liquor shop
-
ఏపీలో ఏరులై పారుతున్న మద్యం
-
హోమ్ మంత్రి అనిత నియోజకవర్గంలో బెల్ట్ షాపుల దందా!
-
కొత్త ఏడాదికి ముందే మరిన్ని మద్యం దుకాణాలు
న్యూఢిల్లీ: రాబోయే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సరానికి ముందే ప్రీమియం మద్యం షాపులను తెరవాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం నూతనంగా ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాలు 500 చదరపు మీటర్ల కంటే అధిక విస్తీర్ణంలో ఉండనున్నాయి. వినియోగదారులు దుకాణంలోని షెల్ఫ్ నుండి తమకు ఇష్టమైన బ్రాండ్ను ఎంచుకునే అవకాశం ఏర్పడనుంది. ఈ నూతన ప్రీమియం స్టోర్లు.. మాల్స్ షాపింగ్ కాంప్లెక్స్లలో ఏర్పాటుకానున్నాయి. ఢిల్లీలోని నాలుగు కార్పొరేషన్లు ఈ దుకాణాలను ఏర్పాటు చేయనున్నాయి.నూతనంగా ఈ ప్రీమియం దుకాణాలను తెరవడం వల్ల ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలపై సుంకం ద్వారా రూ.3,047 కోట్లు ఆర్జించగా, గత ఏడాది ఇదే కాలంలో రూ.2,849 కోట్లు ఆర్జించింది.ఇది కూడా చదవండి: అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై లిచ్ట్మన్ జోస్యం వైరల్ -
వీళ్ళ దోపిడీకి నిదర్శనం.. లిక్కర్ టెండర్లపై వైఎస్ జగన్ సంచలన నిజాలు
-
తాడేపల్లిలో మద్యం షాపును అడ్డుకున్న మహిళలు
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలో మద్యం షాపును మహిళలు అడ్డుకున్నారు. ఆశ్రమం రోడ్డులో ఇళ్ల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు రోడ్డెక్కారు. మద్యం షాపులకు వ్యతిరేకంగా మహిళలు, స్థానికుల నినాదాలు చేశారు.విజయవాడ: కూటమి లిక్కర్ టెండర్లపై వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ మండిపడ్డారు. కూటమి నేతల జేబులు నింపడానికే చంద్రబాబు లిక్కటర్ టెండర్లు పిలిచారని ధ్వజమెత్తారు. టెండర్లలో షాపులు దక్కించుకున్న వారిని కూటమి నేతలు బెదిరిస్తున్నారని.. కొన్ని నియోజకవర్గాల్లో 30 శాతం కమీషన్ ఇవ్వాలని బెదిరిస్తున్నారన్నారు. మరికొందరు బరితెగించి టెండర్ దక్కించుకున్న వారిని కిడ్నాప్ చేస్తున్నారన్నారు.పేద మహిళల కళ్లలో ఆనందం చూడటమే అప్పటి జగన్ ప్రభుత్వ లక్ష్యం. చంద్రబాబు కుటీల రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని అవినాష్ అన్నారు.ప్రకాశం జిల్లా: ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించడం చేతకాని ప్రభుత్వం నాణ్యమైన మద్యం పేరుతో ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటూ మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడం సిగ్గుచేటని ఐద్వా ప్రకాశం జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి, పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి బి.పద్మ మండిపడ్డారు. అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన మద్యం టెండర్ల లాటరీని వ్యతిరేకిస్తూ మహిళా సంఘాలు నిరసన చేపట్టాయి.మహిళా నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి మద్యం వ్యాపారాన్ని చేస్తుందని మండిపడ్డారు. -
అన్ని దుకాణాలు మావే!
-
పచ్చబ్యాచ్ ఆగడాలు.. లిక్కర్ షాపు దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: పచ్చబ్యాచ్ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. సత్యసాయి జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. హిందూపురం నియోజకవర్గంలో దౌర్జన్యానికి దిగారు. మద్యం షాపును దక్కించుకున్న వ్యక్తిని కిడ్నాప్ చేశారు. లేపాక్షి మద్యం షాపును లాటరీలో దక్కించుకున్న రంగనాథ్ను.. లాటరీ ఫలితం వచ్చిన వెంటనే టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. రంగనాథ్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాగా, జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు టెండర్ వేసే ప్రక్రియ మొత్తం ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు.. వారి పీఏలు, అనుచరుల కనుసన్నల్లోనే జరిగింది. ప్రతి దుకాణం తమకు, తమ అనుచరులు చెప్పిన వారికే దక్కే విధంగా టీడీపీ నేతలు ముందస్తు ప్లాన్ చేశారు. దీంతో ఆరంభం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగింది. చాలా చోట్ల సింగిల్ డిజిట్లో దరఖాస్తులు ఉండటం గమనార్హం.జిల్లా వ్యాప్తంగా 87 షాపులకు 1,460 దరఖాస్తులు అందాయి. మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 80 శాతం టీడీపీ వర్గీయులకు సంబంధించినవే. మిగతా 20 శాతం మంది రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా బరిలో దిగారు. అయితే వారందరికీ ఇప్పటికే వార్నింగ్లు వెళ్లినట్లు తెలిసింది. ఒకవేళ లాటరీలో దుకాణం దక్కించుకున్నా వదిలి వెళ్లాల్సిందేనంటూ బెదిరించినట్లు సమాచారం. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి టీడీపీ నేతలు బెదిరింపులు మొదలుపెట్టారు. ఎవరు దరఖాస్తు చేసిన ఖబడ్దార్ అంటూ ఫోన్లలో వార్నింగ్ ఇచ్చారు. దీంతో చాలామంది ఔత్సాహికులు వెనక్కి తగ్గారు. కాగా ఆన్లైన్ విధానం అందుబాటులో ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి దరఖాస్తులు చేశారు.ఇదీ చదవండి: అవినీతి కోసం వేసిన స్కెచ్ కాదా బాబూ?: వైఎస్ జగన్ -
మద్యం షాపులన్నీ నాకే కావాలి..!
సాక్షి టాస్్కఫోర్స్, సాక్షి, రాజమహేంద్రవరం : ‘రేయ్..! ఇతరులు ఎవరైనా మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్నారో జాగ్రత్త..! ఊరుకునే ప్రసక్తే లేదు. అన్నీ నాకే కావాలి. నా మాట కాదని ఎవరన్నా దరఖాస్తు చేశారో వారి అంతు చూడండి..!’ అనుచర గణానికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ఆదేశాలివీ!! ఆయన కనుసైగ చేయడమే ఆలస్యం.. తాడిపత్రి నియోజకవర్గంలో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకున్న ఓ వైఎస్సార్ సీపీ నేతను టీడీపీ శ్రేణులు కిడ్నాప్ చేయగా మరో నేత ఇంటిపై దాడికి తెగబడి బెదిరింపులకు దిగాయి. ఒకపక్క అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇలా యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతుండగా మరోవైపు పోలీసుల ద్వారా సామ, దాన, దండోపాయాలను కూటమి ప్రభుత్వం ప్రయోగిస్తోంది. ‘‘అసలు మీరు ఈ టెండర్లు ఎందుకు వేస్తున్నట్లు? సరే టెండర్లు దక్కించుకున్నారే అనుకోండి. టీడీపీ నేతలను కాదని అసలు మద్యం దుకాణాలను మీరు నిర్వహించగలరా? అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు మీపై కేసులు నమోదవుతాయి. ఎక్సైజ్ దాడులూ జరుగుతాయి. ఏదో ఒక కేసు బుక్ చేసి మిమ్మల్ని మూసి వేయడం ఖాయం. ఇదంతా ఎందుకొచి్చన గొడవ? మద్యం టెండర్ల నుంచి మీకు మీరే మర్యాదగా తప్పుకోండి..!’’ మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకుంటున్న ఇతర పార్టీల నేతలకు స్థానిక ఎస్సై, సీఐల ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ఇదీ!! వైఎస్సార్సీపీ ఎంపీటీసీ కిడ్నాప్ తాడిపత్రిలో 9 మద్యం షాపులు, రూరల్ పరిధిలో 3, యాడికిలో 4, పెద్దవడుగూరులో 3, పెద్దపప్పూరులో ఒక షాపు కలిసి మొత్తం 20 మద్యం దుకాణాలు తమ ఆదీనంలో ఉండాలని జేసీ ప్రణాళిక రూపొందించారు. ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి వలస వెళ్లిన ఓ నేత 20 దుకాణాలకు దరఖాస్తు వేసేందుకు ప్రయత్నించగా ఆయన్ను విరమించుకునేలా చేసినట్లు తెలుస్తోంది. టెండర్లు వేసిన ఇతర నేతలపై జేసీ వర్గం దౌర్జన్యాలకు తెగబడింది. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ రామ్మోహన్ను స్కారి్పయోలో కిడ్నాప్ చేసి తరలించారు. ఎంపీపీ ఉమాదేవి ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తేవడంతో యాడికి సీఐ ఈరన్న టీడీపీ శ్రేణుల నుంచి రామ్మోహన్ను విడిపించి తీసుకొచ్చారు. యాడికిలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసిన వైఎస్సార్ సీపీ నాయకుడు, యాడికి ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్ ఇంటి తాళాలను టీడీపీ మూకలు గురువారం పగులగొట్టి బెదిరింపులకు దిగాయి. వైఎస్సార్ సీపీకి చెందిన మరో నాయకుడు బాల్రెడ్డి ఇంటికి వెళ్లి దరఖాస్తు చేయవద్దని బెదిరించారు. దరఖాస్తుకు నేడే చివరి రోజు రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం గురువారం నాటికి 65,424 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 3,396 షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు శుక్రవారం చివరి రోజు. ఈ నేపథ్యంలో దరఖాస్తులు 70 వేలు దాటవచ్చని ఎక్సైజ్శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 12, 13వ తేదీల్లో దరఖాస్తులను పరిశీలించి 14న లాటరీ విధానంలో లైసెన్సులు కేటాయిస్తారు. దరఖాస్తులకు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో టీడీపీ సిండికేట్ బెదిరింపులు తీవ్రమయ్యాయి. టెండర్ల ప్రక్రియలో పాల్గొన్న వ్యాపారులను టార్గెట్ చేసి నయాపైసా పెట్టుబడి పెట్టకుండా వాటా, గుడ్ విల్ ఇవ్వాలని హెచ్చరిస్తున్నారు. తమను కాదంటే వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు. » రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే అనుచరుడి బెదిరింపులు తట్టుకోలేక దరఖాస్తు చేసుకునేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. రూరల్ నియోజకవర్గంలో 11 షాపులకు గానూ బుధవారం వరకు 150 దరఖాస్తులే అందాయి. సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు ఇతరులను హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. విద్యార్థి సంఘం నేతలను సైతం రంగంలోకి దించారు. నియోజకవర్గంలో 28 షాపులు ఉండగా బుధవారానికి 250 దరఖాస్తులు మాత్రమే అందాయి.» నిడదవోలులో గతంలో మద్యం వ్యాపారం చేసిన టీడీపీ సీనియర్ నేత తన అనుచరులతో టెండర్లు వేయిస్తున్నారు. మరోవైపు జనసేన నేతలు తమకూ షాపులు ఇవ్వాలంటున్నారు. మంత్రి కందుల దుర్గేష్ అనుచరులు 20 శాతం వాటా ఇవ్వాలని టెండర్లు వేసిన వ్యాపారులను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. â రాజానగరం ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులతో నియోజకవర్గంలో 13 దుకాణాలకు 206 టెండర్లు దాఖలు కాగా వీరంతా దాదాపుగా కూటమి నేతలే కావడం గమనార్హం. » కొవ్వూరులో టీడీపీ సీనియర్ నేత అనుమతిస్తేనే టెండర్లు దాఖలవుతున్నాయి.మద్యంపై ‘రౌండ్ ఫిగర్’ బాదుడుఅదనపు ప్రివిలేజ్ ఫీజు పేరిట భారీ దోపిడీకి సిద్ధం» ‘‘మొత్తం రూ.3,850 అయింది. రౌండ్ ఫిగర్ చేస్తే రూ.5 వేలు అవుతుంది..!’’ ఖలేజా సినిమాలో హీరో డైలాగ్!! » ‘‘అదేంటీ.. రౌండ్ ఫిగర్ రూ.4 వేలు కదా..?’’ హీరోయిన్ సందేహం!! » ‘‘రూ.5 వేలులో ఎక్కువ సున్నాలున్నాయి కదా..! అందుకు..’’ హీరో సమర్థన !! అదే రౌండ్ ఫిగర్ సూత్రాన్ని సీఎం చంద్రబాబు సర్కారు తన విధానంగా చేసుకుంది. ఇప్పటికే టీడీపీ సిండికేట్ ద్వారా ప్రైవేట్ మద్యం దుకాణాలతో భారీ దోపిడీకి రంగం సిద్ధం చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా మరో ఎత్తుగడ వేసింది. మద్యం బాటిళ్ల ధరలను సమీపంలోని పదుల సంఖ్యకు చేరుస్తూ రౌండ్ ఫిగర్ చేయాలని నిర్ణయించింది. రూ.100 కంటే అధికంగా ఉన్న మద్యం బాటిళ్ల ధరలను తరువాత వచ్చే దశాంశ మానానికి మార్చి రౌండ్ ఫిగర్ చేసి ధర నిర్ణయిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అందుకు ఉదాహరణను కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఓ మద్యం బాటిల్ ధర రూ.150.50గా ఉంటే... ఆ బాటిల్ ధరను రూ.160గా నిర్ణయిస్తారు. బాటిల్ ధర రూ.272గా ఉంటే... దాన్ని రూ.280 చేస్తారు. ఈ దందాకు ‘అదనపు ప్రివిలేజ్ ఫీజు’ అని నామకరణం చేస్తూ ఎక్సైజ్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చిలక్కొట్టుడు కాదు.. భారీ బాదుడే ఇదేదో చిల్లర సమస్య లేకుండా చేసే చిలక్కొట్టుడు వ్యవహారం కానే కాదు! అదనపు ప్రివిలేజ్ ఫీజు ముసుగులో భారీ దోపిడీకి టీడీపీ కూటమి ప్రభుత్వం పక్కాగా స్కెచ్ వేసింది. టీడీపీ హయాంలో 2018 నాటి లెక్కలనే పరిగణలోకి తీసుకుంటే.. ఆ ఏడాది 3.84 కోట్ల లిక్కర్ కేసులు, 2.77 కోట్ల బీరు కేసులు విక్రయించారు. కేసుకు 48 లిక్కర్ బాటిళ్ల చొప్పున మొత్తం 184.32 కోట్ల లిక్కర్ బాటిళ్లు... కేసుకు 12 బీరు బాటిళ్ల చొప్పున మొత్తం రూ.33.24 కోట్ల బీరు బాటిళ్లు విక్రయించారు.వాటిలో 90 శాతం బాటిళ్ల ధర రూ.100 కంటే అధికంగానే విక్రయించారు. ప్రస్తుతం 180 ఎంఎల్ చీప్ లిక్కర్ను రూ.99కి విక్రయిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆ ఒక్క కేటగిరీ మినహా మిగిలిన అన్ని బ్రాండ్ల ధర రూ.వంద కంటే అధికంగానే ఉంటుంది. ఆ ప్రకారం ఒక్కో బాటిల్పై రూ.2 నుంచి రూ.9 వరకు అదనంగా దోపిడీ చేసేందుకు కూటమి ప్రభుత్వం కుతంత్రం పన్నింది. ఆ లెక్కన ఏడాదికి ఎన్ని వేల కోట్ల దోపిడీకి పాల్పడతారన్నది అంచనాలకు అందడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి చంద్రబాబు ప్రభుత్వమా.. మజాకానా! -
ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పెంపు
-
మా పొట్ట కొట్టొద్దు
అమలాపురం టౌన్/తిరుపతి అర్బన్: కొత్త మద్యం పాలసీని రూపొందిస్తున్న కూటమి ప్రభుత్వం, ప్రభుత్వ మద్యం దుకాణాలను తొలగించే ప్రయత్నంలో ఉందని తెలిసి ఆ దుకాణాల్లో పనిచేస్తున్న సేల్స్మెన్, నైట్ వాచ్మెన్, సూపర్వైజర్లు ఆందోళన బాట పట్టారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని ఏపీ బ్రూవరీస్ లిమిటెడ్ లిక్కర్ డిపో పరి«ధిలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది ఆదివారం రోడ్డెక్కి నిరసన చేపట్టారు.ముమ్మిడివరం, మలికిపురం, అంబాజీపేట మండల కేంద్రాల్లో నిరసనలకు దిగి తమ పొట్ట కొట్టవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొత్త మద్యం పాలసీ వల్ల తాము ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అమలాపురం డిపో పరిధిలో ఉన్న సుమారు వంద ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దాదాపు 350 మంది వరకూ సేల్స్మెన్, సూపర్వైజర్లు, నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్నామన్నారు. ముమ్మిడివరం, లంకతల్లమ్మ గుడి సెంటర్ నుంచి పోలమ్మ చెరువు వరకూ ఆందోళనకారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మలికిపురం గాంధీ సెంటర్, అంబాజీపేటల్లో ధర్నా చేశారు. అనంతరం నిరసన ప్రదర్శన చేపట్టారు. రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక దర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించండి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ మద్యం పాలసీ పద్ధతిలో 2019 నుంచి పనిచేస్తున్న కారి్మకులు డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి ఎస్వీ హైసూ్కల్ గ్రౌండ్ నుంచి టౌన్ క్లబ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. పలువురు కారి్మకులు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నట్లు తెలుస్తోందని చెప్పారు. తమను మద్యం షాపుల్లో అవకాశం లేకుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో సెపె్టంబర్ 7 నుంచి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
అది సీఎం ఆఫీస్.. లిక్కర్ షాపు కాదు.. బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు
ఢిల్లీ: జైలు నుంచి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయడంపై బీజేపీ జాతీయ కార్యదర్శి మంజీందర్ సింగ్ సిర్సా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన తర్వాత ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తొలిసారి సీఎం హోదాలో ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల వివరాలను మీడియా సమావేశంలో ఢిల్లీ మంత్రి అతిషి వెల్లడించగా మంజీందర్ సింగ్ సిర్సా స్పందించారు. ‘ఆప్ మంత్రి అతిషి విలేకరుల సమావేశం ద్వారా జారీ చేసిన లేఖ నకిలీది. ఆమె ఢిల్లీ ప్రజలను మోసం చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. అది సీఎం కార్యాలయం.. మద్యం షాపు కాదని మంత్రి అతిషీకి, ఆ పార్టీకి చెప్పాలనుకుంటున్నాను. ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కోర్టు అనుమతి ఇచ్చే వరకు ఎటువంటి ఉత్తర్వును జారీ చేయలేడు’ అని సిర్సా వ్యాఖ్యానించారు. ‘ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేని సమయంలో సీఎం కార్యాలయాన్ని ఎవరు ఉపయోగించారు? అధికారిక లేఖను ఎవరు రూపొందించారు.. జారీ చేశారు? ఈ విషయాలు నేరపూరిత కుట్రలో భాగమని, దీనిపై విచారణ జరిపించాలని ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనాను కోరుతున్నాను’ అన్నారు. #WATCH | Delhi: As Delhi CM Arvind Kejriwal issues first order from ED custody on water shortage during summer in National Capital, BJP National Secretary Manjinder Singh Sirsa says, "The letter that has been issued by AAP Minister Atishi through a press conference is… pic.twitter.com/HtrbVkxQdI — ANI (@ANI) March 24, 2024 -
మందుబాబులకు కోపం వస్తే ఇలా ఉంటుంది..
-
కావాల్సిన బ్రాండ్ లేదన్నందుకు మద్యం దుకాణానికి నిప్పు
విశాఖపట్నం: తనకు కావాల్సిన బ్రాండ్ మద్యం లేదన్నందుకు ఆగ్రహించి మద్యం షాపునకు నిప్పుపెట్టాడు ఓ మందుబాబు. మద్యం సీసాలు ధ్వంసంగా కాగా మొత్తం రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటన పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మధురవాడ సాయిరాంకాలనీకి చెందిన జి.మధు(53) ఈ నెల 11వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో కొమ్మాదిలో గల మద్యం షాపునకు వెళ్లాడు. ఓ బ్రాండ్ మద్యం ఇవ్వాల్సిందిగా కౌంటర్లో అడిగాడు. ఆ బ్రాండ్ మద్యం తమ షాపులో లేదని చెప్పడంతో వారితో గొడవకు దిగాడు. షాపు మూసేసిన సమయంలో గొడవకు దిగవద్దని వారించినా.. పట్టించుకోకుండా షాపు తగలెట్టేస్తానని చెబుతూ మరింత రెచ్చిపోయాడు. అంతటితో ఆగకుండా ఓ బాటిల్లో పెట్రోలు తీసుకొచ్చి షాపు కౌంటర్పై కుమ్మరించి నిప్పు అంటించాడు. మంటలు చెలరేగడంతో మద్యం షాపు సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికులు అప్రమత్తమై నిందితుడు మధును పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక సీఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని నిందితుని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో రూ.72,660 విలువ చేసే మద్యం బాటిళ్లు ధ్వంసం కాగా.. కంప్యూటర్, లాగ్ బాక్స్, సీసీ కెమెరా, క్యాష్ మెషీన్, పేటీఎం మెషీన్ కాలి బూడిదయ్యాయి. మొత్తం వీటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉండవచ్చని సీఐ తెలిపారు. మద్యం షాపు ప్రతినిధి గండిబోయిన నరసింహులు ఫిర్యాదు మేరకు మధుపై హత్యాయత్నం కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎకై ్సజ్ సీఐ మురళీధర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు
-
Hyderabad: 10 రోజులు రూ.12 కోట్ల
హైదరాబాద్: మద్యం షాపులకు దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో గడువు ముగియనుండడంతో దరఖాస్తులు దాఖలు చేసేందుకు సోమవారం క్యూకట్టారు. సరూర్నగర్ ఎక్సైజ్ జిల్లా పరిధిలో 134 షాపులు ఉండగా, వీటిలో ఇప్పటి వరకు 2,700పైగా దరఖాస్తులు వచ్చాయి.శంషాబాద్ ఎక్సైజ్ జిల్లా పరిధిలో వంద షాపులు ఉండగా, 3,300 వచ్చాయి. ఇన్నర్రింగ్రోడ్డుకు అటు ఇటుగా ఉన్న ఒక్కో షాపునకు సగటున 25 దరఖాస్తులు రావడం విశేషం. ఎలాగైనా షాపులను దక్కించుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది వ్యాపారులు సిండికేట్గా మారి.. బినామీ పేర్లతో ఒకే షాపుపై టెండర్లు దాఖలు చేస్తున్నారు. ఒకరు టెండరు వేసిన చోట మరొకరు వేయకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలా ఇప్పటి వరకు కేవలం ఈ దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి సుమారు రూ.12 కోట్ల ఆదాయం సమకూరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నెల 18తో దరఖాస్తుకు గడువు ముగియనుంది. వచ్చే చివరి మూడు రోజుల్లో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శేకిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్స్టేషన్ పరిధిలోని షాపులకు దరఖాస్తులు భారీగా వచ్చాయి. ఈ ఒక్క స్టేషన్ పరిధిలోనే 1,700 పైగా రావడం గమనార్హం. 21న లక్కీడ్రా మద్యం షాపుల లైసెన్సుల గడువు నవంబర్ 30తో ముగియనుంది. డిసెంబర్ నుంచి కొత్త లైసెన్సుల విధానం అమల్లోకి రావాల్సి ఉంది. అంతకు ముందే సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమై ముందస్తు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 4న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఒక్కో దరఖాస్తుకు ఫీజు రూ.2 లక్షలుగా(నాన్ రిఫండబుల్) నిర్ణయించింది. ఈ పది రోజుల్లోనే 234 షాపులకు 6,000 దరఖాస్తుల అందడం విశేషం. గతంలో మాదిరే ఈసారి కూడా గౌడ, ఎస్సీ, ఎస్టీ కులాలకు రిజర్వేషన్లు వర్తింపజేసింది. ఈ మేరకు లాటరీ ద్వారా ఆయా కులాలకు కేటాయించే షాపుల సంఖ్యను నిర్ధారించింది. ఈ నెల 21న శంషాబాద్లోని మల్లికా కన్వెన్షన్లో లక్కీడ్రా నిర్వహించనుంది. ఈ డ్రా ద్వారా దరఖాస్తుదారులకు షాపులను కేటాయించి, ఆయా షాపులకు 30న కొత్త సరుకును అందజేయనుంది. -
తెలంగాణలో మద్యం షాపుల టెండర్లకు దరఖాస్తుల స్వీకరణ
-
దొంగలించేందుకు వచ్చి కక్కుర్తిపడి అడ్డంగా బుక్కయ్యారు! వీడియో వైరల్
చెన్నై: ఇద్దరు దొంగలు మద్యం బాటిళ్లను దొంగతనం చేసేందుకు మద్యం షాపుకి వెళ్లి పోలీసులుకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని తిరువెల్లూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఆ దొంగలు మద్యం బాటిళ్లను దొంగతనం చేసేందుకని లిక్కర్ షాపుకి డ్రిల్లింగ్ మిషన్తో రంధ్రం చేశారు. ఐతే ఆ దొంగలు షాపులోకి వెళ్లిన తర్వాత ఆ మద్యం బాటిళ్లను చూసి టెంప్ట్ అయ్యి ప్లాన్ మార్చుకున్నారు. కాసేపు ఆ షాపులోనే ఉండి తాగి ఎంజాయ్ చేయాలనుకుంటారు. అనుకున్నదే తడువుగా ప్లాన్ కూడా అమలు చేశారు. ఆ దొంగలు వక్రబుద్దే వారిని పోలీసులకు అడ్డంగా దొరికిపోయాలే చేసింది. పోలీసులు వారు ఏ విధంగా లిక్కర్ షాపుకి రంధ్రం చేసి వెళ్లారు అలానే వారిని బయటకు రప్పించి మరీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు పోలీసులు సదరు షాపు యజమానితో ఓపెన్ చేయించి మరీ పోలీసులను అదుపులోకి తీసుకోవచ్చు, కానీ అలా కాకుండా వారు ఎలా షాపుకి ఎంట్రీ ఇచ్చారో అలానే అదుపులో తీసుకోవడం గ్రేట్ అంటూ పోలీసుల పని తీరును ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Two men drilled a hole in the wall of a liquor shop & were boozing inside when caught redhanded by a patrol police in Thiruvallur district. The men had planned to steal the liquor bottles but decided to booze before taking off when they were caught @xpresstn @NewIndianXpress pic.twitter.com/zF9MoRjlUX — Novinston Lobo (@NovinstonLobo) September 4, 2022 (చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్) -
లిక్కర్ బాటిల్స్ దొంగిలిద్దామని వెళ్లారు.. కానీ!
