kasu mahesh reddy
-
YSRCP కార్పొరేటర్లను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు
-
పోలీసుల దన్నుతో ‘టీడీపీ’ అరాచకాలు: కాసు మహేష్రెడ్డి
సాక్షి, పల్నాడు జిల్లా: పిడుగురాళ్ల మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పోలీసుల దన్నుతో అరాచకాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. నరసరావుపేట శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడం, బెదిరించడం ద్వారా ఈనెల 17న జరగబోయే ఉప ఎన్నికను అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలను కాపాడాల్సిన పోలీసులే ఈ దౌర్జన్యకాండకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...పిడుగురాళ్ళ మున్సిపాలిటీకి నాలుగేళ్ళ కిందట జరిగిన ఎన్నికల్లో ఉన్న మొత్తం 33 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. వైఎస్ జగన్ చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని చూసి ప్రజలు ఏకగ్రీవంగా గెలుపును అందించారు. మున్సిపల్ చైర్మన్ గా వైశ్య సామాజికవర్గానికి చెందిన సుబ్బారావు, వైస్ చైర్మన్గా దళిత సామాజిక వర్గానికి చెందిన ముక్కంటి, మైనార్టీల నుంచి జిలానీకి వైస్ చైర్మన్ పదవులను ఇచ్చాం.గత ఏడాది జనరల్ ఎలక్షన్స్ తరువాత వైస్ చైర్మన్ ముక్కంటి చనిపోవడంతో దానికి గానూ ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతోంది. మొత్తం 33 మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలకు గానూ అన్నింటినీ వైఎస్సార్సీపీ గెలుచుకోగా, తాజాగా ఒకరు మాత్రం పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. ప్రస్తుతం 32 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి ఉన్నారు. సంఖ్యబలం చాలా స్పష్టంగా ఉండటంతో ఏకపక్షంగా ఉప ఎన్నికను తెలుగుదేశం కుట్రపూరితంగా అడ్డుకుంటోంది.గతంలో వైస్ చైర్మన్ ఎన్నికను అధికారులను బెదిరించి వాయిదా వేయించారు. బీఫారం సకాలంలో ఇవ్వకపోవడం వల్ల వాయిదా వేస్తున్నామంటూ అధికారులు కుంటిసాకులు చెప్పారు. మరుసటి రోజు వాయిదా వేయడంతో వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వెడుతున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పోలీసుల సహకారంతోనే కిడ్నాప్ చేసేందుకు తెగబడ్డారు. అన్యాయాలను అడ్డుకోవాల్సిన పోలీసులే అన్యాయంగా వ్యవహరించే పరిస్థితి కనిపించింది. ఆరోజు జరిగిన దారుణాన్ని అన్ని ఆధారాలతో బయటపెట్టడంతో మళ్లీ వాయిదా వేశారు.ఉప ఎన్నిక కోసం ఇంతగా దిగజారుతారా?ఉప ఎన్నిక కోసం తెలుగుదేశం పార్టీ పోలీస్ యంత్రాంగంను ఉపయోగించుకుని చేస్తున్న దౌర్జన్యాలతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు భయాందోళనకు గురవుతున్నారు. సాక్షాత్తు పోలీసులే మమ్మల్ని బెదిరిస్తున్నారు, కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు, ఇక మాకు రక్షణ ఎక్కడ ఉందని ఆందోళన చెందుతున్నారు. దీనిని భరించలేక కొందరు ఊరు వదిలి వెళ్లిపోయారు. ఈలోగానే మళ్లీ తెలుగుదేశం నేతలు, పోలీసులు కలిసి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై దాడులకు, కిడ్నాప్లకు తెగబడ్డారు.తాజాగా తెలుగుదేశం నేతల బెదిరింపులకు భయపడి పక్కనే ఉన్న మాచవరం గ్రామంలో తన తల్లి ఇంట్లో తలదాచుకున్న కౌన్సిలర్ ను టీడీపీ నాయకులు, పోలీసులు కిడ్నాప్ చేశారని ఒక కౌన్సిలర్ భార్య సోషల్ మీడియాలో వీడియో ద్వారా బయటపెట్టారు. తన భర్తకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. అలాగే మరో కౌన్సిలర్ ఈ బాధ పడలేక హైదరాబాద్ లో తలదాచుకుంటే, అయన సోదరులను పోలీస్ స్టేషన్ లో కూర్చోబోట్టి మర్యాదగా పిడుగురాళ్ళకు వచ్చి, తాము చెప్పినట్లు నడుచుకోవాలంటూ బెదిరించారు.ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు జరపాల్సిన ప్రభుత్వం చిన్న ఎన్నికలో కూడా ఇలా దౌర్జన్యాలతో బెదిరింపులకు గురి చేయడం దారుణం. గతంలో దర్శి, తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చింది. ఆరోజు అధికారం ఉందని వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా దౌర్జన్యాలకు పాల్పడితే ఆ రెండింటిలో కూడా వైఎస్సార్సీపీకే అధికారం దక్కేది కాదా? కానీ సీఎంగా ఉన్న వైఎస్ జగన్ అటువంటి విధానాలకు మనం వ్యతిరేకం, ప్రజాతీర్పుకు గౌరవం ఇవ్వాలని స్పష్టంగా తన విధానాన్ని ప్రకటించారు. జేసీ ప్రభాకర్రెడ్డి దానిని స్వయంగా అంగీకరించారు. వైఎస్ జగన్ తలుచుకుంటే తాను మున్సిపల్ చైర్మన్ అయి ఉండేవాడిని కాదు అని ఒప్పుకున్నారు.పార్టీ మారకపోతే అంతుచూస్తామని బెదిరిస్తున్నారుపిడుగురాళ్ళ మున్సిపల్ చైర్మన్ సుబ్బారావుకు చెందిన ఫ్యాక్టరీకి తెలుగుదేశం నేతలు తాళాలు వేశారు. నీ వ్యాపారాలు అడ్డుకుంటాం, పార్టీ మారాలంటూ బెదిరిస్తున్నారు. లేకపోతే అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు. ఇటీవల పిడుగురాళ్ళ మున్సిపల్ కౌన్సిలర్ను టీడీపీ నేతలు కిడ్నాప్ చేసిన నేపథ్యంలో కోర్టులో హెబియస్ కార్ఫస్ పిటీషన్ దాఖలు చేశాం. వెంటనే సదరు కౌన్సిలర్ను వదిలిపెట్టారు. ఈ సందర్భంగా తానను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పాలని లేకుండా తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా బెదిరించారు.దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపైనా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యంకు పాల్పడ్డారు. తిరిగి అబ్బయ్య చౌదరిపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం చూస్తే ఇంత దుర్మార్గమైన పాలన మరెవరూ చేయలేరని అనిపిస్తోంది. తెలుగుదేశం చేస్తున్న ఈ దుర్మార్గాలను ప్రజలు గమనిస్తున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు -
పోలీసుల తీరుపై కాసు మహేష్ రెడ్డి ఫైర్
-
కిడ్నాప్ చేసిన కౌన్సిలర్లు ను విడిచిపెట్టకపోతే టీడీపీ కుట్రపై కాసు మహేష్ రెడ్డి ఫైర్
-
పోలీసులు, కూటమి నేతలు కుమ్మక్కు: కాసు మహేష్రెడ్డి
సాక్షి, పల్నాడు జిల్లా: పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి ఇవాళ ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీ నేతలు మండిపడుతున్నారు. పిడుగురాళ్ల పిడుగురాళ్ల మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులు కాగా, గతంలో 33 వార్డులను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. ఒక కౌన్సిలర్ను టీడీపీ నేతలు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారు.మున్సిపల్ వైస్ చైర్మన్ చనిపోవడంతో ఆ స్థానానికి ఎన్నికల నిర్వహించడానికి నోటిఫికేషన్ వెలువడింది. నిన్న(సోమవారం) వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్ళనివ్వకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ నామినేషన్ కూడా దాఖలు చేయనివ్వకుండా టీడీపీ రౌడీలు అడ్డుకున్నారు. దీంతో ఈరోజుకు వైఎస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు టీడీపీ నేతల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్రెడ్డి మాట్లాడుతూ, పోలీసులు, కూటమి నాయకులు కుమ్మక్కైపోయారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన పదిమంది కౌన్సిలర్లను టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన టీడీపీ నాయకులకు పోలీసులు అండగా ఉన్నారు. పిడుగురాళ్లలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది. కిడ్నాప్ పైన కొంతమంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ఇంటి నుంచి పోలీసులే తీసుకువెళ్లారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు పోలీసులు తీసుకువెళ్లి టీడీపీ నేతలకు అప్పగించారు. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకం నడుస్తోంది’’ అని కాసు మహేష్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బాబు ఆరు నెలల పాలన అంతా దోచుకోవటం.. దాచుకోవటం
-
‘సరస్వతి’ భూముల్లో ప్రతి సెంటూ కొన్నదే
సాక్షి, అమరావతి: ‘సరస్వతి పవర్’ భూముల్లో ప్రతి సెంటూ కొనుగోలు చేసిందేనని, ఒక్క ఎకరం కూడా ప్రభుత్వ భూమి లేదని గురజాల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కాసు మహేశ్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ను రంగంలోకి దించిన విధంగానే.. ఇప్పుడు సరస్వతి భూముల వ్యవహారంలోనూ అదే పవన్కళ్యాణ్తో చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై పెచ్చుమీరుతున్న లైంగిక దాడులు, పేట్రేగుతున్న టీడీపీ మూకల అరాచకాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సరస్వతి భూములపై రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులు అడిగిన దానికంటే ఎక్కువ చెల్లించి కొన్నారు సరస్వతి కంపెనీ భూసేకరణ ఇప్పుడు జరిగింది కాదని.. పదిహేనేళ్ల క్రితం భూముల సమీకరణ జరిగిందని కాసు మహేశ్రెడ్డి చెప్పారు. 2009లో సరస్వతి కంపెనీ భూములు కొనుగోలు చేసేందుకు సిద్ధపడగా.. అప్పట్లో రైతులంతా సమావేశమై ఎకరం మెట్ట భూమికి రూ.1.50 లక్షలు, పల్లపు భూమికి రూ.2.75 లక్షలు చెల్లించాలని కోరుతూ తీర్మానించారని గుర్తు చేశారు. అయితే, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులంతా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో వారు కోరిన దానికంటే మిన్నగా.. అధిక ధర చెల్లించారని గుర్తు చేశారు. కొన్ని భూములకు ఆ రోజుల్లోనే ఎకరానికి రూ. 8.50 లక్షలు చెల్లించారన్నారు. ఆ సమయంలోనే ఇదే ప్రాంతంలో భవ్య సిమెంట్ కంపెనీ ఎకరం రూ.50 వేల చొప్పున కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. రైతులకు ఎక్కువ మేలు చేసింది ఎవరని, ఈ విషయాలను పవన్కళ్యాణ్ ఎందుకు దాచిపెడుతున్నారని, సరస్వతి భూముల విషయంలో ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ భూముల సంగతి పట్టదా పవన్! గురజాల మండలంలో ప్రభుత్వం నుంచి 40 ఏళ్ల క్రితం సంఘీ సిమెంట్స్ భూములు తీసుకుని ఇప్పటికీ పరిశ్రమ ప్రారంభించలేదని మహేశ్రెడ్డి గుర్తు చేశారు. ఇదే ప్రాంతంలో 30 ఏళ్ల క్రితం ప్రభుత్వ భూములు తీసుకుని ఒక్క బస్తా సిమెంట్ కూడా తయారు చేయకుండానే అంబుజా సిమెంట్ ఆ భూములను అదానీకి అమ్మేసిందన్నారు. మై హోమ్, ఇమామి వంటి కంపెనీలు దశాబ్దాల క్రితం ప్రభుత్వ భూములు తీసుకుని పరిశ్రమలు ప్రారంభించకపోయినా పవన్కళ్యాణ్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఆ సంస్థలకు ఇచ్చిన భూములను రద్దు చేస్తామని పవన్ ప్రకటించగలరా అని ప్రశ్నించారు. సరస్వతి భూములపైకి వెళ్లిన పవన్కళ్యాణ్కు.. హైదరాబాద్లో ఖరీదైన ప్రాంతంలో వేలాది ఎకరాలను అక్రమంగా పొంది రామోజీరావు నిర్మించిన ఫిల్మ్ సిటీ భూముల్లోకి వెళ్లే ధైర్యం పవన్కు ఉందా అని ప్రశ్నించారు. ఎక్కడికక్కడ హెరిటేజ్ కంపెనీ అనేక మార్గాల్లో సేకరించిన భూముల్లో పవన్ పర్యటించగలరా అని సవాల్ చేశారు. ఇవేమీ పట్టించుకోని పవన్కళ్యాణ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనుగోలు చేసిన ప్రైవేటు భూములను రద్దు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అబద్ధాలు చెబితే జనం నమ్ముతారా!డిప్యూటీ సీఎం హోదాలో పర్యటించిన పవన్ అన్నీ పచ్చి అబద్ధాలే చెప్పారని మహేశ్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు మాయం అయిపోయారని గతంలో పవన్కళ్యాణ్ ఎలా తప్పుడు ప్రచారం చేశారో.. సరస్వతి భూముల విషయంలోనూ అలాంటి తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారన్నారు. అటవీ భూములను కన్వర్షన్ చేశారన్నది పూర్తి అబద్ధమని స్పష్టం చేశారు. అటవీ శాఖకు పవన్కళ్యాణ్ మంత్రిగా ఉన్నారని, సరస్వతి భూముల విషయంలో కనీసం ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు మేలు కోసం దాదాపు మూడు రెట్లు ఎక్కువ ధరతో జగన్ భూములు కొనుగోలు చేసి, సరస్వతి సిమెంట్ కంపెనీ నెలకొల్పితే.. చంద్రబాబు అధికారంలోకి రాగానే 2014లో ఆ కంపెనీ మైనింగ్ లీజును రద్దు చేశారన్నారు. నిర్దేశించుకున్న సమయానికి ఆ పరిశ్రమ ప్రారంభమై ఉంటే స్థానికంగా వేలాది మందికి ఉపాధి లభించేదన్నారు. కడప జిల్లాలో మొదలైన భారతి సిమెంట్స్ ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒకవైపు రాష్ట్రంలోకి పరిశ్రమలు రావాలంటూ.. దేశాలు తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం మరోవైపు ఇలా ఫ్యాక్టరీలు పెట్టాల నుకున్న కంపెనీలపై కక్ష సాధిస్తుండటం దుర్మార్గమన్నారు. -
పవన్ వ్యాఖ్యలకు కాసు మహేష్ రెడ్డి కౌంటర్
-
డయేరియా మరణాల పాపం ప్రభుత్వానిదే, ఏపీలో మైన్స్, వైన్స్ దోపిడీ
-
పోలీసుల అరాచకాలపై కాసు మహేష్ రెడ్డి వార్నింగ్...
-
టీడీపీ నేతల పై కాసు మహేష్ రెడ్డి ఫైర్
-
‘టీడీపీ నేతల వేధింపులకు ఇది పరాకాష్ట’
పల్నాడు జిల్లా : ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు, హత్యలు, అక్రమాలు తప్పితే మరేం కనిపించడం లేదని గురుజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి ధ్వజమెత్తారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం జూలకల్లులో దళిత మహిళకు అన్యాయం చేశారని కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు.రేషన్ షాపు వ్యవహారంలో మనీషా అనే యువతిని టీడీపీ నేతలు వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. తన తండ్రి చనిపోయిన తర్వాత రేషన్షాపును మనీషా అనే యువతి చూసుకుంటుంటే ఆమెపై టీడీపీ వారు వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆమె షాప్ తీసేయడమే కాకుండా అక్రమ కేసులు పెడతామని హింసించడం మొదలుపెట్టారని, రూ. 70 వేల నుంచి రూ. 80 వేలు కట్టాలని టీడీపీ నేతలు వేధించారన్నారు. టీడీపీ నేతల వేధింపులతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. టీడీపీ నేతల వేధింపులకు ఇది పరాకాష్ట అని కాసు మహేష్రెడ్డి విమర్శించారు.ఆడ పడుచులను మరీ ముఖ్యంగా ఎస్టీ, ఎస్టీలపై టీడీపీ దాడులకు దిగుతుందన్నారు. పోలీసులు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపు, మా పార్టీ నాయకులు జూలకల్లు వెళ్తామని, మనీషా కుటుంబానికి అండగా ఉంటామని కాసు మహేష్రెడ్డి స్పష్టం చేశారు. -
టీడీపీ అరాచకాలు.. 30 రోజుల పాలన ఇదేనా చంద్రబాబు..
-
వైఎస్ జగన్ను కలిసిన ముద్రగడ, కాసు మహేష్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పార్టీ నేతలు శుక్రవారం కలిశారు. వైఎస్ జగన్ని కలిసిన వారిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారు. పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై వైఎస్ జగన్ దిశనిర్దేశం చేశారు.కాగా, వైఎస్ జగన్ మరోసారి వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి(శనివారం) నుంచి మూడు రోజులపాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.షెడ్యూల్ ప్రకారం.. శనివారం ఉదయం తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ తన పర్యటనకు బయల్దేరతారు. తొలుత గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్టు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. ఈ నెల 8వ తేదీన మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి 75వ జయంతి వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
పిన్నెల్లి అరెస్టుపై కాసు మహేష్ రెడ్డి సీరియస్
-
ఓటమిపై సమీక్ష చేస్తాం
దాచేపల్లి: తమ ఓటమిపై సమీక్షించుకుంటామని పల్నాడు జిల్లా గురజాల వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డి తెలిపారు. టీడీపీ చేస్తున్న అవమానాలు, వేస్తున్న నిందలను తట్టుకుని నిలబడతామన్నారు. ఇవే తమలో పట్టుదల పెంచుతాయని చెప్పారు. ఆదివారం ఆయన దాచేపల్లిలో మీడియాతో మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తరువాత వైఎస్ జగన్ను ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ అవమానించిందని గుర్తు చేశారు. ఈ అవమానాలే ఆయనలో పట్టుదలను పెంచి.. వైఎస్సార్సీపీని ఏర్పాటు చేసి సీఎం అయ్యేలా చేశాయన్నారు. నిండు సభలో పాండవులను అవమానిస్తే యుద్ధం చేసి రాజ్యం సాధించుకున్నారని గుర్తు చేశారు. అలాగే టీడీపీ చేసే అవమానాలను దీటుగా ఎదుర్కొంటామన్నారు. మళ్లీ ప్రజల అండదండలతో అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. టీడీపీకి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారని, దీన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. గెలిచిన వెంటనే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అవమానాల ప్రతిఫలం టీడీపీ అనుభవించాల్సి ఉంటుందన్నారు. తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ప్రజలకు మంచి చేసే విధానంలో హుందాగా వ్యవహరిస్తామని తెలిపారు. జగనన్న నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు.రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, మహామహులే ఓడిపోయారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు అద్భుతంగా చేసినప్పటికీ మద్యం, ఇసుక విషయంలో ప్రభుత్వం పట్ల ప్రజల్లో, కార్మికుల్లో కొంత అసంతృప్తి ఉన్నట్లు గుర్తించామన్నారు. తప్పులు ఎక్కడ జరిగాయో తెలుసుకుని మళ్లీ అవి జరగకుండా చూసుకుంటామన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు ధైర్యంగా ఉండాలని, త్వరలోనే ప్రతి ఒక్కరినీ కలుస్తానన్నారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీకి బీజేపీ నివాళిసాక్షి, అమరావతి: దేశహితం కోసం బలిదానం చేసిన మహనీయుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ అంటూ పలువురు బీజేపీ నేతలు కొనియాడారు. బీజేపీ సిద్ధాంతకర్తల్లో ప్రముఖులు శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఆదివారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనూ, వివిధ ప్రాంతాల్లో పార్టీ నేతలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సోషల్ మీడియా ‘ఎక్స్’లో శ్యామ ప్రసాద్ ముఖర్జీ కి నివాళి అర్పించారు. -
ఓటమికి కారణాలు తెలుసుకుంటాం.. దాడులు చేయడం సరికాదు
-
ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడు: కాసు మహేష్రెడ్డి
సాక్షి, విజయవాడ: ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయని ధ్వజమెత్తారు. టీడీపీ అరాచకాలపై ఈసీకి వైఎస్సార్సీపీ నేతలు కాసు మహేష్ రెడ్డి, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.అనంతరం కాసు మహేష్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నామన్నారు. ‘‘సుమారు 60, 70 బూత్ల్లో రిగ్గింగ్ చేశారు. వెబ్ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి రీపోలింగ్ జరపాలని కోరాం. ఈసీ స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఇళ్లను సైతం టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. మహిళలు భయాందోళనలకు గురై గుడిలో తలదాచుకున్నారు. దాడులకు పాల్పడ్డ టీడీపీ నేతలపై చర్యలేవి?. మాచర్ల ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి’’ అని కాసు మహేష్రెడ్డి డిమాండ్ చేశారు.‘‘ఓటు వేసిన వారిని టీడీపీ వాళ్లు కొట్టి, చంపాలని చూస్తే పోలీసులు స్పందించలేదు. ఎన్నికలకు వారం రోజుల ముందు పోలీసులను మార్చారు. దాని వల్లనే హింస చెలరేగింది. ఈ హింసకి బీజేపీ, టీడీపీ, ఈసీ ఎవరు బాధ్యత వహిస్తారు?. ఎన్ని చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసినా ప్రజలు మాత్రం జగన్ని గెలిపించాలని నిర్ణయించారు. మాచర్లలో తుమ్రకోట, వెల్దుర్తి వంటి చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసింది. టీడీపీ రిగ్గింగ్ చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదు’’ అని కాసు మహేష్రెడ్డి పేర్కొన్నారు.‘‘సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ముందే ఈసీ దృష్టికి తీసుకుని వెళ్లామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ముందస్తు భద్రత కల్పించమని అడిగామని.. అయినా భద్రత చర్యలు తీసుకోలేదన్నారు. పురందేశ్వరి అధికారులను మార్చమని ఒత్తిడి తెచ్చారు. ఆమె చేసిన ఒత్తిడి నిర్ణయంతో హింస జరిగింది’’ అని మల్లాది విష్ణు మండిపడ్డారు. -
‘రిగ్గింగ్’ వదిలేసి అడ్డుకుంటే కేసులా?
