karthika masam
-
పోలి స్వర్గం.. భక్తుల పుణ్యస్నానాలు (ఫొటోలు)
-
తిరుపతి జిల్లాలో మహా దీపోత్సవం (ఫొటోలు)
-
శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు..
-
విజయవాడ భవానీ ఐలాండ్ లో వన భోజనాల సందడి (ఫొటోలు)
-
హైదరాబాద్ లో ఘనంగా కార్తీక పౌర్ణమి పూజలు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : కనులపండువగా కోటి దీపోత్సవం (ఫొటోలు)
-
సముద్ర స్నానాలు ఆచరించి..భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలు (ఫొటోలు)
-
Karthika Pournima: కార్తీక పౌర్ణమి విశిష్టత..! త్రిపుర పూర్ణిమ అని ఎందుకు పిలుస్తారు?
కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు. శివుడు , శ్రీమహా విష్ణువులని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి, వారి అనుగ్రహం పొందేందుకు ఈ కార్తీక మాసం కన్నా పవిత్రమైనది మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ కార్తీక మాసంలో కానీ ప్రత్యేకంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున కానీ శివాలయాలు, విష్ణువు నెలవైన పుణ్యక్షేత్రాల్లో భగవంతుడిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇదే కార్తీక మాసాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తుంటారు. వారాణాసి లాంటి ఉత్తర భారతదేశంలోఇదే రోజుని దేవ దీపావళి, దేవ దివాళి అని పిలుస్తుంటారు. అలాగే అలాగే దక్షిణ భారత దేశంలో కొన్ని చోట్ల దీన్ని త్రిపుర పూర్ణిమ అని పిలుస్తారు. అంత పరమ పవిత్రమైన ఈ కార్తీక పూర్ణిమ వెనుకున్న నేపథ్యం, ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా..!ఏం చేస్తారంటే..కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి ఆ పరమ శివుడిని పూజించి రోజంతా ఉపవాసం ఉండటం భక్తులకి ఆనవాయితీ. కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తే , శరీరానికి ఎన్నో శక్తులు చేకూరుతాయని... అందులోనూ పవిత్రమైన నదుల్లో ఈ నదీ స్నానం మరింత పవిత్రతని , పుణ్యంని చేకూరుస్తుందనేది భక్తుల బలమైన విశ్వాసం. అందువల్లే కార్తీక పౌర్ణమి రోజున ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వారణాసి భక్తుల రాకతో కిటకిటలాడుతుంటుంది.ఇంట్లో తులసి మొక్కకు కానీ లేదా దేవాలయాల్లో కానీ ఇవాళ దీపారాధన చేస్తే మరింత పుణ్యం , పూజా ఫలం దక్కుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. కొంతమంది కార్తిక పౌర్ణమి రోజున 365 దీపాలు వెలిగిస్తుంటారు. దీనికి అర్థం.. సంవత్సరంలో ఒక్కో రోజుకి ఒక్కో దీపం చొప్పున అన్ని దీపాలు ఈ పరమ పవిత్రమైన రోజే వెలిగించి మీ అనుగ్రహం కోరుకుంటున్నాను దేవా అని.సత్యనారాయణ వ్రతం :సత్యనారాయణ వ్రతం జరుపుకోవడానికి కార్తీక పౌర్ణమి కన్నా అతి పవిత్రమైన రోజు మరొకటి లేదు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకు కారణం ఆ శ్రీ మహా విష్ణువుకి ఈ కార్తీక పౌర్ణమి అతి ప్రీతి పాత్రమైనది కావడమే. అందుకే మిగతా రోజుల్లో సత్యనారాయణ వ్రతం చేయడం కన్నా కార్తీక పౌర్ణమి రోజున చేసే వ్రతానికే పూజా ఫలం అధికం అని అంటుంటారు పెద్దలు.ఏకాదశి రుద్రాభిషేకం :ఈరోజు శివనామస్మరణతో మోగిపోయే ఆలయాలన్నింటిలో సర్వ సాధారణంగా కనిపించేది ఏకాదశి రుద్రాభిషేకం. పదకొండుసార్లు రుద్ర చమకం లేదా శివ నామస్మరణతో శివుడిని అభిషేకించడమే ఈ ఏకాదశి రుద్ర అభిషేకం ప్రత్యేకత. జ్వాలాతోరణం...ఈ రోజు సంధ్యాసమయంలో శివాలయంలో జ్వాలాతోరణం నిర్వహిస్తారు. ఎండుగడ్డితో తాడును తయారు చేసి ఆలయం ముంగిట తోరణంగా అమర్చి దానిని ఆవునేతి దీపంతో వెలిగిస్తారు. పార్వతీపరమేశ్వరులను పల్లకిలో ఉంచి ఈ తోరణం నుంచి మూడుసార్లు ఊరేగిస్తారు. ఆ పల్లకిని అనుసరించి శివనామ జపం చేస్తూ ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక జన్మల నుంచి చేసిన పాపాలన్నీ పటాపంచలై సుఖ సంతోషాలతో వర్థిల్లుతారని శాస్త్రవచనం.ఈ పూర్ణిమకు మరొక పేరు..కార్తీక పూర్ణిమ నాడు శంకరుడు త్రిపురాసురుణ్ణి వధించిన రోజు. అందువలన ఈరోజును త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు. కార్తీకపురాణం ప్రకారం ఈరోజు దీపదానం, సాలగ్రామ దానం చేయాలి. దానధర్మాలు చేయాలి. ఇవి కోటిరెట్లు ఫలితాన్నిస్తాయని భక్తుల నమ్మకం. ఈ పౌర్ణమి రోజు అరుణాచల క్షేత్రంలో అఖండ జ్యోతి వెలిగిస్తారు. ప్రాముఖ్యత గలిగిన ఈ జ్యోతి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. పౌర్ణమినాడు శ్రీ కృష్ణుని రాసలీలకు పెట్టినది పేరు. అందువలన ఈ రోజు శ్రీ కృష్ణ స్మరణ కూడా అత్యంత ఫలవంతమైనది. మరోవేపు సిక్కులు , జైనులు కూడా..సిక్కులు , జైన మతస్తులు కూడా ఈ కార్తీక పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటుంటారు. సిక్కులు దైవంగా భావించే శ్రీ గురు నానక్ పుట్టింది కార్తీక పౌర్ణమి రోజే కావడంతో సిక్కులు ఈ రోజుని పవిత్రమైనదిగా భావిస్తారు. జైన్లు కూడా ఈ కార్తీక పౌర్ణమిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం విశేషం.(చదవండి: 365 వత్తులు..కార్తీక పురాణం ఏం చెబుతోంది?) -
శ్రీశైల మహాక్షేత్రంలో లక్ష దీపోత్సవం..భక్తకోటి పరవశం (ఫొటోలు)
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష స్వీకరణ (ఫొటోలు)
-
కార్తీక సోమవారం.. శ్రీశైల మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)
-
దక్షిణ భారతాన అతి పెద్ద ఆలయం ఇదే..!
కార్తీకమాసం సందర్బంగా సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన మయూర నాథ ఆలయం గురించి తెలుసుకుందాం. దక్షిణ భారత దేశంలోని అతిపెద్ద శివాలయాలలో ఒకటిగా పేరు గాంచింది. మాయవరంలోని మయూర నాథ ఆలయం. శివుడు లింగ రూపంలో వెలసిన ఆలయాలు అనేకంఉన్నాయి, అందులో అతి పెద్ద శివాలయాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. ఈ ఆలయంలో చెప్పుకోదగ్గ విశేషం ఏమింటంటే... పార్వతీదేవి మయూర రూపంలో స్వయంగా సృష్టించిన దేవాలయం ఇది. మరి పార్వతీదేవి ఈ దేవాలయాన్ని ఎందుకు సృష్టించింది? ఇదెక్కడ ఉందనే విషయాన్ని తెలుసుకుందాము...తమిళనాడు లోని, నాగపట్నం జిల్లాలోని మైలాడుతురై అని పిలిచే మాయవరంలో మయూరనాథ దేవాలయం వుంది.ప్రస్తుతమున్న మైలాడుతురైనే మాయవరం అని పిలిచేవారు. ఇది చాలా పురాతనమైన ఆలయంగా, ఎంతో విశిష్టతను కలిగి ఉంది. ఈ దేవాలయ రాజగోపురం తొమ్మిది అంతస్థులలో నిర్మితమైంది.దక్షిణ భారతదేశంలో అతి పెద్ద శివాలయాలలో ఇది కూడా ఒకటి.స్థలపురాణంఇక్కడ దక్షప్రజాపతి శివపార్వతులను ఆహ్వానించక చేస్తున్న యాగానికి, పరమశివుడు వారిస్తున్నా వినకుండా వచ్చిన పార్వతీదేవిని అవమానిస్తున్న సందర్భంలో... జరుగుతున్న ఈ రసాభాసలో ఆ యజ్ఞగుండ అగ్నికి భయపడి, అక్కడే ఉన్నటువంటి ఓ చిన్న నెమలిపిల్ల పార్వతీదేవి ఒడిలో దాక్కుంది. అదే సమయానికి పార్వతీదేవి తనని తాను యోగాగ్నిలో దహించుకునేసరికి, ఒడిలో ఉన్న నెమలిపిల్ల కూడా ఆహుతైపోతుంది.అలా నెమలితో అగ్నికి ఆహుతి కావడంతో, తర్వాత నెమలి రూపంలో జన్మించి, జరిగిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోడానికి పార్వతీదేవి ఇక్కడ శివుని మందిరాన్ని సృష్టించి, శివుణ్ణి ప్రార్థించి, ఆయనలో లీనమైనట్లు స్థల పురాణం చెబుతోంది. పార్వతీదేవి మయూర రూపంలో స్వయంగా సృష్టించిన దేవాలయం కాబట్టి, ఈ ఆలయానికి మయూర నాథ దేవాలయం అని పేరు స్థిరపడింది. ఈ మయూరనాథుడే శివుడు. పార్వతీదేవిని ఇక్కడ అభయాంబిక, అభయ ప్రధాంబిక అనే పేర్లతో భక్తులు పిలుస్తుంటారు.ఈ ఆలయాన ఓ మర్రి చెట్టు ఉంది.ఈ మర్రి చెట్టుకిందే పార్వతీదేవి మయూర రూపంలో తపస్సు చేసినట్లు భక్తులు భావిస్తారు.ఇక్కడ కావేరీ నది ప్రవహిస్తోంది. దీనిని వృషభా తీర్థం అని పిలుస్తారు. ఇక్కడి కావేరీ నదిలో, ప్రతీ పౌర్ణిమ రోజున తమ తమ గంగ యమునలతోపాటు ఇక్కడికి వచ్చి తమ అంశలతో కూడిన నదులు ఇక్కడికి వచ్చి, తమ జలాల్ని ఈ కావేరినదిలో జారవిడుస్తాయట. అందువలనే ఈ ప్రాంతాన్ని దక్షిణ త్రివేణి సంగమమని భక్తులు తలుస్తుంటారు.మాయవరం పట్టణం చిదంబరం నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది.పురాతన ఆలయం శాసనాల ప్రకారం క్రీ.శ 9 వ శతాబ్దంలో చోళుల కాలంలో నిర్మితమైందని చెబుతారు.చోళరాజుల వాస్తు నైపుణ్యం, అద్భుతమైన చెక్కడాలు, అపురూపమైన శిల్పాలు ఎంతోగాను ఆకట్టుకుంటాయి. తమిళనాడులోని అత్యంత అందమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధికెక్కింది. (చదవండి: కార్తీకంలో ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారు ?) -
నాగుల చవిత విశిష్టత..! ఈ ఆచారం ఎలా వచ్చిందంటే..
ఆశ్లేష, ఆరుద్ర, మూల, పూర్వాభాద్ర, పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు. సర్పము అనగా కదిలేది, పాకేది. నాగములో ‘న, అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటారు. ఈ నక్షత్రంలో సూర్యుడు సరిగ్గా కార్తీక శుద్ధ చవితి నాడు ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించిన రోజుని నాగుల చవితి అంటారు. మనం కూడా పాములమే..హిందువులు పాములను దేవతలుగా భావించి పుజిస్తారు. శివుడి మెడలో కంఠాభరణం గా, శ్రీ మహా విష్ణువు శయనించే శేష తల్పం నాగులుగా మన పురాణాలు పేర్కొన్నాయి. సనాతన ధర్మంలో ప్రతి జీవిలో దైవం చూడమని పేర్కొంది. అలా ప్రకృతిలో భాగమైన చెట్లు, పక్షులను మాత్రమే కాదు ఆవు నుంచి నాగ పాము వరకూ అనేక రకాల జంతుజాలాలను పుజిస్తారు. అలాంటి పండగలలో ఒకటి నాగుల చవితి. జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా ‘నాగం’. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం, సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరుస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు.తెలుగు రాష్ట్రాల ప్రజలు.. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంత ప్రజలు ఈ నాగుల చవితి పండగను ఘనంగా జరుపుకుంటారు. నాగుల చవితిని శాస్త్రం ప్రకారం చవితి రోజునే జరుపుకోవాలని. ఈ రోజు(నవండర్ 5 ) చవితి తిధి సూర్యోదయ సమయం నుంచి సూర్యాస్తమ సమయం వరకూ ఉంటుంది కనుక.. ఈ రోజున నాగుల చవితి వేడుక జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. భూలోకానికి క్రింద ఉన్న అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలల్లో వివిధ జీవరాసులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి.నాగుల విశిష్టత..కద్రువ నాగ మాత. మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే- ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు, రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది. నాగుల ప్రాణాలను రక్షించిన ఆస్తికుడుపాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు! పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుడుని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు. ‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని, వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’ అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి, సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే, నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు. యుగాలనాటిది. (చదవండి: కార్తీకంలో ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారు ?) -
శ్రీశైలం టెంపుల్ లో కార్తీక మాసం శోభ (ఫొటోలు)
-
కార్తీకంలో ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారు ?
ఈ కార్తీకమాసం అంటే పుణ్య మాసం అనే చెప్పాలి. ఈ నెల శివకేశవులకి ఎంతో ప్రియమైనది. అంతేకాదు ఈ సమయంలో వారికి పూజలు అభిషేకాలు వ్రతాలు చేస్తూ ఉంటారు. కార్తీకమాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ఆకాశ దీపం వెలాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఇది ప్రతీ శివాలయం లో వెలిగించడం మనకు కనిపిస్తుంది. గుడికి వెళ్లిన సమయంలో ఆకాశ దీపాన్ని చూసి నమస్కరిస్తారు అందరూ. ఇలా చేయడం వల్ల పితృదేవతలకు మార్గం చూపుతుంది అని నమ్మకం. దానిని తాడు సాయంతో పైకి పంపించి, ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఇలా ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని వారికి దారి కోసం అని కార్తీకపురాణం చెబుతోంది. ఇలా ఆ దీపాన్ని చూసినా తలచుకున్నా ఎంతో మంచిది మనలో ఉన్న నెగిటీవ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఆ కాంతిలో ఆ ప్రాంతం అంతా ఆ శివయ్య కాపాడుతాడు అని కూడా నమ్ముతారు. ఇక ఇంట్లో కూడా ఇలా ఆకాశదీపం వెలిగించవచ్చు. ఎత్తుగా ఒక కర్రకట్టి దానికి వేలాడదీయవచ్చు అని పెద్దలు పండితులు చెబుతారు, కొందరు ఇళ్లల్లో కూడా దీనిని కడతారు.(చదవండి: కార్తీకం.. పరమ పవిత్రం) -
పంచారామ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
-
కార్తీకాన శివరూపం.. కమనీయం ఆ దర్శనం! (ఫోటోలు)
-
కార్తీక మాసం తొలి సోమవారం.. భక్తులతో శైవక్షేత్రాలు కిటకిట
-
యాదాద్రిలో కార్తీక మాసోత్సవాలు.. ప్రతిరోజూ సత్యనారాయణస్వామి వ్రతాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వచ్చే నెల 2వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో భాస్కర్రావు తెలిపారు. మంగళవారం యాదాద్రి ఆలయ సన్నిధిలోని తన చాంబర్లో ఆయన మాట్లాడారు. కార్తీక మాసం సందర్భంగా యాదాద్రి క్షేత్రానికి భక్తులు అధికంగా రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రీస్వామిని దర్శించుకోవడంతో పాటు ఆలయంలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని, ఈమేరకు కొండ కింద వ్రత మండపంలో డిసెంబర్ 1వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆరు బ్యాచ్లుగా వ్రతాల నిర్వహణ ఉంటుందన్నారు.వచ్చే నెల 15వ తేదీన ఉదయం 5.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 8 బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహిస్తామని చెప్పారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో నెల రోజులపాటు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 5 బ్యాచ్లు, కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు 6 బ్యాచ్లుగా వ్రతాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా 15వ తేదీన ప్రధానాలయం, శివాలయంలో రాత్రి 6.30 గంటలకు ఆకాశ దీపారాధన ఉంటుందని తెలిపారు. చదవండి: పోటెత్తిన రద్దీ.. దీపావళికి సొంతూరి బాటలో జనంఈ నెల 31న దీపావళిని పురస్కరించుకుని ఆలయ నిత్య కైంకర్య వేళల్లో మార్పులు చేశామని చెప్పారు. వేకువజామున 3.30 గంటలకు సుప్రభాతం ప్రారంభమవుతుందన్నారు. 4.15 గంటల నుంచి 4.45 వరకు శ్రీస్వామి అమ్మవార్లకు మంగళహారతుల పూజ జరుగుతుందని, ఉదయం 8.15 గంటల నుంచి సర్వ దర్శనాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. -
అమెరికా, న్యూజెర్సీలో కార్తిక మహోత్సవాలు
-
కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా
-
Vijayawada: విజయవాడ భవానీ ద్వీపంలో కార్తీక మాసం సందడి (ఫొటోలు)
-
కార్తీక పౌర్ణమి రోజున ఈ వ్రతం చేస్తే సిరిసంపదలు సిద్ధిస్తాయట
కార్తీక మాసం..అనేక పర్వదినాలకు ఆలవాలం. శివకేశవులకు, ఆయన వారి కుమారుడు అయ్యప్ప స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి పరమ ప్రీతికరమైన మాసం. నోములు, వ్రతాలు, పూజలు ఈ మాసంలో చేసుకుంటే అధిక ఫలాన్నిస్తాయి. అటువంటి వాటిలో కేదారేశ్వర వ్రతం ఒకటి. కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం నోచుకుంటే సిరిసంపదలకు, అన్న వస్త్రాలకు లోటుండదని పండితులు, పెద్దలు చెబుతుంటారు. మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులను విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతన కాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. మహిళలు , పురుషులనే తారతమ్యం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించే భక్తులు ఇంటిల్లిపాది ఉపవాసాలుండి ఆ కేదారేశ్వరుని ధ్యానించాలి. గంగాజలం లేదా శుద్ధజలం, ఆవుపాలు, చెరుకు రసం, కొబ్బరినీళ్లు, తమలపాకులు , పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం సమర్పించిన అనంతరం నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకోవాలి. కార్తీక మాసంలో కొన్ని ప్రాంతాల్లో నవగ్రహ దీపాల నోముగా నోస్తారు. ఈ నోములో ముందుగా గణపతి ఆరాధన చేసి, తరువాయి శివలింగార్చన చేసి, నవధాన్యాలను కొద్దికొద్దిగా తీసి వాటిపై వేస్తూ దీప ప్రమిదల నుంచి ఓం నమఃశ్శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు స్మరిస్తారు. తరువాత అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసి తొమ్మండుగురు బ్రాహ్మణులకు ఆ దీపాలను దానం ఇస్తారు. దానం చేసేటప్పుడు యథాశక్తి నిండు మనస్సుతో ఇవ్వాలి. ఈ నోము శుభతిథులలో సాయంత్రం వేళల్లో మాత్రమే జరగాలి. నోము అనంతరం అక్షతలను గృహం ఈశాన్య భాగంలో కొద్దిగా చల్లి , కుటుంబంలో అందరూ శిరస్సుపై చల్లుకోవాలి. ఇది సర్వ రక్షాకరంగా కుటుంబాన్ని కాపాడుతుందని పురాణోక్తి. శ్రీ కేదారేశ్వర వ్రత కథ శివుడిని మనం అర్ధనారీశ్వరుడిగా ఆరాధిస్తాం కదా... ఆయన అర్ధనారీశ్వరుడెలా అయ్యాడో వివరించే కథ ఇందులో కనిపిస్తుంది. ఈ కథను సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు.పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందడం కోసం చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతాన్ని గూర్చి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాదులకు చెప్పాడు. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చుని ఉన్నాడు. సిద్ధ–సాధ్య– కిన్నర కింపురుష–యక్ష–గంధర్వులు శివుని సేవిస్తున్నారు. దేవముని గణాలు శివుని స్తుతిస్తున్నారు. అట్టి ఆనంద కోలాహలములలో భృంగురిటి అనబడు శివభక్త శ్రేష్టుడు ఆనందపులకితుడై వినోద సంభరితమైన నాట్యగతులతో సభాసదులను, శివుడ్ని మెప్పించాడు. శివుడాతనిని అభినందించి సింహాసనం నుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనునందు భృంగి మొదలు గాగల వంది మాగదులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి ‘‘నాథా! నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరు పరచి ఇట్లేల చేసితిరి?’’ అని ప్రశ్నించింది. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని ‘‘దేవీ! పరమార్ధ విదులగు యోగులు నీవలన ప్రయోజనం కలుగచేయబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించార’’ ని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినై ఉండి ఆ దండప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సు చేయాలనుకుని కైలాసాన్ని వదలి భూలోకంలో సస్యశ్యామలమైన గౌతమాశ్రమానికి వచ్చింది. అక్కడి మునులు, వారి పత్నులను చూసి వారితో ‘‘నియమనిష్టాగరిష్టులై అలరారు పుణ్యపురుషులారా! పవిత్రాంగన లారా! నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని. శివునిసతిగా నా నాధునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సొనర్చ సంకల్పించుకొన్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చాను. కాబట్టి నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండి’’ అని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు ‘‘అమ్మా! పార్వతీ! ఈప్సితార్ధదాయకమగు ఉత్తమ వ్రతమొకటున్నది. అది కేదారేశ్వర వ్రతం. నీవావ్రతాన్ని ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందంటూ వ్రతవిధానాన్ని వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం తన మేనులో సగభాగాన్ని పార్వతికి అనుగ్రహించాడు. కొంతకాలమునకు శిభక్తపరాయుణడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వరవ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడిచేయగోరి దివినుండి భువికేతించి ఉజ్జయినీ నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదారవ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు. తదనంతరం ఉజ్జయినీ నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి అనే ఇరువురు కుమార్తెలున్నారు. వారిరువురు ఒక వటవృక్షం కింద కూర్చుని తోరం కట్టుకొని భక్తితో పూజ చేసుకున్నారు. మహేశ్వరుడు వారికి పూజాసామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తంగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు, సుందర రూపములను ప్రసాదించి అంతర్హితుడయ్యాడు. ఆ వైశ్య పుత్రికలకు యుక్తవయసు వచ్చింది. సౌందర్యసోయగం కలిగిన ఆ వైశ్య పుత్రికలలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయినీ నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంతకాలానికి చిన్నకుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మత్తురాలై కేదారవ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది, ఆమె భర్త ఆమెను, కుమారుడ్ని రాజ్యం నుంచి వెడలగొట్టివేసాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుడ్ని చేరబలిచి ‘‘నాయనా నీ పెద్దతల్లి ఉజ్జయినీపురం మహారాణి. ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయమర్థించి తీసుకొని రావలసిందని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినీకి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుడ్ని సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్దగల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్దతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్నిచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యమందు చోరరూపుడైన శివుడాసొమ్మును తీసుకొని పోయాడు. మరల అతడు పెద్దతల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ‘‘ఓయీ! నీవు ఎన్నిసార్లు నీపెద్దతల్లి నడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదారవ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదు’’ అని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్దతల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియచెప్పాడు. అప్పుడామె బాగా ఆలోచించి అతని చేత కేదారవ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసినదిగా చెప్పమన్నది. అతడాప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్దతల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసినదని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదారవ్రతాన్ని చేసింది. ఆమె భర్త మందీమార్బలంతో వచ్చి ఆమెను, కుమారుడ్ని రాజధానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారవ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్యసంపదలతో జీవిస్తున్నది. ఎవరు ఈ కేదారేశ్వర వ్రతాన్ని నియమనిష్టలతో కల్పోక్తంగా చేయుదురో అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖంగా జీవించి అంత్యమున శివసాన్నిధ్యం పొందుతారు. -డి. వీ. ఆర్. భాస్కర్ -
కార్తీక పౌర్ణమి.. శివనామ స్మరణతో మార్మోగుతున్న ఆలయాలు
సాక్షి, హైదరాబాద్: శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక పౌర్ణమి, అందులోనూ సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయియి. భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున నుంచే భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాన్నారు. భక్తిశ్రద్దలతో దీపాలు వెలిగిస్తున్నారు. వరంగల్ భద్రకాళి, అన్నవరం, ద్వారకతిరుమల, భద్రాచలం తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే మల్లికార్జున స్వామికి అభిషేకాలు చేయడంతో పాటు ఆలయ ప్రాంగణంలో దంపతులు, మహిళలు వేలాదిగా వచ్చి దీపాలను వెలిగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రహ్లాద్ మాట్లాడుతూ ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి సోమవారం రావడంతో ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఉదయం నాలుగు గంటల నుండి స్వామివారి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అలాగే ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ఆలయ ప్రాంగణంలో జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. నిర్మల్ జిల్లా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఖానాపూర్ పట్టణంలో దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. స్థానిక వెంకటేశ్వర స్వామి, హనుమాన్ దేవలయలలో భక్తులు పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమొగుతున్నాయి. హన్మకొండలోని రుద్రశ్వరస్వామి (వెయ్యి స్తంభాల గుడి), సిద్దేశ్వరా స్వామి దేవాలయం, భద్రకాళి భద్రశ్వరా స్వామి దేవాలయాల్లో తెల్లవారు జామునుంచి భక్తులు బారులు తీరారు. కార్తీకపౌర్ణమి పర్వదినం కావడంతో దేవాలయలకు పోటెత్తారు. కాళేశ్వరం, రామప్ప, పాలకుర్తి సోమేశ్వర స్వామి దేవాలయం, కురవి వీరబాదరస్వామి, ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయాల్లో కార్తీకపౌర్ణమి శోభ సంతరించుకుంది. కాకినాడ జిల్లా కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నవరం శ్రీ సత్యదేవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి వ్రతములు ఆచరిస్తూ శ్రీ స్వామి దర్శనానికి బారులు తీరారు.పిఠాపురం పాదగయ క్షేత్రంలో కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి పాదగయ పుష్కరినిలో పవిత్ర స్నానమాచరించి, కార్తీక దీపాలు వెలిగిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విశాఖపట్నం విశాఖ నగరంలో కార్తీకమాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలు దర్శించుకుంటున్నారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా. ద్వారకాతిరుమల శేషాచల కొండపై శివాలయంలో భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. శివ నామస్మరణలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున కార్తీకదీపం వెలిగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కార్తీక సోమవారం పౌర్ణమి పర్వదిన సందర్భంగా రాజమండ్రి గోదావరి ఘాట్ల వద్ద తెల్లవారుజాము నుంచి భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. శివనామ స్మరణతో శైవాలయాలు మారుమోగుతున్నాయి. రాజమండ్రిలో మార్కండేయ స్వామి ఆలయం, ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయాలతో పాటు పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామం, అంబేద్కర్ కౌన్సిలింగ్ జిల్లాలోని కోటిపల్లి మురమళ్ళ ముక్తేశ్వరం లోని క్షణముక్తేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుండి స్వామివారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. -
'కార్తీకమాసంలో ఇలా చేస్తే సర్వ పాపాలు తొలుగుతాయి'
మాసాల్లో కార్తీకం..యుగాల్లో కృత యుగం..శాస్త్రాల్లో వేదం..తీర్థాల్లో గంగానదికి సమానమైనవి లేవన్నది పురాణ వచనం. అంతటి మహత్యం గల కార్తిక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైది. అందుకే భక్తులు వేకువనే చన్నీటి స్నానాలు.. జప, తప నియమాలు..పూజలు.. ఉపవాసదీక్షలు చేస్తారు. కార్తీక మాస విశిష్టతపై ప్రత్యేక కథనం. చిత్తూరు రూరల్: కార్తీక మాసంలో చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉండడంతో ఈ నెలకు ఆ పేరు వచ్చింది. ఈ నెల శివకేశవులిద్దరికీ ప్రీతికరం. ఈ నేపథ్యంలో ఊరూరూ హరిహరుల నామస్మరణతో మార్మోగనున్నాయి. రాత్రి వేళల్లో వదీపాల వెలుగులు విరజిమ్మనున్నాయి. ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం వచ్చే నెల 12వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ నెల రోజులు శైవ, వైష్ణవ క్షేత్రాలు భక్తుల సందడితో కిటకిటలాడనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,197 దేవాలయాలున్నాయి. వీటిలో శివాలయాలు 45 వరకు ఉన్నాయి. ఈ ఆలయాల్లో కార్తిక పూజలు శ్రేష్టంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో ఆలయాలు భక్తులతో కళకళలాడనున్నాయి. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను ఆయా ఆలయ నిర్వాహకులు చేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు లేకుండా దీపారాధన చేసేందుకు పనులు పూర్తి చేశారు. కార్తీక స్నానం కార్తీక మాసమంతా తెల్లవారుజామునే లేచి కృతికా నక్షత్రం అస్తమించేలోపు నది, చెరువు, కాలువల్లో కానీ, ఈ వనరులు అందుబాటులో లేకుంటే ఇంట్లో కానీ తలస్నానం చేయాలి.అప్పుడే కార్తీక స్నానం అవుతుంది. ఈ నియమంతో స్నానం చేసి, శివుడు, విష్ణువు, మరే దైవాన్ని అయినా ధ్యానించి, అర్ఘం ఇవ్వడంతో గంగానది, పుష్కర తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతాయి. సర్వ పాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం. పుణ్యప్రదం.. కార్తీక దీపం భారతీయ సంస్కృతిలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో దీపారాధనకే ప్రథమ స్థానం. అందుకే ఇంట్లోకానీ, శివాలయంలో కానీ ప్రాతఃకాలం, సాయంకాలం దీపారాధన చేస్తారు. ఎవరైనా తెలిసికానీ, తెలియకుండా కానీ ఎక్కడైనా సరే దీపం పెడితే వారి పాపాలు హరిస్తాయని పురాణాలు తెలుపుతున్నాయి. దీపం, బంగారం, నవధాన్యాలు, అన్నం దానం చేస్తే సీ్త్రలకు సౌభాగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే దీపారాధనతో పాటు శివుడికి ప్రత్యేకంగా రుద్రాభిషేకం, లక్షబిల్వార్చ, అమ్మవారికి లక్షకుంకుమార్చన జరిపిస్తారు. వన భోజనం ప్రకృతి ఒడిలో సేదతీరుతూ అప్యాయతలను పంచుకునే అపురూప సందర్భం వనభోజనం కార్తిక మాస ప్రత్యేకం. ఐక్యత సాధనకు ఇది ఎంతో ఉపకరణం. కలిసిమెలసి మసలుకునే తత్త్వం వనభోజన సంబరాలతో అలవడుతుంది. ఈ కార్యక్రమం వనాలపై మన బాధ్యతను గుర్తు చేస్తుంది. ఈ భోజన సంబరంలో పూర్తి సాత్విక వంటకాలనే భుజిస్తారు. కార్తీకం.. ఆచరణ ఇలా కార్తిక మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి. తేలికైన ఆహారం భూజించాలి. ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. పాలు, పండ్లు భుజించవచ్చు. రాత్రి భోజనం చేయకూడదు. అబద్ధాలు, దైవదూషణ చేయకూడదు. తప్పుడు పనులు చేస్తే పాపమని పురాణాలు చెబుతున్నాయి. పుణ్యఫలం సిద్ధిస్తుంది కార్తీక మాసంలోని ప్రతి రోజు కూడా అత్యంత శ్రేష్టమైనది. కార్తిక మాసం శివకేశవులకు చాలా ప్రీతపాత్రమైనది. తెల్లవారుజామునే ఆలయాలను దర్శించుకుని పూజలు చేయాలి. ఈ మాసంలో శివకేశవులను పూజిస్తే మహాపుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానాన్ని పారద్రోలే జ్ఞాన జ్యోతులు కావాలి. ఈ నెలలో 17న నాగుల చవితి, 18న స్కంధషష్టి, 26న కార్తీకదీపం అతిముఖ్యమైన పండుగలు. –సుధాకర్ గురుక్కల్, వేదపండితులు, చిత్తూరు -
రాజమండ్రి గోదావరిలో కార్తీక మాస స్నానాలు
-
తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు
-
శివ నామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు
-
శివ నామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు
-
తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు
-
శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు
-
ద్రాక్షారామం ఆలయంలో కార్తీక మాసం సందడి
-
యాదాద్రీశుడికి కలిసొచ్చిన కార్తీక మాసం.. ఆదాయం రెండింతలు!