-
రూపాయి తెచ్చిన పంచాయితీ !
నల్గొండ (కోదాడరూరల్) : వాటర్ ప్యాకెట్ రేటుపై మద్యం దుకాణ నిర్వాహకుడికి మందుబాబులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన కోదాడ పట్టణంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. అనంతగిరి మండలం గోల్తండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం తాగేందుకు పట్టణంలోని ప్రమీలటవర్ సమీపంలోని ఓ వైన్స్ వద్దకు వచ్చారు. మద్యంతో పాటు వాటర్ ప్యాకెట్ కూడా తీసుకున్నారు. అయితే వైన్స్ నిర్వాహకుడు వాటర్ ప్యాకెట్కు రూ.3 తీసుకున్నాడు. దీంతో వారు వాటర్ ప్యాకెట్ రేటు రూ.2 కదా రూ.3 ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ నెలకొంది. మద్యం తాగేందుకు వచ్చిన వ్యక్తి వైన్స్ కౌంటర్లో ఉన్న వ్యక్తిని బయటకు లాగి గొడవకు దిగాడు. కౌంటర్ బల్లాపై ఉన్న మద్యం సీసాలను పగలకొట్టాడు. దీంతో కౌంటర్నుంచి బయటకు వచ్చిన వైన్స్ నిర్వాహకుడు కోపంతో బీరుసీసా తెచ్చి తలపైకొట్టడంతో అతని తల పగిలింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని వారిని అక్కడి నుంచి స్టేషన్కు తరలించారు. -
జనావాసాల్లో మద్యం దుకాణాలొద్దు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నివాస ప్రాంతాల్లో, ఆస్పత్రులు, మతపరమైన ప్రార్థనా మందిరాలు, పాఠశాలల సమీపంలో మద్యం దుకాణాలు, పర్మిట్ రూంలు, బార్లు ఉండటానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పర్మిట్ రూంలు, బార్లలో మినహా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. తెలంగాణ ఎక్సైజ్ (గ్రాంట్ ఆఫ్ లైసెన్స్ ఆఫ్ సెల్లింగ్ బై షాప్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ లైసెన్స్) నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని తేల్చి చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలకు రెండు నెలల్లో ఆడిట్ నిర్వహించాలని, నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఉంటే వాటిని రెండు నెలల్లోగా తొలగించాలని, తీసుకున్న చర్యలను వివరిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ టి.తుకారాంజీల ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలతోపాటు పర్మిట్ రూంలకు అనుమతి ఇస్తున్నారని, దీంతో చిన్నారులు, మహిళలు వేధింపులకు గురవుతున్నారంటూ న్యాయవాది మహేందర్రాజు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారణ చేసింది. -
మూడు పువ్వులు ఆరు కాయలుగా నా వ్యాపారం వృద్ధి చెందాలి
Comedian Raghu Entered Into Liquor Business: కమెడియన్ రఘు ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై బాగా ఫేమస్ అయిన వ్యక్తి. సినిమాల్లో నవ్వులు పూయించే కామెడీ విలన్ పాత్రల్లో ఆకట్టుకున్న రఘు ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అతడికి ఆఫర్లు రావడం లేదా? సినిమాలు కాకుండా రఘు ఇప్పుడేం చేస్తున్నాడు? అతడి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అనేది ఇప్పుడు చూద్దాం.. కమెడియన్ రఘుకు అడపాదడపా సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. దీంతో అప్పుడప్పుడూ షూటింగులకు వెళ్తున్నాడు. కానీ మిగతా సమయంలో ఖాళీగా ఎందుకుండటం అని వ్యాపారం మీద దృష్టి పెట్టాడు. కొత్తగా లిక్కర్ బిజినెస్లో అడుగుపెట్టాడు. నాలుగు దుకాణాల కోసం టెండర్లు వేస్తే రెండు రఘుకే వచ్చాయట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాతో చెప్పుకొచ్చాడు. దుకాణంలో కౌంటర్ మీద కూర్చున్న రఘు తన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందాలని కోరుతున్నాడు. రెండు మద్యం దుకాణాలకు ఓనర్ అంటే రఘు ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఢోకా ఉండదన్నమాటే! మొత్తానికి అటు సినిమాలతో పాటు బిజినెస్లోనూ రఘు దూసుకుపోతున్నాడు. -
24 గంటలూ కిక్కు
తాడిపత్రి అర్బన్: తాడిపత్రిలో పొద్దు పొద్దున్నే పాల ప్యాకెట్లయినా సరిగా దొరుకుతాయో లేదో కానీ మద్యం మాత్రం అన్ని వేళలా దొరుకుతోంది. సమయం ఏదైనా సరే తలుపు తట్టడమే ఆలస్యం అడిగిన మొత్తం చెల్లిస్తే ఏ బ్రాండ్ మద్యం కావాలన్నా చేతికందిస్తారు. సామాన్యుల వ్యసనాలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ నిబంధనలను బేఖాతారు చేస్తూ తాడిపత్రి పట్టణంలోని బార్ల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. అందిన కాడికి దోచుకోవడమే ధ్యేయంగా తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. నిబంధనలకు తూట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెప్పినట్లుగానే మద్యపాన నిషేధం దిశగా ఒక్కో అడుగు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రైవేటు మద్యం దుకాణాలకు పూర్తి ఎత్తివేశారు. ప్రభుత్వ ఆధీనంలోనే అది కూడా ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల మధ్యలోనే మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నారు. బార్ల సమయాలను కూడా కుదించేశారు. నిబంధనల ప్రకారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యాన్ని విక్రయించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మద్యం బాటిళ్లను పార్శిల్ విధానం ద్వారా బయటకు ఇవ్వకూడదు. అయితే తాడిపత్రి పట్టణంలోని బార్ల నిర్వాహకులు నిబంధనలకు నీళ్లొదిలారు. అడిగినంత ఇస్తే చాలు మద్యం ఎప్పుడు కావాలన్నా సరే ఇచ్చేస్తున్నారు. కార్మికులే లక్ష్యంగా.... తాడిపత్రి చుట్టూ అనేక పరిశ్రమలు ఉన్న సంగతి తెలిసిందే. ఆయా సంస్థల్లో పనిచేసే కారి్మకులు కూడా అధికంగానే ఉంటారు. ముఖ్యంగా కారి్మకులనే లక్ష్యంగా చేసుకొని బార్ల నిర్వాహకులు తమ దందాను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరవని సమయాల్లో ఒక్కో క్వాటర్ బాటిల్ పై రూ.50 నుంచి రూ.70 దాకా అధికంగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మామూళ్ల మత్తుల్లో ఎక్సైజ్ అధికారులు తాడిపత్రిలోని అన్ని బార్లలో ఎప్పుడు కావాలన్నా మద్యం సిద్ధంగా ఉంటుంది. ఉదయం, రాత్రి అన్న తేడా లేకుండా మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నా ఎక్సైజ్ పోలీసులతో పాటు పట్టణ పోలీసులు కూడా చూసీచూడనట్లే వ్యవహరిస్తున్నారు. పత్రికల్లోనో, జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు మాత్రం హడావుడి చేసి తర్వాత మిన్నకుండిపోతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బార్ల నిర్వాహకుల నుంచి భారీగా మామూళ్లు వసూలు చేస్తుండటంతోనే పోలీసులు అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న ఆరోపణలున్నాయి. కొత్తగా వచ్చా... బార్ నిర్వాహకుల దందాపై ఎక్సైజ్ ఎస్ఐ స్వామినాథన్ను ‘సాక్షి’ వివరణ కోరగా... ‘ ఈ సర్కిల్కి కొత్తగా వచ్చా... మీకు వివరణ కావాలంటే సీఐని అడగండి’ అని సమాధానమిచ్చారు. తాడిపత్రి సర్కిల్ ఎక్సైజ్ సీఐని ఫోన్ ద్వారా సంప్రదించాలని ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
కేసీఆర్ చిత్రపటానికి మందుబాబుల పాలాభిషేకం
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో దాదాపు 45 రోజులు తర్వాత, బుధవారం దుకాణాలు తెరుచుకోవటంతో మద్యం ప్రియుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. చాలా రోజుల తర్వాత ‘చుక్క’ దొరకబోతుందన్న సంతోషంతో మందుబాబులు ఉదయం నుంచే వైన్స్ ముందు క్యూ కట్టారు. ఎండను కూడా లెక్కచేయలేదు. మద్యం దొరికే వరకు ఇంటికి వెళ్లేది లేదని తేల్చి చెబుతూ క్యూ లైన్లో నిల్చున్నారు. ఒక్కో వైన్ షాపు వద్ద రెండు, మూడు క్యూలైన్లు దర్శమించాయి. (చదవండి : హైదరాబాద్లో వైన్స్ ముందు మహిళల క్యూ..) ఇక చాలా రోజుల తర్వాత చుక్క దొరకడంతో మందుబాబులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. పలు చోట్లు మద్యం బాటిళ్లు పట్టుకొని ఆనందంతో చిందులేశారు. పలు వైన్స్ షాపులకు పూల మాల వేసి కొబ్బరి కాయలు కొట్టారు. ఇక ఒక చోట అయితే ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ప్రకారం.. కనకదుర్గ వైన్స్ దగ్గర సీఎం కేసీఆర్ చిత్రపటానికి పూల మాలవేసి పాలాభిషేకం చేశారు. అనంతరం జై కేసీఆర్ అంటూ మందుబాబు నినాదాలు చేశారు. అయితే ఇది తెలంగాణలోని ఏ ప్రాంతంలో జరిగిందో వివరాలు తెలియరాలేదు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా బుధవారం ఉదయం 10 గంటలకు మద్యం షాపులు తెరుచుకున్న విషయం తెలిసిందే. వినియోగదారులు భౌతికదూరం పాటిస్తూ.. క్యూ లైన్లలో ఉన్నారు. ధరలు పెంచినా అమ్మకాల్లో మాత్రం తేడా కనిపించలేదు. పైగా మళ్లీ వైన్ షాపులు మూసివేస్తారోనని ఎక్కువగానే మద్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పలు చోట్ల మహిళలు కూడా మద్యం కోసం లైన్లలో వేచి ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని కొండాపూర్, పంజాగుట్ట, మాదాపూర్, ఫిలింనగర్, రాయదుర్గం, హైటెక్సిటీలో మద్యం కోసం మహిళలు, సాఫ్ట్వేర్ యువతులు క్యూ కట్టి మద్యం కొనుగోలు చేశారు. -
‘అయ్యన్న భాష చూస్తుంటే అసహ్యం వేస్తుంది’
సాక్షి, తాడేపల్లి : మద్యం దుకాణాలపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. ఎన్టీఆర్ మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచిన చంద్రబాబుకు మద్యం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుద్ హుద్ తుపాన్ పేరుతో చంద్రబాబు, టీడీపీ నేతలు సేకరించిన నిధులకు ఇప్పటి వరకు లెక్కలు చెప్పలేదని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్ల నుంచి కోట్ల రూపాయల నిధులు సేకరించి మింగేశారని విమర్శించారు. చంద్రబాబుకు దమ్ముంటే హుద్ హుద్ విరాళాలపై విచారణకు రావాలని సవాల్ విసిరారు. పేదల పేరుతో వందల కోట్ల రూపాయలు విరాళాల రూపంలో దండుకున్నారని ఆరోపించారు. (చదవండి : ‘ఆ విషయంలో పచ్చ బ్యాచ్ ఎందుకు స్పందించలేదు?’) మద్యం షాపులపై అయన్న పాత్రుడు మాట్లాడే భాష చూస్తుంటే అసహ్యం వేస్తుందన్నారు. చంద్రబాబు హయాంలో 43 వేల బెల్ట్ షాప్ లు పెట్టినప్పుడు అయ్యన్నపాత్రుడు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంలో మద్యం ఏరులై పారినప్పుడు ఎందుకు అయ్యన్న ప్రశ్నించలేదని నిలదీశారు. సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 43వేల బెల్టు షాపులు తొలగించారని గుర్తుచేశారు. ఏపీలో బెల్టు షాపులు లేకుండా చేశామన్నారు. ప్రజలు మద్యానికి దూరమవుతారనే ధరలు పెంచామన్నారు. మద్యం రేట్లు పెంచితే తప్పేంటని ప్రశ్నించారు. -
