Kumar Sangakkara
-
ఉత్కంఠ పోరులో లంకపై గెలుపు.. భారత్తో ఫైనల్లో వెస్టిండీస్
అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్-2025 (International Masters League)లో వెస్టిండీస్ ఫైనల్కు దూసుకువచ్చింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన రెండో సెమీ ఫైనల్లో శ్రీలంక మాస్టర్స్ (Sri Lanka Masters)ను చిత్తు చేసి.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది. రాయ్పూర్ వేదికగా వెస్టిండీస్ (West Indies Masters)- శ్రీలంక మధ్య శుక్రవారం రాత్రి మ్యాచ్ జరిగింది.టాస్ గెలిచిన శ్రీలంక మాస్టర్స్షాహిద్ వీర్ నారాయణన్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన శ్రీలంక మాస్టర్స్.. వెస్టిండీస్ మాస్టర్స్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో విండీస్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్లలో డ్వేన్ స్మిత్(0) విఫలం కాగా.. విలియం పెర్కిన్స్(24) ఫర్వాలేదనిపించాడు.రామ్దిన్ ధనాధన్వన్డౌన్ బ్యాటర్ లెండిల్ సిమ్మన్స్(12 బంతుల్లో 17) వేగంగా ఆడగా.. కెప్టెన్ బ్రియన్ లారా దంచికొట్టాడు. 33 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 41 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో చాడ్విక్ వాల్టన్తో కలిసి దినేశ్ రామ్దిన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.వాల్టన్ 20 బంతుల్లో 31 పరుగులు చేసి నిష్క్రమించగా.. రామ్దిన్ మాత్రం 22 బంతుల్లోనే 50 రన్స్ సాధించి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. శ్రీలంక బౌలర్లలో నువాన్ ప్రదీప్, జీవన్ మెండిస్, అసేల గుణరత్నె ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.గుణరత్నె ఒంటరిపోరాటం వృథాఇక లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆఖరి వరకు అద్భుత పోరాటం చేసింది. ఓపెనర్లలో ఉపుల్ తరంగ(30) రాణించగా.. కెప్టెన్ కుమార్ సంగక్కర(17), వన్డౌన్లో వచ్చిన లాహిరు తిరిమన్నె(9) పూర్తిగా నిరాశపరిచారు.ఇలాంటి తరుణంలో అసేల గుణరత్నె ఒంటరిపోరాటం చేశాడు. 42 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 66 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా ఇసురు ఉడానా(10 బంతుల్లో 21), దిల్రువాన్ పెరీరా(6 బంతుల్లో 11) రాణించారు. కానీ విండీస్ బౌలర్ల విజృంభణ కారణంగా శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 173 పరుగుల వద్ద నిలిచింది.ఫలితంగా ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది వెస్టిండీస్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. విండీస్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ టినో బెస్ట్ (4/27) అత్యుత్తమంగా రాణించగా.. డ్వేన్ స్మిత్ రెండు, ఆష్లే నర్స్, జెరోమ్ టేలర్, లెండిల్ సిమ్మన్స్ ఒక్కో వికెట్ తీశారు.ఇండియాతో ఫైనల్కాగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో మాస్టర్స్ లీగ్కు ఈ ఏడాది శ్రీకారం చుట్టారు. ఇండియా మాస్టర్స్, శ్రీలంక మాస్టర్స్, ఇంగ్లండ్ మాస్టర్స్, సౌతాఫ్రికా మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్ జట్లు ఇందులో భాగమయ్యాయి. నవీ ముంబై, వడోదర, రాయ్పూర్లో మ్యాచ్లను షెడ్యూల్ చేశారు.ఇక తొలి సెమీస్లో ఇండియా ఆసీస్ను ఓడించి ఫైనల్కు చేరుకోగా.. రెండో సెమీ ఫైనల్లో విండీస్ లంకపై గెలుపొందింది. ఇండియా మాస్టర్స్- వెస్టిండీస్ మాస్టర్స్ మధ్య ఆదివారం(మార్చి 16) నాటి ఫైనల్కు రాయ్పూర్ వేదిక. చదవండి: ఉన్నదే ఒక్కడు.. మీరు కాస్త నోళ్లు మూయండి: పాక్ మాజీ స్పిన్నర్ ఫైర్ View this post on Instagram A post shared by INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) -
IND Vs PAK: విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డు.. సచిన్కు సాధ్యం కాని ఘనత
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డు(Virat Kohli World Record) సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్, క్రికెట్ దేవుడుగా పేరొందిన సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) ఆల్టైమ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా ఈ అరుదైన ఘనత సాధించాడు.రాణించిన భారత బౌలర్లుకాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా భారత్ ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఢీకొట్టింది. దుబాయ్లో టాస్ ఓడి తొలుత ఫీల్డింగ్ చేసిన రోహిత్ సేన.. రిజ్వాన్ బృందాన్ని 241 పరుగులకు కట్టడి చేసింది. టీమిండియా బౌలర్లలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రెండు కీలక వికెట్లు కూల్చాడు.మిగతా వాళ్లలో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీయగా.. పేసర్లలో హర్షిత్ రాణా కూడా ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇక పాక్ విధించిన 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు.ఈ క్రమంలో 15 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 20 పరుగులు చేసిన హిట్మ్యాన్.. పాక్ ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది వేసిన అద్భుత బంతికి బౌల్డ్ అయ్యాడు. దీంతో రోహిత్ స్థానంలో క్రీజులోకి వచ్చిన కోహ్లి గిల్తో కలిసి నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అయితే, పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ సూపర్ డెలివరీతో గిల్(46)ను పెవిలియన్కు పంపాడు.తొలి క్రికెటర్గా వరల్డ్ రికార్డుఈ నేపథ్యంలో సరిగ్గా వంద పరుగులు చేసిన తర్వాత టీమిండియా రెండో వికెట్ కోల్పోగా.. కోహ్లి ఆచితూచి ఆడుతూ సహనం ప్రదర్శించాడు. ఈ క్రమంలో పదిహేను పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి వన్డేల్లో 14000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్గా ఈ రన్మెషీన్ నిలిచాడు. అంతేకాదు.. అత్యంత వేగంగా అంటే.. తక్కువ ఇన్నింగ్స్లోనే ఈ మైల్స్టోన్ అందుకున్న తొలి క్రికెటర్గా వరల్డ్ రికార్డు సాధించాడు.కాగా వన్డేల్లో పద్నాలుగు వేల పరుగులు చేయడానికి సచిన్ టెండుల్కర్కు 350 ఇన్నింగ్స్ అవసరమైతే.. కోహ్లి 287వ ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. తద్వారా 300లోపు ఇన్నింగ్స్లోనే ఈ ఫీట్ నమోదు చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే వన్డేల్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో కోహ్లి మూడో స్థానానికి ఎగబాకాడు. ఇదిలా ఉంటే.. పాక్తో మ్యాచ్లో శతకంతో లక్ష్య ఛేదన పూర్తి చేసి జట్టును గెలిపించాడు.వన్డేల్లో అత్యధిక పరుగుల వీరులు1.సచిన్ టెండుల్కర్(ఇండియా)- 18426 రన్స్(452 ఇన్నింగ్స్)2.కుమార్ సంగక్కర(శ్రీలంక)- 14234 రన్స్(380 ఇన్నింగ్స్)3.విరాట్ కోహ్లి(ఇండియా)- 14000+ రన్స్(287 ఇన్నింగ్స్)*4. రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా)- 13704 రన్స్(365 ఇన్నింగ్స్)5. సనత్ జయసూర్య(శ్రీలంక)- 13430 రన్స్(433 ఇన్నింగ్స్).చదవండి: కోహ్లి సరికొత్త చరిత్ర.. భారత్ తరఫున తొలి ఆటగాడిగా అరుదైన ఫీట్ -
భారత జట్టు కెప్టెన్గా సచిన్ టెండుల్కర్.. అభిమానులకు పండుగే!
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్(ఐఎమ్ఎల్- International Masters League) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. గతేడాదే ఆరంభం కావాల్సిన ఈ పొట్టి ఫార్మాట్ లీగ్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. అయితే, ఈసారి మాత్రం అలాంటి అడ్డంకులేవీ లేవంటూ నిర్వాహకులు తాజాగా ఐఎమ్ఎల్ ఆరంభ, ముగింపు తేదీలను ప్రకటించారు.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఫిబ్రవరి 22న మొదలై.. మార్చి 16న ఫైనల్తో పూర్తవుతుందని తెలిపారు. ఇందుకు మూడు వేదికలను కూడా ఖరారు చేసినట్లు పరోక్షంగా వెల్లడించారు. కాగా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి రిటైర్ అయిన క్రికెటర్ల మధ్య ఈ టీ20 లీగ్ జరుగనుంది.భారత జట్టు కెప్టెన్గా సచిన్ఇందులో ఆరు జట్లు పాల్గొనున్నాయి. భారత్తో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ టైటిల్ కోసం తలపడనున్నాయి. ఇక ఈ టీ20 లీగ్లో దిగ్గజ క్రికెటర్లు కూడా పాల్గొననుండటం విశేషం. భారత జట్టుకు లెజెండరీ బ్యాటర్, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.మరోవైపు.. వెస్టిండీస్ జట్టుకు రికార్డుల ధీరుడు బ్రియన్ లారా, శ్రీలంక టీమ్కు కుమార్ సంగక్కర, ఆస్ట్రేలియా బృందానికి షేన్ వాట్సన్, ఇంగ్లండ్ జట్టుకు ఇయాన్ మోర్గాన్, సౌతాఫ్రికా టీమ్కు జాక్వెస్ కలిస్ సారథ్యం వహించనున్నారు. ఆ ముగ్గురు కీలకంకాగా ఐఎమ్ఎల్కు సంబంధించి గతేడాది ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. లీగ్ కమిషనర్గా ఎంపికైన టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) మాట్లాడుతూ.. ‘‘ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను మరోసారి ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు ఐఎమ్ఎల్ కృషి చేస్తోంది. క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని అందిస్తామని మాట ఇస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.ఇక ఐఎమ్ఎల్ పాలక మండలిలో గావస్కర్తో పాటు వెస్టిండీస్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్తో పాటు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ కూడా ఉన్నారు. కాగా గతేడాది నవంబరు 17 నుంచి డిసెంబరు 8 వరకు ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ తొలి ఎడిషన్ నిర్వహిస్తామని తొలుత ప్రకటన వచ్చింది. అయితే, అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ ఈ లీగ్ను ఎట్టకేలకు ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని నిర్వాహకులు వెల్లడించారు.వేదికలు అవే?ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్కు సంబంధించిన వేదికలు ఇంకా ఖరారు కానట్లు సమాచారం. అయితే, నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంతో పాటు.. రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియం, రాయ్పూర్లోని షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియాన్ని నిర్వాహకులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.డబుల్ ధమాకాఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో పాటు ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ అర్హత సాధించింది. ఇక ఈ ఐసీసీ టోర్నీ మొదలైన మూడు రోజులకే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ కూడా ఆరంభం కానుండటం.. అందులోనూ సచిన్ టెండుల్కర్ మరోసారి బ్యాట్ పట్టి మైదానంలో దిగడం.. క్రికెట్ ప్రేమికులకు డబుల్ ధమాకా అనడంలో సందేహం లేదు.చదవండి: Ind vs Eng: టీమిండియా బ్యాటింగ్ కోచ్గా అతడు ఫిక్స్!.. వారిపై వేటు? -
ENG VS SL 3rd Test: రూట్ ఖాతాలో భారీ రికార్డు
శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ ఓ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 11 పరుగుల వద్ద రూట్ టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్గా అవతరించాడు. గతంలో ఈ స్థానంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర ఉండేవాడు. సంగక్కర 134 టెస్ట్ల్లో 12400 పరుగులు చేయగా.. రూట్ తన 146వ టెస్ట్లో సంగక్కర రికార్డును బ్రేక్ చేశాడు. సంగక్కర రికార్డు బద్దలు కొట్టాక రూట్ మరో పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం రూట్ ఖాతాలో 12402 పరుగులు ఉన్నాయి. సెకెండ్ ఇన్నింగ్స్లో రూట్ 83 పరుగులు చేసుంటే టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్గా అవతరించేవాడు. ప్రస్తుతం ఆ స్థానంలో ఇంగ్లండ్కే చెందిన అలిస్టర్ కుక్ ఉన్నాడు. కుక్ ఖాతాలో 12472 టెస్ట్ పరుగులు ఉన్నాయి. ఓవరాల్గా టెస్ట్ల్లో అత్యధిక పరుగుల రికార్డు దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ ఖతాలో 15921 పరుగులు ఉన్నాయి. సచిన్ తర్వాత రికీ పాంటింగ్ (13378), జాక్ కల్లిస్ (13289), రాహుల్ ద్రవిడ్ (13288) టాప్-4 టెస్ట్ రన్ స్కోరర్లుగా ఉన్నారు.70 పరుగులకే 6 వికెట్లు..మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలుతుంది. ఆ జట్టు 70 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు కేవలం 132 పరుగుల ఆధిక్యంలో ఉంది. బెన్ డకెట్ 7, డేనియల్ లారెన్స్ 35, ఓలీ పోప్ 7, జో రూట్ 12, హ్యారీ బ్రూక్ 3, క్రిస్ వోక్స్ 0 పరుగులకు ఔటయ్యారు. లంక బౌలర్లలో లహీరు కుమార 3, విశ్వ ఫెర్నాండో 2, అశిత ఫెర్నాండో ఓ వికెట్ తీసి ఇంగ్లండ్ను దెబ్బకొట్టారు.అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌటైంది. 211/5 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. ఓవర్నైట్ స్కోర్కు మరో 52 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్ (154) భారీ శతకంతో కదంతొక్కగా.. బెన్ డకెట్ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.కాగా, శ్రీలంక మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇంగ్లండ్ తొలి రెండు మ్యాచ్ల్లో ఘన విజయాలు సాధించింది. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగుతుంది. -
గంభీర్ అవుట్.. శ్రీలంక క్రికెట్ దిగ్గజానికి ఛాన్స్?
ఐపీఎల్-2025 సీజన్కు ముందు శ్రీలంక మాజీ కెప్టెన్, రాజస్తాన్ రాయల్స్ టీమ్ డైరెక్టర్ కుమార సంగక్కర కొత్త ఫ్రాంచైజీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. రాజస్తాన్ రాయల్స్ హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ నియామకం దాదాపుగా ఖారారు కావడంతో.. టీమ్ డైరెక్టర్గా ఉన్న సంగక్కర ఆ ఫ్రాంచైజీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.స్పోర్ట్స్ టుడే రిపోర్టు ప్రకారం.. ఐపీఎల్ 2025లో సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్గా సంగక్కర బాధ్యతలు చేపట్టేందుకు సిద్దమైనట్లు వినికిడి. ఇప్పటికే అతడితో కేకేఆర్ ఫ్రాంచైజీ చర్చలు జరిపినట్లు స్పోర్ట్స్ టుడే తమ కథనంలో పేర్కొంది. కాగా గత సీజన్లో కేకేఆర్ మెంటార్గా పనిచేసిన గౌతం గంభీర్.. ఆఫ్రాంచైజీని వీడి భారత్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. దీంతో అతడి స్ధానాన్ని ఇంకా ఎవరితో కేకేఆర్ మెనెజ్మెంట్ భర్తీ చేయలేదు. ఈ క్రమంలోనే సంగక్కరతో కేకేఆర్ మెనెజ్మెంట్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ శ్రీలంక క్రికెట్ దిగ్గజం స్ట్రోక్ప్లే, మైండ్ గేమ్కు పెట్టింది పేరు. అతడి నేతృత్వంలోనే ఐపీఎల్-2022లో రాజస్తాన్ ఫైనల్కు చేరింది. -
గిల్క్రిస్ట్ టాప్-3 వికెట్ కీపర్లు వీరే.. ధోనికి ఛాన్స్
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు. తన బ్యాటింగ్, కీపింగ్ స్కిల్స్తో ప్రత్యర్ధిలకు చుక్కలు చూపించిన చరిత్ర గిల్ క్రిస్ట్ది. ఈ ఆసీస్ క్రికెట్ దిగ్గజం తనకు ఇష్టమైన ముగ్గురు వికెట్ కీపర్లను తాజాగా ఎంచుకున్నాడు. అందులో భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంస్ ధోనికి చోటు దక్కింది. అయితే ఈ జాబితాలో మొదటి స్థానం తన రోల్ మోడల్ అయిన ఆసీస్ మాజీ వికెట్ కీపర్ రాడ్నీ మార్ష్కు గిల్క్రిస్ట్ ఇచ్చాడు."రోడ్నీ మార్ష్ నా రోల్మోడల్. అతడిని ఆదర్శంగా తీసుకుని వికెట్ కీపర్గా ఎదిగాను. ఆ తర్వాత నాకు ఇష్టమైన వికెట్ కీపర్ ఎంఎస్ ధోని. ఫీల్డ్లో ధోని ఎల్లప్పుడూ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అతడి కూల్నెస్ అంటే నాకెంతో ఇష్టం. ఇక చివరగా నా మూడో ఫేవరేట్ వికెట్ కీపర్ కుమార్ సంగక్కర. అతడొక క్లాస్. వికెట్ కీపింగ్ స్కిల్స్తో పాటు టాప్ ఆర్డర్లో విజయవంతమైన బ్యాటర్" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు. -
లెఫ్టాండర్స్ టెస్టు, వన్డే అత్యుత్తమ జట్లు ఇవే!
