థిర పడిపోయిందన్నాడు ప్రసిద్ధ చరిత్రకారుడు రామ చంద్రగుహ! -
దేశానికి రెండు రాజ్యాంగాలు అనవసరం: తొగాడియా
అలహాబాద్: భారతదేశానికి రెండు రాజ్యాంగాలు అవసరం లేదని, రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని తొలగించాల్సిందేనని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అన్నారు. 370 అధికరణను సమీక్షించాలని, కాశ్మీర్కు అవసరమైతే కొనసాగించాల్సిందేని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ సూచనతో వీహెచ్పీ నేత విభేదించారు. దేశానికి రెండు రాజ్యాంగాలు అవసరంలేదని పేర్కొన్నారు. ప్రత్యేక రాజ్యాంగం వల్ల భారత్లో మరో దేశంగా కాశ్మీర్ చలామణీ అవుతున్నదని తొగాడియా చెప్పారు. గుజరాత్లోఉన్న ఆయన సోమవారం ఫోన్లో విలేకరులతో మాట్లాడారు. కాశ్మీర్కు ప్రత్యేకప్రతిపత్తిని ఎట్టిపరిస్థితిలో ఆమోదించేది లేదన్నారు. అంతేకాక దేశంలో ఉమ్మడిపౌరస్మృతి ఉండాల్సిందేనన్నారు. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆ విషయాన్ని విస్మరిస్తోందని ఆయన ఆరోపించారు.దేశంలో అనేక మతాల వారికి ఒకటే పౌరస్మృతి అమలవుతుండగా, ముస్లింలకు మాత్రం అమలు కావడం లేదని ఆయన అన్నారు. అందరికీ ఒకటే పౌరస్మృతి ఉండాలన్నారు. -
నూతన రాష్ట్రాల ఏర్పాటు.. రాజ్యాంగ ప్రక్రియ
ప్రస్తుతం వున రాష్ట్రంలో.. రాష్ట్ర విభజనకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లు శాసనసభకు వస్తుందనే విషయుంలో విస్తృత స్థారుులో చర్చ సాగుతోంది.. ఈ నేపథ్యంలో నూతన రాష్ట్రాల ఏర్పాటు విషయుంలో కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగ పరంగా సంక్రమించిన అధికారాలు, పార్లమెంట్ బాధ్యత, ఈ విషయుంలో రాష్ట్రపతి భూమిక, ఆ రాష్ట్ర శాసనసభ పాత్ర తదితర అంశాలపై విశ్లేషణ.. భారత రాజ్యాంగ, రాజకీయ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు పరిపాలనలో నిర్మాణాత్మకమైన, కీలక పాత్రను పోషిస్తున్నాయి. మన దేశంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల మాదిరిగా పరిపూర్ణమైన సమాఖ్య వ్యవస్థగానీ, బ్రిటన్ వలె సంపూర్ణ ఏకకేంద్ర రాజకీయ వ్యవస్థగా పని చేయటం లేదు. ఇందుకు భిన్నంగా భారత స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఒక విశిష్ట సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ క్రవుంలో కొన్ని పరిమితులకు లోబడి కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యానికి గుర్తింపునిచ్చారు. అలాంటి అంశాల్లో రాష్ట్రాల ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ప్రధానంగా పేర్కొనవచ్చు. రాష్ట్రాల ఏర్పాటు - రాజ్యాంగం: రాజ్యాంగ ఒకటో భాగం, ప్రకరణ ఒకటి నుంచి నాలుగు వరకు కొత్త రాష్ట్రాల చేరిక, ఏర్పాటు మొదలైన అంశాలను సవివరంగా ప్రస్తావించారు. ప్రకరణ ఒకటిలో భారతదేశాన్ని ‘రాష్ట్రాల యూనియన్ (యూనియన్ ఆఫ్ స్టేట్స్& Union of States)’గా వర్ణించారు. సమాఖ్య అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగానే ప్రయోగించలేదు. ఎందుకంటే భారత యూనియన్ కేంద్ర, రాష్ట్రాల మధ్య ఒప్పందం ద్వారా ఏర్పాటు కాలేదు. కాబట్టి రాష్ట్రాలు కేంద్రం నుంచి వీడిపోలేవు. ఈ పద్ధతి సాంప్రదాయ సమాఖ్య పద్ధతికి భిన్నమైంది. ఇది రాష్ట్రాలను పట్టి ఉంచే (హోల్డింగ్ టుగేదర్) పద్ధతిలో ఏర్పాటైంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల విషయూనికొస్తే.. అక్కడ ఆయూ రాష్ట్రాలను ఒప్పందం ద్వారా ఒక చోటకు చేరతాం (కమింగ్ టుగేదర్) అనే పద్ధతిలో సమాఖ్య వ్యవస్థగా ఏర్పాటు చేశారు. ప్రకరణ రెండు ప్రకారం: పార్లమెంట్ ఒక చట్టం ద్వారా దేశంలో అంతర్గత భూభాగాల విషయంలో మార్పులు చేయడంతోపాటు భారత భూభాగాలను ఇతర దేశాలకు బదిలీ చేయడం, ఇతరుల భూభాగాలను భారత్లో విలీనం చేసుకోవచ్చు. ఇలాంటి విషయాల్లో పార్లమెంట్దే అంతిమ అధికారం. ప్రకరణ మూడు ప్రకారం: పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఎ)కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఇది రెండు రాష్ట్రాల కలయికతో కావచ్చు (ఉదాహరణకు- ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం కలసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది) లేదా ప్రస్తుతం ఉన్న రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టడం (ప్రస్తుతం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ). గతంలో ఈ విధానంలోనే అత్యధిక రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. బి)రాష్ట్రాల సరిహద్దులను పెంచవచ్చు సి)రాష్ట్రాల సరిహద్దులను కుదించవచ్చు డి)సరిహద్దులను మార్చొచ్చు ఇ)రాష్ట్రాల పేర్లను మార్చొచ్చు ప్రక్రియ: పైన పేర్కొన్న అంశాలకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ ఉభయసభల్లో..ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి. రాష్ట్రపతి ప్రతిపాదిత బిల్లును ఆ రాష్ట్ర శాసనసభ అభిప్రాయానికి నివేదిస్తాడు. రాష్ట్రపతి సూచించిన గడువులోగా శాసనసభ తన అభిప్రాయాన్ని తెలియజేయాలి. గడవు పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవచ్చు లేదా విస్మరించవచ్చు. పార్లమెంట్ ఉభయసభలు బిల్లును సాధారణ మెజారిటీతో వేర్వేరుగా ఆమోదించాలి. ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. బిల్లు వీగిపోతుంది. చివరగా బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు. రాష్ట్రపతి ఆమోదం పొందితే ప్రక్రియ పూర్తి అవుతుంది. కేంద్రం ప్రకటించిన రోజు నుంచి కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది. రాష్ట్రపతి పాత్ర: నూతన రాష్ట్రాల ఏర్పాటు బిల్లుకు శాసనసభలో మెజారిటీ అభిప్రాయం వ్యతిరేకంగా ఉంటే రాష్ట్రపతి ఏమి చేయాలో రాజ్యాంగంలో ఎక్కడా