వైన్స్ షాపుల వద్ద ప్రత్యేక మార్క్లు
సాక్షి, హైదరాబాద్ : వైన్స్ షాపుల వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నామని హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్లోని పలు మద్యం దుకాణాల వద్ద పరిస్థితిని పరిశీలించారు. నారాయణగూడ శాంతి థియేటర్ దగ్గర ఉన్న ఓ మద్యం దుకాణాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ రోజు హైదరాబాద్లో 178 మద్యం షాపులు తెరిచారని చెప్పారు. ప్రతి వైన్స్ షాపు వద్ద భౌతిక దూరం పాటించలే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించండం కోసం ప్రత్యే క మార్క్లు వేయించామని తెలిపారు. కంటైన్మెంట్ ప్రాంతాలలో పటిష్ట చర్యలు తీసుకున్నామని చెప్పారు. భౌతిక దూరంతోనే కరోనాను నివారించవచ్చని, దీనికి ప్రజలు సహకరించాలని అంజనీ కుమార్ విజ్ఞప్తి చేశారు. -
మద్యంబాబులకు షాక్.. షాప్స్ క్లోజ్
ముంబై : లాక్డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా ముంబైలో తెరుచుకున్న లిక్కర్ షాపులు మరోసారి మూతపడ్డాయి. ఓవైపు కరోనా వ్యాధి విస్తరిస్తుండటం, మరోవైపు భౌతిక దూరాన్ని పాటించకుండా మద్యం ప్రియులు అత్యుత్సాహం చూపించడంతో ముంబై మున్సిపల్ అధికారులు చేసేదేమీ లేక మద్యం దుకాణాలపై మరోసారి నిషేధం విధించారు. దీంతో బుధవారం నుంచి ముంబైలో మద్యం దుకాణాలతోపాటూ నిత్యావసరాలుకాని దుకాణాలు కూడా మూసివేశారు. లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో దేశవ్యాప్తంగా పలు చోట్ల మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యం ప్రియులు షాపుల ముందు బారులు తీరారు. దాదాపు నెలన్నర తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పెద్దమొత్తంలో జనాలు గుమిగూడారు. ఇక మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పెట్టినా, చాలా చోట్ల అమలు అవ్వడంలేదు. (వైన్ షాపుల ఎదుట మద్యం ప్రియుల జాతర) లాక్డౌన్ సడలింపులతో మద్యం ప్రియులు లిక్కర్ షాపుల ఎదుట భారీగా చేరుకుంటుండంతో, భౌతిక దూరాన్ని పాటించేలా చేయడం ఇబ్బందికరంగా మారిందని పోలీసులు, అధికారుల నుంచి సమాచారం వచ్చిందని ముంబై మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ పర్దేశీ తెలిపారు. నిత్యావసర వస్తువులు, మెడికల్ షాపులు మాత్రం తెరుచుకునే ఉంటాయని పేర్కొన్నారు. మరోవైపు ముంబై మహానగరం వైరస్ కోరల్లో విలవిలలాడుతోంది. ముంబైలో 510 తాజా కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 9000 దాటిపోయింది. ఇక మహారాష్ట్రలో వ్యాప్తంగా 841 తాజా కేసులు వెలుగుచూడగా మహమ్మారి బారినపడి 34 మంది మరణించారు. మహారాష్ట్రలో కేసుల సంఖ్య 15,525కు చేరగా మరణాల సంఖ్య 617కు ఎగబాకింది. (మహమ్మారి విజృంభణతో ముంబై విలవిల) -
మీరే దేశాన్ని కాపాడేది.. మందుబాబులపై పూల వర్షం
న్యూఢిల్లీ : మీరే దేశ అర్థిక వ్యవస్థని కాపాడేది అంటూ మందుబాబులపై ఓ వ్యక్తి పూల వర్షం కురిపించాడు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మందుబాబులే ప్రభుత్వ ఖజానాని నింపేది అంటూ న్యూఢిల్లీలో చందేర్ నగర్లోని ఓ వైన్ షాప్ ఎదుట భారీ లైన్లో నిల్చున్న మందుబాబులపై పూలు చల్లాడు. మరోవైపు భారీ లైన్లలో లిక్కర్ కోసం మండుటెండలో నిల్చున్న మందుబాబులపై మిర్జాపూర్లో ఓ లిక్కర్ షాప్ యజమాని పూలు చల్లాడు. (‘బారు’లు తీరిన మందుబాబులు) కాగా, లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యపాన ప్రియులు పండగ చేసుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా మద్యం ప్రియులు షాపుల ముందు బారులు తీరారు. దాదాపు నెలన్నర తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పెద్దమొత్తంలో జనాలు గుమిగూడారు. ఇక మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పెట్టినా, చాలా చోట్ల అమలు అవ్వడంలేదు. (వైన్ షాపుల ఎదుట మద్యం ప్రియుల జాతర) -
ఒక్కొక్కరికి రెండు ‘మందు’ బాటిళ్లు
కోల్కతా : రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సోమవారం కొన్ని మార్గ దర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ ప్రాంతాలలో మినహా అన్ని జోన్లలో మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటలకు వరకు మాత్రమే మద్యం దుకాణాలు తెరచి ఉంచాలని మమతా బెనర్జీ సర్కార్ స్పష్టం చేసింది. అలాగే ఒక్కో వ్యక్తికి రెండు మద్యం బాటిళ్లను మాత్రమే అమ్మాలని నిబంధనలు జారీ చేసింది. మాస్కులు ధరించకుండా వచ్చిన వారికి ఎట్టి పరిస్థితుల్లోను మద్యం అమ్మవద్దని ఆదేశించింది. కస్టమర్లు భౌతిక దూరం పాటించేలా చూసుకోవాల్సిన బాధ్యత షాపు యజమానిదేనని స్పష్టం చేసింది. (చదవండి : మందు బాబులపై పేలుతున్న జోకులు) లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా వైన్ షాపులు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా పలు చోట్ల సోమవారం ఉదయం మద్యం దుకాణాలు తెరచుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, హరియాణా, ఆంధ్రపదేశ్ తదితర రాష్ట్రాలలో మద్యం షాపుల ముందు మందుబాబులు బారులు తీరారు. కొన్ని చోట్ల ముఖానికి మాస్క్లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్న నిబంధనలను పాటించకపోవడంతో మధ్యాహ్నమే మద్యం దుకాణాలను మూసేశారు. -
వామ్మో.. ఇంత పేద్ద ‘బారా’
న్యూఢిల్లీ: దాదాపు నెలన్నర రోజులుగా ‘మందు’కు మొహం వాచిన మద్యపాన ప్రియులు నేడు వైన్ షాపులు తెరవడంతో వెల్లువలా తరలివచ్చారు. తమ ‘దాహం’ తీర్చుకోవడానికి మద్యం దుకాణాల ముందు కిలోమీటర్ల మేర బారులు తీరారు. దేశ రాజధాని ఢిల్లీలో మందు బాబులు రెట్టించిన ఉత్సాహంతో ‘చుక్క’ కోసం షాపుల ముందు పడిగాపులు కాశారు. దేశబంధు గుప్తా రోడ్డులోని లిక్కర్ షాపు ముందు కిలోమీటర్ల వరకు ఓపిగ్గా నిలబడి రికార్డు సృష్టించారు. కశ్మీర్ గేట్ ప్రాంతంలో ఉన్న మందు దుకాణం ముందు నిలుచున్న మందుబాబులకు పోలీసులు బడితపూజ చేశారు. భౌతిక దూరం పాటించనందుకు లాఠీలతో బాది వారిని చెదరగొట్టారు. (మందు బాబుల బారులు.. 30 శాతం ధరల పెంపు) కాగా, లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యపాన ప్రియులు పండగ చేసుకుంటున్నారు. 45 రోజులుగా నోరు కట్టేసినట్టు అవడంతో ఆబగా మద్యాన్ని అందుకునేందుకు గబగబ వైన్ షాపులకు పరుగులు తీశారు. ఫలితంగా మద్యం దుకాణాలు ముందు తండోప తండాలుగా మనుషుల ‘బారు’లు దర్శనమిచ్చాయి. ముఖానికి మాస్క్లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్న నిబంధనలను పట్టించుకోకుండా మందు కోసం పోటీ పడ్డారు. దీంతో అక్కడక్కడ పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఇక మందుబాబుల విన్యాసాలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. (వైన్షాపుల ఎదుట మద్యం ప్రియుల జాతర) -
లాక్డౌన్: ఆదిలాబాద్లో వైన్షాప్ లూటీ
సాక్షి, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని టానిక్ వైన్స్లో లూటీ చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం వైన్స్ పైన రేకులు తొలగించి చొరబడినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. లాక్డైన్ అమలువుతున్న సమయంలో ఎన్నో రోజులుగా మూసి ఉన్న వైన్స్లో డబ్బులు ఉండే పరిస్థితి లేదని తెలిపారు. ఈ ఘటన కేవలం మద్యం బాలిళ్ల కోసం జరిగిందా.. ఇతర కారణాలు ఎమైనా ఉన్నాయా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా విధించిన లాక్డౌన్ సమయంలో ఇటీవలే ఆదిలాబాద్లోని కంటైన్మెంట్ ప్రాంతంలో మద్యం బాటిళ్లు పట్టుబడటంతో ఎక్సైజ్ అధికారులపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే.లాక్డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ జిల్లాలోని పలు గ్రామాల్లో గుడుంబా, నాటుసారా మళ్లీ గుప్పుమంటుంది. దీంతో ఎక్సైజ్ అధికారులు నాటుసారా, గుడుంబా తయారు చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. -
హెల్మెట్ ఉండగా.. అవన్నీ దండగ
-
కరోనా కాలం: మందు బాబుల ముందు జాగ్రత్త
తిరువంతనంతపురం: ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా కరోనా కలవరింతే. ఆ మహమ్మారి దెబ్బకు జనాలు గుమ్మం దాటాలంటే జంకుతున్నారు. కొన్ని అత్యవసర పనులు తప్పితే బయట అడుగు పెట్టేదే లేదంటున్నారు. మరి పైన ఫొటోలో కనిపించే మగమహారాజులు ఎక్కడికి వెళుతున్నారనుకుంటున్నారా? ఏదో పరీక్షలు రాసేందుకు కాదు, అలా అని వారు నిలబడింది ఏ రేషన్ షాపు దుకాణం ఎదుటో కూడా కాదు... మద్యం షాపు ముందు. అవును, కేరళలో మందుబాబులు సామాజిక ఎడం పాటిస్తూ క్యూ లైన్ కట్టిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. (‘రాత్రయితే తాగుడే.. లేదంటే కుదరదే..!’) అసలే కరోనా కాలం.. ఇప్పటికే దాన్నుంచి తప్పించుకోవాలంటే సామాజిక ఎడం పాటించమని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఎందుకైనా మంచిదని మందుబాబులు ఒకరికి మరొకరికి మధ్య ఒక మీటర్ ఎడం పాటిస్తూ నిలబడ్డారు. అందుకనువుగా మద్యం దుకాణం ఎదుట క్యూలైన్లో ముగ్గుతో గీతలను కూడా గీసి ఉంచడం విశేషం. ఈ క్యూలైన్లో ముఖాలకు చేతులు అడ్డుపెట్టుకుని కొందరు, కర్చీఫ్ కట్టుకుని మరికొందరు కనిపిస్తున్నారు. అయితే ఒక వ్యక్తి మాత్రం అవన్నీ దండగ అనుకున్నాడో ఏమో కానీ, నా రూటే సెపరేటు అంటూ ఏకంగా హెల్మెట్ ధరించి వరుసలో నిలబడ్డాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘వహ్వా.. మందుబాబుల ముందుజాగ్రత్త అదిరిపోయింది’ అని పొగడకుండా ఉండలేకపోతున్నారు. (‘ఈ సంక్షోభం చాలా పెద్దది’) -
అదనంగా ఒక్క రూపాయి ఇవ్వనన్నాడని..
-
మద్యం షాపు మాకొద్దు..!