యాదగిరిగుట్ట: యాదాద్రి ఆలయానికి ఈ కార్తీక మాసం కలిసొచ్చింది. గతేడాది కార్తీక మాసంతో పోల్చుకుంటే ఈసారి అన్ని విభాగాల ద్వారా ఆదాయం డబుల్ అయింది. చివరి రెండు ఆదివారాలు భక్తులు 50వేల కంటే ఎక్కువగా వచ్చి స్వామిని దర్శించుకోవడంతో నిత్యా ఆదాయం సైతం రికార్డు స్థాయిలో వచ్చింది. ఇక సత్యనారాయణస్వామి వ్రతాలు సైతం ఈసారి అధికంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఈఓ గీతారెడ్డి బుధవారం రాత్రి వెల్లడించారు. ఆదాయం రెండింతలు.. గతేడాది కార్తీక మాసంలో రూ.7,35,10,307 ఆదాయం రాగా, ఈసారి రూ.14,66,38,097 ఆదాయం వచ్చింది. యాదాద్రి ప్రధానాలయం మార్చి 28న ప్రారంభమైన తర్వాత క్షేత్రానికి భక్తులు రాక అధికంగా పెరిగింది. స్వయంభూ దర్శనం పునఃప్రారంభం అయిన తరువాత మొదటిసారి వచ్చిన కార్తీక మాసం కావడంతో స్వామివారికి కలిసి వచ్చిందని చెప్పవచ్చు. వ్రతాలతో రూ.1.71కోట్లు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి క్షేత్రం తర్వాత యాదాద్రిలోనే భక్తులు అధికంగా సత్యనారాయణస్వామి వ్రతాలను జరిపిస్తారు. ఈ కార్తీక మాసంలో 21,480 సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించగా రూ.1,71,84,000 ఆదాయం చేకూరినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది బాలాలయం ఉన్న సమయంలో 19,176 వ్రతాలు మాత్రమే జరిపించారు. రికార్డు స్థాయిలో నిత్యాదాయం.. కార్తీకమాసం చివరి రెండు ఆదివారాలు 50వేలకు పైగానే భక్తులు స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ నెల 13న ఆదివారం రోజున స్వామి వారికి రూ.1,09,82,446 నిత్య ఆదాయం రాగా, 20న ఆదివారం రోజున రూ.1,16,13,977 నిత్య ఆదాయం వచ్చింది. కార్తీక మాసం చివరి ఆదివారం వచ్చిన ఆదాయమే ఆలయ చరిత్రలో అధికమని అధికారులు వెల్లడించారు. (క్లిక్ చేయండి: ప్రధాన టెర్మినల్ నుంచే విమాన సర్వీసులు) -
శివయ్య ప్రసాదం.. మూగజీవులకు ఆహారం
రాజంపేట టౌన్ (అన్నమయ్య జిల్లా): కార్తీక మాసం సందర్భంగా వందలాది మంది భక్తులు శివాలయాలకు తరలి వచ్చి దీపాలను వెలిగించి స్వామివారికి పండ్లను ప్రసాదంగా ఉంచుతారు. ఆ పండ్లను భక్తులు తమ వెంట తీసుకెళ్లకుండా అక్కడే ఉంచి వెళ్లిపోతారు. వందలాది మంది భక్తులు వదిలి వెళ్లే వివిధ రకాల పండ్లు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ప్రధానంగా భక్తులు దీపాలను వెలిగించాక స్వామివారికి అరటి పండ్లను ప్రసాదంగా పెడతారు. ఒక్క రాజంపేట పట్టణంలోని శివాలయంలోనే కార్తీక సోమవారం రోజు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు స్వామివారికి ప్రసాదంగా పెట్టే అరటి పండ్లు వేల సంఖ్యలో ఉంటాయి. ఈ కారణంగా కొన్ని గంటల వ్యవధిలోనే ఆలయ ప్రాంగణమంతా వేల సంఖ్యలో అరటి పండ్లు పడి ఉంటాయి. అయితే ఈ పండ్లు నిరుపయోగమవుతున్నాయని పట్టణంలోని ఈడిగపాళెంకు చెందిన నరసింహా అనే ఎలక్ట్రీషియన్ గుర్తించాడు. పండ్లను మూగజీవులకు ఆహారంగా పెడితే ఒక రోజు అయినా అవి కడుపు నింపుకోగలవన్న ఆలోచన ఆయనలో తట్టింది. అనుకున్నదే తడవుగా తన షాపునకు చుట్టుపక్కల ఉండే చిరు వ్యాపారులు, దినసరి కూలీల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి, భక్తులు శివాలయ ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ వదిలిన అరటి పండ్లను ఏరుకొని మూగజీవులకు ఆహారంగా పెడతామని చెప్పాడు. వారు కూడా నరసింహా ఆలోచన సరైనదేనని భావించి కార్తీక మాసంలో భక్తులు శివాలయంలో స్వామివారికి ప్రసాదంగా పెట్టే అరటి పండ్లతో పాటు కొబ్బెర చిప్పలను మూగజీవులకు ఆహారంగా పెట్టేందుకు ముందుకు వచ్చారు. 2016వ సంవత్సరం నుంచి కరోనా సమయంలో మినహా ప్రతి ఏడాది కార్తీక మాసంలో నరసింహాతో పాటు చిరువ్యాపారులు, దినసరి కూలీలైన వెంకటనరసయ్య, రమణ, బీవీ సురేంద్ర, ఉమాశంకర్లు శివాలయంలోని అరటి పండ్లను గోతాల్లో వేసుకొని ప్రత్యేక వాహనంలో రాపూరు ఘాట్లో ఉండే కోతులకు ఆహారంగా పెడుతున్నారు. కార్తీక మాసంలో ప్రతి మంగళవారం ఈ చిరు వ్యాపారులు, దినసరి కూలీలు తమ పనులను సైతం మానుకొని ఆటో బాడుగను కూడా వారే భరించి మూగజీవులకు చేస్తున్న సేవకు పట్టణ వాసులచే ప్రసంశలు, అభినందనలు అందుకుంటున్నారు. రాపూరు ఘాట్లో కోతులు పెద్ద సంఖ్యలో ఉంటాయని, వాటికి ఎవరు కూడా ఆహారం పెట్టే పరిస్థితి ఉండదని అందువల్ల ప్రతి ఏడాది కార్తీకమాసంలో ఈసేవా కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. (క్లిక్ చేయండి: వెయ్యేళ్ల అన్నమయ్య ‘కాలి’బాట.. ఎక్కడుందో తెలుసా!) -
బఘేల్ విన్యాసాలు.. భలే భలే
రాయ్పూర్: గిర్రున తిరిగి నీటిలో హుషారుగా మునకలు వేస్తున్న పెద్దాయనను చూశారా. వయసు శరీరానికే గానీ మనసు కాదు అన్నట్టుగా విన్యాసాలు చేస్తున్నారాయన. ఆయనేమి సామాన్య వ్యక్తి కాదు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం చత్తీస్గఢ్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూపేశ్ బఘేల్ పుణ్యస్నానమాచరించారు. ఈ సందర్భంగా ఆయన నీటి విన్యాసాలు ప్రదర్శించారు. ఒక్క గెంతున నీటిలోకి దుమికారు. వెనక్కి గెంతి కూడా ఆయనీ విన్యాసాన్ని ప్రదర్శించారు. ఈ వీడియోను ట్విటర్లో భూపేశ్ బఘేల్ షేర్ చేశారు. మహాదేవ్ పేరు తలచుకుని.. సంపూర్ణ కార్తీక స్నానం ఆచరించినట్టు పేర్కొన్నారు. గత నెలలో దుర్గ్ జిల్లాలో జరిగిన గౌరి పూజాకార్యక్రమంలో కొరడాతో కొట్టించుకుని ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. (క్లిక్ చేయండి: మా గవర్నర్ అనర్హుడు.. తప్పించండి) -
కార్తీక దీపం.. శోభాయమానం (ఫొటోలు)
-
Karthika Masam Special Photos: కార్తీక వన మహోత్సవ సందడి (ఫొటోలు)
-
కార్తీక మాస ప్రత్యేక పూజలు, పుణ్యస్థానాలు (ఫొటోలు)
-
శివనామస్మరణతో మారుమ్రోగుతున్న శివాలయాలు
-
కార్తీక మాస ఏకాదశి పూజలు (ఫొటోలు)
-
హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం (ఫొటోలు)
-
హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో వైభవంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)
-
శ్రీశైలంలో భక్తులకు దశవిధహారతుల దర్శనం
శ్రీశైలం టెంపుల్: పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం. ఈ మాసంలో శివుడిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో శ్రీశైలంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారు. కార్తీకమాసోత్సవాల్లో భాగంగా ప్రతి సోమవారం శ్రీగిరిలో లక్షదీపోత్సవం, ఆలయ పుష్కరిణి వద్ద దశవిధ హారతుల కార్యక్రమాన్ని ఆలయాధికారులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే దశవిధహారతులు వాటి వల్ల కలిగే పుణ్య ఫలం గురించి శ్రీశైల ఆలయ ప్రధాన అర్చకులు జె.వీరభద్రయ్యస్వామి మాటల్లోనే.. ఓంకార హారతి : పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరమే ఓంకారం. ఓంకారహారతిని దర్శించడం వలన కష్టాలన్నీ నివారించబడి సకల శుభాలు కలుగుతాయి. నాగహారతి: నాగహారతిని దర్శించడం వలన సర్పదోషాలు తొలగిపోతాయి. సంతానం కలుగుతుంది. త్రిశూలహారతి: త్రిశూలహారతిని దర్శించడం వలన అకాలమరణం తొలగిపోతుంది. గ్రహదోషాలు నివారించబడతాయి. నందిహారతి: నందిహారతిని దర్శించడం వలన భయం, దుఃఖము ఉండదు. ఆనందం, ఉత్సాహం లభిస్తాయి. సింహహారతి: సింహహారతిని దర్శించడం వలన శత్రుబాధలు తొలగుతాయి. మనోధైర్యం కలుగుతుంది. సూర్యహారతి: సూర్యహరతిని దర్శించడం వలన ఆరోగ్యం చేకూరుతుంది. దీర్ఘాయుష్షు లభిస్తుంది. చంద్రహారతి: చంద్రహారతిని దర్శించడం వలన మనశుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ ద్వేషాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుంభహారతి: కుంభహారతిని దర్శించడం వలన కొరుకున్న కోరికలు నెరవేరుతాయి. సంపదలు కలుగుతాయి. నక్షత్రహారతి: నక్షత్రహారతిని దర్శించడం వలన జాతక దోషాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది. కర్పూర హారతి: కర్పూరహారతిని దర్శించడం వలన పాపాలన్నీ తొలగిపోతాయి. యజ్ఞఫలంతో పాటు అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. (క్లిక్ చేయండి: హరిహరులకు ఎంతో ప్రీతికరం.. కార్తీక మాసం) -
పంచారామాలు... ప్రసిద్ధ క్షేత్రాలు
భీమవరం(ప్రకాశం చౌక్)/పాలకొల్లు సెంట్రల్: కార్తీకమాసం తొలి సోమవారానికి పశ్చిమగోదావరి జిల్లాలోని పంచారామక్షేత్రాలైన భీమవరం గునుపూడి లోని ఉమాసోమేశ్వర జనార్దనస్వామి ఆల యం (సోమారామం), పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయం (క్షీరారామం) ముస్తాబయ్యాయి. భీమవరంలో క్షేత్రానికి వేకువజాము నుంచి భక్తుల తాకిడి ఉంటుందని, సుమారు 50 వేల మంది భక్తులు వస్తా రనే అంచనాతో ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈఓ ఎం.అరుణ్కుమార్ తెలిపారు. ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాట్లు చేశామని, ఉచిత దర్శనంతో పాటు రూ. 50, రూ.100 ప్రత్యేక దర్శనా లు కల్పిస్తామన్నారు. ఆలయం వెనుక వైపు స్వామికి అభిషేకాలు, కార్తీక నోములు నోచు కునే ఏర్పాట్లు చేశామన్నారు. అన్నదాన కమి టీ ఆధ్వర్యంలో అన్నదానం చేస్తామని, పోలీసు, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఆదివారం అధిక సంఖ్యలో.. ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. క్షీరారామం.. శోభాయమానం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ట్రస్ట్బోర్డ్ చైర్మన్ కోరాడ శ్రీనివాసరావు, ఈఓ యాళ్ల సూర్యనారాయణ ఆదివారం ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయం వెలుపల ప్రాకారం లోపల ఉన్న గోశాల వద్ద కార్తీక దీపాలు వెలిగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక దర్శనం టికెట్ కౌంటర్లు ఆంజనేయస్వామి ఆలయం పక్కన, సర్వదర్శనం క్యూలైన్లు దేవస్థానం కార్యాలయం పక్కనున్న మండపం వద్ద కేటాయించారు. ప్రసాదం విక్రయాలను ప్రత్యేక క్యూలైన్ పక్కన అలాగే సేవా సంస్థలు, దాతలు పా లు, ప్రసాదాలను ఆలయం బయట ఉత్తరం గేటు వద్ద భక్తులకు అందించేలా చర్యలు తీసుకున్నారు. వేకువజామున కార్తీక దీపాలు వెలిగించడంతో పాటు దీప, ఉసిరి, సాలగ్రామ, వస్త్ర, గోదానాలు ఇచ్చే భక్తుల కోసం ఆలయ ఉత్తర భాగంలో గోశాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. పంచారామ యాత్రికుల వాహనాల పార్కింగ్కు బస్టాండ్ వెనుక సంత మార్కెట్ రోడ్డు, మార్కెటింగ్ యార్డు రోడ్డు వద్ద స్థలాలను కేటాయించారు. క్షేత్రంలో పూర్తిస్థాయిలో ఏర్పాట్లను చేసినట్టు ఆలయ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. -
తెలుగు రాష్ట్రాల్లోకార్తీక తొలి సోమవారం శోభ ఆలయాల్లో భక్తుల సందడి (ఫోటోలు)
-
కార్తీక మాసం షురూ.. యాదాద్రిలో భక్తుల సందడి (ఫోటోలు)
-
కార్తీక మాసం తొలి సోమవారం.. భక్తుల దీపారాధన (ఫోటోలు)
-
యాదాద్రికి కార్తీకం తాకిడి
యాదగిరిగుట్ట : కార్తీక మాసం కావడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. హైదరాబాద్ జంటనగరాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చారు. సుమారు 40 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి 3 గంటలు, రూ.150 టికెట్ దర్శనానికి గంటన్నర సమయం పట్టిందని భక్తులు తెలిపారు. 734 జంటలు వ్రత పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వ్రతాలు, నిత్య పూజల ద్వారా ఆదివారం ఒక్కరోజే రూ.52,17,063 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. -
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై గాజుల ఉత్సవం (ఫొటోలు)
-
నల్గొండ జిల్లా : యాదాద్రికి కార్తీక శోభ (ఫొటోలు)
-
హరిహరులకు ఎంతో ప్రీతికరం.. కార్తీక మాసం
హరిహరులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం బుధవారం (అక్టోబర్ 26) నుంచి ప్రారంభమైంది. నవంబర్ 23 వరకు కొనసాగే ఈ మాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యం ఉంది. అన్ని ఆలయాలు, నదీతీరాలు, ఇళ్లల్లో సైతం దీపాలను వెలిగించడం పుణ్యప్రదమని కార్తీక పురాణం చెబుతోంది. దీపదర్శనం, దీపదానం, దీప ప్రకాశనం అనే మూడు ఈ మాసంలో ఎంతో పుణ్యాన్నిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఆలయాలు కార్తీక సందడికి సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక సోమవారాలు, ఏకాదశి, శనివారంతో పాటు ఈ నెలరోజులూ పుణ్యదినాలేనని అర్చకులు చెబుతున్నారు. విశిష్టత ఇలా.... కార్తిక శుద్ధ పాడ్యమికి బలి పాడ్యమి అని పేరు. ఈ రోజున బలిచక్రవర్తిని పూజించి దానం చేస్తే సంపదలు తరగవని చెబుతారు. మరుసటి రోజు ‘భగినీ హస్త భోజనం’ చేస్తారు. దీన్నే యమ ద్వితీయ, భ్రాత ద్వితీయ అని కూడా అంటారు. ఈ రోజున మహిళలు సోదరులు, సోదర వరసైన వారిని ఇంటికి పిలిచి స్వయంగా వంటచేసి భోజనం వడ్డిస్తారు. శుద్ధ చవితిని నాగుల చవితిగా చేసుకుంటారు. శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశికి ప్రబోధన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని పేరు. ఆ మరుసటి రోజుకు క్షీరాబ్ధి ద్వాదశి అని పేరు. శుద్ధ చతుర్దశికి వైకుంఠ చతుర్దశి అని పేరు. ఈ రోజున మహావిష్ణువు పరమశివుణ్ని పూజించారని నానుడి. కార్తికపౌర్ణమిని పరమశివుడు త్రిపురాసులను సంహరించిన రోజుగా చెబుతారు. ఈ రోజున శివాలయాల్లో జ్వాలా తోరణోత్సవాన్ని నిర్వహిస్తారు. దీపమే దైవం... ‘దీపం జ్యోతి పరబ్రహ్మం’ అన్నారు. దీపమే దైవ స్వరూపమని అర్థం. అందుకే లోకాల్లో చీకట్లను తొలగించే దీపారాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం, విప్పనూనె వంటి వాటితో కూడా దీపారాధనలు చేస్తారు. నదీ స్నానం, దానధర్మాలు, ఉపవాసాలు, పూజలు, వ్రతాలు, నోములకు కూడా ఈ మాసంలో ఎంతో ప్రాధాన్యం ఉంది.. దీనివల్ల కష్ట నష్టాలు పోవడంతో పాటు పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. మొత్తం నాలుగు కార్తీక సోమవారాలు అక్టోబర్ 26వ తేదీ నుంచి వచ్చేనెల 23వ తేదీ వరకు కార్తీక మాసంలో మొత్తం నాలుగు సోమవారాలు వచ్చాయి. ఈనెల 31వ తేదీ మొదటి కార్తీక సోమవారం, నవంబర్ 4న ఏకాదశీ, 7న రెండో కార్తీక సోమవారం, అదే రోజు కార్తీక పౌర్ణమి, జ్వాలా తోరణం, 8న చంద్ర గ్రహణం, నవంబర్ 14న మూడో సోమవారం, 21న నాల్గోవ సోమవారం. ఆకాశదీపం ప్రత్యేకం ఆయా ఆలయాల వద్ద ద్వజస్తంభాలకు ఈ నెల రోజుల పాటు సాయంత్రం వేళ ఆకాశదీపాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేసి దీపాలను ధ్వజస్తంభాలకు వేలాడదీస్తుంటారు. ఈ దీపాన్ని చూసిన, నమస్కరించిన దోషాలు తొలగి సుఖసంతోషాలతో జీవిస్తారని భక్తుల విశ్వాసం. ఏటేటా ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. (క్లిక్ చేయండి: కేదారేశ్వర వ్రతం ఎందుకు చేసుకుంటారంటే!) -
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసం సందడి
-
Vijayawada: దుర్గమ్మకు భారీగా దసరా ఆదాయం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో రూ.16 కోట్ల మేర ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ భ్రమరాంబ తెలిపారు. ఇంద్రకీలాద్రి మహా మండపం ఆరో అంతస్తులో ఆమె సోమవారం విలేకరులకు ఉత్సవ ఆదాయ వ్యయాలను వివరించారు. హుండీ కానుకల ద్వారా రూ.9.11 కోట్లు, దర్శన టికెట్ల ద్వారా రూ.2.50 కోట్లు, ప్రసాదాల విక్రయాలతో రూ.2.48 కోట్లు, ఆర్జిత సేవల టికెట్ల ద్వారా రూ.1.03 కోట్లు, తలనీలాల ద్వారా రూ.20 లక్షలు, విరాళాలు ఇతరత్రా కలిపి రూ.16 కోట్ల ఆదాయం సమకూరిందని వివరించారు. ఉత్సవాల ఏర్పాట్లు, ప్రొవిజన్స్, ఇతర ఖర్చులకు రూ.10.50 కోట్ల మేర వెచ్చించామని తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్శర్మ, వైదిక కమిటీ సభ్యుడు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, ఈఈలు కోటేశ్వరరావు, రమా పాల్గొన్నారు. 26 నుంచి కార్తిక మాసోత్సవాలు ఈ నెల 26 నుంచి నవంబర్ 23వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై కార్తిక మాసోత్సవాలను వైభవంగా నిర్వహి స్తామని ఈఓ భ్రమరాంబ తెలిపారు. 23వ తేదీన ధనత్రయోదశి సందర్భంగా మహాలక్ష్మి యాగం, 24న దీపావళి సందర్భంగా అమ్మవారి ప్రధాన ఆలయంలో ధనలక్ష్మి పూజ, సాయంత్రం ఏడు గంటలకు ఆలయ ప్రాంగణంలో దీపావళి వేడుకలు నిర్వహిస్తామన్నారు. 25వ తేదీ సూర్యగ్రహణం నేపథ్యంలో ఉదయం 11 గంటలకు ఆలయాన్ని మూసివేసి, 26 ఉదయం ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామన్నారు. నవంబర్ ఎనిమిదో తేదీన చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం ఎనిమిది గంటలకు అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాలను మూసివేసి మరుసటిరోజు ఉదయం పూజల అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. నవంబర్ 4 నుంచి భవానీ మండల దీక్షలు నవంబర్ నాలుగో తేదీ నుంచి భవానీ మండల దీక్షలు, 24వ తేదీ నుంచి అర్ధమండల దీక్షలు ప్రారంభమవుతాయని ఈఓ తెలిపారు. డిసెంబర్ 15వ తేదీ నుంచి భవానీ దీక్ష విరమణలు ప్రారంభమై 19వ తేదీ పూర్ణాహుతితో ముగుస్తాయని పేర్కొన్నారు. డిసెంబర్ ఏడో తేదీన సత్యనారాయణపురం రామకోటి నుంచి కలశజ్యోతుల మహోత్సవం ప్రారంభమవుతుందని తెలిపారు. (క్లిక్ చేయండి: గుండెకు ‘ఆరోగ్యశ్రీ’ అండ) -
భద్రాద్రిలో 26 నుంచి ‘కార్తీక’ పూజలు
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 26 నుంచి కార్తీక మాస ప్రత్యేక పూజలు జరగనున్నాయి. 26 నుంచి 30వ తేదీ వరకు మణవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలను నిర్వహిస్తారు. 31న విశ్వక్సేన తిరునక్షత్రం, నవంబర్ 1 విశ్వక్సేనుడికి స్నపన తిరుమంజనం, చుట్టు సేవ నిర్వహించనున్నారు. నవంబర్ 5న క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా స్వామివారిని జగన్మోహినిగా అలంకరిస్తారు. 8న చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసేసి, గ్రహణం అనంతరం తెరిచి సంప్రోక్షణ చేస్తారు. ఆ రోజున నిత్యకల్యాణం రద్దు చేస్తారు. తిరిగి 9వ తేదీన సుప్రభాత సేవ తర్వాత దర్శనాలు ప్రారంభమవుతాయి. 14వ తేదీన కార్తీక మాస శ్రీరామ పునర్వసు దీక్షలు ప్రారంభిస్తారు. 20న సర్వ ఏకాదశి సందర్భంగా లక్ష కుంకుమార్చన, ప్రత్యేక పూజలు, 21న కార్తీక బహుళ ద్వాదశి సందర్భంగా గోదావరి నదీ హారతి ఉంటాయని ఆలయ వైదిక కమిటీ సభ్యులు వెల్లడించారు. -
కార్తీకమాస చివరి సోమవారం.. ఆలయాల్లో పోటెత్తిన భక్త జనం
-
హాంగ్ కాంగ్లో ఘనంగా కార్తీక మాస పూజ, వనభోజనాల సందడి!!
