-
అది సీఎం ఆఫీస్.. లిక్కర్ షాపు కాదు.. బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు
ఢిల్లీ: జైలు నుంచి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయడంపై బీజేపీ జాతీయ కార్యదర్శి మంజీందర్ సింగ్ సిర్సా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన తర్వాత ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తొలిసారి సీఎం హోదాలో ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల వివరాలను మీడియా సమావేశంలో ఢిల్లీ మంత్రి అతిషి వెల్లడించగా మంజీందర్ సింగ్ సిర్సా స్పందించారు. ‘ఆప్ మంత్రి అతిషి విలేకరుల సమావేశం ద్వారా జారీ చేసిన లేఖ నకిలీది. ఆమె ఢిల్లీ ప్రజలను మోసం చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. అది సీఎం కార్యాలయం.. మద్యం షాపు కాదని మంత్రి అతిషీకి, ఆ పార్టీకి చెప్పాలనుకుంటున్నాను. ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కోర్టు అనుమతి ఇచ్చే వరకు ఎటువంటి ఉత్తర్వును జారీ చేయలేడు’ అని సిర్సా వ్యాఖ్యానించారు. ‘ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేని సమయంలో సీఎం కార్యాలయాన్ని ఎవరు ఉపయోగించారు? అధికారిక లేఖను ఎవరు రూపొందించారు.. జారీ చేశారు? ఈ విషయాలు నేరపూరిత కుట్రలో భాగమని, దీనిపై విచారణ జరిపించాలని ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనాను కోరుతున్నాను’ అన్నారు. #WATCH | Delhi: As Delhi CM Arvind Kejriwal issues first order from ED custody on water shortage during summer in National Capital, BJP National Secretary Manjinder Singh Sirsa says, "The letter that has been issued by AAP Minister Atishi through a press conference is… pic.twitter.com/HtrbVkxQdI — ANI (@ANI) March 24, 2024 -
మందుబాబులకు కోపం వస్తే ఇలా ఉంటుంది..
-
కావాల్సిన బ్రాండ్ లేదన్నందుకు మద్యం దుకాణానికి నిప్పు
విశాఖపట్నం: తనకు కావాల్సిన బ్రాండ్ మద్యం లేదన్నందుకు ఆగ్రహించి మద్యం షాపునకు నిప్పుపెట్టాడు ఓ మందుబాబు. మద్యం సీసాలు ధ్వంసంగా కాగా మొత్తం రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటన పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మధురవాడ సాయిరాంకాలనీకి చెందిన జి.మధు(53) ఈ నెల 11వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో కొమ్మాదిలో గల మద్యం షాపునకు వెళ్లాడు. ఓ బ్రాండ్ మద్యం ఇవ్వాల్సిందిగా కౌంటర్లో అడిగాడు. ఆ బ్రాండ్ మద్యం తమ షాపులో లేదని చెప్పడంతో వారితో గొడవకు దిగాడు. షాపు మూసేసిన సమయంలో గొడవకు దిగవద్దని వారించినా.. పట్టించుకోకుండా షాపు తగలెట్టేస్తానని చెబుతూ మరింత రెచ్చిపోయాడు. అంతటితో ఆగకుండా ఓ బాటిల్లో పెట్రోలు తీసుకొచ్చి షాపు కౌంటర్పై కుమ్మరించి నిప్పు అంటించాడు. మంటలు చెలరేగడంతో మద్యం షాపు సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికులు అప్రమత్తమై నిందితుడు మధును పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక సీఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని నిందితుని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో రూ.72,660 విలువ చేసే మద్యం బాటిళ్లు ధ్వంసం కాగా.. కంప్యూటర్, లాగ్ బాక్స్, సీసీ కెమెరా, క్యాష్ మెషీన్, పేటీఎం మెషీన్ కాలి బూడిదయ్యాయి. మొత్తం వీటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉండవచ్చని సీఐ తెలిపారు. మద్యం షాపు ప్రతినిధి గండిబోయిన నరసింహులు ఫిర్యాదు మేరకు మధుపై హత్యాయత్నం కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎకై ్సజ్ సీఐ మురళీధర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు
-
Hyderabad: 10 రోజులు రూ.12 కోట్ల
