JD Chakravarthy
-
యాక్షన్... థ్రిల్
జెడీ చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాతస్య మరణం ధ్రువం’. శ్రవణ్ జొన్నాడ దర్శకత్వం వహించారు. ‘తమ్ముడు, నరసింహనాయుడు, అధిపతి’ చిత్రాల్లో నటించిన ప్రీతీ జంగియాని ‘జాతస్య మరణం ధ్రువం’తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్ని లాంచ్ చేశారు.‘‘యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రమిది. ‘జాతస్య మరణం ధ్రువం’ అన్నది ఒక సంస్కృత పద బంధం. ‘పుట్టినవారికి మరణం తప్పదు’ అని అర్థం. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తాం’’ అని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, రాజ్ ఆషూ, కెమెరా: అర్జున్ రాజా. -
‘బాలస్వామిని బంగారు అయ్యప్ప పాట’ బాగుంది: జేడీ చక్రవర్తి
‘బాలస్వామిని బంగారు అయ్యప్ప పాట’ పాట య్యూటూబ్లో దూసుకెళ్తోంది. ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ పాట నక్షత్ర స్టూడియో ద్వారా రిలీజ్ అయి సోషల్ మీడియా లో 25 మిలియన్స్ పైగా వ్యూస్ సంపాదించుకుంది. ఈ సందర్భంగా నక్షత్ర మీడియా ఛైర్మన్ రాజశేఖర్ పాటను రాసిన పరమేశ్, నటించిన చిన్నారి తన్వికితో పాటు సంగీత దర్శకుకు సత్యదీప్, కొరియోగ్రాఫర్ హరికాంత్ రెడ్డికి సన్మానం చేశారు. ఆస్ బెస్టాస్ కాలనీ లోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో జరిగిన ఈ వేడుకకి మాన్లీ స్టార్ జె.డి.చక్రవర్తి అతిథిగా విచ్చేసి టీమ్ని సత్కరించారు. ‘మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి ఎంకరేజ్ చేస్తూ వారికంటూ ఓ ప్లాట్ పామ్ క్రియేట్ చేసినందుకు నక్షత్ర మీడియా అధినేత రాజశేఖర్, యాంకర్ గంగకు మనస్ఫుర్తిగా అభినందనలు తెలియజేస్తూ పాటను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’అని చక్రవర్తి అన్నారు. -
'ఇద్దరు' సినిమా రివ్యూ
ఒకప్పుడు తెలుగులో నటించిన అర్జున్, జేడీ చక్రవర్తి చాలా ఏళ్ల క్రితం 'ఇద్దరు' అనే సినిమాలో హీరోలుగా నటించారు. ఇప్పుడు ఈ మూవీ తెలుగు వెర్షన్ థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అర్జున్ ఓ మల్టీ మిలియనీర్. ఈయన కంపెనీలో జేడీ చక్రవర్తి ఉద్యోగిగా చేరతాడు. రాత్రి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలనేది ఇతడి ఆశ. ఈ క్రమంలో తన బాస్ అర్జున్పై ఒక అమ్మాయితో హనీట్రాప్ చేయాలని చూస్తాడు. ఇది గ్రహించిన అర్జున్.. దానికి పై ఎత్తు వేస్తాడు. ఆ తర్వాత ఏమేం జరిగిందనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: అరెస్ట్ న్యూస్.. వీడియో రిలీజ్ చేసిన బిగ్ బాస్ శేఖర్ భాషా)ఎలా ఉందంటే?ఇద్దరు తెలివైన వ్యక్తుల.. ఒకరిపై మరొకరు ఎత్తుకు పై ఎత్తుల వేస్తే ఏమవుతుంది అనే కాన్సెప్ట్తో తీసిన సినిమా 'ఇద్దరు'. వేల కోట్లకు అధిపతి అయిన అర్జున్ని హానీ ట్రాప్ చేసి కోటీశ్వరుడు కావాలనుకునే ఉద్యోగిగా జేడీ చక్రవర్తి కనిపించాడు. అతని ఎత్తులను పసికట్టి అతని ఎత్తులకు పై ఎత్తులు వేయడం.. ఇలా సినిమా మొత్తం ట్విస్టులో బాగానే తీశారు. దర్శకుడు పర్లేదనిపించాడు. అక్కడక్కడ బోర్ కొట్టించినా.. కమర్షియల్ అంశాలు బాగానే దట్టించారు.ఎవరెలా చేశారు?అర్జున్, జేడీ తమ పాత్రలకు న్యాయం చేసారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ కూడా ఓకే ఓకే. మిగిలిన విభాగాల వాళ్లు తమ తమ పని సక్రమంగా నిర్వర్తించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కార్తీ 'సత్యం సుందరం' మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) -
పోటాపోటీ యాక్షన్
అర్జున్, జేడీ చక్రవర్తి లీడ్ రోల్స్లో నటించిన కన్నడ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ ‘ఒప్పంద: కాంట్రాక్ట్’. ఈ చిత్రంలో రాధికా కుమార స్వామి, సోనీ చరిష్ఠ హీరోయిన్లుగా నటించారు. ఎస్ఎస్ సమీర్ దర్శకత్వంలో డీఎస్ రెడ్డి సమర్పణలో మహమ్మద్ ఫర్హీన్ ఫాతిమా నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ‘ఇద్దరు’ పేరుతో రేపు విడుదల కానుంది.ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో సమీర్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో అర్జున్, చక్రవర్తిగార్లు పోటాపోటీగా నటించారు. కళాతపస్వి కె. విశ్వనాథ్గారు, ఆమిర్ ఖాన్ తమ్ముడు ఫైజల్ ఖాన్ కూడా నటించారు. మా సినిమాని ప్రేక్షకులు సక్సెస్ చేయాలి’’ అని అన్నారు. -
'రుధిరాక్ష' కోసం ఏకమైన ఆది సాయికుమార్, జేడీ చక్రవర్తి
ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు ఆది సాయికుమార్. తాజాగా ఈ యంగ్ హీరో మరో కొత్త సినిమా ‘రుధిరాక్ష’ను కూడా పట్టాలెక్కించాడు. ఇందులో వెర్సటైల్ యాక్టర్స్ జె.డి చక్రవర్తి, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శివ శంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 9 స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై శివ శంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. డార్క్, థ్రిల్లర్ నేపధ్యంలో రూపొందనున్న ఈ చిత్రానికి సంబధించిన పూజా కార్యక్రమం రామానాయడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి సముద్రఖని క్లాప్ కొట్టగా రామ్ తాళ్లూరి కెమరా స్విచాన్ చేశారు. ఫస్ట్ షాట్ కు డైరెక్టర్ దేవ్ దర్శకత్వం వహించారు. హై బడ్జెట్, టాప్ టెక్నికల్ వాల్యూస్ తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. 'యానిమల్' ఫేం హర్షవర్షన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కిశోర్ బోయిదాపు డీవోపీ గా పని చేస్తున్న ఈ చిత్రానికి విజయ్ కృష్ణ ఆర్ట్ డైరెక్టర్. పవన్ హిమాన్షు, బాలు మహేంద్ర మాటలు అందిస్తున్నారు. -
ఆ డైరెక్టర్ మూవీలో జేడీ చక్రవర్తి.. ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్!
మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణించి ఆ తరువాత కథానాయకిగా అయిన నటి ఐశ్వర్యా రాజేశ్. హీరోయిన్ అయిన చాలా తక్కువ కాలంలోనే లేడీ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలే నటిగా ఎదిగిన ఈమె ఇటీవల టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కాగా పాత్రల ఎంపికలో తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు. అలా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఐశ్వర్య రాజేశ్.. తాజాగా గోపీ నయినార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. (ఇది చదవండి: మొన్న ఐటం సాంగ్.. ఇప్పుడు సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్) ఈ దర్శకుడు ఇంతకు ముందే నయనతార ప్రధాన పాత్రలో నటించిన అరమ్ అనే సక్సెస్పుల్ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా తయన తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటుడు జయ్ కథా నాయకుడిగా నటిస్తున్నారు. నటుడు జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటిస్తోన్న.. ఈ చిత్రంలో నటి ఈశ్వరీరావు, జాన్విజయ్, సుబ్బు పంజు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కేఎస్.ప్రసాద్ సంగీతమందిస్తుండగా.. ఈ చిత్రాన్ని ఏజీఎల్ పతాకంపై ఆర్.రమేశ్ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి కరుప్పర్ నగరం అనే టైటిల్ను నిర్ణయించారు. ఈ టైటిల్ పేరును దర్శకుడు వెంకట్ప్రభు ట్విటర్ ద్వారా విడుదల చేసి చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. (ఇది చదవండి: Oppenheimer Movie Review: ఓపెన్హైమర్ సినిమా రివ్యూ) Happy to release #GopiNainar 's next flick title #KarupparNagaram starring my Thambi @Actor_Jai @aishu_dil #JDChakravarthy. Best wishes to the whole Team 🎉 Prod by R Ramesh's @RrFilmmakers & Hemant Raj 's #AGL @ThenandalFilms @venkate25571670 #EswariRao #JohnVijay… pic.twitter.com/MF2kqxPPfI — venkat prabhu (@vp_offl) November 7, 2023 -
జేడీ చక్రవర్తి మళ్లీ.. ఈసారి ఏకంగా!
జేడీ చక్రవర్తి నటించి, స్వీయ దర్శకత్వం వహించిన ద్విభాషా (కన్నడ, తెలుగు) చిత్రం ‘హూ’. ఇందులో శుభరక్ష, నిత్య హీరోయిన్లు. రెడ్డమ్మ కే బాలాజీ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో చిత్ర యూనిట్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ సినిమా ట్రైలర్ను నిర్మాత ప్రసన్న కుమార్, నటుడు నాగమహేశ్లు కలిసి విడుదల చేశారు. నిర్మాతలు ఆచంట గోపీనాథ్, శోభారాణి, చాంబర్ వైస్ ప్రెసిడెంట్ కొల్లి రామకృష్ణ ‘హూ’ సినిమా కొత్త ΄ోస్టర్ను విడుదల చేశారు. ‘‘ఎమోషనల్ థ్రిల్లర్గా సాగే ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి నటన వైవిధ్యంగా ఉంటుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని రెడ్డమ్మ కే బాలాజీ అన్నారు. -
వైజాగ్..నా కెరీర్ని మార్చేసింది: జేడీ చక్రవర్తి
మద్దిలపాలెం (విశాఖతూర్పు): ‘నా సినీ జీవితాన్ని మలుపు తిప్పింది వైజాగ్. నా చిత్రాలకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులు విశాఖ వాళ్లే. అందుకే వైజాగ్ అంటే ప్రాణం. ఇది నా లక్కీ సిటీ అని ప్రముఖ హీరో జేడీ చక్రవర్తి అన్నారు. ‘దయ’తో ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్సిరీస్లో తొలిసారిగా నటించానన్నారు. విశాఖ వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే.. ‘గులాబి’తో స్టార్ స్టేటస్ కృష్ణవంశీ తెరకెక్కించిన గులాబి చిత్రంతో స్టార్ స్టేటస్ లభించింది. ఈ చిత్రం విశాఖలో చిత్రీకరణ జరుపుకుంది. మేఘాలలో తేలిపోమన్నది పాట చిత్రీకరణ పాడేరు కాఫీతోటల సమీపంలో చిత్రీకరించామని, ఆ పాట ఎప్పుడు విన్నా ఈ ప్రాంతం గుర్తుకు వస్తుందన్నారు. దాదాపు ఈ చిత్రమంతా వైజాగ్ పరిసరాల్లో షూటింగ్ జరిపామన్నారు. గులాబి నా సినీ జీవితాన్ని మలుపు తిప్పిందన్నారు. వైజాగ్ అంటే ప్రాణం విశాఖ ప్రేక్షకులు సినిమాలను విశేషంగా ఆదరిస్తారని, ఇక్కడ టాక్ బాగుంటే ఆ సినిమా సూపర్ హిట్టే. తాను నటించిన గులాబి, సత్య సూపర్ హిట్ చేశారని, తొలిసారిగా నటించిన ‘దయ’ వెబ్ సిరీస్ను కూడా ఆదరించాలని కోరారు. దయ ప్రమోషన్ ఇక్కడ నుంచే.. దయ వెబ్ సిరీస్ ప్రమోషన్ నా లక్కీ సిటీ వైజాగ్ నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉంది. డిస్నీప్లస్ హాట్స్టార్లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ దర్శకుడు పవన్ సాధినేని రూపొందించిన ఈ వెబ్ సిరీస్ను 24 గంటల్లోనే ట్రెండింగ్లో నిలిచింది. ఇక్కడ వాళ్లు దయ చూశామని, చాలా బాగుందని చెబుతుండడం ఆనందంగా ఉంది. ఇది నా సెకెండ్ ఇన్నింగ్స్కు శుభసూచికంగా భావిస్తున్నా. మూడు భాషల్లో వెబ్ సిరీస్లో నటిస్తున్నా.. ప్రస్తుతానికి రెండు హిందీ, ఒక తెలుగు, తమిళ వెబ్ సిరీస్లో నటిస్తున్నాను. అలాగే మూడు చిత్రాల్లో నటిస్తున్నా. వాటిలో రెండు తెలుగు చిత్రాలు కాగా, ఒకటి తమిళ చిత్రం. రాజకీయాలకు దూరం రాజకీయాలంటే ఆసక్తే కాని, ప్రత్యక్షంగా ఆ రంగంలోకి వచ్చే ఆలోచనే లేదు. ప్రస్తుతం మంచి చిత్రాలతో అభిమానులను అలరించాలన్నదే నా లక్ష్యం. ఆర్జీవీ నా గురువు రాంగోపాల్ వర్మ నాకు గురువు. చాలా మంది రామూ మీ ఫ్రెండ్ కదా అంటుంటారు. ఆయన జీనియస్..ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. దయ వెబ్ సిరీస్ చూసి ఆదరించండి. చక్కని థ్రిల్ కలిగించే క్రైమ్ వెబ్ సిరీస్. మంచి స్క్రీన్ప్లేతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది. -
విశాఖపట్నంలో సందడి చేసిన జేడీ చక్రవర్తి (ఫొటోలు)
-
'ఇది నాకు చాలా ప్రత్యేకం'.. జేడీ చక్రవర్తి ఆసక్తికర కామెంట్స్!
సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య , విష్ణుప్రియ, కమల్ కామరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ దయా. ఉత్కంఠ భరితమైన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆగస్ట్ 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్తో ఓటీటీ అరంగేట్రం చేసిన జేడీ చక్రవర్తి వైజాగ్లో సందడి చేశారు. ఈ సందర్భంగా డిస్నీ+ హాట్స్టార్ నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ అభిమానులతో సరదాగా ముచ్చటించారు. (ఇది చదవండి: 'ఆరు నెలల పాటు సినిమాలు వదిలేశా '.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) జేడీ మాట్లాడుతూ.. 'డిస్నీ ప్లస్ హాట్స్టార్ కుటుంబంలో భాగమైనందుకు నేను చాలా ఆనందంగా ఉన్నా. ఈ క్రైమ్ థ్రిల్లర్ నాకు చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే నాకు సవాళ్లు అంటే చాలా ఇష్టం. ప్రతి పాత్రతో నన్ను సవాలు చేసుకోవడం, తిరిగి ఆవిష్కరించుకోవడం చేస్తుంటాను. ఈ సిరీస్లో నాకు అది దక్కింది.' అని అన్నారు. ఈ కార్యక్రమంలో, జేడీ చక్రవర్తి ప్రేక్షకులతో ఆప్యాయంగా పలకరించారు. తన పాత్రపై అభిమానుల్లో ఉన్నా సందేహాలను సమాధానాలిచ్చారు. ఆ తర్వాత అభిమానులతో సెల్ఫీలు దిగారు. (ఇది చదవండి: 'ఎవరితోనైనా కమిట్ అయితేనే అలా..' బుల్లితెర నటిపై దారుణ కామెంట్స్!) -
దయా వెబ్ సిరీస్ టీమ్ తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
బాలీవుడ్ నాకు పొరుగు ఇల్లు లాంటిది: జేడీ చక్రవర్తి
బాలీవుడ్నాకు పొరుగు ఇల్లు లాంటిది. అందుకే కొంతకాలం అటువైపు వెళ్లి వచ్చా. నా బలం మాత్రం ఎప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమనే’ అని సీనియర్ హీరో జేడీ చక్రవర్తి అన్నారు. జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘దయా’.పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ఆగస్ట్ 4నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్క్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో జేడీ చక్రవర్తి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► కంటెంట్ ఈజ్ ది ప్రిన్స్, డైరెక్టర్ ఈజ్ కింగ్ అని నమ్మే నటుడిని నేను. దయా అనే కథను దర్శకుడు పవన్ సాధినేని చెప్పిన విధానం ఆకట్టుకుంది. అందుకే ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు అంగీకరించాను. కథ మనకున్న స్థలం లాంటిదైతే..అందులో అందమైన ఇళ్లు కట్టడం డైరెక్షన్ లాంటిది. సినిమా అనే సౌధాన్ని అందంగా నిర్మించడం దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. ► ఏ దర్శకుడైనా పది నిమిషాల్లో కథ చెప్పగలిగితే అతనికి ఆ స్క్రిప్ట్ మీద కమాండ్ ఉన్నట్లు అని ఆర్జీవీ అనేవారు. పవన్ ఫోన్ లో 10 మినిట్స్ స్టోరీ చెప్పినప్పుడే అతనికి కథ మీద ఉన్న పట్టు తెలిసింది. దాంతో ఫుల్ నెరేషన్ వినకుండానే ఓకే చెప్పాను. ► దయా వెబ్ సిరీస్ కు దర్శకుడు పవన్ పెద్ద బలం. ఇందులో క్యారెక్టర్స్ ఒక స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. ప్రతి క్యారెక్టర్ యూనిక్ గా ఉంటుంది. నటీనటులకు గుర్తింపు తెచ్చే పాత్రలు ఇందులో ఉంటాయి. నా మొదటి సినిమా శివతోనే నేను జేడీ అయిపోయా. అలాగే బాహుబలిలో సత్యరాజ్ ను కట్టప్పగానే గుర్తుంచుకుంటాం. ఇలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్న వెబ్ సిరీస్ దయా. లొకేషన్స్, క్యారెక్టర్స్, స్క్రిప్ట్ అన్నీ బాగా కుదిరిన సిరీస్ ఇది. ► దయాలో నేను ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ ను. చేపలను ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్లడం నా పని. దయా వరల్డ్ ను ప్రారంభం నుంచీ 10, 12 నిమిషాల పాటు ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాడు. ఆ ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ కు ఒకరోజు అమ్మాయి శవం కనిపిస్తుంది. పోలీసులకు చెప్పేంత ధైర్యం అతనిలో ఉండదు. ఈ భయంలో ఉండగానే ఇంకో శవం దొరుకుతుంది. సాదాసీదా జీవితం గడిపే ఆ డ్రైవర్ జీవితాన్ని ఈ ఘటనలు మలుపుతిప్పుతాయి. ఆ ఎమోషన్స్ అన్నీ దయాలో చూస్తారు. ► ఓటీటీలో స్టార్ డమ్ ను కౌంట్ చేయలేము అనడం సరికాదు. సినిమా ఎంత సక్సెస్ అయ్యింది అనేందుకు థియేటర్ లో మనకు కలెక్షన్స్ లెక్కిస్తాం. కానీ ఓటీటీలో ఎంతమంది చూశారు అనేది కొలమానం. కథను సినిమాలో కంటే విస్తృతంగా చెప్పేందుకు వెబ్ సిరీస్ బాగా ఉపయోగపడుతుంది. వెబ్ సిరీస్ లో కొత్త వాళ్లకూ ఆదరణ దక్కుతుంది. వాళ్లనూ రిసీవ్ చేసుకుంటారు. కానీ థియేటర్ లో స్టార్స్ సినిమాలకు మాత్రమే బయ్యర్స్ ఉంటారు. ఇది ఓటీటీకున్న అడ్వాంటేజ్. నేను జేడీ చక్రవర్తి కాకుండా కొత్త నటుడిగా దయాలో చూస్తారు. -
మందు,సిగరెట్,నాన్ వెజ్ తీసుకోక పోవడానికి కారణం ఒక్కటే
-
JD Chakravarthy: షూటింగ్ లో నేను మేకప్ వేసుకోకుండా ఏం చేస్తా అంటే..!
-
జెడి చక్రవర్తితో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
ఎవరు?
నటుడు, దర్శక–నిర్మాత జేడీ చక్రవర్తి స్వీయ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో తీసిన తాజా చిత్రం ‘హూ’. ఇందులో శుభరక్ష, నిత్య హీరోయిన్స్ గా నటించారు. రెడ్డెమ్మ బాలాజీ.కె నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా రెడ్డెమ్మ బాలాజీ.కె మాట్లాడుతూ–‘‘ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘హూ’. ఈ మూవీలో జేడీ చక్రవర్తి నటన చాలా వైవిధ్యంగా ఉంటుంది’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: ఈశ్వర్ చంద్. -
‘ఇద్దరు’ విజయం సాధించాలి
అర్జున్ సర్జా, రాధిక కుమారస్వామి, జె.డి చక్రవర్తి, ఫైజల్ ఖాన్ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘ఇద్దరు’. ఎఫ్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.ఎస్.రెడ్డి సమర్పణలో ఫర్హీన్ ఫాతిమా నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ సమీర్ దర్శకుడు. ఈ నెల 7న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్లో జరిగింది. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర సక్సెస్ కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘‘అర్జున్ మంచి నటుడు. విలక్షణమైన పాత్రలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. జె.డి.చక్రవర్తికి సినిమా అంటే ప్యాషన్. వీరిద్దరూ కలిసి నటించిన ఈ చిత్రం హిట్ కావాలి. సమీర్ కష్టపడే తత్వం గలవాడు. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. త్వరలోనే అతను బాలీవుడ్లో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. చిన్న సినిమాలు ఆడితేనే పరిశ్రమ బావుంటుంది’ అని అన్నారు. ‘ఈ సినిమా ట్రైలర్ చూశా. ఆసక్తికరంగా ఉంది. మున్ముందు కూడా ఇలాంటి సందేశాత్మక చిత్రాలు రావాలి’ అని తీన్మార్ మల్లన్న అన్నారు. ‘యాక్షన్తోపాటు చక్కని వినోదాన్ని పంచే సినిమా ఇది’అని దర్శకుడు ఎస్ ఎస్ సమీర్ అన్నారు. ‘చాలా కష్టం పడి సినిమా పూర్తి చేశాం. సినిమాలో హీరో ఎవరు, విలన్ ఎవరు అనేది చివరి వరకూ గెస్ చేయలేరు. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది’ అని నిర్మాత ఫర్హీన్ ఫాతిమా అన్నారు. నటుడు సమీర్, క్కుమార్, కరాటే లక్ష్మీ తదితరులతోపాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. -
ఆర్జీవీలోని విలక్షణతకు ఈ చిత్రం నిదర్శనం
ఆర్జీవీ.. రాం గోపాల్ వర్మ. సంచలనాలను, వివాదాలకు, అన్నింటికి మించి బోల్డ్కు కేరాఫ్. ఈ మధ్యకాలంలో వర్మ సినిమాల ఆడడం మాట ఏమోగానీ.. కెరీర్ తొలినాళ్లలో ఆయన ప్రదర్శించిన విలక్షణతను మరే దర్శకుడు కనబర్చలేదన్నది ఒప్పుకోవాల్సిన విషయం. అప్పటిదాకా మూస ధోరణితో సాగిపోతున్న కమర్షియల్ సినిమాకు సత్య అనే గ్యాంగ్స్టర్ అనే డ్రామాను అందించి బాలీవుడ్లో ఓ కొత్త ఒరవడిని సృష్టించడమే కాదు.. ఆ రియలిస్టిక్ సబ్జెక్టుతోనూ సంచలన విజయం అందుకున్నారాయన. 🎥 రియల్ ఇన్సిడెంట్స్ను బేస్ చేసుకుని వర్మ చేసిన తొలి గొప్ప ప్రయత్నంగా సత్యను అభివర్ణిస్తుంటారు చాలామంది సినీ క్రిటిక్స్. అప్పటికే పదిదాకా సినిమాలు తీసిన అనుభవం.. మంచి సక్సెస్ రేటు అందుకున్న ఘనత కూడా ఉంది. అయితే.. బాలీవుడ్కు పెద్దగా పరిచయం ఉండని కొత్త ముఖాలతోనే సినిమా తీయాలనుకున్న వర్మ.. జేడీ చక్రవర్తిని గా తీసుకున్నారు. ఉర్మిళ హీరోయిన్ కాగా.. మనోజ్ బాజ్పాయితో పాటు సౌరభ్ శుక్లా లాంటి మెథడ్ యాక్టర్లు ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. అలాగే సీఐడీ ఫేమ్ ఆదిత్యా శ్రీవాస్తవ, తెలుగు నటుడు బెనర్జీకి మంచి గుర్తింపు దక్కింది. 🎥 ఓ కంప్లీట్ యాక్షన్ సినిమా తీయాలనుకున్న వర్మ.. కొందరు రియల్ క్రిమినల్స్ను కలుసుకున్నాక తన ఆలోచన మార్చేసుకున్నారట. అలా వాస్తవ జీవితాల నుంచి పుట్టిందే సత్య కథ. అలాగని సత్య కథ అల్లింది వర్మ కాదు. అందులో కల్లుమామ పాత్రధారి సౌరభ్ శుక్లా, అనురాగ్ కశ్యప్లు రైటర్లు. అంతకు మించి.. పల్లెటూరి నుంచి ఉద్యోగం కోసం ముంబైకి వచ్చి.. అక్కడి నుంచి అండర్ వరల్డ్ ప్రపంచంలోకి అడుగుపెట్టి తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకునే సత్యది. 🎥 కోటి కలలతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టే సత్యకు భీకూతో స్నేహం, విద్యతో ప్రేమ బంధం.. మాఫియా మేఘాలు అలుముకుని చివరకు విషాద ముగింపు తీసుకోవడం.. ఇలా చాలా రియల్స్టిక్గా వర్మ చూపించిన విధానాన్ని ఆడియొన్స్ ఆదరించారు. 🎥 వాస్తవానికి.. కొత్త వాళ్లతో సినిమా వర్మ అనౌన్స్ చేయగానే చాలామంది ఆశ్చర్యపోయారట. అందుకు తగ్గట్లే.. సినిమా షూటింగ్ మొదలైన మూడు రోజులకే కొన్ని కారణాల వలన ఆగిపోయిందట. నిజానికి ఈ సినిమాలో సాంగ్స్ లేకుండా ప్లాన్ చేశారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి కారణంగా వర్మ, విశాల్ భరద్వాజ్, సందీప్ చౌతలతో(బ్యాక్గ్రౌండ్ స్కోర్) మ్యూజిక్ కంపోజ్ చేయించాడు. Video Credits: Mango Music 🎥 రెండున్నర కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం.. 1998 జులై 3వ తేదీన విడుదల అయ్యింది. ఐదు రెట్ల కలెక్షన్ల వసూలుతో భాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడంతో పాటు.. 1998లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల జాబితాలో నిలిచింది కూడా. 🎥 వర్మలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన సత్య.. ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు ఓ జాతీయ అవార్డును సైతం దక్కించుకుంది. మనోజ్ బాజ్పాయికి నేషనల్ అవార్డు దక్కింది. 🎥 మొత్తంగా వర్మ కెరీర్లో ఓ ప్రత్యేకమైన సినిమాగా.. కల్ట్ హోదాను దక్కించుకుని భారతీయ చలన చిత్ర రంగంలో గొప్ప చిత్రాల జాబితాలో ఒకటిగా నిలిచింది. 🎥 2008 ఆస్కార్ అవార్డు అందుకున్న స్లమ్డాగ్ మిలీయనీర్ చిత్రానికి సత్య ఒక స్ఫూర్తి. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు డానీ బోయల్ స్వయంగా చెప్పాడు. సత్య సినిమా షూటింగ్ మూడో రోజు విన్న ఒక వార్త బాధాకరంగా అనిపించింది. టీ సిరీస్ గుల్షన్ కుమార్ను కాల్చి చంపారనే వార్త. ఆ తర్వాత అండర్వరల్డ్పై సినిమా తీయొద్దంటూ మా మీద ఒత్తిడి పెరిగింది. ఆ పరిణామం ఒకవైపు ఇబ్బందికరంగా, మరోవైపు బాధగా అనిపించింది. కానీ, వర్మ అనుకున్నది ఓ పట్టాన వదిలే రకం కాదు. తనకు రైట్ అనిపిస్తే చేసేస్తాడంతే. అదే సమయంలో.. తాను అనుకున్నది అండర్వరల్డ్ను గొప్పగా చూపించడం కాదని వర్మ తేల్చేశాడు. ఇంకేం.. అలా మాఫియా ప్రపంచంలో ఉండే భావోద్వేగాల్ని ప్రధానంగా చేసుకుని కథ తెరకెక్కింది.. మంచి విజయం అందుకుంది: జేడీ చక్రవర్తి ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో.. -
టాలీవుడ్ యాంకర్తో పెళ్లి.. మా బంధం అలాంటిది: జేడీ చక్రవర్తి
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి జేడీ చక్రవర్తి. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే జేడీ ప్రస్తుతం ఓటీటీలో అలరిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అంతేకాకుండా ఇటీవల ఓషోలో యాంకర్ విష్ణుప్రియ జేడీ చక్రవర్తి అంటే తనకిష్టమని.. పెళ్లి చేసుకుంటానని చేసిన కామెంట్స్పై స్పందించారు. విష్ణుప్రియ అలా చెప్పడానికి గల కారణాన్ని వెల్లడించారు. ఇంతకీ పెళ్లి వార్తలపై జేడీ ఏమన్నారో చూద్దాం. (ఇది చదవండి: నా ఫస్ట్ క్రష్ అతనే.. యాంకర్ విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!) జేడీ చక్రవర్తి మాట్లాడుతూ..'తమ మధ్య మంచి అనుబంధం ఉంది. కానీ అది ప్రేమ కాదు. విష్ణుప్రియ చాలా మంచి అమ్మాయి. మేమిద్దరం కలిసి ఇటీవలే ఓ సిరీస్లో నటించాం. ఆ సిరీస్ కోసం దాదాపు 40 రోజులు కలిసి పని చేశాం. ఆ సిరీస్ దర్శకుడు ప్రతిరోజూ నేను నటించిన ఒక సినిమా చూడమని విష్ణుప్రియకు సూచించాడు.' అని అన్నారు. ఆ తర్వాత జేడీ ఆమె నేను నటించిన చిత్రాల్లోని పాత్రలతో మాత్రమే ప్రేమలో పడ్డారని తెలిపారు. అంతే తప్ప నాతో కాదు.. మాది గురు శిష్యుల అనుబంధంమని అన్నారు. కాగా.. ఇటీవల ఓషోలో పాల్గొన్న విష్ణుప్రియ జేడీ చక్రవర్తి ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే. ఇటీవలే 'గంగులు' అనే సాంగ్తో అభిమానులను పలకరించింది విష్ణుప్రియ. ఈ సాంగ్లో బిగ్ బాస్ ఫేమ్ మానస్తో కలిసి తన డ్యాన్స్తో అదరగొట్టింది. (ఇది చదవండి: తల్లిని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న విష్ణుప్రియ) -
నాపై 8 నెలలు విషప్రయోగం చేశారు: జేడీ చక్రవర్తి ఎమోషనల్
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి జేడీ చక్రవర్తి. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే ఇతడు ప్రస్తుతం ఓటీటీలోనూ అలరిస్తున్నాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. తనపై విషప్రయోగం జరిగిందన్న సంచలన విషయాన్ని సైతం వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. 'నాకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు. కానీ కొంతకాలం క్రితం నాకు ఉన్నట్టుండి శ్వాసకోస సమస్యలు వచ్చాయి. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఎంతో కష్టమయ్యేది. డాక్టర్లు చేతులెత్తేశారు.. ఎంతోమంది వైద్యులకు చూపించినా ఎవరికీ అంతు చిక్కలేదు. నేనేమో ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిపడుతూనే ఉన్నాను. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో చెక్ చేయించుకున్నా నా సమస్యకు పరిష్కారం దొరకలేదు. డాక్టర్లు నా పరిస్థితి చూసి కష్టమే అని చేతులెత్తేశారు. అప్పుడు నా స్నేహితుడు, నిర్మాత శేషు రెడ్డి నాకు అండగా నిలబడ్డాడు. డాక్టర్ నాగార్జున దగ్గరకు తీసుకెళ్లాడు. ఆయన నన్ను పరీక్షించి డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నావని అడిగాడు. నాకసలు డ్రగ్స్ అలవాటే లేదని చెప్పాను. కషాయం తాగినందుకు అస్వస్థత ఇక్కడ మీకో విషయం చెప్పాలి. నేను ఎడిటింగ్ చేస్తున్న రోజుల్లో ప్రతిరోజు కషాయం తాగేవాడిని. ఓసారి నాతో ఉండే నిర్మాత ఖాసీం తాను నా కషాయం తాగుతానన్నాడు. సరేనని ఇచ్చాను. ఆ కషాయం తాగినందుకు ఖాసీంకు రెండురోజులు తీవ్రమైన జ్వరం వచ్చి లేవలేకపోయాడు. ఇదే మాట నాకు కషాయాన్ని ఇచ్చే వ్యక్తికి చెప్పాను. చూశావా? నువ్విచ్చే కషాయాన్ని నేను ఎంత కష్టపడి తాగుతున్నానో అని! అతడు షాకైపోయాడు. 8 నెలలు విషప్రయోగం.. నీకోసం చేసిన కషాయాన్ని వేరేవాళ్లకు ఎందుకిచ్చావు? అని తిట్టాడు. మా మధ్య మాటల యుద్ధమే జరిగింది. చివరకు ఆస్పత్రిలో తేలిందేంటంటే నాకు 8 నెలలుగా స్లో పాయిజన్ ఇచ్చారు. నేను ఔషధం అని తాగుతున్నదే విషం. దానివల్లే శ్వాసకోస సమస్యలు వచ్చాయని తెలిసింది. ఖాసీంకు మందు తాగే అలవాటు ఉంది. అందుకే ఆ కషాయాన్ని అతడి శరీరం స్వీకరించలేకపోయింది. అందుకే అతడు వాంతులు చేసుకున్నాడు' అని చెప్పుకొచ్చాడు జేడీ చక్రవర్తి. అయితే విషప్రయోగం చేసిందెవరన్న విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. చదవండి: సినిమా రిలీజ్ తర్వాత ఆదిపురుష్ డైరెక్టర్ ట్వీట్.. వైరల్ -
రాము గారు చాలా గ్రేట్ ఎందుకంటే.. 10 లక్షలు అప్పు చేసి..
-
యాంకర్ తో జేడీ పులిహోర
-
ఆర్జీవీ నన్ను హీరోగా పెట్టి రమ్యకృష్ణతో సినిమా...
-
హీరోయిన్లందరినీ ట్రై చేశా.. జేడీ చక్రవర్తి బోల్డ్ కామెంట్స్
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు జేడీ చక్రవర్తి. మనీ మనీ , గులాబీ , బొంబాయి ప్రియుడు వంటి ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించిన జేడీ చక్రవర్తి ప్రస్తుతం హాట్ స్టార్లో ఓ ఒరిజినల్లో నటిస్తున్నారు. ఇందులో ఈషా రెబ్బా హీరోయిన్గా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్లో భాగంగా ఓంకార్ హోస్ట్గా చేస్తున్న ఓ షోకు జేడీ, ఈషా రెబ్బా హాజరై సందడి చేశారు. చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో ధనుష్.. షాకింగ్ లుక్ ఈ సందర్భంగా మీ కెరీర్లో ఏ హీరోయిన్ని అయినా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారా అని ఓంకార్ ప్రశ్నించగా జేడీ చక్రవర్తి అంతే బోల్డ్గా సమాధానం ఇచ్చారు. మా నాన్న మీద ఒట్టు అందరు హీరోయిన్లని ట్రై చేశా అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్గా మారింది. -
జేడీ చక్రవర్తి కి అంతర్జాతీయ అవార్డు
తెలుగు సినిమాలకు, నటీనటులకు ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ నటీనటులకు అంతర్జాతీయ అవార్డులు లభించాయి. తాజాగా సీనియర్ హీరో జేడీ చక్రవర్తిని మరో ఇంటర్నేషనల్ అవార్డు వరించింది. నైజీరియాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో జేడీ చక్రవర్తికి అవార్డు లభించింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో అవార్డు వచ్చింది. దహిణి ది విచ్ అనే సినిమాలోని నటనకు గానూ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు లభించింది. (చదవండి: మహిళల శరీరాలు ఎంతో విలువైనవి.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు) ఈ చిత్రం ఇది వరకు ఆస్ట్రేలియాలోనూ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా అవార్డును అందుకుంది. ఈ సినిమాకు రాజేష్ టచ్రివర్ దర్శకత్వం వహించారు. సునీతా కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తనిష్ట ఛటర్జీ, జేడీ చక్రవర్తి, శ్రుతి జయన్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు 18 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. -
ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఆమెను ఎవరైనా గుర్తుపట్టగలరా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు క్రేజ్ అంతా సులభంగా రాదు. ఒకవేళ వచ్చినా ఎక్కువ నిలబెట్టుకోవడం సవాల్తో కూడుకున్న పని. అలా చాలామంది కెరీర్ను మధ్యలోనే ఆపేసిన కథానాయికలు ఉన్నారు. ఇండస్ట్రీ నుంచి కనుమరుగైన టాలీవుడ్ స్టార్ నటీమణులు ఎందరో ఉన్నారు. తాజాగా అలా కనిపించకుండా పోయిన్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. అప్పట్లో తన గులాబీ చూపులతో బంధించిన కథానాయిక మహేశ్వరి మీకు గుర్తున్నారా?. ప్రస్తుతం ఆమెను చూస్తే గుర్తు పడతారా? ఇటీవల బాలీవుడ్ నటి జాన్వీకపూర్తో ఆమె ఫోటో దిగింది. కానీ ఆ ఫోటోలో అందరూ జాన్వీ చూశారే తప్ప.. పక్కన ఉన్న హీరోయిన్ను ఎవరూ గుర్తు పట్టలేకపోయారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మహేశ్వరి.. అంటే నేటి యువతకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ అదే గులాబీ సినిమా హీరోయిన్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేస్తుంది భామ. అమ్మాయి కాపురం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది ముద్దుగుమ్మ. ఆ తర్వాత వచ్చిన ‘గులాబీ’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. రామ్గోపాల్ వర్మ నిర్మించిన ఆ సినిమా అప్పట్లో భారీ హిట్గా నిలిచింది. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. జేడీ చక్రవర్తి హీరోగా తెరకెక్కిన చిత్రంలో మహేశ్వరి జంటగా నటించింది. ఈ చిత్రంలో బ్రహ్మజీ, బెనర్జీ, జీవ, చంద్రమోహన్, చలపతిరావు కీలకపాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం ఇండస్ట్రీలో పలు రికార్డులను తిరగరాసింది. గులాబీ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో మహేశ్వరికి అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఆ తర్వాత పలు సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. వడ్డే నవీన్తో పెళ్లి, జేడీ చక్రవర్తితో దెయ్యం, మృగం లాంటి సినిమాల్లో నటించింది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
అంతర్జాతీయ వేదికలపై సత్తా.. 'దహిణి' చిత్రానికి అరుదైన పురస్కారం..
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్ తెరకెక్కించిన మరో విలక్షణ చిత్రం ‘దహిణి - మంత్రగత్తె’. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వేదికలపై ఈ సినిమా సత్తా చాటుతోంది. తాజాగా ఈ చిత్రం.. ఆస్ట్రేలియాలో జరిగిన టైటాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డుతో రాజేష్ టచ్ రివర్ కీర్తి కిరీటంలో మరో వజ్రం చేరింది. ఈ ఏడాది ప్రారంభంలో పసిఫిక్ బీచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ వేడుకల్లో బెస్ట్ ఫీచల్ ఫిల్మ్గా నిలిచిన చిత్ర మరో అవార్డును సొంతం చేసుకుంది. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల్లో బెస్ట్ ఫీచర్ మూవీగా నామినేట్ అయ్యింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న జాతీయ అవార్డు గెలుగుచుకున్న యాక్టర్ తన్నిష్ట చటర్జీ ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. జేడీ చక్రవర్తి ఇప్పటి వరకు ఎప్పుడూ చేయనటువంటి ఓ వైవిధ్యమైన పాత్రను పోషించటం విశేషం. ఇంకా అషికీ హుస్సేన్, బద్రూల్ ఇస్లామ్, అంగనా రాయ్, రిజ్జు బజాజ్, జగన్నాథ్ సేత్, శ్రుతీ జయన్, దిలీప్ దాస్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. అసలు కథేంటంటే.. దహిణి - మంత్రగత్తె మూవీ సోషల్ థ్రిల్లర్. భారతదేశం 17 రాష్ట్రాల అన్వేషణలో ఉన్న మంత్రగత్తె కథే ఈ సినిమా. ఇదొక క్రూరమైన వాస్తవికత. అంతర్జాతీయంగా పలు ప్రశంసలను అందుకున్న దర్శకుడు రాజేష్ టచ్ రివర్ మంత్రగత్తె అన్వేషణ అనే విలక్షణమైన కాన్సెప్ట్తో సినిమాను తెరకెక్కించారు. దీంతో ఇండియా సహా పలు దేశాలను పీడిస్తున్న మానవ హక్కులకు సంబంధించిన ఆందోళనను ప్రస్తావించారు. లింగ భేదమైన హింసకు సంబంధించిన రూపాల్లో మంత్రగత్తె అన్వేషణ అనేది ఒకటి. సాధారణ లింగ నిబంధనలకు అనుగుణంగా లేని వేలాది మంది మహిళలను చంపడానికి లేదా వ్యక్తుల మధ్య వివాదాలను పరిష్కరించడానికి ఇందులో కారణంగా చూపించారు.ఈ సినిమాతో అసలు ఎవరూ బహిరంగంగా మాట్లాడని విషయాలను స్క్రీన్పై చూపించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రాన్ని పూర్తిగా ఒరిస్సాలో మంత్రగత్తెల అన్వేషణ ఎక్కువగా ఉండే మయూర్ భంజ్ జిల్లాలో చిత్రీకరించారు. -
స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో 'దహిణి'
తన్నిష్ఠ ఛటర్జీ, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ దర్శకుడు రాజేష్ టచ్రివర్ తెరకెక్కించిన సినిమా 'దహిణి'. ఓరియన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, సన్టచ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై పద్మశ్రీ అవార్డు గ్రహీత, మానవతావాది సునీత కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రం స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కు ఎంపిక అయ్యింది. ఈ సినిమాకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో గౌరవం దక్కడం ఇది రెండోసారి. ఇప్పటికే ఈ చిత్రానికి పసిఫిక్ బీచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' అవార్డు లభించింది. వాస్తవ ఘటనలు ఆధారంగా రాజేష్ టచ్రివర్ సినిమాలు తీస్తుంటారు. దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుండి ఆయనది అదే పంథా. గతంలో ఎన్నో సమస్యలను సినిమాల ద్వారా ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు 'విచ్ హంటింగ్' పేరుతో పలు రాష్ట్రాలలో జరుగుతున్న దారుణాలను వెలుగులోకి తీసుకురావాలనే ప్రయత్నంతో... వివాదాస్పద అంశాలను స్పృశిస్తూ 'దహిణి' తెరకెక్కించారు. ఒరిస్సాలోని మయూర్ బంజ్ జిల్లా, పరిసర ప్రాంతాల్లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా, వాస్తవికతకు దగ్గరగా 'దహిణి' చిత్రాన్ని రూపొందించారు. ఆధునిక కాలంలో కూడా లింగ ఆధారిత హింసతో, ఇప్పటికీ అనాగరిక చర్యలను కొంత మంది పాటిస్తున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అయినప్పటికీ ఎవ్వరూ ఈ దారుణాల గురించి మాట్లాడకపోవడం దురదృష్టం. ఈ వాస్తవాలను అందరికీ తెలియజేయడానికి మేం చేసిన ప్రయత్నం ఈ సినిమా అని మానవ హక్కుల కార్యకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీత కృష్ణన్ అన్నారు. ‘నేటి భారతంలో వేలాది మంది మహిళలను మంత్రగత్తెల పేరుతో ఎలా వేటాడుతున్నారు? మా సినిమాలో ఈ అంశం గురించి చాలా ఓపెన్గా ఈ ఇష్యూ గురించి చర్చిస్తున్నాం. దీని తర్వాత ప్రేక్షకులు మాట్లాడతారని ఆశిస్తున్నాం’అని నిర్మాత ప్రదీప్ నారాయణన్ అన్నారు. -
జేడీ చక్రవర్తి నమ్మకద్రోహం చేశాడు: అమ్మ రాజశేఖర్
కొరియోగ్రాఫర్గా, దర్శకుడిగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు అమ్మ రాజశేఖర్. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జేడీ చక్రవర్తితో ఉన్న గొడవను బయటపెట్టాడు. 'నాకు అర్జున్ సర్ గురువు. తర్వాత నాకు సపోర్ట్ చేసిన వ్యక్తి జేడీ చక్రవర్తి. జేడీ, నేను కలిసి సినిమా తీద్దామనుకున్నాం. ఉగ్రం కథ ఫైనల్ కాగానే జేడీకి రూ.4 లక్షలు ముట్టజెప్పా. జేడీ సినిమా మధ్యలో ఇన్వాల్వ్ అవుతారని కొందరంటుంటే వెళ్లి అడిగేశా. మీరున్నారుగా మాస్టర్, నేను మధ్యలో జోక్యం చేసుకోను అని హామీ ఇచ్చాడు. సినిమా అంతా అనుకున్నట్లుగా పూర్తయింది. నిర్మాత నక్షత్ర మంచి వ్యక్తి. అతడికో ఫ్రెండ్ ఖాసిం ఉండేవాడు. అతడు జేడీకి వీరాభిమానిని అంటూ చేతిపై జేడీ అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. వాడేదో కామెడీ చేస్తున్నాడనుకున్నాను. వాడు చేసేది ఓవరాక్షన్ అని జేడీ చూసుకోలేదు. తీరా 'ఉగ్రం' సినిమాకు రూ.60 లక్షల బిజినెస్ జరిగింది. నిర్మాత నక్షత్ర దిల్రాజులా ఫీలయ్యాడు. నాకు మాత్రం షేర్ ఇవ్వలేదు. మోసం చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అసలు డబ్బులు వచ్చిన సంగతి కూడా నాకు చెప్పలేదు. నిజానికి వచ్చినదాంట్లో సగం ఇవ్వాలనేది అగ్రిమెంట్. సరే సగం ఇవ్వకపోయినా కనీసం వచ్చినదాంట్లో నుంచి ఎంతో కొంతైనా ఇవ్వమని అడిగాను. చివరాఖరికి రూ.50 వేలు పడేశారు. చాలా బాధపడ్డాను. సినిమా ఫస్ట్ కాపీ వచ్చాక జేడీ దాంట్లో తలదూర్చాడు. అది మార్చి, ఇది మార్చి నాశనం చేశాడు. నా సినిమాను నా అనుమతి లేకుండా ఎలా మారుస్తారు. జేడీని గురువులా భావిస్తాను కాబట్టి సైలెంట్గా ఉండిపోయాను. ఓసారి అమ్మను హాస్పిటల్లో జాయిన్ చేశాం. చాలా సీరియస్గా ఉంది. నా డబ్బు నాకు ఇచ్చేయమని అడిగాను. అమ్మ హాస్పిటల్లో ఉంది, నాకు రూ.5 లక్షలు ఇవ్వమన్నా. అన్ని హక్కులు ఇచ్చేస్తాను కనీసం లక్ష రూపాయలు ఇవ్వురా అని అడిగినా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఆయన నాకు నమ్మకద్రోహం చేశాడు. వాళ్లు నన్నేదో చేశామని అనుకుంటున్నారు. కానీ వాళ్ల జీవితాలను వాళ్లే నాశనం చేసుకుంటున్నారు. నన్ను నమ్మి ఉంటే వాళ్లకు పెద్ద హిట్ వచ్చేది' అని చెప్పుకొచ్చాడు అమ్మ రాజశేఖర్. చదవండి: స్టార్ హీరోల సినిమాలకు పెద్ద షాకే ఇది.. హోంటూర్ వీడియోను షేర్ చేసిన యాంకర్ శ్యామల -
ఆయుష్మాన్ ఖురానా, జేడీ చక్రవర్తి మధ్య హిందీ భాషపై చర్చ..
Anek Trailer: Ayushmann Khurrana Gripped By Hindi Language Row: విలక్షణమైన నటనతో అబ్బురపరిచే బాలీవుడ్ యంగ్ హీరోల్లో ఆయుష్మాన్ ఖురానా ఒకరు. విక్కీ డోనర్, అంధాదున్, ఆర్టికల్ 15, డ్రీమ్ గర్ల్, బాలా, చంఢీగర్ కరే ఆషికీ వంటి తదితర చిత్రాలతో ఆకట్టుకున్నాడు. తాజాగా ఆయుష్మాన్ ఖురానా నటించిన చిత్రం 'అనేక్'. ఈ చిత్రంలో తొలిసారిగా ఒక సీక్రెట్ పోలీస్ పాత్రలో అలరించనున్నాడు ఆయుష్మాన్ ఖురానా. ఈ మూవీకి ముల్క్, ఆర్టికల్ 15, తప్పడ్ వంటి చిత్రాలను తెరకెక్కించిన అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. నార్త్ ఈస్ట్ ఇండియా బార్డర్లో నెలకొన్న రాజకీయ సంఘర్షణల నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అనేక్ మూవీ ట్రైలర్ను గురువారం (మే 5) విడుదల చేశారు. ఈ ట్రైలర్లో ఒక మిషన్ను జాషవా (ఆయుష్మాన్ ఖురానా) అనే పోలీసు ఎలా చేధించాడో చూపించారు. అంతేకాకుండా ఈ ట్రైలర్లో హిందీ భాష గురించి ప్రస్తావించడం విశేషం. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ట్విటర్ వార్ గొడవ కారణంగా హిందీ భాషను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో తెలంగాణ పోలీసుగా జేడీ చక్రవర్తి నటిస్తున్నాడు. ఆయుష్మాన్ ఖురానా, జేడి చక్రవర్తి మధ్య వచ్చిన హిందీ భాషకు సంబధించిన చర్చ ఆకట్టుకుంటుంది. చదవండి: హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు, అజయ్, సుదీప్ మధ్య ట్వీట్ల వార్ 'హిందీ భాషను సరళంగా మాట్లాడటం వల్లే నార్త్ ఇండియన్గా నిర్ణయిస్తారా ?' అని ఆయుష్మాన్ అడిగిన ప్రశ్నకు జేడీ చక్రవర్తి 'నో' అని చెబుతాడు. దానికి 'కాబట్టి ఇది హిందీ గురించి కాదు' అని ఆయుష్మాన్ బదులిస్తాడు. తర్వాత 'ఒక మనిషిని ఇండియన్గా ఎలా డిసైడ్ చేస్తారు' అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. హిందీ భాష, నార్త్ ఇండియన్ వంటి అంశాలపై ప్రస్తావించిన 'అనేక్' ట్రైలర్ పై సినీ ప్రముఖులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: అజయ్ దేవగణ్, సుదీప్ల ట్విటర్ వార్పై సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1711356039.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చేతినిండా సినిమాలే.. ఫుల్ బిజీ అయిన జేడీ చక్రవర్తి
నార్త్ అండ్ సౌత్ ఇండస్ట్రీస్లో వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి. తెలుగులో ‘బ్రేకింగ్ న్యూస్’, ‘ది కేస్’ చిత్రాల్లో కీ రోల్స్ చేస్తున్నారు జేడీ. అలాగే తమిళంలో ‘కారీ’తో పాటు మరో సినిమాలో కీలక పాత్ర చేశారు. కన్నడంలో ‘ప్రేమ్’, ‘హూ’ మూవీస్లో జేడీ ముఖ్య పాత్రధారి. ఇక మలయాళంలోనూ రెండు చిత్రాలు కమిటయ్యారాయన. సౌత్లో ఇంత బిజీగా ఉన్న జేడీ హిందీలోనూ వరుస చిత్రాలు చేస్తున్నారు. జాన్ అబ్రహాం ‘ఏక్ విలన్ 2’, ఆయుష్మాన్ ఖురాన్ ఫిల్మ్, ‘దహిని’ చిత్రాలు, టైటిల్ ఖరారు కానీ హిందీ వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. అన్నట్లు.. శనివారం (16.04.) జేడీ బర్త్డే. ‘శివ’ చిత్రం ద్వారా పరిచయమైన జేడీ నటుడిగా 33 ఏళ్లుగా కొనసాగుతున్నారు. ఆ సినిమాలో చేసిన జేడీ పాత్రనే చక్రవర్తి ఇంటి పేరుగా మారిపోయింది. -
ఆర్జీవీ ఇంట విషాదం: సోదరుడిని మిస్ అవుతున్న వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మకు వరుసకు సోదరుడైన పి.సోమశేఖర్ కరోనాకు బలయ్యాడు. కొద్దిరోజులుగా కోవిడ్తో పోరాడుతున్న ఆయన హైదరాబాద్లో ఆదివారం తుది శ్వాస విడిచాడు. కాగా సోమశేఖర్ రంగీలా, దౌడ్, సత్య, జంగల్, కంపెనీ వంటి పలు చిత్రాల నిర్మాణ బాధ్యతలు చూసుకున్నాడు. అనురాగ్ కశ్యప్ రచయితగా పని చేసిన హిందీ సినిమా 'ముస్కురాకే దేఖ్ జర'కు దర్శకుడిగానూ పని చేశాడు. అతడి మరణంపై ఆర్జీవీ ఎమోషనల్ అయ్యాడు. "కొన్నేళ్లుగా అతడు మాతో లేడు. ఇతర వ్యాపారాల్లోకి వెళ్లడంతో చాలాకాలంగా మాకు దూరంగా ఉంటున్నాడు. నా జీవితంలో సోమశేఖర్ చాలా కీలకమైన వ్యక్తి. అతడిని చాలా మిస్ అవుతున్నాను" అని పేర్కొన్నాడు. In this turbulent time just got to know about our old associate #PSomShekar passing away. He was taking care of his mother who had Covid. He got infected too but did not stop taking care of her. #RIPPSomShekhar pic.twitter.com/yqtJ4Xs6pK — Boney Kapoor (@BoneyKapoor) May 23, 2021 'తల్లి కోసం ఎంతో శ్రద్ధ తీసుకున్న శేఖర్, కరోనా సోకిన తర్వాత కూడా ఆమె కోసం పరితపించాడు. ఈ క్రమంలో అతడూ కరోనా బారిన పడ్డాడు. అయినప్పటికీ తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఆమెను కాపాడుకోగలిగాడు కానీ తను మాత్రం ప్రాణాలు కోల్పోయాడు' అని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ విచారం వ్యక్తం చేశాడు. సత్య చిత్రీకరణ సమయంలో వర్మ కంటే సోమశేఖర్కే ఎక్కువ భయపడేవాళ్లమన్న జేడీ చక్రవర్తి ఇద్దరి అభిరుచి ఒకటే కావడంతో చిన్న చిన్న తగాదాలు కూడా జరిగేవని తెలిపాడు. అయితే తొందరగానే అన్నింటినీ సర్దుకుపోయేవాళ్లమని గుర్తు చేసుకున్నాడు. ఈ మధ్య శేఖర్ ఒంటరివాడిగా మారిపోయాడని, కనీసం ఫోన్ కాల్స్ కూడా మాట్లాడకపోవడం ఆందోళనకు గురి చేసిందన్నాడు. ఇంతలోనే ఆయనను కరోనా కబళించడం విషాదకరమన్న జేడీ అతడు మన మధ్య లేనందుకు ఎక్కువగా బాధపడేది ఆర్జీవీనే అని తెలిపాడు. చదవండి: నా చావుకు సుపారీ ఇచ్చాను, ఆ అవసరం రాదు: ఆర్జీవీ -
అమెజాన్ ప్రైమ్లో జేడీ చక్రవర్తి హారర్ మూవీ
జేడీ చక్రవర్తి హీరోగా ఎన్.ఎస్.సి. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమ్.ఎమ్.ఓ.ఎఫ్ (MMOF).ఆర్ ఆర్ ఆర్ ప్రొడక్షన్స్ & జె కే క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి అనుశ్రీ సమర్పణలో రాజశేఖర్,ఖాసీంలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా థ్రిల్లర్గా అలరించింది. తాజాగా ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. మార్చి 22 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయింది. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. సినిమా అమెజాన్ లో విడుదల అయిందని.. తప్పకుండా ఈ సినిమాని చూడండి.. ప్రేక్షకులు కోరుకునే అన్నీ అంశాలు సినిమాలో ఉన్నాయి..థ్రిల్లర్ జొనర్ లో ఇదో కొత్త తరహా చిత్రంగా ఉంటుంది.. ఇది మిస్ అయితే ఓ మంచి థ్రిల్లర్ మిస్ అవుతారు..మంచి సస్పెన్స్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను అన్నారు కథ విషయానికి వస్తే..దీపక్ అనే అతను ఖార్ఖాన ఏరియా లో ఓ థియేటర్ నడుపుతుంటాడు..అందులో ఎక్కువ గా అడల్ట్ సినిమాలు ఆడిస్తుంటాడు..అయితే సడన్గా ఆ థియేటర్ లో సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళు చనిపోతుంటారు.అసలు ఆ థియేటర్ లో ఏముంది? ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు? అనే సస్పెన్స్ అంశాలతో కథ నడుస్తుంది. -
కోవిడ్ వల్ల చాలా మారిపోయాయి
‘‘కోవిడ్ వల్ల చాలా విషయాలు మారిపోయాయి. ఇండస్ట్రీకి ఓ రకంగా మేలు కూడా జరిగింది. కరోనా లాక్డౌన్లో ప్రపంచ సినిమాలు చూస్తున్నారు ప్రేక్షకులు. వాళ్ల అభిరుచి మారింది. దానికి తగ్గట్టుగా కొత్త కథలు, కొత్త ఐడియాలతో సినిమాలు చేయాలి. అది ఓ రకంగా మంచిదే కదా’’ అని జేడీ చక్రవర్తి అన్నారు. జేడీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఎమ్ఎమ్ఓఎఫ్ ఉరఫ్ 70 ఎంఎం’. ఎన్ . ఎస్.సి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో ఓ పాత థియేటర్ నడుపుకునే వ్యక్తి పాత్ర చేశాను. థియేటర్ సరిగ్గా నడవడంలేదని బూతు సినిమాలు ప్రదర్శిస్తుంటాను. అనుకోకుండా నా థియేటర్లో హత్యలు జరుగుతుంటాయి. వాటి వెనక ఉన్నది ఎవరు? ఇందులో నుంచి నేను ఎలా బయటపడ్డాను? అనేది కథ. ప్రస్తుతం ‘కిటికీ’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నా’’ అన్నారు. -
మూడు భాషల్లో ఇద్దరు
అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇద్దరు’. ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వంలో ఫర్హీన్ ఫాతిమా నిర్మిస్తున్నారు. తెలుగు–తమిళ–కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో రాధికా కుమారస్వామి, సోనీ చరిష్టా, జె.డి. చక్రవర్తి, కళాతపస్వి కె.విశ్వనాధ్, హీరో ఆమిర్ ఖాన్ సోదరుడు ఫైసల్ ఖాన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. శనివారం అర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకుని ‘ఇద్దరు’ చిత్రంలోని ప్రత్యేక గీతాన్ని దర్శకుడు బోయపాటి శ్రీనుతో చిత్రబృందం విడుదల చేయించింది. ‘‘అర్జున్గారితో కలిసి నేను చేసిన స్పెషల్ సాంగ్ బోయపాటి సార్ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సోనీ చరిష్టా. ఈ పాట విడుదల కార్యక్రమంలో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, చిత్ర సహనిర్మాత శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. -
వర్మ సందేహాన్ని తీర్చేసిన అభిమానులు
జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎమ్ఎమ్ఓఎఫ్’. ఎన్.ఎస్.ఈ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షత, మనోజ్ నందన్, అక్షిత, బెనర్జీ, సంపూర్ణేశ్ బాబు, జబర్దస్త్ నటులు ఆర్పీ, చమ్మక్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్స్, జేకే క్రియేషన్స్ పతాకంపై రాజశేఖర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ను రాంగోపాల్ వర్మ సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ గురించి ఆర్జీవీ స్పందిస్తూ.. ‘ఎమ్ఎమ్ఓఎఫ్ అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ట్రైలర్ రూపొందించి విధానం మాత్రం బాగుంది. పదునైన కటింగ్తో జెడ్ స్పీడ్లో ఉంది’ అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో ఆయన అభిమానులు స్పందిస్తూ వర్మకు టైటిల్ వివరించే ప్రయత్నం చేశారు. ఎమ్ఎమ్ఓఎఫ్ అంటే 70ఎమ్ఎమ్ అని చెప్పుకొచ్చారు. 70 ఎమ్ఎమ్ను రివర్స్లో ఎమ్ఎమ్ఓఎఫ్ అని పెట్టారని అభిప్రాయపడుతున్నారు. మరి ఇదెంతవరకు నిజమన్నది ఆ సినిమా యూనిట్కే తెలియాలి. ఇస్మార్ట్ దర్శకుడు పూరీజగన్నాథ్ సినిమా గురించి మాట్లాడుతూ.. ట్రైలర్ తనకు ఎంతగానో నచ్చిందన్నారు. ట్రైలర్ కొత్తగా ఉందని, ఇందులో జేడీ తన నటనతో ఇరగదీశాడన్నారు. (కరోనా మమ్మల్ని చంపితే నువ్వూ చస్తావ్: వర్మ) కథానాయకుడు తన జీవితంలో జరిగిన సంఘటనలను చెప్తుండగా ట్రైలర్ ప్రారంభమవుతుంది. ‘ఒకరోజు నేను అడవిలో వెళుతుంటే సడన్గా పులి ఎదురైంది. భయంతో పరిగెట్టాను.. పులి నా వెంట పడింది. పులి నా వెంట పడుతుంది..’ అంటూ డైలాగ్ వినిపిస్తుంది. ఇంతలో ఇంటర్వెల్ పడుతుంది. సినిమాలో లాగా ట్రైలర్లో ఇంటర్వెల్ పడటం కాస్త కొత్తగా అనిపిస్తుంది. ఈ బ్రేక్ తర్వాత హీరో తిరిగి మళ్లీ అదే కథను వినిపిస్తాడు. చివరగా.. ‘ఎటువైపు చూసినా చావే.. ఆ చావులన్నింటినీ దాటాలంటే ఎమ్ఎమ్ఓఎఫ్ చూడండి’ అని ముగిస్తాడు. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్పై కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ‘తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’ను నిస్సిగ్గుగా కాపీ కొట్టార’ని విమర్శిస్తున్నారు. (సినిమాలో అది ట్రై చేద్దామా) -
నేను స్లోగా వెళుతున్నానా అనిపించింది
‘‘ఎంఎంఓఎఫ్’ ట్రైలర్ చూశాక నేను నిదానంగా వెళుతున్నానా? సినిమా తీసినవారు ఫాస్ట్గా ఉన్నారా? అనే అనుమానం కలిగింది. ఈ సినిమా ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. జేడీ చక్రవర్తి ఇలాంటి కొత్త కథలతో మరెన్నో సినిమాలు చేయాలి’’ అన్నారు డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ. జేడీ చక్రవర్తి, బెనర్జీ, అక్షత, మనోజ్ నందన్ ప్రధాన పాత్రల్లో యన్.యస్.సి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఎంఎంఓఎఫ్’. అనుశ్రీ సమర్పణలో ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ జేకే క్రియేష¯ŒŒ్స బ్యానర్స్పై ఆర్ఆర్ఆర్ రాజశేఖర్, జేడీ కాశీం నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ని హైదరాబాద్లో రామ్గోపాల్ వర్మ విడుదల చేశారు. డైరెక్టర్ శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘వర్మలా సినిమాలు చేయాలని, అతన్ని అనుకరించాలని చాలామంది అనుకుంటారు. కానీ అది అసాధ్యం. జేడీ చక్రవర్తి మంచి నటుడు. ఈ ట్రైలర్ చూస్తుంటే త్వరగా సినిమా చూడాలనిపిస్తోంది’’ అన్నారు. ‘‘జేడీ చక్రవర్తితో చాలా కాలం తర్వాత నటించాను. ఆర్జీవీగారి దాదాపు అన్ని సినిమాల్లో నేను నటించాను. తెలుగు సినిమాకు డిఫరెంట్ మేకింగ్ను పరిచయం చేసిన వ్యక్తి ఆయన. ‘ఎంఎంఓఎఫ్’ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నటుడు బెనర్జీ. జేడీ చక్రవర్తి, నటులు ఉత్తేజ్, మనోజ్ నందం, నిర్మాత రామసత్యనారాయణ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: ‘గరుడవేగ’ అంజి. -
సినిమాలోని అది మనం ట్రై చేద్దామా..
ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో యన్ఎస్సీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎంఎంఓఎఫ్. ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్స్, జేకే క్రియేషన్స్ బ్యానర్పై రాజశేఖర్, జేడీ ఖాసీంలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో బెనర్జీ, అక్షత, అక్షిత ముద్గల్, మనోజ్ నందన్, చమ్మక్ చంద్ర ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రైలర్లో మధ్యలో ఇంటర్మిషన్ అని పేర్కొని.. ఒకే కథను రెండు రకాలు చెప్పారు. ‘ఒక రోజు నేను అడవిలో వెళ్తూ ఉంటే సడెన్గా పులి ఎదురైంది. భయంతో పరిగెట్టాను. పులి నా వెంట పడింది. పులి నా వెంట పడుతుంది నేను పరిగెడుతున్నాను. పులి నా వెంట పడుతూనే ఉంది.. నేను పరిగెడుతూనే ఉన్నాను. అలా పరిగెత్తి ఓ కొండపైకి ఎక్కి చూస్తే...’అని కథను రెండు వెర్షన్లలో చూపించారు. ఓ థియేటర్లో జరిగే ఘటనలను ప్రధానంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. ‘సినిమాలో లిప్ టూ లిప్ సీన్ చూశావా.. అది మనం ట్రై చేద్దామా’ అంటూ హీరోయిన్ పలికే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ట్రైలర్లో ఇంటర్మిషన్ తర్వాత చూపించిన సీన్స్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. 2 నిమిషాలకు పైగా నిడివి గల ఈ ట్రైలర్ను ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా తీర్చిదిద్దారు. కాగా, ఈ చిత్రానికి సాయి కార్తీక్ అందిస్తున్నారు. -
యాక్షన్.. కామెడీ
సాగర్ శైలేష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘శివ 143’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాత. ఈ సినిమాలోని ఓ పాటను జేడీ చక్రవర్తి విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘కథ, స్క్రీన్ప్లే, కొరియోగ్రఫీ చేసి హీరోగా శైలేష్ నటించాడని విని ఆశ్చర్యపోయా. ‘రహస్యం’లో తన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ బావున్నాయి. ఇందులో డీఎస్ రావు మంచి పాత్ర చేశారు’’ అన్నారు. ‘‘శివ 143’ని సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నాం. సెన్సార్ పూర్తి కాకపోవడంతో ఆగాం. యాక్షన్, కామెడీ.. ఇలా అన్ని అంశాలు ఉన్నాయి’’ అన్నారు రామసత్యనారాయణ. ‘‘జేడీ చక్రవర్తిగారు నా సినిమాను గుర్తుపెట్టుకొని, అభినందించడం హ్యాపీ’’ అన్నారు సాగర్ శైలేష్. -
ఊహించడం అంత వీజీ కాదు
‘‘ప్రతి ఒక్కరి జీవితంలో బ్యాడ్టైమ్ ఉంటుంది. నా జీవితంలోనూ బ్యాడ్టైమ్ గడిచింది. అందుకే డైరెక్టర్గా గ్యాప్ వచ్చింది’’ అన్నారు దర్శకుడు టి.ఎన్. కృష్ణ. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా టి.ఎన్.కృష్ణ దర్శకత్వంలో కలైపులి యస్. థాను నిర్మించిన చిత్రం ‘హిప్పీ’. ఈ చిత్రంలో దిగంగనా సూర్యవన్షీ, జజ్బాసింగ్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు టి.ఎన్. కృష్ణ చెప్పిన విశేషాలు. ►‘హిప్పీ’ సినిమాను ముందు తమిళ భాషలో తీద్దాం అనుకున్నాం. ఆ టైమ్లో ‘ఆర్ఎక్స్ 100’ తమిళ రీమేక్ ఆఫర్ వచ్చింది నాకు. తెలుగు ‘ఆర్ఎక్స్ 100’ చూశాను. హీరోగా కార్తికేయ బాగా నటించాడు. ఇక రీమేక్ ఎందుకు? అనిపించి స్ట్రయిట్ తెలుగు సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాం. ‘హిప్పీ’ కథను కార్తికేయకు చెప్పాం. నచ్చింది అన్నారు. అలా ‘హిప్పీ’ ప్రయాణం మొదలైంది. జాన్ మిల్టన్ అనే బ్రిటిష్ కవి ప్రస్తావించిన ప్యారడైజ్ లాస్, ప్యారడైజ్ గెయిన్ అనే అంశాల ఇన్స్పిరేషన్తో ఈ సినిమా చేశాను. ►కార్తికేయ బాగా నటించాడు. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి క్యారెక్టర్ పాజిటివ్గా ఉంటుంది. నిర్మాత థానుగారు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇది యూత్ఫుల్ ఫిల్మ్. నేటి యువత రిలేషన్షిప్స్ను ఎలా డీల్ చేస్తున్నారు? రిలేషన్షిప్స్లో వారికి ఎదురయ్యే సమస్యలు ఏంటి? అనే అంశాలను ప్రస్తావించాం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. నెక్ట్స్ సీన్ ఏంటి? అని ఆడియన్స్ అంత వీజిగా ఊహించలేరు. ఇది కంప్లీట్ లవ్ ఫిల్మ్. ఫ్యామిలీ ఆడియన్స్కూ నచ్చుతుంది. ►సోషల్ మీడియా వచ్చిన తర్వాత కల్చలర్ ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతోంది. నేటి టెక్నాలజీకి అందరూ ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఇండస్ట్రీలో అయినా అంతే. అప్డేట్ కావాలి. ►ఈ సినిమాలో నా పర్సనల్ లైఫ్ సీన్స్, నా స్నేహితులవి కొన్ని ఉన్నాయి. పర్సనల్ లైఫ్లో లవ్ని ఫీల్ అవ్వలేనివారు లవ్స్టోరీ తీయలేరని నా నమ్మకం. తెలుగు ఇండస్ట్రీ నాకు బాగా నచ్చింది. ఒక్కో లాంగ్వేజ్లో ఒక్కో బ్యూటీ ఉంటుంది. ►‘సిల్లున్ను ఒరు కాదల్’ (‘నువ్వు నేను ప్రేమ’) (2006) సినిమా తర్వాత ఓ సినిమా స్టార్ట్ చేశాం. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు నేను చేసిన ‘నెడుంజాలై’ రిలీజైంది. ‘హిప్పీ’ నా మూడో సినిమా. నెక్ట్స్ థానుగారే నా డైరెక్షన్లో ఓ సినిమా నిర్మించబోతున్నారు. అలాగే పీఫుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో ఓ తెలుగు సినిమా చేయబోతున్నాను. -
‘హిప్పీ’ వర్కింగ్ స్టిల్స్
-
ఆ రోజు సినిమాలు మానేయొచ్చు
‘‘నాకు నచ్చిన మంచి సినిమాలు చేస్తున్నాను కాబట్టే తక్కువ అవకాశాలు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన తెలుగు సినిమా అవకాశాల్లో ‘హిప్పీ’ తప్ప మరో స్క్రిప్ట్ నన్ను ఎగై్జట్ చేయలేదు. ఏదో కథకి ఓకే చెబితే డబ్బు వస్తుంది. కానీ నాకు అలా ఇష్టం లేదు’’ అని జేడీ చక్రవర్తి అన్నారు. టీఎన్ కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా నటించిన సినిమా ‘హిప్పీ’. దిగంగన సూర్యవన్షీ, జజ్బా సింగ్ కథానాయికలు. జేడీ చక్రవర్తి కీలక పాత్ర చేశారు. కలైపులి యస్. థాను నిర్మించిన ఈ సినిమాని ఈ నెల 6న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి చెప్పిన విశేషాలు.... ► నేటి యువతరం ఆలోచనలు ఎలా ఉన్నాయో ఈ సినిమా ప్రతిబింబిస్తుంది. ఈ చిత్రంలో ఓ కంపెనీ సీఈవోగా నటించాను. ప్లేబాయ్ క్యారెక్టర్కు దగ్గరగా ఉంటుంది. ► కార్తికేయ బాగా నటించాడు. ఫ్రెష్ అప్రోచ్తో పోయిటిక్గా తీశాడు దర్శకుడు క్రిష్ణ. థానుగారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ► లస్ట్ బేస్డ్(కామం) సినిమాలు చాలా రావొచ్చు. కానీ, ఎమోషన్ లేకుండా లవ్, యాక్షన్, ఫియర్.. ఇలా ఏదీ వర్కౌట్ కాదు. కేవలం కామం వల్లే సినిమాలు ఆడవు. ‘అర్జున్రెడ్డి, ఆర్ఎక్స్ 100’ సినిమాలు స్ట్రాంగ్ ఎమోషన్స్తో ఉన్న లవ్ బేస్డ్ సినిమాలు. అందుకే హిట్ సాధించాయి. ‘హిప్పీ’ కూడా బోల్డ్ కంటెంట్తో ఉన్న స్ట్రాంగ్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఫ్యామిలీ ఆడియన్స్కూ నచ్చుతుంది. ► నా యాక్టింగ్ కెరీర్ పట్ల నేను సంతృప్తిగానే ఉన్నాను. ఏమీ నేర్చుకోకుండా ఇండస్ట్రీకి రాలేదు నేను. వచ్చి ఇంకా నేర్చుకుంటున్నాను. అన్నీ నేర్పిన మా గురువుగారు(రామ్గోపాల్ వర్మ) డబ్బులు ఎలా సంపాదించాలో నేర్పలేదు. నేను హిందీలో ‘వాస్తుశాస్త్ర’ చేస్తున్న సమయంలో షారుక్ మా సెట్కి వచ్చారు. అప్పుడు ఆయన ‘వీర్జారా’ చేస్తున్నారు. మా సెట్కి వచ్చిన షారుక్ని సుశ్మితాసేన్ ‘హాయ్.. షారుక్’ అంటూ పలకరించారు. నేను హాయ్ చెప్పి డైలాగ్స్ చదవడంలో మునిగిపోయాను. నేను కొంచెం రూడ్గా బిహేవ్ చేశానని షారుక్ ఫీలైనట్లు అనిపిచింది. సెట్లో ఉన్నప్పుడు కాస్త ఎగై్జట్మెంట్, టెన్షన్ ఉంటుంది. ఈ విషయం షారుక్కు చెప్పేలోపే.. ఆయన నన్ను హగ్ చేసుకుని.. ఈ సమస్య నాకే అనుకున్నా.. నీకూ ఉందా?’ అన్నారు. సెట్లో ఎగై్జటింగ్గా అనిపించని రోజున ఏ యాక్టర్ అయినా సినిమాలు మానేయొచ్చని నా అభిప్రాయం. హాలీవుడ్, బాలీవుడ్లాగా మనం కూడా క్యారెక్టర్ బేస్ట్ సినిమాలు చేయాలి. ► ఇతర భాషల్లో సినిమాలతో బిజీగా ఉన్నందువల్లే నా డైరెక్షన్లో సినిమా రాలేదు. అక్టోబర్లో ఓ సినిమాని ప్రకటించనున్నా. ‘గన్స్ అండ్ థైస్’ వెబ్ సిరీస్లను ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఆర్జీవీగారు నాతో ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. -
హిప్పీ ప్రీ-రిలీజ్ ఈవెంట్
-
జూన్ 7న విడుదలకు సిద్ధమవుతున్న ‘హిప్పి’
‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ, దిగంగన సూర్యవన్షీ జంటగా తెరకెక్కుతున్న సినపిమా హిప్పీ. కలైపులి ఎస్. థాను సమర్పణలో వి. క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు టిఎన్ కృష్ణ దర్శకుడు. షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూన్ 7న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ - ‘మా హిప్పీ జూన్ 7న విడుదల కానుంది. షూటింగ్ చాలా బాగా జరిగింది. ఔట్పుట్ అనుకున్నదానికన్నా బాగా వచ్చింది. టీమ్ అందరం హ్యాపీగా ఉన్నాం. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో ఓ వైపు రియలిస్టిక్ స్టోరి ఉంటుంది. మరో వైపు ఫుల్లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అన్ని కమర్షియల్ అంశాలను పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారు దర్శకుడు. కబాలి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన కలైపులి ఎస్. థానుగారి సంస్థలో హిప్పీ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పెద్ద బడ్జెట్ చిత్రంలా చేశారు. జె.డి. చక్రవర్తిగారిది చాలా చాలా కీ రోల్. ఆయన కథ వినగానే ఒప్పుకోవడంతో హ్యాపీగా ఫీలయ్యా. ఆయన నటనకు నేను పెద్ద ఫ్యాన్ని. హీరోయిన్ దిగంగన చాలా అద్భుతమైన నటి. ఈ సినిమాలో తనది మంచి క్యారెక్టర్. అందరినీ మెప్పిస్తుంది. సంగీతం కూడా చాలా బాగుంది. ఆర్.డి. రాజశేఖర్గారి ఫొటోగ్రఫీ సినిమాకు మంచి ఎస్సెట్గా నిలుస్తుంది’ అన్నారు. నటుడు జె.డి. చక్రవర్తి మాట్లాడుతూ - ‘కథ వినగానే నచ్చింది. నా పాత్రకున్న ఇంపార్టెన్స్ అర్థమై వెంటనే ఓకే చెప్పేశాను. కార్తికేయను ఆర్.ఎక్స్ 100లో చూశా. రొమాన్స్, ఫైట్స్, డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నాడు. తప్పకుండా మంచి హీరోగా ఎదుగుతాడు. అతనికి కెరీర్ బిగినింగ్లోనే హిప్పీ లాంటి కథ కుదరడం గ్రేట్. మంచి మనసున్న కలైపులి థానుగారి బ్యానర్లో ఈ సినిమా చేస్తున్నందుకు నాక్కూడా చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. -
నా అహం దెబ్బతింది
‘‘ఆర్ఎక్స్ 100’ సినిమా విడుదలకు ముందునుంచే కార్తికేయ తెలుసు. ఈ చిత్రంలో నేను చేసిన పాత్రకి దర్శకుడు నన్ను పరీక్షించాలన్నప్పుడు నా అహం దెబ్బతింది. అయితే.. తను చెప్పిన విషయాన్ని నేను నెగటివ్గా తీసుకొని ఉంటే మంచిపాత్రలో నటించే అవకాశం వచ్చేది కాదు’’ అని నటుడు జేడీ చక్రవర్తి అన్నారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హిప్పీ’. టి.ఎన్. కృష్ణ దర్శకుడు. వి. క్రియేషన్స్, ఏషియన్ సినిమాస్ పతాకాలపై కలైపులి యస్.థాను నిర్మిస్తున్నారు. దిగంగనా సూర్యవంశీ, జబ్బాసింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హైదరాబాద్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఆర్ఎక్స్ 100’ తర్వాత చాలా కథలు విన్నా. అదే టైమ్లో ‘నువ్వు నేను ప్రేమ’ ఫేమ్ టి.ఎన్.కృష్ణగారు వినిపించిన ‘హిప్పీ’ కథ కొత్తగా అనిపించడంతో వెంటనే ఓకే చెప్పేశా. కలైపులి థానుగారు ఓకే చెప్పడంతో సినిమా మొదలైంది. జేడీ చక్రవర్తిగారు చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించారు. ఈ సినిమాలో దాదాపు అందరూ నాకంటే సీనియర్లే పని చేశారు. విజువల్స్ చాలా గ్రాంyŠ గా ఉంటాయి. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాని మించి ‘హిప్పీ’ బ్లాక్బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. టి.ఎన్. కృష్ణ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ కామెడీ చిత్రమిది. కథ చాలా సింపుల్. మన ఇరుగు పొరుగు ఇళ్లలో జరుగుతున్నట్లు ఉంటుంది. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. మన జీవితంలో నిత్యం జరిగే ఎన్నో అంశాలు ఇందులో ఉంటాయి. ఈ సినిమాని తొలుత తమిళంలో చేయాలనుకున్నాం. ‘ఆర్ఎక్స్ 100’లో కార్తికేయను చూశాక ‘హిప్పీ’ ఇతనితో ఎందుకు చేయకూడదు? అనిపించింది. కథ అతనికి నచ్చడంతో తెలుగులో ఈ సినిమా స్టార్ట్ అయింది’’ అన్నారు. ‘‘నేను ఎప్పుటి నుంచో తెలుగులో నేరుగా ఓ సినిమా తీయాలనుకుంటుంటే ‘హిప్పీ’తో కుదిరింది. త్వరలోనే పాటలను విడుదల చేయనున్నాం’’ అన్నారు కలైపులి యస్.థాను. ఈ చిత్రానికి నివాస్ కె.ప్రసన్న సంగీతం అందించారు. -
ఆర్జీవీ ప్రశంసలు అందుకున్న‘పట్టరై’
తమిళసినిమా: పట్టరై చిత్రం సంచలన దర్శకుడు రామ్గోపాల్వర్మ ప్రశంసలను అందుకుంది. తనదైన పంథాలో చిత్రాలను చేసే రామ్గోపాల్వర్మ టాలీవుడ్ నటుడు జేడీ.చక్రవర్తి వంటి పలువురు ప్రతిభావంతులను సినిమాకు పరిచయం చేశారు. ఈయన జేడీ.చక్రవర్తి కథానాయకుడిగా 1996లో తెరకెక్కించిన సత్య చిత్రం పలువురి ప్రశంసలను అందుకుంది. ఇక జేడీ.చక్రవర్తి కోలీవుడ్లోనూ పలు చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్న నటుడు. ఆయన తాజాగా తమిళంలో నటించిన చిత్రం పట్టరై. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్, సన్నివేశాల కలర్ టోన్ వంటి అంశాలు చాలా కొత్తగా ఉన్నాయని దర్శకుడు రామ్గోపాల్ వర్మ మెచ్చుకున్నారట. ఈ విషయాన్ని పట్టరై చిత్ర దర్శకుడు పీటర్ ఆల్విన్ పేర్కొంటూ ఇది నమ్మశక్యం కానీ తరుణం అన్నారు. దర్శకుడు కేవీ.ఆనంద్ శిష్యుడైన ఈయన తాను రామ్గోపాల్ వర్మ చిత్రాలను చూసి పెరిగిన వాడినని అన్నారు. ముఖ్యంగా సత్య చిత్రం దర్శకుడిగా తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు. దాని గురించి ఎలా చెప్పాలో తనకు అర్థం కావడం లేదన్నారు. అలాంటి దర్శకుడు పట్టరై చిత్రం గురించి మంచి మాటలు చెప్పడం సంతోషంగా ఉందన్నారు. అందుకు రామ్గోపాల్వర్మకు ధన్యవాదాలు ఎలా చెప్పుకోవాలో తెలియడం సమాజంలో జరుగుతున్న దారుణమైన సంఘటనల్లో ఒకటైన అమ్మాయిల కిడ్నాప్ల గురించి ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రంపై రామ్గోపాల్వర్మ చెప్పిన అభిప్రాయం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుందని, చిత్ర యూనిట్కు ప్రోత్సాహంగా ఉందని దర్శకుడు అన్నారు. -
సస్పెన్స్ కాంట్రాక్ట్
కాంట్రాక్ట్ కుదిరింది. కానీ.. ఎవరు? ఎవరితో? దేనికోసం? కాంట్రాక్ట్ కదుర్చుకున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. సిల్వర్ స్క్రీన్పై చూడాల్సిందే. అర్జున్ హీరోగా సంజయ్ గొడావత్ సమర్పణలో సమీర్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్ఎస్ సమీర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తు్తన్న చిత్రం ‘కాంట్రాక్ట్’. కన్నడ నటి రాధికా కుమారస్వామి కథానాయిక. సీనియర్ దర్శకులు కె.విశ్వనాథ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. నటుడు జేడీ చక్రవర్తి విలన్ పాత్రధారి. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ తమ్ముడు ఫైజల్ ఖాన్ ఈ సినిమాతో సౌత్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ తొలివారంలో విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శక–నిర్మాత సమీర్ మాట్లాడుతూ–‘‘యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. అర్జున్ మల్టీ మిలియనీర్ పాత్రలో నటిస్తున్నారు. టాకీపార్ట్తో పాటు మూడు పాటల చిత్రీకరణ పూర్తి అయింది. ఓ పాటను మహారాష్ట్రలో, రెండు పాటలను థాయ్లాండ్లో చిత్రీకరించనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్. కెమెరా: అమీర్లాల్. -
కామెడీ థ్రిల్లర్
నక్షత్ర మీడియా పతాకంపై ఖాసిం సమర్పణలో జేడీ చక్రవర్తి హీరోగా ‘అమ్మ’ రాజశేఖర్ దర్శకత్వంలో ‘నక్షత్ర’ రాజశేఖర్ నిర్మించిన యాక్షన్ కామెడీ థ్రిల్లర్ ‘ఉగ్రం’. అక్షత కథానాయిక. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా నిర్మాత నక్షత్ర రాజశేఖర్ మాట్లాడుతూ – ‘‘గులాబీ, సత్య వంటి హిట్ చిత్రాల తర్వాత ‘అమ్మ’ రాజశేఖర్ చెప్పిన కథకు జేడీ చక్రవర్తి ఎగై్జట్ అయ్యి నటించారు. యాక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్కు మంచి స్కోప్ ఉన్న చిత్రం ఇది. ఉగాదికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకి కెమెరా: అంజి, సంగీతం: జాన్ పోట్ల, సహనిర్మాత: బండి శివ. -
అమ్మ, అమ్మమ్మ మీద ఒట్టు...అది నిజంకాదు
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై చర్చలు, అంచనాలు నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పాత్రను విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి పోషిస్తున్నాడనే అంచనాలపై వర్మ స్పందించారు. ఆయన ప్రాతను జేడీ పోషించడం లేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు.. ఈ పాత్రను పోషిస్తున్నారనేది ఇంకా తనకు కూడా తెలియదంటూ ఫేస్బుక్ పోస్ట్ ద్వారా వివరణ ఇచ్చారు. వైస్ రాయ్ హోటల్ డ్రామాలో చంద్రబాబు నాయుడు ప్రాతను జేడీ పోషించడంలేదు..ఇది నిజం ..అమ్మ, అమ్మమ్మమీద ఒట్టు అని తేల్చి పారేశారు. కాగా గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు హీరో జేడీ చక్రవర్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు వస్తున్న వార్తలొచ్చాయి. అయితే ఇవిఎంతమాత్రం నిజం కావని ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్ బయోపిక్ సంబంధించిన పనులు శరవేగంగా నడిపిస్తున్న వర్మ ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దీంతోపాటు ఎన్టీఆర్ బయోపిక్ కోసం పరిశోధన మొత్తం పూర్తయిందని... ఎన్టీఆర్ ఆత్మే తనను నడిపిస్తోందంటూ.. ఈ సినిమాకు తనదైన శైలిలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
జేడీ బాబు!
జేడీ చక్రవర్తి కదా... జేడీ బాబు అంటున్నారేంటి అనుకుంటున్నారా? విషయం ఏంటంటే.. త్వరలో జేడీ ఓ రాజకీయ నాయకుడి పాత్ర చేయనున్నారట. అందుకే ‘జేడీ బాబు’ అనాల్సి వచ్చింది. ఇంతకీ ఆ నాయకుడు ఎవరో ఊహించే ఉంటారు. యస్... చంద్రబాబు నాయుడు. నటుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో రామ్గోపాల్ వర్మ సినిమా తీయనున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఎన్టీఆర్ పాత్రకి ఎవరు సరిపోతారు? లక్ష్మీ పార్వతిగా నటించేది ఎవరు? చంద్రబాబునాయుడు పాత్ర ఎవరు చేస్తారు? అనే చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి పాత్రల్లో ఇండస్ట్రీకి పరిచయం లేని కొత్తవారు కనిపిస్తారని వర్మ ప్రకటించి, క్లారిటీ ఇచ్చారు. అయితే, చంద్రబాబు పాత్ర ఎవరు చేస్తారన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. బాబు పాత్రలో వర్మ ప్రియ శిష్యుల్లో ఒకరైన నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి నటించనున్నారని ఫిల్మ్నగర్ టాక్. జేడీ మంచి నటుడు. పైగా గడ్డం కూడా మెయిన్టైన్ చేస్తారు. అందుకే చంద్రబాబు పాత్రకే అతనే కరెక్ట్ అన్నది వర్మ ఆలోచనట. గురువు అడిగితే శిష్యుడు కాదంటారా? ఓకే చెప్పారని సమాచారం. ప్రస్తుతం అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ‘ఉగ్రం’ అనే చిత్రంలో నటిస్తున్నారు జేడీ. -
అందరికీ నచ్చినట్టు సినిమా తీయలేం
ద్వారకాతిరుమల: ‘అందరికీ నచ్చిన అమ్మాయిని మనం పెళ్లి చేసుకోలేం.. అలాగే అందరికీ నచ్చినట్టుగా సినిమా తీయలేం.. కథలో దమ్ముంటే ఎలాంటి సినిమా అయినా హిట్ అవుతుంది’ అని సినీ హీరో జేడీ చక్రవర్తి పేర్కొన్నారు. ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో జేడీ శుక్రవారం సందడి చేశారు. ముందుగా ఆయన శ్రీవారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖమండపంలో అర్చకుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఆలయంలో పలువురు భక్తులు జేడీతో ఫొటోలు దిగేందుకు ఆసక్తిచూపారు. అనంతరం జేడీ విలేకర్లతో కాసేపు ముచ్చటించారు. తాను ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించానన్నది ఎప్పుడూ లెక్కించలేదని చెప్పారు. ప్రస్తుతం రామ్గోపాల్వర్మ నిర్మిస్తున్న ఇంకా పేరు పెట్టని ఒక థ్రిల్లర్ చిత్రానికి దర్శకుడిగా, హీరోగా చేస్తున్నట్టు వివరించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఉగ్రం చిత్రంలో హీరోగా నటిస్తున్నానని, ఈ చిత్రం థ్రిల్లర్తోపాటు హ్యూమరస్గా ఉంటుందని పేర్కొన్నారు. కన్నడంలో సూపర్ హీరోయిన్ పూజాక్రాంతి నిర్మిస్తున్న రావణి చిత్రంలో ఆమె సరసన హీరోగా నటిస్తున్నానని వివరించారు -
'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై వర్మ క్లారిటీ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు వివాదాస్పద పోస్ట్ లు చేసిన రామ్ గోపాల్ వర్మ తాజాగా సినిమా నిర్మాత గురించి వస్తున్న వార్తలను ఖండించారు. కొద్ది రోజులుగా రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కు నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి నిర్మాత అన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై స్పందించిన వర్మ, తన సోషల్ మీడియా పేజ్ లో క్లారిటీ ఇచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ కు జేడీ చక్రవర్తి నిర్మాత అన్న వార్తలు పుకార్లే అన్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించటంలో మంచి రికార్డ్ ఉన్న వర్మ, ఎన్టీఆర్ జీవితంలోని ఎత్తు పల్లాలను వెండితెర మీద ఆవిష్కరించనున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు. -
అమ్మ దర్శకత్వంలో జేడీ
కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ దర్శకునిగా మారి ‘రణం’ వంటి హిట్ చిత్రం తీసిన విషయం తెలిసిందే. తాజాగా జేడీ చక్రవర్తి హీరోగా నక్షత్ర మీడియా పతాకంపై నక్షత్ర రాజశేఖర్ నిర్మాణ సారధ్యంలో ‘అమ్మ’ రాజశేఖర్ ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. ‘‘నేను గురువుగా భావించే వ్యక్తి జేడీగారు. ఆయన్ను డైరెక్ట్ చేయడం సంతోషంగా ఉంది. తమన్ సంగీతం, అంజి కెమేరా, గౌతంరాజు ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అవుతాయి. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ను హైదరాబాద్లో ప్రారంభిస్తాం’’ అన్నారు దర్శకుడు. -
పరువు హత్యల్లో పరువు ఎక్కడుంది?
అర్జున్, జేడీ చక్రవర్తి హీరోలుగా సమీర్ ప్రొడక్షన్స్ పతాకంపై సమీర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘కాంట్రాక్ట్’. హైదరాబాద్లో ప్రచార చిత్రాలను ఆవిష్కరించారు. అర్జున్ మాట్లాడుతూ – ‘‘పోలీసాఫీసర్ కావాలని కరాటే నేర్చుకున్న నేను అనుకోకుండా ‘మా పల్లెలో గోపాలుడు’తో హీరో అయ్యా. ఇంతమంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నా. అందుకు కారణమైన కోడి రామకృష్ణగారికి, తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు. సమీర్ మాట్లాడుతూ – ‘‘మైండ్ గేమ్ నేపథ్యంలో నడిచే చిత్రమిది. ‘పరువు హత్యల్లో అసలు పరువు లేదు’ అనేది చిత్ర మూలకథ. జేడీ చక్రవర్తిగారి ప్రోత్సాహంతో ఈ సినిమా తీశా. దీని తర్వాత మరో భారీ బడ్జెట్ సినిమా తీస్తా’’ అన్నారు. కృతీ కట్వా, దివ్యా సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: జానీ లాల్, సంగీతం: సుభాశ్ ఆనంద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: వి. సునీల్కుమార్, ఎం. రమేశ్, సమర్పణ: సంజయ్ గద్వక్. -
జేడి చక్రవర్తి పెళ్లయిపోయిందా..?
జేడి చక్రవర్తి.. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో పరిచయం అవసరం లేని పేరు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఆయన సినీ కెరీర్కే కాదు, ఆయన విలక్షణ వ్యక్తిత్వానికి కూడా వారసుడిగా ఎదిగాడు చక్రవర్తి. హీరో, విలన్, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా తనలోని అన్ని రకాల టాలెంట్లను తెర మీద చూపించిన చక్రవర్తికి వ్యక్తిగత విషయాల్లోనే వర్మ బాటలోనే అడుగులు వేశాడు. అందుకే పెళ్లి అనే పదానికి చాలా కాలం పాటు దూరంగా ఉండిపోయాడు. అయితే ఇటీవల తన కుటుంబ సభ్యుల వత్తిడి మేరకు చక్రవర్తి పెళ్లి అంగీకరించాడన్న వార్తలు వినిపించాయి. వర్మ స్కూల్ నుంచే వచ్చిన ముద్దుగుమ్మ అనుకృతిని జేడి పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాలో సందడి చేసింది. తాజాగా ఈ ఇద్దరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిందట. వేడుకలకు దూరంగా ఉండే చక్రవర్తి అత్యంత సన్నిహితులను మాత్రమే తన పెళ్లికి ఆహ్వానించాడట. వీరి పెళ్లికి సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నా, వధూవరుల నుంచి మాత్రం వివాహానికి సంబందించి ఎలాంటి ప్రకటనా రాలేదు. -
పెళ్లి పీటలెక్కనున్న జేడీ
హైదరాబాద్: 90వ దశకంలో నాగార్జున కెరియర్ ను ఒక మలుపు తిప్పిన 'శివ' సినిమా తో తెలుగు సినీ లోకానికి పరిచయమైన జేడీ చక్రవర్తి (46)ఎట్టకేలకు పెళ్లి పీటలెక్క బోతున్నాడు. హాఫ్ సెంచరీకి దగ్గరిగా ఉన్న ఈ విలక్షణ నటుడికి ఇప్పటికి పెళ్లిచేసుకునే మెచ్యూరిటీ వచ్చిందట. అందుకే మూడుముళ్ల బంధానికి ఓకే చెప్పానంటున్నాడు. ఢిల్లీకి చెందిన ఓ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని మరికొద్దినెలలో జేడీ పెళ్లి చేసుకోనున్నాడు. ఇప్పటికైనా సెటిల్ అవ్వమనే వాళ్లమ్మ బలవంతం మీద త్వరలోనే ఓ ఇంటివాడయ్యేందుకు నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. దీనిపై ఈ గులాబీ హీరోని వివరణ కోరాగా 'నేను పెళ్లికి ఎప్పుడూ వ్యతిరేకం అని చెప్పలేదు. పెళ్లి చేసుకోవాలంటే ఎంతో బాధ్యత - మెచ్యూరిటీ ఉండాలి. నాకు ఇప్పడవి వచ్చాయని అనుకుంటున్నా' అంటూ మీడియాకు తన పెళ్లి కబురందించాడు. జేడీ చక్రవర్తిగా పాపులర్ అయిన నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి పుట్టింది హైదరాబాద్ లోనే. సినిమా రంగం మీద ఆసక్తితో 1989లో రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ మూవీ శివతో తెరంగేట్రం చేసిన చక్రవర్తి అప్పట్లో కాలేజీ కుర్రకారులోపెద్ద సంచలనం. ఆ తర్వాత గులాబీ, పాపకోసం, హోమం తదితర సినిమాల్లో తన ప్రతిభను రూపించుకుంటూ హీరోగా, విలన్ గా, దర్శకుడిగా తనదైన శైలిలో రాణించాడు. 'సత్య' మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. -
'శ్రీదేవి'ని డైరెక్ట్ చేస్తున్న జెడి..?
విలన్గా పరిచయం అయి, తరువాత హీరోగా మారి, ఆపై దర్శకుడిగా మారిన సౌత్ స్టార్ జెడి చక్రవర్తి. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా అదే మాటతీరును ప్రదర్శించే జెడి చక్రవర్తి, ఓ వివాదాస్పద సినిమాను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడట. గతంలో 'సావిత్రి' పేరుతో ఓ ఎరోటిక్ సినిమాను ఎనౌన్స్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. తన టీచర్ మీద మనసుపడే అబ్బాయి కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా పోస్టర్లతోనే క్లియర్ చేశాడు వర్మ. అయితే వర్మ విడుదల చేసిన పోస్టర్స్తో పాటు, సినిమాకు పెట్టిన 'సావిత్రి' అనే టైటిల్ అప్పట్లో పెద్ద దుమారం లేపింది. దీంతో కాస్త వెనక్కి తగ్గిన వర్మ సినిమా టైటిల్ ను 'శ్రీదేవి'గా మార్చాడు. చాలా కాలంగా శ్రీదేవి సినిమా విషయంలో ఎలాంటి అప్డేట్ ఇవ్వని వర్మ టీం... తాజాగా ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు రావాలని ఆలోచిస్తుందట. వర్మ శిష్యుడైన జెడి చక్రవర్తి దర్శకత్వంలో ఈ సినిమాను పూర్తి చేసి వీలైనంత త్వరగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సెట్స్ మీదకు రాకుండానే వివాదాలు సృష్టించిన శ్రీదేవి రిలీజ్ లోపు ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. -
డైనమైట్ రివ్యూ
చిత్రం : డైనమైట్ జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : మంచు విష్ణు, ప్రణీత, జెడి చక్రవర్తి దర్శకత్వం : దేవాకట్ట నిర్మాత : మంచు విష్ణు సంగీతం : అచ్చు నిడివి : 142 నిమిషాలు విడుదల : 04-09-15 యాక్షన్ స్టార్ ఇమేజ్ కోసం మంచు విష్ణు చేసిన ప్రయత్నమే డైనమైట్. తమిళ్లో ఘనవిజయం సాధించిన 'అరిమనంబి' రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను చిన్నపాటి స్క్రీన్ప్లే మార్పులతో తెలుగు ప్రేక్షకులకు అందించాడు డైరెక్టర్ దేవాకట్ట. ఒరిజినల్ వర్షన్ తో పోలిస్తే యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి విష్ణు ప్రయత్నం ఎంత వరకు వర్క్అవుట్ అయ్యిందో రివ్యూలో చూద్దాం. కథ: అనుకోకుండా కలిసిన శివాజీ ( విష్ణు ) అనామిక ( ప్రణీత )లు తొలి పరిచయంలోనే దగ్గరవుతారు. ఈ ఇద్దరు డేట్ కు వెళ్లిన సమయంలో అనామిక కిడ్నాప్ అవుతుంది. ఈ కిడ్నాప్ కు సంబంధించి శివాజీ పోలీసులకు సమాచారం అందించినా ఎటువంటి ఆధారాలు దొరక్కపోవటంతో, అతనే స్వయంగా ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకుంటాడు. అలా ఆధారాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అనామిక ఓ మెమరీకార్డ్ మూలంగా చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుందని తెలుసుకుంటాడు. అసలు ఆ మెమరీకార్డ్ లో ఏముంది.? అనామికను కిడ్నాప్ చేసింది ఎవరు ? ఈ సమస్య నుంచి అనామికను శివాజీ ఎలా కాపాడాడు అన్నదే సినిమా కథ ? నటన: ఈ సినిమా కోసం సరికొత్త లుక్ ట్రై చేసిన మంచు విష్ణు ఆకట్టుకున్నాడు. పర్ఫామెన్స్ తో పాటు బాడీ లాంగ్వేజ్ లో కూడా స్పెషల్ కేర్ తీసుకొని ఫ్రెష్ లుక్ తీసుకొచ్చాడు. ఇక ఇప్పటి వరకు టాలీవుడ్ స్క్రీన్ మీద చూడని చాలా రిస్కీ స్టంట్స్ను విష్ణు డూప్ లేకుండా చేశాడు. తెర మీద ఈ సన్నివేశాలు అద్భుతంగా అనిపిస్తాయి. చాలా రోజులుగా విష్ణు కోరుకుంటున్న యాక్షన్ ఇమేజ్ ఈ సినిమాతో సాధించాడు. కేవలం యాక్షన్ సీన్స్ లో మాత్రమే కాదు ఎమోషనల్ సీన్స్ లోనూ ఆకట్టుకున్నాడు. ఉన్నంతలో బాగానే ఆకట్టుకుంది ప్రణీత. యాక్టింగ్ పరంగా ఎలా ఉన్నా గ్లామర్ తో మాత్రం అలరించింది. ఒరిజినల్ వెర్షన్ లో నటించిన పాత్రలోనే కనిపించిన సీనియర్ స్టార్ జెడీ చక్రవర్తి మరోసారి బెస్ట్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా మెమరీ కార్డ్ లో ఉన్న సన్నివేశాలు చూసే సమయంలో జెడీ పర్ఫామెన్స్ అమేజింగ్ అనిపిస్తుంది. ఇతర పాత్రల్లో రాజా రవీంద్ర, నాగిరెడ్డి, ప్రవీణ్, పరుచూరి వెంకటేశ్వరరావులు తమ పరిధి మేరకు బాగానే నటించారు. సాంకేతిక నిపుణులు: ఆటోనగర్ సూర్య లాంటి భారీ డిజాస్టర్ తరువాత గ్యారెంటీ హిట్ కొట్టాల్సిన సమయంలో దేవాకట్ట కరెక్ట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇప్పటి వరకు ఎమోషనల్ డ్రామాలు మాత్రమే డీల్ చేసిన దేవ ఈ సినిమాతో యాక్షన్ థ్రిల్లర్లు కూడా ఈజీగా డీల్ చేయగలడని ప్రూవ్ చేశాడు. ముఖ్యంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే దేవాకట్ట కెరీర్ లోనే బెస్ట్. థ్రిల్లర్ సినిమాలకు ప్రాణం లాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో చిన్నా మంచి మార్కులు సాధించాడు. సతీష్ సినిమాటోగ్రఫి, విజయన్ ఫైట్స్ సూపర్బ్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. విశ్లేషణ : యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు టైట్ స్క్రీన్ప్లే తో ఈ మూవీ ప్రతీ ఆడియన్ ను థియేటర్ లో కదలకుండా కూర్చోబెట్టగలదు. విలన్ ఎవరు అన్న విషయం రివీల్ అయ్యే వరకు నడిచే మైండ్ గేమ్, ఆ తరువాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. తొలి భాగంలో కొన్నిసన్నివేశాలు ఇబ్బంది పెట్టినా, రెండో భాగం మాత్రం చాలా ఇంట్రస్టింగ్గా సాగుతుంది. విష్ణు కెరీర్ లోనే ఇది బెస్ట్ ఫిలిం అనటంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా యాక్షన్ థ్రిల్లర్ ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. ఓవరాల్గా మంచి ప్రయత్నం, యాక్షన్ థ్రిల్లర్ లను ఇష్టపడే వారికి బెస్ట్ ఛాయిస్ - సతీష్ రెడ్డి, సాక్షి ఇంటర్ నెట్ డెస్క్ -
ఈ కుర్రాడు భలే చాకు గురూ!
అతను చాకు లాంటి కుర్రాడు.. ఇంకా చెప్పాలంటే డైనమైట్ అంత పవర్ఫుల్ అన్నమాట. ఈ శక్తిమంతమైన పాత్రను పోషిస్తూ, దేవ కట్టా దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్న చిత్రం ‘డైనమైట్’. ఈ చిత్రం పతాక సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్లో జరిగింది. విష్ణు, జేడీ చక్రవర్తి, రెండువేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా సన్నివేశాలు తీశారు. దీంతో టాకీపార్ట్ పూర్తయ్యింది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం వాయిస్ టీజర్కు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. త్వరలో ప్రచార చిత్రాన్నీ, వేసవికి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు దర్శక, నిర్మాతలు. -
మరో కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టాం
‘‘టెక్నాలజీని వినియోగించి, తక్కువ ఖర్చుతో సినిమా తీయడం రామ్గోపాల్వర్మ శైలి. ‘ఐస్క్రీమ్’ చిత్రం ద్వారా ఫ్లోకామ్ టెక్నాలజీని పరిచయం చేశారు. ఇప్పుడు ‘ఐస్క్రీమ్-2’ ద్వారా మరో కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టారు. దాని గురించి త్వరలో చెబుతాం’’ అని చిత్రనిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. జేడీ చక్రవర్తి, నందు, భూపాల్, నవీనా, గాయత్రి నటించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామసత్యనారాయణ మాట్లాడారు ‘‘18 రోజుల్లో ఈ చిత్రాన్ని తీశాం. కానీ, వర్మగారికి సంతృప్తి అనిపించకపోవడంతో రీషూట్ చేశాం. దానివల్ల ఖర్చు పెరిగినప్పటికీ, మేం పెట్టిన పెట్టుబడి వస్తుందనే నమ్మకం ఉంది’’ ఆయన అన్నారు. పెద్ద చిత్రాలను తప్ప ఇతర చిత్రాలు ఎవరూ కొనడం లేదనీ, అందుకే యూత్ఫుల్ చిత్రాలైతే సేఫ్ అని ఇలాంటివి చేస్తున్నాననీ తుమ్మలపల్లి చెప్పారు. -
ఎందరికో జన్మనిచ్చిన 'శివ'
అక్కినేని నాగార్జున - అమల జంటగా రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్.ఎస్.క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన 'శివ' చిత్రం ఎందరికో జన్మనిచ్చిందని ఆ చిత్రంలో నటించిన పలువురు చెప్పారు. ట్రెడ్సెట్టర్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సాక్షి టీవీ నిర్వహించిన 'శివ 25 ఏళ్లు-స్పెషల్ ఎడిషన్'లో తనికెళ్ల భరణి, జెడి చక్రవర్తి, ఉత్తేజ్ పాల్గొన్నారు. దర్శకుడు శివనాగేశ్వర రావు, నటుడు, నిర్మాత చిన్న, రామ్ జగన్.....మరికొందరు ఫోన్లో మాట్లాడారు. రామ్గోపాల్ వర్మ కూడా ఫోన్లో మాట్లాడారు. శివ నిర్మాణం గురించి డాక్యుమెంటరీ విడుదల చేయబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. స్పెషల్ ఎడిషన్'లో పాల్గొన్నవారందరూ ఆ నాటి శివ సినిమా నిర్మాణ ఘట్టాలను, షూటింగ్, రీరికార్డింగ్ సందర్భంగా జరిగిన విషయాలను, ఈ చిత్రంతో తమ అనుబంధాన్ని, తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాము నటులుగా ఎంపికైన వివరాలు తెలిపారు. ముందు మాటల రచయితగా మాత్రమే ఎంపికైన తనికెళ్ల భరణి, ఆ తరువాత ఆ చిత్రంలో నానాజీ పాత్రకు ఎలా విధంగా పోషించారో తెలిపారు. ఈ మూవీలో బాగా పాపులర్ అయిన సైకిల్ చైన్ ఫైటింగ్ సన్నివేశాన్ని రామ్గోపాల్ వర్మతోపాటు తానుకూడా కలిసి రూపొందించినట్లు జెడి చక్రవర్తి చెప్పారు. తొలుత ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన తాను అనుకోకుండా అందులో యాదగిరి పాత్ర పోషించినట్లు ఉత్తేజ్ చెప్పారు. తమకు కొత్త సినీజీవితాలను ఆ చిత్రం ప్రసాదించినట్లు రామ్ జగన్, చిన్న పేర్కొన్నారు. తాను పుట్టి 25 ఏళ్లైందని చిన్న సవినయంగా చెప్పారు. తనకు ఈ చిత్రం కొత్త గుర్తింపును ఇచ్చిందని, అందువల్లే దర్శకుడు రాము పేరుతో కలిపి తన పేరును రామ్ జగన్గా మార్చుకున్నట్లు వివరించారు. ఈ స్పెషల్ ఎడిషన్'లో పాల్గొన్నవారు శివ లాంటి చిత్రం ఎవరూ తీయలేరు - రామూ కూడా తీయలేరు - రామూ తీసినా అంతబాగా తీయలేరు... అని చెప్పారు. వారు చెప్పిన కొన్ని ముఖమైన విషయాలు: తొలుత రామ్గోపాల్ వర్మను ఒక్క నాగార్జున మాత్రమే నమ్మారు. శివ ఇంత హిట్ అవుతుందని అనుకోలేదు. ఈ సినిమాలో హాస్య సన్నివేశాలను రామూ అసలు అంగీకరించలేదు. కథనం-ఫొటోగ్రఫీ-మ్యూజిక్-ఫైటింగ్స్-డైలాగ్స్...అన్నీ కొత్తతరహాగానే ఉన్నాయి. తెలుగు సినిమాకు కొత్త నడక నేర్పింది. ** -
ఐస్క్రీమ్-2 లో జెడి డిఫరెంట్ గెటప్
-
ఐస్క్రీమ్-2 మూవీ ఫస్ట్లుక్
-
ఈ ఐస్క్రీమ్ ఓ అద్భుతం...
‘‘ఫస్ట్లుక్ అంటే.. ఇప్పటివరకూ ఒక్క స్టిల్ని విడుదల చేసేవారు. నేను మాత్రం దీనికి భిన్నంగా ఒకేసారి ఇరవై ఫస్ట్లుక్స్ని విడుదల చేశా’’ అని రామ్గోపాల్వర్మ అన్నారు. ‘ఐస్క్రీమ్’ సిరీస్లో భాగంగా ఆయన ‘ఐస్క్రీమ్-2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జేడీ చక్రవర్తి, నందు, భూపాల్, సిద్ధు, ధన్రాజ్, నవీనా, శాలిని, గాయత్రి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాత. ఈ సినిమా ప్రచార చిత్రాలను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ - ‘‘సెప్టెంబర్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. దానికి ఓ నాలుగు రోజుల ముందు ‘ఐస్క్రీమ్-3’ ప్రారంభిస్తాం. ‘ఐస్క్రీమ్’ సిరీస్ నుంచి నెలకు ఓ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు. ‘‘నిర్మాతగా నేలపై ఉన్న నన్ను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టారు వర్మ. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను’’ అని తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. అందరూ కర్మ సిద్ధాంతాన్ని అనుసరిస్తారని, తాను మాత్రం వర్మ సిద్ధాంతాన్ని పాటిస్తానని, టేకింగ్ పరంగా ‘ఐస్క్రీమ్-2’ ఓ అద్భుతమని జేడీ చక్రవర్తి చెప్పారు. -
వర్మ కొత్త కథానాయిక
ఇటీవలే ‘ఐస్క్రీమ్’ మేకింగ్తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన రామ్గోపాల్ వర్మ, మరో సంచలనానికి సిద్ధమయ్యారు. ‘ఐస్క్రీమ్’ చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తున్నారు. వర్మ నూతనంగా ఏర్పాటు చేసిన ‘న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ’ ద్వారా నిర్మాణమవుతోన్న తొలి చిత్రం ఇదే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నవీన అనే కొత్తమ్మాయిని వర్మ నాయికగా పరిచయం చేస్తున్నారు. జేడీ చక్రవర్తి, జీవా, నందు, భూపాల్, సిద్ధు, ధనరాజ్ తదితరులు ఇందులో ముఖ్యతారలు.