వివరించలేదు. కాబట్టి ఈ అంశం రాష్ట్రపతి విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్రపతికి కొన్ని సంశయాలు ఉంటే రాజ్యాంగంలోని ప్రకరణ 143 (1) కింద సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రాష్ట్రపతి వ్యవహరిస్తాడు. పార్లమెంట్ అధికారాలు - సుప్రీంకోర్టు - రాష్ట్ర శాసనసభ పాత్ర: రాష్ట్ర విభజన ప్రక్రియు రాజ్యాంగ బద్ధంగా జరిగిందా లేదా అనే సందేహంపై అంతిమంగా వ్యాఖ్యానించే అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. రాజ్యాంగంలోని మూడో ప్రకరణపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రాష్ట్ర విభజన విషయంలో అసెంబ్లీ పాత్రను ఎలా నిర్వచించింది, అసెంబ్లీ అభిప్రాయానికి ఏ మాత్రం విలువ ఉంది, అసెంబ్లీకి పంపించిన ముసాయిదా బిల్లుకు ఆ తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుకు మధ్య తేడా మొదలైన అంశాలపై 1959లో బాబూలాల్ వర్సెస్ బొంబాయి స్టేట్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకోవాలి. విభజన-సుప్రీం తీర్పులు ఒక రాష్ట్ర విషయాన్ని ఆ రాష్ట్ర శాసనసభ సమ్మతి లేకుండా పార్లమెంట్ స్వయంగా (టఠౌఝౌౌ్ట) శాసనం చేసే అధికారం రాజ్యాంగంలో ఏ ప్రకరణ కింద పార్లమెంట్కు ప్రకటించిందో అనే విషయంలో స్పష్టత లేదు. ప్రకరణ మూడు పార్లమెంట్కు కొత్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో చట్టం చేసే అధికారం ఉందని మాత్రమే పేర్కొంటుంది. 1956 నుంచి ఇప్పటి వరకు ఏర్పడిన కొత్త రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల శాసనసభల సమ్మతితో జరిగినందున ఏ సమస్య ఉత్పన్నం కాలేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సుప్రీం కోర్టు గతంలో చెప్పిన తీర్పులు యథాతథంగా ఇక్కడ వర్తింపజేయడానికి వీలుకాకపోవచ్చు. రాష్ట్రాల ఏర్పాటు విషయంలో ప్రకరణ రెండు, మూడు ప్రకారం పార్లమెంట్కు సంక్రమించిన అధికారాలను ప్రజాస్వామిక ప్రక్రియలో వినియోగించాలని 1967లో ‘మంగల్ సింగ్ పాండే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ప్రకరణలు రెండు, మూడు, నాలుగు ప్రకారం విభజనకు, కొత్త రాష్ట్రాల ఏర్పాటును బూట్ మెజార్టీతో పాలక పక్షాలు సాధ్యం చేసుకోవడానికి కూడా హద్దులున్నాయని సుప్రీం కోర్టు ‘పౌద్వాల్ కేసు’లో 1993లో తీర్పునిచ్చింది. పరిపాలన సౌలభ్యం, భౌగోళిక సజాతీయత, ఆర్థిక సౌష్టం వంటి అంశాలను పరిశీలించాకే రాష్ట్రాల విభజన, ఏర్పాటు ప్రక్రియ చేయాలని ‘స్టేట్స్ వర్సెస్ యూనియన్’ వివాదంలో అభిప్రాయపడింది. అయితే వీటి వినియోగం, ఇతర ఒప్పందం విషయాల్లో పార్లమెంట్ చట్టాలను ప్రశ్నించడానికి వీల్లేదని ‘ముల్లపెరియార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2006’లో తీర్పునిచ్చింది. బిల్లుపై సంబంధిత అసెంబ్లీ: రాష్ట్రపతి నిర్దేశించిన గడువులోగా అసెంబ్లీ తన అభిప్రాయాన్ని చెప్పాలి. నిర్దిష్ట గడువు ముగిసిన తర్వాత కూడా అసెంబ్లీ తన అభిప్రాయాన్ని చెప్పకపోయినా.. చెప్పినట్లుగానే భావించాల్సి ఉంటుంది. అభిప్రాయాన్ని వెల్లడించేందుకు ఇచ్చిన అవకాశాన్ని అసెంబ్లీ వినియోగించుకోకపోవడమనేది..పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు అడ్డంకి కారాదన్నదే దీని ఉద్దేశం. బిల్లులో తొలుత చేసిన ప్రతిపాదనను కేంద్రం సవరిస్తే, ఆ బిల్లును మరోసారి రాష్ట్ర అసెంబ్లీకి పంపి, అభిప్రాయాలు తీసుకోవాలని కూడా లేదు. ముసాయిదాలో చేసే ప్రతి సవరణపైన అసెంబ్లీ అభిప్రాయాన్ని తీసుకోవాల్సి వస్తే ఇదో అంతులేని ప్రక్రియగా మారుతుంది. పైగా ఈ విషయం వేర్వేరు రాష్ట్రాలతో ముడిపడినదైతే ఎవరి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలనే అంశం సంక్లిష్టంగా మారుతుంది. పార్లమెంట్ దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టి కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల సరిహద్దుల మార్పులపై పూర్తి అధికారం పార్లమెంట్కే ఉంది. శాసనసభలకు తమ అభిప్రాయాలు చెప్పే హక్కు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విభజన - అధికరణ 371: రాష్ట్రంలో 1969 తెలంగాణ, 1972 జై ఆంధ్ర ఉద్యమాల నేపథ్యంలో, ఇరుప్రాంతాల ప్రజల ఆకాంక్షల మేరకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో సమానత్వం కోసం భారత రాజ్యాంగంలో 21వ భాగంలో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా 371డి, 371ఇ అధికరణలను ప్రత్యేక మెజార్టీతో చేర్చారు. 371 డి ప్రకారం భారత రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని, వివిధ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాల్లో సమాన అవకాశాలు, వసతులను కల్పిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయవచ్చు. జీవోఎం పాత్ర: రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించటానికి కమిషన్లు లేదా మంత్రుల బృందాన్ని (జీవోఎం) ఏర్పాటు చేయవ చ్చు. ప్రకరణ మూడు ప్రకారం రాష్ట్ర విభజన వల్ల ఉత్పన్నమైన పరిస్థితుల ఫలితంగా అవసరమైన నిబంధనలను కూడా రాష్ట్ర విభజన బిల్లులో చేర్చవచ్చు. పంపకాల విషయంలో మంత్రుల బృందం వివిధ ఫిర్యాదులను, సలహాలను స్వీకరించి తగిన సిఫార్సులు చేస్తుంది. రాజ్యాంగ సవరణ: ప్రకరణ రెండు, మూడు ప్రకారం ఏదైనా చట్టం చేసినప్పుడు..షెడ్యూల్ ఒకటి, షెడ్యూల్ నాలుగులోని సంబంధిత అంశాలను తప్పనిసరిగా సవరణ చేయాల్సిన అవసరం ఉందని ప్రకరణ 4 (1) స్పష్టం చేస్తుంది. షెడ్యూల్ ఒకటిలో రాష్ట్రాల పేర్లు, షెడ్యూల్ నాలుగులో రాష్ట్రాలకు రాజ్యసభలో ప్రాతినిధ్యం గురించి వివరణ ఉంది. కాబట్టి ఈషెడ్యూల్లోని సంబంధిత అంశాలు ఆటోమాటిక్గా సవరించబడతాయి. అయితే ప్రకరణ 4 (2) ప్రకారం అలాంటి చట్టాలను ప్రకరణ 368లో ప్రస్తావించినట్లుగా రాజ్యాంగ సవరణగా