హాంగ్ కాంగ్లో కార్తీక మాసం నాడు దీపావళి సంబరాలు, భాయ్ దూజ్(భాగిని హస్త భోజనం), కందషష్టి పూజలను తమిళ సంఘం వారు నవంబర్ 4 నుంచి 10 వరకు ఎంతో వైభవంగా జరిపించగా, హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వారు శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతం, వనభోజనం నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం హాంగ్కాంగ్కి వచ్చే తెలుగు వారిలో సాధారణంగా యువ జంటలు ఎక్కువగా ఉంటారు. వీరు శ్రీ సత్యనారాయణ స్వామి వారి పూజ చేసుకోవాలనుకున్నా ఇక్కడ తెలుగు పురోహితులు లేనందుకు నిరాశ చెందేవారు. ఈ విషయాన్ని సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటీ తమ సభ్యులతో చర్చించగా శ్రీ పత్రి భీమసేన తాము చేయిస్తామని స్వచ్చందగా ముందుకు వచ్చి ప్రతి సంవత్సరము కార్తీక మాసం లేదా మాపు మాసంలో తప్పకుండా వ్రతం చేయిస్తున్నారు. వారు హాంగ్కాంగ్లో మూడు దశాబ్దాలకు పైగా ఇక్కడ నివసిస్తున్నారు. దేశం కాని దేశంలో ఉన్న తెలుగు యువ జంటలకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలని సంకల్పం కలగటం ప్రశంసనీయమైన విషయం! పట్టు వదలకుండా కొన్ని సంవత్సరాలుగా వీరి సంకల్పాన్ని సార్థక పరచటం లో విజయాన్ని సాధిస్తున్న శ్రీమతి జయ ప్రయత్నం మరింత ప్రశంసనీయం అన్నారు శ్రీ భీమసేన గారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి కూడ ఎంతో శ్రద్దా భక్తులతో వ్రతం చేసుకున్న యువ జంటలకు మా హార్దిక శుభాకాంక్షలు. ఈ రోజుల్లో పాశ్చాత్య సంస్కారానికి లొంగిపోయిన యువతలో పూజ చేసే సరైన సదుపాయం లేని హాంగ్ కాంగ్లో ఈ పూజ చెయ్యాలని సంకల్పించి పూజ సామాగ్రిని ప్రయాసతో సమకూర్చుకొన్న ఈ జంటలకి, పూజ సక్రమంగా జరగటానికి దోహద పడిన స్వచ్చంద సేవకులకు హార్దిక అభినందనలు తెలిపారు. ముందుగా విఘ్నేశ్వర పూజ చేయించి తర్వాత శ్రీ రామా సహిత సత్యనారాయణ స్వామి ప్రాణ ప్రతిష్ట చేయించి, నవగ్రహాల ఆవాహనం ప్రతి గ్రహానికి అష్టోత్తర పూజ, అష్ట దిక్పాల పూజ మొదలైన వాటి తర్వాత, లక్ష్మీ సమేత శ్రీ సత్యనారాయణ ప్రతిమలకు రూపులకు పురుషసూక్త స్త్రీ సూక్త భూసూక్తాలతో అభిషేకం, పిమ్మట సత్యనారాయణ అస్టోత్తరం, సత్యనారాయణ స్వామి ప్రసాదాలు నైవేద్యం పెట్టించి వ్రత కధలు అయిదు చెప్పి, పునః పూజ తరువాత మహా నైవేద్యం, హారతితో పూజ సంపూర్ణం కాగా అందరూ ఎంతో భక్తితో ప్రసాదాలు స్వీకరించి ఆనందంగా తమ ఇళ్లకు తరలి వెళ్లారు. వీరందరూ ఎంతో ఏకాగ్రతతో మూడు గంటలసేపు కుటుంబ సమేతంగా పూజ చేసి శ్రీ సత్యనారాయణ స్వామి వారి కటాక్షాన్ని పొందారు. హిందు దేవాలయ సిబ్బంది సహకారంతో పూజామంటపాన్ని చాలా అందంగా అలంకరించిన సేవకులకు కృతజ్ఞతలు. ఈ పూజ కలకాలం నిరాటంకంగా కొనసాగాలని, అందరి సత్సంకల్పాలు దివ్యంగా నెరవేరాలని, ప్రపంచమంతా అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండేలా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని మనస్పూర్తిగా ప్రార్ధించడం జరిగింది. 2018 లో కార్తీక వనభోజనం తర్వాత, 2019లో నిరసనలు & 2020లో కోవిడ్ కారణంగా ఎటువంటి కార్యక్రమాలు జరగలేదు. రెండు ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం కార్తీక వనభోజనాలని సభ్యులందరు ఎంతో ఆనందోత్సాహాలతో కలిసి జరుపుకున్నారు. అదే రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారికి, అలాగే పెళ్లిరోజు ప్రధమ వార్షికోత్సవం జరుపుకుంటున్న యువ జంటతో పాటు మరొక జంట తమ పన్నెండవ పెళ్లిరోజుని ఎంతో సంబరంగా తెలుగు వారందరితో జరుపుకున్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వారిది ఒక ప్రత్యేక ఆనవాయితీ ఉందని, క్రొత్తగా హాంగ్ కాంగ్ వచ్చిన వారిని తమ పరిచయాలు తెలుపమని, తద్వారా వారికి క్రొత్త స్నేహితులు ఏర్పడటానికి అవకాశం కల్పించడం సమాఖ్య ముఖ్యోద్దేశమని వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమతి జయ పీసపాటీ తెలియజేశారు. రానున్న సంవత్సరంలో తమ సంస్థ తలపెట్టిన కార్యక్రమాల విషయాలను ప్రస్తావిస్తూ, యువతరం ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడమే కాదు, భాద్యతలు కూడా చేపట్టాలని ప్రోత్సహించారు. ఎంతో కాలం తరువాత, ఇలా దేశం కానీ దేశంలో కార్తీక మాసంలో వనభోజనాలలో బంతి భోజనం చేయడం తమకేంతో ఆనందాన్నిచ్చిందని అందరూ తెలిపారు. -
వరంగల్ జిల్లా ఆలయాల్లో కార్తీక పౌర్ణమి శోభ
-
నేతి బీరకాయకూ ఓ రోజొచ్చింది! డిమాండే డిమాండు
నందిగామ: నేతిబీరకాయకూ ఓ రోజొచ్చింది. మామూలు రోజుల్లో దీనిని అడిగే నాథుడే ఉండడు. కానీ ఏడాదిలో ఒక్కరోజు మాత్రం అది ఈరోజు నాది అని సగర్వంగా చెప్పుకుంటుంది. కార్తిక పౌర్ణమి నేపథ్యంలో పట్టణంలో నేతిబీరకాయకు డిమాండ్ పెరిగింది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో నేతి బీరకాయలు విరివిగా దర్శనమిచ్చేవి. చదవండి: Visakhapatnam: ఆ ఊహలన్నీ త్వరలోనే నిజం కానున్నాయి.. కాలక్రమంలో ఇవి కనుమరుగు కావడంతో మార్కెట్లో వీటి లభ్యత అరకొరగానే ఉంటోంది. అయితే, కార్తికపౌర్ణమి రోజున నేతి బీరకాయతో వంటకాలు రుచి చూడటం ఎంతో శ్రేష్టమని ప్రజలు భావిస్తారు. దీంతో గురువారం నందిగామ మార్కెట్లో వీటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకొని అమ్మకందారులు ఒక్కో కాయను రూ.50 చొప్పున విక్రయించడం గమనార్హం. చదవండి: ఎక్కడి నుంచి వచ్చిందో ఆ యువతి.. ఆకతాయిలు వేధిస్తుండడంతో.. -
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ ఫొటోలు
-
ఒక్క రోజులో పంచారామాల సందర్శనం
భవానీపురం (విజయవాడ పశ్చిమ): పరమ శివుడికి ప్రీతికరమైన కార్తీక మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) విజయవాడ నుంచి ఒక్క రోజు ఆధ్యాత్మిక యాత్ర (వన్ డే టూర్)ను ఏర్పాటు చేసింది. టెంపుల్ టూరిజం కింద ఏర్పాటు చేసిన ఈ ఒక్క రోజు యాత్రలో శైవ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని ఆలయాలను సందర్శించే అవకాశాన్ని ఏపీటీడీసీ కల్పిస్తోంది. కార్తీక సోమవారంతోపాటు ముఖ్యమైన రోజుల్లో తెల్లవారుజామున 3.30 గంటలకు పంచారామాల యాత్ర ప్రారంభమవుతుంది. విజయవాడ బందరు రోడ్లోని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ (సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా) నుంచి బస్సు (నాన్ ఏసీ) బయలుదేరుతుందని ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ సీహెచ్ శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఒక్క రోజు పంచారామాల యాత్రకుగాను పెద్దలకు రూ.1,305, పిల్లలకు రూ.1,015 చార్జిగా నిర్ణయించారు. ఉదయం అల్పాహారం సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. మరిన్ని వివరాలకు యాత్రికులు 9848007025, 8499054422 మొబైల్ నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. ఈ టూర్కు ఆన్లైన్లో https://tourism.ap.gov.in/home వెబ్సైట్ ద్వారా బుకింగ్ సదుపాయంతో పాటు టోల్ ఫ్రీ నంబర్ 180042545454 కూడా ఉందని వివరించారు. కాగా, ఆయా ఆలయాల్లో దర్శనానికి సంబంధించిన రుసుము, భోజన ఖర్చులు యాత్రికులే భరించాల్సి ఉంటుందని తెలిపారు. -
కోటి దీపోత్సవానికి హాజరైన తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్
-
కార్తీక సోమవారం పర్వదినాన భక్తుల సందడి
-
ఒక్క రోజులో.. అదిరిపోయే టూర్లు!
సాక్షి, అమరావతి: కార్తీక మాసంలో ఆధ్యాత్మికతో పాటు ఆహ్లాదాన్ని పంచేలా ‘వన్డే’, ప్రత్యేక టూర్లకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రణాళికలు రూపొందించింది. హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో వచ్చి, వెళ్లేలా కూడా ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి సర్క్యూట్ల వారీగా దేవాలయాలు, సందర్శనీయ ప్రాంతాలను కలుపుతూ షెడ్యూల్ తయారు చేసింది. ప్రస్తుతం విశాఖ నుంచి ప్రతి సోమవారం పంచారామాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట శైవక్షేత్రాలను సందర్శించేందుకు పెద్దలకు రూ.1,685, పిల్లలకు రూ.1,350 టికెట్ ధరలతో ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. అలాగే విజయవాడ నుంచి కూడా ప్రతి సోమవారం పంచారామాలను దర్శించుకునేందుకు పెద్దలకు రూ.1,430, పిల్లలకు రూ.1,190 ధరలతో పర్యాటక శాఖ టూర్ ఏర్పాటు చేసింది. తిరుపతి నుంచి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, కంచి, తిరుత్తణిని సందర్శించేందుకు పెద్దలకు రూ.2,040, రూ.2,330, రూ.3,130, పిల్లలకు రూ.1,635, రూ.1,865, రూ.2,505 టికెట్ రేట్లతో(రెండు రాత్రులు, ఒక పగలు) యాత్రలకు రూపకల్పన చేసింది. ప్యాకేజీలకు అనుగుణంగా రవాణాతో పాటు భోజన, వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తోంది. రాయలసీమ సర్క్యూట్లో ఇలా.. ఒక్క రోజు యాత్ర: తిరుపతిలోని టీటీడీ శ్రీనివాసం నుంచి ప్రతి సోమవారం తలకోన సిద్ధేశ్వరాలయం, గుడిమల్లం పరుశురామేశ్వరాలయం, కపిలేశ్వరస్వామి ఆలయం, తొండవాడ అగస్తేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు. వీటికి టికెట్ ధరను రూ.500గా నిర్ణయించింది. అలాగే ప్రతి రోజూ తిరుపతి సమీపంలోని ఆలయాలకు గైడ్ సౌకర్యంతో రూ.175, రూ.375 టికెట్ రేట్లతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. శ్రీకాళహస్తి, కాణిపాకం, తలకోనకు విడివిడిగా స్థానిక ఆలయాలను కూడా సందర్శించేలా రూ.375తో ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. రెండు రోజుల యాత్ర: శ్రీశైలం, మహానందికి ప్రతి మంగళవారం టీటీడీ శ్రీనివాసం నుంచి రెండు రోజుల యాత్ర ప్రారంభమవుతుంది. శ్రీశైలం, మహానంది, నందవరం, యాగంటి, బెలూం గుహలు, అల్లాడుపల్లి దేవాలయాలను సందర్శించవచ్చు. పెద్దలకు టికెట్ ధర రూ.3,960, పిల్లలకు రూ.3,165గా నిర్ణయించింది. ఉత్తరాంధ్రను చుట్టేసేలా.. విశాఖ నుంచి లంబసింగి, కొత్తపల్లి వాటర్ఫాల్స్, మత్స్యగుండం, మోదుకొండమ్మ ఆలయాన్ని దర్శించేందుకుగాను పెద్దలకు రూ.1,970, రూ.1,850, పిల్లలకు రూ.1,575, రూ.1,480గా టికెట్ ధరలను పర్యాటక శాఖ నిర్ణయించింది. శక్తిపీఠాలైన పిఠాపురం, ద్రాక్షారామంతో పాటు అన్నవరం సందర్శనకు పెద్దలకు రూ.1,180, రూ.1,200, రూ.1,375, రూ.1,200, పిల్లలకు రూ.945, రూ.960 టికెట్ రేట్లతో వివిధ ప్యాకేజీలు ప్రకటించింది. గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శనలో భాగంగా(రెండు రాత్రులు, ఒక పగలు) అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, దిండి, అంతర్వేది, ద్వారకా తిరుమల, విజయవాడ సందర్శనకు పెద్దలకు రూ.4,425, రూ.5,025, పిల్లలకు రూ.3,540, రూ.4,020 టికెట్ ధరగా నిర్ణయించింది. బెంగళూరు నుంచి కూడా.. పర్యాటక శాఖ విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు నుంచి కూడా ప్రత్యేక ప్యాకేజీలు రూపొందిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నుంచి శ్రీశైలానికి(రాత్రి, పగలు/రెండు రాత్రులు, రెండు పగళ్లు) వివిధ ప్యాకేజీల్లో మల్లికార్జున స్వామి దర్శనంతో పాటు రోప్వే, సందర్శన స్థలాల వీక్షణం, హరిత హోటల్లో భోజన వసతి సౌకర్యాలు కల్పించనుంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి (రెండు రాత్రులు, ఒక పగలు)శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనంతో కూడిన ప్యాకేజీ కూడా తీసుకొస్తోంది. విజయవాడ, బెంగళూరు నుంచి గండికోట(రెండు రోజులు), విజయవాడ నుంచి సూర్యలంక(రాత్రి బస, పగలు వీక్షణం), విజయవాడ నుంచి తూర్పుగోదావరిలోని పిచ్చుకలంకకు ఉదయం బయలుదేరి సాయంత్రానికి చేరుకునేలా.. వేదాద్రి నరసింహస్వామి, ముక్త్యాల ముక్తేశ్వరస్వామి, ముక్త్యాల కోట, తిరుమలగిరి వేంకటేశ్వరస్వామి, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దర్శనాలతో కూడిన ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. ఏపీటీడీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంపొందించేలా.. రాష్ట్రంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఆధ్యాత్మిక కేంద్రాలను కలుపుతూ ప్రత్యేక యాత్రలు నిర్వహిస్తున్నాం. హైదరాబాద్, బెంగళూరు నుంచి కూడా పర్యాటకులు వచ్చి వెళ్లేలా ‘వన్డే’ టూర్ ప్లాన్ చేస్తున్నాం. – ఎస్.సత్యనారాయణ, ఏపీటీడీసీ ఎండీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.. పర్యాటకులు రాష్ట్రంలోని శైవక్షేత్రాలు, దేవాలయాలు, సందర్శనీయ స్థలాలను తక్కువ సమయంలో చుట్టివచ్చేలా పర్యాటక ప్యాకేజీలు తీసుకొచ్చాం. అందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలి. – ఆరిమండ వరప్రసాద్రెడ్డి, చైర్మన్, ఏపీటీడీసీ -
కార్తీక దీపం.. దేదీప్యమానం
-
కార్తీక మాసం ఎఫెక్ట్: వంకాయ కిలో@ రూ. 100
ఎల్.ఎన్.పేట: కిలో వంకాయలు రూ.100కు అమ్ముతున్నారు. కార్తీక మాసం కావటంతో భక్తులు మాంసాహారం మాని శాఖాహార భోజనం వైపు చూస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కిలో రూ.20 నుంచి రూ.40ల మధ్య ఉన్న కూరగాయల ధరలు ప్రస్తుతం రూ.80 నుంచి రూ.100కు చేరుకున్నాయి. తాజాగా, సోమవారం మార్కెట్లో కిలో వంకాయల ధర రూ.100 పలకడంతో వినియోగదారులు అవాక్కవుతున్నారు -
కార్తీక మాసం శోభను సంతరించుకున్న వరంగల్ లోని శివాలయాలు
-
పర్యాటకానికి 'జల'సత్వం
సాక్షి, అమరావతి: మరికొద్ది రోజుల్లో పవిత్ర కార్తీక మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదుల్లో జలవిహారాన్ని పునఃప్రారంభించేందుకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తోంది. ఆగస్టులో ఈ రెండు నదుల్లో వరద ఉధృతి పెరగడంతో ముందస్తు చర్యల్లో భాగంగా బోటింగ్ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కానీ, ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండడంతోపాటు కార్తీక మాసం ప్రారంభమవుతుండడంతో నవంబర్ 7 నుంచి గోదావరిలో పాపికొండలుకు బోట్లను తిప్పేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం పోశమ్మగండి నుంచే బోట్లు బయల్దేరుతాయి. కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలోని సింగనపల్లి బోటు పాయింట్ నీటిలో మునిగిపోయింది. దీంతో ఇక్కడ ప్రత్యామ్నాయ బోటింగ్ పాయింట్ను అన్వేషిస్తున్నారు. మరోవైపు.. కృష్ణానదిలో నీటి మట్టం తగ్గిన వెంటనే ఇక్కడా బోట్లు తిప్పనున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతులు రాష్ట్రంలో 300లకు పైగా బోట్లు ఉండగా.. ఇందులో పర్యాటక శాఖకు చెందినవి 48 ఉన్నాయి. వీటిలో మూడు మినహా మిగిలినవి అన్ని అనుమతులతో ప్రయాణికులకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు.. ప్రభుత్వ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ప్రకారం.. ప్రైవేటు బోట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అధికారులు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీచేస్తున్నారు. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, విజయవాడ బెరం పార్కులలో జల విహారానికి 50 సీట్ల సామర్థ్యం ఉన్న బోట్లను తిప్పుతున్నారు. అలాగే, రిషికొండ, రాజమండ్రి, దిండి ప్రాంతాల్లో చిన్నబోట్లు, జెట్ స్కీలను అందుబాటులో ఉంచారు. వాస్తవానికి పాపికొండలు మార్గంలో ఏపీ టూరిజం బోట్లతో పాటు దాదాపు 80 వరకు ప్రైవేటు బోట్లు రాకపోకలు సాగించేవి. ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేయడంతో కేవలం 23 బోట్లకు మాత్రమే అనుమతులు లభించాయి. నిరంతరం బోటింగ్ పర్యవేక్షణ రెండేళ్ల కిందట పాపికొండలు మార్గంలో కచ్చులూరు వద్ద సంభవించిన బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వ సూచనలతో బోట్ల రక్షణ, మార్పుల విషయంలో కాకినాడ పోర్టు అధికారులు ప్రత్యేక నివేదికను సమర్పించగా.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఓపీని రూపొందించింది. దీని ప్రకారం.. ► బోట్ల రూట్ పర్మిట్, పర్యాటక, జలవనరుల శాఖ నుంచి లైసెన్సులు పొందితేనే బోటును నడుపుకునేందుకు ఎన్ఓసీ జారీచేస్తున్నారు. ► గండిపోచమ్మ, పేరంటాలపల్లి, పోచవరం, రాజమండ్రి, రుషికొండ, నాగార్జునసాగర్, శ్రీశైలం, విజయవాడ బెరం పార్కులలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటుచేశారు. ► పోలీసు, రెవెన్యూ, జలవనరులు, పర్యాటక శాఖాధికారులు సమన్వయంతో వీటి ద్వారా బోటింగ్ను నిరంతరం పర్యవేక్షిస్తారు. ► లైఫ్ జాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు బోట్లను తనిఖీ చేస్తున్నారు. ► బోటు బయలుదేరే ప్రదేశంతోపాటు గమ్యస్థానం వద్ద కూడా సీసీ కెమెరాలు, అలారంలను ఏర్పాటుచేశారు. ► ప్రైవేటు బోట్లలో సీటింగ్ సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించకుండా చర్యలు చేపడుతున్నారు. భద్రతా ప్రమాణాలతో సేవలు ఇక పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని బోట్లను సముద్ర యానానికి కూడా అనువైనవిగా తీర్చిదిద్దారు. 8 ఎంఎం స్టీల్ బాడీతో, ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (ఐఆర్ఎస్) నిర్దేశిత భద్రతా ప్రమాణాలతో ఇవి సేవలందిస్తున్నాయి. ఈ బోట్లలో సమాచారాన్ని వేగంగా అందించేలా శాటిలైట్ ఫోన్లను ప్రవేశపెట్టారు. పాపికొండల మార్గంలో వీటిని వినియోగిస్తారు. ప్రయాణించే బోటుతోపాటు కమాండ్ కంట్రోల్ రూమ్, పేరంటాలపల్లిలోని రిమోట్ కంట్రోల్ రూమ్లో వీటిని అందుబాటులో ఉంచారు. పాపికొండలుకు వెళ్లే బోట్లకు రక్షణగా ప్రత్యేక పైలట్ బోటుతో పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. నావిగేషన్ వ్యవస్థతోపాటు కమ్యూనికేషన్ కోసం వెరీ హై ఫ్రీక్వెన్సీ (వీహెచ్ఎఫ్) రేడియోలతో బోట్లను నడపనున్నారు. పాపికొండలుకు విహారయాత్ర గోదావరి, కృష్ణాలో బోటు షికారుకు ఏర్పాట్లుచేస్తున్నాం. పర్యాటక శాఖకు చెందిన 45 బోట్లకు పోర్టు అనుమతులున్నాయి. కార్తీక మాసంలో పర్యాటకుల సందడిని దృష్టిలో పెట్టుకుని నవంబర్ 7 నుంచి పాపికొండల విహార యాత్రను అన్ని జాగ్రత్తలతో ప్రారంభిస్తున్నాం. అదే రోజున కృష్ణాలో కూడా బోట్లు తిప్పేందుకు జలవనరుల శాఖ అధికారులతో చర్చిస్తున్నాం. – ఎస్.సత్యనారాయణ, ఎండీ, ఏపీటీడీసీ -