నరసరావుపేట: ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ యథేచ్ఛగా రిగ్గింగ్కు పాల్పడిన వారిని వదిలేసి అడ్డుకున్న వారిపై ఈసీ కన్నెర్ర చేయడం ఏమిటని గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. బుధవారం నరసరావుపేటలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా పిన్నెల్లి నాలుగు సార్లు ప్రజాబలంతో ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేశారు. ఈవీఎం ఘటనను పదేపదే చూపిస్తున్న టీడీపీ అనుకూల మీడియా అదేచోట వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై జరిగిన దాడులను ఎందుకు దాచి పెడుతోందని నిలదీశారు. మిగతా వాటి సంగతేంటి? ఒక్క ఈవీఎం ఘటనను చూపిస్తూ పిన్నెల్లి నిందితుడిగా చేర్చారు. మరి పల్నాడులో పలుచోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఆ వీడియోలను ఎందుకు బయట పెట్టడం లేదు? టీడీపీ నేతలు దౌర్జన్యాలకు తెగబడి ఈవీఎంలను పగులకొట్టిన వీడియోలు ఎందుకు బహిర్గతం చేయడం లేదు? పోలింగ్ కేంద్రాల్లో వీడియో కెమెరాలు అమర్చిన ఈసీ పది రోజులుగా మేం ఘోషిస్తున్నా ఎందుకు స్పందించలేదు?రిగ్గింగ్ జరగలేదని నిరూపించాలి..మాచర్లలో ఈసీకి ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులొచ్చాయి? వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో వెల్లడించాలి. పాల్వాయి గేటుతో సహా మేం చెబుతున్న చోట్ల రిగ్గింగ్ జరగలేదని వెబ్ కెమెరా వీడియోలను బయటపెట్టి నిరూపించగలరా? ప్రజాస్వామ్య వ్యవస్థలో దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదే. కొత్త గణేశునిపాడులో మహిళల నిర్బంధంపోలింగ్ రోజు మాచవరం మండలం కొత్త గణేశునిపాడులో అర్ధరాత్రి యాదవులు, ఎస్టీల ఇళ్లపై టీడీపీ మూకలు దాడులకు దిగి స్వైరవిహారం చేశాయి. మహిళలు ప్రాణభయంతో 24 గంటల పాటు ఓ దేవాలయంలో తల దాచుకుంటే ఇరువర్గాలపై కేసులు పెడతారా? ఇదేనా ఈసీ చేసే న్యాయం? పోలింగ్కు ముందు పల్నాడులో పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసిన ఈసీ ఆ స్థానంలో తాను నియమించిన వారు విధుల్లో అలసత్వం ప్రదర్శించారంటూ సస్పెండ్ చేసింది. ఈసీ నియమించిన అధికారులే సస్పెండ్ అయ్యారంటే ఎవరు విఫలమైనట్లు? రీపోలింగ్కు హైకోర్టుకెళ్లి పోరాడతాం..ఎన్నికల కమిషన్కు వైఎస్సార్ సీపీ అందించిన ఫిర్యాదులన్నింటికీ సమాధానం చెప్పాల్సిందే. రిగ్గింగ్ జరిగినట్లు మేం ఫిర్యాదు చేసిన ప్రతి పోలింగ్ కేంద్రం వీడియోలను ఎన్నికల కమిష¯Œన్ బహిర్గతం చేయాల్సిందే. అధికారుల నియామకాలు, ఆ తర్వాత వారిని సస్పెండ్ చేయడం, ఎన్నికల ప్రక్రియలో లోపాలపై కచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తాం. రీపోలింగ్ నిర్వహించేలా పోరాటం చేస్తాం. రిగ్గింగ్ ఆరోపణలు వచ్చిన చోట వెబ్ కెమెరాలను తనిఖీ చేసి రీపోలింగ్ నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉంది. పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ నేతలు, ఏజెంట్లు కలసి రిగ్గింగ్కు పాల్పడ్డారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లను బయటకు లాగి దాడి చేయడంతో పిన్నెల్లి అక్కడకు చేరుకుని తీవ్రంగా ప్రతిఘటించారు. మేం చెప్పేది నిజం కాకుంటే పూర్తి నిడివి వీడియోలను ఈసీ బయట పెట్టాలి. పిన్నెల్లి నాలుగు సార్లు ప్రజాస్వామ్యబద్ధంగా మాచర్ల ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదోసారి కూడా కచ్చితంగా విజయం సాధిస్తారు. నలుగురు అధికారులను మేనేజ్ చేసి ఎడిటెడ్ వీడియోలు లీక్ చేసినంత మాత్రాన భయపడే ప్రసక్తే లేదు. ఇలాంటి రాజకీయాలు చాలా చూశాం. బాబు నోట నీతులా..?నరసరావుపేటలో కోడెల ఇంట్లో బాంబులు తయారు చేస్తుండగా నలుగురు చనిపోతే ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించిన చంద్రబాబు నీతులు చెబుతున్నారు. ఏడుగురి హత్య కేసులో నిందితుడైన మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డిపై ఏ 1గా ఎఫ్ఐఆర్ నమోదు చేయించిన చంద్రబాబు ఇప్పుడు అదే వ్యక్తికి పార్టీ టికెట్ ఇచ్చారు. ఫ్యాక్షనిజం, ఫ్యాక్షన్ లీడర్లను ప్రోత్సహించేది చంద్రబాబేనని అందరికీ తెలుసు.'గేట్’ వీడియోలన్నీ బయట పెట్టాలి..మాచర్ల నియోజకవర్గంలోని తుమృకోట, వెల్దుర్తి, చింతపల్లి, వేపకంపల్లె, ఒప్పిచర్లలో టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్కు పాల్పడ్డారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లను బూత్ల నుంచి బయటకు లాక్కెళుతున్న వీడియోలను ఎన్నికల కమిష¯Œన్ దృష్టికి తెచ్చాం. పాల్వాయిగేట్లో మా పార్టీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు లాక్కెళ్లి కొడుతుంటే పిన్నెల్లి రిగ్గింగ్ను అడ్డుకునేందుకు వెళ్లారు. ఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు రెండు మూడు గంటల పాటు సాగిన టీడీపీ మూకల దౌర్జన్యాలు, విధ్వంసకాండను ఎందుకు బయట పెట్టడం లేదు? అక్కడ ఉదయం నుంచి జరిగిన ఘటనల వీడియోలన్నీ బహిర్గతం చేయాలి. -
టీడీపీ రిగ్గింగ్.. పూర్తి వీడియో బయటపెట్టాలి: కాసు మహేష్రెడ్డి
సాక్షి, నరసరావుపేట: మాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని.. దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. పిన్నెల్లి తప్పు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోంది. మొత్తం వీడియో బయటపెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. ఒక్కటే వీడియో ఎందుకు రిలీజ్ చేశారు. రిగ్గింగ్ జరిగిందని చెప్తుంటే.. ఎందుకు వీడియో రిలీజ్ చేయడం లేదు?’’ అంటూ కాసు మహేష్రెడ్డి ప్రశ్నించారు.‘‘మాచర్లలో ఎవరు దాడి చేశారో ప్రజలందరికి తెలియాలి. మాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు? టీడీపీ కాదా?. బీసీలు, ఎస్టీలు వైఎస్సార్సీపీకి ఓటేశారనే కారణంతో దాడులు చేశారు. అందరికీ చట్టపరమైన శిక్ష పడేవరకు పోరాడతాం. రిగ్గింగ్ జరిగిందని మేము చెబుతున్నాం.. మీరు ఎందుకు వీడియో బయటపెట్టడం లేదు?. ఎన్నికల అధికారులు ఆరోజు ఏమైందనేది మొత్తం వీడియో బయటపెట్టాలి. ఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు 2, 3 గంటల వీడియో బయటపెట్టాలి. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు’’ అని కాసు మహేష్ చెప్పారు.‘‘దాడులకు సంబంధించి ఈసీ పూర్తి వీడియోలు బయటపెట్టాలి. ఏడు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగిందని ఈసీనే చెబుతోంది. మాచర్ల వీడియోను మాత్రమే బయటపెట్టారు. మిగిలిన వీడియోలను ఎందుకు బయటపెట్టడం లేదు. ఈసీ విశ్వసనీయత కోల్పోతుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం’’ అని కాసు మహేష్రెడ్డి పేర్కొన్నారు. -
టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్
-
ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!
-
టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..
-
ఇంటర్నేషనల్ ఫెసిలిటీ తో ఆస్పత్రి నిర్మాణం
-
మీకు రెండే రెండు ప్రశ్నలు.. టీడీపీ మేనిఫెస్టోపై కాసు మహేష్ రెడ్డి ఫైర్
-
పల్నాడు వాసుల చిరకాల స్వప్నం నెరవేరబోతుంది: ఎమ్మెల్యే కాసు
-
షర్మిలకు కాసు మహేష్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్
-
ముఖ్యమంత్రి జగన్ పాలన సౌలభ్యాన్ని తీసుకొచ్చారు: ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
-
నీకు ఉరి శిక్ష పడేలా చేస్తా...టీడీపీ నేతకు వార్నింగ్..
-
ఈ హత్యకు కారణం ఆయనే..!
-
రూ.300 కోట్ల సారాయి డబ్బులతో చంద్రబాబు ఇళ్లు కట్టుకున్నారు
-
నారా లోకేష్కు ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి సవాల్
సాక్షి, పల్నాడు జిల్లా: వైఎస్సార్సీపీ పాలనలో అభివృద్ధిపై మంగళగిరి టీడీపీ ఆఫీసులో చర్చ పెట్టినా తాను చర్చకు సిద్ధమని నారా లోకేష్కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేను అబద్ధాలు చెప్పినట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. గురజాల నియోజకవర్గంలో టీడీపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘రూ.83 కోట్లతో నిర్మించిన సీసీరోడ్లు, అంగన్వాడీలు, కమ్యూనిటీ హాళ్లని రూ.2020 కోట్లతో నిర్మించానని లోకేష్ అబద్ధాలు చెప్పాడు. సారా డబ్బులతో హైదరాబాద్లో చంద్రబాబుకు రూ.300 కోట్ల భవనం. ప్రజల్ని లూటీ చేసి చంద్రబాబు, లోకేష్ సంపాదించారు. టీడీపీ హయాంలో లిప్ట్ ఇరిగేషన్ నుంచి సర్వే అయినా చేయించారా?’’ అంటూ మహేష్రెడ్డి ప్రశ్నించారు. చదవండి: అన్నమయ్య జిల్లా: చంద్రబాబుపై కేసు నమోదు -
గురజాల నియోజకవర్గంలో టీడీపీ శవ రాజకీయాలు: ఎమ్మెల్యే కాసు
సాక్షి, పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గంలో టీడీపీ శవ రాజకీయాలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. మైనింగ్ గుంటలో పడి ప్రమాదవశాత్తు నలుగురు బాలురు చనిపోయారు. గురజాలలో జరగబోయే లోకేష్ సభకు వచ్చి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా చెప్పాలని చనిపోయిన ఇద్దరు బాలురు కుటుంబ సభ్యులపై యరపతినేని ఒత్తిడి చేస్తున్నాడని ఎమ్మెల్యే కాసు ధ్వజమెత్తారు. తనకు వ్యతిరేకంగా లోకేష్ దగ్గర చెప్తే ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇస్తానంటూ యరపతినేని శ్రీనివాసరావు ప్రలోభాలు పెడుతున్నారని కాసు మహేష్రెడ్డి మండిపడ్డారు. చదవండి: Viveka Case: ఆద్యంతం సందేహాస్పదం.. ‘ద వైర్’ విశ్లేషణాత్మక కథనం–2 -
‘వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందనే బాబుకు ఈ భయమంతా’
తాడేపల్లి: ఓటుకు నోటు, బెల్టు షాపులు తెచ్చింది నారా చంద్రబాబు నాయుడేనని మండిపడ్డారు గురజాల ఎమ్మెల్యే కాసు మహేవ్రెడ్డి. అసలు రాజకీయాల్ని భ్రష్టు పట్టించిందే చంద్రబాబని మహేశ్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘2024లో బాబుకు రిటైర్మెంట్ ఖాయం. వృద్దాప్యంలోనైనా గౌరవంగా బతకండి. వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ అనే సర్వేలతో బాబు వెన్నులో వణుకు. ఆనాడు మద్యపాన నిషేదం ఎత్తేసింది చంద్రబాబు కాదా..? , మీ బాబు తెచ్చిన మద్యం బ్రాండ్లే నేటికీ ఉన్నాయి..తెలుసుకో యరపతినేని. లోకేశ్ స్టాన్ఫర్డ్ చదువుకు డోనేషన్ కట్టింది ఎవరో లోకానికి తెలియదా..?, ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకేంటి..? అది చంద్రబాబు ప్రచారమే’ అని విమర్శించారు. కాసు మహేశ్ రెడ్డి మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే: వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందనే బాబుకు ఈ భయమంతా..!: యరపతినేని ఒక నీతి జాతి లేని నాయకుడు మాట్లాడినట్లు చిల్లరగా మాట్లాడుతున్నాడు. పేస్ యరపతినేనిది...బ్యాక్గ్రౌండ్ చంద్రబాబుది...ఈ గుంట నక్క రాజకీయాలు ఎన్నిరోజులు..? చంద్రబాబు మాజీ ఎమ్మెల్యేలతో, మాజీ మంత్రులతో, అమెరికాలో ఉంటున్న మహిళలతో పోస్టులు పెట్టిస్తున్నాడు. ఎన్ని రోజులు ఈ రాజకీయాలు...ఎందుకింత భయపడుతున్నాడు..? టైమ్స్ నౌ, ఇండియా టుడే సర్వేలు వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతోందని చెప్తుంటే ఈయన భయపడిపోయి ఇవన్నీ చేస్తున్నాడు. ఆయన చేసిన తప్పులన్నీ జగన్ గారికి ఆపాదిస్తూ ఏదంటే అది మాట్లాడిస్తున్నాడు..మాట్లాడుతున్నాడు. ఒకడు లిక్కర్ అంటాడు...ఒకడు సిమెంట్ అంటాడు. అసలు లిక్కర్ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి ఉందా...? మద్యపాన నిషేదం పెడితే ఎత్తేసింది చంద్రబాబు కాదా..? ఇంటింటికీ లిక్కర్ పథకాన్ని పెట్టింది చంద్రబాబు కాదా..? దేశంలోనే మొట్టమొదటి సారిగా బెల్టు షాపులు పెట్టి వైన్ షాపులకు టార్గెట్లు ఇచ్చిన నాయకుడు చంద్రబాబే. మాట్లాడితే లిక్కర్లో జే టాక్స్ అంటారు...250 బ్రాండ్లను రాష్ట్రంలోకి తెచ్చింది చంద్రబాబే. చంద్రబాబు పెట్టిన డిస్టిలరీలే నేటికీ వ్యాపారం చేస్తున్నాయి. ఆదికేశవులనాయుడిది డిస్టిలరీ లేదా..? ఆయన టీడీపీ కాదా..? తాను డిస్టిలరీని అమ్మేసుకున్నాను అని అయ్యన్నపాత్రుడు మొన్నీ మధ్య చెప్తున్నాడు...ఆయన టీడీపీ నేత కాదా..? యనమల రామకృష్ణుడు వియ్యంకుడు టీడీపీ నేత కాదా..? ఎస్పీవై రెడ్డి వైఎస్సార్సీపీలో గెలిస్తే ప్రమాణ స్వీకారం చేయకముందే లాగేసుకుని ఆయన చేత డిస్టిలరీ పెట్టించింది చంద్రబాబే. ఈ రోజుకీ చంద్రబాబు పెట్టిన బ్రాండ్లే రాష్ట్రంలో నడుస్తున్నాయి. వీళ్లు చెప్తున్న భూమ్ భూమ్ బ్రాండు, వివిధ రకాల మెడల్స్ వారి హయాం నుంచి వస్తున్నవే. ఆనాడు ఆ సంస్థల వద్ద లంచాలు తీసుకుని వాటికి అనుమతులు ఇచ్చింది మీరే కదా. చేసిన తప్పంతా మీరు చేసి మాపై రుద్దాలనుకుంటే ఎలా..?: చేసిన తప్పంతా మీరు చేసి ఆ బురదంతా మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి పుయ్యాలంటే ఎలా..? ప్రజలు ఇవన్నీ తెలుసుకోలేని అమాయకులా..? చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి తప్పుడు పనులు అన్నట్లుంది చంద్రబాబు తీరు. సిమెంట్ సంస్థలు ముఖ్యమంత్రి గారికి లంచాలు ఎందుకిస్తారు..? ఈ రాష్ట్రంలో అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. గతంలో 2014–19 మధ్య ధరలు 10–15శాతం పెరిగాయి... ఈ రోజు అంతర్జాతీయంగా బొగ్గు ధరలు పెరిగి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు పెరిగాయి. ఒక్క సిమెంట్ ధరలే కాదు స్టీల్ ధరలు కూడా పెరిగాయి. బహుశా ఆ తప్పులన్నీ వాళ్లే చేశారేమో..? అందుకే ఇవన్నీ మాపై ఆపాదిస్తున్నారు. ప్రజలకు అంతా తెలుసు..ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది ఎవరు...మాట తప్పింది ఎవరు అనేది వారు గమనిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగన్ గారి నాయకత్వంలో 99 శాతం మేనిఫెస్టో ను అమలు చేశాం. నువ్వేదో విలువలు కలిగిన నాయకుడి ఫోజులెందుకు చంద్రబాబూ..?: ఎందుకీ కుటిలరాజకీయాలు..ఆలా ఎన్ని రోజులు చేస్తారు..? చంద్రబాబునే నేరుగా వచ్చి మాట్లాడమనండి...ఆ బూతులేవో తానే మాట్లాడమనండి. ఎందుకీ నాటకాలు..? ముందొక మాట..వెనకొక మాట. ఆయనేదో పెద్ద విలువలు కలిగిన నాయకుడిలా ఫోజులెందుకు..? ఈ దేశంలోనే రాజకీయాలను బ్రష్టు పట్టించింది చంద్రబాబే. ఓటుకు నోటును తీసుకొచ్చింది చంద్రబాబు. ఎన్టీఆర్ చనిపోయిన నాడు ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ఓటుకు యాభై రూపాయలు అనే విధానాన్ని ప్రవేశపెట్టింది చంద్రబాబే. ఈ రోజు రాజకీయ వ్యవస్థలో ఓటుకు నోటు ఒక క్యాన్సర్లా మారింది. మీడియాను, వ్యవస్థలను వాడుకోవడం, వారికి ప్రలోభాలు పెట్టడం వల్ల మిమ్మల్ని గత ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు. మళ్లీ ఇక గెలవలేమనే ఫ్రస్టేషన్తో నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. చిన్నవయసులో ముఖ్యమంత్రి అయినా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ..కేంద్రంతో మంచి రిలేషన్స్ నడుపుతూ ముందుకు వెళ్తూ నిధులు తీసుకొస్తున్నారు. అది తట్టుకోలేక అక్కసుతో, కుళ్ళుతో చంద్రబాబు ఇవన్నీ చేస్తున్నాడు. సొంత బలంతో నిలబడగలుగుతాడా అంటే అదీ ఆయనకు చేతకాదు. ఆ రోజు ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 270 సీట్ల వరకూ ఉన్నాయి. ఈ రోజు తెలంగాణాలో జీరో...అక్కడ పోటీ చేసే దిక్కు లేదు. ఆంధ్రప్రదేశ్ 175 సీట్లలో సొంతంగా పోటీ చేయలేని దుస్థితి. పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ కావాలి..కమ్యూనిస్టులు కావాలి... ఇదీ ఈ రోజు టీడీపీని చంద్రబాబు ఈ స్థాయికి దిగజార్చాడు.. సొంత బలంలో జగన్ గారు ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకపోయినా తన రాజకీయాన్ని మొదలు పెట్టి 151 సీట్లు, 50 శాతం ఓట్లు సంపాదించాడు. 90 శాతం ఎంపీటీసీ, సర్పంచ్లు, జడ్పీటీసీలు వైఎస్సార్సీపీ గెలుచుకుంది. ఎక్కడ చదివామన్నది కాదు..ఎంత సంస్కారం ఉందనేది ముఖ్యం: జగన్ చదువులు గురించి కూడా విచిత్రంగా మాట్లాడుతున్నారు. జగన్ చదివింది బేగంపేటలో కాదా..? పది వరకూ కష్టమైన ఐసీఎస్సీ సిలబస్ చదివారు. ఇంటర్ ఐఎస్సీలో చదివారు. డిగ్రీ చదివారు. ఎంబీఏ చేశారు. మాట్లాడితే నీ డిగ్రీ ఎక్కడ అని అడుగుతున్నారు. లోకేశ్ స్టాన్ఫర్డ్లో చదివాడట...ఆయన టెన్త్ క్లాస్, ఇంటర్ వివరాలు తీయమనండి. చదువు రాక నారాయణతో ట్రైనింగ్ ఇప్పించారు. సత్యం రామలింగరాజు వద్ద లంచంగా తీసుకుని అక్కడ ఫీజు కట్టారు. ఆ సీటు కూడా మెరిట్లో రాలేదు...డొనేషన్ కడితే అక్కడ సీటు వచ్చింది. దానికేదో లోకేశ్కు డాక్టరేట్ వచ్చినంత బిల్డప్లు ఇస్తున్నారు. అయినా ఎక్కడ చదివామనేది కాదు...సంస్కారం, బుద్ధి, నాయకత్వ లక్షణాలు ఎలా ఉన్నాయనేది ముఖ్యం. సొంత బలంతో జగన్ గారు 151 సీట్లు గెలుచుకున్నాడు...మా ఖర్మ లోకేశ్ ఆయనతో పోటీ పెట్టుకుంటాడు. ప్రజాస్వామ్యంలో సమాధానం చెప్పాలి కదా..? అదీ మా ఖర్మ ఏం చేస్తాం. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి అడ్డదారిలో లోకేశ్ మంత్రి అయ్యాడు. లోకేశ్ తన ఎమ్మెల్యే సీటు తాను గెలవలేడు..ఆయనకు మాతో పోటీ అట. ఆయన పాదయాత్ర చేస్తుంటే వైఎస్సార్సీపీ నాయకులు భయపడుతున్నారట..నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదు. ప్రశాంతతకి, ప్రశాంతి అత్తకి తేడా తెలియని వాడికి వైఎస్సార్సీపీ భయపడుతోందట... ఈ రోజు ఏదో సర్కస్లా లోకేశ్ పాదయాత్ర నడుస్తోంది...దాన్ని చూసి మాకు నిద్ర పట్టడం లేదనడం హాస్యాస్పదం. ఈ రోజు ధైర్యంగా ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్తున్నారు..గడచిన కాలంలో ఏనాడైనా జరిగిందా..? ఇంత ధైర్యంగా మేం జనం వద్దకు వెళ్తున్నామంటే వెనుకున్న జగన్ గారి బొమ్మ వల్ల..ఆయన చేసిన ప్రజారంజక పాలన వల్ల. మేనిఫెస్టో ఇచ్చి అదిరిందా తమ్ముళ్లూ..అంటున్నాడు..ఇదేమన్నా రికార్డింగ్ డాన్సా..?: జగన్ పథకాలు జిరాక్స్ తీసి ప్లస్ వన్ అని యాడ్ చేసుకుని మొన్న చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించారు. పక్క రాష్ట్రాల్లో ఇస్తున్న పథకాలను కాపీ కొట్టి ప్రకటిస్తాడు.. మళ్లీ అదిరిందా తమ్ముళ్లూ అంటాడు..అదేమన్నా రికార్డింగ్ డాన్సా అదిరిపోడానికి..? అక్కడున్న టీడీపీ వాళ్లే జగన్ గారే పథకాలే మనం చెప్తుంటే ఇక మనకెవరు ఓట్లు వేస్తారని అనుకున్నారట. అదే స్టేజ్ మీద కూర్చుని లోకేశ్ మాలోకం లెక్కలేస్తున్నాడట..ఇంత డబ్బు ఎలా తెస్తాం అని ఆందోళన చెందుతున్నాడట. ఖర్మ కాలి అధికారంలోకి వస్తే లక్ష కోట్లు ఎక్కడనుంచి తెస్తాం అని చంద్రబాబును అడిగాడట. చంద్రబాబు పిచ్చోడా..ఇచ్చేదైతే కదా లెక్కలు కట్టడానికి అని లోకేశ్కి చెప్పాడట. వీళ్లు జగన్ గారి నిబద్ధతను, ఆయన్ను విమర్శించడం విడ్డూరంగా ఉంది. పనీ పాటా లేకుండా బూతులు మాట్లాడుకుంటూ కాలం గడుపుతున్నారు. మా నాయకుడిపై వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకునేదే లేదు: అనైతికంగా జగన్ గారిని, భారతి రెడ్డి గారిని ఏది నోటికొస్తే అది మాట్లాడతున్నారు. ధైర్యముంటే చెప్పండి...ఈ పథకం ఇవ్వలేదని, ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయాడని చెప్పగలరా..? మెరుగైన రాజకీయం కోసం ఒక్క సలహా ఇవ్వలేరు. కేవలం తమ చేతిలో మీడియా సంస్థలు ఉన్నాయంటే ఎలా పడితే అలా మాట్లాడటం, అభూత కల్పనలుచేయడం టీడీపీ వారికి అలవాటుగా మారింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చి వాళ్లు కాదు. ఎవరేం చేస్తున్నారో అన్నీ చూస్తున్నారు. ఒక్క తొమ్మిది నెలలు ఆగండి...151 కాదు ఈసారి 175 సీట్లు జగన్ గారు కైవసం చేసుకుంటారు. అప్పుడే వీళ్లకి బుద్ధి వస్తుంది...అప్పటి వరకూ వీళ్ల బతుకులు ఎవరూ మార్చలేరు. జగన్పై, ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. ప్రతి కార్యకర్త స్పందిస్తాడు. వయసు పెద్దదైంది..గౌరవంగా బతకండి...రేపు ఎన్నికల తర్వాత ఎలాగూ రిటైర్ అవుతారు. కనీసం రిటైర్మెంట్ అయ్యేటప్పుడైనా గౌరవంగా అవ్వండి అని ఉచిత సలహా ఇస్తున్నా. రాజకీయాల్లో వచ్చేటప్పుడు ఎంత గౌరవంగా వచ్చామో అంతే గౌరవంగా రిటైర్ అవ్వాలి. అలా జరగాలంటే అవతలి వారికి గౌరవం ఇస్తే మీకు గౌరవం దక్కుతుంది. మేం ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏముంది..?: రెండేళ్ల నుంచి ముందస్తు అనే చెప్తున్నారు. వాళ్లకి భయం పట్టుకుంది..వాళ్లకి కార్యకర్తలు నిలబడటం లేదు. ఇదిగో ఎన్నికలు వస్తున్నాయంటే ఆఫీసుల్లో జనం కనిపిస్తారని వారి భావన. అందుకే తమ పత్రికల్లో, టీవీల్లో వాళ్లే క్రియేట్ చేసి ముందస్తు రాగం పాడుతుంటారు. జగన్ ప్రధానిని కలవడానికి వెళ్లింది అనేక పథకాల గురించి.. పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై వెళ్లారు. ముఖ్యమంత్రి గారి కార్యాలయం కానీ, ప్రధాని కార్యాలయం కానీ...ఏమైనా చెప్పిందా. అసలు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలి..ప్రజలు ఐదేళ్లు పూర్తి విశ్వాసం జగన్ గారికి ఇచ్చారు. బ్రహ్మాండంగా ప్రభుత్వం నడుస్తోంది...ఖచ్చితంగా గెలుస్తామని ధీమా ఉన్న మాకు ముందస్తు ఎందుకు..? వారాహి యాత్ర మొదలు పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎంత మైనస్ అయ్యాడో వాళ్ల పార్టీ వాళ్లనే అడగండి. ఒక రోజు ముఖ్యమంత్రి అంటాడు..ఒక రోజు కాదంటాడు.. ఆ బూతులేంటి..ఒక రోజు పొత్తు అంటాడు..మరో రోజు లేదంటాడు. పవన్ కళ్యాణ్ ఏంటో, ఆయన విధానాలేంటో అర్ధం కాక వారి పార్టీ నాయకులే తలపట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎంత జనంలో తిరిగితే అంత క్లారిటీ ప్రజలకు వస్తుంది. -
విద్యపై ఏపీ ప్రభుత్వం కృషి అభినందనీయం
దాచేపల్లి: విద్యాభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం చేస్తోన్న కృషి అభినందనీయమని జర్మనీలోని బ్రాండెన్బర్గ్ మాజీ ఎంపీ, అట్ల్యాండ్స్బగ్ మాజీ మేయర్ డాక్టర్ గుజ్జుల రవీంద్ర అన్నారు. పల్నాడు జిల్లా నడికుడి మాజీ సర్పంచ్ బుర్రి విజయ్కుమార్రెడ్డి నివాసంలో రవీంద్ర దంపతులను గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి ఆదివారం కలిసి సన్మానించారు. అనంతరం విలేకరుల సమావేశంలో రవీంద్ర మాట్లాడారు. విద్యపై ఎంత ఖర్చు పెట్టినా ఎప్పటికీ వృథా కాదన్నారు. ఇప్పటికిప్పుడు ఫలితాలు రాకపోయినా రానున్న రోజుల్లో వచ్చే ఫలాలను ప్రజలు అనుభవిస్తారని చెప్పారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. పుట్టిపెరిగిన ఊరితోపాటుగా ఉమ్మడి ఏపీలో తమవంతు సామాజిక సేవ, విద్య, ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లోని జూబ్లిహిల్స్లో తమ ట్రస్ట్ ద్వారా అంగన్వాడీ అనే ప్రాజెక్ట్ను చేపట్టామని, ఏపీలో కూడా ఇటువంటి ప్రాజెక్ట్లు చేపడతామని వెల్లడించారు. రవీంద్ర సతీమణి, అట్ల్యాండ్స్బగ్ డిప్యూటీ మేయర్ గాబ్రియేల్ మాట్లాడుతూ..దేశంలోని మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించటం అభినందనీయమన్నారు. -
‘బీసీలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు దాడులు’
తాడేపల్లి: మాచర్లలో విధ్వంసానికి చంద్రబాబు నాయుడే కారణమని ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి స్పష్టం చేశారు. బాబు డైరెక్షన్లోనే బ్రహ్మారెడ్డి మాచర్లలో అలజడి సృష్టించారన్నారు. హత్యా రాజకీయాలను టీడీపీ నేతలు ప్రోత్సహిస్తున్నారని, బీసీలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని కాసు మహేష్రెడ్డి విమర్శించారు. చంద్రబాబు హయాంలో పల్నాడులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, సీఎం జగన్ పాలనలో పల్నాడుకి జిల్లా వచ్చిందన్నారు. మాచర్ల, గురజాల నియోజకవర్గాలను రూ. 4700 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారని విషయం ప్రజలు గ్రహించాలన్నారు. పులివెందులతో సమానంగా పల్నాడు అభివృద్ధి జరుగుతోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మహేస్రెడ్డి పేర్కొన్నారు. -
హత్యా రాజకీయాలను టీడీపీ నేతలు ప్రోత్సహిస్తున్నారు
-
ఎవరు చర్చకు వచ్చినా రెడీ.. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఓపెన్ సవాల్
సాక్షి, పిడుగురాళ్ల: గురజాల అభివృద్ధిపై చర్చకు నేను సిద్దమంటూ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఓపెన్ సవాల్ విసిరారు. కాగా, మహేష్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘2019-2022 మధ్య కాలంలో గురజాల అభివృద్ధి కోసం రూ.2,673 కోట్లు ఖర్చు చేశాము. టీడీపీతోపాటు ఏపార్టీ వచ్చినా చర్చకు రెడీ. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో గత 40 నెలలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. పల్నాడులోని గురజాల వెనుకబడ్డ ప్రాంతం. వైఎస్సార్ హయంలోనే ఇక్కడ అభివృద్ధి మొదలైంది. విద్య, వైద్య సదుపాయాలను మెరుగుపరిచాము. ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపేందుకు చర్యలు చేపట్టాము. టీడీపీ హయంలో ఒక్క పథకమైనా చేపట్టారా?’ అని ప్రశ్నించారు. -
గురజాల అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధం
-
గురజాల అభివృద్ధిపై ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి బహిరంగ సవాల్
-
లోకేష్ నోరు అదుపులో పెట్టుకో: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
-
లోకేష్ నోరు అదుపులో పెట్టుకో: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
సాక్షి, గుంటూరు: అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రభుత్వంపై టీడీపీ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అన్నారు. ఈ మేరకు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'సీఎం జగన్ పాలనలో పల్నాడు ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. అవినీతికి తావులేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇది ఓర్చుకోలేక టీడీపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలి. వార్డు మెంబర్గా కూడా లోకేష్ గెలవలేరు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు' అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. పల్నాడు ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దాచేపల్లి, గురజాల, పిడుగురాళ్ల రూపురేఖలు మారుతున్నాయి. రాబోయే కాలంలో పల్నాడు వెనుకబడిన ప్రాంతంగా ఉండదు. అభివృద్ధి చూసి ఓర్వలేక టీడీపీ కుటిల రాజకీయాలు చేస్తోంది. పల్నాడుకు టీడీపీ చేసిందేమీలేదు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టడమే టీడీపీకి తెలుసు అని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. చదవండి: (‘ఆ ప్రశ్నకు టీడీపీ నుంచి ఇంతవరకు సమాధానమే లేదు’) -
‘ఆ ప్రశ్నకు టీడీపీ నుంచి ఇంతవరకు సమాధానమే లేదు’
సాక్షి, గుంటూరు: యుద్ధాలు చేస్తాం, మీసాలు తిప్పుతాం, తొడలు చరుస్తాం అనే మాటలన్నీ టీడీపీ వాళ్లు సోషల్ మీడియాలో ప్రచారం కోసం చేసే చీప్ ట్రిక్స్ అని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. మున్సిపల్ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. 2019లో వైఎస్సార్సీపీ సత్తా ఏంటో చూపించాం. ప్రజలే నిర్ణయించారు మగాళ్లు ఎవరు.. మడత గాళ్లు ఎవరు అనేది. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చంద్రబాబు డబ్బులు పంపితే రేవంత్రెడ్డి పట్టుబడలేదా, అదేమైనా ప్రతపక్షాల కుట్రా..?. దాచేపల్లి పట్టణంలో చంద్రబాబు డబ్బులు పంపితే మద్యం పంచుతూ ఒకరిద్దరు టీడీపీకి చెందిన వ్యక్తులను అరెస్ట్ చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి సంబంధం..?. దాచేపల్లి పట్టణానికి తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చెప్పాలి అని ప్రశ్నిస్తే ఇంతవరకు జవాబు లేదు. దమ్ము, ధైర్యం గురించి టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. దమ్ము ధైర్యం పుష్కలంగా ఉండబట్టే కదా 2019లో పోరాటాలు చేసి గెలిచింది. రాష్ట్రంలో ఏ ఎలక్షన్కి వెళ్లిన వైఎస్సా్ర్సీపీనే గెలుస్తుంది అంటే ప్రజల మనసుల్లో మా పార్టీ పదిలంగా ఉంది అని అర్థం. 1996 నుంచి ఎన్నికల్లో డబ్బులు పంచే సంస్కృతిని చంద్రబాబే తీసుకువచ్చాడు. డబ్బులు పంచే సంస్కృతి ఈ రోజు యావత్తు రాష్ట్రాన్ని దహించివేస్తుంది. మేము పట్టుబట్టి దాచేపల్లి, గురజాలని మున్సిపాల్టీలుగా చేశాం. తెలుగుదేశం నాయకులు కోర్టులకు వెళ్లి ఎన్నికలు ఆపాలని చూశారు. ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు' అంటూ కాసు మహేష్రెడ్డి మండిపడ్డారు. చదవండి: (అసలు లోకేష్కు ఎయిడెడ్ విద్యాసంస్థలంటే ఏంటో తెలుసా..?: ఆదిమూలపు సురేష్) -
అలాంటి ఫలితాలే రానున్నాయి: కాసు మహేష్రెడ్డి
-
అలాంటి ఫలితాలే రానున్నాయి: కాసు మహేష్రెడ్డి
సాక్షి, గుంటూరు: గురజాల నియోజకవర్గంలో టీడీపీ చేయలేని అభివృద్ధిని 30 నెలల్లోనే తాము చేసి చూపించామని వైఎస్సార్సీపీ కాసు మహేష్రెడ్డి అన్నారు. టీడీపీ హయాంలో పిడుగురాళ్లలో ఒక్క ఇంటికైనా కుళాయి ద్వారా నీళ్లిచ్చారా అంటూ ఆయన ప్రశ్నించారు. గురజాల, దాచేపల్లిని నగర పంచాయతీలుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో గురజాల, దాచేపల్లి నగర పంచాయతీల్లో అలాంటి ఫలితాలే రానున్నాయన్నారు. గురజాల, దాచేపల్లి గ్రామాలను పట్టణాలుగా చేయాలనేది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షగా మహేష్రెడ్డి పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో ఉన్నతమైన పట్టణాలుగా తీర్చిదిద్దుతామన్నారు. టీడీపీ హయాంలో ఈ ప్రాంతాల అభివృద్ధికి ఏం చేశారో ఆ పార్టీ నేతలు చెప్పాలని ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి డిమాండ్ చేశారు. -
ఆయనెవరో నాకు తెలీదు.. చంపితే మాకేం వస్తుంది!