క్రికెట్లో ఎడమచేతి వాటం ఉన్న ఆటగాళ్లు చాలా తక్కువే మందే ఉంటారు. అందులోనూ అత్యుత్తమంగా రాణించేవాళ్లు ఇంకా తక్కువ. అయితే, ఆ జాబితాలో ఈ 22 మందికి తప్పక చోటు ఉంటుంది అంటున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్! ఒకరోజు ఆలస్యంగానైనా సరే.. లెఫ్టాండర్లకు తాను ఇచ్చే ట్రిబ్యూట్ ఇదేనంటూ బుధవారం ఓ ట్వీట్ చేశాడు.ప్రపంచ టెస్టు, వన్డే అత్యుత్తమ లెఫ్టాండర్లతో కూడిన తన తుదిజట్లను ప్రకటించాడు వసీం జాఫర్. టెస్టు ప్లేయింగ్ ఎలెవన్లో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్, శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కరకు చోటిచ్చిన ఈ ముంబై బ్యాటర్.. వెస్టిండీస్ ఆల్టైమ్ గ్రేట్ బ్రియన్ లారాను వన్డౌన్ బ్యాటర్గా ఎంచుకున్నాడు.ఇక నాలుగో స్థానంలో సౌతాఫ్రికాకు చెందిన గ్రేమ్ పొలాక్, ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా అలెన్ బోర్డర్, విండీస్ గ్రేట్ సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్, ఆసీస్ ఆడం గిల్క్రిస్ట్లకు చోటు ఇచ్చాడు వసీం జాఫర్. ఇక బౌలింగ్ విభాగంలో ముగ్గురు సీమర్లు వసీం అక్రం(పాకిస్తాన్), జహీర్ ఖాన్(టీమిండియా)తో పాటు మిచెల్ జాన్సన్/చమిందా వాస్/ట్రెంట్ బౌల్ట్లలో ఒకరిని ఎంచుకుంటానని తెలిపాడు. కెప్టెన్గా ఆసీస్ లెజెండ్ ఈ జట్టులో ఒకే స్పిన్నర్, టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్కు కూడా స్థానం ఇచ్చాడు. ఈ జట్టుకు కెప్టెన్గా అలెన్ బోర్డర్ను ఎంచుకున్న వసీం జాఫర్.. వికెట్ కీపర్గా గిల్క్రిస్ట్కు అవకాశం ఇచ్చాడు. ఇక ఈ జట్టులోని ఓపెనర్లు హెడెన్, సంగక్కర టెస్టుల్లో వరుసగా 8,625, 12, 400 పరుగులు సాధించారు. అదే విధంగా.. లారా 11,953 రన్స్ స్కోరు చేయడంతో పాటు.. ఫస్ల్క్లాస్ క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్లో 501 రన్స్ నాటౌట్, టెస్టుల్లో 400 పరుగులతో నాటౌట్గా నిలిచి ఆల్టైమ్ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఇక పొలాక్ ఆడింది కేవలం 23 టెస్టులే అయినా.. అతడి సగటు 60.97. మరోవైపు.. కెప్టెన్ అలెన్ బోర్డర్ టెస్టుల్లో 11,174 పరుగులతో ఓవరాల్గా పదకొండవ స్థానంలో ఉన్నాడు. మిగిలిన వాళ్లలో గ్యారీఫీల్డ్ సోబర్స్ ఎనిమిది వేలకు పైగా పరుగులతో పాటు.. 235 వికెట్లు తీసి సత్తా చాటాడు. వికెట్ కీపర్ ఆడం గిల్క్రిస్ట్ 47.60 సగటు కలిగి ఉండటంతో పాటు ఏకంగా 416 డిస్మిసల్స్లో భాగమయ్యాడు.వసీం జాఫర్ లెఫ్టాండర్స్ అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్మాథ్యూ హెడెన్, కుమార్ సంగక్కర, బ్రియన్ లారా, గ్రేమ్ పొలాక్, అలెన్ బోర్డర్(కెప్టెన్), గ్యారీఫీల్డ్ సోబర్స్, ఆడం గిల్క్రిస్ట్, వసీం అక్రం, జహీర్ ఖాన్, మిచెల్ జాన్సన్/చమిందా వాస్/ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ యాదవ్.ఇక వన్డే జట్టు విషయానికొస్తే.. మాథ్యూ హెడెన్(ఆస్ట్రేలియా), సనత్ జయసూర్య(శ్రీలంక), కుమార్ సంగక్కర(శ్రీలంక- వికెట్ కీపర్), బ్రియన్ లారా(కెప్టెన్), యువరాజ్ సింగ్(టీమిండియా ఆల్రౌండర్), మైకేల్ బెవాన్(ఆస్ట్రేలియా), వసీం అక్రం(పాకిస్తాన్), జహీర్ ఖాన్(టీమిండియా), కుల్దీప్ యాదవ్(టీమిండియా)లను వసీం జాఫర్ ఎంపిక చేసుకున్నాడు. అన్నట్లు ఆగష్టు 13న లెఫ్టాండర్స్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వసీం జాఫర్ ఈ టీమ్స్ను సెలక్ట్ చేశాడన్నమాట!చదవండి: కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన రోహిత్ శర్మ -
ఆండ్రూ ఫ్లింటాప్ కాదు.. ఇంగ్లండ్ హెడ్ కోచ్గా శ్రీలంక లెజెండ్!?
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల హెడ్ కోచ్ మాథ్యూ మోట్పై వేటు వేసేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు సిద్దమైంది. వన్డే వరల్డ్కప్-2023, టీ20 వరల్డ్కప్-2024లో ఇంగ్లండ్ జట్టు నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాథ్యూ మోట్ను హెడ్కోచ్ పదవి నుంచి తప్పించాలని ఈసీబీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.అతడి స్ధానంలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కరను తమ జట్టు హెడ్కోచ్గా నియమించాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అతడితో ఈసీబీ చర్చలు కూడా జరిపినట్లు వినికిడి. కుమార్ సంగక్కర ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్గా ఉన్నాడు. అయితే ఆ పదవిని భారత మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ జట్టు హెడ్కోచ్గా సంగక్కర వెళ్లనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తొలుత ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల హెడ్ కోచ్గా ఆ దేశ క్రికెట్ దిగ్గజం ఆండ్రూ ఫ్లింటాప్ బాధ్యతలు చేపట్టనున్నాడని వార్తలు వినిపించాయి.కానీ ఫ్లింటాప్ మాత్రం హెడ్కోచ్ పదవిపై ఆసక్తి చూపలేదంట. ఈ నేపథ్యంలోనే ఈసీబీ పెద్దలు చర్చలు సంగక్కరతో జరిపినట్లు తెలుస్తోంది. ఇక వన్డే ప్రపంచకప్-2023, టీ20 వరల్డ్కప్-2024 రెండింటిలోనూ ఫైనల్కు ఇంగ్లండ్ను చేర్చడంలో విఫలమైనప్పటకీ జోస్ బట్లర్ను కెప్టెన్గా కొనసాగించేందుకు బోర్డు మొగ్గు చూపినట్లు సమాచారం. -
అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి?.. మా వాడికేం ఢోకా లేదు
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు బ్యాట్ ఝులిపించలేదు. కనీస స్థాయి ప్రదర్శన చేయలేక చతికిలపడ్డాడు. కాగా గత సీజన్లో 14 మ్యాచ్లు ఆడి ఏకంగా 625 పరుగులు సాధించిన ఈ లెఫ్టాండర్.. టీమిండియాలో ఎంట్రీ ఇచ్చి దుమ్ములేపాడు. టెస్టు, టీ20లలో భారత ఓపెనర్గా సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో యశస్వి జైస్వాల్పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. కానీ.. అందుకు తగ్గట్లుగా ఈ రాజస్తాన్ రాయల్స్ స్టార్ రాణించలేకపోతున్నాడు. తాజా సీజన్లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో కలిపి యశస్వి జైస్వాల్ కేవలం 39 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు సాధించిన అత్యధిక స్కోరు 24. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో అయితే పరుగుల ఖాతా తెరవకుండానే అతడు వెనుదిరిగాడు. ఈసారి పరుగుల ఖాతా కూడా తెరవలేదు జైపూర్లో శనివారం జరిగిన మ్యాచ్లో రెండు బంతులు ఎదుర్కొని జైస్వాల్ డకౌట్ అయ్యాడు. రీస్ టోప్లీ బౌలింగ్లో మాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, మరో ఓపెనర్ జోస్ బట్లర్ అజేయ శతకం(100)తో రాజస్తాన్ను గెలుపు తీరాలకు చేర్చాడు. 4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷 And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪 Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN — IndianPremierLeague (@IPL) April 6, 2024 సంజూ శాంసన్(69) సైతం మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి రాజస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా రాజస్తాన్ ఖాతాలో వరుసగా నాలుగో గెలుపు చేరింది. ఇక ఇలా జట్టు ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో గెలుపొందింది కాబట్టి జైస్వాల్ వైఫల్యం పెద్దగా లెక్కలోకి రాలేదు. నిజానికి ఏ ఒక్క మ్యాచ్లో ఫలితం తారుమారైనా వేళ్లన్నీ జైస్వాల్ వైపు చూపేవనడంలో సందేహం లేదు. ఏదేమైనా.. ఒంటిచేత్తో జట్టును గెలిపించే సత్తా ఉన్న ఆటగాడైన ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇలా విఫలం కావడం విమర్శలకు తావిస్తోంది. అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి? ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతిసారీ లెఫ్టార్మ్ పేసర్ల చేతిలో అవుట్ అవుతున్న జైస్వాల్ ఇప్పటికైనా బలహీనతలు అధిగమించేందుకు కృషి చేయాలని సూచించాడు. ‘‘యశస్వి జైస్వాల్ మళ్లీ స్కోరు చేయలేకపోయాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్లో మూడింటిలో లెఫ్టార్మ్ పేసర్ల చేతికే చిక్కాడు. అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి? దయచేసి పట్టుదలగా నిలబడి బ్యాటింగ్ చెయ్యి.. కొన్ని పరుగులు సాధించు. నిజానికి నువ్వు మంచి ఆటగాడివి’’ అంటూ జైస్వాల్ ఆట తీరును ఆకాశ్ చోప్రా విమర్శించాడు. ఇప్పటికైనా తిరిగి పుంజుకుంటే వరల్డ్కప్ జట్టులో పోటీ లేకుండా బెర్తు ఖరారు చేసుకోవచ్చని సూచించాడు. చెత్త బ్యాటర్ అయిపోడు ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్కు రాజస్తాన్ రాయల్స్ కోచ్ కుమార్ సంగక్కర అండగా నిలిచాడు. ఫ్రాంఛైజీ క్రికెట్తో పాటు టీమిండియా తరఫున కూడా అదరగొట్టిన యశస్వి.. రెండు ఇన్నింగ్స్లో విఫలమైనంత మాత్రాన చెత్త బ్యాటర్ ఏమీ అయిపోడని వెనకేసుకువచ్చాడు. అతడి నైపుణ్యాలేమిటో తమకు తెలుసునని.. కచ్చితంగా కమ్బ్యాక్ ఇస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. చదవండి: Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Virat Kohli: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా
Asia Cup 2023- India vs Pakistan- Virat Kohli Century: దాయాది పాకిస్తాన్తో మ్యాచ్ అంటే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పూనకాలే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది టీ20 వరల్డ్కప్-2022లో చిరకాల ప్రత్యర్థిపై భారత్కు తన అద్భుత ఇన్నింగ్స్తో చిరస్మరణీయ విజయం అందించిన తీరును ఎవరూ మర్చిపోలేరు. పాకిస్తాన్తో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా కోహ్లి ఇక తాజాగా మరోసారి పాక్పై అదిరిపోయే బ్యాటింగ్తో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఆసియా కప్-2023 సూపర్ -4 మ్యాచ్లో ఆకాశమే హద్దుగా అజేయ సెంచరీతో చెలరేగాడు. కోహ్లి ఇన్నింగ్స్లో ఏకంగా 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. సచిన్ టెండుల్కర్ రికార్డు బద్దలు.. ప్రపంచంలో తొలి బ్యాటర్గా ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డేల్లో 47వ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లి.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో తక్కువ ఇన్నింగ్స్లో 13 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్గా కోహ్లి రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్ను కోహ్లి అధిగమించాడు. చెలరేగిన బ్యాటర్లు.. టీమిండియా భారీ స్కోరు ఇదిలా ఉంటే.. పాకిస్తాన్తో మ్యాచ్లో రిజర్వ్ డే అయిన సోమవారం టీమిండియా బ్యాటర్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి అజేయ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి భారత జట్టు 356 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతకు ముందు ఆదివారం ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుబ్మన్ గిల్(58) అర్ధ శతకాలు సాధించారు. కాగా కొలంబోలో జరగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. వన్డేల్లో 13 వేల పరుగులు చేసేందుకు.. ఎవరికి ఎన్ని ఇన్నింగ్స్ అవసరమయ్యాయంటే? 1. విరాట్ కోహ్లి- 267 2. సచిన్ టెండుల్కర్- 321 3. రిక్కీ పాంటింగ్- 341 4. కుమార్ సంగక్కర- 363 5. సనత్ జయసూర్య- 416. చదవండి: రోహిత్ పూర్తిగా నిరాశపరిచాడు.. మరీ చెత్తగా..: టీమిండియా మాజీ ఓపెనర్ 💯 NUMBER 4️⃣7️⃣ King @imVkohli, take a bow! 🙌😍 Legendary knock by the modern day great. #Pakistan truly gets the best out of the King! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvPAK #Cricket pic.twitter.com/7BfKckU1AO — Star Sports (@StarSportsIndia) September 11, 2023 -
వాళ్లు మమ్మల్ని అవుట్ చేయలేదు.. మా అంతట మేమే! మరీ చెత్తగా..