హైదరాబాద్: మద్యం షాపులకు దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో గడువు ముగియనుండడంతో దరఖాస్తులు దాఖలు చేసేందుకు సోమవారం క్యూకట్టారు. సరూర్నగర్ ఎక్సైజ్ జిల్లా పరిధిలో 134 షాపులు ఉండగా, వీటిలో ఇప్పటి వరకు 2,700పైగా దరఖాస్తులు వచ్చాయి.శంషాబాద్ ఎక్సైజ్ జిల్లా పరిధిలో వంద షాపులు ఉండగా, 3,300 వచ్చాయి. ఇన్నర్రింగ్రోడ్డుకు అటు ఇటుగా ఉన్న ఒక్కో షాపునకు సగటున 25 దరఖాస్తులు రావడం విశేషం. ఎలాగైనా షాపులను దక్కించుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది వ్యాపారులు సిండికేట్గా మారి.. బినామీ పేర్లతో ఒకే షాపుపై టెండర్లు దాఖలు చేస్తున్నారు. ఒకరు టెండరు వేసిన చోట మరొకరు వేయకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలా ఇప్పటి వరకు కేవలం ఈ దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి సుమారు రూ.12 కోట్ల ఆదాయం సమకూరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నెల 18తో దరఖాస్తుకు గడువు ముగియనుంది. వచ్చే చివరి మూడు రోజుల్లో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శేకిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్స్టేషన్ పరిధిలోని షాపులకు దరఖాస్తులు భారీగా వచ్చాయి. ఈ ఒక్క స్టేషన్ పరిధిలోనే 1,700 పైగా రావడం గమనార్హం. 21న లక్కీడ్రా మద్యం షాపుల లైసెన్సుల గడువు నవంబర్ 30తో ముగియనుంది. డిసెంబర్ నుంచి కొత్త లైసెన్సుల విధానం అమల్లోకి రావాల్సి ఉంది. అంతకు ముందే సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమై ముందస్తు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 4న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఒక్కో దరఖాస్తుకు ఫీజు రూ.2 లక్షలుగా(నాన్ రిఫండబుల్) నిర్ణయించింది. ఈ పది రోజుల్లోనే 234 షాపులకు 6,000 దరఖాస్తుల అందడం విశేషం. గతంలో మాదిరే ఈసారి కూడా గౌడ, ఎస్సీ, ఎస్టీ కులాలకు రిజర్వేషన్లు వర్తింపజేసింది. ఈ మేరకు లాటరీ ద్వారా ఆయా కులాలకు కేటాయించే షాపుల సంఖ్యను నిర్ధారించింది. ఈ నెల 21న శంషాబాద్లోని మల్లికా కన్వెన్షన్లో లక్కీడ్రా నిర్వహించనుంది. ఈ డ్రా ద్వారా దరఖాస్తుదారులకు షాపులను కేటాయించి, ఆయా షాపులకు 30న కొత్త సరుకును అందజేయనుంది. -
తెలంగాణలో మద్యం షాపుల టెండర్లకు దరఖాస్తుల స్వీకరణ
-
దొంగలించేందుకు వచ్చి కక్కుర్తిపడి అడ్డంగా బుక్కయ్యారు! వీడియో వైరల్
చెన్నై: ఇద్దరు దొంగలు మద్యం బాటిళ్లను దొంగతనం చేసేందుకు మద్యం షాపుకి వెళ్లి పోలీసులుకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని తిరువెల్లూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఆ దొంగలు మద్యం బాటిళ్లను దొంగతనం చేసేందుకని లిక్కర్ షాపుకి డ్రిల్లింగ్ మిషన్తో రంధ్రం చేశారు. ఐతే ఆ దొంగలు షాపులోకి వెళ్లిన తర్వాత ఆ మద్యం బాటిళ్లను చూసి టెంప్ట్ అయ్యి ప్లాన్ మార్చుకున్నారు. కాసేపు ఆ షాపులోనే ఉండి తాగి ఎంజాయ్ చేయాలనుకుంటారు. అనుకున్నదే తడువుగా ప్లాన్ కూడా అమలు చేశారు. ఆ దొంగలు వక్రబుద్దే వారిని పోలీసులకు అడ్డంగా దొరికిపోయాలే చేసింది. పోలీసులు వారు ఏ విధంగా లిక్కర్ షాపుకి రంధ్రం చేసి వెళ్లారు అలానే వారిని బయటకు రప్పించి మరీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు పోలీసులు సదరు షాపు యజమానితో ఓపెన్ చేయించి మరీ పోలీసులను అదుపులోకి తీసుకోవచ్చు, కానీ అలా కాకుండా వారు ఎలా షాపుకి ఎంట్రీ ఇచ్చారో అలానే అదుపులో తీసుకోవడం గ్రేట్ అంటూ పోలీసుల పని తీరును ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Two men drilled a hole in the wall of a liquor shop & were boozing inside when caught redhanded by a patrol police in Thiruvallur district. The men had planned to steal the liquor bottles but decided to booze before taking off when they were caught @xpresstn @NewIndianXpress pic.twitter.com/zF9MoRjlUX — Novinston Lobo (@NovinstonLobo) September 4, 2022 (చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్) -
లిక్కర్ బాటిల్స్ దొంగిలిద్దామని వెళ్లారు.. కానీ!
-
రూపాయి తెచ్చిన పంచాయితీ !