సాక్షి, యలమంచిలి: గుంపర్రు గ్రామంలో మద్యం దుకాణం ప్రారంభించవద్దని గ్రామస్తులు, డ్వాక్రా మహిళలు ఆదివారం బ్రాందీ షాపు వద్ద ఆందోళన చేశారు. గుంపర్రు, కడిమిపుంత రోడ్డులో ఏర్పాటుచేసిన కొత్త మద్యం దుకాణం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు, రైతులు ఆరోపించారు. పొలాల మధ్య ఉన్న ఈ దుకాణంలో రాత్రి పూట కొందరు మద్యం సేవించి ఖాళీ సీసాలను పక్కనున్న చేలలో పడేస్తున్నారని రైతులు ఆరోపించారు. గ్రామానికి దగ్గరగా మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని గ్రామంలో షాపు పెట్టవద్దని మహిళలు నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై కొప్పిశెట్టి గంగాధరరావు, ఎక్సైజ్ ఎస్సై దుర్గాప్రసాద్ ఆందోళనకారులతో మాట్లాడారు. ఇది ప్రభుత్వ దుకాణమని ఇక్కడ ఆందోళన చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో విషయాన్ని రాజకీయ నాయకులకు తెలియజేస్తామని ఆందోళన కారులు వెనుతిరిగారు. ఈ ధర్నాకు మహిళలు యల్లమిల్లి రాజేశ్వరి, గంగులూరి శ్యామల, గొల్లమందుల కుమారి గ్రామస్తులు పితాని స్వామి, కడలి శ్రీనివాస్, కవురు వెంకటేశ్వరరావు, గుడాల నరసింహమూర్తి, చెల్లుబోయిన ఏడుకొండలు, కడలి నరసింహస్వామి నాయకత్వం వహించారు. -
పర్మిట్ రూముల్లో తనిఖీలు చేయండి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని ఏ4 మద్యంషాపుల పక్కన నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్న పర్మిట్ రూములను తనిఖీ చేయాలని ఎక్సైజ్ కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది. మద్యం షాపుల యజమానులు తమ షాపుల పక్కనే పర్మిట్ రూమ్లు ఏర్పాట్లు చేసి అందులో ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నా అధికారులు వారిపై చర్యలు తీసుకోవడం లేదంటూ హైదరాబాద్కు చెందిన ఎస్.రాములు నాయక్ దాఖలు చేసిన పిల్పై హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది. ఏయే ప్రాంతాల్లోని పర్మిట్ రూమ్లలో తనిఖీలు చేయాలో అధికారుల నిర్ణయానికి వదిలేసింది. ఒక్కో పర్మిట్ రూమ్ ఎంత ఉంది? నిబంధనల మేరకే ఆ పర్మిట్ రూమ్ సైజు ఉందా? నిబంధనలకు లోబడే పర్మిట్ రూమ్ను నిర్వహిస్తున్నారా? ఆహార పదార్థాల సరఫరా నిబంధనల్లో ఏమైనా మినహాయింపులు ఉన్నాయా? తదితర వివరాలతో నివేదికను తమ ముందుంచాలని కమిషనర్ను ఆదేశించింది. విచారణను జనవరి 1కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పర్మిట్ రూమ్ల వల్ల ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్కు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. పర్మిట్ రూమ్లలో ఆహార పదార్థాల సరఫరాకు నిబంధనలు అంగీకరించవన్నారు. -
అప్లాంజ్ బార్ సీజ్
సాక్షి, హైదరాబాద్ : మద్యం మత్తులో నిండు ప్రాణం బలిగొన్న యువతుల ఘటనపై ఘట్కేసర్ అధికారులు స్పందించారు. 21 ఏళ్ల వయసు లోపు వారికి మద్యం అమ్మకూడదన్న నిబంధనను పట్టించుకోకుండా మద్యం అమ్మకాలు చేశారన్న కారణంతో మంగళవారం ఏఎస్రావు నగర్లోని అప్లాంజ్ (సమ్మక్క సారక్క) బార్ను ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్రావు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మల్లయ్య ఆధ్వర్యంలో దాడులు జరిపి సీజ్ చేశారు. నిర్వాహకుడు శ్రీధర్గౌడ్పై కేసు నమోదు చేశామని, ఉన్నతాధికారుల సూచన మేరకు జరిమానా విధించనున్నట్లు తెలిపారు. సమ్మక్క–సారక్క పేరుతో నాగారానికి చెందిన శ్రీధర్గౌడ్ పేరు మీద బార్కు లైసెన్స్ ఉంది. నిర్వహణ సక్రమంగా సాగకపోవడంతో నిర్వాహకుడు బార్ను మూసేశాడు. మూసేసిన బార్ను పై ఫ్లోర్లో ఉన్న అప్లాంజ్ రెస్టారెంట్ నిర్వాహకులు లీజ్కు తీసుకొని గత 6 నెలలుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కనీస నిబంధనలను పాటించకుండా బార్ నిర్వహణ, మద్యం అమ్మకాలు సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం రాత్రి ఈ బార్లో తప్పతాగిన యువతులు డ్రైవింగ్ చేసి నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. కాగా సదరు యువతులు 21 ఏళ్లు దాటినట్లు తప్పుడు ధృవపత్రాలు చూపించారని నిర్వాహకులు పేర్కొంటున్నారు. అతిగా మద్యం సేవించడంతో బారు సిబ్బంది వారిని కారు వరకు తీసుకెళ్లి వదిలినట్లు సీసీ కెమెరా రికార్డులు చెబుతున్నాయి. -
25 నుంచి మద్యం షాపుల బంద్
సాక్షి, అమరావతి: మద్యం వ్యాపారులు రాష్ట్రవ్యాప్తంగా బంద్కు దిగనున్నారు. మద్యం షాపులు మూసేయడంతోపాటు సరుకును కూడా ఏపీబీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్) గోడౌన్ల నుంచి తీసుకెళ్లకుండా నిరసన చేపట్టనున్నారు. ఈ మేరకు ఏపీ స్టేట్ వైన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాయల సుబ్బారావు అధ్యక్షతన శనివారం విజయవాడలో ఓ ప్రైవేటు హోటల్లో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం సిండికేట్లు హాజరయ్యారు. ఈ నెల 25 నుంచి మద్యం షాపుల బంద్ పాటించేందుకు నిర్ణయించారు. మద్యం వ్యాపారులకు ఇస్తున్న 10 శాతం కమీషన్ను 18 శాతానికి పెంచాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. దీనికి ప్రతి మద్యం షాపు నుంచి రూ.5 వేల వంతున వసూలు చేశారు. చివరకు సీఎం కార్యాలయం అధికారులు కూడా జోక్యం చేసుకుని కమీషన్ను పెంచాలని రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావుకు మెమో జారీ చేశారు. అయితే గతంలో కమీషన్ 10 శాతానికి మించి ఉండకూడదని జీవో ఉండటంతో 18 శాతానికి పెంచడం సాధ్యం కాదని తేల్చారు. పెంపు ప్రతిపాదనలు నిలిచిపోవడంతో వైన్ డీలర్స్ అసోసియేషన్ గత నెలలో అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు నాలుగు జిల్లాల్లో మద్యం షాపులు మూసివేసి నిరసన తెలిపింది. మళ్లీ ఈ నెల 25 నుంచి నిరవధిక బంద్ పాటించనున్నారు. ప్రభుత్వం దిగొస్తుంది.. సహకరించండి: విజయవాడలో సమావేశమైన మద్యం సిండికేట్లు అన్ని జిల్లాల్లో వ్యాపారుల్ని బుజ్జగించే పనిలో ఉన్నారు. వారం రోజులు బంద్ పాటించి నిరసన తెలిపితే ప్రభుత్వం దిగొస్తుందని, 18% కమీషన్ పెంచేందుకు అంగీకరిస్తుందని సిండికేట్లు పేర్కొనడం గమనార్హం. వ్యాపార దృక్పథంతో చూడకుండా అందరూ షాపుల్ని మూసేయాలని సూచించారు. వారంలో సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తమకు సమాచారం ఉందని అసోసియేషన్ పెద్దలు చెబుతున్నారు. కాగా, మద్యం వ్యాపారులు బంద్ పాటిస్తే ఏర్పడే డిమాండ్ను బట్టి ప్రభుత్వమే ఔట్లెట్లు ఏర్పాటు చేసి అమ్మకాలు చేపట్టాలని యోచిస్తోంది. -
జార్ఖండ్ ఎమ్మెల్యేల వింత కోరిక
రాంచీ: ప్రజాసమస్యలపై చర్చించే అసెంబ్లీలో మద్యం దుకాణం ఏర్పాటు చేయాలంటున్నారు.. జార్ఖండ్ ఎమ్మెల్యేలు. బయట మద్యం కొనుక్కోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని, క్యూలలో జనాలు భారీగా ఉండటంతో ఇబ్బందిగా ఉంటోందని, అసెంబ్లీ ప్రాంగణంలో మద్యం దుకాణం ఏర్పాటు చేసేలే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. చలి కాలం కావడంతో మద్యం ప్రియులు ఎక్కువయ్యారని, దీంతో ఎమ్మెల్యేల సాయంత్రం పెగ్ అలవాటుకు సమస్యగా మారుతోందని ఓ ఎమ్మేల్యే వాపోయాడు. ఇక జార్ఖండ్ ప్రభుత్వం మద్యం దుకాణాల లైసెన్స్ను రద్దు చేసి స్వయంగా లిక్కర్ షాపులను నిర్వహిస్తోంది. ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉండడంతో ఎప్పుడు చూసిన రద్దీగా ఉంటున్నాయి. దుకాణాల ముందు గొడవలు జరుగుతున్నాయి. దుకాణాలు కేవలం సీటీ శివారులో ఉండటం.. రాత్రి 10 గంటల వరకే అందుబాటులో ఉండటంతో మందుబాబులకు ప్రధాన సమస్యగా మారింది. ఈ నెల 12 నుంచి జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ విషయాన్ని లేవనేత్తాలనుకుంటున్నారు. ఈ విషయంలో స్పీకర్ దినేష్ సాయంతో ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ను ఒప్పిస్తామని ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎమ్ఎమ్) నేత హేమంత్ సోరేన్ కూడా మద్దతు తెలుపుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తాలని తమ ఎమ్మెల్యేలకు సూచించారు. -
'బెల్ట్' తీసే ప్రైవేటు సేన!
సాక్షి, హైదరాబాద్ : బెల్టు షాపులకు మద్యం సరఫరా విషయంలో వ్యాపారుల మధ్య గొడవలను నియంత్రించేందుకు ఎక్సైజ్ అధికారులు ఓ చట్ట విరుద్ధ పాలసీని అమల్లోకి తెచ్చారు. అధీకృత (ఏ4 షాపు) మద్యం దుకాణం చుట్టూ ఉన్న రెవెన్యూ గ్రామాలను ఒక గ్రూపులో చేర్చి, ఆయా గ్రామాల్లో బెల్టు దుకాణాలకు నిర్ధేశిత ఏ4 దుకాణం యాజమాన్యమే మద్యం సరఫరా చేయాలని ఒప్పందం చేయించారు. ఈ ఒప్పందాన్ని అతిక్రమించకుండా పక్కాగా అమలు చేసేందుకు యాజమాన్యాలు ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ప్రతి లైసెన్స్డ్ దుకాణానికి నలుగురికి తగ్గకుండా ప్రైవేటు వ్యక్తులను నియమించుకున్నాయి. బెల్టు షాపే తారక మంత్రం ప్రభుత్వం మద్యం ఎంఆర్పీ (గరిష్ట చిల్లర ధర) నిబంధనను కఠినంగా అమలు చేస్తోంది. ఎంఆర్పీకి మించి మద్యం అమ్మిన దుకాణాలకు రూ.2 లక్షల జరిమానా, నెల పాటు లైసెన్స్ రద్దు చేస్తోంది. ఈ నిబంధన వ్యాపారులతోపాటు, ఎక్సైజ్, పోలీసు అధికారులకు ఇబ్బందిగానే మారింది. అదనపు సంపాదన లేక వ్యాపారులు నెల మామూళ్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఏ4 దుకాణాల ద్వారా మద్యం విక్రయాల నెలవారీ టార్గెట్లను అందుకోలేకపోతున్నారు.దీంతో ఎక్సైజ్ అధికారులు బెల్టు దుకాణాలను ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో 8,685 రెవె న్యూ గ్రామాలు, 21 వేల హాబిటేషన్లు ఉన్నా యి. ప్రతి రెవెన్యూ గ్రామంలో సగటున 5 చొప్పున, ప్రతి హాబిటేషన్ గ్రామంలో ఒకటి చొప్పున 65 వేలకు పైగా బెల్టు దుకాణాలు నడుస్తున్నాయి. రాష్ట్రంలోని మద్యం వ్యాపారంలో 60 శాతం బెల్టు దుకాణాల ద్వారానే నడుస్తోంది. ఏడాదికి కనీసం 633 లక్షల కేసుల మద్యం విక్రయించాలని, ఇందులో 283.20 లక్షల కేసుల బ్రాందీ, విస్కీ, 349.42 లక్షల కేసుల బీరు, 0.82 లక్షల కేసుల విదేశీ మద్యం విక్రయించడం ద్వారా రూ.15,836 కోట్ల విలువైన వ్యాపారం చేయాలని ఎక్సైజ్ శాఖ ప్రణాళిక రూపొందించింది. మద్యం దుకాణాల ద్వారా అమ్మితే ఇందులో 40% మద్యం కూడా అమ్ముడవదు. దీంతో ప్రభుత్వం బెల్టు షాపులను ప్రోత్సహిస్తోంది. దుకాణానికి నలుగురు ఒప్పందం పక్కాగా అమలు చేసేందుకు దుకాణాల యాజమాన్యాలు ప్రైవేటు సైన్యాలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రతి దుకాణానికి నలుగురు యువకుల చొప్పున చేర్చుకున్నారు. వీరికి నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇస్తున్నారు. గ్రామాల్లోని బెల్టు దుకాణాలను నిత్యం పర్యవేక్షిస్తూ.. పక్క దుకాణాల నుంచి మద్యం తెచ్చి విక్రయిస్తున్నారని తెలిస్తే దాడులు చేయటమే వాళ్ల పని. మద్యం నిర్దేశిత దుకాణం లోనిదా? కాదా ? అని నిర్ధారించుకునేందుకు ‘వేర్ ఇట్’అనే ఎక్సైజ్ శాఖ యాప్ను ఉపయోగిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు ఫోన్స్లో ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నారు. బెల్టు దుకాణంలోని మద్యం సీసా మూతకు అతికించిన లేబుల్ను స్కాన్ చేస్తే ఆ సీసా ఏ లైసెన్స్డ్ దుకాణం నుంచి వచ్చిందో తెలిసిపోతుంది. ఒకవేళ బెల్టు దుకాణాల నిర్వాహకులు ఒప్పందం అతిక్రమిస్తే ప్రైవేటు సైన్యం భౌతిక దాడులు చేస్తోంది. తర్వాత స్థానిక ఎక్సైజ్ అధికారికి ఫిర్యాదు చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు వారి మీద అక్రమ మద్యం కేసులు నమోదు చేస్తున్నారు. తరచూ గొడవలు కొత్తగా లైసెన్స్ పొందిన మద్యం దుకాణాలు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయి. దీంతో వ్యాపారులు బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేసే పనిలో పడ్డారు. ప్రతి క్వార్టర్కు ప్రస్తుతానికి ఎంఆర్పీ మీద రూ.2 అదనంగా వసూలు చేస్తున్నారు. భవిష్యత్తులో రూ.5 నుంచి రూ.10 వరకు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకే మండలంలో రెండు,మూడు మద్యం దుకాణాలు ఉన్న చోట బెల్టు షాపులకు మద్యం సరఫరా చేసే విషయంలో తరచుగా గొడవలు తలెత్తుతున్నాయి. ఈ గొడవలను నివారించటం కోసం స్థానిక ఎక్సైజ్ పోలీసులు మధ్య వర్తిత్వం చేసి గ్రామాలను విభజించి పరిధిని నిర్ధారించారు. నిర్ధారించిన గ్రామా ల్లోని బెల్టు దుకాణాలకు మాత్రమే మద్యం సరఫరా చేయాలని ఒప్పందం చేసుకున్నారు. -