IPL 2023 RR vs RCB: ‘‘ఈ మ్యాచ్లో మా బ్యాటింగ్ మరీ చెత్తగా ఉంది. మా బౌలర్లు మెరుగ్గానే రాణించారు. ప్రత్యర్థిని 171 పరుగులకు కట్టడి చేశారు. ఇలాంటి పిచ్ మీద ఈ టార్గెట్ సులువుగానే ఛేదించవచ్చు. అయితే, పవర్ ప్లేలోనే మా వాళ్లు తడబడ్డారు. పరుగులు రాబట్టాలన్న తొందరలో వికెట్లు పారేసుకున్నారు’’ అని రాజస్తాన్ రాయల్స్ హెడ్కోచ్ కుమార్ సంగక్కర అన్నాడు. బ్యాటర్ల వైఫల్యం కారణంగానే ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ఐపీఎల్-2023లో భాగంగా ఆర్సీబీతో ఆదివారం జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ పరాజయం పాలైంది. 59 పరుగులకే ఆలౌట్ అయి 112 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సంజూ శాంసన్ సేన ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అప్పుడే ఆట ముగిసిపోయింది ఈ నేపథ్యంలో సంగక్కర మాట్లాడుతూ.. ‘‘భాగస్వామ్యాలు నమోదు చేయాలని మా వాళ్లు ప్రయత్నించారు. కానీ దురదృష్టవశాత్తూ.. పవర్ ప్లేలోనే ఐదు వికెట్లు కోల్పోయాం. అప్పుడే మా ఆట దాదాపుగా ముగిసిపోయింది. సంజూ తరచుగా ఈరోజు ఆడినటువంటి షాట్ ఆడుతూ ఉంటాడు. కానీ అన్నిసార్లూ రోజులు మనవి కావు. అతడు దూకుడైన ఆటగాడు. జట్టును గెలిపించాలనే తపనతో ఆడతాడు. అయితే, టీ20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. పవర్ ప్లేలో సగం వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. వాళ్లు అవుట్ చేయలేదు.. మా అంతట మేమే నిజానికి ఆర్సీబీ బౌలర్లు మమ్మల్ని అవుట్ చేసినట్లు అనిపించలేదు. మాకు మేమే అవుటైనట్లు కనిపించింది. ఈ ఓటమి ఎవరో ఒకరు బాధ్యులు కారు. బ్యాటింగ్ విభాగం మొత్తం ఈరోజు విఫలమైంది’’ అని విచారం వ్యక్తం చేశాడు. తదుపరి పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తామని సంగక్కర ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఆర్సీబీతో ఆదివారం నాటి మ్యాచ్లో రాజస్తాన్ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్ డకౌట్ కాగా.. సంజూ శాంసన్ 4 పరుగులు మాత్రమే చేశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన జోరూట్ 10, తర్వాతి స్థానాల్లో వచ్చిన పడిక్కల్ 4, షిమ్రన్ హెట్మెయిర్ 35, ధ్రువ్ జురెల్ 1, అశ్విన్ 0, ఆడం జంపా 2, సందీప్ శర్మ 0, కేఎమ్ ఆసిఫ్ 0 పూర్తిగా విఫలమయ్యారు. చదవండి: వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని అసలు క్రికెటరే కాదు.. ఇంకా: టీమిండియా ఆల్రౌండర్పై వివాదాస్పద వ్యాఖ్యలు 𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦! The Anuj Rawat direct-hit that left everyone in disbelief 🔥🔥 Check out the dismissal here 🔽 #TATAIPL | #RRvRCB pic.twitter.com/2GWC5P0nYP — IndianPremierLeague (@IPL) May 14, 2023 -
'ఓవైపు తల్లికి సీరియస్.. అయినా మ్యాచ్లో అదరగొట్టాడు'
ఐపీఎల్-2022లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో ఆర్సీబీని చిత్తు చేసి రాజస్తాన్ రాయల్స్ ఫైనల్కు చేరింది. కాగా రాజస్తాన్ విజయంలో ఆ జట్టు పేసర్ ఒబెడ్ మెక్కాయ్ కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్లో జోస్ బట్లర్ అదగరగొట్టగా.. బౌలింగ్లో మెక్కాయ్, ప్రసిద్ద్ కృష్ణ అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్లో తన నాలుగు ఓవర్ల కోటాలో 23 పరుగులు ఇచ్చిన మెక్కాయ్ మూడు కీలక వికెట్ల పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్కు ముందు మెక్కాయ్ తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. మ్యాచ్ ఆరంభానికి ముందు ఈ విషయం గురించి మెక్కాయ్కు సమాచారం అందింది. అయినప్పటికీ ఓ వైపు బాధను దిగమింగుతూ మెక్కాయ్ అత్యుత్తమంగా రాణించాడు. అయితే ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార్ సంగక్కర వెల్లడించాడు. కాగా ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సంగక్కర తెలిపాడు. "మెక్కాయ్ తల్లి క్వాలిఫయర్-2 మ్యాచ్కు ముందు అనారోగ్యానికి గురైంది. అయినప్పటికీ ఆ విషయాన్ని పక్కన పెట్టి మెక్కాయ్ అద్భుతంగా రాణించాడు. కాగా ఆమె ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది అని"సంగక్కర పేర్కొన్నాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్లో గుజరాత్ టైటాన్స్తో రాజస్తాన్ తలపడనుంది. చదవండి: Mathew Wade: 'మా జట్టు ఫైనల్ చేరింది.. అయినా సరే టోర్నమెంట్ చికాకు కలిగిస్తుంది' -
'దేశం దుర్భర స్థితికి ప్రభుత్వమే కారణం.. అసహ్యమేస్తోంది'
శ్రీలంక సంక్షోభం తారాస్థాయికి చేరి హింసాత్మకంగా మారడంపై ఆ దేశ తాజా, మాజీ క్రికెటర్లు స్పందించారు. దేశం ఇంత దుర్భర స్థితికి చేరుకోవడానికి కారణం ప్రభుత్వమేనంటూ దిగ్గజ క్రికెటర్లు మహేళ జయవర్దనే, కుమార సంగక్కరతో పాటు ప్రముఖ క్రికెటర్లు వనిందు హసరంగా, నిరోషన్ డిక్వెల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. లంక సంక్షోభంపై ముంబై ఇండియన్స్ కోచ్ జయవర్దనే స్పందింస్తూ.. తమ ప్రాథమిక అవసరాలు, హక్కుల కోసం డిమాండ్ చేస్తున్న శాంతియుత నిరసనకారులపైకి ప్రభుత్వ మద్దతుతో దుండగులు, గూండాలు దాడి చేయడం చూస్తుంటే అసహ్యమేస్తోందని తెలిపాడు. దీంతోపాటు ఒక వీడియోను ట్వీట్ చేశాడు. అందులో కొంతమంది కలిసి ఓ మహిళపై దాడిచేస్తున్నారు.‘‘పోలీసుల ముందే నిరసన చేస్తున్న మహిళలను ఎలా కొడుతున్నారో చూడండి.. సిగ్గు చేటు’’ అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. కాగా, నిన్న శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై రాజపక్స కుటుంబ సభ్యుల మద్దతుదారులు దాడిచేయడం బాధాకరమని పేర్కొన్నాడు. శ్రీలంక మాజీ కెప్టెన్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు హెడ్ కోచ్ సంగక్కర మాట్లాడుతూ.. ఈ హింస వెనుక ప్రభుత్వం ఉందని.. ఉద్దేశపూర్వకంగా పక్కా ప్రణాళికతో జరిగిన హింస అని ఆరోపించాడు లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ కూడా ప్రభుత్వ తీరుపై మండిపడ్డాడు. అమయాక, శాంతియుత నిరసనకారులపై జరిగిన దాడిని అనాగరిక చర్యగా అభివర్ణించాడు. మన దేశాన్ని ఇలాంటి నాయకత్వం నడిపిస్తోందా? అని ఆవేదన వ్యక్తం చేశాడు. దేశం కోసం ఏకమై అందరి పక్షాన ఉంటానని హామీ ఇచ్చాడు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అమాయక ప్రజలపై దాడులు జరగడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని వికెట్ కీపర్ బ్యాట్స్మన్ నిరోషన్ డిక్వెల్లా పేర్కొన్నాడు. శ్రీలంకలో సంక్షోభం తీవ్ర రూపం దాల్చడం.. ఫలితంగా చెలరేగిన రాజకీయ హింసలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం, 200 మందికిపైగా గాయపడ్డారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. చదవండి: ఉపేక్షించొద్దు.. అలాంటి వాళ్లను కాల్చేయండి: శ్రీలంకలో తీవ్ర హెచ్చరికలు Mumbai Indians: ప్లేఆఫ్ అవకాశాలు ఖేల్ఖతం.. ఇంతకుమించి ఏం చేస్తారులే! -
ఆస్ట్రేలియన్ క్రికెటర్ అరుదైన ఫీట్.. దిగ్గజ ఆటగాళ్ల రికార్డు బద్దలు
ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీవ్స్మిత్ ఒక అరుదైన ఫీట్ సాధించాడు. పాకిస్తాన్తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో స్మిత్ 59 పరుగులు చేసి ఔటయ్యాడు. తద్వారా స్మిత్ ఒక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో 150వ ఇన్నింగ్స్ దగ్గర అత్యధిక పరుగులు(7993 పరుగులు) సాధించిన తొలి బ్యాటర్గా స్మిత్ నిలిచాడు. ఈ నేపథ్యంలోనే శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరను(7913 పరుగులు) స్మిత్ అధిగమించాడు. కాగా స్మిత్, సంగక్కర తర్వాత వరుసగా టీమిండియా త్రయం సచిన్ టెండూల్కర్(7,869 పరుగులు), వీరేంద్ర సెహ్వాగ్(7,694 పరుగులు), రాహుల్ ద్రవిడ్(7,680 పరుగులు) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 391 పరుగులకు ఆలౌట్ అయింది. ఉస్మాన్ ఖవాజా 91, అలెక్స్ క్యారీ 67, కామెరాన్ గ్రీన్ 79, స్మి్త్ 59 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, నసీమ్ షా చెరో 4 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. చదవండి: IPL 2022: అభిమానులకు బీసీసీఐ బ్యాడ్న్యూస్.. వరుసగా నాలుగో ఏడాది -
'అతడు అద్భుతమైన ఆటగాడు.. భారత ప్రపంచకప్ జట్టులో చోటు ఖాయం'
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్పై ఆ జట్టు క్రికెట్ డైరెక్టర్ కుమార్ సంగక్కర ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత టీ20 అత్యుత్తమ ఆటగాళ్లలో శాంసన్ ఒకడని అతడు కొనియాడాడు. అదే విధంగా శాంసన్ విద్వంసకర ఆటగాడు, తన బ్యాటింగ్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు అని సంగక్కర తెలిపాడు. "శాంసన్ రాజస్థాన్ కెప్టెన్గానే కాకండా, ప్రస్తుత టీ20 అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. అతను అద్భుతమైన ఆటగాడు, తన విధ్వంసకర బ్యాటింగ్తో మ్యాచ్ విన్నర్గా నిలుస్తాడు. అతడిలో మంచి ప్రతిభ ఉంది. నేను గత సీజన్లో బాధ్యతలు చేపట్టక ముందే అతడు రాజస్థాన్ కెప్టెన్గా ఉన్నాడు. నేను జట్టులో బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత ఎక్కువ అతడి గురించి తెలుసుకున్నాను. అతడికి రాజస్థాన్ రాయల్స్ జట్టు పట్ల మక్కువ ఎక్కువ. అతడు తన ఐపీఎల్ కెరీర్ను రాజస్థాన్తో ప్రారంభించాడు. అదే విధంగా అతడు కెప్టెన్సీ పరంగా కూడా అద్భుతమైన స్కిల్స్ను కలిగి ఉన్నాడు. ఇక ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరగనుంది. కచ్చింతంగా అతడికి భారత్ జట్టులో చోటు దక్కుతుందని భావిస్తున్నాను అని సంగక్కర పేర్కొన్నాడు. కాగా గతేడాది ఐపీఎల్లో 14 మ్యాచ్లు ఆడిన శాంసన్ 484 పరుగులు సాధించాడు. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. రాజస్థాన్ రాయల్స్ తన తొలి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్తో మార్చి 29న తలపడనుంది. చదవండి: IPL 2022: ఆఫ్ఘనిస్తాన్ యువ బౌలర్కు లక్కీ ఛాన్స్.. ఏకంగా ఆర్సీబీ తరపున! Happy, excited, raring to go - a few of your favourite Royals have arrived. 💗#RoyalsFamily | #TATAIPL2022 pic.twitter.com/I1Z9GGFdKD — Rajasthan Royals (@rajasthanroyals) March 18, 2022 -
IPL 2022: క్వారంటైన్ పూర్తి కానివ్వండి ఏం చేయాలో అది చేద్దాం: చహల్
IPL 2022- Rajasthan Royals Swagat: ఐపీఎల్-2022 కోసం రాజస్తాన్ రాయల్స్ సంసిద్దమవుతోంది. క్యాష్ రిచ్లీగ్లో భాగంగా నాగపూర్లో తమ శిబిరాన్ని ఏర్పాటు చేసుకుందీ ఈ జట్టు. పుణె వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో మార్చి 29న రాజస్తాన్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఆటగాళ్లు జట్టుతో చేరారు. కెప్టెన్ సంజూ శాంసన్ సహా యజువేంద్ర చహల్ తదితరులు రాయల్స్ క్యాంపునకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. ఇదిలా ఉండగా.. ఫ్రాంచైజీ డైరెక్టర్ కుమార సంగక్కర సహా ఆటగాళ్లకు రాజస్తాన్ వినూత్న రీతిలో స్వాగతం పలికింది. ఈ క్రమంలో చహల్, అతడి భార్య ధనశ్రీకి సంబంధించిన ఫొటోను షేర్ చేసిన రాజస్తాన్.. ‘‘మరి.. మా స్వాగతం ఎలా ఉంది చహల్’’ అంటూ క్యాప్షన్ జతచేసింది. ఇందుకు స్పందించిన చహల్.. ‘‘మూడు రోజుల క్వారంటైన్ పూర్తి కానివ్వండి. అప్పుడు ఏం చేయాలో అది చేద్దాం’’ అంటూ మీ స్వాగతసత్కారాలతో హృదయం ప్రేమతో నిండిపోయిందంటూ హార్ట్ ఎమోజీలు జతచేశాడు. కాగా బెంగళూరు ఫ్రాంఛైజీ వదిలేయడంతో ఐపీఎల్-2022 మెగా వేలంలోకి వచ్చిన చహల్ను రాజస్తాన్ 6.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022- Mumbai Indians: ముంబై ఇండియన్స్కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం! అయితే.. 😂😂 fire hai @KumarSanga2 🔥 pic.twitter.com/eng1wzzLs1 — Rajasthan Royals (@rajasthanroyals) March 14, 2022 #HallaBol in 𝗳𝘂𝗹𝗹 𝗽𝗼𝘄𝗲𝗿. ⚡ Welcoming One Moto India to the #RoyalsFamily as our Associate Sponsor. 💗#RoyalsFamily | #OneMotoIndia | #ElectrifyingRR pic.twitter.com/zsyUNRHJGX — Rajasthan Royals (@rajasthanroyals) March 14, 2022 Wiiiiiings 🔜 pic.twitter.com/X5q1K7bmGD — Rajasthan Royals (@rajasthanroyals) March 15, 2022 3 days quarantine bus uske baad hum he karenge joh karna hai 💖💗 https://t.co/YBqJwOwM59 — Yuzvendra Chahal (@yuzi_chahal) March 14, 2022 -
భీకరమైన ఫామ్; మెగా టోర్నీలో 5 సెంచరీలు.. నేటితో రెండేళ్లు
సాక్షి, వెబ్డెస్క్: టీమిండియా ఓపెనర్.. హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 ప్రపంచకప్లో భీకరమైన ఫామ్లో ఉన్నాడు. సెంచరీలు కాదని డబుల్ సెంచరీలను మంచీనీళ్ల ప్రాయంగా మలిచిన రోహిత్ ఆ మెగా టోర్నీలో ఏకంగా ఐదు సెంచరీలు బాది ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. అప్పటివరకు ఒక ప్రపంచకప్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర పేరిట ఉండేది. రోహిత్ ఆ రికార్డును చెరిపేస్తూ కొత్త చరిత్రను సృష్టించాడు. రోహిత్ ఆ రికార్డు సాధించి నేటితో సరిగ్గా రెండేళ్లు. ఈ సందర్భంగా అప్పటి ఆసక్తికర విషయాలను ఒకసారి గుర్తుచేసుకుందాం. లీగ్ దశలో న భూతో భవిష్యత్తు అనేలా రోహిత్ ఆటతీరు సాగింది. కొడితే భారీ స్కోర్లు ఖాయం అనేలా అతని ఇన్నింగ్స్లు సాగాయి. లీగ్ దశలో దక్షిణాఫ్రికాపై 122* పరుగులు, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 140 పరుగులు, ఇంగ్లండ్పై 102, బంగ్లాదేశ్పై 104 పరుగులు చేశాడు. ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 103 పరుగులతో శతకం సాధించిన రోహిత్ ఒక మేజర్ టోర్నీలో అత్యధిక సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అయితే ఆఫ్గానిస్తాన్, వెస్టిండీస్లపై మాత్రం విఫలమైన రోహిత్ ఆసీస్తో జరిగిన మ్యాచ్లో 57 పరగులు చేశాడు. రోహిత్ జోరుతో టీమిండియా మరోసారి విజేతగా నిలుస్తుందని అంతా భావించారు. కానీ రోహిత్ ఇదే టెంపోనూ కివీస్తో జరిగిన సెమీఫైనల్లో చూపెట్టలేకపోయాడు. ఆ మ్యాచ్లో రోహిత్ ఒక్క పరుగుకే వెనుదిరగడంతో అభిమానుల ఆశలు గల్లంతయ్యాయి. అయితే రోహిత్ ఇదే ప్రపంచకప్లో మరో రికార్డును కూడా సాధించాడు. ఒక్క ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు. మొత్తంగా రోహిత్ శర్మ ఐదు సెంచరీల సాయంతో 648 పరుగులు చేశాడు. అంతకముందు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(673 పరుగులు, 2003 ప్రపంచకప్), ఆసీస్ మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్( 659 పరుగులు, 2007 ప్రపంచకప్) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అంతేగాక టీమిండియా తరపున సచిన్ తర్వాత ఒక ప్రపంచకప్లో 600 పైచిలుకు పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలవడం విశేషం. -
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో వినూ మన్కడ్, సంగక్కర
దుబాయ్: తొలి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ను పురస్కరించుకొని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పది మంది దిగ్గజ క్రికెటర్లకు ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు కల్పించింది. ఇందులో భారత్ నుంచి దివంగత క్రికెటర్ వినూ మన్కడ్కు... శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరకుమార సంగక్కరకు స్థానం దక్కింది. 1978లో మృతి చెందిన వినూ మన్కడ్ భారత్ తరఫున 1947 నుంచి 1959 మధ్య కాలంలో 44 టెస్టులు ఆడి 2,109 పరుగులు చేయడంతోపాటు 162 వికెట్లు తీశారు. మేటి ఆల్రౌండర్గా పేరున్న వినూ మన్కడ్ 1952లో ఇంగ్లండ్తో లార్డ్స్లో జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 72, రెండో ఇన్నింగ్స్లో 184 పరుగులు చేయడంతోపాటు బౌలింగ్లో ఏకంగా 97 ఓవర్లు వేశారు. దిగ్గజ క్రికెటర్ సంగక్కర శ్రీలంక తరఫున 134 టెస్టులు (12,400 పరుగులు), 404 వన్డేలు (14,234 పరుగులు), 56 టి20 మ్యాచ్లు (1,382 పరు గులు) ఆడాడు. వినూ మన్కడ్, సంగక్కరలతోపాటు మోంటీ నోబుల్ (ఆస్ట్రేలియా), కాన్స్టన్ టైన్ (వెస్టిండీస్), స్టాన్ మెక్కేబ్ (ఆస్ట్రేలియా), డెక్స్టర్ (ఇంగ్లండ్), హేన్స్ (వెస్టిండీస్), బాబ్ విల్లీస్ (ఇంగ్లండ్), ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే) కూడా ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం పొందారు. చదవండి: సిరీస్తోపాటు ‘టాప్’ ర్యాంక్ సొంతం -