సాక్షి, గుంటూరు : దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను నడిరోడ్డుపైన హత్య చేసిన చరిత్ర చంద్రబాబుదని గురజాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనలో జరిగిన హత్యలన్ని ఆయన ప్రేరేపించాడని భావించాలా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం శవ రాజకీయాలు చేయటం మంచిది కాదని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంగళవారం జిల్లాలో మాట్లాడుతూ.. తెలుగుదేశం నాయకుడు అంకులు హత్యపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారని తెలిపారు. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారని, విచారణలో అసలు విషయాలు బయటపడతాయని పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కఠినంగా ఉన్నారని, తెలుగుదేశం నాయకుడు అంకులు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఇప్పటి వరకు నేను ఆయనను చూడలేదన్నారు. ఆయన్ను చంపితే మాకేం వస్తుందని, ఈ హత్య కేసులో ఎంతటి వారున్నా కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. చదవండి: కూల్చే సంస్కృతి టీడీపీదే: జయరామ్ తెలుగుదేశం నాయకులు శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన ఇంత గొప్పగా ఉంటుందని తెలుగుదేశం నాయకులు ఊహించలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజల దృష్టి మళ్లించడానికే టీడీపీ శవ రాజకీయాలు, దేవాలయాలపై దాడులు చేపిస్తోందన్నారు. యరపతినేని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నాలుగైదు హత్యలు జరిగాయని, అంటే వాటిని ఆయన చేయించాడా అని సూటిగా ప్రశ్నించారు. యరపతినేని నరేంద్ర హత్య కేసులో ముద్దాయి అన్న సంగతి మర్చిపోయాడా అని నిలదీశారు. కాగా గుంటూరు జిల్లాలో టీడీపీ నేత, మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులు ఆదివారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. -
అభివృద్ధి పథంలో గురజాల
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయి. గురజాల నియోజకవర్గంలో కూడా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి ప్రజా సమస్యలకు పరిష్కార మార్గం చూపేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన చేపడుతున్న పనులకు విశేష ఆదరణ లభిస్తోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నియోజకవర్గానికి ఆసుపత్రితో కూడిన వైద్య కళాశాల, పిడుగురాళ్లలో ప్రతి ఇంటికీ త్రాగునీరు, గ్రామాల్లో సీసీ రోడ్లు.. వంటి పథకాలు మంజూరు అయ్యేలా చేశారు. ఇలా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆయన చేస్తున్న కృషిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న జననేత సీఎం వైఎస్ జగన్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సొంత ఇల్లు లేని 19 వేల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నట్టు తెలిపారు. ► రూ. 350 కోట్లతో ఆసుపత్రితో కూడిన వైద్య కళాశాల.. తన అదే బాట కార్యక్రమంలో భాగంగా కాసు మహేష్రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ఒక గర్భిణీ కాన్పు కొరకు సుమారు 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందడం ఆయనను కలచివేసింది. ఆ సమయంలో ఆయన మదిలో మెదిలిన ఆలోచనే ఈ ఆసుపత్రి తో కూడిన వైద్య కళాశాల. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పల్నాడు లోని ఏ ఒక్కరూ వైద్యం అందక ఇబ్బంది పడకూడదనే కృత నిశ్చయంతో తన మొదటి ప్రాధాన్యత క్రింద ఈ విషయాన్ని జననేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం వైఎస్ జగన్.. మొదటి బడ్జెట్లోనే నిధులు మంజూరు చేయడమే కాక, పరిపాలనా పరమైన అన్ని ఆమోదాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి శ్రావణ మాసంలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా భూమి పూజ చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ► రూ. 2650 కోట్లతో 7 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి తాగునీరు.. మహేష్రెడ్డి ఆయన తాత దివంగత సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి నమ్మిన జలం జనానికి జీవనమనే సిద్ధాంతాన్ని అనుసరించి ముందుకు సాగుతున్నారు. పశ్చిమ గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల కోసం బ్రహ్మానందరెడ్డి సాధించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు సాగునీరు అందించే విషయంలో సఫలీకృతం అయింది. అయితే త్రాగునీరు విషయంలో పల్నాడు నియోజకవర్గాలైన మాచర్ల, గురజాలతోపాటు వినుకొండ, చిలకూరిపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుండటంపై మహేష్రెడ్డి దృష్టిసారించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ.. మహేష్రెడ్డి ఇందుకు సంబంధించి తానే స్వయంగా ఒక ప్రణాళిక రూపొందించారు. నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలతోపాటు మిగిలిన ఆరుగురు శాసససభ్యులను కలుపుకుని ఈ సమస్యను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా సమస్య తీవ్రతను వివరించి సీఎం జగన్ అభినందనలు కూడా పొందారు. అలాగే తాను కోరిన పథకానికి కావాల్సిన ఆర్థిక, పరిపాలన పరమైన అన్ని అనుమతులు అందుకున్నారు. ► రూ. 34 కోట్లతో డ్రెయినేజీ నిర్మాణం.. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో రహదారుల తర్వాత మురుగు కాల్వల నిర్మాణం ప్రధానమైనది. ఈ నేపథ్యంలో మురుగు నీటి వ్యవస్థ క్రమబద్దీకరణ ఆవశ్యకతను మహేష్రెడ్డి గుర్తించారు. రహదారి నిర్మాణం జరిగే ప్రతి చోటా రహదారి ఇరువైపుల మురుగు నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు కాల్వల నిర్మాణం కొరకు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ వారితో అంచనాలు తయారు చేయించారు. రూ. 34 కోట్లతో అవసరమైన ప్రతి గ్రామంలో మురుగు నీటి పారుదల వ్యవస్థ ను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తున్నారు. ► రూ. 140 కోట్లతో పిడుగరాళ్ల పట్టణంలో ప్రతి ఇంటికి తాగునీరు.. మహేష్రెడ్డి తండ్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మంత్రిగా ఉన్న కాలంలో పిడుగురాళ్ల నగర పంచాయతీగా మార్పు చెందింది. అయితే పిడుగరాళ్ల పట్టణంలోని ప్రజలు త్రాగునీరు కొరకు విపరీతమైన ఇబ్బందులు పడటాన్ని తన అదే బాట కార్యక్రమంలో మహేష్రెడ్డి ప్రత్యక్షంగా గమనించారు. ఈ విషయంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, ముఖ్యంగా తాగునీరు తెచ్చుకునే సమయంలో మహిళలు పడుతున్న అవస్థలను సీఎం వైఎస్ జగన్కు మహేష్రెడ్డి వివరించారు. దగ్గరలోని బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి నేరుగా పిడుగురాళ్ల పట్టణానికి త్రాగు నీరందించే పథకానికి యుద్ధ ప్రాతిపదికన అంచనాలు తయారు చేయించి వాటికి సీఎం జగన్ను మెప్పించారు. రెండవ అసెంబ్లీ సమావేశాల్లోనే నిధులు మంజూరు చేయించడమే కాకుండా త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పనులు ప్రారంభ కార్యక్రమం జరపటానికి ప్రయత్నం చేస్తున్నారు. ► రూ. 55 కోట్లతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం.. గత ప్రభుత్వం గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను అందించటం లో పూర్తిగా విఫలమైన విషయాన్ని తన అదే బాట కార్యక్రమంలో కాసు మహేష్రెడ్డి నిశితంగా గమనించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ అంతర్గత రహదారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన ప్రతి గ్రామంలో.. కులాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా 55 కోట్ల రూపాయలతో అంతర్గత రహదారుల నిర్మాణానికి అంకురార్పణ చేయటం జరిగింది. ► మున్సిపాలిటీలుగా గురజాల, దాచేపల్లి గ్రామాలు గురజాల, దాచేపల్లి ప్రజల చిరకాల కోరిక ఆ రెండు గ్రామాలు మున్సిపాలిటీలుగా మార్పు చెందటం. ఈ మేరకు తన ఎన్నికల ప్రచారంలో కాసు మహేష్రెడ్డి ఆ రెండు గ్రామాలను మున్సిపాలిటీలుగా మారుస్తానని వాగ్దానం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సహకారంతో గురజాల, దాచేపల్లి గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చటం ద్వారా కాసు మహేష్రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆ రెండు గ్రామాల ప్రజల ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు కారణమయ్యారు. -
లక్ష్మీనారాయణా.. సమాధానం చెప్పు
సాక్షి, తాడేపల్లి: కరోనాపై ప్రతిపక్ష నేత చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుందన్నారు. చంద్రబాబుకు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వత్తాసు పలకడం బాధాకరమన్నారు. చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలకు ఎల్లో మీడియా వంత పాడుతుందని ధ్వజమెత్తారు. కరోనా టెస్ట్ కిట్లు కొనుగోలు వ్యవహారంలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కన్నా ఆరోపణలు అర్థ రహితమన్నారు. (కోవిడ్-19 ఎఫెక్ట్పై షాకింగ్ సర్వే) కన్నా సమాధానం చెప్పాలి.. ఎటువంటి లోపాలకు తావివ్వకుండా ప్రభుత్వం ముందుకెళ్తుందని మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా నివారణకు ప్రభుత్వం చర్యలను కేంద్రం, జాతీయ మీడియా ప్రశంసించాయని చెప్పారు. కిట్ను రాష్ట్రం రూ.730కి కొంటే.. కేంద్రం రూ.790కి కొనుగోలు చేసిందన్నారు. దీనిపై కన్నా లక్ష్మీనారాయణ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కన్నా, టీడీపీ నేతలు ఒకే విధంగా విమర్శలు చేస్తున్నారని.. వారితో కలిసి కన్నా లక్ష్మీనారాయణ ప్రెస్ మీట్ పెడితే బాగుండేదని ఎద్దేవా చేశారు. ఆత్మ పరిశీలన చేసుకోవాలి.. విమర్శలు చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన హితవు పలికారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నామని పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు వాలంటీర్ల వ్యవస్థ తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తోందని తెలిపారు. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. -
కన్నా ఆరోపణలు అర్ధ రహితం
-
దాచేపల్లిలో కరోనా కలకలం; 144 సెక్షన్ అమలు
సాక్షి, దాచేపల్లి(గురజాల): దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో కరోనా కలకలం రేపింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహామ్మరి దాచేపల్లికి కూడా తాకటంతో ప్రభుత్వ అధికారులు అప్రమత్తం అయ్యారు. నగర పంచాయతీ పరిధిలోని నారాయణపురానికి చెందిన ఓ వ్యక్తి కొంతకాలంగా టీబీ వ్యాధితో బాధపడుతూ కరోనా లక్షణాలతో మృతిచెందినట్లుగా అధికారులు వెల్లడించారు. దీంతో మృతిచెందిన వ్యక్తి నివసించే వీధితో పాటుగా సమీపంలోని వీధుల్లో పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ►పోలీసులు, రెవెన్యూ అధికారులు ఈ ప్రాంతాన్ని రెడ్జోన్గా ప్రకటించి 144 సెక్షన్ విధించారు. ►ఈ ప్రాంతంలో ఎవరూ రాకపోకలు సాగించకుండా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ వీధుల్లోకి రావొద్దంటూ ఎవరి వీధి వద్ద వారు ముళ్లకంచెను అడ్డుగా వేసుకున్నారు. ►రెడ్జోన్ ప్రాంతంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని యంత్రం ద్వారా పిచికారీ చేయించారు. వీధుల్లో బ్లీచింగ్ చల్లించారు. రెడ్జోన్ ప్రాంతంలో ప్రజలు వీధుల్లోకి రావద్దని మైక్ ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. ►కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో గురజాల నియోజకవర్గంలో నేటి నుంచి లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నామని శాసనసభ్యుడు కాసు మహేష్రెడ్డి స్పష్టం చేశారు. లాక్డౌన్ అమలుపై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కాసు పాల్గొన్నారు. చదవండి: మీ వ్యూహంతో ముందుకు సాగుతాం నారాయణపురంలో కరోనాతో మృతిచెందిన వ్యక్తి ఇంటికి వెళ్లే వీధి నిర్మానుష్యంగా ఉన్న దృశ్యం ►నియోజకవర్గంలో పోలీసులు, రెవెన్యూ యంత్రంగం, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్నారని, వారికి పాదాభివందనం చేసినా రుణం తీర్చుకోలేమన్నారు. లాక్డౌన్ కఠినతరం చేస్తున్న నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని ఆయన చెప్పారు. ►దాచేపల్లిలో మృతుడు ఎవరెవరిని కలిసాడో..ఏ ఏ గ్రామాలకు వెళ్లాడో అనే వివరాలు తెలుసుకుంటున్నామని, దీని తీవ్రత ఎంతవరకు ఉంటుందో పరిశీలన చేస్తున్నామని ఎమ్మెల్యే కాసు తెలిపారు. ►గ్రామాల్లో వ్యవసాయ పనులు ఉండటం వలన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించారని, నేటి నుంచి 10 రోజుల పాటు కఠినంగా వ్యవహరించనున్నారని చెప్పారు. ►కరోనా వైరస్ తీవ్రత తగ్గేంతవరకు ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్వారంటైన్స్కు తరలింపు దాచేపల్లి(గురజాల): దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నారాయణపురంలో కరోనా పాజిటివ్ కేసు నమోదుకావటంతో ప్రభుత్వ అధికారులు అప్రమతం అయ్యారు.కరోనా లక్షణాలతో మృతిచెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడారు. మృతిచెందిన వ్యక్తి బయట సన్నిహితంగా ఉండే వ్యక్తుల వివరాలను ఆరా తీసి తెలుసుకున్నారు. కరోనా లక్షణాలతో మృతిచెందిన వ్యక్తి 13మందితో ప్రాథమికంగా సన్నిహితంగా ఉన్నట్లుగా, మరో 34 మందితో కూడా సన్నిహితంగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించి తెలుసుకున్నారు. వీరిలో 13మందిని కేఎల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి, మరో 34మందిని దాచేపల్లి ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. మృతిచెందిన వ్యక్తి ఇంటి పరిసరాలతో పాటుగా పలు వీధుల్లో రెడ్జోన్గా ప్రకటించి పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. చదవండి: కరోనా ఎఫెక్ట్: నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కాల్చివేత -
టీడీపీ నేతలకు అభ్యతరం ఏంటి..?
-
ఎంత రెచ్చగొట్టిన సరే సంయమనం పాటిస్తాం
-
దివ్యాంగుడిని కార్లతో గుద్ది వెళ్లిపోయారు
సాక్షి, తాడేపల్లి: పల్నాడుపై చంద్రబాబు కక్ష్య పెట్టుకున్నారని గురజాల ఎమ్మెల్యే కాసు మషేశ్రెడ్డి అన్నారు. పల్నాడుకు బోండా ఉమ, బుద్దా వెంకన్న ఎందుకు వచ్చారు? గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకులే లేరా? అని వరుస ప్రశ్నలు సంధించారు. ఇక్కడ ఉద్రిక్తతలు పెంచడానికి బాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బుద్దా వెంకన్న, బోండా ఉమతో పాటు పల్నాడుకు బాబు రౌడీలను పంపారని విమర్శించారు. కనీసం వచ్చే ముందు పోలీసులకు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. అంతేకాక దివ్యాంగుడిని కార్లతో గుద్ది వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (‘మొహం చెల్లదనే బాబు వారిని రప్పించారు’) టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అది తట్టుకోలేక ఎన్నికలను ఆపాలని చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకడం లేదు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి ఇప్పటినుంచే బాబు సాకులు వెతుక్కుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు బాబు ఎందుకు ఎన్నికలు పెట్టలేదు. పల్నాడును ఎందుకు అభివృద్ధి చేయలేదు. బాబు చిల్లర రాజకీయాలు మానుకోవడం లేదని.. ఆయన ప్రస్తుతం ఓడిపోతామన్న ఫ్రస్టేషన్లో ఉన్నారు’ అని మహేశ్రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (టీడీపీ అరాచకాలను ఆధారాలతో నిరూపిస్తాం : కాసు) -
రంకేసిన గుంటూరు జిల్లా ఎద్దులు
సాక్షి, సత్రశాల (రెంటచింతల): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా సత్రశాలలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానం సమీపంలోనున్న అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య, భక్త మల్లారెడ్డి అన్నదాన సత్రంలో నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో గుంటూరు జిల్లా ఎద్దులు రంకేశాయి. మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి ఆధ్వర్యంలో జరిగే పోటీల్లో భాగంగా 6వ రోజు గురువారం రెండు పళ్ల విభాగంలో నిర్వహించిన పోటీల్లో మొత్తం 12 జతల గిత్తలు పాల్గొన్నాయి. రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామానికి చెందిన అరిగెల కార్తీక్ నాయుడు, రమ్యనాయుడు గిత్తలు 4,800 అడుగుల దూరం లాగి మొదటి బహుమతి రూ.20వేలను కైవసం చేసుకున్నాయి. నకరికల్లు మండలం కుంకనగుట్ల గ్రామానికి చెందిన బల్లగిరి వెంకటేశ్వర్లు ఎడ్లు 4,690.2 అడుగుల దూరం లాగి 2వ బహుమతి రూ.15 వేలను దక్కించుకున్నాయి. ఫిరంగిపురం మండలం తక్కెలపాడు గ్రామానికి చెందిన యేరువ శ్రీనివాసరెడ్డి, అమరావతి మండలం అత్తలూరు గ్రామానికి చెందిన నెట్టం గీతా చౌదరి కంభైడ్ ఎడ్లు 4,658.5 అడుగుల దూరం లాగి 3వ బహుమతి రూ.10వేలను కైవసం చేసుకున్నాయి. చేబ్రోలు మండలం తోటపాలెం గ్రామానికి చెందిన రామినేని రత్తయ్య ఎడ్లు 4,642.11 అడుగుల దూరం లాగి 4వ బహుమతి రూ.8 వేలను గెలుచుకున్నాయి. రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామానికి చెందిన రాయ రామిరెడ్డి గిత్తలు 4,553 అడుగుల దూరం లాగి 5వ బహుమతి రూ.5 వేలను దక్కించుకుంది. పోటీలను అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య, భక్త మల్లారెడ్డి అన్నదాన సత్రం అధ్యక్ష ఉపాధ్యక్షులు గుంటా పుల్లారెడ్డి, పులి ఓబుల్రెడ్డి, కమిటీ సభ్యులు యర్రెద్దు శ్రీనివాసరెడ్డి, గొట్టం రవీంద్రారెడ్డి, పత్తి కోటిరెడ్డి, దొండేటి వెంకటేశ్వరరెడ్డి, చింతా శివారెడ్డి, చేర్రెడ్డి కోటిరెడ్డి, పూర్ణచంద్రారెడ్డి, మందలపు వెంకటరెడ్డి పర్యవేక్షించారు. కొండు వెంకట్రామిరెడ్డి, పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ విభాగంలో రూ.20వేలను భాస్కర్రెడ్డి, రూ.15వేలను శ్రీనివాసరెడ్డి, రవీంద్రారెడ్డి, రూ.10వేలను లింగారెడ్డి, రూ.8వేలను అంజిరెడ్డి, రూ.5వేలను భాస్కర్రెడ్డి అందజేశారు. -
ఓట్ల కొనుగోలుకు ఆద్యుడు చంద్రబాబు
-
దాచేపల్లి, గురజాలకు మున్సిపాలిటీ హోదా
సాక్షి, దాచేపల్లి: దశాబ్దాల కల సాకరమైంది. దాచేపల్లి, గురజాల పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్న మున్సిపాల్టీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి మున్సిపల్ పరిపాలన శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే దాచేపల్లి, గురజాల పట్టణాలకు మున్సిపాల్టీలల హోదాను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది . ఎన్నికల సమయంలో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి దాచేపల్లి, గురజాల పట్టణాలకు మున్సిపాల్టీ హోదాను కల్పిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి ప్రజల కలను నిజం చేశారు. దాచేపల్లి, నడికుడి జంట గ్రామాలను కలిసి దాచేపల్లి మున్సిపాల్టీగా, గురజాల, జంగమహేశ్వరపురం గ్రామాలను కలిసి గురజాల మున్సిపాల్టీలుగా రూపాంతరం చెందనున్నాయి. మున్సిపాల్టీల ఏర్పాటుతో పాటు అందుకు అవసరమైన సిబ్బంది, కార్యాలయం, ఫర్నిచర్తో ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపాల్టీలతో అభివృద్ధి.. దాచేపల్లి, గురజాల పట్టణాలను మున్సిపాల్టీలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ గత దశాబ్దాల నుంచి వినిపిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు మున్సిపాల్టీలుగా మారుస్తున్నామని గొప్పలు చెప్పారే తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు. అయితే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పల్నాడు అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడగానే నియోజకవర్గానికి రూ.66 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేశారు. ఆ తర్వాత తంగెడ, మాచవరం గ్రామాల పరిధిలో ఎత్తిపోతల నిర్మాణాలకు రూ.188 కోట్ల ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. దాచేపల్లి, నడికుడి, గురజాల, జంగమహేశ్వరపురంలో ఉన్న జనాభా, భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక, మానవ వనరులను పరిగణలోకి తీసుకుని దాచేపల్లి, గురజాల పట్టణాలను మున్సిపాల్టీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మున్సిపాల్టీలు ఏర్పడితే ప్రతి రోజు పూర్తిస్థాయిలో పారిశుద్ధ్యం, ఇంటింటికి కుళాయి ద్వారా తాగునీరు అందుతాయి. మున్సిపాల్టీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకంగా నిధులు వస్తాయి. తమ కల ఇన్నాళ్లకు నెరవేరతుండటంతో దాచేపల్లి, గురజాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే పిడుగురాళ్ల మున్సిపాల్టీగా ఉండటంతో తాజాగా దాచేపల్లి, గురజాల పట్టణాలు కూడా ఆ జాబితాలో చేరనున్నాయి. -
‘మొహం చెల్లదనే బాబు వారిని రప్పించారు’
సాక్షి, గుంటూరు : పల్నాడు ప్రాంతంలో శాంతిభద్రతల సమస్య సృష్టించి హింసను ప్రోత్సహించడమే చంద్రబాబు ఉద్దేశంగా ఉందని వైఎస్సార్సీపీ గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో పల్నాడులో ఒక్క పనైనా చేశారా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతం గురించి బాబుకు ఏం తెలుసని అన్నారు. వైఎస్సార్ హయాంలోనే పల్నాడు అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. ఇసుక, మట్టి, మైనింగ్, గంజాయి సహా.. అసెంబ్లీ ఫర్నీచర్ను కూడా టీడీపీ నేతలు వదల్లేదని ఎద్దేవా చేశారు. గుంటూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కాసు మహేశ్రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నంబూరి శంకర్రావు, ఎంపీ కృష్ణదేవరాయలు మీడియాతో బుధవారం మాట్లాడారు. ప్రీగా వచ్చిందని ఫినాయిల్ కూడా వదలకుండా దోచుకున్నారని మహేశ్రెడ్డి చురకలంటించారు. పల్నాడు నాయకులు వస్తే మొహం చెల్లదని ఇతర జిల్లాల నేతల్ని తెచ్చారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ పాలనలో పల్నాడు ప్రశాంతంగా ఉందని వెల్లడించారు. మూడేళ్లలో జమిలి ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు కొత్త నాటకం ఆడుతున్నారని విమర్శించారు. ‘3 నెలల్లో ఎన్నికలు వచ్చినా మేం సిద్ధమే. గత ఎన్నికల్లో ఓడినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు’అన్నారు. ఒక్కసారి కూడా రాలేదు.. ఇప్పుడేమో.. పల్నాడులో ఏం హింస జరుగుతోందో చర్చకు రావాలని వైఎస్సార్సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. గంతంలో చంద్రబాబు ఒక్కసారి కూడా ఈ ప్రాంతానికి రాలేదని, ఇప్పుడేమో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజల్ని కోరారు. టీడీపీ హయాంలో పల్నాడు ప్రాంతం వెనుకబడిందని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు అన్నారు. నేడు పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వెల్లడించారు. ఫ్యాక్షన్ గ్రామాల్లో కూడా ప్రశాంత వాతావరణ నెలకొందని తెలిపారు. అంబటి, గోపిరెడ్డిపై దాడులు చేశారు.. 3 నెలల సీఎం జగన్ పరిపాలనలో అభివృద్ధి జరుగుతోందని, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఎంపీ కృష్ణదేవరాయలు చెప్పారు. గురజాల, సత్తెనపల్లి ప్రాంతాల్లో హింసను ప్రేరేపించింది టీడీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డిపై దాడులకు తెగబడ్డారని గుర్తు చేశారు. అయినా, లేని సంక్షోభాన్ని టీడీపీ నేతలు క్రియేట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గుంటూరు జిల్లాకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు మాతో పాటు ప్రతి గ్రామానికి రావాలి. ప్రతి గ్రామంలో జరిగిన అన్యాయాన్ని చూద్దాం. ఎవరు ఎవరిపై దాడి చేశారో ప్రజలే నిర్ణయిస్తారు’అన్నారు. -
టీడీపీ అరాచకాలను ఆధారాలతో నిరూపిస్తాం : కాసు
సాక్షి, గుంటూరు : టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొడతామన్నారు. వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన ‘ఛలో ఆత్మకూరు’ను విజయవంతం చేస్తామని చెప్పారు. బుధవారం ఉదయం 11 గంటలకు తాము ఆత్మకూరుకు చేరుకుంటామని తెలిపారు. చంద్రబాబు కథ తేలుస్తామని వ్యాఖ్యానించారు. అలాగే టీడీపీ నేతలతో ఇబ్బందులు పడిన తమ కార్యకర్తలు, ప్రజలతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు ఆత్మకూరు వెళ్లేందుకు పయనమవుతున్నారు. బుధవారం ఉదయం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ఆత్మకూరు బయలుదేరేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ప్రశాంతంగా ఉన్న పల్నాడులో గందరగోళ పరిస్థితులు సృష్టించవద్దని వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు హితవు పలికారు. చదవండి : బాధితులంతా రావాలి; మేం కూడా ‘ఛలో ఆత్మకూరు’ చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తల షాక్ -
ఆ కేసులపై పునర్విచారణ చేయిస్తాం : మంత్రి సుచరిత
-
‘ఆ కేసులపై పునర్విచారణ చేయిస్తాం’
సాక్షి, గుంటూరు : గత ఐదేళ్లలో టీడీపీ నేతలు రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు సృష్టించారని, అక్రమ కేసులు పెట్టి ఎంతోమందిని వేధించారని హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. అక్రమ కేసు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శనివారం ఆమె పల్నాడులోని పిడుగురాళ్ల వాసవీ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘చంద్రబాబు ప్రభుత్వ బాధితుల సమావేశా’నికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ... గత టీడీపీ పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయన్నారు. దేశంలో ఎక్కడ లేని అరాచకాలు, దారుణాలు పల్నాడులో జరిగాయన్నారు. అధికారం పోయాక వారి అరాచకాలు ఒక్కొక్కటి భయటకు వస్తుండడంతో ఎదురుదాడి ప్రారంభించారని ఆరోపించారు. పెయిడ్ ఆర్టీస్టులతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ధర్నాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలన రాక్షస పాలనకు నిదర్శమన్నారు. యరపతినేతి, కోడెల అక్రమాలను చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. అక్రమ కేసు బాధితులకు అండగా ఉంటామని, ఆ కేసులపై పనర్విచారణ చేయిస్తామని మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ బాధితలందరికి న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చంద్రబాబు అందుకు సిద్ధమా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వంద రోజుల పాలన ప్రశాంతంగా సాగిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. దానిని ఓర్చుకోలేకనే టీడీపీ నేతలు వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పల్నాడుకు వస్తే వాస్తవాలు ఏంటో తెలుస్తాయన్నారు. తాను ఒక్కడినే వచ్చి ఇక్కడి పరిస్థితిని చంద్రబాబుకు చూపిస్తానన్నారు.ఎక్కడికైనా చర్చకు సిద్ధమని, చంద్రబాబుకు అందుకు సిద్ధమా అని సవాలు విసిరారు. -
‘కోడెలను బాబు ఎందుకు పరామర్శించలేదు?’