నల్గొండ (కోదాడరూరల్) : వాటర్ ప్యాకెట్ రేటుపై మద్యం దుకాణ నిర్వాహకుడికి మందుబాబులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన కోదాడ పట్టణంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. అనంతగిరి మండలం గోల్తండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం తాగేందుకు పట్టణంలోని ప్రమీలటవర్ సమీపంలోని ఓ వైన్స్ వద్దకు వచ్చారు. మద్యంతో పాటు వాటర్ ప్యాకెట్ కూడా తీసుకున్నారు. అయితే వైన్స్ నిర్వాహకుడు వాటర్ ప్యాకెట్కు రూ.3 తీసుకున్నాడు. దీంతో వారు వాటర్ ప్యాకెట్ రేటు రూ.2 కదా రూ.3 ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ నెలకొంది. మద్యం తాగేందుకు వచ్చిన వ్యక్తి వైన్స్ కౌంటర్లో ఉన్న వ్యక్తిని బయటకు లాగి గొడవకు దిగాడు. కౌంటర్ బల్లాపై ఉన్న మద్యం సీసాలను పగలకొట్టాడు. దీంతో కౌంటర్నుంచి బయటకు వచ్చిన వైన్స్ నిర్వాహకుడు కోపంతో బీరుసీసా తెచ్చి తలపైకొట్టడంతో అతని తల పగిలింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని వారిని అక్కడి నుంచి స్టేషన్కు తరలించారు. -
జనావాసాల్లో మద్యం దుకాణాలొద్దు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నివాస ప్రాంతాల్లో, ఆస్పత్రులు, మతపరమైన ప్రార్థనా మందిరాలు, పాఠశాలల సమీపంలో మద్యం దుకాణాలు, పర్మిట్ రూంలు, బార్లు ఉండటానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పర్మిట్ రూంలు, బార్లలో మినహా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. తెలంగాణ ఎక్సైజ్ (గ్రాంట్ ఆఫ్ లైసెన్స్ ఆఫ్ సెల్లింగ్ బై షాప్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ లైసెన్స్) నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని తేల్చి చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలకు రెండు నెలల్లో ఆడిట్ నిర్వహించాలని, నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఉంటే వాటిని రెండు నెలల్లోగా తొలగించాలని, తీసుకున్న చర్యలను వివరిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ టి.తుకారాంజీల ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలతోపాటు పర్మిట్ రూంలకు అనుమతి ఇస్తున్నారని, దీంతో చిన్నారులు, మహిళలు వేధింపులకు గురవుతున్నారంటూ న్యాయవాది మహేందర్రాజు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారణ చేసింది. -
మూడు పువ్వులు ఆరు కాయలుగా నా వ్యాపారం వృద్ధి చెందాలి
Comedian Raghu Entered Into Liquor Business: కమెడియన్ రఘు ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై బాగా ఫేమస్ అయిన వ్యక్తి. సినిమాల్లో నవ్వులు పూయించే కామెడీ విలన్ పాత్రల్లో ఆకట్టుకున్న రఘు ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అతడికి ఆఫర్లు రావడం లేదా? సినిమాలు కాకుండా రఘు ఇప్పుడేం చేస్తున్నాడు? అతడి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అనేది ఇప్పుడు చూద్దాం.. కమెడియన్ రఘుకు అడపాదడపా సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. దీంతో అప్పుడప్పుడూ షూటింగులకు వెళ్తున్నాడు. కానీ మిగతా సమయంలో ఖాళీగా ఎందుకుండటం అని వ్యాపారం మీద దృష్టి పెట్టాడు. కొత్తగా లిక్కర్ బిజినెస్లో అడుగుపెట్టాడు. నాలుగు దుకాణాల కోసం టెండర్లు వేస్తే రెండు రఘుకే వచ్చాయట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాతో చెప్పుకొచ్చాడు. దుకాణంలో కౌంటర్ మీద కూర్చున్న రఘు తన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందాలని కోరుతున్నాడు. రెండు మద్యం దుకాణాలకు ఓనర్ అంటే రఘు ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఢోకా ఉండదన్నమాటే! మొత్తానికి అటు సినిమాలతో పాటు బిజినెస్లోనూ రఘు దూసుకుపోతున్నాడు. -
24 గంటలూ కిక్కు