24 గంటల నిరాహార దీక్ష
♦ వరుసగా ఉన్న ఐదు మద్యం షాపులను తొలగించాలి ♦ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరం రోడ్డులో గుడి, బడితోపాటు పేదలు నివసించే ప్రాంతంలో వరుసగా ఉన్న ఐదు మద్యం షాపులను తొలగించాలని కోరుతూ శనివారం ఉదయం నుంచి 24 గంటల నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మద్యం షాపులను ఎత్తివేయాలని పలు మార్లు ప్రభుత్వాధికారులకు విన్నవించడం, వినతి పత్రాలు సమర్పించడం, ధర్నాలు చేశామని తెలిపారు. అయినా స్పందించలేదని తెలిపారు. ప్రజల ఇబ్బందిని, ముఖ్యంగా మహిళలు పడుతున్న అవస్థలను గమనించామని పేర్కొన్నారు. మద్యం ప్రియుల వల్ల ఆ ప్రాంత మహిళలు, హైస్కూల్, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులు, యువతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ కారణంగా ఆ ప్రాంతంలోని ఐదు మద్యం షాపులను ఎత్తివేయాలని బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా డిమాండ్ చేస్తున్నానన్నారు. మద్యం షాపులు ఎత్తేసే వరకు పోరాటం సాగిస్తాం వైఎస్సార్ కాంగ్రెస్సార్పార్టీ నాయకత్వంలో టీడీపీ మద్యం పాలసీకి వ్యతిరేకంగా రామేశ్వరం రోడ్డులోని ఐదు మద్యం షాపులను ఎత్తివేసేంత వరకు పోరాటం సాగిస్తామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం జన నివాసాల మధ్య షాపులు ఉండరాదని, ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తే తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ప్రకటనలకే పరిమితమైన సీఎం చంద్రబాబు మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతానని ప్రకటించడం ఇదేనా అని విమర్శించారు. ఈ దీక్షతోనైనా ప్రభుత్వంలో మార్పు రావాలని ఆశీస్తున్నానన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాజుపాళెం మండల కన్వీనర్ ఎస్ఏ నారాయణరెడ్డి, కౌన్సిలర్ టప్పా గైబుసాహెబ్, పోసా భాస్కర్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానపరెడ్డి ప్రతాప్రెడ్డి, కార్యదర్శి లక్కిరెడ్డి పవన్కుమార్రెడ్డి, మాజీ కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి, కొర్రపాడు సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
మద్యం సీసాలను ధ్వంసం చేసిన మహిళలు
విజయవాడ: నగరంలోని భవానీపురంలో జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణంలోని మద్యం సీసాలను మహిళలు ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. మద్యం దుకాణం ముందు రోజులతరబడి ధర్నాలు చేస్తున్నా దుకాణాన్ని తొలగించకుండా విక్రయాలు జరుపుతుండటంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా దుకాణంలోకి వెళ్లి మద్యం సీసాలను పగులగొట్టారు. అనంతరం వైన్ షాప్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మద్యం దుకాణంలో దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై పలువురు మహిళలపై భవానీపురం పోలీసులు కేసులు నమోదు చేశారు. -
మద్యం షాపు మార్చాలని వినతి
ఎల్.ఎన్.పేట: మండల కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపు ఏర్పాటు చేస్తున్నారని, ఇందుకు ఎక్సైజ్ అధికారులు వత్తాసు పలుకుతున్నారని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన చేశారు. అనంతరం తహసీల్దార్ కె.అప్పారావుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రధాన రహదారికి కనీసం 100 అడుగుల దూరంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చెబుతున్న ఇక్కడ అందుకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్నారని మండల కేంద్రానికి చెందిన ఎం.ఆదెమ్మ, ఆర్.జ్యోతి, ఎం.భాగ్యలక్ష్మి, డి.శ్రీనివాసరావు, కె.సింహాచలంతో పాటు పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మద్యం దుకాణానికి సమీపంలోనే శ్రీభక్తాంజనేయ స్వామి దేవాలయం ఉందని, ఎదురుగా తహసీల్దారు, ఎంపీడీఓ, ఐకేపీ కార్యాలయాలకు వెళ్లేందుకు రోడ్డు ఉందన్నారు. వైన్ షాపు ఉన్నచోటే రోడ్డుపై ఆటోలు నిలుపుతారని దీని వల్ల ఇబ్బందులు వస్తాయన్నారు. ఈ మేరకు మరోచోట దుకాణం ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ఫిర్యాదును జిల్లా అధికారులకు పంపించి తగిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. -
మద్యం షాపు తరలించవద్దని మహిళల ఆందోళన
కోయంబత్తూర్: మద్యం దుకాణాలను నివాసప్రాంతాల నుంచి తరలించాలని మహిళలు ఆందోళనలకు దిగటం సర్వసాధారణం. తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో ఇందుకు విరుద్ధమైన ఘటన జరిగింది. గ్రామంలోని మద్యం దుకాణాన్ని రద్దు చేయాలనే అధికారుల నిర్ణయంపై తనీర్పండాల్ గ్రామానికి చెందిన మహిళలు నిరసన తెలిపారు. దాదాపు 50 మంది మహిళలు గురువారం రాస్తారోకోకు దిగారు. గ్రామంలో ఆ దుకాణం లేకుంటే తమ భర్తలు దూరంగా ఉన్న మద్యం దుకాణానికి వెళతారని, అలా వెళ్లే సందర్భాల్లో ప్రమాదబారిన పడే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారు ప్రమాదం బారిన పడకుండా సురక్షితంగా ఉండాలంటే గ్రామంలోనే అది ఉండటం మంచిదని కోరారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని మద్యం దుకాణాలను జనావాసాల నుంచి అధికారులు దూరంగా తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా ఆందోళన జరగటం గమనార్హం. -
షాపు కట్టి... మద్యం చిచ్చుపెట్టి !
♦ మద్యం మంటలను రాజేస్తున్న టీడీపీ నేతలు ♦ సిద్దార్థ మహిళా కళాశాల పక్కనే మద్యం దుకాణం ♦ మహిళలు, విద్యార్థినుల నిరసన ♦ అధికారులు తొలగించినా రాత్రికి రాత్రే నిర్మాణం ♦ ఎమ్మెల్యే గద్దె, కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ వత్తాసు ♦ దుకాణం ఎదుట మహిళలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ ధర్నా ♦ ప్రసాదంపాడులో కొనసాగుతున్న ఆందోళనలు జిల్లాలోని టీడీపీ నాయకులు మద్యం మంటలను రాజేస్తున్నారు. విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాలకు అతి సమీపంలోనే ఓ ఎమ్మెల్యే అనుచరుడు మద్యం షాపు ఏర్పాటు చేస్తున్నారు. కళాశాల విద్యార్థినులు, స్థానిక మహిళలు ఆందోళనల కారణంగా నాలుగు రోజుల కిందట అధికారులు ఆ షాపును కూల్చివేశారు. అయితే, ఎమ్మెల్యే అండతో రాత్రికి రాత్రే దుకాణం నిర్మించేశారు. ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో స్థానిక మహిళలతో కలిసి వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ గురువారం ఆ దుకాణం ఎదుట ధర్నా చేశారు. మరోవైపు ప్రసాదంపాడులోనూ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సాక్షి, అమరావతిబ్యూరో: మద్యం ఆదాయం కోసం ప్రభుత్వం కోర్టు నిబంధనలనే కాలరాస్తే .. టీడీపీ నేతలు తమ్ముళ్ల ఆదాయం కోసం మద్యం మంటలను మరింతగా రాజేస్తున్నారు. ఇళ్లు, గుడి, బడి ఉన్నా లెక్కచేయని తెలుగు తమ్ముళ్లు మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. స్థానికులు, మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా యజమానులు వారి ఆవేదనను పరిగణలోకి తీసుకొకుండా దుకాణాలు ఏర్పాటు చేçస్తున్నారు. కళాశాల పక్కనే మద్యం దుకాణం అన్యాయంటూ కాలనీ వాసులు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, కార్పొరేటర్ను ఆశ్రయిస్తే మీ ఆవేదన కంటే మద్యం ఆదాయమే ప్రభుత్వానికి అవసరం కదా..? అంటూ వారిని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారు. నాలుగువేల మంది విద్యార్థులున్నా.. విజయవాడ ఫకీర్గూడెం కాలనీలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. సిద్ధార్థ మహిళా కళాశాల ఉంది. అందులో నాలుగు వేల మంది విద్యార్థినిలు చదువుతున్నారు. వారిలో ఏడు వందల మంది హాస్టల్లో ఉంటున్నారు. ట్రాఫిక్ సమస్య కారణంగా కాలేజ్ వెనుకవైపు గేటు ఏర్పాటు చేస్తున్నారు. ఆ గేట్ ముందు వైపే కొత్తగా మద్యం దుకాణం టీడీపీ నేత ఏర్పాటు చేస్తున్నాడు. చుట్టూ నివాసాలు, కాలేజ్ పక్కనే మద్యం షాపు ఏర్పాటుచేస్తే మందుబాబుల ఆగడాలతో విద్యార్థినులు అసౌకర్యానికి గురవుతారని, చుట్టూ నివాసాల వారు ప్రశాంతత కోల్పోతారని స్థానికులు, ఆ కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం దుకాణాన్ని అడ్డుకోవాలంటూ స్థానిక వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ సుజాతకు ఫిర్యాదు చేశారు. ఆమె పరిశీలించి మద్యం దుకాణాన్ని తొలగించాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కార్పొరేషన్ అధికారులు పరిశీలించి కార్పొరేటర్ సమక్షంలోనే అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. ఆ వైన్ యజమాని స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రధాన అనుచరుడు కావడంతో దుకాణం అక్కడే ఉంచాలని పట్టుబడ్డాడు. మరో టీడీపీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ ఆ వైన్ యజమానికి మద్దతు ఇవ్వడంతో దుకాణం తొలగించిన చోటే రాత్రికి రాత్రే మరొకటి నిర్మించాడు. రెండు రోజుల్లో షాపు ప్రారంభిస్తానని స్థానికులకు సవాల్ విసరడంతో గురువారం ఆకాలనీ మహిళలతోపాటు కాలేజ్ ప్రిన్సిపాల్ ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ సుజాత ఆందోళన చేశారు. దుకాణ నిర్మాణం అడ్డుకోవాలంటూ ఆ కాలనీ వాసులతోపాటు కాలేజ్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి రాతపూర్వకంగా ఎక్సైజ్, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి మహిళా కాలేజ్ పక్కనే మద్యం దుకాణం ఏర్పాటు తప్పుగా తేల్చారు. ప్రభుత్వ ఆదాయం పొగొట్టుకోవాలా..? మహిళా కళాశాల, నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటును అడ్డుకోమని స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ను స్థానిక మహిళలు వేడుకున్నారు. మహిళల ఆవేదనను అర్థం చేసుకోకుండా ఎమ్మెల్యే ప్రభుత్వ ఆదాయం పోగొట్టుకోవాలంటూ వారినే ప్రశ్నించినట్లు స్థానికులు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే దుకాణాలు నివాసాల మధ్య ఏర్పాటు చేసుకుంటున్నారని నేనేమీ చేయలేనంటూ ఎమ్మెల్యే చేతులెత్తేయడంపై వారు మండిపడుతున్నారు. మరో టీడీపీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ మద్యం దుకాణం ఎక్సైజ్ పాలసీ ప్రకారం జరుగుతుందని నేనేమీ చేయలేయని మాట దాట వేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాదంపాడులో.. ప్రసాదంపాడు దళిత కాలనీలో బార్ అండ్ రెస్టారెండ్ ఏర్పాటు విషయంపై ఆరు రోజులుగా స్థానికులు ఆందోళన చేస్తున్నారు. వీరికి ప్రజాసంఘాలు, మహిళా సంఘాలుతోడు కావడంతో ఆందోళన ఉధృతం అయింది. వైన్ యజమాని టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో మహిళల ఆందోళన లెక్కలోకి తీసుకోవటం లేదు. బార్ పక్కనే గుడి, బడులు ఉన్నాయని ప్రశాంతత కోల్పోతామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. గురువారం వైఎస్సార్సీసీపీ జిలా పార్టీ అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, నియోజక సమన్వయకర్త దుట్టా రామచంద్రరావు స్థానికుల ఆందోళనకు మద్దతిచ్చారు. -