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు నిరసనగా రేపు గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్లలో టీడీపీ బాధితులు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి హోంమంత్రి మేకతోటి సుచరితతో సహా పల్నాడు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నాయకులు దాడులకు దిగుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. రౌడీ షీటర్లను కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగే విధంగా టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడం దారుణమన్నారు. మాజీ స్పీకర్ కోడెల్ శివప్రసాద్కు గుండెపోటు వస్తే చంద్రబాబు నాయుడు ఎందుకు పరామర్శించలేదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలను పరామర్శించలేని చంద్రబాబు తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లిచ్చి ప్రజలు ఓట్లతో దాడి చేసినా చాల్లేదా? అని ఎద్దేవా చేశారు. కోడెల శివప్రసాద్, యరపతినేని శ్రీనివాసరావు అక్రమాలపై చంద్రబాబు నాయుడు నోరెందుకు మెదపడంలేదని ఎమ్మెల్యే కాసు మహేష్ ప్రశ్నించారు. తనపై దాడిచేయాలని చంద్రబాబు ప్రణాళిలకు రచించడం హాస్యాస్పదమన్నారు. -
టీడీపీ పాలనలో అవినీతి, అక్రమాలే!
సాక్షి, గుంటూరు: పల్నాడు ప్రాంతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు చూసినా అవినీతి, అక్రమాలు, కరువు రాజ్యమేలాయని వైఎస్సార్ సీపీ గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. గుంటూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పల్నాడులో దుస్థితి ఏ రాష్ట్రంలో లేదని చంద్రబాబు చెబుతున్న మాటలు చూస్తే నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 1994 నుంచి 2004 మధ్య కాలంలో నక్సలైట్ల సమస్యతో ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. కొడవలి పట్టుకొని తిరగాల్సిన చేతులు, తుపాకులు పట్టుకుని తిరిగే దుస్థితి వచ్చిందన్నారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేయని అకృత్యాలు లేవన్నారు. అక్రమ మైనింగ్, పేకాట క్లబ్లు, నకిలీ విత్తనాలు, కల్తీ మద్యం, లైంగిక దాడులు వంటి ఎన్నో దురాగతాలు జరిగాయన్నారు. వీటిపై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధించిన విషయాన్ని గుర్తు చేశారు. గురజాలలో పిచ్చికుక్కపై రాయి వేస్తే దాడి జరిగినట్లు కేసులు పెట్టారని, 70 ఏళ్ల వృద్ధులపై కూడా లైంగిక దాడి కేసులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. వై.ఎస్.జగన్ పాలనలో సంతోషం.. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో ఇప్పుడు పల్నాడు ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కృష్ణమ్మ పరవళ్లు తొక్కి ప్రాజెక్టులు అన్నీ నిండాయని, దీంతో రైతులు, రైతు కూలీలు, వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. గురజాలలో మెడికల్ కళాశాల, గురజాల, దాచేపల్లిని మున్సిపాలిటీ చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ప్రతి ఇంటికి నీరు ఇచ్చే విధంగా రూ.500 కోట్లతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ హయాంలో ఒక్క మంచి పనైనా జరిగిందా అని ప్రశ్నించారు. కాసు బ్రహ్మానందరెడ్డి, వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని వివరించారు. బహిరంగ విచారణకు సిద్ధమా? ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అమరావతి, హైదరాబాద్లో కూర్చుని ఏవేవో మాటలు మాట్లాడుతున్నారని, పిన్నెల్లి, మోర్జంపాడు, తురకపాలెం గ్రామాలకు ఆయన రావాలని కోరారు. బహిరంగ విచారణకు సిద్ధమని, ఐజీతో పాటు, ఎస్పీ, పోలీసులు వస్తారని, గత ఐదేళ్ల పాలనలో, ప్రస్తుతం మూడు నెలల వైఎస్సార్ సీపీ పాలనలో ఏ పార్టీ వారు ఎవరిపై దాడిచేశారో గ్రామాల్లోకి వస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. పల్నాడులో అక్రమాలకు పాల్పడిన వారే గ్రామాలు విడిచి వెళ్లారని, దానిని మరిచి చంద్రబాబునాయుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. పల్నాడు ప్రాంతంలో ఎవరినీ భయపెట్టలేదని, మాకు హింసించే సమయం లేదని, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పినా ఆయన తీరులో మార్పు రాలేదన్నారు. టీడీపీ పాలనలో దొంగల్ని వదిలేశారు టీడీపీ పాలనలోనే అక్రమ మైనింగ్ జరిగినట్లు ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. 96 లక్షల మెట్రిక్టన్నుల ఖనిజాన్ని అక్రమ మైనింగ్ చేయలేదని, 34 లక్షల మెట్రిక్ టన్నుల తెల్ల సున్నపురాయిని మాత్రమే అక్రమ మైనింగ్ చేసినట్లు టీడీపీ ప్రభుత్వమే గుర్తించిందన్నారు. అయితే గత ప్రభుత్వం మాత్రం దొంగను పట్టుకోకుండా వదిలేసిందన్నారు. చంద్రబాబు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. త్వరలో అక్రమ మైనింగ్కు సంబంధించి దోషులను పట్టుకుని వడ్డీతో సహా వసూలు చేస్తామన్నారు. సీఐడీ సైతం అక్రమాలు జరిగాయని హైకోర్టుకు నివేదించినట్లు తెలుస్తోందన్నారు. -
కన్నాకు టీడీపీ అక్రమాలు కన్పించలేదా?
సాక్షి, గుంటూరు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కన్పించడంలేదని, రెండు నెలల క్రితం బీజేపీలో చేరిన టీడీపీ నాయకుల చెప్పుడు మాటలు వింటున్నారని గురజాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి విమర్శించారు. ఈ నెల 16వ తేదీన గురజాలలో కన్నాలక్ష్మీనారాయణ ధర్నా చేస్తామన్నారు. గురజాలలో ఎందుకు ధర్నా చేస్తున్నారో అర్థం కావడంలేదని, గత ప్రభుత్వంలో గురజాలలో సున్నపురాయి దోపిడీ జరుగుతుంటే అప్పుడు ఎందుకు ధర్నా చేయలేదని మండిపడ్డారు. ‘తెలుగుదేశం ప్రభుత్వం ఇష్టంవచ్చినట్లు అక్రమ కేసులు పెడితే ఎందుకు మాట్లాడలేదు. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అరాచకాలు చేస్తే ప్రశ్నించలేదు. ఇప్పటికైనా స్థానిక బీజేపీ నాయకుల ద్వారా నిజాలు తెలుసుకోవాలని’ కన్నాకు సూచించారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ మైనింగ్, అక్రమ గ్రానైట్, నకిలీ విత్తనాలు, గంజాయి, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలు ఇప్పుడు జరగకుండా అదుపు చేశాం. గడచిన 3 నెలల్లో గురజాలలో శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చామన్నారు. 2 నెలల క్రితం టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వారి మాటలు వింటే పచ్చ కామెర్ల వారికి అంత పచ్చగానే కనపడుతుందనేలాగే ఉంటుందని ఎద్దేవాచేశారు. చంద్రబాబు నాయుడు తన పార్టీ వారిని బీజేపీలోకి పంపి మళ్ళీ 3సంవత్సరాల తర్వాత టీడీపీలో చేర్చుకుంటారని తెలిపారు. చంద్రబాబు ఉద్దేశం బీజేపీ భుజాలపైన గన్ను పెట్టి వైఎస్సార్సీపీపై దాడిచేయాలని, ఇప్పటికైనా బీజేపీ నాయకులు టీడీపీ దుర్మార్గాలను గ్రహించాలని సూచించారు. గతంలో ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తుంటే చంద్రబాబు అక్రమ కేసులు పెట్టించారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ధర్నా చేసే వారికి ప్రొటెక్షన్ కల్పించమని పోలీసు అధికారులకు సూచిస్తుంది అని పేర్కొన్నారు. -
ప్రజలు అన్నం అడిగితే ప్రభుత్వం బిర్యానీ పెట్టింది
-
‘హామీల అమలు దిశగా అడుగులు’
సాక్షి, అమరావతి: పల్నాడు ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రకటించడం అభినందనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకంలో నడవడం ఖాయమని అభిప్రాయపడ్డారు. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీలో తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై వైఎస్సార్సీపీ నేతలతో సహా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన ఉద్దానం ప్రాంతంకు బడ్జెట్లో సరైన ప్రాధాన్యత ఇచ్చారని పలాస ఎమ్మెల్యే డాక్టర్ అప్పల రాజు సంతోషం వ్యక్తం చేశారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చర్యలు అభినందనీయమన్నారు. తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతానికి పునర్ నిర్మాణం దిశగా ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. జీడి, మామిడి, అరటి, కొబ్బరి పంటలకు మంచి కేటాయింపులు చేశారన్నారు. పేద ప్రజలను, వెనుకబడిన ప్రాంతాలను ఆదుకునే విధంగా బడ్జెట్ను రూపొందించడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. దేశంలోనే తొలిసారి.. పారదర్శక పాలనకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ వ్యాఖ్యానించారు. జ్యుడీషియల్ కమిషన్ ద్వారా అవినీతిని నియంత్రించాలని కృతనిశ్చయంతో ఉందన్నారు. అమ్మ ఒడి పథకం అనేది దేశంలోనే తల్లులకు మొట్టమొదటి సారిగా అందిస్తున్న ప్రోత్సాహమని ఆయన స్పష్టం చేశారు. రైతులకు పూర్తి బరోసా కల్పించే చర్యలు, ఆరోగ్యశ్రీ పౌరసరఫరా సేవలను నేరుగా ప్రజల ఇంటికే అందించే చర్యలు అభినందనీయంమన్నారు. మహిళా సంక్షేమం కోసం సున్నావడ్డీ అమలు, ఎస్సీ, ఎస్డీ,బీసీ, మైనార్టీలకు బడ్జెట్లో కేటాయింపులు అద్భుతంగా ఉన్నామని అభినందించారు. -
వారసులొచ్చారు..
సాక్షి, గుంటూరు : జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ వారసులు విజయదుందుభి మోగించారు. తమ వారసత్వ రాజకీయాలను కొనసాగించారు. ప్రజా సేవలో రాణిస్తున్నారు. నరసరావుపేట ఎంపీ, గురజాల, మాచర్ల, బాపట్ల, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వారి తాతలు, తండ్రులు, మామల వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించడం విశేషం. అయితే జిల్లాలో గెలిచిన రాజకీయ వారసులంతా వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నుంచి గెలుపొందడం మరో విశేషం. ఎంపీగా భారీ మెజార్టీ జిల్లాలోని నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి, 1.53 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన లావు శ్రీకృష్ణదేవరాయలు తండ్రి విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత అయిన లావు రత్తయ్య కావడం అందరికి తెలిసిన విషయమే. అయితే లావు రత్తయ్య వేర్వేరు పార్టీల తరఫున రెండు సార్లు ఎంపీగా పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. ఆయన రాజకీయ వారసునిగా శ్రీకృష్ణదేవరాయలు రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసిన మొదటిసారే ఎంపీగా భారీ మెజార్టీతో గెలుపొందడం విశేషం. వరుసగా నాలుగో సారి.. మాచర్ల ఎమ్మెల్యేగా వరుసగా నాల్గో సారి విజయం సాధించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ నియోజకవర్గంలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మొదటి వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించారు. గతంలో అక్కడ ఎవరైనా ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాక ప్రజలు పక్కన పడేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం వరుసగా నాల్గో సారి ఎమ్మెల్యేగా గెలుపొంది జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన బాబాయి పిన్నెల్లి సుందరరామిరెడ్డి పల్నాడులో మంచి పేరు సంపాదించినప్పటికీ 1994లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1999లో మరో బాబాయి పిన్నెల్లి లక్ష్మారెడ్డి సైతం పోటీ చేసి ఓటమి చెందారు. 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన రామకృష్ణారెడ్డి అప్పటి నుంచి 2009, 2012, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయ పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. అన్నాబత్తుని వారసుడు.. తెనాలి నుంచి పోటీ చేసి గెలుపొందిన అన్నాబత్తుని శివకుమార్ తండ్రి అన్నాబత్తుని సత్యనారాయణ 1983, 1985 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడమే కాకుండా మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన వారసునిగా రాజకీయాల్లోకి వచ్చిన అన్నాబత్తుని శివకుమార్ 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొంది తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. మామ స్ఫూర్తితో.. పొన్నూరు నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిలారి వెంకట రోశయ్య ఐదు సార్లు వరుసగా విజయం సాధిస్తూ వస్తున్న టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అల్లుడు కిలారి వెంకట రోశయ్య. 2009 ఎన్నికల్లో తెనాలి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో మాత్రం అనూహ్యంగా పొన్నూరు నుంచి పోటీ చేసి సంచలన విజయం సాధించారు. కోన కుటుంబం నుంచి.. బాపట్ల ఎమ్మెల్యేగా రెండో సారి గెలుపొందిన కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు 1967, 1972, 1978లో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతోపాటు రాష్ట్ర మంత్రిగా, స్పీకర్గా కూడా పనిచేశారు. ఆయన తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కోన రఘుపతి 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మూడో తరం నేత మహేష్రెడ్డి రాష్ట్రంలోనే చెప్పుకోదగ్గ రాజకీయ కుటుంబంగా పేరొందినది కాసు కుటుంబం. మూడో తరానికి చెందిన కాసు మహేష్రెడ్డి ఎమ్మెల్యేగా గురజాల నుంచి పోటీ చేసి గతంలో ఎన్నడూ లేనంత భారీ మెజార్టీతో విజయ దుందుభి మోగించారు. మహేష్రెడ్డి తాత కాసు బ్రహ్మానందరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా, గవర్నర్గా పనిచేశారు. మరో తాత కాసు వెంగళరెడ్డి రాజ్యసభ్య సభ్యుడిగా, ఎమ్మెల్సీగా, జిల్లాపరిషత్ చైర్మన్గా అనేక ఉన్నత పదవులు పొందారు. కాసు మహేష్రెడ్డి తండ్రి కాసు వెంకట కృష్ణారెడ్డి ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. మహేష్రెడ్డి మొదటిసారిగా వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా గురజాల నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొంది కాసు కుటుంబంలో మూడో తరం రాజకీయ నేతగా పేరొందారు. -
ఇంతటి ఘనవిజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు
-
గురజాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి ప్రచారం
-
గురజాల నుంచే విజయఢంకా మోగిస్తాం : కాసు
సాక్షి, పిడుగురాళ్ల: గురజాల నియోజకవర్గం నుంచే వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగిస్తామని పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్రెడ్డి అన్నారు. పట్టణ సమీపంలోని ఆక్స్ఫర్డ్ కళాశాలలో పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ నెల 16వ తేదీన హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ అయ్యే ప్రాంగణాన్ని గురువారం కాసు, పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ప్రోగ్రామ్ కన్వీనర్, పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కాసు మహేష్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ గెలుపు శంఖారావం గురజాల నియోజకవర్గం నుంచే ప్రారంభమవుతుందన్నారు. పల్నాడు ప్రాంత ప్రజలపై జగన్మోహన్రెడ్డికి ఉన్న అభిమానంతో పల్నాడు ప్రాంతంలోని పిడుగురాళ్ల నుంచే ప్రచార సభ ఏర్పాటు చేశారని తెలిపారు. ఆయన రాక పల్నాడు ప్రజల అదృష్టమని భావిస్తున్నామన్నారు. గురజాల నియోజకవర్గానికి ప్రత్యేకమైన మేనిఫెస్టోను జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా విడుదల చేస్తామన్నారు. గురజాల నియోజకవర్గంలో మెడికల్ కళాశాల నిర్మించి అందులోనే హాస్పిటల్ను ఏర్పాటు చేస్తామని, అదే విధంగా ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. కృష్ణానది పక్కనే ఉన్నప్పటికీ టీడీపీ నాయకులు ప్రజలకు తాగునీరు అందించలేకపోయారని విమర్శించారు. కేవలం పేకాట క్లబ్లు, మట్టి మాఫియా, క్వారీలను దోచుకోవడం, వ్యాపారులను ఇబ్బంది పెట్టడం, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై జగన్మోహన్రెడ్డి మాట్లాడతారని వివరించారు. లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ పౌరుషాల పురిటిగడ్డ అయిన పల్నాడు ప్రాంతం నుంచి సమర శంఖారావం పూరించబోతున్నారన్నారు. పల్నాడు ప్రాంతం నుంచి ఏ కార్యక్రమం మొదలు పెట్టినా అది జయప్రదం కావడం శుభపరిణామం అన్నారు. రాష్ట్రంలో టీడీపీని కూకటి వేళ్లతో పెకిలించడానికి వైఎస్సార్ సీపీ నడుం బిగించిందని, అందుకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చి సభను విజయవం తం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రేపాల శ్రీనివాసరావు, కుందుర్తి గురవాచా రి, జెడ్పీటీసీ వీరభద్రుని రామిరెడ్డి, ఎంపీటీసీ తాటికొండ చిన ఆంజనేయులురెడ్డి, పట్టణ అధ్యక్షుడు చింతా వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ఐటీ గ్రిడ్స్పై ఎన్నికల సంఘానికి వైఎస్సార్ సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారంతో పాటు ఓటర్ల జాబితాకు సంబంధించిన మాస్టర్ డేటా హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ సంస్థ ఐటీ గ్రిడ్స్ వద్ద ఉండటంపై తక్షణం దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. పార్టీ నేతలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్రెడ్డి, లావు కృష్ణ దేవరాయలు ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదికు మంగళవారం ఫిర్యాదు చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. 3 కోట్ల మంది రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం సేవా మిత్ర యాప్ ద్వారా ఒక ప్రైవేట్ సంస్థకు ఏ విధంగా వెళ్లిందన్న దానిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ డేటాను ప్రభుత్వమే ఇచ్చిందా లేక ఇతర మార్గాల ద్వారా వెళ్లిందా అన్నదానిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు. కాసు మహేష్ మాట్లాడుతూ..ఎన్నికల సంఘం జనవరి 11న విడుదల చేసిన ఓటర్ల జాబితా తరువాత గురజాల నియోజకవర్గంలో 3,600 ఓట్లు నమోదు, 3,479 ఓట్లను తొలగించినట్లు కలెక్టర్ ఆఫీసులో ఉన్న డేటా చూపిస్తుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం డేటాలో మాత్రం కేవలం 300 ఓట్లు మాత్రమే తొలగించినట్లు చూపిస్తుండటంపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. జనవరి 11 నుంచి ఇప్పటి వరకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఓట్ల తొలగింపు, చేర్పునకు 3,84,236 దరఖాస్తులు రావడంపై అనుమానాలు వ్యక్తం చేశామని, ఓట్లు తొలగించే ముందు ఆ జాబితాను పరిశీలనకు అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వాలని ద్వేవేదిని డిమాండ్ కోరినట్లు చెప్పారు. దీనికి ద్వివేది అంగీకరించినట్లు కృష్ణదేవరాయులు వెల్లడించారు. -
ఓట్ల తొలగింపుపై విచారణ జరిపించాలి
-
‘చంద్రబాబు నాయకత్వంలోనే ఓట్ల తొలగింపు’
సాక్షి, అమరావతి : ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలోనే ఓట్ల తొలగింపు జరుగుతోందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. గురువారం వైఎస్సార్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కాసు మహేష్ రెడ్డిలు ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని కలిశారు. గురజాల నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై ఆయనకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఓట్ల తొలగింపుపై ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశామని తెలిపారు. గురజాలలో 9500 ఓట్లు తొలగించారని తెలిపారు. పోలీసులు యరపతినేని చెప్పుచేతుల్లో ఉన్నారు : కాసు మహేష్ రెడ్డి గురజాలలో కొంతమంది పోలీసులు టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ చెప్పు చేతల్లో ఉన్నారని వైఎస్సార్ సీపీ నేత, గురజాల ఇంచార్జి కాసు మహేష్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని చెప్పారు. ఓటర్ల అనుమతి లేకుండా ఓట్లు తొలగించాలని ఫారం 7ను ఇస్తున్నారని తెలిపారు. సమగ్ర విచారణకు ఆదేశించాలని ఎన్నికల అధికారిని కోరినట్లు వెల్లడించారు. -
జగన్ సీఎం అయితేనే కష్టాలు తీరేది
గుంటూరు, పిడుగురాళ్ల రూరల్ : ‘‘పింఛన్ కోసం దరఖాస్తు పెట్టుకుంటే జన్మభూమి కమిటీ సభ్యుల సంతకం పెట్టించుకోమని మెలిక పెడతారు. సొంత ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్న తమకు ఇళ్లు మంజూరు చేయమంటే టీడీపీకి ఓటు వేయాలని బెదిరిస్తున్నారు. కనీసం ఇంటి స్థలం మంజూరు చేయమన్నా మీరు వైఎస్సార్ సీపీ వాళ్లు కాబట్టి ఇవ్వబోమని మొహం మీదే చెబుతున్నారు.. ఇటువంటి దుర్మార్గమైన టీడీపీ ప్రభుత్వం దిగిపోవాలయ్యా.. జగన్ వస్తే మా కష్టలు తీరుతాయనే నమ్మకం మాకు ఉంది’’ అంటూ పలువురు మహిళలు, యువకులు వైఎస్సార్ సీపీ నేతల ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పిడుగురాళ్ల మండలం అంజనీపురం, తుమ్మలపురం గ్రామాల్లో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్రెడ్డి చేపట్టిన అదేబాట పాదయాత్ర జరిగింది. ఈ సందర్భంగా కాసు మహేష్రెడ్డి, పార్టీ నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు వద్ద పేదలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఒక్క పథకం కూడా తీసుకోలేదని, ఏది కావాలన్నా జన్మభూమి కమిటీ, ఎమ్మెల్యే దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోమంటున్నారని మహిళలు వాపోయారు. ఈ కష్టాలను భరించే ఓర్పు, సహనం మాకు లేదని, జగనన్న సీఎం అయితే మా జీవితాలు బాగుపడతాయని చెప్పారు. బాబు వస్తే జాబు వస్తుందని ఆశపడ్డామని, కానీ ఇంత వరకు మాకు ఉద్యోగం ఇవ్వలేదని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులను చంద్రబాబు ఇంతలా మోసం చేస్తాడని ఊహించలేదని, చంద్రబాబు పోతేనే మాకు జాబ్లు వస్తాయని వారు తెలిపారు. మహిళలు, యువకుల సమస్యలను విన్న శ్రీకృష్ణదేవరాయలు, కాసు మరో నాలుగు నెలలు ఓపిక పడితే మీరు అడిగినవన్ని, అడగనివి కూడా చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. నేతలు ఎనుముల మురళీధర్రెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వరరావు, చింతా సుబ్బారెడ్డి, దొడ్డా అంజిరెడ్డి, షేక్ దస్తగిరి తదితరులున్నారు. వైఎస్సార్ విగ్రహావిష్కరణ : తుమ్మలచెరువు గ్రామానికి చెందిన గున్నమరెడ్డి మదన్ మోహన్రెడ్డి కుమారుడు ఉమమహేశ్వరరెడ్డి(ఎన్ఆర్ఐ) ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని లావు, కాసు ఆవిష్కరించారు. అయ్యప్పనగర్లో వైఎస్సార్ సీపీ జెండాను ఎగురవేశారు. పార్టీ మండల కన్వీనర్ చల్లా పిచ్చిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వీరభద్రుని రామిరెడ్డి, నేతలు జాలిరెడ్డి, వాసుదేవరెడ్డి, కుమారి ఏలియా పాల్గొన్నారు. బురిడి బాబును సాగనంపుదాం :వైఎస్సార్ సీపీ నేత కృష్ణదేవరాయలు పిడుగురాళ్ల రూరల్ : అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను నాలుగున్నరేళ్లుగా మోసం చేస్తున్న బురిడి బాబును సాగనంపే రోజులు దగ్గర్లో పడ్డాయని వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త లావు కృష్ణదేవరాయలు అన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్రెడ్డి చేపడుతున్న అదేబాట పాదయాత్ర శుక్రవారం మండలంలోని తుమ్మల చెరువు గ్రామం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ తెలంగాణాలోనే కాదు ఏపీలో కూడా బురిడి బాబును త్వరగా ఇంటికి పంపాలని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం అభివృద్ధి చేయకుండా కాలయాపన చేసి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. దద్దమ్మ ప్రభుత్వాన్ని తరిమికొడదాం : కాసు నాగార్జున సాగర్లో పూర్తి స్థాయి నీటిమట్టం ఉన్నా రైతులకు సాగునీరు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం టీడీపీది అని నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్రెడ్డి మండిపడ్డారు. రైతులకు పండిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం చేతగాదు కాని పేకాట క్లబ్లు మాత్రం ఏర్పాటు చేస్తారని విమర్శించారు. పల్నాడులో మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేయడం చేతగాదు గాని సున్నపు గనులు దోచుకోవడం యరపతినేనికి వచ్చునని అన్నారు. గ్రామాల్లో మద్యం 24 గంటలు అందుబాటులో ఉంటుంది కాని మంచినీళ్లు మాత్రం దొరకకపోవడం దారుణమన్నారు. దివంగత నేత రాజశేఖర్రెడ్డి ముస్లింల అభివృద్ధికి నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి, వారు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఉపయోగపడ్డారన్నారు. కాని నేటి టీడీపీ ప్రభుత్వం ముస్లింలను విస్మరించిందన్నారు. -