తాడిపత్రి అర్బన్: తాడిపత్రిలో పొద్దు పొద్దున్నే పాల ప్యాకెట్లయినా సరిగా దొరుకుతాయో లేదో కానీ మద్యం మాత్రం అన్ని వేళలా దొరుకుతోంది. సమయం ఏదైనా సరే తలుపు తట్టడమే ఆలస్యం అడిగిన మొత్తం చెల్లిస్తే ఏ బ్రాండ్ మద్యం కావాలన్నా చేతికందిస్తారు. సామాన్యుల వ్యసనాలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ నిబంధనలను బేఖాతారు చేస్తూ తాడిపత్రి పట్టణంలోని బార్ల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. అందిన కాడికి దోచుకోవడమే ధ్యేయంగా తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. నిబంధనలకు తూట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెప్పినట్లుగానే మద్యపాన నిషేధం దిశగా ఒక్కో అడుగు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రైవేటు మద్యం దుకాణాలకు పూర్తి ఎత్తివేశారు. ప్రభుత్వ ఆధీనంలోనే అది కూడా ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల మధ్యలోనే మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నారు. బార్ల సమయాలను కూడా కుదించేశారు. నిబంధనల ప్రకారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యాన్ని విక్రయించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మద్యం బాటిళ్లను పార్శిల్ విధానం ద్వారా బయటకు ఇవ్వకూడదు. అయితే తాడిపత్రి పట్టణంలోని బార్ల నిర్వాహకులు నిబంధనలకు నీళ్లొదిలారు. అడిగినంత ఇస్తే చాలు మద్యం ఎప్పుడు కావాలన్నా సరే ఇచ్చేస్తున్నారు. కార్మికులే లక్ష్యంగా.... తాడిపత్రి చుట్టూ అనేక పరిశ్రమలు ఉన్న సంగతి తెలిసిందే. ఆయా సంస్థల్లో పనిచేసే కారి్మకులు కూడా అధికంగానే ఉంటారు. ముఖ్యంగా కారి్మకులనే లక్ష్యంగా చేసుకొని బార్ల నిర్వాహకులు తమ దందాను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరవని సమయాల్లో ఒక్కో క్వాటర్ బాటిల్ పై రూ.50 నుంచి రూ.70 దాకా అధికంగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మామూళ్ల మత్తుల్లో ఎక్సైజ్ అధికారులు తాడిపత్రిలోని అన్ని బార్లలో ఎప్పుడు కావాలన్నా మద్యం సిద్ధంగా ఉంటుంది. ఉదయం, రాత్రి అన్న తేడా లేకుండా మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నా ఎక్సైజ్ పోలీసులతో పాటు పట్టణ పోలీసులు కూడా చూసీచూడనట్లే వ్యవహరిస్తున్నారు. పత్రికల్లోనో, జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు మాత్రం హడావుడి చేసి తర్వాత మిన్నకుండిపోతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బార్ల నిర్వాహకుల నుంచి భారీగా మామూళ్లు వసూలు చేస్తుండటంతోనే పోలీసులు అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న ఆరోపణలున్నాయి. కొత్తగా వచ్చా... బార్ నిర్వాహకుల దందాపై ఎక్సైజ్ ఎస్ఐ స్వామినాథన్ను ‘సాక్షి’ వివరణ కోరగా... ‘ ఈ సర్కిల్కి కొత్తగా వచ్చా... మీకు వివరణ కావాలంటే సీఐని అడగండి’ అని సమాధానమిచ్చారు. తాడిపత్రి సర్కిల్ ఎక్సైజ్ సీఐని ఫోన్ ద్వారా సంప్రదించాలని ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
కేసీఆర్ చిత్రపటానికి మందుబాబుల పాలాభిషేకం
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో దాదాపు 45 రోజులు తర్వాత, బుధవారం దుకాణాలు తెరుచుకోవటంతో మద్యం ప్రియుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. చాలా రోజుల తర్వాత ‘చుక్క’ దొరకబోతుందన్న సంతోషంతో మందుబాబులు ఉదయం నుంచే వైన్స్ ముందు క్యూ కట్టారు. ఎండను కూడా లెక్కచేయలేదు. మద్యం దొరికే వరకు ఇంటికి వెళ్లేది లేదని తేల్చి చెబుతూ క్యూ లైన్లో నిల్చున్నారు. ఒక్కో వైన్ షాపు వద్ద రెండు, మూడు క్యూలైన్లు దర్శమించాయి. (చదవండి : హైదరాబాద్లో వైన్స్ ముందు మహిళల క్యూ..) ఇక చాలా రోజుల తర్వాత చుక్క దొరకడంతో మందుబాబులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. పలు చోట్లు మద్యం బాటిళ్లు పట్టుకొని ఆనందంతో చిందులేశారు. పలు వైన్స్ షాపులకు పూల మాల వేసి కొబ్బరి కాయలు కొట్టారు. ఇక ఒక చోట అయితే ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ప్రకారం.. కనకదుర్గ వైన్స్ దగ్గర సీఎం కేసీఆర్ చిత్రపటానికి పూల మాలవేసి పాలాభిషేకం చేశారు. అనంతరం జై కేసీఆర్ అంటూ మందుబాబు నినాదాలు చేశారు. అయితే ఇది తెలంగాణలోని ఏ ప్రాంతంలో జరిగిందో వివరాలు తెలియరాలేదు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా బుధవారం ఉదయం 10 గంటలకు మద్యం షాపులు తెరుచుకున్న విషయం తెలిసిందే. వినియోగదారులు భౌతికదూరం పాటిస్తూ.. క్యూ లైన్లలో ఉన్నారు. ధరలు పెంచినా అమ్మకాల్లో మాత్రం తేడా కనిపించలేదు. పైగా మళ్లీ వైన్ షాపులు మూసివేస్తారోనని ఎక్కువగానే మద్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పలు చోట్ల మహిళలు కూడా మద్యం కోసం లైన్లలో వేచి ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని కొండాపూర్, పంజాగుట్ట, మాదాపూర్, ఫిలింనగర్, రాయదుర్గం, హైటెక్సిటీలో మద్యం కోసం మహిళలు, సాఫ్ట్వేర్ యువతులు క్యూ కట్టి మద్యం కొనుగోలు చేశారు. -
‘అయ్యన్న భాష చూస్తుంటే అసహ్యం వేస్తుంది’
సాక్షి, తాడేపల్లి : మద్యం దుకాణాలపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. ఎన్టీఆర్ మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచిన చంద్రబాబుకు మద్యం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుద్ హుద్ తుపాన్ పేరుతో చంద్రబాబు, టీడీపీ నేతలు సేకరించిన నిధులకు ఇప్పటి వరకు లెక్కలు చెప్పలేదని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్ల నుంచి కోట్ల రూపాయల నిధులు సేకరించి మింగేశారని విమర్శించారు. చంద్రబాబుకు దమ్ముంటే హుద్ హుద్ విరాళాలపై విచారణకు రావాలని సవాల్ విసిరారు. పేదల పేరుతో వందల కోట్ల రూపాయలు విరాళాల రూపంలో దండుకున్నారని ఆరోపించారు. (చదవండి : ‘ఆ విషయంలో పచ్చ బ్యాచ్ ఎందుకు స్పందించలేదు?’) మద్యం షాపులపై అయన్న పాత్రుడు మాట్లాడే భాష చూస్తుంటే అసహ్యం వేస్తుందన్నారు. చంద్రబాబు హయాంలో 43 వేల బెల్ట్ షాప్ లు పెట్టినప్పుడు అయ్యన్నపాత్రుడు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంలో మద్యం ఏరులై పారినప్పుడు ఎందుకు అయ్యన్న ప్రశ్నించలేదని నిలదీశారు. సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 43వేల బెల్టు షాపులు తొలగించారని గుర్తుచేశారు. ఏపీలో బెల్టు షాపులు లేకుండా చేశామన్నారు. ప్రజలు మద్యానికి దూరమవుతారనే ధరలు పెంచామన్నారు. మద్యం రేట్లు పెంచితే తప్పేంటని ప్రశ్నించారు. -
వైన్స్ షాపుల వద్ద ప్రత్యేక మార్క్లు
సాక్షి, హైదరాబాద్ : వైన్స్ షాపుల వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నామని హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్లోని పలు మద్యం దుకాణాల వద్ద పరిస్థితిని పరిశీలించారు. నారాయణగూడ శాంతి థియేటర్ దగ్గర ఉన్న ఓ మద్యం దుకాణాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ రోజు హైదరాబాద్లో 178 మద్యం షాపులు తెరిచారని చెప్పారు. ప్రతి వైన్స్ షాపు వద్ద భౌతిక దూరం పాటించలే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించండం కోసం ప్రత్యే క మార్క్లు వేయించామని తెలిపారు. కంటైన్మెంట్ ప్రాంతాలలో పటిష్ట చర్యలు తీసుకున్నామని చెప్పారు. భౌతిక దూరంతోనే కరోనాను నివారించవచ్చని, దీనికి ప్రజలు సహకరించాలని అంజనీ కుమార్ విజ్ఞప్తి చేశారు. -
మద్యంబాబులకు షాక్.. షాప్స్ క్లోజ్
ముంబై : లాక్డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా ముంబైలో తెరుచుకున్న లిక్కర్ షాపులు మరోసారి మూతపడ్డాయి. ఓవైపు కరోనా వ్యాధి విస్తరిస్తుండటం, మరోవైపు భౌతిక దూరాన్ని పాటించకుండా మద్యం ప్రియులు అత్యుత్సాహం చూపించడంతో ముంబై మున్సిపల్ అధికారులు చేసేదేమీ లేక మద్యం దుకాణాలపై మరోసారి నిషేధం విధించారు. దీంతో బుధవారం నుంచి ముంబైలో మద్యం దుకాణాలతోపాటూ నిత్యావసరాలుకాని దుకాణాలు కూడా మూసివేశారు. లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో దేశవ్యాప్తంగా పలు చోట్ల మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యం ప్రియులు షాపుల ముందు బారులు తీరారు. దాదాపు నెలన్నర తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పెద్దమొత్తంలో జనాలు గుమిగూడారు. ఇక మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పెట్టినా, చాలా చోట్ల అమలు అవ్వడంలేదు. (వైన్ షాపుల ఎదుట మద్యం ప్రియుల జాతర) లాక్డౌన్ సడలింపులతో మద్యం ప్రియులు లిక్కర్ షాపుల ఎదుట భారీగా చేరుకుంటుండంతో, భౌతిక దూరాన్ని పాటించేలా చేయడం ఇబ్బందికరంగా మారిందని పోలీసులు, అధికారుల నుంచి సమాచారం వచ్చిందని ముంబై మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ పర్దేశీ తెలిపారు. నిత్యావసర వస్తువులు, మెడికల్ షాపులు మాత్రం తెరుచుకునే ఉంటాయని పేర్కొన్నారు. మరోవైపు ముంబై మహానగరం వైరస్ కోరల్లో విలవిలలాడుతోంది. ముంబైలో 510 తాజా కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 9000 దాటిపోయింది. ఇక మహారాష్ట్రలో వ్యాప్తంగా 841 తాజా కేసులు వెలుగుచూడగా మహమ్మారి బారినపడి 34 మంది మరణించారు. మహారాష్ట్రలో కేసుల సంఖ్య 15,525కు చేరగా మరణాల సంఖ్య 617కు ఎగబాకింది. (మహమ్మారి విజృంభణతో ముంబై విలవిల) -
మీరే దేశాన్ని కాపాడేది.. మందుబాబులపై పూల వర్షం
న్యూఢిల్లీ : మీరే దేశ అర్థిక వ్యవస్థని కాపాడేది అంటూ మందుబాబులపై ఓ వ్యక్తి పూల వర్షం కురిపించాడు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మందుబాబులే ప్రభుత్వ ఖజానాని నింపేది అంటూ న్యూఢిల్లీలో చందేర్ నగర్లోని ఓ వైన్ షాప్ ఎదుట భారీ లైన్లో నిల్చున్న మందుబాబులపై పూలు చల్లాడు. మరోవైపు భారీ లైన్లలో లిక్కర్ కోసం మండుటెండలో నిల్చున్న మందుబాబులపై మిర్జాపూర్లో ఓ లిక్కర్ షాప్ యజమాని పూలు చల్లాడు. (‘బారు’లు తీరిన మందుబాబులు) కాగా, లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యపాన ప్రియులు పండగ చేసుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా మద్యం ప్రియులు షాపుల ముందు బారులు తీరారు. దాదాపు నెలన్నర తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పెద్దమొత్తంలో జనాలు గుమిగూడారు. ఇక మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పెట్టినా, చాలా చోట్ల అమలు అవ్వడంలేదు. (వైన్ షాపుల ఎదుట మద్యం ప్రియుల జాతర) -
ఒక్కొక్కరికి రెండు ‘మందు’ బాటిళ్లు
కోల్కతా : రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సోమవారం కొన్ని మార్గ దర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ ప్రాంతాలలో మినహా అన్ని జోన్లలో మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటలకు వరకు మాత్రమే మద్యం దుకాణాలు తెరచి ఉంచాలని మమతా బెనర్జీ సర్కార్ స్పష్టం చేసింది. అలాగే ఒక్కో వ్యక్తికి రెండు మద్యం బాటిళ్లను మాత్రమే అమ్మాలని నిబంధనలు జారీ చేసింది. మాస్కులు ధరించకుండా వచ్చిన వారికి ఎట్టి పరిస్థితుల్లోను మద్యం అమ్మవద్దని ఆదేశించింది. కస్టమర్లు భౌతిక దూరం పాటించేలా చూసుకోవాల్సిన బాధ్యత షాపు యజమానిదేనని స్పష్టం చేసింది. (చదవండి : మందు బాబులపై పేలుతున్న జోకులు) లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా వైన్ షాపులు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా పలు చోట్ల సోమవారం ఉదయం మద్యం దుకాణాలు తెరచుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, హరియాణా, ఆంధ్రపదేశ్ తదితర రాష్ట్రాలలో మద్యం షాపుల ముందు మందుబాబులు బారులు తీరారు. కొన్ని చోట్ల ముఖానికి మాస్క్లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్న నిబంధనలను పాటించకపోవడంతో మధ్యాహ్నమే మద్యం దుకాణాలను మూసేశారు. -
వామ్మో.. ఇంత పేద్ద ‘బారా’