మందస్తు డీల్.. రోడ్లు మారాయి
హైవేపై ముందుగానే తెరిచారు జమ్మలమడుగు: సుప్రీంకోర్టు జాతీయ రహదారులకు 500 మీటర్ల, రాష్ట్ర రహదారులకు 220 మీటర్ల దూరంలో మద్యంషాపులను ఏర్పాటు చేసుకోవాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో హైవేలపై ఉన్న మద్యం షాపులను ఇళ్ల మధ్యకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో జిల్లావ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ జమ్మలమడుగులో అలాంటివేమీ చోటుచేసుకోలేదు. కారణం రాష్ట్ర హైవేలను జిల్లా రహదారులుగా మార్చుతామని పాలకుల నుంచి ముందే సమాచారం అధికారపార్టీ నాయకులకు రావడమే. జాతీయ రహదారి అయిన ముద్దనూరు రోడ్డును వదిలి తాడిపత్రి రహదారి వైపు బ్రాందీషాపులను వారంకిందటి నుంచే మార్చుకునే ప్రయత్నాలు చేశారు. అందులోభాగంగా ఒకటో తేదీనుంచే పట్టణంలో తాడిపత్రి రోడ్డులో మూడు బ్రాందీషాపులు తెరుచుకున్నాయి. అయితే రాష్ట్ర హైవేలను జిల్లా రహదారులుగా ప్రభుత్వం జీఓను మంగళవారం విడుదల చేసింది. విషయం ముందుగానే తెలియడంతోనే సంజామల మోటు నుంచి మోరగుడి మోటు వరకు మొత్తం బ్రాందీషాపులు ఇప్పటికే వెలిశాయి. సాక్షి ప్రతినిధి, కడప: మద్యం సిండికేట్లతో ప్రభుత్వ పెద్దలకు కుదిరిన ముందస్తు డీల్తో జిల్లాలోని 1,130.906 కిలోమీటర్ల స్టేట్హైవే రోడ్డును ప్రభుత్వం జిల్లా మేజర్ రోడ్లుగా మార్చింది. దీంతో ఇప్పటిదాకా ఉన్న 90శాతం మద్యం దుకాణాలకు సుప్రీంకోర్టు తీర్పు దెబ్బతప్పింది. రోడ్లు మనవే తోసేయ్ అనేలా వ్యాపారులు యథాతథంగా ప్రస్తుత స్టేట్హైవే రోడ్లకు ఆనుకుని ఉన్న భవనాల కోసం వేట ప్రారంభించారు. సిండికేట్లదే పెత్తనం జిల్లాలో 255 మద్యం దుకాణాలతో పాటు, గత ఏడాది ఉన్న 19 బార్ అండ్ రెస్టారెంట్లకు అదనంగా 11 బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటుచేయడానికి ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఈ సంఖ్య మేరకు దుకాణాలు, బార్ల ఏర్పాటుకు అవసరమైన లైసెన్సుల మంజూరుకు ఎక్సైజ్ శాఖ అధికారిక ప్రక్రియ పూర్తి చేసింది. రోడ్డుప్రమాదాలను కట్టడి చేయడం కోసం హైవేలను ఆనుకుని 500 మీటర్ల దూరం తర్వాతే మద్యం దుకాణాలు, బార్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును అమలు చేస్తే తమ వ్యాపారాలు దెబ్బతింటాయనీ, ప్రభుత్వానికి కూడా ఆదాయం తగ్గుతుందని రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు మన జిల్లాలోని మద్యం సిండికేట్లు కూడా ప్రభుత్వ పెద్దల మీద ఒత్తిడి తెచ్చాయి. ఈ ప్రమాదం నుంచి గట్టెక్కడానికి ఆమ్యామ్యాలు సమర్పించుకున్నాయి. ఈ ముందస్తు సెటిల్మెంట్ల కారణంగా గత నెల 28, 29 వ తేదీలకే స్టేట్హైవేలన్నీ జిల్లా మేజర్ రోడ్లుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంది. అయితే జనావాసాల్లో మద్యం షాపులు ఏర్పాటు చేయించి ప్రజల నుంచి వ్యతిరేకత తెప్పించి హైవేలను జిల్లా రోడ్లుగా మార్చే ఎత్తుగడ వేశారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఈ వ్యూహం అమలు చేసి ప్రజల ఆందోళనలు దృష్టిలోఉంచుకుని రోడ్లస్థాయి తగ్గించినట్లు కథ నడపించారు. సినిమాకు ఈ తరహా ముగింపు ఉంటుందని ముందే తెలిసిన కొందరు సిండికేట్ పెద్దలు సుమారు 100 మద్యం దుకాణాల ఏర్పాటుకు లైసెన్సులు తీసుకోవడానికి ఎగబడకుండా ఎదురుచూశారు. మంగళవారం రాత్రి రాష్ట్ర హైవేలను జిల్లా మేజర్ రోడ్లుగా మారుస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తమ దుకాణాలు తెరిచేందు కు వ్యాపారులు ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్నిచోట్లే ఇబ్బందులు జిల్లాలో కర్నూలు– చిత్తూరు, కడప– బాలుపల్లి, రాయచోటి– అంగళ్లు, కొండాపురం–బద్వేలు మధ్య సుమారు 500 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారులు ఉన్నాయి. వీటిని ఆనుకుని దగ్గర్లో ఏర్పాటైన మద్యం దుకాణాలు చాలా తక్కువ ఉన్నాయి. బార్లయితే కడప, రాజంపేటలో రెండు మాత్రమే ఉన్నాయి. జాతీయ రహదారులు వెళ్లే ప్రతిచోట రింగ్రోడ్డు లేదా బైపాస్ రోడ్లు ఉండటంతో అత్యధిక మద్యం దుకాణాలు స్టేట్హైవేలను ఆనుకునే ఉన్నాయి. ఈ ప్రకారం జిల్లాలో 1,130.906 కిలోమీటర్ల స్టేట్హైవే రోడ్డు ఉండగా, 55.437 కిలోమీటర్లు మాత్రమే జిల్లా మేజర్ రోడ్లు ఉన్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో స్టేట్హైవేలన్నీ జిల్లా మేజర్రోడ్లుగా మారుతున్నాయి. దీంతో ఇప్పటికే హైవేలను ఆనుకుని మద్యం వ్యాపారం చేస్తున్న వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయింది. దువ్వూరు, ఖాజీపేట, మైదుకూరు, కోడూరు, బద్వేలు, రాజంపేటల్లో మాత్రం చాలాతక్కువ మద్యం దుకాణాలకు ఇబ్బంది కలుగుతుంది. వీటిని కూడా ప్రస్తుత స్టేట్హైవేల్లో సర్దుబాటు చేయడానికి అధికారుల నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండే అవకాశం లేదు. ఈ కారణంగా మద్యం దుకాణాల ఏర్పాటుపై ప్రజల్లో సాగుతున్న ఆందోళనలు తగ్గిపోయి మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఏర్పడింది. -
కిక్కు.. రోడ్డు దిగాల్సిందే!
- నేటి నుంచి కొత్త మద్యం పాలసీ – జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన దుకాణాలు 167, బార్లు 17 – సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించాలంటున్న అధికారులు – మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్(ఎండీఆర్)గా మార్పు కోసం ఎదురుచూపులు కర్నూలు: జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన మద్యం దుకాణాలను జులై 1వ తేదీ నుంచి(శనివారం) నిర్ణీత దూరంలో ఏర్పాటు చేయాల్సిందే. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. నూతనంగా లైసెన్స్ పొందిన వ్యాపారులు శనివారం నుంచి దుకాణాలు ప్రారంభించనున్నారు. వారు సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పక పాటించాలి. రూ.20 వేల లోపు జనాభాఉన్న ప్రాంతాల్లో రహదారికి 220 మీటర్ల దూరంలో దుకాణాన్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుందన్న ఆశతో పాత వ్యాపారులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని నగర/పట్టణాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులను మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్(ఎండీఆర్)గా మార్పునకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అది అమలైతే జాతీయ, రాష్ట్ర రహదారులకు 220 మీటర్ల దూరంలో దుకాణాలను కొనసాగించవచ్చునన్న ఆశతో పాత వ్యాపారులు ఎదురు చూస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో రహదారికి 500 మీటర్ల దూరంలో దుకాణం ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు డివిజన్లో 86, నంద్యాల డివిజన్లో 81 కలిపి 167 మద్యం దుకాణాలు జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన ఉన్నట్లు గుర్తించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం వాటన్నింటినీ తొలగించాల్సిందే. అయితే మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్గా మార్పు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నందున దుకాణాలు అక్కడే కొనసాగించేందుకు అవకాశం వస్తుందని 80 శాతం మంది వ్యాపారులు చివరి రోజు రాత్రి వరకు ఎదురుచూస్తున్నారు. అలాగే జిల్లాలో పాతవి 35 బార్లు ఉండగా, నంద్యాలలో 15కు గాను రెండు రోడ్సైడ్, కర్నూలులో 18కి గాను 12 రోడ్సైడ్ ఉన్నట్లు గుర్తించారు. వారంతా కూడా చివరిగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తుండటంతో కొత్త దుకాణాల ఏర్పాటు గందరగోళంగా మారింది. ఎంఆర్పీ అమలయ్యేనా? ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మద్యం వ్యాపారులు గరిష్ట చిల్లర ధర కంటే అదనపు ధరకు మద్యం విక్రయించి సొమ్ము చేసుకున్నారు. నెల రోజుల క్రితం వరకు సీసాపై రూ.20 వరకు అదనంగా దోపిడీ చేశారు. జూలై 1 నుంచి ఏర్పాటు కానున్న కొత్త దుకాణాల ఫీజులు భారీగా తగ్గనున్నాయి. ఈసారైనా మద్యం వ్యాపారులు ఎంఆర్పీకి విక్రయిస్తారా లేక మళ్లీ సిండికేట్ల రూపంలో అదనపు ధరలతో దోచుకోవడం మొదలు పెడతారా అనే విషయం చర్చనీయాంశంగా మారింది. -
మద్యం దుకాణం యజమానిపై దాడి
రాయచోటి(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా రాయచోటి పట్టణంలో ఒక మద్యం దుకాణం యజమాని మరో దుకాణం యజమానిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. పట్టణంలోని వరదా వైన్స్ యజమాని కోకిల వైన్స్ యజమాని శ్రీనివాసులురెడ్డిపై శనివారం రాత్రి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులురెడ్డిని వెంటనే కడపకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఖరీదైన మద్యం సీసాలు మాయం
సత్తెనపల్లి(గుంటూరు): గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైన్షాపులో చోరీ జరిగింది. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని రెడ్ వైన్స్లో మంగళవారం రాత్రి దొంగలు పడి రూ. 50 వేలు విలువైన మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. బుధవారం ఇది గుర్తించిన షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మద్యం దుకాణం వద్దంటూ ఆందోళన
ముత్తుకూరు (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు) : తమ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ స్థానికులు ఆందోళనకు దిగిన సంఘటన ఇది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరులో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానిక సెంటర్లో మద్యం దుకాణం ఏర్పాటుపై అందిన దరఖాస్తు మేరకు ఎక్సైజ్ సీఐ నరహరి శనివారం సాయంత్రం అక్కడికి చేరుకుని సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేపట్టారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న దాదాపు 100 మంది స్థానికులు మద్యం దుకాణం వద్దంటూ బైఠాయించి నినాదాలు చేశారు. అయితే దుకాణం ఏర్పాటు కేవలం ప్రతిపాదనల దశలోనే ఉందని ఏర్పాటు సంగతిని పైఅధికారులు చూసుకుంటారని ఎక్సైజ్ సీఐ నరహరి తెలిపారు. స్థానికుల ఆందోళన చాలాసేపటి వరకు కొనసాగింది. -
అర్థరాత్రి టీడీపీ నేతల దౌర్జన్యం
తిరుపతి క్రైం: మద్యం దుకాణానికి, పర్మిట్ రూం ఏర్పాటుకు అనుమతి ఎందుకిచ్చారంటూ తెలుగుదేశం నాయకులు దౌర్జన్యానికి దిగారు. పోలీసు, ఎక్సైజ్ అధికారులు కూడా ఏమీ చేయలేక మిన్నకుండి పోయారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. నగరంలో లక్ష్మీపురం ప్రాంతంలో ఉన్న దేవి వైన్స్పై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నర్సింహయాదవ్తోపాటు ఆయన అనుచరులు గురువారం రాత్రి దాడి చేశారు. ఈ ప్రాంతంలో మద్యం దుకాణం, పర్మిట్ రూంకు ఎలా, ఎవరు అనుమతి ఇచ్చారంటూ ఆ దుకాణంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కుర్చీలను తీసుకెళ్లి తూర్పుపోలీస్ స్టేషన్కు ఎదురుగా రోడ్డుపై పడేశారు. పక్కనే ఉన్న వంతెనపై వాహనాల రాకపోకలకు అడ్డంకులు సృష్టించారు. ఇంత చేస్తున్నా అక్కడికి చేరుకున్న సివిల్, ఎక్సైజ్ సీఐలు మౌనంగా ఉన్నారు. వారిని ఏమీ చేయలేక సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. హల్చల్ చేస్తున్న వారికి మద్దతుగా ఎమ్మెల్సీ శ్రీనివాసులు అక్కడికి చేరుకున్నారు. ఈ దందా అర్థరాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. -
చోరీకి యత్నించి..ఇరుక్కుపోయాడు!