‘శ్రేయస్ అయ్యర్ గ్యాంగ్కు ప్లేఆఫ్స్ చాన్స్ కష్టమే’
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ చేరడం కష్టమని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కార అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఢిల్లీ ఘోర పరాజయం చవిచూడటం కంటే ముందుగానే సంగక్కార ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ -2020 స్టార్ స్పోర్ట్స్ కామెంటరీ ప్యానల్లో జాయిన్ అయిన సంగక్కార లైవ్ షోలో మాట్లాడుతూ శ్రేయస్ అయ్యర్ అండ్ గ్యాంగ్ బ్యాటింగ్పై ఆందోళన వ్యక్తం చేశాడు. ఢిల్లీ పేలవమైన బ్యాటింగ్ను చూస్తుంటే ఆ జట్టు టాప్-4లో నిలవడం చాలా కష్టమన్నాడు. ('నేను బౌలింగ్కు వస్తే గేల్ సెంచరీ చేయలేడు') ‘ఢిల్లీ టాపార్డర్ బ్యాటింగ్లో నిలకడ కనిపించడం లేదు. వారి టాపార్డర్ రాణిస్తేనే ప్లేఆఫ్ ఆశలు పెట్టుకోవచ్చు. గ్యారంటీగా ఢిల్లీ ప్లేఆఫ్స్కు చేరుతుందని చెప్పలేను. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ ప్లేఆఫ్ చాన్స్లు చాలా తక్కువ. ఇప్పటికే ముంబై ప్లేఆఫ్స్కు చేరింది. ఆర్సీబీ ప్లేఆఫ్కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో కింగ్స్ పంజాబ్ కూడా టాప్-4లో ఉంటుందనే అనుకుంటున్నా. కానీ ప్లేఆఫ్ స్థానం దక్కించుకునే నాల్గో జట్టు ఏదో చెప్పడం నాకు కష్టంగా ఉంది’ అని సంగక్కరా అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ దారుణమైన ఓటమి చవిచూసింది. దాంతో ఆ జట్టు నెట్రన్రేట్ మైనస్లోకి వెళ్లిపోయింది. అటు తొలుత బ్యాటింగ్లో నిరాశపరిచిన ఢిల్లీ, బౌలింగ్లో కూడా రాణించలేదు. దాంతో ముంబై ఇండియన్స్ ఈజీ విక్టరీని నమోదు చేసింది. ఢిల్లీ నిర్దేశించిన 111 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ముంబై అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు ఇషాన్ కిషాన్(72 నాటౌట్; 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లు) కీలక పాత్ర పోషించాడు. (టాప్ లేపిన ముంబై.. చిత్తుగా ఓడిన ఢిల్లీ) -
2011 ఫిక్సింగ్ : దర్యాప్తు నిలిపివేసిన శ్రీలంక
కొలంబొ : భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ శ్రీలంక మాజీ క్రీడల మంత్రి మహిందనంద అలత్గమగే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఫొన్సెక నేతృత్వంలోని బృందం శ్రీలంక ఆటగాళ్లను విచారిస్తోంది. తాజాగా మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ వచ్చిన ఆరోపణలకు తగిన ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు శ్రీలంక క్రీడాశాఖ తెలిపింది.(‘సరైన టైమ్లో కెప్టెన్గా తీసేశారు’) కాగా ఈ కేసులో ఇప్పటికే మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ ఆరోపణలు చేసిన మహిదానందతో పాటు అప్పటి కెప్టెన్ కుమార సంగక్కరతో పాటు మాజీ ఆటగాళ్లు మహేళ జయవర్దెనేతో పాటు అప్పటి సెలక్షన్ కమిటీ ఛైర్మన్, మాజీ ఆటగాడు అరవింద డిసిల్వాలను విచారించింది. విచారణలో భాగంగా వారు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకున్నామని.. వారి సమాధానాలతో తాము సంతృప్తి చెందినట్లు ఫొన్సెక నేతృత్వంలోని స్పెషల్ ఇన్వస్టిగేషన్ టీమ్ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన విచారణను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నాం అంటూ శ్రీలంక క్రీడాశాఖ తెలిపింది.( నేడు విచారణకు సంగక్కర ) కాగా 2011 మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంపై అప్పటి కెప్టెన్ కుమార సంగక్కరను దర్యాప్తు విభాగం సుమారు 10 గంటల పాటు విచారించింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో రెండు సార్లు టాస్ వేయడంపై గల కారణాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన సంగక్కర.. నిజనిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయని చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం లంక మాజీ క్రికెటర్, మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అరవింద డిసిల్వాను అధికారులు ఆరు గంటల పాటు విచారించారు. ప్రపంచకప్ 2011 ఫైనల్ సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించిన వివరాలపై కూపీ లాగారు. మంగళవారం సమన్లు జారీ చేసిన పోలీసులు ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కౌన్సిల్ సైతం స్వతంత్ర విచారణ జరిపించాలని డిసిల్వా డిమాండ్ చేశారు. అవసరమైతే విచారణ కోసం భారత్కు వస్తానని పేర్కొన్నారు. ఫిక్సింగ్ ఆరోపణల్లో భాగంగా శ్రీలంక బ్యాటింగ్ లెజెండ్ మహేలా జయవర్ధనే విచారణకు హాజరయ్యాడు. అందుకోసం కొలంబోలోని సుగతదాసా స్టేడియంలోని క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు విభాగానికి జయవర్ధనే హజరయ్యాడు. జయవర్దెనే చెప్పిన విషయాలను దర్యాప్తు బృందం రికార్డు చేసుకుంది. ఆ మ్యాచ్లో జయవర్దెనే శతకం సాధించిన సంగతి తెలిసిందే. (2011 ఫైనల్ ఫిక్సింగ్? దర్యాప్తు వేగవంతం) కాగా నాటి ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 274/6 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. స్టార్ బ్యాట్స్మెన్ సెహ్వాగ్ (0), సచిన్ (18)ల వికెట్లను త్వరగా కోల్పోయింది. ఆ క్లిష్ట స్థితిలో గౌతమ్ గంభీర్(97) అద్భుత పోరాటానికి.. ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ తోడవడంతో ఆరు వికెట్లతో టీమిండియా విజయం సాధించి 28 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై రెండో ప్రపంచకప్ను సాధించింది. -
నేడు విచారణకు సంగక్కర
కొలంబో: ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐయూ) ముందు నేడు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర హాజరు కానున్నాడు. 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో లంక ఆటగాళ్లు ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మాజీ క్రీడల మంత్రి మహిందనంద అలత్గమగే ఈ ఆరోపణ చేశాడు. అప్పట్లో ఆయన క్రీడల మంత్రిగా వ్యవహరించారు. ఫొన్సెక నేతృత్వంలోని బృందం ఆ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిన శ్రీలంక ఆటగాళ్లను విచారిస్తోంది. గురువారం ఉదయం 9 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా 2011 వరల్డ్కప్లో శ్రీలంకకు కెప్టెన్గా వ్యవహరించిన సంగక్కరను కోరింది. బుధవారం ఓపెనర్ ఉపుల్ తరంగాను రెండు గంటల పాటు విచారించింది. నాటి వరల్డ్కప్ ఫైనల్లో తరంగ 20 బంతులు ఆడి రెండు పరుగులు చేశాడు. ‘కమిటీ అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చాను. నా స్టేట్మెంట్ను వారు రికార్డు చేశారు’ అని తరంగ తెలిపాడు. కానీ ప్రశ్నలేంటో చెప్పలేదు. అప్పట్లో చీఫ్ సెలక్టర్గా వ్యవహరించిన శ్రీలంక విఖ్యాత ఆటగాడు అరవింద డిసిల్వాను మంగళవారం ఆరు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. లంకలో ఫిక్సింగ్కు పాల్పడితే క్రిమినల్ నేరం కింద కఠినంగా శిక్షిస్తారు. లంక కరెన్సీలో రూ. 10 కోట్ల జరిమానాతో పాటు పదేళ్ల జైలు శిక్ష విధించేలా గత నవంబర్లో చట్టం తెచ్చారు. -
‘నేను టాస్ ఓడిపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేది’
కోల్కతా: గతంలో ఎప్పుడూ లేనివిధంగా 2011 ప్రపంచకప్ ఫైనల్లో రెండుసార్లు టాస్ వేయాల్సి వచ్చింది. భారత స్పిన్నర్ అశ్విన్తో ఇన్స్టాగ్రామ్ లైవ్లో కుమార సంగక్కర ఈ అంశం గురించి మాట్లాడాడు. ‘టాస్ సమయంలో వాంఖెడే స్టేడియం అరుపులతో హోరెత్తుతోంది. టాస్కు సంబంధించిన నేను నా ఎంపిక చెప్పాను. కానీ ధోనికి వినబడనట్లుంది. అతను వెంటనే నువ్వు టెయిల్స్ ఎంచుకున్నావా? అని నన్ను అడిగాడు. లేదు హెడ్స్ అని చెప్పాను. అప్పటికే రిఫరీ నేను టాస్ గెలిచాను అని ప్రకటించాడు. తను ఇంకా ఏం చెప్పలేదని ధోని అనడంతో అక్కడ గందరగోళం నెలకొంది. దీంతో మళ్లీ టాస్ వేయాలంటూ ధోని కోరడంతో రెండోసారి వేయగా... నేను కోరుకున్న హెడ్స్ పడింది. దీంతో మేం ముందుగా బ్యాటింగ్ చేశాం. అప్పుడు టాస్ గెలవడం అదృష్టమో కాదో తెలియదు కానీ ఒకవేళ నేను టాస్ ఓడిపోయి ఉంటే ఇండియా మొదట బ్యాటింగ్ చేసి ఉండేది. ఫలితం మరోలా ఉండేదని నేను నమ్ముతున్నా’అంటూ సంగక్కర నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నాడు. -
అందుకే అతడి ముఖం మీద చిరునవ్వు చెరగలేదు
హైదరాబాద్: టీమిండియా 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆ మధుర క్షణాలు అభిమానుల కళ్ల ముందు ఇప్పటికీ కదలాడుతూనే ఉన్నాయి. కులశేఖర్ బౌలింగ్లో ధోని సిక్సర్ కొట్టిన వెంటనే యువీ ఆనందంతో ధోనిని హత్తుకునే ఉద్వేగభరిత దృశ్యాలు మనందరికీ గుర్తుండే ఉంటాయి. కానీ యువీ, ధోనిలు సంబరాలు జరుపుకుంటే అక్కడే వికెట్ల వెనకాల ఉన్న కుమార సంగక్కర చిరునవ్వును చాలా తక్కువ మంది మాత్రమే గుర్తించారు. క్రీడా స్పూర్తిని ప్రదర్శిస్తూ, ఓటమిని అంగీకరిస్తూ గుండెల్లోని బాధను దిగమింగుకుంటూనే అతడి ముఖం మీద చిరునవ్వు చెరగలేదు. దీనికి లంక అభిమానులతో సహా, యావత్ క్రీడా ప్రపంచం సంగక్కర క్రీడా స్పూర్తికి సెల్యూట్ చేసింది. ఈ క్రమంలో అలాంటి బాధాకర సమయంలో కూడా తన ముఖంపై చిరునవ్వుకు గల కారణాలను సంగక్కర తాజాగా వెల్లడించారు. ‘30 ఏళ్లుగా శ్రీలంకలో నివసిస్తున్నాను (ప్రపంచకప్-2011 సమయానికి). మేము ఇబ్బందులు పడిన సందర్బాలు అనేకం. కొన్ని పరిస్థితులు మమ్మల్ని కిందికి నెట్టేశాయి. యుద్దాలు జరిగాయి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. ఇలా అనేక సమస్యలు వచ్చాయి. కానీ శ్రీలంకలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే స్థితిస్థాపకత. దేని నుంచైనా త్వరగా కోలుకొని పూర్వ స్థితికి చేరుకోవాలి అనే విషయం నా దేశం నేర్పింది. ఇదే సూత్రాన్ని మేం క్రికెట్ ఆడేటప్పుడు కూడా అవలంభిస్తాము. గెలుపు కోసమే బరిలోకి దిగుతాం, రెండు కోట్ల మంది ప్రజల ముఖాలపై చిరునవ్వు కోసం ఆడతాం, పోరాడుతాం. గెలుపోటములు సహజం. కానీ ఓటమిని జీర్ణించుకొని తరువాతి మ్యాచ్ కోసం త్వరగా సన్నద్దమవుతాం. (ప్రపంచకప్-2011 ఫైనల్: రెండుసార్లు టాస్) 1996 తర్వాత మరోసారి ప్రపంచకప్ గెలవడానికి 2007, 2011లో అదేవిధంగా 2009,2012 (టీ20 ప్రపంచకప్)లో అవకాశం వచ్చింది. ఫైనల్ మెట్టుపై ఓడిపోయాం. ముఖ్యంగా 2011 ప్రపంచకప్ మమ్మల్ని ఎక్కువగా బాధించింది. మంచి టీం, మంచి స్కోర్ సాధించాం, ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టాం అయినా ఓడిపోయాం. అయితే కొన్ని సార్లు ఇలాంటివి సంభవిస్తాయి. ఇప్పుడు ఓడిపోయాం. అయితే ఏడుస్తూ కూర్చొని ఉంటామా? లేక వచ్చే ప్రపంచకప్ కోసం సన్నద్దం కావాలా? మా ఆలోచన కూడా అంతే. మా ఆటగాళ్లకు కూడా ఎప్పుడూ ఒకటి చెబుతుంటా. ఎక్కువ ఎమోషన్గా ఉండకూడదని, ఎందుకంటే ఎక్కువ ఎమోషన్గా ఉంటే తమను తాము నియంత్రించుకోలేరు’ అంటూ సంగక్కర వివరించారు. (ధోనికి ఆ హక్కు ఉంది) -
ప్రపంచకప్-2011 ఫైనల్: రెండుసార్లు టాస్
హైదరాబాద్: దాదాపు 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ స్వదేశంలో 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్ను టీమిండియా రెండోసారి ముద్దాడింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అపూర్వ విజయం సాధించి భారత్ జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్కు సంబంధించి ఆనాటి లంక సారథి కుమార సంగక్కర పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్తో ఇన్స్టా లైవ్లో సంగక్కర పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో రెండు సార్లు టాస్ వేసిన విషయాన్ని తెలుపుతూ, దానికి గల కారణాలు వెల్లడించాడు. (ధోనికి ఆ హక్కు ఉంది ) ‘నేనెప్పుడు శ్రీలంకలో అంతమంది ప్రేక్షకులను మైదానంలో చూడలేదు. ఆ స్థాయిలో అభిమానులు మైదానానికి రావాలన్నా, ఆటగాళ్లను ఉత్సాహపరచాలన్నా అది భారత్లోనే సాధ్యం అవుతుందనుకుంటా!. కిక్కిరిసిన ప్రేక్షకులు, భారీ శబ్దాలు, ఫైనల్ టెన్షన్తో టాస్కు వెళ్లాం. ధోని టాస్ వేశాడు. నేను టెయిల్స్ అన్నాను. భారీ శబ్దాల కారణంగా నేను చెప్పింది ధోనికి వినపడలేదు. అతడు నన్ను అడిగాడు..నువ్వు టెయిల్స్ అన్నావా? అని, కాదు నేను టెయిల్స్ అని అన్నాను. దీనిబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో సౌండ్స్ ఉన్నాయో. ఇక మ్యాచ్ రిఫరీ వచ్చి శ్రీలంక టాస్ గెలిచిందని చెప్పగా ధోని గందరగోళంగా ఉందని మరోసారి టాస్ వేయాలని రిఫరీని, నన్ను కోరాడు. దీంతో మరోసారి టాస్కు వెళ్లాం. (నన్ను అవమానించారు.. లేదు మనోజ్!) మరోసారి టాస్ వేయగా మళ్లీ మేమే గెలిచాం బ్యాటింగ్ తీసుకున్నాం. బహుశా రెండో సారి మేము టాస్ ఓడిపోయి ఉంటే టీమిండియా తొలుత బ్యాటింగ్ తీసుకునేది కావచ్చు. మేము లక్ష్యాన్ని ఛేదించేవాళ్లం కావచ్చు. ఎందుకంటే ఐదు, ఆరు స్థానాల వరకు మా బ్యాటింగ్ దుర్బేద్యంగా ఉంది. అప్పటికీ మేము బ్యాటింగ్లో పలు ప్రయోగాలు చేసి విజయవంతమయ్యాం. ఇక మాథ్యూస్ గాయం కూడా మా ఓటమికి కారణమైంది. అతడు ఆరోజు మ్యాచ్లో ఉండి ఉంటే మేము ఛేజింగ్ వైపు మొగ్గు చూపేవాళ్లం. ఎందుకంటే అవసరమైన సమయంలో టెయిలెండర్ల సహాయంతో బ్యాటింగ్ చేసి మ్యాచ్ను గట్టెక్కించేవాడు. జరిగిందేదో జరిగిపోంది. టీమిండియా అద్భుతంగా ఆడింది. ధోని తన స్టైల్లో సిక్సర్ కొట్టి టీమిండియాకు ప్రపంచకప్ను అందించాడు’అని పేర్కొంటూ ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్నాడు సంగక్కర. -
నేను 8 వికెట్లు తీయలేనా..!
కొలంబో: టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు (800) నెలకొల్పిన దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ తన ఆఖరి టెస్టులో ఈ ఘనత నమోదు చేసాడు. 2010లో స్వదేశంలో భారత్తో జరిగిన ఈ సిరీస్కు ముందే తాను మొదటి టెస్టు మాత్రమే ఆడి రిటైర్ అవుతానని అతను ముందే ప్రకటించాడు. అప్పటికి అతని ఖాతాలో 792 వికెట్లు ఉన్నాయి. అయితే సహచరుడు సంగక్కర మాత్రం 800 మైలురాయిని వచ్చేవరకు ఆడాల్సిందేనని ఒప్పించే ప్రయత్నం చేశాడు. అవసరమైతే తర్వాతి టెస్టునుంచి విశ్రాంతి తీసుకొని లేదా మరుసటి సిరీస్ అయినా ఆడాల్సిందే తప్ప ఇలా తప్పుకోవద్దని మళ్లీ మళ్లీ చెప్పాడు. దీనిపై స్పందించిన మురళీ...‘నేను నిజంగా అత్యుత్తమ స్పిన్నర్నే అయితే ఒకే టెస్టులో 8 వికెట్లు తీస్తాను తప్ప ఇలా సాగదీయను’ అని బదులిచ్చాడు. చివరకు అతను అన్నట్లుగానే సరిగ్గా 8 వికెట్లు తీసి చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. గురువారం భారత స్పిన్నర్ అశ్విన్తో జరిపిన ఇన్స్టాగ్రామ్ సంభాషణలో సంగక్కర ఇది వెల్లడించాడు. -
ఆ జాబితాలో ఇండియా ఆటగాళ్లు ఒక్కరు లేరు
జోహన్నెస్బర్గ్ : దక్షిణాఫ్రికా వెటరన్ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ తాను ఎదుర్కొన్న ఆటగాళ్లు, తనతో కలిసి ఆడిన 11 మంది అత్యుత్తమ ఆటగాళ్లను ప్రకటించాడు. ఈ 11మంది ఆటగాళ్లలో ఇద్దరు విదేశీయులు తప్ప మిగతావారంతా ప్రొటీస్ జట్టుకు ఆడినవారే కావడం గమనార్హం. ఇందులో టీమిండియా నుంచి ఒక్కరు కూడా లేకపోవడం విశేషం. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమి స్మిత్, శ్రీలంక మాజీ వికెట్కీపర్ కుమార సంగక్కరలు ఓపెనర్లుగా, ప్రపంచ అత్యుత్తమ ఆల్రౌండర్గా పేరుపొందిన మాజీ ఆల్రౌండర్ జాక్ కలిస్ నాలుగో స్థానంలో, వరల్డ్ బెస్ట్ ఫీల్డర్గా గుర్తుంపుపొందిన జాంటీ రోడ్స్ ఐదో స్థానంలో ఉన్నారు. 6వ స్థానంలో దక్షిణాఫ్రికా ప్రస్తుత వన్డే వికెట్ కీపర్గా ఉన్న క్వింటన్ డికాక్ను ఎంపిక చేశాడు. బౌలర్ల జాబితాలో ఆసీస్ నుంచి మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్లీ చోటు సంపాధించగా మిగతావారంతా దక్షిణాఫ్రికాకు చెందిన బౌలర్లే ఉన్నారు. వీరిలో దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ అలెన్ డొనాల్డ్ కూడా ఉన్నాడు. స్టెయిన్ అత్యుత్తమ జట్టు : గ్రేమి స్మిత్, కుమార సంగక్కర, డేవ్ హాకిన్, జాక్ కలిస్, జాంటీ రోడ్స్, క్వింటన్ డికాక్, బ్రెట్ బార్గియాచి, పీటర్ లాంబార్డ్, బ్రెట్ లీ, పాల్ హరిస్, అలెన్ డొనాల్డ్ -
పాక్కు వెళ్లే సంగక్కర జట్టు ఇదే..