న్యూఢిల్లీ: దాదాపు నెలన్నర రోజులుగా ‘మందు’కు మొహం వాచిన మద్యపాన ప్రియులు నేడు వైన్ షాపులు తెరవడంతో వెల్లువలా తరలివచ్చారు. తమ ‘దాహం’ తీర్చుకోవడానికి మద్యం దుకాణాల ముందు కిలోమీటర్ల మేర బారులు తీరారు. దేశ రాజధాని ఢిల్లీలో మందు బాబులు రెట్టించిన ఉత్సాహంతో ‘చుక్క’ కోసం షాపుల ముందు పడిగాపులు కాశారు. దేశబంధు గుప్తా రోడ్డులోని లిక్కర్ షాపు ముందు కిలోమీటర్ల వరకు ఓపిగ్గా నిలబడి రికార్డు సృష్టించారు. కశ్మీర్ గేట్ ప్రాంతంలో ఉన్న మందు దుకాణం ముందు నిలుచున్న మందుబాబులకు పోలీసులు బడితపూజ చేశారు. భౌతిక దూరం పాటించనందుకు లాఠీలతో బాది వారిని చెదరగొట్టారు. (మందు బాబుల బారులు.. 30 శాతం ధరల పెంపు) కాగా, లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యపాన ప్రియులు పండగ చేసుకుంటున్నారు. 45 రోజులుగా నోరు కట్టేసినట్టు అవడంతో ఆబగా మద్యాన్ని అందుకునేందుకు గబగబ వైన్ షాపులకు పరుగులు తీశారు. ఫలితంగా మద్యం దుకాణాలు ముందు తండోప తండాలుగా మనుషుల ‘బారు’లు దర్శనమిచ్చాయి. ముఖానికి మాస్క్లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్న నిబంధనలను పట్టించుకోకుండా మందు కోసం పోటీ పడ్డారు. దీంతో అక్కడక్కడ పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఇక మందుబాబుల విన్యాసాలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. (వైన్షాపుల ఎదుట మద్యం ప్రియుల జాతర) -
లాక్డౌన్: ఆదిలాబాద్లో వైన్షాప్ లూటీ
సాక్షి, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని టానిక్ వైన్స్లో లూటీ చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం వైన్స్ పైన రేకులు తొలగించి చొరబడినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. లాక్డైన్ అమలువుతున్న సమయంలో ఎన్నో రోజులుగా మూసి ఉన్న వైన్స్లో డబ్బులు ఉండే పరిస్థితి లేదని తెలిపారు. ఈ ఘటన కేవలం మద్యం బాలిళ్ల కోసం జరిగిందా.. ఇతర కారణాలు ఎమైనా ఉన్నాయా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా విధించిన లాక్డౌన్ సమయంలో ఇటీవలే ఆదిలాబాద్లోని కంటైన్మెంట్ ప్రాంతంలో మద్యం బాటిళ్లు పట్టుబడటంతో ఎక్సైజ్ అధికారులపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే.లాక్డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ జిల్లాలోని పలు గ్రామాల్లో గుడుంబా, నాటుసారా మళ్లీ గుప్పుమంటుంది. దీంతో ఎక్సైజ్ అధికారులు నాటుసారా, గుడుంబా తయారు చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. -
హెల్మెట్ ఉండగా.. అవన్నీ దండగ
-
కరోనా కాలం: మందు బాబుల ముందు జాగ్రత్త
తిరువంతనంతపురం: ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా కరోనా కలవరింతే. ఆ మహమ్మారి దెబ్బకు జనాలు గుమ్మం దాటాలంటే జంకుతున్నారు. కొన్ని అత్యవసర పనులు తప్పితే బయట అడుగు పెట్టేదే లేదంటున్నారు. మరి పైన ఫొటోలో కనిపించే మగమహారాజులు ఎక్కడికి వెళుతున్నారనుకుంటున్నారా? ఏదో పరీక్షలు రాసేందుకు కాదు, అలా అని వారు నిలబడింది ఏ రేషన్ షాపు దుకాణం ఎదుటో కూడా కాదు... మద్యం షాపు ముందు. అవును, కేరళలో మందుబాబులు సామాజిక ఎడం పాటిస్తూ క్యూ లైన్ కట్టిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. (‘రాత్రయితే తాగుడే.. లేదంటే కుదరదే..!’) అసలే కరోనా కాలం.. ఇప్పటికే దాన్నుంచి తప్పించుకోవాలంటే సామాజిక ఎడం పాటించమని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఎందుకైనా మంచిదని మందుబాబులు ఒకరికి మరొకరికి మధ్య ఒక మీటర్ ఎడం పాటిస్తూ నిలబడ్డారు. అందుకనువుగా మద్యం దుకాణం ఎదుట క్యూలైన్లో ముగ్గుతో గీతలను కూడా గీసి ఉంచడం విశేషం. ఈ క్యూలైన్లో ముఖాలకు చేతులు అడ్డుపెట్టుకుని కొందరు, కర్చీఫ్ కట్టుకుని మరికొందరు కనిపిస్తున్నారు. అయితే ఒక వ్యక్తి మాత్రం అవన్నీ దండగ అనుకున్నాడో ఏమో కానీ, నా రూటే సెపరేటు అంటూ ఏకంగా హెల్మెట్ ధరించి వరుసలో నిలబడ్డాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘వహ్వా.. మందుబాబుల ముందుజాగ్రత్త అదిరిపోయింది’ అని పొగడకుండా ఉండలేకపోతున్నారు. (‘ఈ సంక్షోభం చాలా పెద్దది’) -
అదనంగా ఒక్క రూపాయి ఇవ్వనన్నాడని..