మేడ్చల్ (రంగారెడ్డి జిల్లా) : ఓ వ్యక్తి మద్యం దుకాణంలో దొంగతనానికి యత్నించి.. ఆనక పైకప్పు రేకుల్లో ఇరుక్కుపోయి, పోలీసులకు చిక్కాడు. ఘటన వివరాల్లోకి వెళ్తే... మేడ్చల్కు చెందిన శంకర్ అనే వ్యక్తి బుధవారం రాత్రి స్థానిక రంగసాయి వైన్స్లో దొంగతనానికి యత్నించాడు. మద్యం దుకాణం పైకప్పు రేకులకు రంధ్రం చేసి లోపలికి దూరేందుకు యత్నించాడు. ఆ క్రమంలో అతడు రంధ్రంలోనే ఇరుక్కుపోయాడు. పైకి రాలేక, కిందికి దిగలేక రాత్రంతా అవస్థలు పడుతూనే ఉన్నాడు. గురువారం ఉదయం కేకలు వేస్తుండటంతో అటుగా వెళ్లేవారు అతనిని గమనించి, దుకాణం యజమానికి తెలిపారు. ఆయన వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. అంతా కలసి శంకర్ను రక్షించారు. అయితే రేకులు చీరుకుపోయి ఒళ్లంతా గాయాలైన శంకర్ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీఐ శశాంకరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం దుకాణానికి తాళం వేసిన గ్రామస్తులు
గుంటూరు: నివాసాల మధ్య మద్యం దుకాణం నిర్వహిస్తూ.. ప్రజల్ని ఇబ్బందుల పాలు చేస్తుండటాన్ని గ్రామస్తులు దైర్యంగా ఎదిరించారు. మద్యం దుకాణాలను నిరసిస్తూ.. గ్రామస్థులంతా కలిసి మద్యం దుకాణానికి తాళం వేసిన సంఘటన గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలంలో చోటుచేసుకుంది. ఎడ్లపాడు మండల కేంద్రంలో జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని మూసివేయాలని గతంలో పలుమార్లు సూచించినా యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు మద్యం దుకాణాన్ని మూసివేయించి తాళం వేశారు. -
మద్యం పై యుద్ధం
-
షాపు అద్దెకిచ్చారని.. వైఎస్సార్సీపీ కార్యకర్త హత్య
వైన్ షాపు దక్కలేదన్న అక్కసుతో జేసీ వర్గీయుల ఘాతుకం లాటరీలో మద్యం షాపును దక్కించుకున్న వ్యక్తికి షాపును అద్దెకు ఇచ్చారన్న ఆక్రోశంతో జేసీ వర్గీయులు వైఎస్సార్సీపీ కార్యకర్తను హతమార్చారు. ఈ కేసులో సూత్రధారులు బోగతి నారాయణరెడ్డి, అతని కుమారుడు నాగేశ్వరరెడ్డి పరారు కాగా, ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తాడిపత్రి డీఎస్పీ నాగరాజు ఈ వివరాలు తెలిపారు. మద్యం టెండర్లలో యల్లనూరులో కూచివారిపల్లికి చెందిన సుదర్శన్నాయుడుకు షాపు దక్కింది. గతంలో మద్యం దుకాణాన్ని నిర్వహించిన బొగతి నారాయణరెడ్డి దీనిని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఆయన వర్గీయులు తమకు మద్యం షాపులో కనీసం 50 శాతం వాటా ఇవ్వలని.. లేదంటే షాపు పెట్టేందుకు వీల్లేదని సుదర్శన్నాయుడుని డిమాండ్ చేశారు. అందుకు అతను ససేమిరా.. అంటూ సొంతంగా దుకాణాన్ని నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ కార్యకర్త ప్రకాశంశెట్టి తన భవనాన్ని నెలకు రూ.15 వేల చొప్పున అద్దెకు ఇచ్చాడు. దీంతో ఆక్రోశానికి లోనై అదేరోజు రాత్రి కాపు కాచి ఇంటికి వెళ్తున్న ప్రకాశంశెట్టిపై పీర్ల నాగేశ్వరరెడ్డి, ధర్మేంద్ర, రాజశేఖర్, పవన్కుమార్, శంకర్, అబ్దుల్లు దాడి చేసి హతమార్చారు. హతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. హత్యకు కుట్ర పన్నిన శివయ్యతో పాటు మిగతా ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ఇనుప రాడ్లు, వేటకొడవలి, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ప్రధాన కుట్రదారులైన బోగతి నారాయణరెడ్డి, ఆయన కుమారుడు బోగతి నాగేశ్వరరెడ్డిలు పరారీలో ఉన్నారని, త్వరలో వారిని అరెస్టు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే జేసీ నిరసన హత్య కేసులో అరెస్టు చేసిన నిందితులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారని తెలుసుకున్న తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి తన అనుచరులతో వచ్చి ఆందోళనకు దిగారు. వెంటనే నిందితులను కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చడంతో రిమాండ్ ఆదేశించారు. వైద్య పరీక్షలకు వారిని తరలిస్తుండగా పోలీసు వాహనాన్ని సైతం అడ్డుకున్నారు. -
255 షాపులు రూ.92.76 కోట్లు
కొత్త మద్యం పాలసీతో జిల్లాలో మద్యం వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు ఆబ్కారీ శాఖ సిద్ధమవుతోంది. జిల్లావ్యాప్తంగా మద్యం షాపులకు ఏడాది కాలపరిమితితో లెసైన్సులు జారీ చేసే ప్రక్రియను షురూ చేసింది. సోమవారం గెజిట్ ప్రకటన వెలువరించింది. 23వ తేదీన బహిరంగ వేలం ద్వారా దుకాణాలను కట్టబెట్టనుంది..!! సాక్షి ప్రతినిధి, నల్లగొండ :పాత విధానానికి కొత్త సవరణలతో, సరికొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ప్రకటించిన వెంటనే జిల్లా ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాలకు వేలం నిర్వహిస్తోంది. జిల్లాలోని 255 షాపుల వేలానికి సబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. సోమవారం నుంచే మద్యం షాపులకు దరఖాస్తులు విక్రయించ డం మొదలు పెట్టింది. దీనికోసం అప్పుడే టెండరు బాక్సునూ సీల్ చేసింది. ఈ నెల 23న నల్లగొండలోని టౌన్హాలులో మద్యం షాపులకు బహిరంగ వేలం నిర్వహించనున్నా రు. ఏడాది కాలపరిమితి ఉన్న మద్యం షాపు ల కోసంఎన్ని వేల దరఖాస్తులు టెండరు బాక్సులో పడతాయో 23న తెలిసిపోతుంది. జనాభా ప్రాతిపదికన విభజన.. జిల్లా వ్యాప్తంగా 255 షాపులను జనాభా ప్రాతిపదికన విభజించి మూడు శ్లాబులను నిర్ణయించారు. దీని ప్రకారం 91 షాపులకు ఏడాది లెసైన్సు ఫీజు ఒక్కో షాప్నకు రూ.42ల క్షల చొప్పున రూ.38.22కోట్లు, 83 షాపులకు రూ.34లక్షల చొప్పున రూ.28.22 కోట్లు, 81షాపులకు ఏడాది లెసైన్సు ఫీజు రూ.32.50లక్షల చొప్పున నిర్ణయించారు. ఈ లెక్కన మొత్తం 255 షాపులకు జిల్లా నుంచి లెసైన్సు ఫీజు రూపంలోనే ప్రభుత్వానికి రూ.92.76కోట్ల ఆదాయం ఏటా సమకూరనుంది. ఇక, వేలంలో పాల్గొనడానికి ప్రతి దరఖాస్తుదారుడూ రూ.25వేలు చెల్లించాల్సిందే. దరఖాస్తుదారులు పార్టిసిపేషన్ ఫీజుతో పాటు 10శాతం ధరవాతు సొమ్ము చెల్లించాలి. వేలం తర్వాత ఎవరికీ పార్టిసిపేషన్ ఫీజు మొత్తాన్ని తిరిగి వెనక్కి ఇవ్వరు. కేవలం 255 మందికి మాత్రమే దుకాణాలు దక్కుతాయి. ఇక, మిగిలిన వారందరి పార్టిసిపేషన్ ఫీ ప్రభుత్వానికే చెందుతుంది. వేలంలో దుకాణం దక్కించుకున్న వారు మాత్రం లెసైన్సు ఫీజులో 1/3వంతు వెంటనే చెల్లించాల్సి ఉంటుంది. కాగా, 2014-15 మద్యం పాలసీ మేరకు జరుగుతున్న ఈ వేలం తర్వాత కొత్త షాపులు జూలై 1వ తేదీ నుంచి మద్యం విక్రయాలు మొదలు పెడతాయి. కాగా, ప్రభుత్వం ఇంకా, బార్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని, ఆ తర్వాతే బార్లకు కొత్త అనుమతులు మంజూరు చేస్తామని ‘ఆబ్కారీ’ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ నల్లగొండ రూరల్ : మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించేందుకు జిల్లా ఎక్సైజ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 21వ తేదీ లోపు ఆసక్తి గల అభ్యర్థులు మద్యం దుకాణాల కోసం రూ.25 వేల చలాన్ను, వార్షిక లెసైన్స్ ఫీజులో 10 శాతం ఈఎండీని ఎక్సైజ్ సూపరింటెండెంట్ పేరు మీద డీడీ తీయాలని కోరారు. ఈ నెల 23న నల్లగొండ పట్టణంలోని టౌన్హాల్లో లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. దరఖాస్తు ఫారాలను రామగిరిలోని ఎక్సైజ్ కార్యాలయంలో అందజేయాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అనసూర్యదేవి కోరారు. -
దరఖాస్తుల స్వీకరణలో జాగ్రత్త..
ఖమ్మం క్రైం: జిల్లాలో మద్యం షాపుల కేటాయింపునకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ మహేష్బాబు సూచించా రు. జిల్లాలోని 14 ఎక్సైజ్ స్టేషన్ల సీఐలతో ఖమ్మంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఆదివారం డిప్యూటీ కమిషనర్ మహేష్బాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్సైజ్ సూపరింటెం డెంట్ కార్యాలయంలో స్టేషన్కు ఒక టెండర్ బాక్సు చొప్పున ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. సీమాంధ్రలో కలిసే ముంపు మండలాల్లోని తొమ్మిది దుకాణాలను ఇప్పటికే ఏపీబీసీఎల్(ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్)కు అప్పగించామని, జూన్ 2వ తేదీ నుంచి వారికి అక్కడి నుంచే మద్యం సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు. ముంపు మండలాల్లోని దుకాణాల్లో తూర్పు గోదావరి జిల్లాకు రెండు షాపులు, పశ్చిమ గోదావరి జిల్లాకు ఏడు షాపులు కేటాయించామని, అవి తమ పరిధిలోకి రావని తెలిపారు. బూర్గంపాడు పోలీస్స్టేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలు తమ పరిధిలో ఉన్నాయని, ఆ ప్రాంతాలకే తమ స్టేషన్ పరి మితం అవుతుందని తెలిపారు. రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసే సరిహద్దుల ఆధారంగా స్టేషన్ పరిధిని విస్తరిస్తామని అన్నారు. ఈ నెల 21వ తేదీన దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుందని, చివరి రోజున పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని, సాయంత్రం 5గంటల వరకు ఎవరైతే క్యూలో ఉంటారో వారికి కూపన్లు అందజేస్తామని, వారి దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తామని అన్నారు. దరఖాస్తు దారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 23వ తేదీన సీక్వెల్లో డ్రా పద్ధతిలో షాపులను కేటాయిస్తామని, అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సివిల్ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయంపై కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, ఎస్పీ రంగనాథ్లకు సమాచారం అందించామని అన్నారు. వారి సమక్షంలోనే మద్యంషాపుల వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం, కొత్తగూడెం ఎక్సైజ్ సూపరింటెండెంట్లు గణేష్, నరసింహారెడ్డి, సీఐలు పాల్గొన్నారు.