లండన్: వచ్చే నెలలో పాకిస్తాన్లో పర్యటించనున్న కుమార సంగక్కర నేతృత్వంలోని మెరిల్బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) జట్టును ప్రకటించారు. ఈ మేరకు 12 మందితో కూడిన ఇంగ్లిష్ కౌంటీ క్లబ్ జట్టును ఎంసీసీ తాజాగా వెల్లడించింది. ఈ జట్టులో సంగక్కర సారథిగా వ్యవహరిస్తుండగా, మరో సీనియర్ క్రికెటర్ రవి బొపారాను సైతం ఎంపిక చేశారు. పాక్ పర్యటనలో ఎంసీసీ జట్టు మూడు మ్యాచ్లు ఆడనుంది. ఇందులో రెండు మ్యాచ్లను పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) జట్లైన లాహోర్ క్వాలండర్స్-ముల్తాన్ సుల్తాన్స్తో ఎంసీసీ ఆడనుంది. ఇక మూడో మ్యాచ్ను పాకిస్తాన్ దేశవాళీ టీ20 మ్యాచ్ విజేత నార్తరన్తో ఎంసీసీ జట్టు తలపడుతోంది. తమ దేశంలో క్రికెట్ను బతికించాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చేసిన విజ్ఞప్తిని ఎంసీసీ గత నెల్లో ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎంసీసీ నుంచి ఒక జట్టును పాకిస్తాన్ పర్యటనకు పంపడానికి సమాయత్తమైంది. ఎంసీసీ అధ్యక్షుడిగా ఉన్న సంగక్కర సారథ్యంలోని జట్టు.. పాకిస్తాన్ పర్యటనకు పంపాలని నిర్ణయించింది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్ తరహా దేశాల్లో క్రికెట్ను బ్రతికించడం చాలా ముఖ్యమని భావించిన ఎంసీసీ.. పాక్లో పరిస్థితులు బాగానే ఉన్నాయనే చెప్పాలనే ఉద్దేశంతోనే తమ జట్టును అక్కడకు పంపుతుంది. 2009లో పాకిస్తాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఆ ప్రమాదంలో పలువురు క్రికెటర్లు గాయాలు బారిన పడ్డా ప్రాణ నష్టం జరగలేదు. ఆ ఘటనలో కుమార సంగక్కర సైతం గాయపడ్డాడు. అప్పట్నుంచి పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడానికి విదేశీ జట్లు భయపడుతున్నాయి. భద్రతాపరంగా అన్ని హామీలు లభించిన తర్వాత అందుకు సమాయత్తమవుతున్నాయి. ఆ దాడి తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వరల్డ్ ఎలెవన్ జట్టు ఒకసారి వెళ్లగా, శ్రీలంక అక్కడకు తరుచూ వెళుతూనే ఉంది. ఇటీవల శ్రీలంక జట్టు.. పాకిస్తాన్లో టెస్టు సిరీస్ ఆడింది. ఆ దాడి తర్వాత పాక్లో ఇదే తొలి టెస్టు సిరీస్ కాగా, ప్రస్తుతం బంగ్లాదేశ్ సైతం పాకిస్తాన్ పర్యటనలో ఉంది. దీనిలో భాగంగా ఇప్పటికే మూడు టీ20ల సిరీస్ ఆడిన బంగ్లాదేశ్.. పాక్తో రెండు టెస్టుల సిరీస్కు సిద్ధమైంది. పాక్కు వెళ్లే ఎంసీసీ జట్టు ఇదే.. కుమార సంగక్కర(కెప్టెన్), రవి బొపారా, మైకేల్ బర్జెస్, ఒలివర్ హానన్, ఫ్రెడ్ క్లాసెన్, మైకేల్ లీస్క్, అర్రోన్ లిల్లీ, ఇమ్రాన్ క్వాయమ్, విల్ రోడ్స్, సఫ్యాన్ షఫ్రీ, వాన్ డెర్ మెర్వీ, రాస్ వైట్లీ -
అతని భార్య గురించి కామెంట్ చేశా: ఇర్ఫాన్
న్యూఢిల్లీ: అన్ని ఫార్మాట్ల క్రికెట్కు శనివారం రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా వెటరన్ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన జ్ఞాపకాలను ఒక్కోక్కటిగా నెమరువేసుకుంటున్నాడు. భారత క్రికెట్లో ఒక వెలుగు వెలిగి అలానే జట్టుకు దూరమైన ఇర్ఫాన్.. ఢిల్లీలో శ్రీలంకతో జరిగిన ఒక టెస్టు మ్యాచ్లో ఆ జట్టు దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కరాను స్లెడ్జ్ చేయడాన్ని గుర్తు చేసుకున్నాడు. ప్రధానంగా కుమార సంగక్కరాను స్లెడ్జ్ చేసే క్రమంలో అతని భార్య గురించి కూడా కామెంట్ చేయాల్సి వచ్చిందనే విషయాన్ని తాజాగా ఇర్ఫాన్ పేర్కొన్నాడు.(ఇక్కడ చదవండి:ఇర్ఫాన్ పఠాన్ వీడ్కోలు) ‘ ఆ మ్యాచ్లో నేను రెండో ఇన్నింగ్స్లో 93 పరుగులు చేశా. అప్పటికే వీరేంద్ర సెహ్వాగ్ గాయపడటంతో నేను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చా. ఆ మ్యాచ్ను లంకేయులు కోల్పోతారనే విషయం సంగక్కరాకు తెలుసు. ఆ క్రమంలోనే నాపై స్లెడ్జింగ్కు దిగాడు. అది వ్యక్తిగత దూషణ. నేను కూడా వ్యక్తిగత దూషణకే దిగా. ప్రత్యేకంగా అతని భార్య గురించి కామెంట్ చేశా. అతను కూడా నా తల్లి దండ్రుల గురించి వ్యాఖ్యలు చేశాడు. అది మా మధ్య అగ్గి రాజేసింది. ఆ మ్యాచ్ తర్వాత కూడా మేమిద్దరం సంతోషంగా లేము.. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేదు కూడా’ అని ఒకనాటి చేదు అనుభవాలను పఠాన్ జ్ఞప్తికి తెచ్చుకున్నాడు.(ఇక్కడ చదవండి: బౌలర్గా వచ్చి ఆల్రౌండర్గా ఎదిగి చివరికి..) -
పాకిస్తాన్ టూర్కు కెప్టెన్గా సంగక్కరా
లండన్: తమ దేశంలో క్రికెట్ను బతికించాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చేసిన విజ్ఞప్తిని మెరిల్బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) మన్నించింది. ఈ మేరకు ఎంసీసీ నుంచి ఒక జట్టును పాకిస్తాన్ పర్యటనకు పంపడానికి సమాయత్తమైంది. దానిలో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లాహోర్కు జట్టును పంపడానికి అంగీకరించింది. అయితే పాకిస్తాన్ పర్యటనకు వచ్చే ఎంసీసీ జట్టు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరా నేతృత్వం వహించనున్నాడు. ఈ విషయాన్ని ఎంసీసీ తాజాగా ధృవీకరించింది. ఎంసీసీ అధ్యక్షుడిగా ఉన్న సంగక్కరా సారథ్యంలోని జట్టు.. పాకిస్తాన్ పర్యటనకు వస్తుందని స్పష్టం చేసింది. ‘ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్ తరహా దేశాల్లో క్రికెట్ను బ్రతికించడం చాలా ముఖ్యం. పాకిస్తాన్లో క్రికెట్ను కాపాడుకోవడానికి పీసీబీ ఇప్పటికే పలు మ్యాచ్లను విజయవంతంగా నిర్వహించింది. అందుకు మేము కూడా సిద్ధం ఉన్నాం’ అని ఎంసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. 2009లో పాకిస్తాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఆ ప్రమాదంలో పలువురు క్రికెటర్లు గాయాలు బారిన పడ్డా ప్రాణ నష్టం జరగలేదు. ఆ ఘటనలో కుమార సంగక్కరా సైతం గాయపడ్డాడు. అప్పట్నుంచి పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడానికి విదేశీ జట్లు భయపడుతున్నాయి. భద్రతాపరంగా అన్ని హామీలు లభించిన తర్వాత అందుకు సమాయత్తమవుతున్నాయి. ఆ దాడి తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వరల్డ్ ఎలెవన్ జట్టు ఒకసారి వెళ్లగా, శ్రీలంక అక్కడకు తరుచూ వెళుతూనే ఉంది. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటనలోనే ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటికే తొలి టెస్టు జరగ్గా అది డ్రాగా ముగిసింది. అయితే రెండో టెస్టు గురువారం నుంచి కరాచీలో ఆరంభం కానుంది. ఆ దాడి తర్వాత పాకిస్తాన్లో ఒక ద్వైపాక్షిక టెస్టు సిరీస్ జరగడం ఇదే తొలిసారి. -
హింసాత్మక ఘటనలపై క్రికెటర్ల ఆందోళన
సాక్షి, స్పోర్ట్స్ : శ్రీలంకలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై ఆ దేశ సీనియర్ క్రికెటర్లు కుమార సంగక్కర, మహేల జయవర్దనేలు ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలు, బుద్దుల మధ్య హింస చెలరేగడంతో అల్లర్లు దేశవ్యాప్తంగా విస్తరించకుండా లంక ప్రభుత్వం పదిరోజుల ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలపై జయవర్ధనే, సంగక్కరలు ట్విటర్లో ఖండించారు. ‘ ఏదో ఒక జాతి, మతాన్ని లక్ష్యంగా చేసుకొని భయపెట్టడం, హింసకు పాల్పడటం మంచిది కాదు. ఒకే దేశం.. ఒకే ప్రజలం అనే భావనతో కలిసి ఉండాలి. ప్రేమ, నమ్మకం, ఆదరణ అనేవి అందరి సాధారణ మంత్రంగా ఉండాలి. జాత్యహంకారం, హింసకు చోటులేదు. వాటిని ఆపేయండి. అంతకలిసి నిలబడి.. బలమైన దేశంగా నిలవాలని’ సంగక్కర ట్వీట్ చేశాడు. ‘ఇటీవల సంభవించిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నా. జాతి, మతంతో సంబంధం లేకుండా ఈ ఘటనలో పాలుపంచుకున్న ప్రతిఒక్కరిని శిక్షించాలి. 25ఏళ్ల పాటు కొనసాగిన సివిల్ వార్ నడుమ పెరిగాను. వచ్చే తరం ఇలాంటి వాతావరణానికి లోనుకాకుడదని కోరుకుంటున్నా.’ అని జయవర్దనే ట్వీట్ చేశాడు. వీళ్లతో పాటు లంక స్టార్ క్రికెటర్ ఎంజెలో మాథ్యూస్, మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య తదితరులు అల్లర్లను ఖండించారు. ప్రస్తుతం నిదహాస్ టీ20 ట్రై సిరీస్లో భాగంగా కొలంబోలో ఆతిథ్య శ్రీలంక, బంగ్లాదేశ్, భారత్ జట్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే. I strongly condemn the recent acts of violence & everyone involved must be brought to justice regardless of race/ religion or ethnicity. I grew up in a civil war which lasted 25 years and don’t want the next generation to go through that. — Mahela Jayawardena (@MahelaJay) 7 March 2018 No one in Sri Lanka can be marginalized or threatened or harmed due to their ethnicity or religion. We are One Country and One people. Love, trust and acceptance should be our common mantra. No place for racism and violence. STOP. Stand together and stand strong. — (@KumarSanga2) 7 March 2018 -
విరాట్పై సంగక్కర బిగ్ బెట్
న్యూఢిల్లీ : పరుగుల మెషీన్గా మారిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీపై శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర ఆసక్తికర ట్వీట్ చేశారు. 2017 కేలండర్ ఇయర్లో 2,818 పరుగులు సాధించినా... శ్రీలంక మాజీ కెప్టెన్ రికార్డును మాత్రం బద్దలు కొట్టలేకపోయాడంటూ బీబీసీ రిపోర్టర్ ట్వీట్ చేశారు. ఇందుకు స్పందించిన సంగక్కర.. తన రికార్డు ఎప్పటికీ అలానే ఉండిపోదని అన్నారు. 2018లో కొహ్లీనే దాన్ని బద్దలు కొడతాడని, 2019లో మరోసారి ఆ రికార్డును తిరగరాస్తాడని చెప్పారు. భవిష్యత్లో అత్యున్నత శిఖరాలకు కొహ్లీ చేరుకుంటాడని తాను బెట్ కడతానని అన్నారు. కొహ్లీ బ్యాటింగ్ శైలి విభన్నమైనదని కితాబిచ్చారు. కాగా, శ్రీలంకతో న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన మూడో టెస్టులో కొహ్లీ 243(287) పరుగులు సాధించిన విషయం తెలిసిందే. I don’t think that will last long the way @imVkohli is batting. He will probably overtake it next year and then do it again the year after. He is a different class. — Kumar Sangakkara (@KumarSanga2) December 6, 2017 -
పాండ్యాకు సంగక్కర బిగ్ కాంప్లిమెంట్!
సాక్షి, హైదరాబాద్: టీమిండియా ఆల్రౌండర్ హార్థిక్ పాండ్యా ప్రత్యేకమైన ఆటగాడని శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కర ప్రశంసించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఇండోర్ వన్డేలో పాండ్యా (78) అద్భుత ఇన్నింగ్స్ భారత్ విజయం సులువైన విషయం తెలిసిందే. ఆల్రౌండ్ ప్రదర్శనతో మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అందుకున్న పాండ్యాను కొనియాడుతూ సంగక్కర ట్వీట్ చేశారు. ‘భారత్ సిరీస్ గెలిచింది. హార్థిక్ పాండ్యా ప్రత్యేకమైన ఆటగాడు. అన్ని పరిస్థితుల్లో ఆడేలా భారత్ పరిపూర్ణంగా ఉంది.’ అని సంగక్కర ట్వీట్ చేశారు. దీనికి హార్దిక్ పాండ్యా ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. @BCCI seemed to canter to the series win. @hardikpandya7 is a very special player. India looks a complete side for all conditions — Kumar Sangakkara (@KumarSanga2) 24 September 2017 Thank you for the kind words sir! 😊 — hardik pandya (@hardikpandya7) 24 September 2017 -
వీడియో వైరల్: ఫోన్ పగలగొట్టిన సంగక్కర..!
లండన్: అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి రెండు సంత్సరాలు అయినా శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర తన బ్యాటింగ్ సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఇంగ్లండ్ డొమెస్టిక్ టీ20 టోర్నీలో సర్రే-మిడిల్ సెక్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సంగక్కర తన బ్యాటును ఝులిపించాడు. 6 ఫోర్లు, 3 సిక్సులతో 70 పరుగులు బాదిన ఈ 40 ఏళ్ల లంక మాజీ ఆటగాడు ఓ సిక్స్ తో అభిమాని ఫోన్ పగలగొట్టాడు. స్టీవెన్ ఫిన్ ఆఫ్ స్టంప్ మీదుగా వేసిన బంతిని సంగక్కర భారీ షాట్ తో సిక్స్ గా మలిచాడు. ఈ బంతిని అందుకోవడానికి ఆతృత చూపిన ఓ అభిమాని చేతిలో ఫోన్ తో క్యాచ్ పట్టడానికి ప్రయత్నించాడు. దీంతో బంతి మొబైల్ కు తగిలి కింద పడిపోయింది. వెంటనే ఫోన్ అందుకున్న ఆ అభిమాని పగిలిపోయిన ఫోన్ చూపిస్తూ ఆశ్ఛర్యం వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 2015లో టెస్టు క్రికెట్ కు సంగక్కర వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 134 టెస్టుల్లో 57.40 సగటుతో 12,400 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన ఏడాది నుంచి సర్రే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక సంగక్కర శ్రీలంక గెలిచిన 2014 టీ20 వరల్డ్ కప్ జట్టులో ,2007 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ చేరిన జట్టులో కీలక ఆటగాడు. అంతేగాకుండా సంగక్కర కెప్టెన్సీలో శ్రీలంక 2011 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరింది. 2015లో వన్డే, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగక్కర అంతర్జాతీయ టీ20 చివరి మ్యాచ్ ను 2014లో భారత్ తో ఆడాడు. -
భారత మహిళా క్రికెటర్.. అతన్ని తెగ కాపీ కొట్టేది!