-
మద్యం షాపు మాకొద్దు..!
సాక్షి, యలమంచిలి: గుంపర్రు గ్రామంలో మద్యం దుకాణం ప్రారంభించవద్దని గ్రామస్తులు, డ్వాక్రా మహిళలు ఆదివారం బ్రాందీ షాపు వద్ద ఆందోళన చేశారు. గుంపర్రు, కడిమిపుంత రోడ్డులో ఏర్పాటుచేసిన కొత్త మద్యం దుకాణం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు, రైతులు ఆరోపించారు. పొలాల మధ్య ఉన్న ఈ దుకాణంలో రాత్రి పూట కొందరు మద్యం సేవించి ఖాళీ సీసాలను పక్కనున్న చేలలో పడేస్తున్నారని రైతులు ఆరోపించారు. గ్రామానికి దగ్గరగా మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని గ్రామంలో షాపు పెట్టవద్దని మహిళలు నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై కొప్పిశెట్టి గంగాధరరావు, ఎక్సైజ్ ఎస్సై దుర్గాప్రసాద్ ఆందోళనకారులతో మాట్లాడారు. ఇది ప్రభుత్వ దుకాణమని ఇక్కడ ఆందోళన చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో విషయాన్ని రాజకీయ నాయకులకు తెలియజేస్తామని ఆందోళన కారులు వెనుతిరిగారు. ఈ ధర్నాకు మహిళలు యల్లమిల్లి రాజేశ్వరి, గంగులూరి శ్యామల, గొల్లమందుల కుమారి గ్రామస్తులు పితాని స్వామి, కడలి శ్రీనివాస్, కవురు వెంకటేశ్వరరావు, గుడాల నరసింహమూర్తి, చెల్లుబోయిన ఏడుకొండలు, కడలి నరసింహస్వామి నాయకత్వం వహించారు. -
పర్మిట్ రూముల్లో తనిఖీలు చేయండి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని ఏ4 మద్యంషాపుల పక్కన నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్న పర్మిట్ రూములను తనిఖీ చేయాలని ఎక్సైజ్ కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది. మద్యం షాపుల యజమానులు తమ షాపుల పక్కనే పర్మిట్ రూమ్లు ఏర్పాట్లు చేసి అందులో ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నా అధికారులు వారిపై చర్యలు తీసుకోవడం లేదంటూ హైదరాబాద్కు చెందిన ఎస్.రాములు నాయక్ దాఖలు చేసిన పిల్పై హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది. ఏయే ప్రాంతాల్లోని పర్మిట్ రూమ్లలో తనిఖీలు చేయాలో అధికారుల నిర్ణయానికి వదిలేసింది. ఒక్కో పర్మిట్ రూమ్ ఎంత ఉంది? నిబంధనల మేరకే ఆ పర్మిట్ రూమ్ సైజు ఉందా? నిబంధనలకు లోబడే పర్మిట్ రూమ్ను నిర్వహిస్తున్నారా? ఆహార పదార్థాల సరఫరా నిబంధనల్లో ఏమైనా మినహాయింపులు ఉన్నాయా? తదితర వివరాలతో నివేదికను తమ ముందుంచాలని కమిషనర్ను ఆదేశించింది. విచారణను జనవరి 1కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పర్మిట్ రూమ్ల వల్ల ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్కు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. పర్మిట్ రూమ్లలో ఆహార పదార్థాల సరఫరాకు నిబంధనలు అంగీకరించవన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రశాంతంగా జాతర జరుపుకోవాలి
నేరచరిత లేనివారిని బైండోవర్ చేయొద్దు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
టమాట సీజన్ ప్రారంభం
No Headline
కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
ఆకట్టుకున్న మాక్డ్రిల్
27 నుంచి విజయవాడ రైలు రద్దు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: మహిళలు 10 శాతమైనా లేరు!
- Lok Sabha Election 2024: ఇద్దరికీ కీలకమే
- మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
- జీతాలపై ప్రభావం.. ఎయిర్ఇండియా ఉద్యోగుల ఆందోళన!
- విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు
- ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
- ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్
- ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. వందల కోట్ల విలువైన నెక్లెస్తో!
- T20: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. మినీ టీమిండియా అంటూ..
- నేమ్ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
Advertisement