ఇంద్రకీలాద్రిపై వైభవంగా కోటిదీపోత్సవం
-
కాళేశ్వర మహాక్షేత్రం: త్రివేణీ సంగమం
కార్తీకమాసంలో ప్రతిరోజూ పర్వదినమే. అయితే ఈ మాసం నెలరోజులు చేసే పూజలన్నింటి కంటే కార్తీక పౌర్ణమి నాటి పూజకు ఫలితం అధికంమంటారు. అగ్నితత్త్వ మాసమైన కార్తీకంలో వచ్చే పౌర్ణమికి చంద్రుని విశేషంగా ఆరాధించాలని మన పూర్వులు చెబుతారు. చంద్రుని కొలవడంలో మానసిక చైతన్యం, కుటుంబ శ్రేయస్సు, భార్యాభర్తల మధ్య సఖ్యత, సంతాన సౌభాగ్యం కలిగి ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ మాసంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. భక్తి శ్రద్ధలతో భక్తులు పలు శైవ క్షేత్రాలను దర్శించుకుంటారు. కాళేశ్వర మహాక్షేత్రం ముక్తీశ్వర సమన్వితం కాళేశ్వరో మహాదేవో భుక్తిం ముక్తిం ప్రదాస్యతి!! అంటూ భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పిలుచుకునే దేవుడు పరమ శివుడు. బోళా శంకరుడిగా, ఆదియోగిగా పూజలందు కుంటున్న ఈ స్వామి కాళేశ్వర ముక్తీశ్వర నామధేయంతో కొలువుదీరిన అపురూప ధామం కాళేశ్వరం. కరీంనగర్ జిల్లా మహదేవ్ పూర్ మండలంలో గోదావరి, ప్రాణహిత నదులు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తున్న త్రివేణీ సంగమ ప్రదేశంలో స్వయంభువుగా వెలసిన స్వామి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి సోయగాల మధ్య అలరారుతున్న అతి పురాతనమైన ఈ ఆలయం ఒకప్పుడు అరణ్యంలో ఉండటం వల్ల రవాణా సౌకర్యం ఉండేదికాదు. అయితే 1976–82 సంవత్సరాల మధ్య కాలం లో ఆలయ జీర్ణోద్ధరణ పనులు జరగడంతో రవాణా వసతి సౌకర్యాలు మెరుగుపడ్డాయి. విశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ దివ్యాలయం నాలుగు వైపుల నాలుగు నంది మూర్తులు దర్శనమిస్తాయి. ఇతర ఆలయాలకు మల్లే కాకుండా ఇక్కడ గర్భాలయంలో ఒకే పానమట్టం మీద రెండు లింగాలు ఉండటమే కాక ముక్తీశ్వర స్వామికి రెండు నాసికా రంధ్రాలుంటాయి. ఈ రంధ్రాలలో అభిషేక జలం ఎంత పోసినప్పటికీ ఒక్కచుక్క కూడా బయటకు రాకుండా భూమార్గం గుండా ప్రవహించి, సరస్వతీ నది రూపంలో గోదావరి ప్రాణహిత నదుల సంగమంలో కలుస్తుందని ఆలయ చరిత్ర చెబుతోంది. గర్భాలయంలో ఉన్న రెండు లింగాలలో ఒకటి కాళేశ్వర లింగం కాగా, రెండవది ముక్తీశ్వర లింగంగా చెబుతారు. కాళేశ్వర లింగాన్ని యమధర్మరాజు ప్రతిష్టించాడు. మహాశివుడు యమధర్మరాజుకిచ్చిన వరం కారణంగా, ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా కాళేశ్వరలింగాన్ని దర్శించి అనంతరం ముక్తీశ్వర లింగాన్ని దర్శించాలన్న నియమం ఉంది. ఈ ఆలయం ఏటా మహాశివ రాత్రి ఉత్సవాలతో సహా పండుగలు, పర్వదినాలు, కార్తీక మాసాలలో భక్తులతో పోటెత్తుతుంది. ఆయా రోజుల్లో స్వామి వార్లకు మహాన్యాసక రుద్రాభిషేకాలు, అర్చనాది అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ పార్వతీమాత శుభానంద దేవిగా కొలుపులందుకుంటోంది. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో పక్క మహాసరస్వతి ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారు ప్రౌఢసరస్వతిగా నీరాజనాలందుకుంటోంది.ఆలయంలో మరో పక్క ప్రధాన ద్వారానికి ముందు భాగంలో సూర్య దేవాలయం ఉంది. ఇంకోపక్క విజయ గణపతి కొలువుదీరాడు. విశాలమైన ఆలయ ప్రాంగణంలో స్వామి వారి ఆలయానికి ముందు భాగంలో కోనేరు ఒకటి ఉంది. ఈ కోనేరులో స్నానమాచరించిన వారికి కాశీలోని మణికర్ణికా ఘాట్లో స్నానమాడిన ఫలితం దక్కుతుందంటారు. ప్రధానాలయ ఆవరణలో యమకోణం ఉంది. ఈ ప్రాంగణంలోనే యముడు తపస్సు చేసినట్లు చెబుతారు. ఈ యమకోణ ప్రవేశం చేసే వారికి యమ బాధలుండవని, ముక్తికలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వార్ల ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో ఆది ముక్తీశ్వర స్వామి ఆలయం ఉంది. ఆది ముక్తీశ్వర స్వామి దర్శనం సర్వపాపహరణం. కాశీలో మరణిస్తే కైలాసప్రాప్రి కలుగుతుందని చెబుతారు. కాని ఈ క్షేత్రంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరుని దర్శిస్తేనే కైలాస ప్రాప్తి కలుగుతుందన్నది స్థలపురాణం. ఎలా చేరుకోవాలి? కరీంనగర్కు 130 కి.మీ దూరంలోను, మంథనికి 65 కి. మీ. దూరంలోను, వరంగల్లుకు 110 కి.మీ దూరంలోనూ ఉన్న ఈ దివ్యక్షేత్రానికి తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. – దాసరి దుర్గాప్రసాద్, పర్యాటక రంగ నిపుణులు -
కోటి పుణ్యాల కార్తీక పున్నమి
కార్తీకమాసంలో ప్రతిరోజూ పర్వదినమే. అయితే ఈ మాసం నెలరోజులు చేసే పూజలన్నింటి కంటే కార్తీక పౌర్ణమి నాటి పూజకు ఫలితం అధికంమంటారు. అగ్నితత్త్వ మాసమైన కార్తీకంలో వచ్చే పౌర్ణమికి చంద్రుని విశేషంగా ఆరాధించాలని మన పూర్వులు చెబుతారు. చంద్రుని కొలవడంలో మానసిక చైతన్యం, కుటుంబ శ్రేయస్సు, భార్యాభర్తల మధ్య సఖ్యత, సంతాన సౌభాగ్యం కలిగి ప్రశాంతత ఏర్పడుతుంది. అటువంటి కార్తీక పౌర్ణమి విశేషాలను తెలుసుకుందాం.కారీక్త పౌర్ణమి రోజున సంప్రదాయం ప్రకారం ఉదయమే పుణ్యస్త్రీలు మంగళ స్నానం ఆచరించి శుచియైన వస్త్రం ధరించి ఇంటి ముంగిట రంగవల్లులు దిద్ది, పార్వతీపరమేశ్వరులకు ఆహ్వానం పలుకుతూ ఇల్లంతా అలంకరించాలి. సూర్యోదయానికి పూర్వమే తులసికోట వద్ద 365 వత్తులను ఆవునేతితోగాని, కొబ్బరినూనెతోగాని, నువ్వులనూనెతో గాని తడిపి దీపాలను వెలిగించాలి. అలాగే బియ్యపిండితో చేసిన దీపాలను, ఉసిరికాయ దీపాలను కూడా సమర్పించాలి. పిమ్మట.. శివాలయానికి వెళ్ళి గుమ్మడి, కంద దుంప, తాంబూలాదులతో బ్రాహ్మణులకు దానమిచ్చి, నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని పొందాలి. అరటి దొన్నెలో దీపాలను వెలిగించి పవిత్ర నదులలో, కాలువలో వదలాలి. ఈవేళ చాలా ప్రాంతాలలో నదీమతల్లికి పసుపు కుంకుమను సమర్పిస్తారు. ఈ దృశ్యం అత్యంత మనోహరంగా, కనులకింపుగా వుంటుంది. దీనివల్ల నదీమతల్లి సంతసించి సకల సంపదలు ప్రసాదిస్తుందని, సంపూర్ణ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. ఈ దినమంతా ఉపవసించి, సంధ్యాసమయంలో యధావిధిగా తిరిగి స్నానాదులు గావించి, కుటుంబ సౌఖ్యం, సౌభాగ్యం, ఐశ్వర్యం కోరుకుంటూ చంద్రునికి భక్తితో దీపాలు సమర్పించి వేడుకోవాలి. పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను ధనం, సౌభాగ్యం, ఆరోగ్యం, యశస్సునిమ్మని ప్రార్థించాలి. ఈరోజు శివాలయంలో ఈశ్వరునికి నవరసాలతో, పంచామృతాలతో మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. తదనంతరం లక్షపత్రి పూజ, లక్ష కుంకుమార్చనలను నిర్వహిస్తారు. ధాత్రీపూజను కూడా చేస్తారు. ఉసిరి చెట్టు లభ్యం కాకపోతే కనీసం ఉసిరి కొమ్మనైనా తులసి కోటలో వుంచి పూజిస్తే మంచిది. ఈ రోజు సంధ్యాసమయంలో శివాలయంలో జ్వాలాతోరణం నిర్వహిస్తారు. ఎండుగడ్డితో తాడును తయారు చేసి ఆలయం ముంగిట తోరణంగా అమర్చి దానిని ఆవునేతి దీపంతో వెలిగిస్తారు. పార్వతీపరమేశ్వరులను పల్లకీలోనుంచి ఈ తోరణం నుండి మూడుసార్లు ఊరేగిస్తారు. ఆ పల్లకీని అనుసరించి శివనామ జపం చేస్తూ ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక జన్మల నుండి చేసిన పాపాలన్నీ పటాపంచలయి, ఆనందం కలుగుతుందని శాస్త్రవచనం.కార్తీక పూర్ణిమ నాడు శంకరుడు త్రిపురాసురుణ్ణి వధించిన రోజు. అందువలన ఈరోజును త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు. కార్తీకపురాణం ప్రకారం ఈరోజు దీపదానం, సాలగ్రామ దానం చేయాలి. దానధర్మాలు చేయాలి. ఇవి కోటిరెట్లు ఫలితాన్నిస్తాయని నమ్మిక. ఈ పౌర్ణమి రోజు అరుణాచల క్షేత్రంలో అఖండ జ్యోతి వెలిగిస్తారు. ప్రాముఖ్యత గలిగిన ఈ జ్యోతి దర్శనానికి అనేక రాష్ట్రాలనుండి భక్తులు వస్తారు. పౌర్ణమినాడు శ్రీ కృష్ణుని రాసలీలకు పెట్టినది పేరు. అందువలన ఈ రోజు శ్రీ కృష్ణ స్మరణ కూడా అత్యంత ఫలవంతమైనది. కార్తీకపౌర్ణమి నాడు కార్తికేయుడు తారాకాసుర సంహారం చేసినట్లు తెలుస్తోంది. అందువలన ఆయనకు కూడా విశేష పూజలు నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమినాడు తమిళులు నూత్న వధూవరులను పుట్టింటికి పిలిచి వారితో దీపారాధన చేయించి, సువాసినులకు దక్షిణ తాంబూలాలు ఇప్పిస్తారు. దీనివలన భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుందని, తమ కుమార్తె వలన మరొక గృహం కాంతులీనుతుందని నమ్మకం.అత్యంత ఫలప్రదమైన ఈ కార్తీక పౌర్ణమిని భక్తి శ్రద్ధలతో ఆచరించి మన సంప్రదాయ విధివిధానాలను ముందు తరాలకు పదిలపరచి లోకక్షేమానికి కృషిచేద్దాం.:::డా. దేవులపల్లి పద్మజ -
పంచారామాలకు 1,750 ప్రత్యేక బస్సులు
సాక్షి, అమరావతి: కార్తీక మాసంలో రాష్ట్రంలో ఐదు పంచారామాలైన పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట, అమరావతికి అన్ని జిల్లాల నుంచి 1,750 బస్సులను తిప్పేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించింది. భక్తులకు అసౌకర్యం లేకుండా బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల రీజనల్ మేనేజర్లను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఒక్కరోజే పంచారామాలు దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. దీనికి అనుగుణంగా ఆర్టీసీ రవాణా సదుపాయం కల్పిస్తోంది. మొదటి సోమవారం ఆర్టీసీ తొమ్మిది జిల్లాల నుంచి పంచారామాలకు, నాలుగు జిల్లాల నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడిపింది. మొదటివారం 106 సర్వీసులు ► పంచారామాలకు మొదటివారం తొమ్మిది జిల్లాల నుంచి 106 ప్రత్యేక సర్వీసులు, శ్రీశైలం, కోటప్పకొండకు కర్నూలు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 16 బస్సులు నడిపారు. ► దూరాన్ని బట్టి ఆదివారం అర్ధరాత్రి నుంచి బస్సులు బయలుదేరి సోమవారం రాత్రికల్లా పంచారామాల్లో దర్శనాలు చేసుకుని తిరుగు పయనమయ్యేందుకు వీలుగా శీఘ్ర దర్శనాలు చేయించనున్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాస శోభ
-
కార్తీక శోభ
-
రాజన్న సన్నిధిలో కార్తీక సందడి
సాక్షి, వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయానికి కార్తీక శోభ సంతరించుకుంది. నెల రోజులపాటు స్వామివారు భక్తుల విశేష పూజలందుకుంటారు. ఆదివారం అమావాస్య అయినప్పటికీ రాజన్నను దర్శించుకునేందుకు 10 వేల మందికి పైగా భక్తులు వచ్చారు. కార్తీకదీపాలు వెలిగించి, మొక్కు తీర్చుకున్నారు. కోవిడ్–19 నిబంధనల మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26న సాయంత్రం 6.30 గంటలకు విఠలేశ్వర స్వామికి శ్రీకృష్ణతులసీ కల్యాణం జరిపిస్తున్నట్లు స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ తెలిపారు. 28న వైకుంఠ చతుర్ధశిని పురస్కరించుకుని శ్రీఅనంతపద్మనాభ స్వామి వారికి 12 మంది రుత్విజులతో మహాభిషేకం జరపనున్నట్లు పేర్కొన్నారు. అదేరోజు రాత్రి 7.30 గంటలకు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామికి మహాపూజ, పొన్నసేవపై స్వామివార్లకు ఊరేగింపు, రాత్రి 8 గంటలకు జ్వాలాతోరణం, 10.30 గంటలకు స్వామివారి నిషిపూజ అనంతరం మహాపూజ ఉంటుందన్నారు. వేములవాడలో దీపావళి వేడుకలు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దీపావళి వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. అర్చకులు ఉదయం స్వామివారి సన్నిధిలో నిత్యపూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు గంటన్నరపాటు కల్యాణ మండపంలో స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ ఆధ్వర్యంలో ధనలక్ష్మీ పూజ ఘనంగా జరిపించారు. అనంతరం శ్రీపార్వతీరాజరాజేశ్వర స్వామి, శ్రీఅనంతపద్మనాభస్వామి వార్ల ఉత్సవమూర్తులను గజ వాహనంపై ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. పూజలు చేస్తున్న అర్చకులు కార్తీకం.. సర్వపాప హరణం! కరీంనగర్ కల్చరల్/విద్యానగర్(కరీంనగర్): కార్తీకమాసం శివుడికి ప్రీతికర మాసం.. అందుకే దీన్ని పవిత్రమాసంగా భావిస్తారు.. సోమవారం నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది.. ఈ మాసంలో దీపారాధన చేయ డం ద్వారా సర్వపాపాలు హరించుకుపోతాయని ప్రజల నమ్మకం. తెల్లవారుజామునే నిద్రలేవడం.. కతికా నక్షత్రం అస్తమించేలోగా స్నానమాచరించడం, భోళాశంకురుడికి నిత్యం రుద్రాభిషేకం చేయడం, మెడలో రుద్రాక్షలు, తులసీ పూసల్ని ధరించడం, ఒక్కపూట మాత్రమే భోజనం చేయడం వంటి సంప్రదాయాలను ఆచరిస్తారు. కతికా నక్షత్రానికి అధిపతి అగ్ని, అగ్నికి మారుపేరు రుద్రుడు. ప్రతీ ఆలయంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల శుభాలు కలుగుతాయి. పుత్రులు లేని వారికి పుత్రులు, దరిద్రులకు ధనం, పురుషులకు గహస్తులు, భోగమోక్షాలు లభించడంతో పాటు వానప్రస్థ ఆశ్రమాలలో ఉండే వారికి జ్ఞాన వైరాగ్యత, స్త్రీలకు మోక్షం, మహాపుణ్యం కలుగుతాయి. కార్తీకమాసం నేపథ్యంలో దానాలు, పూజలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. శైవక్షేత్రాల్లో అర్చనలు, అభిషేకాలు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, కాళేశ్వరంతో పాటు అన్ని ప్రాంతాల్లోని శివక్షేత్రాల్లో అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రత్యేక ఉంది. ఈ రోజు దీపదానాలు చేస్తే సకల పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. దానం.. శుభప్రదం కార్తీక మాసంలో ఉసిరికాయలు దానం చేయడం ద్వారా సంతానం లేని స్త్రీలకు సంతానం కలుగుతుంది. శివపూజ చేయడం వల్ల నవగ్రహ దోష నివారణ జరుగుతుంది. గుమ్మడి కాయ దానం చేయడం వల్ల యమదూతలు దూరంగా ఉంటారు. ఆవు నెయ్యితో వత్తులు వెలిగించి, ఆకుడొప్పల్లో ఉంచి, నీటి ప్రవాహంలో వదలడం, కుమార్తెలకు వివాహాలు, కుటుంబ సభ్యులతో వనభోజనాలు, ఉసిరి, తులసి చెట్లకు పూజలు, విష్ణుమూర్తి కల్యాణం, నాగుపాములకు పూజలు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి పూజలు, దీపారాధన చేయడం మహా మహిమోపితమైనది. ఇంటి ఎదుట ముగ్గులు పెట్టి, తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి గౌరీ పూజలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలుగుతుంది. ధాత్రి అంటే ఉసిరి. ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. లక్ష బిల్వార్చనలు, అభిషేకాలు, కాగడ హారతులు, కార్తీక స్నానాలు, మారేడు పత్రాలతో ఈశ్వరుడిని ఆరా ధిస్తే శుభాలు కలుగుతాయని వేదపండితులు చెబుతున్నారు. దీపం.. మోక్ష మార్గం దీపంలో ప్రమిద, వత్తి, నూనె, అగ్ని, వెలుగు.. వీటిలో దేనికదే ప్రత్యేకం. ప్రమిద మనసుకు, వత్తి దైవ స్మరణకై ఆసక్తి, నూనె జ్ఞానానికి, అగ్ని అజ్ఞానాన్ని తొలగించే నిప్పురవ్వకు, వెలుగు మనుషుల్లోని చెడు స్వభావాలను తొలగించి, మోక్ష మార్గానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అందుకే కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా మహిళలు దేవాలయాల్లో దీపాలను సమర్పిస్తారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, దాస్యం, వందనం, పాద సేవనం, సఖ్యం, ఆత్మ నివేదనం అనే తొమ్మిది భావనలతో పూజలు చేస్తారు. విష్ణు కథాశ్రవణంతో పరీక్షిత్తుడు, కీర్తనతో వ్యాసుని కుమారుడు శుఖుడు, నారదుడు, స్మరణతో ప్రహ్లాదుడు, అర్చనతో పథు చక్రవర్తి, దాస్యంతో హనుమంతుడు, గరుత్మంతుడు, వందనంతో అక్రూరుడు, పాదసేవతో లక్ష్మి, భార్గవి, సఖ్యంతో అర్జునుడు, ఆత్మనివేదనంతో బలి చక్రవర్తి పుణ్యలోకాలను చేరుకున్నారని వేద శాస్త్రాలు ప్రవచిస్తున్నాయి. ఈ కారణంగానే తొమ్మిది రకాల భక్తి భావనలతో పౌర్ణమి రోజు దీప ప్రదానంతో పుణ్యలోకాలను అందుకునేందుకు ప్రయత్నిస్తారు. మని షి పతనానికి హేతువులైన అరిష«ఢ్వర్గాలను జయించేందుకు గోధుమ పిండితో ఆరు దీపపు ప్రమిదలను చేసి, నెయ్యితో వెలిగిస్తారు. సకల శాంతి, సౌభాగ్యాల కోసం ధాత్రి నారాయణ, తులసీ కల్యాణం జరుపుతారు. కార్తీక మాసోత్సవం.. కీసర: ప్రఖ్యాత శైవ క్షేత్రమైన కీసరగుట్టలో సోమవారం నుంచి వచ్చేనెల 14వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నారు. దాదాపు నెల రోజుల పాటు కీసరగుట్టలో కొనసాగనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలకు నగర నలుమూలల నుంచి కీసరగుట్ట శ్రీభవానీరామలింగేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్ తటాకం శ్రీనివాస్శర్మ, ఈఓ సుధాకర్రెడ్డి తెలిపారు. మొదటిరోజు సోమవారం ఆలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ఆకాశదీపోత్సవంతో పూజలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో దేవాదాయశాఖ ఆదేశానుసారం గుట్టలో ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో గర్భాలయ అభిషేకాలు, సత్యనారాయణ స్వామి వత్రాలు, అన్నదానం తదితర వాటిని రద్దు చేశామని వారు వివరించారు. మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలన్నారు. -
శైవ క్షేత్రాల్లో కార్తీక మాస శోభ..