పరిగణించరు. ఎందుకంటే ప్రకరణ 368లో సాధారణ మెజార్టీ గురించి ప్రస్తావన లేదు. సమన్యాయం - ప్రాథమిక హక్కు: రాష్ట్రాల ఏర్పాటు అధికారం రాజ్యాంగపరంగా పార్లమెంటుకే ఉన్నప్పటికీ.. ఈ ప్రక్రియలో రాష్ట్రాల పాత్ర కూడా కీలకమవుతుంది. అభిప్రాయం, మెజార్టీ తదితర అంశాలను సాంకేతికంగా మాత్రమే చూడాల్సిన అవసరం లేదు. రాష్ట్రాల ఏర్పాటుకు సహేతుక కారణం కూడా చూపాలి. విభజన అనివార్యం అయితే ఏప్రాంత ప్రజలు నష్టపోరాదు. అన్ని సందర్భాల్లో వంద శాతం న్యాయం జరగకపోవచ్చు. ఆదే సందర్భంలో గరిష్ట న్యాయం చేయడం కూడా అసాధ్యం కాదు. సమన్యాయం అంటే భాగస్వామ్యంలో ఇచ్చిపుచ్చుకొని సమానంగా ప్రయోజనాన్ని పొందడమే. ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరుకు ఈ సూత్రమే పునాది. రాష్ట్రాల ఏర్పాటుకు అనుసరించిన ప్రక్రియ 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా దేశంలోని రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించారు. 1953లో నియమించిన ఫజల్ అలీ కమిషన్ సూచన ద్వారా ఈ వ్యవస్థీకరణ జరిగింది. పార్లమెంట్లో 2/3 వంతు మెజార్టీతో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ మేరకు 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. ................................................................ బొంబాయి రాష్ట్రాన్ని విభజిస్తు గుజరాతీ భాష మాట్లాడే వారి కోసం ప్రత్యేకంగా సౌరాష్ట్ర ప్రాంతాన్ని కలుపుతూ గుజరాత్ను దేశంలో 15వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బొంబాయి రాష్ట్రాన్ని మహారాష్ట్రగా పేరు మార్చారు. ................................................................ ‘షా’ కమిషన్ నివేదిక మేరకు హిందీ మాట్లాడే ప్రజలకు ప్రత్యేకంగా హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి, పంజాబీ భాష మాట్లాడే వారికోసం పంజాబ్ రాష్ట్రాన్ని కొనసాగించారు. ................................................................ మధ్యప్రదేశ్ నుంచి గిరిజన ప్రాంతాన్ని ఛత్తీస్గఢ్ రాష్ట్రంగా 2000, నవంబర్ 1న ఏర్పాటు చేశారు. అలాగే అదే ఏడాది ఉత్తరప్రదేశ్ నుంచి నవంబర్ 9న ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని, బీహార్ నుంచి నవంబర్ 15న జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ................................................................ బి. కృష్ణారెడ్డి, డెరైక్టర్, క్లాస్-1 స్టడీ సర్కిల్, హైదరాబాద్ -
రాష్ట్రాలకు ‘మూడు’తోంది సుమా!