సంగ్లీ: భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధన పేరు ఇప్పుడు మార్మోగుతోంది. ఇటీవల వరల్డ్ కప్లో సెంచరీ బాదిన ఈ అమ్మాయిని భారత లెజండ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ప్రశంసల్లో ముంచెత్తారు.. స్మృతి చిన్నప్పుడు తన ఫేవరెట్ క్రికెటర్ కుమార సంగక్కర తెగ కాపీ కొట్టేదట. అతని ప్రతి బ్యాటింగ్ స్టైల్ను నకలు చేసేందుకు ఆమె ప్రయత్నించడంతో కోచ్ కొన్నిసార్లు తలంటాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని ఆమె చిన్ననాటి కోచ్ అనంత్ తంబ్వేకర్ తెలిపారు. స్మృతికి చిన్నప్పుడే క్రికెట్ మీద ఇష్టం ఏర్పడింది. దీంతో తన సోదరులతో కలిసి ఆమె కూడా అనంత్ తంబ్వేకర్ కోచింగ్ అకాడమీలో చేరింది. 'స్మృతి చిన్నప్పటినుంచి చాలా హుషారుగా ఉండేది. అదేసమయంలో నెట్స్లో మాత్రం చాలా క్రమశిక్షణతో మెలిగేది. ఒక షాట్ ఆడటంలో కచ్చితత్వం సాధించేవరకు ఆమె నెట్స్ను వదిలిపెట్టేది కాదు. నెట్స్లో తను ఎప్పుడూ శ్రీలంక బ్యాట్స్మన్ సంగక్కరను కాపీ కొట్టడానికి ప్రయత్నించేది. దీంతో కొన్నిసార్లు నేను ఆమెను తిట్టేవాడిని. అలా కాపీ కొట్టడం సరికాదని చెప్పేవాడిని' అని అనంత్ తెలిపారు. 20 ఏళ్ల స్మృతి వరల్డ్ కప్లో భాగంగా గత గురువారం వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో తన రెండో సెంచరీని సాధించిన సంగతి తెలిసిందే. -
వయసు 39.. సెంచరీలు 100
లీడ్స్: శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర విజృంభణ కొనసాగుతోంది. ఇంగ్లీష్ కౌంటీల్లో ఇరగదిస్తున్నాడు. వరుస శతకాలతో మోత మోగిస్తున్నాడు. ఈ క్రమంలో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. కెరీర్లో వందో శతకం పూర్తి చేశాడు. ఇంగ్లీష్ కౌంటీల్లో భాగంగా సర్రే టీమ్ తరపున ఆడుతున్న సంగక్కర అన్ని ఫార్మాట్లలో కలిపి 45,529 పరుగులు సాధించాడు. కౌంటీ చాంపియన్ షిప్లో భాగంగా మంగళవారం యార్క్షైర్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సెంచరీతో తన జట్టుకు విజయాన్ని అందించాడు. 121 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 121 పరుగులు చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన సర్రే టీమ్ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 313 పరుగులు చేసింది. యార్క్షైర్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 289 పరుగులు సాధించింది. 39 ఏళ్ల సంగక్కర రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. దేశవాళీ క్రికెట్ నుంచి కూడా త్వరలో తప్పుకోనున్నట్టు ఇటీవల ప్రకటించాడు. మరో నాలుగు నెలలు మాత్రమే క్రికెట్ ఆడతానని వెల్లడించాడు. వయసు మీదపడుతున్న అతడి బ్యాటింగ్ పదును తగ్గలేదు. కౌంటీ చాంపియన్ షిప్లో సర్రే టీమ్ తరపున రు సెంచరీలు సాధించడమే ఇందుకు తాజా రుజువు. కెరీర్లో సంగక్కర సాధించిన వంద శతకాల్లో 61 ఫస్ట్ క్లాస్ సెంచరీలుండగా, 39 లిస్ట్-ఎ సెంచరీలున్నాయి. కెరీర్ ముగించేలోపు మైదానంలో అతడు మరిన్ని రికార్డులు సాధించడం ఖాయం. -
'ఆ జట్లు సెమీస్కు వస్తాయని అనుకోలేదు'
చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకపై అనూహ్య విజయం సాధించిన పాకిస్థాన్ జట్టు సెమీస్కు చేరుకోవడంపై కుమార సంగక్కర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కీలకమైన ఈ మ్యాచ్లో లంక జట్టు పలు పొరపాట్లు చేసిందని ఆ జట్టు మాజీ ఆటగాడైన సంగక్కర అభిప్రాయపడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఆసియాకు చెందిన మూడు జట్లు టాప్-4లో ఉన్నాయని, టోర్నమెంటుకు ముందు ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరని అన్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు సెమీఫైనల్కు చేరుతాయని తాను అనుకోలేదని, కానీ అద్భుతంగా ఆడి ఆ జట్లు ఈ ఘనత సాధించాయని, చక్కని క్రికెట్ ఆడి సెమీస్కు చేరిన ఘనత వాటికి దక్కుతుందని అన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సోమవారం జరిగిన ఈ గ్రూప్ ‘బి’ మ్యాచ్లో పాక్ 3 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 49.2 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ డిక్వెల్లా (86 బంతుల్లో 73; 4 ఫోర్లు), మ్యాథ్యూస్ (54 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించగలిగారు. పేసర్లు జునైద్ ఖాన్, హసన్ అలీలకు మూడేసి, ఆమిర్, అష్రాఫ్లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్కు దిగిన పాక్ 44.5 ఓవర్లలో 7 వికెట్లకు 237 పరుగులు చేసింది. లక్ష్యఛేదన సందర్భంగా పాకిస్థాన్ ఓ దశలో స్కోరు 162/7తో వెనుకబడటంతో... ఇక శ్రీలంక గెలుపు ఖాయమే అని అంతా భావించారు. కానీ, కెప్టెన్ సర్ఫరాజ్ (79 బంతుల్లో 61 నాటౌట్; 5 ఫోర్లు), ఆమిర్ (43 బంతుల్లో 28 నాటౌట్; 1 ఫోర్) పట్టువదలని పోరాటం ఆ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. పాక్ బ్యాట్స్మెన్ ఫఖర్ జమాన్ (36 బంతుల్లో 50; 8 ఫోర్లు, 1 సిక్స్), అజహర్ అలీ (50 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించారు. -
సంగక్కర సరికొత్త రికార్డు
-
సంగక్కర సరికొత్త రికార్డు
చెమ్స్ ఫోర్ట్: ఇటీవల తన దేశవాళీ క్రికెట్ కెరీర్ కు సంబంధించి రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఇంకా అత్యుత్తమ ఫామ్లోనే కొనసాగుతున్నాడు. ఇంగ్లీష్ కౌంటీల్లో భాగంగా సర్రే తరపున ఆడుతున్న సంగక్కర అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఎసెక్స్ తో మ్యాచ్ లో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో సంగక్కర(177 బ్యాటింగ్;) భారీ సెంచరీ సాధించాడు. తద్వారా కౌంటీ చాంపియన్ షిప్ లో సర్రే తరపున వరుసగా ఐదు సెంచరీలు చేసిన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతకుముందు సంగక్కర(136, 105, 114, 120) వరుస శతకాలతో మెరిశాడు. ఇదిలా ఉంచితే, సంగక్కరకు ఇది 99వ సెంచరీ కావడం మరో విశేషం. ఇందులో 61 ఫస్ట్ క్లాస్ సెంచరీలుండగా, 38 లిస్ట్-ఎ సెంచరీలున్నాయి. మరో నాలుగు నెలలు మాత్రమే క్రికెట్ ఆడుతున్నట్లు సంగక్కర ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ తరువాత దేశవాళీ క్రికెట్ నుంచి సైతం వీడ్కోలు తీసుకుంటున్నట్లు తెలిపాడు. దాదాపు రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగక్కరకు వయసు పైబడటంతో గేమ్ నుంచి పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. -
క్రికెట్ కు సంగక్కర గుడ్ బై
కొలంబో: దాదాపు రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కు గుబ్ బై చెప్పిన శ్రీలంక మాజీ క్రికెట్ కెప్టెన్ కుమార్ సంగక్కర తాజాగా తన ఫస్ట్ క్లాస్ కెరీర్కు సైతం వీడ్కోలు చెప్పాడు. ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్షిప్లో భాగంగా సెప్టెంబర్ లో తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడనున్నట్లు సంగాక్కర తాజాగా ప్రకటించాడు. ' మరికొన్ని నెలల్లో 40వ ఒడిలోకి వెళ్లబోతున్నా. ఇంకా ఆడాలని ఉన్నా శరీరం సహకరించడం లేదు. దాంతో ఇక పూర్తిగా క్రికెట్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నా. ఇంగ్లండ్ లో ఆడబోయే కౌంటీ క్రికెట్ నాకు చివరిది. కొన్ని రోజుల్లో నా క్రికెట్ కెరీర్ ముగుస్తుంది. సుదీర్ఘకాలం పాటు క్రికెట్ ఆడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదొక రోజు ఆటకు గుడ్ బై చెప్పక తప్పదు'అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్య్వూలో సంగా స్పష్టం చేశాడు. 2015లో టెస్టు క్రికెట్ కు సంగక్కర వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 134 టెస్టుల్లో 57.40 సగటుతో 12,400 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన ఏడాది నుంచి సర్రే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత సీజన్ లో కౌంటీల్లో వెయ్యి పరుగులు సాధించిన సంగా.. మిడిల్సెక్స్ పై రెండు సెంచరీలతో ఆకట్టుకున్నాడు. -
'కోహ్లి ఆటను చూడలేకపోయాం'
న్యూఢిల్లీ:టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లిపై శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ప్రశంసలు కురిపించాడు. వరల్డ్ టీ 20లో భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ విరాట్ ఆడిన తీరు అద్భుతమని కొనియాడాడు. భారత జట్టులో విరాట్ అత్యంత ప్రతిభావంతుడని సంగక్కర పేర్కొన్నాడు. అయితే వరల్డ్ టీ 20లో విరాట్ ఆట సెమీ ఫైనల్ వరకూ మాత్రమే పరిమితం కావడం నిజంగా దురదృష్టకరమన్నాడు. టీమిండియా ఫైనల్ కు చేరకపోవడంతో విరాట్ ఆటను టోర్నీ కడవరకూ ఆస్వాదించలేకపోయామని జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో సంగక్కర పేర్కొన్నాడు. ఈ టోర్నీలో విరాట్ కోహ్లి మూడు హాఫ్ సెంచరీల సాయంతో 273 పరుగులు నమోదు చేశాడు. వరల్డ్ ట్వంటీ 20లో విరాట్ యావరేజ్ 136.50 ఉండగా, స్ట్రైక్ రేట్ 146. 77 గా ఉంది. విరాట్ సాధించిన పరుగుల్లో 29 బౌండరీలు, 5 సిక్సర్లు ఉన్నాయి. తాజాగా ఐసీసీ వరల్డ్ టీ 20 కెప్టెన్ గా ఎంపికైన కోహ్లి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. -
సంగక్కర సునామీ ఇన్నింగ్స్
హూస్టన్: అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినా తనలో సత్తా తగ్గలేదని శ్రీలంక దిగ్గజ బ్యాట్స్ మన్ కుమార సంగక్కర నిరూపించాడు. ఆల్ స్టార్ క్రికెట్ టి20 సిరీస్ లో భాగంగా సచిన్ బ్లాస్టర్స్ తో గురువారం జరుగుతున్న రెండో మ్యాచ్ లో సంగక్కర చెలరేగాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. సంగక్కర వీరవిహారంతో వార్న్ టీమ్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన వార్న్ వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 262 పరుగులు చేసింది. సచిన్ సేనకు 263 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. సంగక్కర 30 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. రికీ పాంటింగ్ 16 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు సాధించాడు. కల్లిస్ 45(23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), హేడన్ 32(15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), వాగన్ 30(22 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్), సైమండ్స్ 19(6 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లు) చెలరేగడంతో వార్న్ సేన భారీ స్కోరు చేసింది. -
బై.. బై... సంగ
శ్రీలంక దిగ్గజానికి ఘనంగా వీడ్కోలు కొలంబో: పదిహేనేళ్లుగా శ్రీలంక క్రికెట్కు అతడు వెన్నెముక.. జట్టు సాధించిన ఎన్నో విజయాల్లో అతడి పాత్ర మరువలేనిది.. ఇన్నాళ్లుగా తన అసమాన ఆటతీరుతో జట్టును సమున్నతంగా నిలిపి అభిమానులను ఉర్రూతలూగించిన కుమార సంగక్కర.. తన కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టాడు. భారత్తో జరిగిన రెండో టెస్టు తన చివరిదని ఇంతకుముందే ప్రకటించిన ఈ సీనియర్ బ్యాట్స్మన్ సోమవారం మ్యాచ్ ముగిసిన అనంతరం ఘనమైన వీడ్కోలు తీసుకున్నాడు. ఇంతకాలం వెన్నంటి ప్రోత్సహించిన కుటుంబ సభ్యులతో పాటు కోచ్లు, ఆటగాళ్లు, బోర్డు, ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ చివరిసారిగా ప్రసంగించాడు. లంక తరఫున క్రికెట్ ఆడడం జీవితంలో అన్నింటికన్నా మధురమైన జ్ఞాపకమని చెప్పాడు. తమ నాయకుడిని ఆటగాళ్లు భుజాలపై ఎత్తుకొని మైదానంలో తిప్పారు. 37 ఏళ్ల సంగకు వీడ్కోలు పలికేం దుకు లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని రణిల్ విక్రమసింఘే, మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ, సునీల్ గవాస్కర్ హాజరయ్యారు. అంతకుముందు మ్యాచ్ ముగిసిన అనంతరం భారత క్రికెట్ ఆటగాళ్ల సంతకాలతో కూడిన జెర్సీని కెప్టెన్ కోహ్లి.. సంగక్కరకు అందించాడు. సంగక్కర భావోద్వేగ వీడ్కోలు ప్రసంగం అతడి మాటల్లోనే... అందరికీ కృతజ్ఞతలు: నాకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాని, కుటుంబసభ్యులకు, భారత, లంక జట్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా నా క్రికెట్ కెరీర్ ఆరంభానికి క్యాండీలోని ట్రినిటీ కాలేజి ఎంతగానో చేయూతనందించింది. ఇక నాకు చాలా మంది కోచ్లున్నారు. ఎందుకంటే నేను టీనేజ్లో ఉన్నప్పుడు మా నాన్న చాలా మంది దగ్గర శిక్షణ ఇప్పించేవాడు. డ్రెస్సింగ్ రూమ్ కబుర్లు మిస్ అవుతా: నా గత కెప్టెన్లు, తోటి ఆటగాళ్లు నా అభివృద్ధికి తోడ్పడినవారే. డ్రెస్సింగ్ రూమ్లో వారి కబుర్లను ఎంతగానో మిస్ అవుతాను. నాది అద్భుతమైన కుటుంబం. 30 ఏళ్లుగా నన్ను అభిమానించిన వారంతా మ్యాచ్ చివరి రోజు హాజరయ్యారు. ఇదే నేను సాధించిన గొప్ప ఘనత. చాలా మంది జీవితంలో మిమ్మల్ని ప్రభావితం చేసింది ఎవరని అడుగుతుంటారు. నిజానికి దీని కోసం నేనెక్కడా చూసింది లేదు. నా తల్లిదండ్రులే నన్ను విపరీతంగా ప్రభావితం చేశారు. ఈ కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. అభిమానులకు రుణపడి ఉంటా: లంక తరఫున ఇన్నేళ్లుగా ఆడేందుకు నాకు మనోధైర్యాన్నిచ్చిన అభిమానులకు ఎంతగానో రుణపడి ఉంటాను. నా గురించి మాట్లాడిన విరాట్ కోహ్లి, భారత జట్టుకు కూడా అభినందనలు. చాలా ఏళ్లుగా ఆ జట్టు లంకకు పటిష్ట ప్రత్యర్థిగా ఉంది. ఈరోజు మేం ఓడిపోయినందుకు ఏమీ బాధపడడం లేదు. తర్వాతి మ్యాచ్ మేమే గెలుస్తాం. లంక జట్టు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా దేశం గర్వించేలా ఆడుతుందని ఆశిస్తున్నాను. జహీర్, స్వాన్ బౌలింగ్లో కష్టపడ్డా: ఈ సిరీస్లో అశ్విన్ నన్ను ఇబ్బంది పెట్టినా ఓవరాల్గా నా కెరీర్లో పేసర్ జహీర్ ఖాన్, ఇంగ్లండ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ బౌలింగ్ సవాల్గా నిలిచింది. నేను యువకుడిగా ఉన్నప్పుడు వసీం అక్రమ్ బంతులను ఎదుర్కోవడంలోనూ ఇబ్బంది పడ్డా. హైకమిషనర్ పదవిపై ఆలోచిస్తా... కుమార సంగక్కరకు ఇంగ్లండ్లో శ్రీలంక హైకమిషనర్ పదవిని అధ్యక్షుడు సిరిసేన ఆఫర్ చేశారు. అయితే దీనిపై ఆలోచించాకే తుది నిర్ణయం తీసుకుంటానని సంగక్కర చెప్పాడు. ‘అధ్యక్షుడి విజ్ఞప్తిని నేను గౌరవిస్తాను. ఈ విషయం గురించి ఆయనతో లోతుగా చర్చించాల్సి ఉంది. ఎందుకంటే అలాంటి అనుభవం నాకు లేదు. ఆ పదవికి ప్రత్యేక పరిజ్ఞానం అవసరం. అందుకే ఆలోచించాకే తుది నిర్ణయం తీసుకుంటాను’ అని సంగ అన్నాడు. లంక దిగ్గజం సంగక్కర ఆడిన శకంలోనే తాను కూడా క్రికెట్ ఆడినందుకు గర్వపడుతున్నానని భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ట్విట్టర్లో పేర్కొన్నాడు. ‘ఓ వ్యక్తిగానే కాకుండా క్రికెటర్గా నీగురించి చెప్పడానికి మాటలు లేవు. చాలామందికి ప్రేరణగా నిలిచావు. నీ శకంలోనే నేను కూడా ఆడుతున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. జీవితంలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను’ అని కోహ్లి చెప్పాడు. మాజీ ఆటగాళ్ల క్లబ్కు స్వాగతం: గవాస్కర్ సంగక్కర జీవితంలో రెండో ఇన్నింగ్స్ అద్భుతంగా సాగాలని మాజీ కెప్టెన్ గవాస్కర్ కోరుకున్నారు. ‘క్రికెట్లో సాగించిన ఇన్నింగ్స్కంటే రెండో ఇన్నింగ్స్ ఇంకా బాగా సాగాలి. ఇన్నేళ్లుగా లంక ఆశలను సమర్థవంతంగా మోశావు. చివరిగా మాజీ ఆటగాళ్ల క్లబ్కు నీకు స్వాగతం పలుకుతున్నాను’ అని గవాస్కర్ అన్నారు. గొప్ప ఆటగాడు: ఐసీసీ గత 15 ఏళ్లుగా సంగక్కర అంతర్జాతీయ క్రికెట్లో గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ అన్నారు. కెప్టెన్గా, వికెట్ కీపర్గా, ఆటగాడిగా జట్టుకు అతడు అందించిన సేవలను తక్కువగా చూడలేమని కొనియాడారు. -
చెప్పడానికి మాటలు చాలవు!