రాష్ట్రంలో 52 లక్షల నకిలీ ఓట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 52 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని, ఒక్క నరసరావుపేట నియోజకవర్గంలోనే 43 వేల డూప్లికేట్ ఓట్లున్నాయని శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ గురజాల సమన్వయకర్త కాసు మహేష్రెడ్డి తెలిపారు. శుక్రవారం తాత్కాలిక సచివాలయంలోని ఎన్నికల ప్రధాన అధికారి ఆర్పీ సిసోడియాను కలిసి గురజాల నియోజకవర్గంలో ఓటర్ల నమోదులో అవకతవకలపై ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దొంగ ఓట్లు చేర్పించడంలో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుది అందెవేసిన చేయి అని ఆరోపించారు. గురజాలలో డూప్లికేట్ ఓటర్ల పూర్తి వివరాలు తెలియజేస్తూ ఆన్లైన్ ద్వారా ఫారం నంబర్ 7లో ఆర్డీవోకు ఫిర్యాదు చేశామన్నారు. అయినా ఆర్డీవో పట్టించుకోలేదన్నారు. యరపతినేని ఒత్తిళ్లు తట్టుకోలేక మాచవరం తహసీల్దార్ సెలవులో వెళ్లిపోయినట్లు తెలిపారు. ఫిర్యాదు చూసిన తరువాత పరిశీలించి వారు కూడా అన్యాయం అంటున్నారని, కానీ చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారన్నారు. అధికారం ఉన్నవాడి చేతుల్లో విచ్చలవిడితనం మంచిది కాదన్నారు. గురజాల నియోజకవర్గంలో 13 వేల దొంగ, నకిలీ ఓట్లున్నట్లు గుర్తించామన్నారు. సెప్టెంబర్ 30లోపే ఆర్డీవోకు ఆన్లైన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వీటన్నింటి వివరాలు ఈసీకి ఆధారాలతో సహా అందజేశామన్నారు. 2004లో వైఎస్సార్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 96 లక్షల దొంగ ఓట్లున్నాయని ప్రతిపక్షం ఫిర్యాదు చేస్తే ఈసీ స్పందించి తొలగించిందని గుర్తు చేశారు. నకిలీ ఓట్లపై చర్యలు తీసుకోకుంటే హైకోర్టుకు వెళ్తామన్నారు. గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల, రూరల్ మండలాల్లోనే 8 వేల దొంగ ఓట్లున్నాయని వీటన్నింటినీ తొలగించాలని కోరినట్లు తెలిపారు. చర్యలు తీసుకుంటాం ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసినందున తప్పకుండా విచారించి చర్యలు తీసుకుంటామని ఈసీ సిసోడియా వైఎస్సార్సీపీ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కాసు మహేష్రెడ్డిలకు హామీ ఇచ్చారు. ఫిర్యాదును స్వీకరించిన ఈసీ హార్డ్కాపీలు కూడా తీసుకున్నారు. డూప్లికేట్, దొంగ ఓట్లను తొలగిస్తామని హామీ ఇచ్చారు. -
రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షల దొంగ ఓట్లు: ఉమ్మారెడ్డి
సాక్షి, గుంటూరు: జిల్లాలోని గురజాల నియోజకవర్గంలో ఓట్ల గల్లంతుపై విషయంపై వైఎస్సార్సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కాసు మహేష్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో టీడీపీ నేతలు ఉద్దేశ పూర్వకంగా ఓట్లు తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల జాబితాలో అక్రమాలకు పాల్పడుతోందని, టీడీపీ అనుకూల ఓట్లను ఉంచి, వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా 52లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని అన్నారు. గతంలో నరసరావుపేటలో 43 వేల ఓట్లు టీడీపీ నేతులు తొలగించారు. అధికార నేతల ఒత్తిడి తట్టుకోలేక ఎన్నికల అధికారులు సెలవులపై వెళ్లిపోతున్నారని చెప్పారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని అన్నారు. కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ... గురజాల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ఒత్తిడి వల్లనే మాచవరం ఎమ్మార్వో సెలవుపై వెళ్లిపోయారని తెలిపారు. వచ్చే జనవరి 18 వరకు చూస్తామని, న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. గురజాల నియోజక వర్గం పిడుగు రాళ్ళలో కొత్తగా 8వేల దొంగ ఓట్లు చేర్పించారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. -
‘చేసేదే వైఎస్ జగన్ చెబుతారు’
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసేదే చెప్తారని ఆ పార్టీ నేత కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ ఆటవిక పాలనకు నిరసనగా దాచేపల్లిలో వైఎస్సార్ సీపీ ‘పల్నాటి గర్జన’ చేపట్టింది. ఈ సందర్భంగా గర్జనకు హాజరైన ఆ పార్టీ నేత కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయడు వచ్చారు.. కరువు తెచ్చారని ఎద్దేవ చేశారు. నాలుగున్నరేళ్లలో ఈ ప్రాంతానికి చంద్రబాబు నీళ్లు ఇవ్వలేకపోయారని ధ్వజమెత్తారు. నీళ్లు, ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. దమ్ముంటే పల్నాడు అభివృద్దిపై గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ ప్రాంత ఎమ్మెల్యే టికెట్ను చంద్రబాబు ప్పుడైనా బీసీలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలతోనే పేదల అభ్యున్నతి అంటూ మహేష్ రెడ్డి వివరించారు. ఈ గర్జనకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పల్నాడు ప్రాంత ప్రజలు హాజరయ్యారు. -
వైఎస్ఆర్సీపీ నేత కాసు మహేష్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు
-
పల్నాడులో వైఎస్సార్సీపీ నేతల అరెస్టు
గుంటూరు: పల్నాడులో వైఎస్సార్సీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇంటి పన్నుల పెంపు, వేసిన రోడ్లకే మళ్లీ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ నేతలు మంగళవారం ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే. దీంతో ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను ధర్నాకు వెళ్లనీయకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. గురజాల వైఎస్సార్సీపీ సమన్వయకర్త కాసు మహేశ్ రెడ్డిని గృహనిర్బంధం చేశారు. పోలీసుల కన్నుగప్పి పిడుగురాళ్ల వైఎస్సార్సీపీ కార్యాలయానికి చేరుకున్న కాసు మహేశ్ను అక్కడ కూడా చుట్టుముట్టారు. వైఎస్సార్సీపీ అగ్రనేత అంబటి రాంబాబుని కూడా గుంటూరులో గృహనిర్బంధం చేశారు. పిడుగురాళ్ల నేతలు రామిరెడ్డి, రేపాల శ్రీనివాస్లతో పాటు పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేసి రాజుపాలెం పోలీస్స్టేషన్కు తరలించారు. వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకునేందుకు పిడుగురాళ్ల మున్సిపాలిటీ వద్దకు పోలీసులను భారీగా మోహరించారు. కాసు మహేశ్ రెడ్డి అరెస్ట్ ధర్నాకు పిలుపునిచ్చిన గురజాల వైఎస్సార్సీపీ సమన్వయకర్త కాసు మహేశ్రెడ్డిని నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ను నిరసిస్తూ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల చర్యతో ఇద్దరు కార్యకర్తలకు గాయాలు కూడా అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పిడుగురాళ్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్ హౌస్ అరెస్ట్
-
గురజాలలో ఉద్రిక్తత
గుంటూరు : నరసరావుపేటలోని గురజాలలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గురజాల వైఎస్సార్సీపీ సమన్వయకర్త కాసు మహేష్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ ప్రభుత్వం ఇటీవల పెంచిన ఇంటి పన్నులకు నిరసగా నేడు పిడుగురాళ్ల మున్సిపాలిటీ ముట్టడికి వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ ఇంటి చూట్టు భారీగా చుట్టుముట్టిన పోలీసులు అతన్ని బయటకు రాకుండా గృహ నిర్భంధం చేశారు. మహేష్ అరెస్ట్పై వైఎస్సార్సీపీ శ్రేణుల భగ్గుమన్నారు. పొద్దునలేస్తే ప్రజాస్వామ్యం పేరుతో గొప్పలు చేప్పుకునే సీఎం చంద్రబాబు.. ప్రశ్నించే వారిని అక్రమంగా అరెస్ట్ చేపిస్తున్నారని మండిపడ్డారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఇంటి పన్నులు, గతంలో వేసిన రోడ్లకు మళ్లీ టెండర్లు పిలవడంపై వైఎస్సార్సీపీ నేడు ధర్నాకు పిలుపునిచ్చింది. -
గుంటూరు అక్రమ మైనింగ్పై సీబీఐ విచారణ..!
సాక్షి, హైదరాబాద్ : గుంటూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కాసు మహేశ్రెడ్డి డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి అయిన టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును తప్పించేందుకే అమాయకులపై కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. అక్రమ గనులను పరిశీలించేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీని పోలీసులు ప్రయోగించి అడ్డుకున్నారని తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి 10 రోజులు గడువిచ్చామని, అప్పటికీ అనుమతి ఇవ్వకపోతే కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అక్రమ గనుల వ్యవహారంలో సీఐడీ విచారణ వల్ల ఏమీ జరగదని, సీబీఐ విచారణ జరిపిస్తేనే నిజాలు వెలుగులోకి వస్తాయని, సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ జరుగుతున్న భూములను ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకోవాలన్నారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగితే.. బీజేపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. -
‘పర్యటన అడ్డుకున్నా.. ఉద్యమాన్ని ఆపలేరు’
సాక్షి, గుంటూరు: గురజాలలో ఎమ్మెల్యే యరపతినేని మైనింగ్ అక్రమాలు బయటపెట్టే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని గురజాల వైఎస్సార్సీపీ సమన్వయకర్త కాసు మహేష్రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మంగళవారం మాట్లాడారు. వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటనను పోలీసులను అడ్డం పెట్టుకుని వాయిదా వేయగలిగారనీ, కానీ టీడీపీ నేతల అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేసే ఉద్యమాన్ని ప్రభుత్వం ఆపలేదని తెలిపారు. మైనింగ్ అక్రమాలు వెల్లడైతే ప్రభుత్వం ఇరుకునపడుతుందని యరపతినేని వణికిపోతున్నారని అన్నారు. అందినకాడికి దోచుకున్న యరపతినేని మైనింగ్ కేసులో తన దగ్గర పనిచేసే డ్రైవర్, వాచ్మెన్, గుమాస్తాలను బాధ్యులను చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ మైనింగ్ కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మైనింగ్ మాఫియా నుంచి వసూలు చేసిన రెండువేల కోట్ల పెనాల్టీని పల్నాడు అభివృద్ధికి ఖర్చు చేయాలని అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన 6 నెలల్లో అక్రమ మైనింగ్ జరిగిన భూములను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. ప్రజా తిరుగుబాటు అంటే ఎలా ఉంటుందో యరపతినేనికి త్వరలో చూపిస్తామనీ, వచ్చే ఎన్నికల్లో ఆయనకు దారుణమైన ఓటమి తప్పదని మహేష్రెడ్డి హెచ్చరించారు. -
'నిజాలు బయటకొస్తాయని టీడీపీకి భయం'
-
కాసు మహేశ్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు : నరసరావుపేటలోని గురజాల వైఎస్సార్సీపీ సమన్వయకర్త కాసు మహేశ్ రెడ్డి ఇంటి వద్ద సోమవారం ఉద్రిక్తవాతావరణం నెలకొంది. అక్రమ గునుల పరిశీలనకు వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వరని కాసు మహేశ్ రెడ్డి మండిపడ్డారు. గురజాలలో నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్ జరుగుతోందన్నారు. యరపతినేని కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరుగుతోందని, అక్రమ మైనింగ్ క్వారీలను పరిశీలించేందుకు వెళ్తుంటే వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. అన్యాయాలు బయటకొస్తాయని యరపతినేనికి భయం పట్టుకుందన్నారు. కూలీలు, డ్రైవర్లపై అక్రమ మైనింగ్ కేసులు పెట్టారన్నారు. ఇల్లు, పొలం కూడా లేని వ్యక్తి రూ.80 కోట్ల స్కాం చేస్తాడా అని ధ్వజమెత్తారు. అమాయకులపై కేసులు పెట్టి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారని మహేశ్రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడే అవినీతిని ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కేసును నీరుకార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ కేసు నుంచి టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుని రక్షించడానికి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోందని ఉమ్మారెడ్డి ధ్వజమెత్తారు. భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని హైకోర్టు రిపోర్ట్ ఇచ్చిందన్నారు. అమాయకులపై కేసులు పెట్టి యరపతినేని ఈ కేసులనుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని తెలిపారు. అక్రమ మైనింగ్ క్వారీలను తాము పరిశీలిస్తే నిజాలు బయటకోస్తాయని టీడీపీకి భయం పట్టుకుందని ఉమ్మారెడ్డి నిప్పులు చెరిగారు. ఖచ్చితంగా అక్రమమైనింగ్ క్వారీలను పరిశీలిస్తామని, ఎన్ని అరెస్టులు చేసినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ కేసును తప్పుదారిపట్టించాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అక్రమ మైనింగ్ పాల్పడ్డవారు ఎవరైనా శిక్షపడాల్సిందేనన్నారు. నిజనిర్ధారణ కమిటీని అడ్డుకోవడం సరికాదన్నారు. -
పల్నాడ్లో తీవ్ర ఉద్రిక్తత..144 సెక్షన్ అమలు
-
గురజాలలో పోలీసుల రాజ్యం
సాక్షి, గుంటూరు : గురజాల నియోజకవర్గంలో పోలీసులు అక్రమ అరెస్ట్లతో వైఎస్సార్సీపీ నేతలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నేడు పిడుగురాళ్ల, దాచేపల్లిలోని అక్రమ మైనింగ్ క్యారింగ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీ పర్యటించనున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి, పార్టీనేత కాసు మహేష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురజాల నియోజకవర్గాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఇళ్లనుంచి బయటకు వచ్చిన అనేక మంది కార్యకర్తలను, పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ నిజ నిర్ధారణ కమిటీని అడ్డుకునేందుకు పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. నేతలేవరు బయటకు రాకుండా దాచేపల్లి, పిడుగురాళ్ల ప్రాంతాల్లో 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. కమిటీ పర్యటిస్తే అక్రమ మైనింగ్పై నిజాలు బయటకొస్తాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం భయపడుతోందని, అందుకే తమ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా నియోజవర్గంలో పోలీసులు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు తొత్తులుగా మారారు. మూడు రోజుల క్రితం టీడీపీ ర్యాలీకి అనుమతించిన పోలీసులు వైఎస్సార్సీపీ నేతల పర్యటనను మాత్రం అడ్డుకుంటున్నారు. పర్యటన రద్దు చేసుకోకపోతే కేసులు పెడతామని హెచ్చరించిన పోలీసులు ముందుగానే వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు పంపించారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో హైకోర్టును తప్పుదారి పట్టించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్టు కనబడుతోంది. పల్నాడులో 28 లక్షల టన్నుల తెల్లరాయిని దోచుకున్నట్లు ఇటీవల నిర్ధారణ కమిటీ తేల్చిన విషయం తెలిసిందే. తనపై కేసులు రాకుండా టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని పన్నాగం కుట్రలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ నేతలు అక్రమంగా కోట్లు దోచుకుంటున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. అధికార పార్టీ నాయకులకు దోపిడీలకు కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్
-
నరసరావు పేటలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు : నరసరావు పేటలో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కాసు మహేష్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆయన నివాసానికి వచ్చే దారిలో బారికేడ్ల్ పెట్టి, రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. కాగా నేడు గురజాలలోని పిడుగురాళ్ల, దాచేపల్లిలోని అక్రమ మైనింగ్ క్యారింగ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీ పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిటీని అడ్డుకునేందుకు పోలీసులు పార్టీ నేతలపై ఉక్కుపాదం మోపుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలకు అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని నేతలు ఆరోపిపస్తున్నారు. క్యారింగ్కు సంబంధించిన సాక్ష్యాలు మాయమవుతాయంటూ కొత్త వాదన తెరపైకి తీసుకువచ్చారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు ద్వారా నోటీసులు పంపారు. పర్యటన రద్దు చేసుకోకపోతే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని, గురజాల నియోజకవర్గాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే పలువురు వైఎస్సార్సీపీ నేతలకు, కార్యకర్తలకు నోటీసులు పంపిన పోలీసులు, రేపల నివాసరావు, గాంధీతో పాటు పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. -
‘వైఎస్సార్ సీపీ కమిటీ వాస్తవాలను బయటపెడుతుంది’
సాక్షి, గుంటూరు : వైఎస్సార్ సీపీ నిజనిర్థారణ కమిటీ రేపు గురజాలలో పర్యటించి వాస్తవాలను బయట పెడుతుందని వైఎస్సార్ సీపీ నేత కాసు మహేష్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే యరపతినేని తన అనుచరులను అక్రమ మైనింగ్ తామే చేసినట్లు ఒప్పుకోమని వేధిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ నిజనిర్థారణ కమిటీకి పోలీసులు ఎందుకు అడ్డుచెడుతున్నారని ప్రశ్నించారు. రూ. 290కోట్ల సున్నపురాయిని అక్రమంగా తరలించారు గుంటూరు : ఈ నాలుగేళ్లలో రూ. 290కోట్ల విలువైన సున్నపురాయిని టీడీపీ నాయకులు అక్రమంగా తరలించారని వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఎమ్మెల్యే హస్తముందని అందరికీ తెలుసన్నారు. హైకోర్టు స్టే ఇచ్చి విచారణకు ఆదేశించటంతో డొంక కదిలిందని అన్నారు. మైనింగ్ అధికారులు ఎమ్మెల్యేను కేసు నుంచి తప్పించేందుకు సంబంధంలేని వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. -
యరపతినేనిని రక్షించడానికి ప్రయత్నాలు
-
యరపతినేనిని రక్షించడానికి ప్రయత్నాలు
గుంటూరు: గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కేసును నీరుకార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ కేసు నుంచి టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుని రక్షించడానికి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోందని గురజాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కాసు మహేశ్ రెడ్డి ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ..హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఈ కేసు విచారణ జరుగుతోందని వ్యాఖ్యానించారు. కోర్టు ఏమని ఆదేశాలు జారీ చేసింది.. మైనింగ్ అధికారులు అక్కడ ఎవరిని విచారిస్తున్నారని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్ చేసిన వారిని వదిలేసి సంబంధం లేని వారికి నోటీసులు ఇచ్చి అధికారులు ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఈ కేసుకు సంబంధం లేని పల్వరైజింగ్ మిల్లర్లకు నోటీసులు ఇస్తున్నారు..ఇది చాలా అన్యాయం, దారుణమని అన్నారు. పల్వరైజింగ్ మిల్లర్లు భయపడవద్దు..మీకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే యరపతినేని స్థానికుల్ని రెచ్చగొట్టి కేసు పక్కద్రోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో సున్నపురాయిని దోచేసిన వారికి శిక్షపడేంతవరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేశారు. -
కూలీలను కేసులో ఇరికిస్తున్నారు : కాసు
సాక్షి, గుంటూరు : మైనింగ్ విచారణను తెలుగుదేశం పార్టీ(టీడీపీ) తప్పుదోవ పట్టిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాసు మహేష్ ఆరోపించారు. దోషులను వదిలి కూలీలను కేసులో ఇరికించే యత్నం చేస్తున్నట్లు చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని హస్తం దీని వెనుక ఉందని అన్నారు. ఇందుకు యరపతినేనికి మంత్రి నారా లోకేష్ సాయం చేస్తున్నారని, ఇద్దరూ కలసి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. -
చంద్రబాబు అండతోనే మైనింగ్ జరుగుతుంది
-
యరపతినేని ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్
విజయవాడ: నాలుగేళ్లుగా గురజాల నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని గురజాల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేశ్ రెడ్డి ఆరోపించారు. గురువారం విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో కాసు మహేశ్ విలేకరులతో మాట్లాడారు. అక్రమ మైనింగ్ ద్వారా రూ.270 కోట్ల దోపిడీ జరిగిందని విమర్శించారు. ప్రభుత్వానికి రాయల్టీ కట్టకుండా యరపతినేని మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో యరపతినేని కీలక సూత్రధారి అని లోకాయుక్త నిర్ధారించిందని వెల్లడించారు. ఇప్పుడు కూడా యరపతినేని ఆధ్వర్యంలో అక్రమమైనింగ్ జరుగుతుందన్నారు. హైకోర్టు ప్రభుత్వానికి తీవ్రమైన అక్షింతలు వేసినా వీరికి బుద్ధిరాలేదని మండిపడ్డారు. మీకు దగ్గర్లో అక్రమ మైనింగ్ జరుగుతుంటే ఎందుకు చోద్యం చూస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం అండదండలతోనే ఇదంతా జరుగుతుందని వ్యాఖ్యానించారు. వడవల్లి వెంకటేశ్వర్లు, ఘట్టమనేని నాగేశ్వరరావు, నెలూరి శ్రీనివాస రావు అనే ఈ ముగ్గురూ యరపతినేని బినామీలు అని ఆరోపణ చేశారు. -
కాకితో కబురు చేస్తే కాసు మహేశ్ వస్తాడు..
సాక్షి, గుంటూరు : ధృడమైన నాయకత్వం ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని, అది వైఎస్ ఒక్క జగనన్నతోనే సాధ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాసు మహేశ్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో శనివారం నర్సరావుపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘నర్సరావుపేట ప్రస్తుతం లంచాలపేటగా మారిపోయింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నర్సరావుపేటలో అభివృద్ధి జరిగింది. ఆయన మరణాంతరం టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్, ఆయన కుమారుడు, కుమార్తె, వారి అనుచరులు కలిసి నర్సరావుపేటను అవినీతిమయం చేశారు. చేతకాని టీడీపీ దద్దమ్మ ప్రభుత్వం పోయి, మంచి ప్రభుత్వం రావాలి. ఈ ప్రాంతంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు అరికట్టి వైఎస్ జగన్ను సీఎం చేయాలన్న ఆరాటం అందరిలో ఉంది. వైఎస్ జగన్ సీఎం అయితేనే అభివృద్ధి సాధ్యం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నర్సరావుపేట రూపురేఖలు మార్చుతామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. కాసు మహేష్ రెడ్డి ఇక్కడ ఉండడు అంటూ... కొందరు టీడీపీ నేతలు పుకార్లు రేపుతున్నారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై ఈగ వాలినా ...కాకితో కబురు చేస్తే కాసు మహేష్ రెడ్డి వస్తాడు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వాటిని ఎవరూ నమ్మొద్దు. పార్టీ అభివృద్ధికి అందరం కలిసి పని చేస్తాం.’ అని స్పష్టం చేశారు. -
ఇది అంతం కాదు.. ఆరంభం
పిన్నెల్లి (మాచవరం): దుర్మార్గపు టీడీపీ పాలన పతనం పిన్నెల్లి నుంచే ప్రారంభం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్రెడ్డి పిలుపునిచ్చారు. అదేబాట పాదయాత్ర ముగింపు సభ మాచవరం మండంలోని పిన్నెల్లి గ్రామంలో శని వారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా మహేష్రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాటం కోసం ఎన్ని అవరోధాలు ఎదురైయినా.. ఆటంకాలు వచ్చినా.. చివరకు అక్రమంగా జైలులో పెట్టినా.. మన అధినేత జగన్మోహన్రెడ్డి ధర్మ యుద్ధం చేస్తున్నారని, ఇది అంతంకాదని.. ఆరంభం మాత్రమేనని అన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులు పెట్టి అక్రమంగా కేసులు పెట్టించిన నాయకులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు అధికారం మారితే సస్పెండ్ చేస్తారని అనుకుంటున్నారని.. తాము అధికారంలోకి వస్తే అటువంటి అధికారులను డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు. టీడీపీ చేస్తున్న ప్రతి అక్రమాలు అన్నింటినీ గుర్తు పెట్టుకుంటున్నామని, తమ కార్యకర్తలపై పెట్టిన కేసులకు వడ్డీతో బదులు తీర్చుకుంటున్నామని స్పష్టంచేశారు. మద్దతు ధర ఏది? రైతులు పండించే పంటలకు టీడీపీ పాలనలో కనీస మద్దతు ధర లభించటంలేదని కాసు మహేష్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ముస్లింల సంక్షేమానికి దివంగత వైఎస్సార్ చేసిన కృషిని గుర్తుచేశారు. చంద్రబాబు క్యాబినెట్లో 26 మంది మంత్రులు ఉన్నారని, ముస్లింలకు మాత్రం చోటు కల్పించలేదని దుయ్యబట్టారు. జగన్ సీఎం అయితే ముస్లింలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య మంత్రి అయిన ఆరునెలల్లో గురజాల నియోజకవర్గానికి సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు. ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందిస్తామన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో రూ.600 కోట్లు అక్రమంగా సంపాదించిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు త్వరలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టంచేశారు. కార్యకర్తలను ఇబ్బందిపెడితే సహించం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందిపెడితే ఊరుకునేదిలేదని పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి హెచ్చరించారు. టీడీపీ నాయకులు చెప్పిందే వేదంగా పాటిస్తున్న అధికారులను వదిలిపెట్ట బోమన్నారు. రాష్ట్రంలో శాంతియుత పరిపాలనా కావా లంటే జగన్ను సీఎంగా చేసుకోవాలని సూచించారు. నియోజకర్గంలో ఎమ్మెల్యే యరపతినేని ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. పదేళ్లుగా నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఏమీ ఇవ్వని యరపతి నేని ఇప్పుడు అక్రమంగా దోచుకున్న సంపాదనతో షష్టిపూర్తి, సీమంతాలు చేస్తూ ముక్కుపుడకలు, చీరలు, పంచెలు పంచడం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు. దాచేపల్లి, పిడుగురాళ్ల మండలాల్లో గనులు దోచుకోవడమే కాకుండా అన్నింటా కమీషన్లు వసూలు చేస్తూ వ్యాపారులు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజ మెత్తారు. ఎమ్మెల్యే షేక్ ముస్తఫా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు అమలయ్యాయని, ఎందరికో ఉద్యోగాలు వచ్చాయని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో ముస్లింలు జగన్కు ఓట్లు వేసి సీఎం చేయాలని కోరారు. ఇటీవల పిడుగురాళ్ల మండలంలోని జానపాడు గ్రామంలో ముస్లింలపై టీడీపీ అగ్రకుల నేతలు దాడులు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గురజాల ఎమ్మెల్యేగా మహేష్రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలను హింసించే స్థానిక ఎమ్మెల్యేను వచ్చే ఎన్నికల్లో మట్టికరిపించి మంచికల్లుకు పంపించాలని పిలుపునిచ్చారు. కాసు కుటుంబం నుంచి వచ్చిన నేటితరం యువనాయకుడు మహేష్రెడ్డిని అఖండమెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తొలుత నగరి ఎమ్మెల్యే రోజ ప్రసంగించారు. ఈ సభలో యువనాయకుడు జంగా కోటయ్య, మాజీ సర్పంచ్ చింతపల్లి నన్నే, మండల కన్వీనర్ చౌదరి సింగరయ్య, జెడ్పీటీసీ సభ్యులు మూలగొండ్ల ప్రకాష్రెడ్డి, వీరభద్రుని రామి రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు వట్టె రామిరెడ్డి, ఉపాధ్యక్షుడు చింతపల్లి సైదా, ఎంపీటీసీ సభ్యులు పార్లగొర్ల కోటేశ్వరరావు, యడవల్లి మరియదాసు, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు శివయాదవ్, వెంకటరెడ్డి, రమేష్రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి అనిల్కుమార్, అధికార ప్రతినిధి రేపాల శ్రీనివాసరావు, సేవాదళ్ మండల కన్వీనర్ షేక్ మహ్మద్జానీ, సొసైటీ డైరెక్టర్ గుర్రం వీరాంజనేయరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయ్ !
గురజాలరూరల్: ‘గ్రామాల్లో ఎక్కడా చూసినా సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. నియోజకవర్గంలో దోపిడీయే ప్రధాన ఎజెండాగా యరపతినేని కోట్ల రూపాయలు దండుకున్నారు. రాష్ట్రమంతా అవినీతి కంపుకొడుతోంది. ఈ దగా ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయ్’ అంటూ వైఎస్సార్ సీపీ గురజాల నియోజకవర్గ ఇన్చార్జి కాసు మహేష్ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర స్ఫూర్తితో కాసు తలపెట్టిన ‘అదేబాట’లో కాలినడకన రెండోరోజు మంగళవారం అంజనాపురం గ్రామానికి చేరుకున్నారు. అడుగడుగునా మహిళలు పూలతో, హారతులతో బ్రహ్మరథం పట్టారు. దేవాలయాల్లో, చర్చిల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాదయాత్రతో వస్తున్న మహేష్రెడ్డికి ప్రజలు సమస్యలు ఏకరవు పెట్టారు. పొలంలో పనిచేస్తున్న వ్యవసాయకూలీలు బియ్యం కూడా కొనుగోలు చేసుకోలేని స్థితితో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాసు మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. రాజన్నరాజ్యం స్థాపనకు జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాయని భరోసానిచ్చారు. రైతులకు ధరల స్థిరీకరణనిధి ఏర్పాటు చేసి ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, మండల కన్వీ నర్ సిద్దాడపు గాంధీ, సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు, మేకల శేషి రెడ్డి, సోమ వెంకట్రావు, గ్రామ కన్వీనర్ పేరం సత్యనారాయణరెడ్డి, ఎం.వెంకటేశ్వరరెడ్డి, మిర్యాల కృష్ణ, వెంటేశ్వర్లు, రాం బాబు, చంద్రశేఖర్రెడ్డి, శంకర్రెడ్డి, వెంకటరెడ్డి, వెన్నా వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా కాసు మహేష్రెడ్డి పాదయాత్ర
-
‘ఆ రెండు ఘటనలకు టీడీపీదే బాధ్యత’
సాక్షి, సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నర్సరావుపేటలో అధికార టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, కాసు మహేశ్రెడ్డి ఆరోపించారు. బుధవారం వీరిద్దరూ మీడియాతో మాట్లాడుతూ... పెదగొట్టిపాడు, జానపాడులో జరిగిన ఘటనలకు బాధ్యులు టీడీపీ నాయకులు, కార్యకర్తలేనని అన్నారు. టీడీపీ వ్యతిరేకంగా, వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉంటున్నారన్న అక్కసుతో ఎస్సీ, మైనార్టీలపై అధికార పార్టీ నేతలు విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారని తెలిపారు. టీడీపీ జేబు సంస్థగా పోలీసువ్యవస్థ మారిందని దుయ్యబట్టారు. పోలీసుల పక్షపాత వైఖరి వల్లే రాష్ట్రంలో శాంతిభద్రతలు నశిస్తున్నాయని విమర్శించారు. అంత తామేనన్న అధికార మదంతో టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. ఇళ్లపైకి వచ్చి.. తలుపులు బద్దలు కొట్టి... పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో శనివారం రాత్రి ముస్లింలపై అధికార పార్టీకి చెందిన సుమారు 70 మంది ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. తమ ఇళ్లపైకి వచ్చి అసభ్యకరంగా దూషించారని, రాళ్లు వేసి తలుపులు బద్దలుకొట్టారని బాధితులు తెలిపారు. ఇదేమని ప్రశ్నించిన మహిళలను కూడా కొట్టి గాయపరిచారని చెప్పారు. నిందితులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
ఆగడాలకు అంతం పలకండి
అభిమానంతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొంటే నిర్దాక్షిణ్యంగా పీకేశారు. ఇంటి ముందు ముగ్గులేసుకొంటే పసుపు నీళ్లు చల్లి అవమానించారు. ఇదేమి రౌడీయిజమని ప్రశ్నిస్తే పోలీసుల అండతో అక్రమ కేసులు బనాయించారు. ఇలా రోజురోజుకు పెరిగిపోతున్న టీడీపీ నాయకుల ఆగడాలపై మాచవరం మండలంలోని మహిళలు తిరగబడ్డారు. సుమారు 500 మంది వరకు పిడుగురాళ్లలో పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించి పోలీసులు, టీడీపీ నాయకుల తీరును దుయ్యబట్టారు. వీరికి వైఎస్సార్ సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి మద్దతు పలికారు పిడుగురాళ్ల టౌన్: పల్నాడు ప్రాంతంలోని మాచవరం మండలంలో టీడీపీ నేతల అరాచకాలు అధికమయ్యాయి. వీరికి పోలీసులు వంతపలకడంతో వారి దుర్మార్గాలకు అంతులేకుండా పోయింది. ఇదేమని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తూ స్టేషన్లో వేయిస్తున్నారు. అధికారం మాది, అధికారులూ మా వాళ్లే అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. చివరకు మహిళలనూ పరుష పదజాలంలో దుర్భాషలాడుతున్నారు. పండుగ సమయాల్లో ముగ్గులు వేస్తే వాటిపై పసుపు రంగు చల్లి అవహేళన చేస్తున్నారు. ఇంటి ముందు అభిమానంతో ప్లెక్సీలు ఏర్పాటు చేస్తే తొలగించాలని ఆదేశిస్తున్నారు. లేదంటే నిర్దాక్షిణ్యంగా తొలగించేస్తున్నారు. వీరి దౌర్జన్యాలు, ఆగడాలను భరించలేక మండలంలోని మోర్జంపాడు గ్రామ మహిళలు వందలాదిగా ఏకమై పిడుగురాళ్ల రూరల్ పోలీస్స్టేషన్ ఎదుట అద్దంకి–నార్కెట్పల్లి రహదారిపై ఆదివారం బైఠాయించి నిరసన తెలిపారు. వీరికి వైఎస్సార్ సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్రెడ్డి మద్దతుగా నిలిచారు. మాచవరం మండలంలోని మోర్జంపాడు వైఎస్సార్ సీపీకి పట్టున్న గ్రామం. ఇది తట్టుకోలేని టీడీపీ నాయకుడు జీవీఆర్, మరో ఇద్దరు గత కొన్ని నెలలుగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు, అభిమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన మహిళలు పిడుగురాళ్ల రూరల్ పోలీస్స్టేషన్ ఎదుట రాస్తారోకో చేశారు. టీడీపీ నాయకులపై చర్యలు తీసుకునేంత వరకు రాస్తారోకో విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గ్రామంలో రాత్రి పూట బయటకూర్చొనే పరిస్థితి లేదని, మద్యం సేవించి సీసాలను ఇళ్లల్లో వేస్తున్నారని తెలిపారు. బాంబులు విసరడం లాంటి కవ్వింపు చర్యలకూ పాల్పడుతున్నారు. దాడి చేసి మాపైనే కేసులు: మహిళలు అరాచకాలపై ప్రశ్నిస్తే టీడీపీ నాయకుడు ఒకరు తమను కొట్టి తిరిగి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారన్నారు. ‘బాస్ చెప్పారు. వాళ్లని లోపల వేసి కొట్టండి’ అని హుకుం జారీ చేయడంతో ఎస్ఐ కూడా జీ హుజూర్ అంటూ వైఎస్సార్ సీపీ వాళ్లపై కేసులు నమోదు చేస్తున్నారని మహిళలు వాపోయారు. అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారంటూ అవేదన వ్యక్తం చేశారు. ఇటీవల 200 వందల మంది మాచవరం పోలీస్స్టేషన్ వద్ద ధర్నాచే స్తే ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. తమ ఇళ్లకు టీడీపీ రంగులు వేయటం, బ్యానర్లు పీకేయడం ఇలా ఎన్నో రకాలుగా పోలీసులను అడ్డుపెట్టుకుని జీవీఆర్ అనే నాయకుడు మండలంలో అరాచకాలు సృష్టిస్తున్నారని తెలిపారు. అతని అరాచకాలను ఆపాలని రూరల్ సీఐ సుబ్బారావు వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. మహిళలనూ దుర్భాషలాడి వేధించడంతో తమ దగ్గరకు వచ్చామని సీఐకు వివరించారు. మహిళల ఆవేదనపై ఎస్ఐ వెటకారం పోలీస్స్టేషన్లోకి కాసు మహేష్రెడ్డితోపాటు మహిళలను పంపించాలని మాచవరం ఎస్ఐ జగదీష్ను సీఐ ఆదేశించారు. ఎస్ఐ మహిళలతో మాట్లాడుతూ అక్కడ వారు పసుపు నీళ్లు చల్లారని ఇక్కడ రోడ్లపై రంగులు చల్లుతారా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. పక్కనే ఉన్న మహేష్రెడ్డి ఆగ్రహించి ‘మాచవరం మండలంలో అధికార పార్టీ వారితో రంగులు చల్లిస్తున్నావు కదా ఇక చాల్లే’ అంటూ మండిపడ్డారు. అతని ప్రవర్తనపై మహేష్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇంత జరిగినా ఎస్ఐ జగదీష్లో మార్పు రాలేదంటూ మహిళలు మండిపడ్డారు. అధికారుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయకపోతే వెయ్యి మందితో ధర్నా చేస్తాం: కాసు మహేష్ రెడ్డి మహిళలకు మద్దతు పలికిన కాసు మహేష్రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అరాచకాలు అధికమయ్యాయని, పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్ సీపీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ‘భయపడితే భయపడం.. ఇప్పుడు న్యాయం జరుగుతుందని 500 మందితో వచ్చాం.. పోలీసులు న్యాయం చేయకపోతే 1000 మందితో గుంటూరులో ధర్నా చేపడతామ’ని హెచ్చరించారు. ఆయన వెంట జెడ్పీటీసీ వీరభద్రుని రామిరెడ్డి, పట్టణ, మండల నాయకులు, వందలాది మంది కార్యకర్తలు ఉన్నారు. -
గంజాయి గురజాలగా మార్చేస్తున్నారు
పట్నంబజారు(గుంటూరు): చారిత్రక ప్రాధాన్యం కలిగిన పల్నాడు ప్రాంతం.. సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న జిల్లా.. రాష్ట్ర రాజధాని ప్రాంతంలో.. గురజాలను గంజాయి మయంగా మార్చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేకాట, గనులు, మద్యం అమ్మకాలు, కాంట్రాక్టర్ల నుంచి పర్సంటేజీల వరకు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు సంబంధం లేదా అని సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం తీసివేసిన జీవీఆర్ క్లబ్ నిర్వాహకులు.. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలను వదిలేసి మారుమూల గ్రామంలో క్లబ్ పెట్టేందుకు ఎమ్మెల్యే యరపతినేని సహకరించారనేది వాస్తవం కాదా అని నిలదీశారు. అరండల్పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రూ.కోటి విలువ చేసే గంజాయిని క్యాపిటల్ కల్చరల్ క్లబ్కు తీసుకెళ్తున్నట్లు ఆ వాహన డ్రైవర్ పోలీసుల వద్ద ఒప్పుకొన్న విషయం విదితమేనన్నారు. ఎమ్మెల్యే అండదండలు ఉండటంతోనే ఆగడాలు అధికమైపోతున్నాయని ధ్వజమెత్తారు. బెల్టుషాపులతో యువత, విద్యార్థులు పెడదోవ పడుతున్నారని, కొత్తగా గంజాయితో వారి జీవితాలను నాశనం చేసే చర్యలపై తీవ్రంగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. ఎస్ఐ, సీఐ, డీఎస్పీలను ఆయనకు కావాల్సిన వారికి పోస్టింగ్లు ఇప్పించిన యరపతినేని, ఇదేమని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. గంజాయి అంశానికి సంబంధించి తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాసంఘాలు, కమ్యూనిస్టు పార్టీలను కలుపుకొని పేకాటకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాను పేకాట ఖిల్లాగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. పిడుగురాళ్ల సీఐ హనుమంతరావు అధికార పార్టీ పక్షాన ఉద్యోగం చేస్తున్నారన్నారు. ఘర్షణ జరిగితే దెబ్బలు తగిలినా... ప్రతిపక్షంపై కేసులు నమోదు చేయటం సీఐకి పరిపాటిగా మారిందన్నారు. వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు కొత్తా చిన్నపరెడ్డి, బండారు సాయిబాబు, కోవూరి సునీల్కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం - దుర్మార్గపు పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర్లోనే ఉంది - అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అన్ని వర్గాలనూ మోసం చేశారు - మహేశ్రెడ్డి చేరిక సందర్భంగా నరసరావుపేటలో భారీ బహిరంగ సభ సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: మోసకారి పాలకులు రాష్ట్రాన్ని అడ్డగో లుగా అమ్మేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. అబద్ధాలు, మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసే నాయకుడిని కాలర్ పట్టుకొని నిలదీయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. అలా నిలదీస్తేనే రాజకీయా ల్లో ఉన్న నాయకులకు భయం కలుగుతుందని.. అబద్ధాలు, మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేయాలనుకొనే నేతలు వెనక్కి తగ్గుతారన్నారు. కాసు మహేశ్రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరుతున్న సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పోటెత్తిన జనసందో హాన్ని ఉద్దేశించి జగన్ మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ప్రజలు అల్లాడిపో తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లడబ్బుతో తెలంగా ణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ చంద్రబా బు అడ్డంగా దొరికిపోయారని, ఆడియో, వీడియో టేపులు కూడా బయటకు వచ్చాయ న్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని ముఖ్యమంత్రిపై ధ్వజ మెత్తారు. మనకు రావాల్సిన నీళ్లను ఎగువ నుంచి తెలంగాణ ఎత్తుకుపోతున్నా గట్టిగా నిలదీసే పరిస్థితి సీఎంకు లేకుండా పోయిందన్నారు. ప్రధానమంత్రి మోదీని చూసి చంద్రబాబు వణికిపోతున్నారని చెప్పా రు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ మాట తప్పిన బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయ లేక నీళ్లు నములుతున్నారని ఆరోపించారు. గట్టిగా నిలదీస్తే.. ఈ రెండున్నరేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశిస్తారనే భయం చంద్రబాబును వెం టాడుతోందని వివరించారు. అబద్ధాలు చెప్పి మోసం చేస్తే చూస్తూ ఊరుకోబోమనే సంకేతాన్ని ప్రజలు పాలకులకు ఇవ్వాల న్నారు. టీడీపీ దుర్మార్గపు పాలనను అంతం చేయడానికి అందరమూ ఒక్కటవుదామని పిలుపునిచ్చారు.బాబు కాలర్ పట్టుకొని దుర్మార్గపు పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర్లోనే ఉందని స్పష్టం చేశారు. సభలో జగన్ ఇంకా ఏం చెప్పారంటే... ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవస రం లేదు. నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పు డూ ఒకమాట చెబుతుండేవారు. ఎన్నాళ్లు బతికామన్నది కాదు.. బతికినంత కాలం ఎలా బతికామన్నదే ముఖ్యమని అనేవారు. అబద్ధా లు చెప్పి, మోసం చేసే ముఖ్యమంత్రి వద్దని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. నాయకుడంటే ప్రజలంతా గర్వంగా చెప్పుకునేలా ఉండాలి. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలను మోసం చేసిన వాడు తమ నాయకుడని ప్రజలు సిగ్గుతో తలదిం చుకొనే విధంగా ఉండకూడదు. చంద్రబాబు చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చారు. రైతు రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. బాబు వచ్చారు.. బ్యాంకుల నుంచి బంగారం ఇంటికి రాలేదు.. నోటీసులు మాత్రం వచ్చాయి. రుణమాఫీ చేయకుండా రైతులను దగా చేశారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి.. ఒక్క పైసా కూడా మాఫీ చేయకుండా అక్కచెల్లెమ్మలను వంచించారు. మోసం చేయకుండా సమాజంలోని ఏ వర్గాన్నీ వదల్లేదు. బాబొస్తే జాబొస్తుందంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు. ఉద్యోగం ఇవ్వలేక పోతే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అం దజేస్తామన్నారు. గద్దెనెక్కాక ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపాన పోలేదు’’ అని జగన్ నిప్పులు చెరిగారు. జంగా కృష్ణమూర్తికి అన్యాయం జరగదు ‘‘ఈ రోజు కాసు మహేశ్రెడ్డిని మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. నాకు తోడుగా రా.. అన్నగా నీకు అండగా నిలుస్తానని చెబుతున్నా. చంద్రబాబు నాయుడు పాలన తో ప్రజలు పూర్తిగా విసుగెత్తిపోయారు. ఆయన చేసిన మోసాల వల్ల జనం అగచాట్లు పడుతున్నారు. ఇలాంటి మోసపూరిత పాలనకు చరమగీతం పాడాలంటే మనమం తా ఒక్కటి కావాలి. అందులో భాగంగానే మహేశ్రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాను. మహేశ్ రాక వల్ల నరసరావుపేటలో గందర గోళం(కన్ఫ్యూజన్) నెలకొంటుందని తెలుగు దేశం పార్టీ నాయకులు ఆనందంగా ఎదురు చూస్తున్నారమో! ఎలాంటి గందరగోళం ఉండదని నేను గట్టిగా చెబుతున్నా. కారణం ఏమిటంటే.. మహేశ్ను చేర్చుకునే ముందు గురజాల నియోజకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తితో మాట్లాడాను. ప్రజలను అడు గడుగునా వంచిస్తున్న చంద్రబాబు ప్రభు త్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని జంగన్న (జంగా కృష్ణమూర్తి)తో చెప్పా. తర్వాత ఇద్దరం కలసికట్టుగా ఆలోచన చేశాం. గురజా ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సాగిస్తున్న దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. క్లబ్బుల దగ్గర్నుంచి మైన్ల దాకా.. ఇసుక దగ్గర్నుంచి చివరకు సినిమా థియేటర్ల దాకా అంతటా అరాచకమే. అక్కడ రౌడీయి జమే రాజ్యమేలుతోంది. ఇలాంటి దారుణాల కు అడ్డుకట్ట వేయడానికి యువకుడు, ఉత్సా హవంతుడు అయిన మహేశ్రెడ్డిని తీసుకొద్దా మని చెప్పా. గురజాల నియోజకవ ర్గంలో నిలబడుతున్న నా తమ్ముడు మహేశ్ను ఆశీర్వ దించాలని ప్రజలను కోరుతున్నా. నరసరావు పేట నియోజకవర్గంలో అందరికీ పరిచయçస్తు డు, డాక్టరు, సౌమ్యుడైన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొనసాగుతారు. నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత జంగన్న లాంటి వాళ్లు నాకు నాన్నగా అండగా నిలిచా రు. ఎట్టిపరిస్థితుల్లోనూ జంగన్నకు అన్యాయం జరగదని గట్టిగా చెబుతున్నా. నేను ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి న ఆరు నెలలకే జంగన్నను చట్టసభల్లోకి తీసు కొచ్చి నా పక్కన కూర్చోబెట్టుకుంటానని సభాము ఖంగా చెబుతున్నా’’ అని జగన్ అన్నారు. బాబు మోసం చేశారు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారా? లేదా? సభికులను జగన్ అడిగారు. ఇచ్చారని సభికుల నుంచి సమాధానం వచ్చింది. చేతులు ఊపుతో చెప్పాలని జగన్ కోరడంతో.. అందరూ చేతులు పైకెత్తారు. బాబు మోసం చేశారని బిగ్గరగా బదులిచ్చారు. రుణమాఫీ జరిగిందా? సభికులకు మళ్లీ జగన్ ప్రశ్న. లేదు.. లేదు.. అని సభికుల సమాధానం. రెండు చేతులూ పైకెత్తి.. చేయి తిప్పుతూ.. రుణమాఫీ జరిగిందో.. లేదో.. చూపించాలని జగన్ అడిగారు. కిక్కిరిసిన సభలో అందరూ చేతులు పైకెత్తి రుణమాఫీ చేయలేదంటూ చేతులు తిప్పారు. రుణమాఫీ చేస్తానని బాబు మోసం చేశారా? లేదా? మళ్లీ జగన్ ప్రశ్న. బాబు మోసం చేశాడు.. సభికుల సమాధానం. రెండు చేతులు పైకెత్తి చెప్పాలని మళ్లీ జగన్ సూచన. సభలో ఉన్న వారంతా చేతులు పైకెత్తి మోసం చేశారన్నట్లుగా చేతులు ఊపారు. బాబు మోసం చేశారంటూ గట్టిగా చెప్పాలని జగన్ మళ్లీ అడిగారు. ‘బాబు మోసం చేశారు’ అని ప్రజలు గట్టిగా నినదించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని అక్కచెల్లెమ్మలను, బాబు వస్తే జాబు వస్తుందంటూ యువతకు చేసిన మోసం గురించీ ఇదే విధంగా జగన్ సభలో ఉన్న వారిని అడిగారు. రెండు చేతులు పైకెత్తి.. చేతులు తిప్పుతూ.. బాబు మోసం చేశారంటూ ప్రజలు నినదించారు. కాగా కాసు మహేశ్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ఆలస్యమైందనీ అంతం వరకూ వైఎస్సార్సీపీ ఉంటానన్నారు. జగన్ను ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రానికి పట్టిన శనిని వదిలించాలన్నారు. -
అప్పటి వరకు విశ్రమించేది లేదు..
-
‘బాబును బంగాళాఖాతంలో కలపడం ఖాయం’
నరసరావు పేట: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మోసపూరిత, కుట్ర పూరిత ప్రభుత్వం కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోసపూరిత చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళా ఖాతంలో కలిపే రోజు వచ్చిందనీ ఆయన హెచ్చరించారు. ప్రజలకు తోడుగా నిలబడాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అడ్డగోలుగా అమ్మేస్తున్నారని నిప్పులు చెరిగారు. గురజాల ఎమ్మెల్యే చేస్తున్న ఆరాచకాలు అన్నీ ఇన్నీ కావని, రాష్ట్రంలో చాలా దారుణమైన పాలన ఉందని, అది చూసి బాబు కార్యకర్తలు కూడా సిగ్గుపడుతున్నారని తెలిపారు. శుక్రవారం నరసరావుపేట రెడ్డి కాలేజీ గ్రౌండ్స్ లో జరిగిన భారీ బహిరంగ సభలో అశేష జన సందోహం మధ్య కాసు మహేష్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజల హర్షధ్వానాల మధ్య మహేష్ రెడ్డిని పార్టీలో చేర్పించుకుంటున్నట్టు జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. మషేష్ రెడ్డికి అన్ని వేళల్లో తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హాజరైన జనవాహినిని ఉద్దేశించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తూ, చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత పరిపాలనపై నిప్పులు చెరిగారు. జగన్ ప్రసంగం కొనసాగినంత సేపు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన లభించింది. ప్రజలతో కిక్కిరిసిన రెడ్డి కాలేజీ మైదానం ఇసుకేస్తే రాలనంతగా హాజరయ్యారు. ఆ సభలో జగన్ చెప్పిన ప్రతి మాటకు ప్రజల నుంచి చప్పట్లు కేరింతలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు, అధికారం చేపట్టిన తర్వాత అమలు చేయకపోవడంపై పలు అంశాలను ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి ఉటంకించగా అవును... అమలు చేయలేదంటూ ప్రజల నుంచి పెద్దపెట్టిన ప్రతిస్పందనలు వినిపించాయి. నిజానికి ఈ సభ సాయంత్రం 4 గంటలకే జరగాల్సి ఉండగా, జిల్లాలో అడుగుపెట్టింది మొదలు మార్గమధ్యంలో అన్ని చోట్ల ప్రజలు జగన్ కలవడానికి పెద్ద ఎత్తున తరలిరావడం, ఆయనను నిలువరించి స్వాగతం పలకడం, ఆయనతో కరచాలనం చేయడానికి పెద్దా చిన్నా అన్న తేడా లేకుండా ఎగబడటంతో ఆయన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకోవడానికి ఆలస్యమైంది. సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన సభ 8 గంటల సమయంలో మొదలైంది. జగన్ అక్కడికి చేరుకోవడం గంటల కొద్దీ ఆలస్యమైనప్పటికీ జనంలో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ప్రత్యేకంగా యువకులు పెద్దఎత్తున హాజరు కావడం, ఆయన మాట్లాడుతున్నప్పుడు అడుగడుగునా చప్పట్లు చరుస్తూ, కేరింతలు కొడుతూ ఊత్సాహం ప్రదర్శించడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రం అనేక సమస్యలతో సతమతమవుతోందని, ఇలాంటి సమయంలో ప్రజలకు తోడుగా నిలవాల్సిన సీఎం చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా అమ్మేస్తున్నారని జగన్ మోహన్ రెడ్డి చెప్పినప్పుడు జనం విశేషంగా స్పందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పినట్టుగా... ఎన్నాళ్లు బతికామన్నది కాదు.. బతికినంత కాలం ఎలా బతికామన్నది నాయకుడికి ముఖ్యమని జగన్ గుర్తుచేస్తూ ప్రతి కార్యకర్త సగర్వంగా తలెత్తుకునేలా నాయకుడు ఉండాలన్నారు. అయితే చంద్రబాబు నాయుడును చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని మండిపడ్డారు. నిత్యం అబద్దాలు ఆడటం... మోసాలు చేయడం... ఇదే ఆయన నాయకత్వం అని దుయ్యబట్టారు. చంద్రబాబు మోసాలు, అబద్దాలకు సంబంధించి పలు అంశాలను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. అవినీతిలో ఏపీని నెంబర్ 1 చేసిన ఘనుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వస్తే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు... చివరికి ఏమైంది... రైతులను నిలువునా మోసం చేశారు... అవునా... కాదా.. మీరేమంటారు? అని సభికులను ప్రశ్నించినప్పుడు అవును.. అవును అంటూ దిక్కులు పిక్కటిల్లేలా చెప్పారు. అనంతరం వారినుద్దేశించి చంద్రబాబు పాలన బంగాళా ఖాతంలో పడేందుకు ఇక రెండేళ్ల గడువుందని, కాలం కలిసొస్తే ఏడాదిలోనే పడుతుందని, అప్పటి వరకు వేచి ఉండాలని కోరారు. అధికారంలోకి వస్తే బ్యాంకుల్లో పెట్టిన బంగారం తెచ్చిస్తామన్నారు. మరి ఆయన ఇప్పుడేం చేశారు. డ్వాక్రా మహిళలను మోసం చేశారు... మీరేమంటారని మళ్లీ ప్రశ్నించగా అవునంటూ దద్దరిల్లే సమాధానం సభ నుంచి వచ్చింది. ఇలా నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి చెల్లించడానికి సంబంధించి, ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన అనేక హామీలను ప్రస్తావించి అధికారం చెపట్టిన తర్వాత ఏ విధంగా మోసం చేశారన్న విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి ఎండగట్టారు. ఈ రకంగా చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలు... నోరు తెరిస్తే మోసం చేయడం మామూలైపోయిందని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఇలా అబద్ధాలు చెప్పే... ఈ రకంగా మోసం చేసే నాయకులను బంగాళాఖాతంలో కలపాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పారు. ఇలాంటి నాయకులను బంగాళాఖాతంలో కలపడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేసులకు భయపడి... చంద్రబాబు తనపైన కేసులు ఎక్కడ వచ్చి పడుతాయోననీ, ఇప్పటికే ఇరుక్కున్న కేసుల్లో ఎక్కడ తెరమీదకు వస్తాయోనన్న భయంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నా అటు కేంద్రంపైన గానీ ఇటు తెలంగాణ ప్రభుత్వంపైన గానీ నోరు మెదపడం లేదని జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. పైన తెలంగాణ ప్రాజెక్టులు కట్టి నీటిని ఎత్తుకుపోతుంటే చంద్రబాబు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. తెలంగాణ ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి ఎమ్మెల్యేలకు ఇక్కడి నుంచి బ్లాక్ మనీని తీసుకెళ్లి సూట్ కేసుల్లో పెట్టి ఇస్తుంటే... ఆ కేసులో చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయారని గుర్తుచేశారు. ఆ కేసుకు సంబంధించి ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన ఆ కేసులకు, అవన్నీ బయట పడుతాయని భయపడి చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నా మాట్లాడటం లేదని విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని విభజించినప్పుడు బీజేపీతో కలిసి ప్రత్యేక హోదా తెస్తామన్నారని ఆనాటి ఘటనలను గుర్తూచేస్తూ, ఆ హామీతోనే ఆరోజు రాష్ట్రాన్ని విడదీశారని విడమరిచి చెప్పారు. అదే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ చంద్రబాబు రాష్ట్రానికి అత్యంత ఆవశ్యకమైన ప్రత్యేక హోదా గురించి అడిగే పరిస్థితి లేరని పేర్కొంటూ అందుకు కారణాలను విశ్లేషించారు. గడిచిన రెండున్నరేళ్లలో చంద్రబాబు విచ్చలవిడి అవినీతి పాల్పడ్డారని, కేంద్రాన్ని ఏమనడిగినా తన అవినీతిపై సీబీఐ విచారణ జరిపిస్తారని భయపడి అడగటం లేదని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అవస్థలు పడుతున్నారు. ప్రజలను విస్మరించిన చంద్రబాబు, ఆయన పాలన అంతం కావాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజలిచ్చే తీర్పుతో నాయకులు ఇక అబద్దాలు చెప్పాలంటే... మోసం చేయాలంటే... భయపడే పరిస్థితి రావాలి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బాబు మోసాలకు, అబద్దాలకు ఫలితంగా ఆయనను బంగాళాఖాతంలో కలిపే రోజు తప్పదని చెప్పారు. ఈరోజు పార్టీలో చేరిన మహేష్ రెడ్డి తన తమ్ముడి లాంటి వాడని, ఆయనను అందరూ ఆశీర్వదించాలని జగన్ ప్రజల హర్షధ్వానాల మధ్య కోరారు. ఇక్కడ రాజకీయంగా ఎలాంటి గందరగోళం ఉండదని స్పష్టం చేశారు. -
‘బాబును బంగాళాఖాతం లో కలపడం ఖాయం’
-
వైఎస్ఆర్సీపీలో చేరిన కాసు మహేష్ రెడ్డి
-
వైఎస్ఆర్సీపీలో చేరిన కాసు మహేష్ రెడ్డి
నరసరావు పేట: రాజన్న రాజ్యం వచ్చే వరకు విశ్రమించబోమని, అప్పటి వరకు వరకు వైఎస్ జగన్ వెంట ఉండి పోరాడుతా అన్నారు కాసు మహేష్ రెడ్డి. ఆయన శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున జేజేల నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. గుంటూరు జిల్లా నరసరావు పేటలో శుక్రవారం సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలల్లో వచ్చారు. సభా ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. 'పౌరుషాలకు, ప్రతాపాలకు మారు పేరు పల్నాడు. ఏపీలో దుర్మార్గపు పాలన జరగుతోంది. చంద్రబాబు నియంతలా పాలిస్తున్నారు. నాగార్జున సాగర్ ను శ్మశానం చేసే కుట్ర చేస్తున్నారు. ప్రజల రుణం తీర్చుకునేందుకే వైఎస్ఆర్ సీపీలోకి వచ్చా. జగన్ ను సీఎం చేసి ఈ ప్రాంతానికి పట్టిన శని వదిలిద్దాం' అన్నారు. -
వైఎస్సార్సీపీ గూటికి కాసు మహేశ్రెడ్డి
- పార్టీ అధినేత వైఎస్ జగన్తో భేటీ - ఈ నెల 16న పార్టీలో చేరిక సాక్షి, అమరావతి బ్యూరో/హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనుమడు, కాంగ్రెస్ మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తనయుడు కాసు మహేశ్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, పార్టీ ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి, నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలతో కలిసి మహేశ్రెడ్డి ఆదివారం హైదరాబాద్ లోటస్పాండ్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి షరతులు లేకుండా తాను పార్టీలో చేరాలనుకుంటున్నట్లు వివరించారు. కలిసి పని చేద్దాం, పార్టీలోకి రండి అని వైఎస్ జగన్ ఆహ్వానించారని తెలిపారు. తన తండ్రి కాసు కృష్ణారెడ్డి 1978లో తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి సుదీర్ఘకాలంపాటు ఒకే సిద్ధాంతం కోసం పోరాడారన్నారు. తాను కూడా జగన్తో కలిసి పని చేయాలనే నిర్ణయానికి వచ్చానన్నారు. నరసరావుపేటలో ఈ నెల 16న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీలో అధికారికంగా చేరనున్నట్లు ప్రకటించారు. కాసు మహేశ్రెడ్డిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించినట్లు మర్రి రాజశేఖర్ తెలిపారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర గలిగిన కాసు కుటుంబం వైఎస్సార్సీపీలో చేరడం పార్టీకి రాష్ట్రంలో ఊపునిస్తుందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. అందరం కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. మహేశ్ చేరిక జిల్లాలో పార్టీ బలోపేతం కావడానికి తోడ్పడుతుందని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. కలిసి మెలిసి పని చేయడానికి తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. మహేశ్రెడ్డి చేరికను ఆహ్వానిస్తున్నట్లు జంగా కృష్ణమూర్తి చెప్పారు. మహేశ్రెడ్డి 2004 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో తన తండ్రి కాసు కృష్ణారెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారు. -
వైఎస్సార్సీపీ గూటికి కాసు మహేశ్రెడ్డి
-
నరసరావుపేట ఎంపీగా పోటీ చేయను: కాసు
గుంటూరు : గుంటూరు జిల్లాలో కాంగ్రెస్కు తనయుడు ఝలక్ ఇస్తే తండ్రి మరో షాక్ ఇచ్చారు. నరసరావుపేట ఎంపీగా పోటీ చేయటం లేదంటూ మాజీమంత్రి కాసు కృష్ణారెడ్డి ప్రకటించారు. మరో అభ్యర్థిని చూసుకోవాలని ఆయన కాంగ్రెస్ హైకమాండ్కు సూచించారు. కాగా నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనని కాసు కృష్ణారెడ్డి తనయుడు మహేష్ రెడ్డి నిన్ననే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాగా నరసరావుపేట నియోజకవర్గంలో 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతోనే అనుబంధం ఉన్న కాసు కుటుంబం కాంగ్రెస్ పార్టీ తరపును పోటీ చేయటం లేదంటూ ప్రకటించటం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. నామినేషన్లకు మరో రెండు రోజులే గడువు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయా స్థానాల్లో కొత్త అభ్యర్థులను వెతుక్కోవటం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందనే చెప్పుకోవాలి. ఇక మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూడా పోటీ చేయటం లేదంటూ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ నుంచా.. మేమా.. పోటీ చేయం
గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఇద్దరు అభ్యర్థులు ఆ పార్టీకి కోలుకోలేని ఝలక్ ఇచ్చారు. నరసరావుపేట, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసిన కాసు మహేశ్ రెడ్డి, కాండ్రు కమల.. ఇద్దరూ తాము పోటీ చేసే ప్రసక్తి లేదని తేల్చిచెప్పేశారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించి తీరుతో విసుగెత్తిపోయిన ప్రజలు ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో, పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవని, పైగా అనవసరంగా బోలెడు ఖర్చవుతుందని భావించే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి అధిష్ఠానం ఎంపిక చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆ వెంటనే బీజేపీలో చేరిపోతే.. ఇప్పుడు వీళ్లిద్దరూ ఈ రకమైన ఝలక్ ఇచ్చారు.