కార్తీక మాసం శివుడికి ప్రీతికర మాసం.. అందుకే దీన్ని పవిత్ర మాసంగా భావిస్తారు. సోమవారం నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో దీపారాధన చేయడం ద్వారా సర్వపాపాలు హరించుకుపోతాయని ప్రజల నమ్మకం. తెల్లవారు జామునే నిద్రలేవడం.. కతికా నక్షత్రం అస్తమించేలోగా స్నానమాచరించడం, భోళాశంకరుడికి నిత్యం రుద్రాభిషేకం చేయడం, మెడలో రుద్రాక్షలు, తులసీ పూసల్ని ధరించడం, ఒక్కపూట మాత్రమే భోజనం చేయడం వంటి సంప్రదాయాలను ఆచరిస్తారు. నేటి నుంచి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కార్తీక మాస ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. చదవండి: ధర్మ దాన దీపోత్సవం తూర్పుగోదావరి జిల్లా : కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఐ పోలవరం మండలం మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో భక్తులు దర్శించుకుంటున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని శివనామ స్మరణతో కుండలేశ్వరం,ముమ్మిడివరం, తాళ్ళరేవు, యానంలోని శైవ క్షేత్రాలు మారుమ్రోగింది. మురమళ్ళ వృదగౌతమి గోదావరిలో తెలవారుజాము నుంచి భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాశివుని దర్షించుకునేందుకు ఆలయాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్యూ లైన్లలో బారులు తీరుతున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీకమాస పర్వదిన సందర్భంగా శివనామ స్మరణతో దక్షిణ కాశి ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం మారుమ్రోగుతోంది. ఈ క్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. మొదటి కార్తీక సోమవారం కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ స్వామివారిని, అమ్మవారిని భక్తులు దర్శించుకునేలా అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. నిబంధనలు పాటిస్తూ స్వామివారిని, అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. కోవిడ్ ప్రభావంతో కార్తీక సోమవారం స్వామివారిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు స్వల్ప సంఖ్యలో హాజరయ్యారు. ఆలయంలో సప్త గోదావరి నదిలో స్నానాలు నిలిపివేశారు. అభిషేకాలు, కుంకుమ పూజలు, దీపారాధనల కూడా నిషేధించారు. పోటెత్తిన భక్తులు రాజమండ్రి గోదావరి ఘాట్లో భక్తుల పుణ్యస్నానాలు, దీపారాధనలు చేపట్టారు. ద్రాక్షారామం శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నవరం, పిఠాపురం పాదగయా క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. పాలకొల్లు శ్రీక్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, భీమవరం శ్రీఉమాసోమేశ్వరజనార్దన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు అధికారులు దర్శనం కల్పిస్తున్నారు. అమర లింగేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సామూహిక నదీస్నానాలకు అనుమతించలేదు. కర్నూలు జిల్లా శ్రీశైలం : శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4గంటలు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు దర్శనాలు ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతీరోజు నాలుగు విడతలుగా ఆర్జిత సామూహిక అభిషేకాలు నిర్వహించారు. ఏకాదశ రుద్రాభిషేకం రాజన్నసిరిసిల్లా జిల్లా : కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. స్వామివారికి అర్చకులు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి కళ్యాణ మండపంలో మహాలింగార్చన చేయనున్నారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా : కార్తీక మాస సందర్భంగా చర్ల మండలంలోని శ్రీ ఉమారామళింగేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా : కొవ్వూరు గోష్పాద క్షేత్రం లో కార్తీక మాసం మొదటి రోజు సోమవారం కావడంతో భక్తిశ్రద్ధలతో గోదావరి నదిలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. శివ నామస్మరణతో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సుందరేశ్వర స్వామి దేవాలయం మార్మోగుతుంది. కరోనా ప్రభావంతో భక్తులు అంతగా లేక పవిత్ర గోష్పాద క్షేత్రం వేలవేల పోయింది. మాస్కు ధరించి శివపార్వతులను పలువురు భక్తులు దర్శించుకున్నారు. పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం ప్రత్యేక పూజలు చేపట్టారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సామూహిక నది స్నానాలకు అనుమతి లేదు విజయవాడ : కార్తీకమాసం మొదటి సోమవారం భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. కార్తీక దీపారాధన కోసం పెద్ద సంఖ్యలో భక్తుల పూజలు నిర్వహిస్తున్నారు. అభిషేకాల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోవిడ్ కారణంగా ఘాట్లలో స్నానం చేయడానికి అధికారులు అనుమతి ఇవ్వలేదు. గుంటూరు : కార్తీక సోమవారం కావడంతో అమరావతి అమరలింగేశ్వర స్వామి దర్శించుకోడానికి భారీ స్థాయిలో భక్తులు తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అధికారులు కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నారు. సామూహిక నదీ స్నానాలకు అధికారులు అనుమతించలేదు. సామూహిక దీపారాధనకు కూడా అనుమతి లేదు. -
దివి నుంచి భువికి ముక్కోటి
వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని వ్యవహరిస్తారు. సంక్రాంతిలాగే ఇది కూడ సౌరమానాన్ననుసరించి జరిపే పండుగలలో ఒకటి. కర్కాటక సంక్రమణం, ధనుస్సు నెల పట్టిన తరువాత శుద్ధపక్షంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ఇది మార్గశిరమాసంలో లేదా పుష్యమాసంలో వస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్లిన శ్రీమహావిష్ణువు, కార్తీకశుద్ధ ఏకాదశి రోజున ఆ నిద్ర నుంచి మేల్కొని, శ్రీదేవి – భూదేవి సమేతంగా ఈ ఏకాదశి రోజున వైకుంఠానికి తిరిగివచ్చాడట. అప్పుడు ముక్కోటి దేవతలు ఉత్తరద్వారం చెంత నిలిచి స్వామి దర్శనం చేసుకున్నారని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ముక్కోటి నాడు వైకుంఠ ద్వారాలు తెరుస్తారనీ, దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములు అందరూ స్వర్గంలో ప్రవేశిస్తారని నానుడి. ఈ కారణం చేత ఈ పండుగను దక్షిణాదిన కొన్ని ప్రాంతాలలో స్వర్గద్వారం అని కూడా అంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడుకోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రత కలది కావడం చేత దీనికీ పేరు వచ్చిందని చెబుతున్నారు. ‘కృతయుగంలో చంద్రావతి అనే నగరం రాజధానిగా చేసుకొని ‘ముర‘ అనే అసురుడు రాజ్యపాలనం చేస్తూ ఉండేవాడు. వాడు దేవతల్ని గారిస్తూ వచ్చాడు. అప్పడు దేవతలు వెళ్లి వైకుంఠంలో విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నారు. దేవతల దీనాలాపాలు విని అప్పడు విష్ణువు వైకుంఠాన్నుంచి భూమి మీదకు దిగి వచ్చి మురాసురుణ్ణి సంహరిస్తాడు. ఆ సంహారం ఈ ఏకాదశినాడు జరిగింది. విష్ణువు వైకుంఠాన్నుంచి దిగి భూమి మీదకు వచ్చి శత్రుసంహారం చేసిన రోజు కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ పర్వదినాన దేవాలయాల ఉత్తరద్వారాన శ్రీ మహావిష్ణువును దర్శించిన వారికి పునర్జన్మ ఉండదని శాస్త్రప్రమాణం. ఈరోజే శ్రీరంగ క్షేత్రాన శ్రీరంగ దేవాలయంలో ద్వారస్థ భగవదాలోకన మహోత్సవం జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా గల అన్ని విష్ణ్వాలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈరోజు ఏం చేయాలి? ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి పటాన్ని గంధంతోటీ, జాజిమాలతోటీ అలంకరించి ఆయనకు ప్రీతికరమైన పాయసంతో పాటు వివిధరకాల తీపిపదార్థాలను లేదా ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించడం విశిష్ట ఫలదాయకమని పెద్దలు చెబుతారు. అన్నింటికీ మించి ఈ పర్వదినాన స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడం, విష్ణులీలలను తెలిపే గ్రంథాలను భగవద్భక్తులకు దానం చేయడం, విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఉపవసించడం, యథాశక్తి దాన ధర్మాలు చేయడం, జాగరణ చేయడం వలన మోక్షం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కలియుగ వైకుంఠంగా పేరు పొందిన తిరుమలలోనూ, ఉడిపిలోనూ, గురువాయూర్లోనూ, అరసవిల్లి, శ్రీకూర్మం, లోనూ, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలోనూ, భద్రాద్రిలోనూ, యాదాద్రిలోనూ ఇంకా అనేకానేక ఆలయాలో నేడు భక్తులు తెల్లవారు జామునుంచే స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుని పులకాంకితులవుతారు. -
నేటితో ముగియనున్న కార్తీకమాసం
-
రాజమండ్రి: పుష్కరఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు
-
హైదరాబాద్: కార్తీక మాసం..వనభోజనాల సందడి
-
కార్తీక దీపం.. సకల శుభకరం
సాక్షి, వర్గల్(గజ్వేల్): నాచగిరి శివకేశవుల నిలయం..జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం..కార్తీక పౌర్ణమి వేళ మంగళవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపోత్సవంతో ఆధ్యాత్మిక అనుభూతులు పంచనున్నది. ఇందుకోసం నాచారం గుట్ట శ్రీలక్ష్మీ నృసింహ క్షేత్రం కార్తీక పౌర్ణమి మహోత్సవానికి సర్వసన్నద్ధమైంది. ఈ విశేష పర్వదినం రోజున క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలాచరిస్తారు. శివాలయం పక్కన కార్తీక దీపాలు వెలిగించి దీపారాధన చేస్తారు. సకల శుభాలు కోరుతూ పెద్ద ఎత్తున భక్తులు కార్తీక సత్యనారాయణ వ్రతాలు జరుపుకుంటారు. కార్తీకపౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతాల ప్రారంభ వేళలు మొదటి విడత వ్రతాలు: ఉదయం 6 గంటలకు రెండో విడత వ్రతాలు ఉదయం 8 గంటలకు మూడో విడత వ్రతాలు ఉదయం 10 గంటలకు నాలుగో విడత వ్రతాలు మద్యాహ్నం 12 గంటలకు అయిదో విడత వ్రతాలు సాయంత్రం 4.30 గంటలకు సామూహిక వ్రతాలకు విస్తృత ఏర్పాట్లు.. నాచగిరిలో కార్తీక పౌర్ణమి మహోత్సవం సందర్భంగా ఆలయ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. వ్రతభక్తులకు ఇబ్బంది కలగకుండా ఉదయం 6 గంటల నుంచే సత్యదేవుని వ్రతాలు ప్రారంభమవుతాయి. తొలి విడత ఉదయం 6 గంటలకు , రెండో విడత ఉదయం 8 గంటలకు, మూడో విడత ఉదయం 10 గంటలకు, నాలుగో విడత మద్యాహ్నం 12 గంటలకు, చివరి విడత సాయంత్రం 4.30 గంటలకు వ్రతాలు ప్రారంభమవుతాయి. వ్రతాలు జరిపించుకునే భక్తులు కౌంటర్లలో టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. వారితో పురోహిత పరివారం ఆలయ వ్రతమండపంలో వ్రతాలు జరిపిస్తారు. నేడు సాయంత్రం కార్తీక దీపోత్సవం కార్తీక పౌర్ణమి సందర్భంగా నాచగిరి క్షేత్రంలో మంగళవారం సాయంత్రం భక్తజన సామూహిక కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ఈ వేడుక ప్రారంభమవుతుంది. ఆలయ ఆవరణలో వివిధ ఆకృతులలో వెలుగులు విరజిమ్ముతూ దీపాల వరుసలు నేత్ర పర్వం చేయనున్నాయి. దుబ్బాకటౌన్: హిందువులకు కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది, కార్తీకం ఈ పేరు వింటేచాలు బాధలు క్షణాల్లో తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కార్తీక మాసంలో తమ ఇంట్లో వ్రతాలు (నోము) చేస్తే సర్వ సుఖాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయన్న విశ్వాసం. అందుకే కార్తీక మాసంలో పెద్దనోములు, దీపారాధనలు చేయడం అనవాయితీగా వస్తోంది. పవిత్రమైన రోజు.. కార్తీక శుద్ధ పౌర్ణమి అనగా కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కల్గిన పదిహేనవరోజు. కార్తీక మాసంలో చివరిరోజైన పౌర్ణమి ఎంతో పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. అన్ని మాసాల్లో ఈ కార్తీక మాసానికే విశిష్టత ఉందని వేదాలు, పురణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రతిదినం ఓ పర్వ దినమే అందులో ముఖ్యమైనవి భగిని, హస్తభూజనం, నాగుల చవితి, నాగుల పంచమి, ఉరŠాధ్వన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, చివరిగా కార్తీక పౌర్ణమి. ప్రతీ ఇంటా నోములు, వ్రతాలు.. కార్తీకమాసం వచ్చిందంటనే ప్రతి ఇంటా నోములు(వ్రతాలు) ప్రత్యేకం. ప్రతీ ఏటా కార్తీక మాసంలో పెద్దనోములు( కేదారీశ్వర వ్రతం), సత్యనారాయణ వ్రతం,భక్తీశ్వర వ్రతాలు చేసుకుంటారు. కార్తీక దీపారాధన కార్తీక దీపానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. జ్ఞానానికి చిహ్నం దీపం, సర్వసంపదలు జ్ఞానం వల్లనే లభిస్తాయి.ఈ మాసమంతా దీపారాధన చేసి చివరిరోజున వెలుగుతున్న వెండి ప్రమిదను దానం చేస్తే అనంత పుణ్యఫలం, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. శివ, విష్ణుదేవలయాలు రెండింట స్త్రీలు ఎంతో నిష్టతో దీపాలు వెలిగిస్తారు. ప్రతీ ఇంటా కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే ఉసిరి కాయలు, ఆకులతో మరిగించిన నీటితో తలస్నానాలు ఆచరించి ఇంట్లో తులసికోట వద్ద మహిళలు నేతితో నింపిన భరిణిల్లో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు. దీపావళి రోజు నుంచి ఈ కార్తీక పౌర్ణమి వరకు 15 రోజులు తమ ఇండ్ల ముందర సాయం కాళంలో దీపాలు పెడుతారు. కార్తీక వనభోజనాలు... కార్తీకపౌర్ణమి రోజున శివ, విష్ణు ఆలయాలను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటారు.అలాగే కార్తీక వనభోజనాలకు వెళ్లడం ముఖ్యంగా ఉసిరిచెట్ల నీడలో కుటుంబసమేతంగా వన భోజనాలు చేయడం చాలా శ్రేష్టం. దీపారాధన శుభప్రదం.. కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం, ఆకాశదీపాలు వెలిగించడం, నదిలో దీపాలను వదలడం, దీపదానం చేయడం అత్యంత శుభప్రదం. వీటిని తప్పనిసరిగా ఆచరించాలని శాస్త్రం చెబుతున్నది. కార్తీకమాసమంతా ఇంటిముందర ద్వారానికి ఇరువైపుల దీపాలు వెలిగించి పెట్టాలి. సాయం వేళలో శివాలయాల్లో గాని, వైష్ణవాలయాల్లోగాని, గోపుర ద్వారం లేదా దేవుడి సన్నిధానంలో గాని, ఆలయ ప్రాంగణంలో గాని దీపాలను వెలిగిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతున్నది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. ఉపవాస నియమాలు పాటించడం శుభప్రదం. – హరిప్రసాద్ శర్మ, నాచగిరి వేదపండితులు తెలంగాణ ప్రాంత భక్తుల ఆరాధ్యక్షేత్రం నాచగిరి. ఇక్కడ జరిగే ప్రతీ కార్యక్రమం పండుగలా జరగాలన్నదే అభిమతం. అదేవిధంగా మంగళవారం కార్తీకపౌర్ణమి మహోత్సవం పండుగ వాతావరణంలో నిర్వహిస్తాం. కార్తీక పౌర్ణమి రోజున పెద్ద ఎత్తున కార్తీక వ్రతాలు జరుగనున్నాయి. అలాగే సాయంత్రం కార్తీక దీపోత్సవం జరుగుతుంది. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేశాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీకి అనుగుణంగా విడతల వారీగా వ్రతాలు జరిపిస్తాం. అదేవిధంగా సామూహిక కార్తీక దీపోత్సవం సాయంత్రం 6.30కు ప్రారంభమవుతుంది – కట్టా సుధాకర్రెడ్డి (నాచగిరి ఆలయ కార్యనిర్వహణాధికారి) -
తెలుగు రాష్ట్రాలో కార్తీక శోభ
-
ఉసిరి కొసిరి కొసిరి వడ్డించండి
కార్తీక మాసం ఉత్సవ మాసం. ఒకవైపు నాలుకపై శివనామ స్మరణం.. మరోవైపు జిహ్వకు ఉసిరి భోజనం... ఆధ్యాత్మికత మానసిక ఆరోగ్యం ఇస్తుంది. ఉసిరి సిరి శారీరక ఆరోగ్యం ఇస్తుంది జిహ్వకు సరికొత్త సత్తాని కూడా ఇసు ్తంది... అందుకే కొసిరి కొసిరి వడ్డించండి... ఆమ్ల గోలీ కావలసినవి: ఉసిరి కాయలు – పావు కేజీ; బెల్లం – 150 గ్రా.; వాము – పావు టీ స్పూను; వేయించిన జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఆమ్చూర్ పొడి – అర టీ స్పూను; నల్ల ఉప్పు – ఒక టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; పంచదార పొడి – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – కొద్దిగా. తయారీ: ►శుభ్రంగా కడిగిన ఉసిరికాయలకు తగినన్ని నీళ్లు జత చేసి కుకర్లో ఉంచి ఉడికించాలి ►రెండు విజిల్స్ వచ్చాక దింపి, చల్లారాక నీళ్లు వేరు చేయాలి ►ఉసిరికాయల నుంచి గింజలు వేరు చేసి, కాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►స్టౌ మీద పాన్ వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక, ఉసిరికాయ ముద్దను వేసి కలపాలి ►బెల్లం పొడి జత చేసి సుమారు ఐదు నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి ►వాము, ఇంగువ, వేయించిన జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, నల్ల ఉప్పు, ఉప్పు జత చేసి బాగా కలిపి దింపేయాలి ►కొద్దిగా చల్లారాక గోళీలుగా చేసి, పంచదార పొడిలో దొర్లించి, బాగా ఆరిన తరవాత గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి. ట్రెజర్ హంట్ కావలసినవి మైదా పిండి – 50 గ్రా.; జొన్న పిండి – 50 గ్రా.; ఉసిరికాయ తురుము – పావు కప్పు, బెల్లం తురుము – అర కప్పు; తేనె – పావు కప్పు ; వెనిగర్ – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – కొద్దిగా; బేకింగ్ పౌడర్ – అర టీ స్పూను; బేకింగ్ సోడా – అర టీ స్పూను; ఎగ్లెస్ కేక్ పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); కొబ్బరి తురుము – 2 టీ స్పూన్లు; ఆలివ్ ఆయిల్ – పావు కప్పు; పాలు – అర కప్పు; నీళ్లు – అర కప్పు. తయారీ ►ఒక పాత్రలో అన్ని పదార్థాలను వేసి ఎక్కువసేపు బాగా కలపాలి ►ఈ మిశ్రమాన్ని కేక్ కంటెయినర్లో పోసి, సమానంగా పరవాలి ►అవెన్ను 180 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి ►కేక్ కంటెయినర్ను అందులో ఉంచి, సుమారు అర గంట సేపు బేక్ చేశాక తీసి, చల్లారాక కట్ చేసి అందించాలి. ఆమ్ల గ్రీన్ చిల్లీ పికిల్ కావలసినవి: ఉసిరి కాయలు – పావు కేజీ; తాజా పచ్చి మిర్చి – పావు కేజీ; ఆవ పొడి – ఒక కప్పు; ఆవ నూనె – ఒక కప్పు; ఉప్పు – తగినంత, పసుపు – 2 టీ స్పూన్లు ఇంగువ – ఒక టీ స్పూను. తయారీ: ► ఒక పాత్రలో తగినన్ని నీళ్లు పోసి ఉసిరికాయలు, పచ్చి మిర్చి కాయలను శుభ్రంగా కడగాలి ►పచ్చి మిర్చిని మధ్యకు కట్ చేయాలి (గుత్తి వంకాయ మాదిరిగా) ►కుకర్లో అర గ్లాసు నీళ్లు, ఉసిరి కాయలు వేసి మూత ఉంచి, స్టౌ మీద పెట్టి, ఒక విజిల్ వచ్చాక దింపేయాలి ►బాగా చల్లారాక ఉసిరి కాయలలోని గింజలను వేరు చేయాలి ►తరిగిన పచ్చి మిర్చి, ఉసిరి ముక్కలు, పసుపు, ఆవ పొడి, ఉప్పు ఒక పాత్రలో వేసి బాగా కలపాలి ►స్టౌ మీద బాణలిలో ఆవ నూనె వేసి కాగాక ఇంగువ వేసి బాగా కలిపాక, సిద్ధంగా ఉన్న ఉసిరి పచ్చడి మీద పోసి, బాగా కలియబెట్టాలి ►ఈ మిశ్రమాన్ని రెండు రోజులు ఎండబెట్టాలి ∙గాలి చొరని జాడీలోకి తీసుకోవాలి ►వేడి వేడి అన్నంలో, కమ్మటి నువ్వుల నూనెతో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. ఆమ్ల స్వీట్ అండ్ హాట్ పికిల్ కావలసినవి: ఉసిరి కాయ ముక్కలు – పావు కేజీ; బెల్లం పొడి – ఒక టేబుల్ స్పూను; నువ్వు పప్పు నూనె – ఒక కప్పు; ఉప్పు – తగినంత; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 5; ఇంగువ – పావు టీ స్పూను; పసుపు – ఒక టీ స్పూను; వెల్లుల్లి రేకలు – 10; కరివేపాకు – 3 రెబ్బలు; మిరప కారం – 2 టేబుల్ స్పూన్లు; మెంతులు – అర టీ స్పూను. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, బెల్లం పొడి, ఉసిరి ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు కలపాలి ►తడి బయటకు వస్తుంటే, మంట బాగా తగ్గించి, మరో రెండు నిమిషాలు ఉడికించి, మరోపాత్రలోకి తీసుకోవాలి ►స్టౌ మీద మరో బాణలిలో నువ్వుల నూనె వేసి కాగాక, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి, ఇంగువ, పసుపు, వెల్లుల్లి రేకలు వేసి బాగా కలపాలి ►కరివేపాకు జత చేసి మరోమారు వేయించాక, ఎండు మిర్చి జత చేసి కలిపి దింపేయాలి ►సిద్ధంగా ఉన్న ఉసిరి పచ్చడిలో ఈ మిశ్రమం, ఉప్పు, మిరపకారం వేసి బాగా కలపాలి ►ఒక గంట తరవాత వేడి వేడి అన్నంలోకి తింటే రుచిగా ఉంటుంది ►రోటీలలోకి కూడా బాగుంటుంది. ఆమ్ల క్యారట్ జ్యూస్ కావలసినవి: క్యారట్ – పావు కేజీ; ఉసిరి కాయలు – 4, అల్లం తురుము – అర టీ స్పూను, తాజా నిమ్మ రసం – 2 టీ స్పూన్లు; తేనె – ఒక టేబుల్ స్పూను; నీళ్లు – తగినన్ని; ఐస్ క్యూబ్స్ – తగినన్ని. తయారీ: ►క్యారట్లను శుభ్రంగా కడిగి, పైన తొక్క తీసి, కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేయాలి ►మిక్సీలో క్యారట్ ముక్కలు, అల్లం తురుము, కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టి, వడ కట్టి, రసం వేరు చేయాలి ►ఉసిరి కాయలను శుభ్రంగా కడిగి, గింజలను వేరు చేసి, కాయలను సన్నగా తురమాలి ►తగినన్ని నీళ్లు, ఉసిరి కాయ తురుములను మిక్సీలో వేసి మెత్తగా చేసి, వడకట్టి, నీరు వేరు చేసి పక్కన ఉంచాలి ►ఒకపెద్ద పాత్రలో క్యారట్ రసం, ఉసిరి రసం పోసి, తేనె జత చేసి బాగా కలపాలి ►ఐస్ క్యూబ్స్ జత చేసి చల్లగా అందించాలి. -
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ
-
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ
సాక్షి, హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసంలో మొదటి సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. అభిషేకాలు నిర్వహించి, కార్తీక దీపాలు వెలిగించారు. సూర్యలంక సముద్ర తీరంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లలోని సూర్యలంక సముద్ర తీరాన పంచభూతాలకు ఆయన కర్పూర హారతి ఇచ్చి, అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సముద్ర తీరానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు కోన రఘుపతి. మరోవైపు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. గుంటూరు కార్తీక మాసం తొలి సోమవరాం, కోటి సోమవారం సందర్భంగా జిల్లాలోని నరసరావుపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండపై ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. త్రికోటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున నుంచి మూలవిరాట్కు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కోటి సోమవారం సందర్భంగా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. అమరావతిలో తెల్లవారుజాము నుంచే నదీ స్నానం చేసి భక్తులు అమరలింగేశ్వరుడుని దర్శించుకుంటున్నారు వైఎస్సార్ జిల్లా: హిందువుల పవిత్ర కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా రాజంపేట డివిజన్లలో ఉన్న ఆత్త్తిరాల త్రేతేశ్వర, ఊటుకూరు భక్తకన్నప్ప ఆలయం, రాజంపేట రామలింగేశ్వర ఆలయంలో శివ భక్తులు బారులు తీరారు. ఆలయాల్లో శివ నామస్మరణతో పంచాక్షరి మంత్రం మారు మోగితోంది. నెల్లూరు జిల్లా కార్తీక సోమవారం సందర్భంగా జిల్లాలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. జిల్లీలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. కావలి శివాలయంలో హరి హర నామస్మరణలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. రామతీర్థం.. కాటపల్లిలలో భక్తులు సముద్ర స్థానాలు ఆచరిస్తున్నారు. కర్నూలు కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా శ్రీశైలం దేవస్థానం భక్తులు తో పోటెత్తింది. వేకువ జామునుండే భక్తులు పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నేటి సాయంత్రం లక్ష దీపోత్సవం కార్యక్రమం జరగనుంది. తూర్పు గోదావరి కడియం మరియు రాజమండ్రి రూరల్ మండలాల్లో కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో వేకువజాము నుంచే శివాలయాలు కిటకిటలడాయి.ముమ్మిడివరం మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి నిత్యకళ్యాణం పచ్చతోరణంతో విరాజిల్లుతున్నాడు. ముమ్మిడివరం శ్రీఉమాసూరేశ్వరస్వామి, కుండలేశ్వరం శ్రీపార్వతీ కుండలేశ్వర స్వామి వారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దక్షిణ కాశీ శ్రీమాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. సప్తగోదావరిలో స్నానం ఆచరించి భక్తులు కార్తీక దీపాలు వదిలారు. పశ్చిమగోదావరి : పాలకొల్లు పంచారమ క్షేత్రం శ్రీ క్షీరా రామలిబుగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. భక్తులు తెల్లవారు జామున నుండి స్వామి వారికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు. భీవవరంలోని పంచారామ క్ష్రేత్రంలో భక్తులు పూజలు, అభిషేకాలు నిర్వహించారు. -
నేడు కార్తిక తొలి సోమవారం
-
భక్తులతో కిటకిటలాడిన శ్రీశైలం
కర్నూలు, శ్రీశైలం ప్రాజెక్ట్: కార్తీకమాసం మొదటి ఆదివారం సందర్భంగా శ్రీశైలం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 60 వేలమంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఉంటారని ఆలయాధికారుల అంచనా. తెల్లవారుజామున పవిత్ర పాతాళ గంగలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వేకువ జామున 3.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సుప్రభాత సేవ, ప్రాతఃకాల పూజలు, మహామంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. 4.30 గంటల నుంచి భక్తులను స్వామి అమ్మవార్ల సర్వ దర్శనం, ఆర్జిత సేవలకు అనుమతించారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు రద్దీ కారణంగా సుప్రభాత సేవ, మహా మంగళ హారతి సేవ, టిక్కెట్లను నిలిపివేశారు. భక్తులకు క్యూలలో మంచినీరు, బిస్కెట్లు, అల్పాహారం, ఉదయం వేళల్లో పాలు పంపిణీ చేశారు. శివదీక్షా శిబిరాల్లో వనభోజనాలు ఏర్పాటు చేశారు. అన్నదాన మందిరంలో భక్తుల సౌకర్యార్థం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. కార్తీక దీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట, గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీకదీపారాధన చేసుకునే భక్తులకు ఆలయ ఉత్తరభాగం నుంచి ప్రత్యేక ప్రవేశం కల్పించారు. -
జ్ఞానానికి ప్రతీక ఉసిరి దీపం
సాక్షి, నిజామాబాద్ : సకల సౌభాగ్యాలు ప్రసాదించే కార్తీకమాసం మోక్షమాసంగా పేరు పొందింది. ఈ మాసంలో చేసే పూజలు కైలాస, వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో మాత్రమే పూజించే ఉసిరికాయను విష్ణు స్వరూపంగా భావించి పూజలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే ఉసిరిని ఈ మాసంలో తిన్నా, దీపాలతో ఆరాధించినా ఆరోగ్యభాగ్యం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కార్తీక మాసం ఆరంభం నుంచే జిల్లా కేంద్రంలో ఉసిరికాయ అమ్మకాలు జోరందుకున్నాయి. శివాలయాల్లో.. ఉమ్మడి జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ, శివాలయాల్లో కార్తీకమాసాన్ని పురస్కరించుకొని ఉదయం, సాయంత్రం భక్తులు ఉసిరి దీపారాధనలు చేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లోని శివాలయాలతో పాటు భిక్కనూరు, బీబీపేట, దోమకొండ, తాడ్వాయి, లింగంపేట, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్, ఆర్మూర్, పోచంపాడ్ తదితర ప్రాంతాల్లోని శివాలయాల్లో భక్తులు కార్తీక పూజలు చేస్తున్నారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఔషధ గుణాలు ఇవే.. ఉసిరిని ఎక్కువగా ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇందులో క్యాల్షియం, ఐరన్, ప్రొటీన్లు, పాస్పర్స్, కార్బొహైడ్రేడ్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయని వారు చెబుతున్నారు. జ్ఞాపకశక్తిని, తెలివితేటలు పెంచేందుకు ఉసిరి దివ్య ఔషధంగా పనిచేసుందని తెలుస్తోంది. ఉసిరిని పొడిగా లేదా ముక్కలుగా ఏదో ఒక రూపంలో ప్రతిరోజు కొద్ది మోతాదులో తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరెన్నో ఉపయోగాలు ఉసిరితో మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి. శరీరంలోని వేడిని, జలుబు, కోరింత దగ్గును తగ్గిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కడుపు, పేగులో మంటను అరికడుతుంది. అధిక దాహాన్ని అదుపులో ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఉసిరి కలిపిన నూనెను వాడితే జుట్టు నిగనిగలాడటంతో పాటు జుట్టు రాలటం ఆగుతుంది. దీంతో తయారు చేసిన టానిక్ వాడితే ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. చర్మ రక్షణకు ఉసిరి చలికాలంలో వచ్చే చర్మవ్యాధులకు ఉసిరి దివ్యౌషధంగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి, చిన్నపిల్లల్లో ఎముకల సంరక్షణకు, మహిళల్లో రుతుక్రమం సక్రమంగా రావడానికి ఉసిరి సేవనం బాగా ఉపయోగపడుతుంది. అందుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనం చేయాలని పెద్దలు చెబుతారు. – యోగా రాంచంద్రం, గాజుల్పేట జ్ఞానానికి ప్రతీక ఉసిరి దీపం చీకటి అజ్ఞానానికి, వెలుగు జ్ఞానానికి ప్రతిబింబం. పవిత్రమైన కార్తీకమాసం శివకేశవుల ఆరాధన విశేష పుణ్యాన్నిస్తుంది. తులసి, ఉసిరికోట ముందు దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలుగుతాయని కార్తీక పురాణం చెబుతుంది. ఈ మాసంలో ఉసిరికను పూజించటం వలన ఈ కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు దరిచేరవని శాస్త్రాలు చెబుతున్నాయి. – తోక చంద్రమౌళి, వినాయక్నగర్ -
పెళ్లి సందడి షురూ...!