‘దేశ రాజ్యాంగం అంటే - ప్రాథమిక శాసనం. అన్ని ప్రభు త్వ విభాగాల ఉనికి, రాజ్యాంగానికి బద్ధమై ఉండాలి. ఈ విభాగాల అధికారాలన్నీ రాజ్యాంగ చట్రం నుంచే సంక్రమిస్తాయి. ఆ చట్రం లోపలనే ఈ విభాగాలన్నీ తమ బాధ్యత లనూ నిర్వహిస్తాయి. అందు వల్ల, కేంద్ర శాసన వేదికైన పార్లమెంటుగానీ, రాష్ట్రాల శాస నసభలు గానీ రాజ్యాంగ చట్రాన్ని అధిగమించి పోగల సర్వసత్తాక ప్రతిపత్తిగల (సావరీన్) స్వతంత్రశక్తులు కావు. అటు భారత యూనియన్, ఇటు రాష్ట్రాల అధికారాల పరి ధులలోని అంశాలకు సంబంధించిన ఏ సవరణ అయినా సరే పార్లమెంటులోని ప్రత్యేక ప్రక్రియ (స్పెషల్ ప్రొసీ జర్) ద్వారా మాత్రమే జరగాలి, ఆ సవరణను దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు ధృవీకరించి తీరాలి. అటు యూని యన్ ప్రభుత్వం, ఇటు రాష్ట్రాల శాసనసభలూ చేసే చట్టా లు రాజ్యాంగం నిర్వచించిన వాటి వాటి పరిధులలో ఉన్నాయా, లేక రాజ్యాంగ నిబంధనలను ఆ చట్టాలు ఉల్లంఘించాయా అని పరిశీలించి, ఆ చట్టాలు గనుక రాజ్యాంగ పరిధుల్ని అతిక్రమిస్తే సదరు చట్టాన్ని / చట్టా లను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంది.’ - రాజ్యాంగ నిపుణుడు పి.ఎం. బక్షీ: (ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, 7వ ఎడిషన్, 2013 ప్రచురణ) ఇల్లు కాలుతూంటే బొగ్గులేరుకునే బాపతుకు సమ ఉజ్జీలే చాలామంది మన పార్లమెంటు సభ్యులూ, శాసన సభ్యు లూ! తెలుగుజాతిని తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం చాలా కృత్రిమ పద్ధతులను అనుసరిస్తూండగా, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోని లెజిస్లేటర్లూ ప్రత్యేక ప్యాకేజీలతో మెజారిటీ ప్రజలను సంతృప్తిపరచడానికి ఎలాంటి వెరపూ లేకుండా ముందుకు సాగటమే ఇందుకు నిదర్శనం. అలాగే ఇప్పటిదాకా రాజ్యాంగంతో, అందులోని ఫెడరల్ స్వభావంతో, సవరణాధికారాలతో, షెడ్యూల్స్తో, ఆంధ్ర ప్రదేశ్లోని మూడు ప్రాంతాలలోని విద్యార్థులు, యువజ నులు, వారి ఉద్యోగసద్యోగాల కల్పనకు, ఉద్యోగుల ప్ర మోషన్లకు సంబంధించిన 371(డి) ప్రత్యేక రాజ్యాంగ సవ రణాధికరణతో ఎలాంటి పొత్తూ పొంతనలేకుండా తీర్ప రులుగా వ్యవహరిస్తున్న వారిలో న్యాయవాదులు, లెజిస్లే టర్లు, మేధావులూ కూడా ఉండటం విచారకరం! చివరికి రాజ్యాంగంలోని ‘3వ అధికరణ’ ఫెడరల్ వ్యవస్థ మౌలిక స్వభావాన్ని అనేక సందర్భాలలో స్వాతంత్య్రానంతరం ఊడ్చిపెట్టుకుపోతున్నా ఈ ‘మేతావుల’కు చలనం లేదు. ఆ అధికరణం ఎందుకు? ఈ అధికరణను రాజ్యాంగ నిర్ణయసభ 1949లో చొప్పించ డానికి ప్రధాన కారణం - రాజ్యాంగం తుది ముసాయిదా రూపకల్పనలో ఉన్నప్పటికీ ఇండియన్ యూనియన్లో చేరడానికి ‘ససేమిరా’ అంటున్న ‘స్వదేశ సంస్థానాల’కు (ప్రిన్స్లీ స్టేట్స్) ముగుదాడు వేయడం కష్టసాధ్యంగా ఉన్న రోజులవి. ఆ సమయంలో రాజ్యాంగ నిర్ణయసభ ఈ ‘అధి కరణ-3’ ద్వారా కేంద్ర ప్రభుత్వ / పార్లమెంటు అధికారా లను పటిష్టం చేయాల్సివచ్చింది. తద్వారా సంస్థానాలను దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం యూనియన్లో విలీనం చేయక తప్పలేదు. కాని కాంగ్రెస్ ప్రభుత్వాలూ, బీజేపీ ప్రభుత్వం, వాటి సంకీర్ణ మంత్రివర్గాలూ ఈ అధి కరణను ‘వాటం’గా