కొలంబో:దశాబ్దన్నర కాలంగా అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో ఘనతలు సాధించి, క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కరపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. సంగక్కర ఆటతో తాను ఎంతో స్ఫూర్తి పొందానని .. ప్రపంచ క్రికెట్ లో సంగా చాలా మందికి ఆదర్శంగా నిలిచాడనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. 'సంగా గురించి చెప్పడానికి పదాలు చాలవు. సమకాలీన క్రికెటర్లలో సంగా ఒక గొప్ప క్రికెటర్. నేను సంగాతో కలిసి ఆడటం అదృష్టంగా భావిస్తున్నా. సంగా క్రికెట్ లో సాధించిన ఘనతలు నిజంగా అద్భుతం' అని బీసీసీఐ అధికారిక ట్విట్టర్ లో కోహ్లీ పొగడ్తలు కురిపించాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సంగాకు , అతని కుటుంబానికి ఇక ముందు కూడా అంతా మంచే జరగాలని కోహ్లీ ఆకాంక్షించాడు. సంగా ఆడిన చివరి టెస్టు ఫలితాన్ని పక్కన పెడితే అతనికి భారత ఆటగాళ్లు 'గార్డ్ ఆఫ్ ఆనర్' తో వీడ్కోలు పలికారు. 38 ఏళ్ల సంగా దశాబ్దమన్నర కాలంగా శ్రీలంక క్రికెట్కు వెన్నె ముకగా నిలిచాడు. 134 టెస్టుల్లో 12,400 పరుగులు చేశాడు. ఇందులో 38 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 38 సెంచరీల్లో 11 డబుల్ సెంచరీలుగా మలచడం విశేషం. ఇక 404 వన్డేల్లో 14,234 పరుగులు చేశాడు. వీటిలో 25 సెంచరీలు, 93 హాఫ్ సెంచరీలున్నాయి. ప్రస్తుతం టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగుల జాబితాలో అతను ఐదో స్థానంలో ఉన్నాడు. -
కుమార సంగక్కర రాయని డైరీ
చివరి టెస్టు! శారా ఓవల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నట్టుగా లేదు. ఫేర్వెల్ మూడ్ని చెదరగొట్టడానికి మా వాళ్లంతా బ్యాటింగులోకి దిగుతున్నట్టుగా ఉంది. స్కూల్లో చేరినప్చడు కొత్త పిల్లవాడిపై చూపే స్నేహాన్ని, ఉత్సాహాన్ని... ఇప్చడు ‘స్కూల్’ నుంచి వెళ్లిపోబోతున్న ఈ పాత పిల్లాడిపై అంతా చూపిస్తున్నారు. ఆశీర్వచనాలు అందిస్తున్నారు. హృదయానికి బాగా దగ్గరగా వచ్చి హత్తుకుంటున్నారు. స్టేడియంలోని ఈ ఉద్వేగాల హెచ్చుతగ్గులు నన్ను తాకకుండా వెళ్లిపోతున్నవేమీ కాదు. గంభీరంగా ఆడే ప్రయత్నం చేస్తున్నాను. సెంచరీ కొట్టడంపై నా దృష్టి లేదు. కానీ ప్రతి బంతినీ కొట్టాలి. బలంగా కొట్టాలి. చివరి వరకూ ఎంటర్టైన్ చెయ్యాలి. నన్నీ స్థాయికి ఎవరైతే తీసుకువచ్చారో వారందరి కోసం ఒక్కో బంతినీ కొట్టాలి. ‘చివరి’ అనే మాట నాలోని ఏ నాడీమండల హృదయ కణజాలంలోనో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆట మధ్యలోనే బ్రేక్డౌన్ అయిపోతానా... ఎమోషనల్ గా! స్టాండ్లో కూర్చుని ఉంది ఎహాలి. నా జీవిత భాగస్వామి. తనవైపు చూసే సాహసం చెయ్యలేకపోతున్నాను. నాకు తెలుసు తను నన్నే చూస్తూ ఉంటుందని. ఆ చిరునవ్వు... నేను వీడ్కోలు తీసుకుంటున్న క్షణాల్లోనూ అలాగే దృఢంగా ఉంటుంది. గట్టి అమ్మాయి. నా స్ట్రగుల్స్ మొత్తం తనకు తెలుసు. తన స్థిరత్వం ఒక్కటే నాకు తెలుసు. స్టేడియంలో తను ఉంటే... బిగించి ఉన్న ఆ పెదవులలోని స్థిరత్వం... పెవిలియన్ ను దాటుకుని వచ్చి నాలోకి ప్రవహిస్తున్నట్లు ఉంటుంది. నా ప్రతి ఆటలోనూ తను ఉంది. ఇప్చడూ ఉంది ఈ చివరి మ్యాచ్ లో. మామూలుగానే ఉందా? మూమూలుగానే ఉన్నట్లు ఉందా? సంగ... సంగ... స్టేడియంలో పెద్దగా అరుపులు! సముద్రపు హోరులా! అంత హోరులోనూ ఉబికి రాబోయే నా కన్నీళ్ల హోరును నేను స్పష్టంగా వినగలుగుతున్నాను. బ్యాట్ పెకైత్తి అభివాదం చేయడానికి శక్తి చాలడం లేదు. స్ట్రయిట్ ఇంటూ ద క్రౌడ్... సిక్సర్ని కొట్టడానికి బ్యాట్ పైకి లేపినంత తేలిక కాదేమో, ఆఖరి మ్యాచ్ లో ఫ్యాన్స్ కోసం బ్యాట్ ను పైకి లేపి గాలిలో ఆడించడం! ఇవాళ నా నుంచి వాళ్లేమీ కోరుకోవడం లేదు. నన్ను నన్నుగా తప్ప. హౌ లక్కీ అయామ్! పదిహేనేళ్లు నన్ను ఆదరించిన వారికి ఒక్కరోజులో నేనేమి ఇవ్వగలను? గుండె నిండా కృతజ్ఞత మాత్రం ఉంది. వచ్చిన రోజుల్ని మర్చిపోలేను. నా ఫస్ట్ కోచ్, నా ఫస్ట్ స్కిప్పర్, నా ఫస్ట్ టెస్ట్, నా ఫస్ట్ వన్డే, నా ఫస్ట్ సిక్స్, నా ఫస్ట్ సెంచరీ! వెళ్లిపోతున్న రోజునూ మర్చిపోలేను. నా ఫ్యాన్స్, నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్, నా ఫ్యామిలీ, ఇంకా... కోహ్లీ హ్యాండ్షేక్, టీమిండియా ‘గార్డ్ ఆఫ్ ఆనర్’! ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీవన్ కలిస్తేనే నేను. నాదంటూ ఏం లేదు. నేనంటూ ఏం లేను. థ్యాంక్యూ శ్రీలంక. మాధవ్ శింగరాజు -
భారత్కు ఓపిక అవసరం
అనిల్ కుంబ్లే రెండో రోజు ఆట ముగిసేసరికి ఈ టెస్టు ఆసక్తికరంగా మారింది. నువ్వా.. నేనా అనే రీతిలో సాగినా మూడో రోజు భారత్కు కాస్త ఆధిక్యం దొరికేటట్లే కనిపిస్తోంది. నేటి (శనివారం) ఆట ఆరంభంలోనే వికెట్లు తీయడం చాలా కీలకం. పిచ్ ఇప్పటిదాకా అయితే బౌలర్లకు సహాయకారిగానే ఉంటోంది. మ్యాచ్ ఎలా సాగబోయేది తొలి సెషన్ నిర్ధారిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యం మ్యాచ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ జారవిడుచుకునే అవకాశం ఇవ్వకూడదు. ఏ టెస్టులోనైనా రెండు, మూడో రోజు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి భారత్ చాలా ఓపికగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం.. శ్రీలంక చివరి వరుస దాకా బ్యాటింగ్ చేసే జట్టు అని గుర్తుంచుకోవాలి. భారత్ విషయంలో రాహుల్, కోహ్లి మధ్య మంచి భాగస్వామ్యం ఏర్పడినా జట్టు తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసే అద్భుత అవకాశాన్ని చేజార్చుకుంది. ముఖ్యంగా రాహుల్ బ్యాటింగ్ చేసిన విధానం.. అతడి ఫుట్వర్క్ చూడముచ్చటగా ఉంది. స్పిన్నర్లను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఇక బౌలింగ్లో మన జట్టు మెరిసింది. ఇదే జోరును చూపితేనే ఫలితం ఉంటుంది. బౌలర్లు ఉమేశ్ యాదవ్, స్పిన్నర్ అశ్విన్ ప్రదర్శన బాగుంది. ముఖ్యంగా సంగక్కరను వరుసగా మూడోసారి కూడా అశ్విన్ అవుట్ చేయగలిగాడు. నిజానికి లంక చక్కటి ఆధిక్యం కోసం చూస్తోంది. ఈ సమయంలోనూ భారత్ సానుకూల ధృక్పథంతోనే ఉండాలి. 1-0తో ఆధిక్యంలో ఉన్న లంక ఆటగాళ్లు తమ సహజశైలిలోనే ఆడేందుకు చూస్తున్నారు. కానీ కోహ్లి బృందం మాత్రం మ్యాచ్ను తమవైపు తిప్పుకుని సిరీస్ను సమం చేయడంపై దృష్టి పెట్టాలి. -
సంగాకు 'గార్డ్ ఆఫ్ ఆనర్'
కొలంబో: మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో చివరి టెస్టు ఆడుతున్న శ్రీలంక వెటరన్ ఆటగాడు కుమార సంగక్కారకు అరుదైన గౌరవం లభించింది. రెండో రోజు ఆటలో భాగంగా శుక్రవారం సంగక్కార బ్యాటింగ్ కు వెళుతున్న సమయంలో కొలంబో స్టేడియం చప్పట్లతో మార్మోగింది. ప్రేక్షకులు లేచి నిలబడి తమ హర్షధ్వానాలతో సంగా బ్యాటింగ్ కు స్వాగతం పలికారు. కాగా, కుమార సంగాక్కర క్రీజ్ లోకి వచ్చే ముందు టీమిండియా ఆటగాళ్లు వరుసగా నిలబడి 'గార్డ్ ఆఫ్ ఆనర్' తెలిపారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కరాచలనంతో సంగాకు అభినందనలు తెలిపాడు. 133 వ టెస్టు ఆడుతున్న సంగాక్కార 57.71 సగటుతో 12, 350 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 38 సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో కూడా సంగాక్కార తనదైన ముద్రవేసిన సంగతి తెలిసిందే. 404 వన్డేలు ఆడిన సంగా 41.98 సగటుతో 14,234 పరుగులు చేశాడు. -
సంగక్కరకు బీసీసీఐ సన్మానం
కొలంబో: అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెబుతున్న లంక మాజీ సారథి కుమార సంగక్కరను బీసీసీఐ సన్మానించింది. గురువారం ప్రారంభమైన రెండో టెస్టుకు ముందు ఈ కార్యక్రమం జరిగింది. ‘సంగక్కర దిగ్గజ క్రికెటర్. మైదానంలో, బయటా అతని వ్యక్తిత్వం అద్భుతం. మన కాలంలో అత్యంత నిలకడైన బ్యాట్స్మెన్లో ఒకరిగా పేరు సంపాదించాడు. ప్రపంచ వ్యాప్తంగా యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాడు. సంగక్కర భవిష్యత్ బాగుండాలని బీసీసీఐ తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా కూడా సంగకు అభినందనలు తెలిపారు. కేవలం లంక జట్టుకే కాకుండా క్రికెట్కే సంగక్కర పెద్ద అంబాసిడర్ అని కొనియాడారు. కోచ్పై నిర్ణయం సెప్టెంబరులో భారత జట్టుకు కొత్త చీఫ్ కోచ్పై సెప్టెంబర్లో తుది నిర్ణయం తీసుకుంటామని ఠాకూర్ వెల్లడించారు. ఈ అంశాన్ని సలహాదారుల కమిటీతో చర్చిస్తామన్నారు. ‘ఏ జట్టుకైనా పూర్తిస్థాయి కోచ్ ఉండటం చాలా అవసరం. కోచ్ అంశంపై కసరత్తులు చేయడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి సెప్టెంబర్లో తుది నిర్ణయం తీసుకుంటాం. టీమ్ డెరైక్టర్గా శాస్త్రి బాగానే పని చేస్తున్నారు. అతని గురించి ఆటగాళ్లు కూడా మంచి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే పూర్తిస్థాయి కోచ్ ఉంటే ఎలాంటి సెటప్ ఉండాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలి. జట్టుతో పాటు 10 మంది కోచ్లు ఉండలేరు. కాబట్టి ఈ విషయాన్ని సలహాదారుల కమిటీకి వదిలేశాం. ఎంత మందిని నియమించాలనే దానిపై వాళ్లు నిర్ణయం తీసుకుంటారు. దక్షిణాఫ్రికా సిరీస్కు ముందే ఈ పని పూర్తి చేస్తాం’ అని ఠాకూర్ వివరించారు. -
సంగక్కర స్పెషల్!
కొలంబో: క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో శ్రీలంక బ్యాట్స్ మన్ కుమార్ సంగక్కర్ రెండో స్థానంలో నిలిచాడు. మూడు ఫార్మాట్లలో(టెస్టులు, వన్డేలు, టి20) ఇప్పటివరకు అతడు 27,966 పరుగులు చేశాడు. భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సంగక్కర కొలంబోలో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్ తర్వాత క్రికెట్ జీవితానికి వీడ్కోలు చెబుతానని సంగక్కర ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 133 టెస్టులు ఆడిన సంగక్కర 12,350 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో సంగక్కర ఐదో స్థానంలో ఉన్నాడు. 85 టెస్టుల్లో అతడు వికెట్ కీపింగ్ చేయలేదు. ఈ మ్యాచుల్లో 67.4 సగటుతో 9,233 పరుగులు సాధించడం విశేషం. 11 డబుల్ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. బ్రాడ్ మన్(12) టాప్ లో ఉన్నాడు. సంగక్కర ఖాతాలో 38 టెస్టు సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో వేగంగా 8, 9, 11, 12 వేల పరుగులు పూర్తి చేసిన ఘనత కూడా సంగక్కర పేరిట ఉంది. టెస్టుల్లో సంగక్కర బౌలింగ్ కూడా చేశాడు. నాలుగు ఇన్నింగ్స్ లో 4 బంతులు విసిరిన అతడు ఒక వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. 404 వన్డేలు ఆడిన సంగక్కర 41.98 సగటుతో 14234 పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలు, 93 అర్ధసెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. -
'ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తా'
కొలంబో: తన చివరి టెస్టులో ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తానని శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర వెల్లడించాడు. భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో తమ టీమ్ ను గెలిపించేందుకు తనవంతు పాత్ర పోషించడంపైనే దృష్టి పెట్టానని వెల్లడించాడు. అయితే ఎటువంటి లక్ష్యాలు పెట్టుకోలేదన్నాడు. చివరి టెస్టులో సెంచరీ చేయాలకుని తనకు తానుగా ఒత్తిడికి గురికాబోనని చెప్పాడు. టీమిండియాను సమర్థవంతంగా ఎదుర్కొవడంపైనే దృష్టి నిలిపానన్నాడు. గాలెలో జరిగిన మొదటి టెస్టులో కోహ్లి సేన అనూహ్యంగా ఓటమిపాలైందని, టెస్టు క్రికెట్ సవాల్ తో కూడుకున్నదనడానికి ఇదే నిదర్శమని చెప్పాడు. క్రికెట్ కు వీడ్కోలు చెప్పడం తనకు కష్టంగానే ఉందని అన్నాడు. చివరి టెస్టు తనకు భావోద్వేగంతో కూడుకున్నదేనన్నాడు. తన టీమ్ మేనేజ్ మెంట్ తో కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ పూర్తి చేశానన్నాడు. రిటైర్ తర్వాత కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతానని వెల్లడించాడు. తనకు ఇచ్చిన అవకాశాలకు శ్రీలంకకు కృతజ్ఞుడినై ఉంటానని సంగక్కర ప్రకటించాడు. తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. -
వీడ్కోలు వేళ..!
అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పనున్న క్లార్క్, సంగక్కర ♦ వీళ్లతో పాటు రోజర్స్ కూడా ♦ రేపటి నుంచి ఈ ముగ్గురి ఆఖరి టెస్టులు కాకతాళీయమే అయినా... ఇద్దరు దిగ్గజాలు అంతర్జాతీయ క్రికెట్కు ఒకేసారి వీడ్కోలు చెబుతున్నారు. దశాబ్దానికి పైగా తమ జట్లకు చిరస్మరణీయ విజయాలు అందించి... అంతర్జాతీయ క్రికెట్లో ప్రకంపనలు సృష్టించిన మైకేల్ క్లార్క్, కుమార సంగక్కర ఇద్దరూ బ్యాట్ను పక్కనపెట్టేస్తున్నారు. వీళ్లతో పాటు రోజర్స్ కూడా చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాడు. రేపటి నుంచి జరిగే టెస్టుల్లో ఈ దిగ్గజాల ఆటను చివరిసారి చూడొచ్చు. సాక్షి క్రీడావిభాగం : క్లార్క్ జట్టులో ఉంటే ఆస్ట్రేలియాకు అదో ధైర్యం... అలాగే సంగక్కర ఆడుతున్నాడంటే శ్రీలంక ప్రశాంతంగా ఉంటుంది. ఇద్దరూ ఇద్దరే. సమకాలీన క్రికెట్లో సంచలనాలు సృష్టించిన వారే. యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్తో రేపటి నుంచి జరిగే ఆఖరి టెస్టుతో క్లార్క్ పూర్తిగా క్రికెట్కు గుడ్బై చెప్పేస్తున్నాడు. అలాగే ఇదే మ్యాచ్ ద్వారా ఆస్ట్రేలియా ఓపెనర్ క్రిస్ రోజర్స్ కూడా అస్త్రసన్యాసం చేయబోతున్నాడు. ఇక ఇటు సొంతగడ్డపై సంగక్కర భారత్తో రేపటి నుంచి జరిగే రెండో టెస్టు ద్వారా చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ నేపధ్యంతో ఈ ముగ్గురి ఘనతల గురించి క్లుప్తంగా... కుమార సంగక్కర బ్యాట్స్మన్గా, వికెట్ కీపర్గా, కెప్టెన్గా త్రిపాత్రాభినయం చేసిన సంగక్కర లంక జట్టులో అత్యంత కీలక ఆటగాడు. దశాబ్దానికి పైగా ఒంటిచేత్తో జట్టును నడిపించిన సంగ...వన్డే ప్రపంచకప్ తర్వాత ఆట నుంచి తప్పుకుందామని భావించినా, లంక జట్టు భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని మరికొన్నాళ్లు క్రికెట్లో కొనసాగాడు. ప్రపంచ క్రికెట్లో అత్యంత ‘వివేకపూరితమైన’ బ్యాట్స్మన్గా పేరు తెచ్చుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో సుదీర్ఘకాలంపాటు నంబర్వన్గా కొనసాగాడు. మహేళ జయవర్ధనేతో కలిసి ఎన్నో రికార్డు భాగస్వామ్యాలు కూడా నెలకొల్పాడు. ఇటీవల ఫామ్తో ఇబ్బందులుపడుతున్న సంగక్కర పాక్తో జరిగిన రెండు టెస్టుల్లో మామూలుగా ఆడాడు. భారత్తో జరిగిన తొలి టెస్టులోనూ విఫలమైన అతను రెండో టెస్టులో ఓ భారీ ఇన్నింగ్స్తోనైనా కెరీర్కు గుడ్బై చెబుతాడేమో చూద్దాం. తన కెరీర్లో ఒక టి20 ప్రపంచకప్ గెలిచాడు. వన్డే ప్రపంచకప్లో రెండు ఫైనల్స్ ఆడినా టైటిల్ లేకపోవడం కెరీర్లో లోటు. మైకేల్ క్లార్క్ ఆడిన తొలి మ్యాచ్తోనే భవిష్యత్ సారథిగా పేరు తెచ్చుకున్న క్లార్క్... స్వల్ప కాలంలోనే తిరుగులేని బ్యాట్స్మన్గా ఎదిగాడు. అయితే తన కెరీర్ ఆసాంతం గాయాలతో ఇబ్బందిపడ్డాడు. అయినా 12 ఏళ్ల పాటు జట్టుకు సేవలందించాడు. రెండు వన్డే ప్రపంచకప్లు, రెండు యాషెస్ సిరీస్ విజయాల్లో భాగమయ్యాడు. పాంటింగ్ రిటైరైన తర్వాత సారథిగా బాధ్యతలు తీసుకున్నాడు. సొంతగడ్డపై ఈ ఏడాదే జరిగిన వన్డే ప్రపంచకప్ను సారథిగా అందుకోవడం తన కెరీర్లో అత్యంత మధుర క్షణం. మరికొంత కాలం టెస్టులు ఆడాలనే కోరిక ఉన్నా... యాషెస్లో ఎదురైన ఘోర పరాభవాల నేపథ్యంలో ఆట నుంచి శాశ్వతంగా తప్పుకోవాలనే కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎంత గొప్ప క్రికెటర్ అయినా కెరీర్ చివరి దశలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుందని, నిలకడగా ఆడలేకపోతే తప్పుకుని కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని తన నిర్ణయం ద్వారా క్లార్క్ క్రికెట్ ప్రపంచానికి చెప్పాడు. క్రిస్ రోజర్స్ చాలా ఆలస్యంగా 30 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన క్రికెటర్ రోజర్స్. దాదాపు 250 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో నిలకడగా ఆడినా ఆసీస్ క్రికెట్లో ఉండే పోటీ దృష్ట్యా తనకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ ఒక్కసారి అవకాశం దొరికాక మాత్రం వదల్లేదు. అయితే తన ఏడేళ్ల కెరీర్లో కేవలం 24 టెస్టులు మాత్రమే ఆడటం లోటు. వరుసగా 7 టెస్టుల్లో అర్ధసెంచరీలు చేసిన ఘనత రోజర్స్ది. ప్రస్తుతం యాషెస్ సిరీస్లో సహచర బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డ చోట కూడా తను రాణించాడు. అయితే ఈ యాషెస్ ఆరంభానికి ముందే తాను చివరి సిరీస్ ఆడబోతున్నానని ప్రకటించాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోజర్స్ రిటైర్మెంట్ ఆస్ట్రేలియా క్రికెట్కు పెద్ద లోటు. -
'మా ఆయన వంట కూడా బాగా చేస్తాడు'
గాలే: శ్రీలంక క్రికెటర్ కూమార సంగక్కర భార్య యెహాలి కొన్ని ఆసక్తికర విషయాలను స్థానిక మీడియాతో పంచుకున్నారు. తన భర్త సంగక్కర మంచి క్రికెటరే కాదు మంచి భర్త, ఉత్తమ తండ్రి అని ఆమె అన్నారు. ఆయన ఎక్కడుంటే నేనూ అక్కడే ఉంటాను.. ఆయన ఎక్కడికి వెళ్లిన తోడుగా వెళ్తుంటాను అని చెప్పారు. సంగకు కుటుంబం అంటే చాలా ఇష్టమని, చాలా ముఖ్యమని నా అభిప్రాయమని అన్నారు. ప్రతి విషయాన్ని చాలా సాధారణంగా తీసుకుంటారని, త్వరగా ఏ విషయం నుంచైనా బయటపడతారని వివరించారు. తన భర్త సంగ క్రికెట్ బాగా ఆడటంతో పాటు వంట కూడా చేస్తాడని, పాస్తా చాలా బాగా వండుతాడని యెహాలి తెలిపింది. గాలే టెస్టులో తక్కువ స్కోరుకే ఔటవ్వడంతో సంగ చాలా భాదపడ్డాడని పేర్కొంది. తక్కువ స్కోరుకు పరిమితమైనప్పుడల్లా ఆయన దిగులు చెందుతాడని చెప్పింది. టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక మరో రెండు లేదా మూడేళ్లు దేశవాలీ క్రికెట్ కొనసాగిస్తాడని వివరించింది. శ్రీలంక జట్టులో నిలకడ ఉన్న ఆటగాడు తన భర్త అని చెప్పింది. గతంలో జరిగిన లాహోర్ దాడి తనకు ఎప్పుడు గుర్తుంటుందని, సంగ కెరీర్ లో ఎన్నో అత్యుత్తమ సంఘటనలు నెలకొన్నాయి. దక్షిణాఫ్రికా జట్టుతో 2006లో కొలంబోలోఆడుతున్నప్పుడు మహేళ జయవర్దనేతో కలిసి సంగ చేసిన 624 పరుగుల భాగస్వామ్యం తాను ఎప్పుడు మరిచిపోలేనని చెప్పుకొచ్చింది. ప్రతిక్షణం జట్టుకోసం తాపత్రయపడేవాడని, తన సెంచరీలను తాను బాగా ఎంజాయ్ చేస్తానని అతని కెరీర్ గురించి ఈ విషయాలను ఆమె పంచుకున్నారు. -
వన్డే ప్రపంచకప్ గెలవకపోవడమే లోటు
తన సుదీర్ఘ కెరీర్ను సంతోషంగానే ముగిస్తున్నానని, వన్డే ప్రపంచకప్ గెలవకపోవడం ఒక్కటే లోటని శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర అన్నాడు. వన్డే ప్రపంచకప్తోనే రిటైర్ అవుదామని భావించినా సెలక్టర్లతో చర్చల తర్వాత పాకిస్తాన్, భారత్లతో రెండేసి టెస్టులు ఆడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. భారత్తో రెండో టెస్టు తర్వాత సంగక్కర అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నాడు. తొలి టెస్టు వేదిక గాలె పట్టణం మొత్తం అతని కటౌట్లు, బ్యానర్లతో నిండిపోయింది. -
సంగా.. మరో ఏడాది ఆడొచ్చుగా..
శ్రీలంక: వన్డే క్రికెట్ నుంచి నిష్క్రమించే నిర్ణయాన్ని మరోసారి పునరాలోచించుకోవాలని శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కరకు ఆ దేశ క్రీడాశాఖ మంత్రి సూచించారు. సంగక్కర మరో ఏడాదిపాటు దేశానికి క్రికెట్ సేవను అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఓడిపోయిన అనంతరం మార్చి 18న సంగక్కర అంతర్జాతీయ వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో భారత్తో టెస్టు సిరీస్ తర్వాత సంగక్కర పూర్తిగా గుడ్బై చెప్పనున్నాడు. ఈ నేపథ్యంలో ట్వంటీ ట్వంటీ నుంచి తప్పుకోవాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని సదరు మంత్రి విజ్ఞప్తి చేశారు. సంగక్కర వచ్చిన 2000 సంవత్సరం నుంచి శ్రీలంక క్రికెట్లో మంచిరోజులు ప్రారంభమయ్యాయని, ఇది కొట్టిపారేయలేని విషయమని చెప్పారు. ఇప్పటికే తాము సంగక్కరతో మాట్లాడామని, మరో ఏడాది దేశానికి ఆయన సేవలు అందించాలని కోరామని తెలిపారు. -
సంగా అవుట్.. ఆగిన ఆట
సిడ్నీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక 127 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. కుమార సంగక్కర అవుటయ్యాడు. నెమ్మదిగా ఆడిన సంగక్కర 96 బంతుల్లో 3 ఫోర్లతో 45 పరుగులు చేశాడు. ఈ సమయంలో వర్షం రావడంతో ఆట ఆగిపోయింది. భారీగా వర్షం కురుస్తుండడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఒకవేళ వర్షంతో ఈరోజు మ్యాచ్ జరగకపోయినా రేపు రిజర్వు డే ఉంది. ఆట ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి రిజర్వు డేలో ఆట మొదలు పెడతారు. -
శ్రీలంక జిడ్డు బ్యాటింగ్
సిడ్నీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక ఆటగాళ్లు అతిజాగ్రత్తగా ఆడుతున్నారు. సెంచరీల వీరుడు కుమార సంగక్కర బాగా జిడ్డు ఆడుతున్నాడు. 51 బంతుల్లో కేవలం 15 పరుగులు చేసి టెస్టు బ్యాటింగ్ ను తలపించాడు. జయవర్థనే కూడా ఆచితూచి ఆడాడు. 15 బంతుల్లో 4 పరుగులు చేసి నాలుగో వికెట్ గా అవుటయ్యాడు. ఓపెనర్ దిల్షాన్ 7 బంతులాడి డకౌటయ్యాడు. మరో ఓపెనర్ కుశాల్ పెరీరా 10 బంతుల్లో 3 పరుగులు చేశాడు. తిరిమన్నె ఒక్కడే స్థాయికి తగినట్టు బ్యాటింగ్ చేశాడు. 48 బంతుల్లో 5 ఫోర్లతో 41 పరుగులు చేశాడు. -
సంగాకు ఏమైంది?
సిడ్నీ: ప్రపంచ కప్లో అద్భుత ఫామ్లో ఉన్న బ్యాట్స్మన్ శ్రీలంక వెటరన్ సంగక్కర. వరుసగా నాలుగు సెంచరీలు బాది చరిత్ర సృష్టించాడు. ఈ ఈవెంట్లో టాప్ స్కోరర్ కూడా సంగాయే. 500 పరుగుల మార్క్ అధిగమించాడు. అలాంటి సంగా.. దక్షిణాఫ్రికాతో కీలక క్వార్టర్స్ మ్యాచ్లో అంచనాలకు భిన్నంగా ఆడుతున్నాడు. సంగా మరీ టెస్టు మ్యాచ్లో మాదిరిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. సంగా ఆడిన తొలి 15 బంతుల్లో ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు. 16 బంతికి ఎట్టకేలకు సింగిల్ తీశాడు. 27 బంతుల్లో సంగా స్కోరు 2.. 40 బంతుల్లో 6 మాత్రమే. సంగా 43వ బంతికి తొలి ఫోర్ కొట్టాడు. ఇలా 50 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేశాడు. సంగక్కర బ్యాటింగ్ చూస్తే అతనేనా ఆడుతోంది అనే సందేహం రాకమానదు. మరో వైపు తిరిమన్నె మాత్రం దూకుడుగా ఆడాడు. -
సంగక్కర @ 500 రన్స్
సిడ్నీ: శ్రీలంక స్టార్ బ్యాట్స్ మన్ కుమార సంగక్కర తాజా ప్రపంచకప్ లో 500 పరుగులు పూర్తి చేశాడు. పరుగుల వీరుల జాబితాలో టాప్ కొనసాగుతున్న సంగక్కర వ్యక్తిగత స్కోరు 4 పరుగులు చేయగానే 500 స్కోరు అందుకున్నాడు. 7 మ్యాచ్ లాడి 500 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 4 సెంచరీలున్నాయి. ప్రస్తుత మ్యాచ్ లో 5 పరుగులతో సంగక్కర్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. -
'అతడే నంబర్ వన్'
వెల్లింగ్టన్: పరిమిత ఓవర్ల క్రికెట్ లో కుమార సంగక్కరను మించినవాడు లేడంటూ శ్రీలంక బ్యాట్స్ మన్ లాహిరు తిరిమన్నె ఆకాశానికెత్తాడు. అత్యుత్తమ ఆటగాళ్లలో అతడొక్కడని కితాబిచ్చాడు. వరుసగా రెండు మ్యాచుల్లో సంగక్కర రెండు సెంచరీలు సాధించాడు. ఇంగ్లండ్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో సంగక్కర(117) సెంచరీతో నాటౌట్ గా నిలిచాడు. అంతకుముందు బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 105 పరుగులు సాధించాడు. 402 వన్డే మ్యాచులు ఆడిన సంగక్కర ఇప్పటివరకు 24 సెంచరీలు సాధించాడు. ఎంతో అనుభవం ఉన్న సంగక్కర జట్టును ప్రభావితం చేయగలడని తిరిమన్నె అన్నాడు. అతడు నంబర్ వన్ ఆటగాడని, అతని బ్యాటింగ్ చాలా బాగుంటుందని ప్రశంసించాడు. స్ట్రైక్ రొటేట్ చేయడమే కాకుండా బౌండరీలు బాదడంలోనూ దిట్టని తెలిపాడు. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ తిరిమన్నె(139) కూడా అజేయ శతకం బాదాడు. -
టీ20 ప్రపంచకప్ విజేత శ్రీలంక
మిర్పూర్: టీ20 ప్రపంచకప్-2014ను శ్రీలంక చేజిక్కించుకుంది. ఆదివారమిక్కడ ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో భారత్ను 6 వికెట్ల తేడాతో ఓడించి లంక టీ20 చాంపియన్గా అవతరించింది. భారత్ నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక మరో 13 బంతులు మిగిలివుండగానే ఛేదించింది. 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. కుమార సంగక్కర అజేయ అర్థసెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. 35 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్తో 52 పరుగులు చేశాడు. మహేల జయవర్థనే 24, పెరీరా 23, దిల్షాన్ 18 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రైనా, మొహిత్ శర్మ, అశ్విన్, అమిత్ మిశ్రా తలో వికెట్ తీశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత సంగక్కర, జయవర్థనేను సహచరులు తమ భుజాలపైకి ఎత్తుకుని ఊరేగించారు. వీరిద్దరూ టీ20ల నుంచి వైదొలగనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
2015 వరల్డ్ కప్ తర్వాత సంగక్కర నిష్ర్కమణ!
ఢాకా: మరోవైపు టి20 అంతర్జాతీయ మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కుమార సంగక్కర 2015 వన్డే ప్రపంచ కప్ తర్వాత ఈ ఫార్మాట్కు కూడా గుడ్బై చెప్పనున్నట్లు వెల్లడించాడు. ఆ సమయానికి తాను 37 ఏళ్లకు చేరుకుంటాను కాబట్టి కొనసాగలేనని, ఇది సహజ పరిణామమని అతను స్పష్టం చేశాడు. ఇప్పటికే ట్వంటీ20 ల నుంచి రిటైర్ తీసుకుంటున్నటున్నట్లు జయవర్ధనే, సంగక్కరలు ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ టి20ల నుంచి రిటైర్ అవుతున్నట్లు మహేల సోమవారం ప్రకటించాడు. సంగక్కర రిటైర్మెంట్ ప్రకటన తర్వాతి రోజే జయవర్ధనే ఇది చెప్పడం విశేషం. శ్రీలంక జట్టు టి20 విజయాల్లో సంగక్కర, జయవర్ధనే కీలక పాత్ర పోషించారు. టి20ల్లో రెండో అత్యుత్తమ భాగస్వామ్యం (166) సంగక్కర-జయవర్ధనే జోడి పేరిటే ఉంది. సంగక్కర సారథ్యంలో శ్రీలంక 2009 ప్రపంచ కప్ ఫైనల్లో... జయవర్ధనే కెప్టెన్సీలో 2012 ప్రపంచ కప్ ఫైనల్లో పరాజయం పాలైంది. -
సంగక్కర బాటలో జయర్థనే
ఢాకా: శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం మహేల జయవర్థనే అంతర్జాతీయ టి20లకు గుడ్ బై చెప్పనున్నాడు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్ నుంచి అతడు వైదొలగుతాడని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ట్విటర్ ద్వారా వెల్లడించింది. కుమార సంగక్కర బాటలోనే జయవర్థనే పయనించనున్నాడని తెలిపింది. ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ టి20ల నుంచి రిటైర్ కానున్నట్లు సంగక్కర నిన్న ప్రకటించాడు. 36 ఏళ్ల జయవర్థనే వరుసగా ఐదు టి20 ప్రపంచకప్లలోనూ శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు 49 అంతర్జాతీయ టి20 మ్యాచ్లు ఆడిన జయవర్థనే.. 31.78 సగటు, 134 స్ట్రైక్ రేట్తో 1335 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఎనిమిది అర్థ సెంచరీలున్నాయి.