అన్నింట్లో పోటీ.. ఏదీ చేసినా సెన్సేషన్.. అందరూ శభాష్ అనేలా చేయాలనేది నేటి కాస్సెప్ట్.. ఎవరూ చేయలేనిది చేయకూడనిది చేసి హౌరా అనిపించాలనేది ధనవంతుల మనస్సులో ప్రణాళిక. ఉన్నంతలో తమ పిల్లల పెళ్లిళ్లు ఘనంగా చేయాలనేది మధ్య తరగతి కుటుంబాలు మనోగతం. వివాహాల విషయంలో శుభలేఖలు మొదలు.. వీడియో, ఫొటోలు, అలంకరణ, స్టేజీ ఏర్పాటు, లైటింగ్, గుర్రపుబండ్లతో ర్యాలీ.. మ్యూజికల్నైట్స్.. ఒక్కటేమిటి ప్రతీది ప్రత్యేకంగా ఉండాల్సిందే. బంధుమిత్రలతో పాటు ప్రతిఒక్కరు మీ బాబు, మీ అమ్మాయి వివాహం అదరహో.. సూపర్ చేశారు.. అంటూ ప్రసంశల వర్షం కురిపించుకుంటే చెప్పలేని ఆనందం. నేటి నుంచి కార్తీకమాసం ప్రారంభం కానుండడం ఈ నెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉండడంతో.. పెళ్లిళ్ల సందడి నెలకొననుంది. సాక్షి, యాదగిరిగుట్ట (ఆలేరు) : కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లాలో వివాహల సందడి నెలకొనుంది. నవంబర్ 1, 6, 14, 15, 22, 28, 30వ తేదీల్లో మంచి ముహుర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఈ తేదీల్లో వివాహాలు చేసుకోవడానికి అధికసంఖ్యలో ముహుర్తాలు పెట్టుకున్నారు. ఒకే రోజు వందల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఈ ముహుర్తాలను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. వీడియోలకు ప్రాధాన్యం... ఎంత తీసుకున్నా ఓకే. వీడియో, ఫొటోలు అద్భుతంగా ఉండాలి. ప్రతిఘట్టాన్ని మర్చిపోలేని రీతిలో.. భవిష్యత్లో తీపిగుర్తుగా మిగిలిపోయేలా టేకింగ్ ఉండాలని నిర్వహకులు కోరుతున్నారు. కనీసం రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు వీడియోలు, ఫొటోలకు నజరానా ఇస్తున్నారు. అధునాతన కెమెరాలు ఉండాలి, ప్రతి సన్నివేశం చిత్రీకరించేందుకు స్టాప్ సరిపడా తెచుకోవాలని ఆంక్షలు విధిస్తున్నారు. అందుకే వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లకు ఈ నాలుగు రోజులకు డిమాండ్ పెరిగింది. బంగారం, వస్త్ర దుకాణాలకు క్యూ.. పెళ్లి అంటే ముందు గుర్తు వచ్చేది బంగారం, వస్త్రాలు. వీటి కోసం కనీసం 4 నుంచి 5రోజుల సమయం పడుతుంది. ఎందుకంటే మంచి మోడల్స్ ఎంపిక చేయడం, పెళ్లికూతురు, పెళ్లి కొడుకులతో పాటు తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులకు కూడా స్థాయిని బట్టి బంగారం, వెండి, వస్త్రాలు పెడతారు. దీంతో బంగారు దుకాణాలు, వస్త్ర దుకాణాలు కిటకిటాలాడుతున్నాయి. కంపనీ వస్త్రాలకే పెళ్లి కుటుంబాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. పురోహితులు బిజీ.. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో పురోహితులు బిజీగా మారిపోయారు. ఒకే రోజు ఒక్కో పురోహితుడు 3 వివాహాలు జరిపించేలా ముహుర్తాలు సెట్ చేసుకుంటున్నారు. మరికొందరు ప్రధాన పురోహితులు, ప్రధాన ఘట్టం మాత్రమే దగ్గరుండి నిర్వహించి, మిగిలిన కార్యక్రమం సహాయకులు చూసుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతే కాకుండా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఫంక్షన్హాల్స్ కూడా పూర్తిగా బుకింగ్ అయిపోయాయని పురోహితులు అంటున్నారు. క్యాటరింగ్కు డిమాండ్.. గతంలో మాదిరి వివాహానికి హాజరయ్యే అతిథులకు విందు కోసం కూరగాయలు, సరుకులు తెచ్చి వండించే విధానం దాదాపు లేదనే చెప్పాలి. అంతా కేటరింగ్కు ఇవ్వడమే ప్రస్తుత పరిస్థితులు. మాకు ఇన్ని రకాల స్వీట్లు, హాట్లు, పప్పు, సాంబారు, పచ్చళ్లు, మాంసం, అప్పడాలు వంటివన్ని సుమారు 20 నుంచి 25 రకాలు మెనూ కావాలి అంటూ కాంట్రాక్టులు ఇస్తున్నారు. మెనూను బట్టి ధర నిర్ణయిస్తున్నారు. ఇక పెళ్లిళ్ల నిర్వాహకులకు వంటలు, వడ్డనతో సంబంధం ఉండదు. వీరూ అతిథుల్లాగా వెళ్లడమే. డీజే.. బ్యాండ్.. భజంత్రీలు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వివాహం చేసుకునే కుటుంబాలు భాజా భజంత్రీలు, బ్యాండ్తో పాటు డీజే మ్యూజిక్ను ఎంచుకుంటున్నాయి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిని చేసేటప్పుడు సంప్రదాయంగా బాజా భజంత్రీలు, జిలకర బెల్లం, తాళికట్టే సమయాల్లో భాజా, బ్యాండ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక సాయంత్రం భరాత్ తీయడానికి డీజేను అధికసంఖ్యలో ఎంచుకుని డ్యాన్స్లు చేస్తున్నారు. కళ్లు చెదిరేలా కల్యాణ మండపాలు.. సినిమా షూటింగ్ల తరహాలో కల్యాణ మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. కాసులు కురిపించే కొద్దీ కాంతిలీనే కల్యాణ మండపాలు ముస్తబవుతాయి. దీని కోసం రూ.లక్షలు వేచిస్తున్నారు. డెకరేషన్స్ చేసే వారికి ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చేశారు. కళ్లుమిరుమిట్లు గొలిపేలా సెట్టింగ్లు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ మాసంలో మంచి ముహూర్తాలు.. మార్గశిర మాసంలో వివాహాలు మంచిది. కార్తీకమాసంలో కొద్ది రోజులు మూఢాలు రావడంతో వివాహలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ కార్తీకమాసంలో మంచి ముహుర్తాలు ఉన్నాయి. ఈ మాసంలో వివాహాలు చేసుకోవడంతో నూతన జంటల దాంపత్య జీవితం మంచిగా ఉంటుంది. ఇప్పటికే ఒక్కో రోజు 3 వివాహాలు జరిపించడానికి పురోహితులు సిద్ధమయ్యారు. కార్తీకమాసం భక్తితో పాటు శుభ కార్యాలకు మంచిదిగా చాలా మంది భావిస్తారు. – మార్తి పవన్కుమార్ శర్మ, పురోహితుడు -
రాజమండ్రి పుష్కరఘాట్లో భక్తులు పుణ్యస్నానాలు
-
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ
-
ఎగ్ @ రూ.4.25
సాక్షి సిటీబ్యూరో: వాస్తవానికి గుడ్ల ధర చలికాలంలో పెరిగి, వేసవిలో తగ్గుతుంటుంది. అయితే ఈసారి చలికాలం ప్రారంభంలో ధరలు కాస్త పెరిగినా... వారం రోజుల నుంచి పడిపోయాయి. ప్రస్తుతం ఒక గుడ్డు ధర రిటైల్ మార్కెట్లో రూ.4.25 ఉండగా... గతేడాది నవంబర్లో రూ.5 దాటిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఓవైపు కార్తీకమాసం, మరోవైపు గుడ్ల ఉత్పత్తి పెరగడం ధరలు తగ్గడానికి కారణమని హోల్సేల్ వ్యాపారులుచెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ఫామ్లో గుడ్డ ధర రూ.3.65 ఉండగా... హోల్సేల్లో రూ.4.10, రిటైల్లో రూ.4.25 పలుకుతోంది. గతేడాది ఈ సమయంలో ఫామ్ రేట్నే రూ.4.60 వరకు ఉందంటున్నారు. తగ్గిన ఎగుమతులు.. తెలంగాణ నుంచి గుడ్లను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో లేయర్ ఫామ్స్ పెరగడంతో ఈ ఏడాది ఎగుమతులు తగ్గాయి. మరోవైపు చలికాలంలో ధర ఉంటుందని ఫామ్ యజమానులు ఎక్కువగా లేయర్స్ను వేశారు. స్థానికంగా ఉత్పత్తి పెరిగింది. దీంతో ధరలు చాలా వరకు తగ్గాయి. ఈ పరిస్థితుల్లో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఫామ్ యజమానులు ఆందోళన చెందుతున్నా రు. ఒక్కో లేయర్ కోడిపై దాదాపు రూ.250 ఖర్చవుతుందని, ఈ నేపథ్యంలో ఒక్కో దానిపై రూ.75 వరకు నష్టం రావొచ్చని అంటున్నారు. ‘ప్రతిఏటా నవంబర్ నుంచి గుడ్ల ధరలు పెరుగుతాయి. ఈ ఏడాది చలికాలంలో ప్రారంభంలో పెరిగినా... నవంబర్ మూడో వారం నుంచి ధరలు విపరీతంగా తగ్గాయి. కార్తీకమాసంలో ప్రతిఏటా ధరలు తగ్గుతాయి. కానీ ఈ స్థాయిలో తగ్గుతాయని అనుకోలేద’ని నెక్ బిజినెస్ మేనేజర్ సంజీవ్ చింతావర్ తెలిపారు. -
ఆశాదీపం
-
చలో టూర్..
సాక్షి, సిటీబ్యూరో: ఒకవైపు పవిత్ర కార్తీకమాసం. మరోవైపు వీకెండ్ వరుస సెలవులు. దానికి తోడు ఆహ్లాదకరమైన శీతాకాలం. మరింకేం. అన్నీ కలిసొచ్చాయి. దీంతో నగర వాసులు సొంత ఊళ్లకు, పర్యాటకస్థలాలకు పయనమవుతున్నారు. నాలుగు రోజులు సరదాగా గడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. గురువారం నుంచే వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, బస్సుల్లో రద్దీ కనిపించింది. అన్ని రెగ్యులర్ రైళ్లలో వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరుకుంది. శుక్రవారం ప్రయాణికుల రద్దీ మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ, రైల్వే అధికారుల అంచనా. వరుస సెలవులను దృష్టిలో ఉంచుకొని పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. విజ్ఞాన, విహార యాత్రలకు వెళ్లే విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ఉత్తర, దక్షిణాది పర్యటనలకు తరలి వెళ్తున్నారు. మరి కొందరు పర్యాటక ప్రియులు శ్రీలంక, థాయ్లాండ్, దుబాయ్ వంటి విదేశాలకు స్వల్ప కాలిక టూర్లకు వెళ్తున్నారు. పర్యాటకుల అభిరుచికి తగిన ట్లుగా ఐఆర్సీటీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే పలు ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చాయి. దీంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య కొద్దిగా పెరిగినట్లు విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా కార్తీక మాసంతో పాటు సెలవులు కూడా కలిసి రావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు, సందర్శకుల సంఖ్య ఇతోధికంగా పెరిగింది. సుమారు 17 శాతం వరకు దేశీయ ప్రయాణాలు పెరిగినట్లు కాక్స్ అండ్ కింగ్స్ ట్రావెల్ సంస్థ పేర్కొంది. పర్యాటకుల అభిరుచి మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు సైతం ప్రత్యేక ప్యాకేజీలతో ఆకట్టుకుంటున్నాయి. ఉత్తరాదికి పెరిగిన రద్దీ... చాలామంది నగరవాసులు, విద్యార్థులు ఉత్తరాదికి వెళ్లేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా ఢిల్లీ, జైపూర్, పట్నా, వారణాసి, తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో రద్దీ పెరిగినట్లు రైల్వే అధికారి ఒకరు పేర్కొన్నారు. ‘ వారణానికి వెళ్లే వారిలో ఎక్కువ శాతం ఆధ్మాత్మిక పర్యాటకులు ఉండగా, జైపూర్, తదితర ప్రాంతాలకు వెళ్లే వారిలో టూరిస్టులు, విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వెళ్లే పట్నా ఎక్స్ప్రెస్, దాణాపూర్, రాజ్కోట్, తదితర రైళ్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఈ రైళ్లలో నెల రోజుల క్రితమే బెర్తులు పూర్తిగా రిజర్వు చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం అన్ని రైళ్లలోనూ చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ దర్శనమిస్తోంది. కార్తీక మాసం సందర్భంగా తుంగభద్రలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఎక్కువ మంది కర్నూలు తరలి వెళ్తున్నారు. అలాగే రాజమండ్రికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. విజయవాడ, విశాఖ, కాకినాడ, తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు ముందస్తుగానే బుక్ అయ్యాయి. శుక్ర, శని వారాల్లో రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. పంచారామాలకు ఆర్టీసీ ప్యాకేజీ... తెలంగాణలోని పంచ శైవక్షేత్రాలైన వేముల వాడ (రాజరాజేశ్వరాలయం), కాళేశ్వర (ముక్తేశ్వర, కాళేశ్వర స్వామి), రామప్పగుడి (రామలింగేశ్వర స్వామి) వెయి స్తంభాలగుడి (రుద్రేశ్వర స్వామి), పాలకుర్తి (సోమనాథ స్వామి), ఏపీలోని అమరావతి (అమరేశ్వరాలయం), భీమవరం (సోమేశ్వరాలయం), పాలకొల్లు (క్షీరరామలింగేశ్వరాలయం), ద్రాక్షారామం (భీమేశ్వరాలయం), సామర్లకోట (కుమార రామ భీమేశ్వరాలయం)లకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. తెలంగాణలోని దక్కన్ పంచ శైవక్షేత్రాలకు కార్తీక పౌర్ణమి ముందు రోజు ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. అలాగే ప్రతి ఆదివారం మధ్యాహ్నం బయలుదేరి సోమవారం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ పర్యటను చార్జీ సూపర్లగ్జరీ రూ.1100, రాజధాని రూ.1500 చొప్పున ఉంది. ఏపీలోని పంచారామాలకు కూడా కార్తీక పౌర్ణమి ముందు రోజు బస్సులు బయలుదేరుతాయి. ఈ పర్యటనకు సూపర్లగ్జరీ చార్జీ రూ.1800 కాగా, రాజధాని చార్జీ రూ.2450 చొప్పున ఉంది. దర్శనం టిక్కెట్లు, స్నాన వసతి కోసం మరో రూ.300 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అలాగే కార్తీక మాసంలో ప్రతి ఆదివారం బయలుదేరి మంగళవారం తిరిగి హైదరాబాద్ చేరుకొనేలా ఈ బస్సులను ఏర్పాటు చేశారు. -
శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మసోత్సవాలు
-
రామలింగేశ్వరునికి కార్తీక శోభ
మల్లాపూర్(కోరుట్ల): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే ఏకైక హరిహరక్షేత్రంగా శ్రీరామలింగేశ్వర ఆలయం కీర్తించబడుతుంది. మండలంలోని వాల్గొండ గ్రామంలో గోదావరి నది తీరాన ఉన్న ఆలయంలో కార్తీక మాస పంచాహ్నిక మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 19 నుంచి 23న కార్తీక పౌర్ణమి వరకు శివముష్టి, చందనోత్సవ, తులసీ వివాహా, అష్టోత్తర కళశ స్నపన, లక్ష కుంకుమార్చన, పుష్పయాగములతో పాటు..పౌర్ణమి రోజున లక్ష దీపాలంకరణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నారు. లక్ష దీపాలంకరణోత్సవాలకు ముఖ్య అతిథులుగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ పాల్గొంటారని ఆలయ కమిటీ చైర్మన్ సాంబారి శంకర్, వైస్ చైర్మన్ చిలివేరి లక్ష్మి, ఎంపీటీసీ ఇస్లావత్ లక్ష్మీబలరాంనాయక్, మాజీ సర్పంచులు చిలివేరి రమేశ్, ఎండీ.జమాల్, మాజీ ఉపసర్పంచ్ దండిగ రాజం తెలిపారు. విచ్చేయనున్న సాధుపుంగవులు.. కార్తీక పౌర్ణమి రోజున లక్ష దీపాలంకరణోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి సాధుపుంగవులు ముఖ్య ఆథితులుగా విచ్చేయనున్నారు. మనోరబాద్ నుంచి శ్రీ శివానందభారతిస్వామి, శకణాగిరి నుంచి శ్రీకేశవనాథ్స్వామి, ఆదిలాబాద్ నుంచి శ్రీ ఆదినాథ్స్వామి, వాల్గొండ చంద్రయ్యస్వామి, వేంపేట నుంచి భవవద్గీత పారా యణ భక్తులు, కొలిప్యాక నుంచి శ్రీగంగాధర్స్వామి, కోరుట్ల నుంచి శ్రీ ఆత్మనందస్వామి, గంభీర్పూర్ నుంచి గిరిజామాతస్వామి, కోరుట్ల నుంచి శ్రీజగదీశ్వరస్వామి, కోరుట్ల నుంచి హరిప్రియమాత, పిప్రి నుంచి శ్రీయోగేశ్వరస్వామి, శ్రీ నర్సింగరెడ్డిస్వామి లక్షదీపోత్సవానికి విచ్చేయనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. -
కార్తీకం శుభప్రదం!
పవిత్ర కార్తిక మాసం ప్రారంభం కావడంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.ఈ కార్తిక మాసంలో భక్తులంతా తెల్లవారు జామునే లేచి పవిత్ర స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేయడంలో నిమగ్నం అయిపోతారు. కార్తిక మాసం సర్వమంగళకరం హరిహరులకు ప్రీతికరమైనది.కార్తిర మాసంలో ఏ పనిచేసినా...మంచి ఫలితాలు కలుగుతాయని ప్రజల నమ్మకం అందుకే ఈ మాసంలో భక్తులు ఉదయాన్నే నది స్నానాలు చేసి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి హరిహరులకు పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి సోమవారాలు, ఏకాదశి, ద్యాదశి, పౌర్ణమి తిదులను పరమ పవిత్రమైన దినాలుగా భావిస్తారు. ధర్మపురి: కార్తీకమాసం ఎంతో శుభప్రదం. ఆదివారం సెలవు రోజు కావడంతో ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ప్రధాన ఆలయం శ్రీయోగానందుడైన శ్రీలక్ష్మీనృసింహస్వామితో పాటు అనుబంధ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఉసిరిక చెట్టు వద్ద మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. -
సోమవారానికి ఎందుకంత ప్రాధాన్యత?
కార్తికంలో సోమవారానికి ఎనలేని ప్రాధాన్యత ఎందుకంటే, సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్నినక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రంమీద ఉండటం చేత సోమవారాలకు విశిష్టత కలిగింది. సోమ అంటే చంద్రుడు. శివుని సిగలో వెలిగే చంద్రుని వారం గనుకే సోమవార ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత. అదీగాక సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే భక్తులు ఈ మాసంలో సోమవారాలలో భక్తిశ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తారు. సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించడం వల్ల సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో, ఆనందోత్సాహాలతో వర్థిల్లుతారని విశ్వాసం. వనసమారాధన కార్తీకమాసంలోనే ఎందుకు? గడపదాటి వెళ్లనివారు సైతం కార్తీక మాసంలో వన సమారాధనలో పాల్గొంటారు. తక్కిన ఏ మాసమూ కూడా వనభోజనాలకు అనుకూలం కాదు. వసంత రుతువు కొంత అనుకూలమే అయినా, వడగాలులు, ఉక్కపోతా ఉంటాయి కాబట్టి అంత బాగుండదు. ఇక గ్రీష్మరుతువులో ఎండలు మెండు. ఆ తర్వాత వర్ష రుతువులో ఎప్పుడు వాన వస్తుందో తెలియని ఇబ్బంది...తర్వాత వచ్చే శరదృతువులో అందులోనూ కార్తీక మాసంలో చలి మెల మెల్లగా పాకుతూ నెల చివరికి బాగా చలిగా ఉండేలా మారుతుంది కాబట్టీ, సాయంత్రం అయ్యేసరికి చిరుచలిగాలులు వీచి ఈ రోజుకి వనభోజనాలు ముగిసాయని ఆ నాటికి కాలమే హెచ్చరిక చేస్తూంటుంది కాబట్టీ, చిరుచలీ దానితోపాటు వేడిమీ పగలంతా ఉపవాసం కాబట్టీ ఈ చలి వేడిముల వాతావరణంలో భోజనాలు – అదీ సామూహికంగా – ఎంత బాగుంటాయి. తలచుకున్నప్పుడల్లా సంతోష పరిమళాలని వెదజల్లుతూ ఉంటాయి. ఇక తర్వాత వచ్చే హేమంత రుతువులో మంచు ఎక్కువగా కురుస్తుంది. ఆ తర్వాత శిశిర రుతువులో చెట్లన్నీ బోడిగా ఉంటాయి. నీడ అనేది దొరకని కాలం కాబట్టి అనేక అనుకూలతలు ఉన్న కార్తీకమాసంలోనే వన భోజనాలు జరుగుతాయి. ఒట్టిగా తిని పోవడానికి మాత్రమే కాకుండా, భగవంతుని పేరిట అభిషేకాన్ని చేసుకుని – లేదా – ఓ వ్రతాన్ని చేసుకుని, అన్నాన్ని భగవత్ప్రసాదంలా స్వీకరించగలిగే అవకాశముండేది ఈ మాసంలో మాత్రమే.వనసమారాధనలో ఉసిరి చెట్టునీడన సాలగ్రామరూపంలో శ్రీహరిని పూజించి శక్తి కొలది అన్నసమారాధన చేసిన వారిని యముడు కన్నెత్తి కూడా చూడలేడని, సకల పాపాలు తొలగిపోయి విష్ణుసాయుజ్యం పొందుతారనీ కార్తీక పురాణం బోధిస్తోంది. -
కార్తీక మాసం: శివనామ స్మరణతో మార్మోగుతున్న ఆలయాలు
కార్తీకమాసం మొదటి సోమవారం విజయవాడ భ్రమరాంభమల్లేశ్వర స్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది. తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులు కృష్ణానదిలో స్నానాలాచరించి కార్తీక దీపాలు వెలిగించారు. మహాశివుడికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. దీపాల వెలుగులతో ఆలయం మరింత శోభను సంతరించుకుంది. బ్రమరాంభ మల్లేశ్వర స్వామి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గుంటూరు జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం కోటప్ప కొండ భక్తులతో నిండిపోయింది. కార్తీకపూజల కోసం భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి 30 వేల మంది వస్తారని అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి జిల్లాల్లోని శివాలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. అన్నవరం సత్యదేవుని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామునుంచే భక్తులు పెద్దసంఖ్యలో సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. మహిళలు రావిచెట్టు వద్ద పూజలు చేసి దీపాలు వెలిగించారు. స్వామివారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో పశ్చిమగోదావరి జిల్లాల్లోని శైవక్షేత్రాలన్నీ కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ.. మహాశివుడిని దర్శనం చేసుకుంటున్నారు. కార్తీక మాసం శివునికి ఎంతో ఇష్టమైన మాసమని, అలాంటి కార్తీక మాసంలో అందులోనూ సోమవారం ఆ మహాశివుడిని ఆరాధిస్తే.. పుణ్యఫలాలు దక్కుతాయని ప్రతీతి. ఈ మాసంలో శివ శివ అని స్మరిస్తే చాలు.. ఆ దేవదేవుడు కరుణిస్తున్నాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే కార్తీక మాసంలో భక్తులు సైతం శివారాధన కోసం ఆలయాలకు పోటెత్తారు. కార్తీక దీపాలు వెలిగించి.. నీలకంఠుడికి అభిషేకాలు చేయిస్తున్నారు. ముఖ్యంగా పంచారామక్షేత్రాలైన ద్రాక్షారామం, సామర్లకోట శివాలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని ఘాట్లన్నీ భక్తజన సందోహంతో నిండిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలోనూ కార్తీక సోమవారం పూజలు వైభవంగా జరుగుతున్నాయి. టెక్కలి మండలం రావివలస గ్రామంలోని శ్రీ ఎండల మల్లికార్జునస్వామివారి ఆలయంలో కొలువైన అతిపెద్ద శివలింగాన్ని దర్శించుటకు భక్తులు తరలివస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచే కాకుండా.. ఇతర జిల్లాల నుంచి భక్తులు వందలాదిగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంగణంలో శివనామస్మరణలు మారుమోగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా తెల్లవారు జామున మూడు గంటల నుంచే గోదావరి నదిలో పుణ్యస్నానాలాచరించారు. పెద్దసంఖ్యలో వచ్చిన మహిళలు నదిలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు . ఆలయంలోని మహాశివునికి అభిషేకాలు చేశారు. గోదావరితీరం దీపాల కాంతితో శోభాయమానంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడు శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మారుమోగుతోంది. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అనంతరం మహాశివుడు భక్తులకు దర్శనమిచ్చాడు. తెల్లవారుజామునుంచే ధర్మగుండంలో పుణ్యస్నానాలాచరించి కార్తీక దీపాలను వెలిగించి కోడె మొక్కులు తీర్చుకున్నారు . భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అర్జిత సేవలను రద్దు చేసి భక్తులకు లఘు దర్శనం కల్పించారు. నల్లగొండ జిల్లాలోని యాదాద్రి సహా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోనూ భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. -
కార్తీక మాసం: భక్తులతో కిక్కిరిసిన గోదావరి జిల్లాలోని శైవక్షేత్రాలు
-
రాజమండ్రి గోదావరి దగ్గర కార్తీకమాసం శోభ
-
వానర ప్రీతి.. సంభావన చేసి..
ద్వారకాతిరుమల : కార్తీక మాసంలో వన భోజనాలు చేస్తే పుణ్యఫలాలు దక్కుతాయని భక్తుల విశ్వాసం. ఇది మనందరికీ తెలిసిందే. మనమంతా ఒకచోట చేరి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతాం. ఇదీ సాధారణమే. అయితే వనాల్లో తిరిగే మూగజీవాలైన వానరాల (కోతులు) కోసమే కార్తీక వన సమారాధన చేస్తే..? ఈ ఆలోచనే వచ్చింది జంగారెడ్డిగూడేనికి చెందిన ఎ.శ్రీరంగరాజ అనే వ్యక్తికి. వెంటనే ఆ ఆలోచనను ఆచరణలో పెట్టారు. ఈ వానర కార్తీక వన సమారాధన ద్వారకాతిరుమల మండలంలోని జి.కొత్తపల్లిలో కార్తీక మాస చివరిరోజైన శుక్రవారం జరిగింది. వనాల్లోంచి వందలాదిగా రహదారిపైకి వచ్చిన వానరాలకు ఫలాలు, తినుబండారాలను అందించి ఆయన తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మూగజీవాలు బతకాలని.. జంగారెడ్డిగూడెంకు చెందిన వ్యాపారి శ్రీరంగరాజ ఆంజనేయ స్వామి భక్తుడు. వానరాలంటే ఆయనకు ఎంతో ఇష్టం. అడవులు నశించిపోతుండటం వల్ల మూగజీవాలన్నీ రోడ్డున పడుతున్నాయి. సరైన ఆహారం దొరక్క అలమటిస్తున్నాయి. దీన్ని చూసి ఆవేదనకు గురైన శ్రీరంగరాజ ఒక్కరోజైనా వాటికి కడుపునిండా ఆహారాన్ని అందించాలనుకున్నారు. ప్రస్తుతం కార్తీక వన సమారాధనలతో అన్ని కుల, మత వర్గాల వారు హడావుడిగా ఉన్నారు. వీటిని చూసింది తడవు ఆయన ఇలా జి.కొత్తపల్లిలోని అటవీ ప్రాంతం వద్ద వానర కార్తీక వస నమారాధనను జరిపారు. దాతకు జంగారెడ్డిగూడెంకు చెందిన కుక్కునూరి కృష్ణకుమార్, కోడూరి ఆంజనేయశర్మలు సహకరించి, వానరాలకు తినుబండారాలను అందించారు. ఆహారం పెడుతున్నారని తెలిసి.. తినుబండారాలను తీసుకొచ్చిన దాత ముందుగా కారు వద్ద ఆంజనేయుని చిత్రపటానికి పూజలు నిర్వహించారు. తరువాత పండ్లు, తినుబండారాలను వానరాలకు అందించడాన్ని మొదలు పెట్టారు. దీన్ని గ్రహించిన వానరాలు రోడ్డుపైకి పరుగులు తీస్తూ వచ్చాయి. మొదట నాలుగైదు వచ్చినా తరువాత వాటి సంఖ్య వంద వరకు వెళ్లింది. అవన్నీ పండ్లను అందుకున్నాయి. రోడ్డు వెంబడి మూడు నాలుగు ప్రాంతాల్లో ఈ తినుబండారాలను అందించారు. రహదారిపై వెళుతున్న ఆ కారు హారన్ విన్న వానరాలు.. పరుగు పరుగున కారు దగ్గరకు వచ్చి, వారందించిన పదార్థాలను ఒకదాని తరువాత మరొకటి అందుకున్నాయి. వాటిని ఆరగించిన తరువాత అడవిలోకి పరుగులు తీశాయి. ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి చాలా మంది మూగజీవాలను పట్టించుకోరు. మానవ మనుగడకు అవి ఎంతగానో దోహద పడతాయి. ముఖ్యంగా జంతువులకు సేవ చేస్తే నేరుగా ఆ భగవంతుడికి సేవ చేసినట్లే. నానాటికీ అడవులు నశించి పోతున్నాయి. ఉన్న కొద్ది పాటి అటవీ ప్రాంతాలను ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు ఇస్తోంది. దీని వల్ల మూగజీవాల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. అటవీశాఖ అధికారులు దీన్ని గ్రహించాలి. మూగజీవాలకు ఆహారాన్ని అందించేందుకు ఎవరికి వారు ముందుకు రావాలి. అదే నా ఆశయం. – ఎ.శ్రీరంగరాజ, జంగారెడ్డిగూడెం, దాత వానరాలకు సేవ చేయడం ఆనందం మూగజీవాలైన వానరాలకు ఇలా ఆహార పదార్థాలు అందించడం నాకెంతో ఆనందంగా ఉంది. కార్తీక మాసంలో ఇలా వీటికి సేవ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో ఆకలితో అవి పరుగు పరుగున వచ్చి తినుబండారాలను అందుకున్నాయి. – కుక్కునూరి కృష్ణకుమార్, జంగారెడ్డిగూడెం నరుడా నీ ఉనికి తెలుసుకో మనం వానర జాతి నుంచి ఉద్భవించి, నరుడిగా జ్ఞానోదయం పొంది, సమాజంలో జీవిస్తున్నాం. కానీ చాలా మంది వానరాలపై ప్రేమ చూపకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. వానరులు వనాధిపతులు. అవి తల్లిదండ్రులతో సమానం. వాటిని మనం రక్షించుకోవాలి. వాటికి ఆహారాన్ని అందించే మంచి కార్యక్రమాన్ని తలపెట్టాం. ప్రతి ఒక్కరూ మూగజీవాలపై ప్రేమ చూపి, వాటికి ఆహారాన్ని అందించాలి. – కోడూరి ఆంజనేయ శర్మ, జంగారెడ్డిగూడెం -
శ్రీగిరి.. భక్తుల సందడి
శ్రీశైలం: కార్తీ్తకమాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని ఆదివారం నుంచి శ్రీశైలంలో భక్తుల సందడి కనిపించింది. ఆంధ్రా, తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో క్షేత్ర పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఆదివారం ఉదయానికి భక్తుల సంఖ్య లక్షకు పైగా చేరుకోవడంతో ఉచిత, ప్రత్యేక, దర్శన క్యూలలో విపరీతమైన రద్దీ కనిపించింది. దీంతో ఈఓ భరత్గుప్త ఆలయపూజావేళల్లో మార్పులు చేశారు. వేకువజామున 2.30గంటలకు మంగళవాయిద్యాలు, 3గంటలకు సుప్రభాతం, 4గంటలకు మహామంగళహారతి, 4.30గంటల నుంచి దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేశారు. అభిషేక సేవాకర్తలను మాత్రం నిర్ణీత సమయంలో గర్భాలయంలోకి అనుమతించారు. మల్లన్నను అభిషేకించుకొని స్పర్శ దర్శనం చేసుకోవడానికి వందల సంఖ్యలో భక్తులు ఆన్లైన్, కరెంట్ , ముందస్తు టిక్కెట్లను కొనుగోలు చేయడంతో 900కు పైగా అభిషేకాలు జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి. నేడు పుష్కరిణి హారతి, లక్షదీపోత్సవం కార్తీక మాసంలో వచ్చే నాలుగు సోమవారాలు పుష్కరిణి హారతితో పాటు లక్ష దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటుకు ఈఓ భరత్ గుప్తా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం 6.30గంటల నుంచి స్వామిఅమ్మవార్లకు పుష్కరిణి హారతులు నిర్వహిస్తారు. ముందుగా స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి ప్రత్యేక వేదికపై వేంచేయింపజేసి విశేషపూజలు నిర్వహిస్తారు. అలాగే లోక కల్యాణార్థం పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం ఏర్పాటు చేశారు. ఉత్సవంలో భక్తులందరూ పాల్గొనే అకాశం కల్పించారు. ∙మల్లన్న దర్శనం కోసం నిరీక్షణ .. శ్రీ భ్రమరాంబామల్లికార్జున స్వామివార్లను ఉచిత దర్శన క్యూల ద్వారా దర్శించుకోవడానికి సుమారు 4 గంటల సమయం పట్టగా ప్రత్యేక దర్శనానికి 2 గంటలకు పైగా నిరీక్షించాల్సి వచ్చింది. గంటల తరబడి నిరీక్షించే భక్తులకు క్యూలోనే ప్రసాద వితరణ చేశారు. మంచినీరు, పిల్లలు, వృద్ధులకు బిస్కెట్లు, సాంబారన్నం అందించారు. దర్శనానంతరం అన్నపూర్ణభవన్లో భోజన ప్రసాదం వడ్డించారు. -
హరిహర ప్రియం కార్తీకం
హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి గొప్ప ఆధ్యాత్మిక ప్రశస్తి ఉంది. హిందూ పంచాంగం ప్రకారం ఎనిమిదో నెల అయిన కార్తీకం శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన మాసం. ఈ నెల పొడవునా శివాలయాలు, వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. ఇక పవిత్ర క్షేత్రాల్లోనైతే భక్తుల రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. మన తెలుగువాళ్లతో పాటు దేశంలో చాంద్రమానం పాటించే వాళ్లందరికీ దీపావళి అమావాస్య మరుసటి రోజు నుంచి కార్తీకం మొదలవుతుంది. సౌరమానం పాటించే తమిళులకు సూర్యుడు వృశ్చికరాశిలో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రారంభమవుతుంది. బెంగాలీలకు, ఒరియా వాళ్లకు ఆశ్వీయుజ పున్నమి మర్నాటి నుంచే కార్తీకం మొదలవుతుంది. కార్తీక మాసంలో చాలా పర్వదినాలు ఉన్నాయి. కార్తీకమాసం తొలిరోజున బలిపాడ్యమి, గోవర్ధన పూజ, రెండో రోజున భాయీదూజ్ (భగినీహస్త భోజనం), శుద్ధ చవితి రోజున నాగుల చవితి, శుక్లపక్షంలో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి, ఆ మర్నాడు వచ్చే క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పున్నమి ఈ నెలలో వచ్చే ప్రధాన పర్వదినాలు. కార్తీక పున్నమి హిందువులకు మాత్రమే కాదు, సిక్కులకు, జైనులకు కూడా ఇది అత్యంత పవిత్రమైన రోజు. దేవతల దీపావళి దీపావళి అమావాస్యకు పదిహేను రోజుల తర్వాత వచ్చే కార్తీక పున్నమిని ‘దేవ దీపావళి’గా అభివర్ణిస్తారు. నరక చతుర్దశి మర్నాడు వచ్చేది మానవుల దీపావళి అయితే, కార్తీక పున్నమి దేవతల దీపావళి అన్నమాట. కార్తీక పున్నమి వేడుకలు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నుంచే మొదలవుతాయి. కార్తీక శుద్ధ ఏకాదశిని ‘ప్రబోధ ఏకాదశి’ అని, ‘ప్రబోధిని ఏకాదశి’ అని అంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి నాటితో చాతుర్మాస్య వ్రతం పూర్తవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి జారుకున్న శ్రీమహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. కార్తీక పున్నమి నాటి దేవ దీపావళి వేడుకలకు ఏకాదశి రోజు నుంచే సన్నాహాలు మొదలవుతాయి. రాజస్తాన్లోని బ్రహ్మదేవుడి ఆలయం ఉన్న పుష్కర క్షేత్రంలో బ్రహ్మదేవుడి ప్రీత్యర్థం జరిగే పుష్కర మేళా ఏటా కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక పున్నమి వరకు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఐదురోజులూ భక్తులు పుష్కర తీర్థంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తారు. పుష్కర మేళాలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే సాధువులు ఇక్కడకు సమీపంలోని గుహలలో తలదాచుకుంటారు. దాదాపు రెండులక్షలకు పైగా భక్త జనవాహినితో పాటు పాతికవేలకు పైగా ఒంటెలతో పుష్కరమేళాలో జరిగే ఊరేగింపు చూసి తీరాల్సిందే. ఇది ఆసియాలోనే అతిపెద్ద ఒంటెల ఊరేగింపుగా గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే, శైవక్షేత్రాలలో తలమానికమైన వారణాసిలో దేవదీపావళి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. గంగానది ఒడ్డున అన్ని ఘాట్లూ లెక్కలేనన్ని దీపాలతో మిరుమిట్లుగొలుపుతూ కనువిందు చేస్తాయి. కాశీక్షేత్రంలో గంగా మహోత్సవం ఏకాదశి నుంచి పున్నమి వరకు వైభవోపేతంగా జరుగుతుంది. పరమశివుడు కార్తీక పున్నమి రోజున త్రిపురాసురుడిని సంహరించాడు. ముల్లోకాలనూ ముప్పుతిప్పలు పెడుతూ పీడించిన త్రిపురాసురుడి పీడ విరగడ కావడంతో దేవతలు ఆ రోజున దీపావళి పండుగ చేసుకున్నారని ప్రతీతి. అందుకే ఈ పున్నమిని ‘త్రిపురారి పౌర్ణమి’ అని కూడా అంటారు. కార్తీక పున్నమి నాడు చిన్నా పెద్దా దేవాలయాలన్నీ అసంఖ్యాకమైన దీపాల వెలుగులతో ధగధగలాడుతూ కనువిందు చేస్తాయి. నిత్యదీపారాధన చేయని వారు కార్తీక పున్నమి నాడు 365 వత్తులను ఒక్కటిగా చేసి, ఆవునేతితో తడిపి మట్టి ప్రమిద లేదా కొబ్బరి చిప్పలో దీపం వెలిగిస్తే ఏడాది పొడవునా దీపారాధన చేసిన ఫలం దక్కుతుందని ప్రతీతి. కార్తీక పున్నమి ఉదయం విష్ణుపూజకు, రాత్రి శివపూజకు అనుకూలమైనవి. శివకేశవుల అనుగ్రహం కోరేవారు ఆ రోజు ఉదయం వైష్ణవాలయాల్లో అర్చనలు జరిపిస్తారు. రాత్రివేళ శివాలయాల్లో అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో అరటిదొప్పల్లో దీపాలను వెలిగించి, వాటిని నీటిలో వదులుతారు. దీపదానాలు చేస్తారు. ఉసిరికాయల మీద దీపాలు వెలిగించే ఆచారాన్ని కూడా కొన్ని చోట్ల పాటిస్తారు. చాలామంది కార్తీక పున్నమిరోజున క్షేత్రదర్శనం చేసుకునేందుకు ఆసక్తి చూపుతారు. క్షేత్రదర్శనానికి వీలు లేకున్నా, మంత్రోపదేశం పొందిన వారు కార్తీక పున్నమి వేళ నిష్ఠగా మంత్రజపం సాగించినట్లయితే విశేష ఫలం దక్కుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఏకకాలంలో శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి కార్తీక పున్నమిని మించిన రోజు మరేదీ లేదు. చాలా ప్రాంతాల్లో కార్తీక పున్నమి రోజున తులసి చెట్టును శ్రీమహాలక్ష్మిగా, ఉసిరికొమ్మను శ్రీమహావిష్ణువుగా భావించి, భక్తిశ్రద్ధలతో వాటికి కల్యాణం జరిపించే సంప్రదాయం కూడా ఉంది. జ్వాలాతోరణంతో పాప విమోచనం కార్తీక పున్నమినాడు కొన్ని చోట్ల శివాలయాల్లో జ్వాలా తోరణాన్ని నిర్వహిస్తారు. దీపకాంతులతో ధగధగలాడే జ్వాలాతోరణం కింది నుంచి భక్తులు ఉత్సాహంగా పరుగు పెడతారు. ఇలా చేయడం వల్ల సకల పాపాలూ నశిస్తాయని విశ్వసిస్తారు. శివాలయాల్లో జ్వాలా తోరణం నిర్వహించడానికి పౌరాణిక నేపథ్యం ఉంది. క్షీరసాగర మథనంలో మొదటగా హాలాహలం వెలువడుతుంది. లోకాలన్నింటినీ కబళించేలా హాలాహలం దూసుకుపోతుండటంతో పరమశివుడు దానిని ఉండగా చేసుకుని మింగబోతాడు. పూర్తిగా మింగేస్తే తన ఉదరంలో పదిలంగా ఉన్న లోకాలన్నీ నశించే ప్రమాదం ఉన్నందున శివుడు దానిని తన కంఠంలోనే బంధించి ఉంచుతాడు. పరమశివుడు హాలాహలాన్ని మింగడంతో పార్వతీదేవి ఆందోళన చెందుతుంది. హాలాహల జ్వాలలు తన భర్తకు హాని కలిగించరాదంటూ అగ్నిదేవుడిని ప్రార్థించింది. ఆమె ప్రార్థనతో అగ్నిదేవుడు చల్లబడ్డాడు. అందుకు ప్రతీకగా పార్వతీదేవి అగ్నిస్వభావం గల కృత్తికా నక్షత్రానికి సంకేతమైన కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం ఏర్పాటు చేసి, తన భర్తతో కలసి దాటింది. ఆ మంటల వేడి నుంచి ఉపశమనం కలిగించడానికే శివుడికి నీటితోను, పంచామృతాలతోను అభిషేకం చేస్తారు. జ్వాలా తోరణానికి సంబంధించి మరో ఐతిహ్యం కూడా ఉంది. శివుడి రేతస్సును అగ్నిదేవుడు భరించలేక గంగానదిలో పడవేస్తాడు. గంగ కూడా దానిని భరించలేక ఒడ్డునే ఉన్న రెల్లుగడ్డిలో వదిలింది. ఆ తేజస్సు నుంచే జన్మించిన కుమారస్వామి శరవణభవుడిగా ప్రసిద్ధి పొందాడు. శివుడి కుమారుడి చేతిలో తప్ప ఇతరుల చేత మరణం సంభవించకుండా వరం పొందిన తారకాసురుడు రెల్లుగడ్డిని తగలబెట్టించాడు. కారణజన్ముడైన కుమారస్వామికి అగ్నిదేవుడు ఎలాంటి హాని చేయకుండా సురక్షితంగా కాపాడాడు. దానికి గుర్తుగా కుమారస్వామి జన్మనక్షత్రమైన కృత్తికా నక్షత్రం రోజున వచ్చే కార్తీక పున్నమి నాడు జ్వాలాతోరణం నిర్వహిస్తారు. జ్వాలాతోరణం కింద నుంచి మూడుసార్లు వెళితే సమస్తపాపాలు, అపమృత్యు గండాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. గౌరీశంకరుల పల్లకిని జ్వాలాతోరణం కింది నుంచి మూడుసార్లు తీసుకువెళతారు. ఆ తర్వాత తోరణానికి మిగిలిన ఎండుగడ్డిని, సగం కాలిన గడ్డిని రైతులు గడ్డివాముల్లో కలుపుతారు. ఆ వాముల్లోని గడ్డిని మేస్తే పశువుల సంతతి అభివృద్ధి చెందుతుందని, రైతులకు ధాన్యానికి లోటు ఉండదని నమ్ముతారు. ఉపవాస దీక్షలు పవిత్ర కార్తీకమాసంలో చాలామంది భక్తులు ఉపవాస దీక్షలను ఆచరిస్తారు. ఈ మాసంలో వచ్చే సోమవారాల్లోను, ఏకాదశి, పున్నమి రోజుల్లో ఉపవాసాలు ఉండి దేవాలయ సందర్శనలు, అర్చనలతో శివకేశవులను ఆరాధిస్తారు. ముఖ్యంగా చంద్రుడికి చెందిన సోమవారం శివునికి ప్రీతిపాత్రమైన వారం. కొందరు పూర్తిగా నిరాహారంగా ఉపవాసం ఆచరిస్తారు. ఇంకొందరు రోజులో ఒక్కసారే ఫలహారం స్వీకరించి ఏకభుక్తం చేస్తారు. మరికొందరు వండని పదార్థాలు... అంటే, పండ్లు, కాయలు తింటూ నక్తం చేస్తుంటారు. కొందరు కార్తీకంలో నెలపొడవునా నక్తవ్రతాన్ని ఆచరిస్తారు. మిగిలిన రోజుల్లో చేసే ఉపవాసం ఒక ఎత్తయితే, కార్తీక పున్నమి రోజున చేసే ఉపవాసం మరో ఎత్తు. కార్తీక పున్నమినాటి ఉపవాసం విశిష్ట ఫలదాయకమని పురాణాలు చెబుతున్నాయి. దారిద్య్రబాధల విముక్తి కోసం కార్తీకంలో శ్రీమహాలక్ష్మిని పూజించడం వల్ల సత్ఫలితాలు సిద్ధిస్తాయని ప్రతీతి. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన శ్రావణమాసం అంటే శివునికి ఎంత ఇష్టమో, శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసం అంటే లక్ష్మీదేవికి కూడా అంతే ఇష్టం. అందువల్ల శ్రావణంలో శివుడికి, కార్తీకంలో లక్ష్మీదేవికి కూడా అర్చనలు జరుపుతారు. కార్తీక పున్నమి రోజున ఆవుపాలతో వండిన పాయసాన్ని శివకేశవులకు, లక్ష్మీదేవికి నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించేవారికి, మారేడు ఫలాన్ని సేవించేవారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి. నానక్ జయంతి సిక్కుమత వ్యవస్థాపకుడు గురునానక్ జన్మించినది కార్తీక పున్నమి రోజునే కావడంతో ఈ రోజును సిక్కులు అత్యంత పవిత్ర దినంగా భావిస్తారు. నానక్ మార్గాన్ని అనుసరించే ‘నానక్పంథీ’ హిందువులు కూడా నానక్ జయంతి రోజున గురుద్వారాలను దర్శించుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నానక్ జయంతిని సిక్కులు ‘గురుపరబ్’ అని, ‘ప్రకాశ్పర్వ’ అని కూడా అంటారు. జైనులకూ పవిత్రదినం కార్తీక పున్నమి జైనులకు కూడా అత్యంత పవిత్రమైన రోజు. హిందువుల మాదిరిగానే జైనులు కూడా వర్ష రుతువులో చాతుర్మాసం పాటిస్తారు. చాతుర్మాసం ముగిసిన తర్వాత కార్తీక పున్నమి రోజున గుజరాత్లోని శత్రుంజయ పర్వతంపై వెలసిన జైనక్షేత్రం ఆదినాథ ఆలయంలో ప్రార్థనలు జరుపుతారు. ఇక్కడకు చేరుకోవడానికి దుర్గమ పర్వతమార్గంలో సుమారు రెండువందల కిలోమీటర్ల దూరం యాత్ర సాగిస్తారు. ఈ యాత్రనే శ్రీ శత్రుంజయ తీర్థయాత్ర అంటారు. జైనుల తొలి తీర్థంకరుడైన ఆదినాథుడు ఇక్కడి నుంచే తొలి ప్రబోధం చేసినందున లక్షలాది మంది జైన సన్యాసులు కార్తీక పున్నమి రోజున ఇక్కడకు చేరుకుని, ప్రార్థనలు చేస్తారు. కార్తీకంలో పాటించాల్సిన ఆచారాలు కార్తీకంలో నెలపొడవునా దీపారాధన చేయడం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. నెలపొడవునా కుదరకుంటే కనీసం శుక్లపక్షంలోని తొలి ఐదురోజులు, కృష్ణపక్షంలోని తొలి ఐదురోజులు... మొత్తం పది రోజులైనా ఈ నెలలో దీపారాధన చేయాలని, దీని వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని శాస్త్ర వచనం. కార్తీకంలో నదీస్నానం, దీపదానం కూడా విశేష ఫలాన్ని ఇస్తాయి. కార్తీక సోమవారాల్లో ఉపవాస వ్రతం ఆచరించేవారు ఈ నెల పొడవునా శుద్ధ సాత్విక శాకాహారం మాత్రమే స్వీకరించాలి. ఉపవాస వ్రతం పాటించేవారికి ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి తామసిక పదార్థాలు పూర్తిగా నిషిద్ధం అని పెద్దలు చెబుతారు. ఉపవాస వ్రతం ఆచరించేవారు కార్తీకమాసంలో నెలపొడవునా నిత్య పూజలతో పాటు శివపురాణం, కార్తీక పురాణాల పారాయణ చేయడం వల్ల విశేష ఫలితం ఉంటుందని అంటారు. దాన ధర్మాలు చేయడానికి, వ్రతాలు, హోమాలు చేయడానికి కూడా కార్తీక మాసం చాలా అనుకూలమైన మాసం. కార్తీక సోమవారాల్లో గాని, ఏకాదశి, పున్నమి రోజుల్లో›గాని రుద్రాభిషేకం, మహా మృత్యుంజయ హోమం చేయడం వల్ల అపమృత్యు భయం, వ్యాధిపీడ తొలగి, మనస్థైర్యం చేకూరుతుంది. కార్తీక ఏకాదశి శ్రీ సత్యనారాయణ వ్రతం ఆచరించడానికి అద్భుతమైన రోజు. కార్తీక మాసంలో పురోహితులకు దీపదానం చేయడంతో పాటు యథాశక్తి గోదానం, భూదానం, హిరణ్యదానం వంటివి కూడా చేయవచ్చు. అలాగే ఈ నెలలో గోసేవ, అనాథ సేవ వంటి కార్యక్రమాలు చేపట్టడం, అన్న సమారాధన చేయడం విశేష ఫలదాయకమని పురాణాలు చెబుతాయి. వనభోజనాల సందడి కార్తీకమాసంలో వనభోజనాలు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఎందరో దేవతలు వనాలలో, కొండ కోనల్లో వెలశారు. సుప్రసిద్ధ శైవ వైష్ణవ క్షేత్రాలు చాలా వరకు ఇలా కొండ కోనల్లో, దుర్గమారణ్యాలలో వెలసినవే. అందువల్ల వనభోజనాలు చేయడం దేవతా ప్రీతికరమని ప్రతీతి. మానవాళి మనుగడకు పత్రహరితమే కీలకమని చెప్పడంతో పాటు ‘వృక్షో రక్షతి రక్షితః’ అని పిలుపునివ్వడం కార్తీక వనభోజనాల ఆంతర్యం. విష్ణువుకు ప్రతీక అయిన ఉసిరిచెట్టు కింద పనస ఆకుల విస్తర్లలో భోజనాలు చేయడం కార్తీక వనభోజనాల సంప్రదాయం. ఏడాదిలో మరే నెలలోనూ లేనట్లుగా కార్తీకంలోనే ఎందుకు వనభోజనాలు చేస్తారనేదానికి పెద్దలు చెప్పే ముఖ్యవిశేషం ఏమిటంటే, శ్రావణ భాద్రపదాలలో వర్షాలు విస్తారంగా కురుస్తాయి. శరదృతువులో వచ్చే ఆశ్వీయుజ, కార్తీకాలలో భూమి నుంచి కొత్త మొక్కలు మొలకెత్తుతాయి. వనభోజనాల సమయంలో ఆయుర్వేద మూలికా వైద్యం తెలిసిన అనుభవజ్ఞులు ఈ మొక్కల విశేషాన్ని, వాటితో ఔషధులు తయారు చేసే విధానాన్ని, వాటి ఉపయోగాన్ని విశదీకరించేవారు. ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడం వల్ల చదువు సంధ్యలు లేని పామరులు సైతం వైద్య మర్మాలను గ్రహించగలిగేవారు. మొక్కల వల్ల ఒనగూడే ప్రయోజనాన్ని తెలుసుకోవడం వల్ల వాటి పట్ల గౌరవంగా మసలుకొనేవారు. ప్రకృతిని, వృక్షాలను ప్రేమించే లక్షణాన్ని పెంపొందించే ఉద్దేశంతో చేపట్టే కార్తీక వనభోజనాలు మనుషుల మధ్య సామరస్యానికి కూడా దోహదపడతాయి. -
తెలుగు రాష్ట్రాల్లో కార్తీకమాసం తొలి సోమవారం, నాగులచవితి పూజలు
-
శ్రీశైలంలో కాసుల వర్షం!
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీకమాసం, ఆదివారం కావడంతో పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోవడంతో క్యూ లైన్ల వెలుపల భక్తులు నిరీక్షిస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 16గంటలు, నడక దారి భక్తులకు 6 గంటల సమయం పడుతుంది. నిన్నటితో పెరటాశి శనివారాలు ముగిసినప్పటికీ శ్రీవారి దర్శనానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలి బాట మార్గాలు నడిచివచ్చే భక్తులతో కిక్కిరిసిపోయాయి. కిటకిటలాడుతున్న శ్రీశైలం.. శ్రీశైలం మల్లన్న క్షేత్రం భక్తజనంతో కిటకిటలాడుతోంది. శనివారం సాయంత్రానికి విపరీతంగా పెరిగిన రద్దీ ఆదివారం కూడా కొనసాగుతోంది. నేడు ఆదివారం, రేపు మొదటి కార్తీక సోమవారం కావడంతో రద్దీ మరింత పెరిగే అవకాశముంది. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ పూజావేళల్లో మార్పులు చేశారు శ్రీశైలం మల్లన్నకు కాసుల వర్షం కురిసింది. ఒక్కరోజే హండీ ఆదాయం కోటిన్నర దాటింది. శనివారం ఒక్కరోజే భ్రమరాంబామల్లిఖార్జున స్వామివారికి కోటీ 62 లక్షల 78 వేల 88 రూపాయల హుండీ ఆదాయం వచ్చిందని ఈవో నారాయణభరత్ గుప్తా వెల్లడించారు. సాగర్కు పర్యాటకశోభ..! నాగార్జున సాగర్ను సందర్శించే టూరిస్టుల కోసం మరో పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. గతవారం శ్రీశైలం దగ్గర అక్టోపస్ వ్యూ పాయింట్ను ప్రారంభించిన తెలంగాణ అటవీ శాఖ ఈసారి సాగర్ సమీపంలో వాచ్ టవర్ను అందుబాటులోకి తెచ్చింది. ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా అటవీశాఖ వాచ్ టవర్ను నిర్మించింది. హైదరాబాద్ - నాగార్జున సాగర్ రోడ్డులోని నెల్లికల్ ఫారెస్ట్ బ్లాక్ ప్రాంతంలో ఈ వాచ్ టవర్ ను ఏర్పాటు చేశారు. సముద్ర మట్టానికి 1050 అడుగుల ఎత్తులో ఉండే ఈ వాచ్ టవర్ నుంచి అటవీ అందాలతో పాటు కృష్ణా నదీ అందాలను, నాగార్జున సాగర్ డ్యామ్ బ్యాక్ వాటర్ను కూడా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. -
ప్రారంభమైన కార్తీకమాసం.. పంచారామాల్లో సందడి
సాక్షి, అమరావతి: కార్తీక మాసం శుక్రవారం నుంచి ప్రారంభం కావడంతో శైవ క్షేత్రాలలో భక్తుల సందడి మొదలైంది. ప్రధాన శైవ క్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, మహానందితోపాటు పంచారామాలలోనూ భక్తుల రద్దీ నెలకొంది. పంచారామాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలకు భక్తుల పోటెత్తారు. తెల్లవారుజామునుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న మల్లికార్జునస్వామిని కూడా దర్శించుకుంటున్నారు. ముందుగా కృష్ణానదిలో స్నానాలాచరించి దీపారాధనలు చేసుకుని స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. తెలంగాణలోని కాళేశ్వరం, వేములవాడల్లోకూడా భక్తుల రద్దీ నెలకొంది. భద్రాచలంలోనూ భక్తులు ఎక్కువ సంఖ్యలో సీతారామలక్ష్మణులను దర్శించుకున్నారు. పవిత్ర గోదావరిలో స్నానాలాచరించి దీపారాధనలు, దీపదానాలు చేశారు. -
కార్తిక మాసోత్సవాలకు రత్నగిరి సన్నద్ధం
అన్నవరం (ప్రత్తిపాడు): ఈ నెల 20వ తేదీ నుంచి నవంబర్ 18 వరకూ కొనసాగనున్న కార్తి్తకమాసంలో సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని దేవస్థానం, ప్రభుత్వశాఖల సమన్వయకమిటీ సమావేశంలో తీర్మానించారు. శుక్రవారం దేవస్థానంలోని ఈఓ చాంబర్లో జరిగిన ఈ సమావేశానికి పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు అ«ధ్యక్షత వహించారు. దేవస్థానం ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు మాట్లాడుతూ దేవస్థానంలో చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. సమావేశంలో శంఖవరం ఎంపీడీఓ శ్రీను, పంపా రిజర్వాయర్ ఏఈ వీరబాబు, తుని ఫైర్ సర్వీస్ అధికారి కేవీ రమణ, దేవస్థానం వైద్యాదికారి డాక్టర్ పాండురంగారావు, గ్రామపంచాయతీ కార్యదర్శి రామశ్రీనివాసరావు, ఆర్టీసీ, వైద్య ఆరోగ్యశాఖ, రెవిన్యూ, పోలీస్, తదితర విభాగాల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. సమన్వయకమిటీ సమావేశం నిర్ణయాలు ముఖ్యమైన పర్వదినాలు: ఈ నెల 23, 30, నవంబర్ ఆరోతేదీ, నవంబర్ 13వ తేదీ కార్తి్తకమాస సోమవారాలు. 21, 28 నవంభర్ నాలుగో తేదీ 11, 18 తేదీలు శనివారాలు, 22,29, నవంభర్ 5, 12 వ తేదీలు ఆదివారాలు. 31 వ తేదీ, నవంబర్ 14 వ తేదీ కార్తిక శుద్ధ, బహుళ ఏకాదశి పర్వదినాలు వచ్చినందున ఆ రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆ రోజుల్లో తెల్లవారుజామున రెండు గంటలకే ఆలయం తెరిచి భక్తులకు సర్వదర్శనాలు కల్పిస్తారు. ఆ రోజుల్లో పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. భక్తులకు ఉదయం ఏడు గంటల నుంచి పులిహోర పంపిణీ చేయాలని నిర్ణయించారు. నవంబర్ 1న తెప్పోత్సవం: క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్బంగా నవంబర్ ఒకటో తేదీ సాయంత్రం 6–30 గంటల నుంచి 8–30 గంటల వరకూ సత్యదేవుని తెప్పోత్సవానికి పంపా నదిలో తగినంత నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలి. బాణసంచా కాల్చేటపుడు ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా తుని ఫైర్ సిబ్బంది చర్యలు తీసుకోవాలి. పోలీసు బందోబస్తు నిర్వహించాలి. నాలుగో తేదీన గిరిప్రదక్షిణ : నవంబర్ నాలుగో తేదీన కార్తీకపౌర్ణమి సందర్భంగా స్వామివారి గిరిప్రదక్షిణ ఉదయం ఎనిమిది గంటల నుంచి నిర్వహించాలని నిర్ణయించారు. మూడో తేదీ మధ్యాహ్నం నుంచి వచ్చినందున ఆరోజు రాత్రి జ్వాలాతోరణం, పంపా నదీ హారతులు నిర్వహిస్తారు. సహస్ర దీపాలంకరణ సేవ ప్రారంభం: దేవస్థానంలో సహస్రదీపాలంకార సేవను కార్తీకమాసంలోనే ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన షెడ్డు నిర్మాణం, ఇతర వస్తుసామగ్రిని కార్తీక పౌర్ణమి నాటికి సమకూర్చుకోవాలని నిర్ణయించినట్లు ఇన్చార్జి ఈఓ జగన్నాథరావు సాక్షి కి తెలిపారు. కార్తీకమాసంలోని పర్వదినాల్లో తెల్లవారుజాము నుంచి వ్రతాలు ప్రారంభిస్తారు. భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నపుడు అంతరాలయ దర్శనం రద్దు చేసి ప్రత్యేక దర్శనం టిక్కెట్ భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ అమలు చేస్తారు. కార్తీకమాసం నెల రోజులు రత్నగిరికి ఆర్టీసీ ప్రత్యేక బస్లు నడపాలని, వైద్య నిర్వహించాలని నిర్ణయించారు. -
శ్రీశైలంలో కోటి దీపోత్సవం
-
గోదావరి నదిలో నలుగురు గల్లంతు..
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వేలేరుపాడు మండలం కోయిదా గ్రామం వద్ద గోదావరిలో స్నానానికి దిగిన నలుగురు మృతిచెందారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రానికి చెందిన 22 మంది రెండు ఆటోల్లో పిక్నిక్కు కోయిదా వచ్చారు. నదిలో స్నానాలు చేస్తున్న క్రమంలో నలుగురు నీట మునిగి మృతిచెందారు. మృతుల్లో ఎస్కే అరిఫా(45), మెహబూబీ(12), హసీమా(11) అనే ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మద్ది కొండమ్మ(36) అనే మహిళ మృతదేహాం కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో అశ్వారావుపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
వన భో‘జనం’
-
తిరుపతమ్మ మహత్యం నాటక ప్రదర్శన
తెనాలి: కార్తీక మాసం సందర్భంగా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మూడురోజుల భక్తిరస పౌరాణిక నాటకోత్సవాలు శుక్రవారం సాయంత్రం ఇక్కడి మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. పట్టణానికి చెందిన శ్రీవిజయలక్ష్మీ శ్రీనివాస నాట్యమండలి ఆధ్వర్యంలో తొలిరోజున శ్రీతిరుపతమ్మ మహాత్మ్యం నాటకాన్ని ప్రదర్శించారు. తొలుత స్థానిక సాహితీ సాంస్కృతిక సంస్థ ప్రజ్వలిత వ్యవస్థాపకుడు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో ప్రముఖ హార్మోనిస్టు, నాటక సమాజం ఆర్గనైజరు దీపాల సుబ్రహ్మణ్యం, జి.బుల్లెబ్బాయి, ఆర్సీ శేఖర్, కొండలరావు, చెన్న సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
ఇంద్రకీలాద్రిపై ఘనంగా దీపోత్సవం
-
బాసరలో భక్తుల రద్దీ
బాసర: బాసర కొలువైన శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. కార్తీక శుక్రవారం కావడంతో.. తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించడానికి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. -
యాదాద్రిలో కార్తీక పూజలు
యాదాద్రి : కార్తీక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని యాదాద్రి జిల్లా శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం(యాదగిరిగుట్ట)కు భక్తులు పోటెత్తారు. సోమవారం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని కార్తీక పూజలు నిర్వహించారు. ముందుగా విష్ణు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు... తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీకమాసం సోమవారంతో ప్రారంభం కావడం విశేషమని ఆలయ అర్చకులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల్లో భక్తులు కార్తీక పూజలు చేశారు. -
శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు
శ్రీశైలం: కార్తీక సోమవారం సందర్భంగా మల్లన్న క్షేత్రం భక్తులతో నిండి పోయింది. పుణ్యస్నానాలు ఆచరించి స్వామి దర్శనం కోసం భక్తులు అర్థరాత్రి నుంచే బారులు తీరారు. వేలాది మందిగా తరలిరావటంతో స్వామి దర్శనానికి ఆరుగంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. రద్దీ కారణంగా అధికారులు అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసి, స్వామి వారి అలంకార దర్శనాన్ని అమలు చేశారు. -
మహానందికి పోటెత్తిన భక్తులు
మహానంది: కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తజనంతో మహానంది క్షేత్రం కిటకిటలాడింది. పవిత్ర కార్తీకమాసంలో దీపం, దానం, స్నానం ఎంతో ప్రధానమైనవి. ఈ మాసంలో వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించి ముక్కంటీని దర్శించుకోవడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వేకువజాము నుంచి దర్శనాలు ప్రారంభం కావడంతో శ్రీకామేశ్వరీదేవీ సహీత మహానందీశ్వరస్వామివార్ల దర్శనార్థం భక్తులు బారులు తీరారు. స్థానిక కోనేరులలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించారు. శ్రీకామేశ్వరీదేవీ సహీత మహానందీశ్వర, వినాయకనంది, గరుడనంది, సూర్యనంది ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహానంది క్షేత్రానికి వచ్చిన భక్తులు వర్షంతో తీవ్ర అవస్థలు పడ్డారు. అధికారులు ఎలాంటి ప్రత్యేక చర్యలు చేపట్టకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
శ్రీశైలంలో కార్తీక శోభ
-
వనాల్లో ఉల్లాస పవనాలు..
జిల్లావ్యాప్తంగా తోటలు, తోపులు, తీరాల్లో తిరణాల వాతావరణం కనిపించింది. హిందువులకు పరమ పావనమైన కార్తికమాసంలో చివరిరోజు, ఆదివారం కలిసి రావడంతో వనసమారాధనలు విరివిగా జరిగాయి. వివిధ సంఘాలు, సామాజికవర్గాలే కాక బంధుమిత్రులతో కూడిన బృందాలు ఇళ్లను, ఊళ్లను వీడి పచ్చని ప్రకృతి ఒడికి, కడలి తీరానికి చేరారు. పగలంతా ఆటపాటలు, విందువినోదాలతో గడిపారు. సమారాధనల సందర్భంగా పెద్దలూ పిన్నలైపోయి కేరింతలు కొట్టారు. రకరకాల ఆటలు ఆడుతూ తుళ్లిపడ్డారు. అంతర్వేది నుంచి మారేడుమిల్లి వరకూ సందడి నెలకొంది. ఆలయాలను, క్షేత్రాలను సందర్శించే వారితో పాటు పాపికొండలకు షికారు వెళ్లిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వివిధ సామాజికవర్గాలు నిర్వహించిన వన సమారాధనలకు ఆయా వర్గాలకు చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. -సాక్షి, రాజమండ్రి ఘనంగా కాపు వన సమారాధన మధురపూడి / రాజమండ్రి రూరల్ :రాజమండ్రి నగర కాపు సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు అధ్యక్షతన కాపుల కార్తిక వనసమారాధన మధురపూడిలోని ఎస్బీ వెంచర్స్లో ఆదివారం ఘనంగా జరిగింది. తొలుత దేవాదాయ మంత్రి పి.మాణిక్యాలరావు, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు రాష్ట్ర కాపు సంఘం అధ్యక్షుడు దివంగత మిరియాల వెంకట్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మిరియాల వెంకట్రావు కోడలు సృజన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంజీవని స్వచ్ఛంద రక్తదాతల సంస్థ, రోటరీ క్లబ్ (కాకినాడ)ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదానశిబిరాన్ని మంత్రి మాణిక్యలరావు ప్రారంభించారు. మంత్రి మాణిక్యాలరావు, సినీ దర్శకుడు మారుతి తదితరులను సత్కరించారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, మేయర్ పంతం రజనీ శేషసాయి, జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు, తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు వంగాగీత, కురసాల కన్నబాబు, రౌతు సూర్యప్రకాశరావు, సీనియర్ న్యాయవాది ఎస్జీ రామారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి యర్రా వేణుగోపాలరాయుడు, సీసీసీ చానల్ ఎండీ పంతం కొండలరావు, జిల్లాకాపు సంఘ అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు, కాపు నాయకులు బస్సా ప్రభాకరరావు, తాడివాక రమేష్నాయుడు, శ్రీనివాసనాయుడు తదితరులు మాట్లాడారు. కార్తిక వనసమారాధన కమిటీ నిర్వాహకులు మారిశెట్టి రామారావు, గన్నాబత్తుల మహేష్లు కాపు, కాపు ఉపకులాలను బీసీల్లో చేర్చాలన్న దానితో పాటు మరో ఐదు ఆకాంక్షలను వ్యక్తం చేస్తూ తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈకార్యక్రమంలో ప్రముఖ కాంట్రాక్టర్ ఆర్.సుబ్బరాజు, బాలత్రిపురసుందరి, జక్కంపూడి చిన్ని, సుంకర శ్రీనివాస్, యెనుముల రంగబాబు, సుంకర చిన్ని, పలువురు కాపు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కోటగుమ్మం (రాజమండ్రి) :సంఘీయులంతా ఐకమత్యంతో మెలగితే అభివృద్ధి సుసాధ్యమని గౌడ, శెట్టిబలిజ, శ్రీశయన, యాత నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక ఎస్.కె.వి.టి. డిగ్రీ కాలేజీలో ఆదివారం గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత కులాల కార్తిక సమారాధన జరిగింది. జిల్లా నుంచే కాక వివిధ జిల్లాల నుంచి ఆ సామాజికవర్గాలకు చెందిన దాదాపు 25 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రి కె.ఇ.కృష్ణమూర్తిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ సంఘీయుల పురోభివృద్ధికి పలు సూచనలు చేశారు. గౌడ సంఘం రాష్ట్ర చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, గౌడ, శెట్టిబలిజ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు కాసాని భుజంగరావు, అధ్యక్షుడు రెడ్డి రాజు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనుసూరి పద్మలత, పాలిక శ్రీను, బుడ్డిగ రవి, హితకారిణి సమాజం చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అంగర ఉమ, గేడి రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సూరంపూడి శ్రీహరి, వెలిగట్ల పాండురంగారావు, వల్లూరి ప్రకాష్, మట్టా శ్రీను తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి వై జంక్షన్లో గౌడ, శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమర యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రాజమండ్రి మేయర్ పంతం రజనీ శేషసాయి, లచ్చన్న కుమారుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామ్సుందర్ శివాజీ, శాసనమండలిలో ప్రభుత్వ విప్ చైతన్యరాజు, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు తదితరులు పాల్గొన్నారు. -
బాసర పుణ్యక్షేత్రంలో కార్తీక మాసం సందడి
ఆదిలాబాద్ : కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గోదావరి తీరంలోని సూర్యేశ్వర ఆలయంలో మహభిషేకం నిర్వహించారు. గోదావరి నదికి భక్తులు కార్తీక దీపారాధన చేస్తున్నారు. -
కొండ పై ఇంకా ఆరని చిచ్చు
-
రంగనాథస్వామి ఆలయంలో అగ్నిప్రమాదం
-
రంగనాథస్వామి ఆలయంలో అగ్నిప్రమాదం
జిల్లాలోని అనందమయం మండలం గుడిలోవ రంగనాథస్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు స్వామివారి ఆలయంలో దీపారాధాన చేశారు. కొండపై నుంచి భక్తులు వెళ్లిపోయాక ఒక్కసారిగా మంటలు అలముకున్నాయి. భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. కొండపై గాలులు భారీగా వీస్తున్నాయి. దాంతో దగ్గర్లోని గ్రామాలకు మంటలు వ్యాపించే ప్రమాదమని నేవీ హెలికాప్టర్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. కాగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్టు సమాచారం. -
వేములవాడలో పోటెత్తిన భక్తులు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అందులోనూ రెండవ కార్తీక సోమవారం కావడంతో అమ్మ శ్రీరాజరాజేశ్వరి అనుగ్రహాన్ని పొందేందుకు భక్తజనం పోటెత్తింది. దర్శనం కోసం వచ్చిన భక్తులందరూ ప్రాత:కాలమే పుష్కరిణిలో పవిత్రస్నానాలు ఆచరించి ధర్మదర్శనం కోసం నిర్దేశించిన క్యూల్లో వేచివున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులంతా శ్రీరాజరాజేశ్వరి నామాన్నిస్మరిస్తూ బారులు తీరారు. దాంతో అమ్మవారి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. -
మన భోజనం
ఆలయాల్లో శివారాధన.. వనంలో సమారాధన.. కార్తీకమాసం స్పెషల్స్. పల్లెల్లో అయితే కార్తీకం వచ్చిందంటే వన భోజనాలతో సామూహిక సందడి మొదలవుతుంది. సిటీవాసులకు తరలిరాని ఆనందాన్ని శిల్పారామం తీసుకొస్తుంది. కార్తీక మాసం సందర్భంగా వన భోజన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నెల 25, 26, నవంబర్ 1, 2, 8, 9, 15, 16 తేదీలలో ఈ వనవిందుకు పసందైన ఏర్పాట్లు చేస్తోంది. వనభోజన వివరాలను, టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు ఆయా తేదీలకు ఒకరోజు ముందుగా సంప్రదించాలని శిల్పారామం జనరల్ మేనేజర్ సాయన్న పేర్కొన్నారు. శిల్పారామం, టూరిజం ప్లాజా, బేగంపేట్లోని గ్రీన్ ల్యాండ్స్, యాత్రినివాస్, సికింద్రాబాద్లోని తెలంగాణ టూరిజం కౌంటర్, ట్యాంక్బండ్ సమీపంలోని ఇన్ఫర్మేషన్ అండ్ రిజర్వేషన్, సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్, బషీర్బాగ్లోని నిజాం షుగర్ బిల్డింగ్ లలో టికెట్ బుకింగ్ సౌకర్యం కల్పించామని తెలిపారు. మరిన్ని వివరాలకు 040-6451864, 8886652030, 8886652004 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. -
కొండంత కేక్
దివాలీ సంబరానికి తెరపడగానే.. సిటీలో కార్తీక శోభ మొదలైంది. కార్తీక మాస తొలి రోజు సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం గోవర్ధనగిరి వేడుకలు జరిగాయి. వందలాది మంది భక్తులు ఉత్సవంలో పాల్గొన్నారు. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఇదే రోజున ఎత్తారని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా గోవర్ధనగిరి ఆకారంలో 333 కిలోల కేక్ను రూపొందించారు. ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. -
ధరల భగ్గు
మంచిర్యాల అర్బన్, న్యూస్లైన్ : కూరగాయల ధరలు మండుతున్నాయి. మార్కెట్కు వెళ్లాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రూ.100 మార్కెట్కు తీసుకెళ్తె చిన్న సంచినిండా కూడా నిండటం లేదు. మరోవైపు చికెన్ ధరలు దిగివచ్చాయి. కాలీఫ్లవర్ కిలో రూ.120 పలుకుతుండగా, కోడి కిలో ధర రూ.70 ఉంది. ఏ కూరగాయల ధరలు చూసినా రూ.70కి తక్కువ లేవు. ఆకు కూరల ధరలు కూడా అందుబాటులో లేవు. కార్తీక మాసం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో కూరగాయల ధరలు పెరిగాయని అమ్మకందారులు తెలుపుతున్నారు. చికెన్ ధరలు ఢమాల్ నాలుగు నెలల క్రితం కిలో చికెన్ ధర రూ.225. అంత డిమాండ్ పలికిన చికెన్ ధర ఒక్కసారిగా పడిపోయింది. ప్రస్తుతం కిలో ధర రూ.100కు పడిపోయింది. మూడు నెలల నుంచి చికెన్ అమ్మకాలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అసలే పౌల్ట్రీ ఫాం నష్టాలతో వ్యాపారులు ఆర్థికంగా అపార నష్టం వాటిల్లింది. మరోవైపు చికెన్ అమ్మకాలు తగ్గిపోవడంతో వ్యాపారులకు కూడా కోలుకోలేని దెబ్బతగిలింది. కార్తీక మాసంను పవిత్రంగా భావించే వారు మాంసం, చికెన్ను తినరు. ఇక వివాహాల సందర్భంగా చికెన్ అమ్మకాలు జరుగుతాయని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. మాంసం, కూరగాయలకు మొగ్గుచూపడంతో చికెన్కు డిమాండ్ తగ్గింది. నవంబర్ మాసం నుంచి మరో రెండు నెలలు ఇదే పరిస్థితి కొనసాగే పరిణామాలు కనిస్తున్నాయి. మొత్తానికి చికెన్ ప్రియులు ధరల తగ్గుదలతో ఆనందిస్తున్నారు. -
కార్తీకమాసంలో పాపికొండల యాత్రకు పెరిగిన రద్దీ
-
‘కార్తీక’ సందడి షురూ..
కీసర, న్యూస్లైన్: కీసరగుట్టలో కార్తీక మాసోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కావడంతో నగరం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం యాగశాల వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ ప్రాంగణంలోని శివలింగాలకు, ఆంజనేయస్వామి దేవాలయ సమీపంలోని శివలింగాలకు పసుపు, కుంకుమ, పూలు, పాలు, నూనెలతో అభిషేకాలు చేశారు. ధ్వజస్తంభం వద్ద ఆకాశదీపోత్సవం నిర్వహించారు. స్వామివారి పల్లకీసేవ, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని వేదపండితులు కన్నుల పండువగా జరిపించారు. మహామండపంలో సామూహిక అభిషేకాలను నిర్వహిం చారు. పూజల అనంతరం భక్తులు గుట్ట దిగువన హుడాపార్కులో కుటుంబసమేతంగా వనభోజనాలు చేసి సాయంత్రం తిరుగు పయనమయ్యారు. పూజా కార్యక్రమాల్లో కేఎల్లార్ ట్రస్టు చైర్మన్ విజయలక్ష్మి, ఆలయ చైర్మన్ టి.నారాయణశర్మ, ఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. దేవస్థానానికి సోమవారం ఒక్కరోజే సుమారు రూ.3 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ వర్గాలు తెలిపాయి. నీటికరువు.. ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన అధికారులు, నిర్వాహకులు తొలిరోజే భక్తులకు మంచినీటిని అందించడంలో విఫలమయ్యారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుళాయిల నుంచి చుక్కనీరు రాకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శివలింగాలకు అభిషేకం చేయడానికి గుట్ట కిందికి వెళ్లి మంచినీటి ప్యాకెట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. భక్తుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవడంతో మధ్యాహ్నానికి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించారు. -
శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: కార్తీక మాసం సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలను దర్శించుకునే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ సి.వినోద్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్లోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి, కాళేశ్వరం ముక్తేశ్వరస్వామి, వరంగల్లోని వే యి స్తంభాల గుడి రుద్రేశ్వరస్వామి, పాలకుర్తి సోమనాథ ఆలయాలకు ప్రత్యేక బస్సులు నడుపుతారు. కార్తీక మాసంలోని ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సూపర్ లగ్జరీ బస్సులు హైదరాబాద్ నుం చి బయలుదేరి సోమవారం రాత్రికి తిరిగి హైదరాబా ద్ చేరుకుంటాయి. టిక్కెట్ ధర రూ.900. పంచారామాల దర్శనం..: గుంటూరు జిల్లా అమరావతి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, పాల కొల్లు, తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామం, సామర్లకోటకు వెళ్లేందుకు కార్తీక మాసంలోని ప్రతి ఆదివారం, ఆ నెలలోని పౌర్ణమికి ఒక రోజు ముందు సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. దర్శనం అనంతరం మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటాయి. టిక్కెట్ ధర రూ.1500. ప్రయాణికులు తమ సీట్లను మహాత్మాగాంధీ బస్స్టేషన్, జూబ్లీ బస్స్టేషన్, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్, హైదరాబాద్లోని అన్ని అధీకృత టికెట్ బుకింగ్ కేంద్రాలలో రిజర్వ్ చేసుకోవచ్చు.