తీసుకుని భాషాప్రయుక్త ప్రాతిపది కపైన, రాష్ట్రాల తొలి పునర్వ్యవస్థీకరణ సంఘం సాను కూల సిఫారసులు ఆధారంగా ఏర్పడిన భాషా రాష్ట్రాలను సహితం తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఓట్లు- సీట్ల వేటలో భాగంగా చీల్చడానికి వాడుకుంటూ వచ్చాయి! అంతేగాదు, రాష్ట్రాల శాసనసభల అభీష్టాలతో, ఓటింగ్తో కూడా నిమిత్తం లేకుండా నిరంకుశంగా ‘అధికరణ-3’ను ఈ పాలక పక్షాలు వాడుకుని రాష్ట్రాల ఉనికిని అస్తవ్యస్తం చేయడానికి వెనుకాడటం లేదు. నిశ్చితాభిప్రాయానికి నీళ్లు 1955కు ముందున్న రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర పతి తన వద్దకు ఆమోదం కోసం ఏ బిల్లునైనా, సవరణ బిల్లునైనా పార్లమెంటు పంపించినప్పుడు సదరు బిల్లు వల్ల ‘అధికరణ-3’ కింద రాష్ట్రాలను, వాటి సరిహద్దులను చీల్చి, విడగొట్టడం వల్ల దెబ్బతినిపోయే రాష్ట్రాల శాసన సభల ‘నిశ్చితాభిప్రాయా’న్ని (‘ఎసర్టైన్డ్’) ఓటింగ్ ద్వారా ఆయన తెలుసుకోవాలని నిబంధన ఉంది. కాని ఆ తర్వా త కాంగ్రెస్ ప్రభుత్వం 1955 డిసెంబర్ 24న బ్రూట్ మెజారిటీతో రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పదాన్ని తొల గించి, దాని స్థానంలో శాసనసభకు రాష్ట్రపతి కేవలం ‘రిఫర్’ చేస్తే చాలునని, ఓటింగ్ అవసరం లేదనీ శాసిం చింది! ఇదే తెలుగుజాతి ఉనికికే ప్రమాదకారంగా తయాై రెంది. రాజ్యాంగంలోని 368 అధికరణ రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు సంక్రమింపచేయగా లేనిది, ఫెడరల్ వ్యవస్థలో భాషా రాష్ట్రాల అస్తిత్వాన్ని, ఉనికినీ ‘విభజించి - పాలించే’ దుర్నీతికి చోటు కల్పిస్తున్న ‘అధికరణ-3’ను పార్లమెంటు ఎందుకు సవరించలేదు? ఆనాడే ప్రశ్నించిన పెద్దలు 1948-49 నాటి రాజ్యాంగ నిర్ణయ సభా చర్చల సంద ర్భంగా రాజ్యాంగ ముసాయిదా రచనా సంఘం అధ్య క్షుడైన డా.అంబేద్కర్ సహితం రాష్ట్రాల ఉనికిని, వాటి సరిహద్దుల్నీ లేదా వాటి పేర్లను చెదరగొట్టి కొత్త రాష్ట్రాల నిర్మాణం తలపెట్టేటప్పుడు ఇబ్బందుల పాలయ్యే సంబం ధిత రాష్ట్రాలతో విధిగా సంప్రతించాలని ముందుగా వాటి అనుమతిని పొందాలనీ (‘కన్సెంట్’) స్పష్టం చేశారు! ఆయనే కాదు, ఆ నాటి సభా చర్చలో పాల్గొన్న ప్రొఫెసర్ కె.టి.షా, సంతానం, హెచ్వీ పటాస్కర్ లాంటి ఉద్దం డులు కూడా రాష్ట్ర శాసనసభ అనుమతి తప్పనిసరి అనీ, ఈ విషయం ‘అధికరణ-3’ తొలి పాఠంలోనే ఉందనీ, దురదృష్టవశాత్తు ఆ అంశాన్ని ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పాలనీ ఘాటుగా ప్రశ్నించారు! ఆ మాట కొస్తే రాష్ట్రపతి కూడా రాజ్యాంగం ఒకటవ విభాగంలోని (పార్ట్-1) రాష్ట్రాల శాసనసభల ‘నిశ్చితాభిప్రాయాల’ను తెలుసుకున్నారనీ, అలాగే రాజ్యాంగం మూడవ విభాగం లోని (పార్ట్-3) రాష్ట్రాలకు సంబంధిత ఇబ్బందులున్న సందర్భాలలోనూ ‘శాసనసభల అనుమతిని పొందార’నీ పటాస్కర్ వెల్లడించారు! కాని కాంగ్రెస్ ఒత్తిడి వల్ల మూడవ విభాగంలోని రాష్ట్రాల అనుమతిని రాష్ట్రపతి పొంద వలసిన అవసరం లేదంటూ అధికార పూర్వక సవరణను చొప్పించారని కూడా ఆయన వివరించారు. ఫలితంగా ఓటింగ్తో నిమిత్తం లేకుండా కేవలం రాష్ట్రాల అభిప్రాయా లను తెలుసుకుని వదిలేయాలన్నదే అధికారిక సవరణ సారాంశమనీ పటాస్కర్ చెప్పారు! కనుకనే, సంబంధిత లెజిస్లేటర్లు అందరూ మూకుమ్మడిగా ఓటు చేయడం ద్వారానే రాష్ట్రాల అక్రమ విభజనను అడ్డుకోగలుగుతారని ఆయన స్పష్టం చేశారు. (1949 అక్టోబర్ 13: రాజ్యాంగ నిర్ణయ సభ చర్చలు: సంపుటి7: పేజీ: 211-212) కనుమరుగవుతుందనే... మూడవ అధికరణ కాలక్రమంలో నిర్జీవమైనదిగా (డెడ్ లెటర్) మిగిలిపోవచ్చునని పటాస్కర్ ప్రభృతులు ఆశిం చారు గాని, అది ‘ఉత్తిమాట’ అని అనంతరం కాంగ్రెస్, బీజేపీ పాలక పక్షాలు ఆచరణలో నిరూపించాయి! కాని పటాస్కర్ ప్రసంగం ఆఖర్లో చేసిన వ్యాఖ్య నేటి మన పరిస్థితుల్లో భవిష్యత్ వాణిగా చెప్పుకోక తప్పదు: ‘‘రాబోయే రోజుల్లో ఈ నూతన రాజ్యాంగం కింద, ‘అధి కరణ-3’ ప్రొవిజన్స్ కింద దేశానికి మరిన్ని కష్టాలు ఎదు రవుతాయి’ (‘దేర్ విల్ బి మోర్ డిఫికల్టీస్ అండర్ ది న్యూ కానిస్టిట్యూషన్ అండ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్-3)! అలాగే, రాజ్యాంగంలోని 2, 3, 4 అధికరణలను కేంద్ర పాలకులు పార్లమెంటులో బ్రూట్ మెజారిటీ ‘తెర’ చాటున అనేక సందర్భాల్లో దుర్వినియోగం చేస్తున్న ఉదంతాన్ని సుప్రీంకోర్టు కూడా గతంలో ఉదహరించింది. అధికరణలు (2), (3) గురించి వ్యాఖ్యానిస్తూ సుప్రీం కోర్టు (1993) ఈ ‘అధికరణల కింద పార్లమెంటుకు సంక్ర మించిన అధికారం భారత రాజ్యాంగ సూత్రాలకు లోబడి ఉండాలి, పార్లమెంటు విధించగోరే షరతులు పరస్పరం విరుద్ధంగా ఉండకూడదు, రాజ్యాంగ ప్రక్రియనే పక్కదా రులు పట్టించేదిగా ఉండకూడదు అని చెప్పింది! అంతే గాదు, రాజ్యాంగ ప్రక్రియను పార్లమెంటు అతిక్రమించ కూడదు. ఒక చట్టం రాజ్యాంగం అనుమతించదగిన పరి మితులను దాటి వెడితే ఆ చట్ట సామంజస్యాన్నే ప్రశ్నించ వచ్చునని కూడా సుప్రీం స్పష్టం చేసింది! ‘మూడు’ను సవరించాలి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 371(డి) రాజ్యాంగ సవరణాధికరణను ‘సవరించడం తేలికే’నని కొందరు ‘మేధావులు’ భ్రమలు కొల్పారు కూడా! అదేమంటే, ఆ అధికరణలోనే వేరుపడే తెలుగు ప్రాంతం పేరును కూడా చేర్చుతూ సవరిస్తే సరి పోతుందని మరికొందరి ఉచిత సలహా! ఇది కుదరదని తెలుసుకున్న తర్వాత, పోనీలే 371(డి) అధికరణను యథాతథంగా ఉంచినా చాలునని రాజీపూర్వక సంతృప్తి! అందువల్ల ‘అధికరణ-3’ను కేంద్రంలోని పాలకపక్షాలు స్వార్థ ప్రయోజనాల కోసం తరచుగా ‘తురుపు’గా ఉప యోగించకుండా ఉండాలంటే, రాష్ట్రాల శాసనసభల ప్రభు త్వాల పరిపూర్ణ అనుమతితో తప్ప ఆ అధికరణను వాడరా దని స్పష్టం చేస్తూ విధిగా సవరించాల్సి ఉంది. విశ్లేషణ: ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు