Malavika
-
బుల్లితెర నటి కూతురి అన్నప్రాసన వేడుక.. సోషల్ మీడియాలో వైరల్!
ప్రముఖ బుల్లితెర నటి మాళవిక కృష్ణదాస్ గతేడాది నవంబర్లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బుల్లితెర నటుడు తేజస్ను 2023లో పెళ్లాడిన నటి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్రకటించి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. గత నవంబర్లో పండంటి పాపకు జన్మనిచ్చిన ముద్దుగుమ్మ.. తన కూతురికి రుత్వి తేజస్గా నామకరణం చేసింది. అయితే తాజాగా తన కూతురి అన్నప్రాసన వేడుకను గ్రాండ్గా నిర్వహించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.కాగా.. టీవీ సీరియల్స్, టెలివిజన్ డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ జూనియర్ 2 ద్వారా మలయాళ కుట్టి మాళవిక కృష్ణదాస్ ఫేమ్ తెచ్చుకున్నారు. అంతేకాకుండా మాళవిక కృష్ణదాస్ మలయాళంలో పలు టీవీ సీరియల్స్లోనూ నటించింది. ఆ తర్వాత మాళవిక కృష్ణదాస్, తేజస్ జ్యోతి ప్రముఖ రియాలిటీ షో నాయికా నాయకన్లో కంటెస్టెంట్స్గా పాల్గొన్నారు. ఆ షో ద్వారానే మరింత ఫేమస్ అయ్యారు. రియాలిటీ షోలో పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Malavika Krishnadas (@malavika_krishnadass) View this post on Instagram A post shared by Malavika Krishnadas (@malavika_krishnadass) -
‘ఓ భామ అయ్యో రామ’ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
Malavika Mohanan: రాజాసాబ్లో ప్రభాస్తో జోడీ కట్టిన బ్యూటీ.. ఎంతందంగా ఉందో!(ఫోటోలు)
-
బుల్లితెర నటి కూతురి నామకరణ వేడుక.. ఏ పేరు పెట్టారంటే?
-
బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో భర్త పోస్ట్!
ప్రముఖ బుల్లితెర నటి మాళవిక కృష్ణదాస్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గతంలో ప్రెగ్నెన్సీ ప్రకటించిన నటి.. సోషల్ మీడియా వేదికగా చాలాసార్లు బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. బిడ్డ పుట్టిన విషయాన్ని ఆమె భర్త తేజస్ జ్యోతి ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. బిడ్డ చేతిని పట్టుకున్న ఫోటోను ఆయన పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బుల్లితెర జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. మాళవిక కృష్ణదాస్, తేజస్ జ్యోతి బుల్లితెర జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరు ప్రముఖ రియాలిటీ షో నాయికా నాయకన్లో కంటెస్టెంట్స్గా పాల్గొన్నారు. ఆ షో ద్వారానే మరింత ఫేమస్ అయ్యారు. రియాలిటీ షోలో పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత మాళవిక, తేజస్ పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ బుల్లితెర ప్రేమజంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ కొట్టేశారు.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే మాళవిక ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీపై పోస్టులు పెడుతూనే ఉంటోంది. బేబీ షవర్ వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. తన భర్తతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. కాగా.. మాళివిక కృష్ణదాస్ మలయాళంలో పలు టీవీ సీరియల్స్లోనూ నటించింది. View this post on Instagram A post shared by Malavika Krishnadas (@malavika_krishnadass) -
రన్నరప్ మాళవిక
సార్బ్రుస్కెన్ (జర్మనీ): హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 34వ ర్యాంకర్ మాళవిక 10–21, 15–21తో ప్రపంచ 36వ ర్యాంకర్ మియా బ్లిచ్ఫెల్ట్ (డెన్మార్క్) చేతిలో ఓటమి చవిచూసింది. మహారాష్ట్రకు చెందిన 23 ఏళ్ల మాళవికకు 7,980 డాలర్ల (రూ. 6 లక్షల 70 వేలు)ప్రైజ్మనీతోపాటు 5950 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో రన్నరప్గా నిలువడం మాళవికకు ఇది రెండోసారి. 2022లో జరిగిన సయ్యద్ మోదీ సూపర్–300 టోర్నీ ఫైనల్లో పీవీ సింధు చేతిలో ఓడిపోయి మాళవిక రన్నరప్గా నిలిచింది. -
హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో మాళవిక
సార్బ్రుకెన్ (జర్మనీ): భారత యువ షట్లర్ మాళవిక బన్సోద్ హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్కు దూసుకెళ్లింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆరో సీడ్ మాళవిక 23–21, 21–18తో జూలియా జాకబ్సన్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. 44 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన మాళవిక ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ముందంజ వేసింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో ఏడో సీడ్ మియా బ్లిచ్ఫెల్ట్ (డెన్మార్క్)తో మాళవిక తలపడనుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఆయుశ్ షెట్టి పరాజయం పాలయ్యాడు. అన్సీడెడ్ ఆయుశ్ షెట్టి 17–21, 13–21తో క్రిస్టో పొపొవ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో 28వ స్థానంలో ఉన్న పొపొవ్పై 51వ ర్యాంకర్ ఆయుశ్ ఆధిక్యం ప్రదర్శించలేకపోయాడు. 49 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్లో చక్కటి ప్రదర్శనతో ప్రత్యర్థికి దీటైన పోటీనిచ్చిన ఆయుశ్... రెండో గేమ్లో అదే జోరు కొనసాగించలేకపోయాడు. -
కలల పంటకోసం ఎదురు చూపులు : అందమైన మెటర్నిటీ షూట్
టీవీ సీరియల్స్, టెలివిజన్ డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ జూనియర్ 2 ద్వారా పాపులర్ అయిన మలయాళ కుట్టి మాళవిక కృష్ణదాస్ త్వరలో తల్లి కాబోతుంది. ఈ సందర్భంగా భర్తతో కలిసి మెటర్నిటీ ఫోటో షూట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. మాళవిక క్లాసికల్ డేన్సర్ కూడా. నటనతోపాటు, శాస్త్రీయ నృత్యంలో కూడా అనేక అవార్డులు రివార్డులుగెల్చుకుంది. 2023లో ‘నాయికా నాయకన్’ కో-కంటెస్టెంట్ తేజస్ జ్యోతిని వివాహం చేసుకుంది. ఇపుడు ఈ జంట తమ తొలిబిడ్డకు జన్మనివ్వబోతోంది. -
హైదరాబాద్ హెచ్ఐసీసీలో.. హైలైఫ్ ఎగ్జిబిషన్!
మాదాపూర్: ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వ్రస్తాభరణాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో మూడు రోజుల పాటు కొనసాగనున్న హైలైఫ్ ఎగ్జిబిషను నటి శ్రవంతి చొకరపు, మాలవిక శర్మ నిర్వాహకుడు డొమినిక్తో కలసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివాహాది శుభకార్యాలకు ప్రత్యేక డిజైన్లతో కూడిన వ్రస్తాభరణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దేశంలోని 350 మంది డిజైనర్లు రూపొందించిన వ్రస్తాభరణాలు స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. గృహాలంకరణ ఉత్పత్తులు, వధువరులకు ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. నటి ప్రీతి సుందర్ తో పాటు పులవురు మోడల్స్, డిజైనర్లు పాల్గొన్నారు. -
ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న హీరోయిన్ మాళవిక శర్మ (ఫొటోలు)
-
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
ప్రముఖ మలయాళ నటుడు జయరాం కుమార్తె మాళవిక ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టింది. జయరాం-పార్వతి ముద్దులక కూతురైన మాళివిక నవనీత్ను పెళ్లాడింది. వీరి వివాహం బంధువులు, సన్నిహితుల సమక్షంలో త్రిసూర్లోని గురువాయూర్ ఆలయంలో చాలా సింపుల్గా జరిగింది. అయితే తాజాగా వీరి వివాహా రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు.కొచ్చిలోని ప్రముఖ హోటల్లో మాళవిక-నవనీత్ రిసెప్షన్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి మలయాళ సినీ తారలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈవేడుకలో మమ్ముట్టి, దిలీప్, జాకీ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనాక్షి, శోభన, ఖుష్బు సుందర్ లాంటి ప్రముఖల తారలందరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. .@mammukka #yusufAli @PrithviOfficial #Supriya @ #Jayaram’s daughter Malavika’s wedding reception in Kochi pic.twitter.com/ff1VoT9mVk— sridevi sreedhar (@sridevisreedhar) May 5, 2024 -
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు
ప్రముఖ నటుడు జయరాం ఇంట పెళ్లి బాజాలు మోగాయి. జయరాం- పార్వతి దంపతుల కూతురు మాళవిక పెళ్లి ఎంతో సింపుల్గా జరిగింది. పాలక్కడ్కు చెందిన నవనీత్ గిరీశ్తో ఏడడుగులు వేసింది. శుక్రవారం నాడు కేరళలోని గురువాయూర్ ఆలయంలో జరిగిన ఈ వివాహానికి ఇరు కుటుంబసభ్యులు సహా బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కేరళ సీఎం పినరయి విజయన్ సహా ఇతర రాజకీయ, సినీ సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వరుడు నవనీత్ గిరీశ్ విషయానికి వస్తే.. అతడు ప్రస్తుతం యూకేలో చార్టెడ్ అకౌంటెంట్గా పని చేస్తున్నాడు.మాళవిక విషయానికి వస్తే.. ఆమె వేల్స్ దేశంలో స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పూర్తి చేసింది. మాళవిక- నవనీత్ల ఎంగేజ్మెంట్ కర్ణాటకలోని మడికెరిలో గతేడాది డిసెంబర్లో జరిగింది. -
నకిలీ సబ్ఇన్స్పెక్టర్ మాళవికను పోలీసులు అరెస్ట్ చేశారు
-
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు: హీరో గోపీచంద్
‘‘భీమా’ పక్కా కమర్షియల్ ప్యాక్డ్ మూవీ. నేను చేసిన భీమా పాత్రలో చాలా ఇంటెన్సిటీ ఉంటుంది. ప్రేమ, ఎమోషన్స్, రొమాన్స్.. ఇలా అన్ని అంశాలున్నాయి. ఈ కథలో సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ని హర్ష అద్భుతంగా చూపించాడు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్లో అద్భుతమైన భావోద్వేగం ఉంటుంది. సినిమా చూసి బయటికి వచ్చాక ప్రేక్షకుల మనసులో భీమా నిలిచిపోతాడనే నమ్మకం ఉంది’’ అని హీరో గోపీచంద్ అన్నారు. ఎ. హర్ష దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా, ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భీమా’. కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ పంచుకున్న విశేషాలు. ► ‘భీమా’ సహనిర్మాత శ్రీధర్గారు కోవిడ్ సమయంలో దర్శకుడు హర్షని నాకు పరిచయం చేశారు. అప్పుడో కథ చెప్పాడు హర్ష.. కథ బావుంది కానీ ఆ సమయంలో చేయకూడదని అనిపించింది. పోలీస్ నేపథ్యంలో ఏదైనా వైవిధ్యమైన కథ ఉంటే చెప్పమన్నాను. ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకొన్న హర్ష ఆ తర్వాత వచ్చి ‘భీమా’ కథ చెప్పాడు. చాలా బాగా నచ్చడంతో ఓకే చెప్పాను. ► నేను గతంలో పోలీసు పాత్రలు చేశాను. ‘గోలీమార్’లో డిఫరెంట్ కాప్. ‘ఆంధ్రుడు’ లవ్ స్టోరీ నేపథ్యంలో నడుస్తుంది కానీ దాని నేపథ్యం పోలీసు కథే. ‘శౌర్యం’ కూడా భిన్నమైన కథ. ఈ మూడు చిత్రాలకు పూర్తి వైవిధ్యమైన పోలీస్ పాత్రని ‘భీమా’లో చేశాను. ఈ పోలీసు కథలో సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ చాలా కొత్తగా ఉంటుంది.. అదే నాకు చాలా ఆసక్తిని కలిగించింది. హర్ష కన్నడలో చాలా అనుభవం ఉన్న దర్శకుడు. ‘భీమా’ని అద్భుతంగా తీశాడు.. స్క్రీన్ ప్లే చాలా ఆసక్తిగా ఉంటుంది. ► ‘భీమా’ పరశురామ క్షేత్రంలో జరిగే కథ. ట్రైలర్లో చూపించినట్లు అఘోరాలు, కలర్ ప్యాలెట్, నేపథ్య సంగీతం వల్ల ‘అఖండ’ సినిమాతో పోలుస్తున్నారు. కానీ, ఇది పూర్తిగా వైవిధ్యమైన కథ. ఈ సినిమాలో శివుని నేపథ్యం ఉంది. పైగా సినిమా కూడా మహా శివరాత్రికి వస్తోంది. అయితే దీన్ని మేం ముందుగా ప్లాన్ చేయలేదు.. అలా కలిసొచ్చింది. శివుని ఆజ్ఞ అనుకుంటాను. ► నిర్మాత రాధామోహన్, నా కాంబినేషన్లో ‘పంతం’ (2018) సినిమా వచ్చింది. అప్పటి నుంచి ఆయన, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ‘పంతం’ వాణిజ్య పరంగా సక్సెస్ అయినా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కాలేదు. కానీ, ‘భీమా’తో తప్పకుండా హిట్ సాధిస్తామనే నమ్మకం ఉంది. ఈ సినిమాని చాలా గ్రాండ్గా నిర్మించారాయన. ► మా నాన్న (డైరెక్టర్ టి. కృష్ణ)తో పాటు ఆ తరంలోని దర్శకులు జనాలతో మమేకం అయ్యేవారు. అలా ప్రజల సాధక బాధకాలు, సమస్యలు తెలుసుకుని కథ రాసుకుని, సామాజిక బాధ్యతతో సినిమాలు తీసి హిట్ సాధించేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. శంకర్గారి లాంటి ఒకరిద్దరు దర్శకులు తప్ప మిగిలిన వారు సమాజం, ప్రజల నేపథ్యంలో కథలు రాయడం లేదు. సొసైటీ బ్యాక్డ్రాప్ని ఎంచుకుని సరైన విధానంలో తెరపై చూపించగలిగితే ఇప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తారు. దర్శకత్వం అనేది చాలా కష్టమైన పని.. అందుకే నాకు ఆ ఆలోచన లేదు. ► చిత్ర పరిశ్రమలో దాదాపు 22 ఏళ్ల ప్రయాణం నాది.. ఇన్నేళ్ల జర్నీ హ్యాపీగా ఉంది కానీ నటుడిగా పూర్తిగా సంతృప్తి పడటం లేదు. ఒక నటుడికి సంతృప్తి అనేది ఎప్పటికీ ఉండదు.. ఎప్పటికప్పుడు కొత్తగా చేయాలనే తపన ఉంటుంది. ప్రభాస్, నేను కలిసి సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. కానీ, ఆ చాన్స్ రాలేదు.. వస్తే మాత్రం తప్పకుండా నటిస్తాం. ప్రస్తుతం శ్రీను వైట్లగారి దర్శకత్వంలో నేను చేస్తున్న సినిమా 30 శాతం పూర్తయింది. ఆ తర్వాత బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడుగార్లతో ఓ చిత్రం, యూవీ క్రియేషన్స్లో ఓ సినిమా చేయాల్సి ఉంది. -
'చాలా బాగుంది' హీరోయిన్ ఎలా మారిపోయిందో చూశారా?
శ్వేత కొన్నూర్ మీనన్.. ఈ పేరు చెప్పగానే ఎవరబ్బా అనుకునేరు? హీరోయిన్ మాళవిక అసలు పేరిది! 19 ఏళ్ల వయసులోనే ఉన్నాయ్ తేడి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్స్టర్ కొట్టింది. రోజావనం మూవీతో తన సత్తా నిరూపించుకుంది. ఇంకేముంది తెలుగు చలనచిత్ర పరిశ్రమ రారమ్మని పిలిచింది. చాలా బాగుంది సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది. దీవించండి, నవ్వుతూ బతకాలిరా, ప్రియ నేస్తం, అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమాలతో తెలుగులో టాప్ హీరోయిన్గా వెలుగొందింది. రీఎంట్రీకి సిద్ధం తెలుగు, తమిళంతోపాటు మలయాళ, హిందీ, కన్నడ సినిమాలు కూడా చేసింది. 2009లో చివరగా ఆరుపాడై సినిమా చేసింది. అందులో అతిథి పాత్రలో కనిపించింది. 2007లో సుమేష్ మీనన్ను పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయింది. చాలాకాలానికి గోల్మాల్ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. 44 ఏళ్ల వయసులోనూ తన శరీరాన్ని ఫిట్గా ఉంచుకుంటోందీ బ్యూటీ. మరింత బలంగా మార్చుతుంది తాజాగా తన సోషల్ మీడియాలో యోగా చేస్తున్న ఫోటోను షేర్ చేసింది. ఈ జర్నీ అంత సులువేం కాదు.. కానీ యోగా పట్ల నీకు ఎంత నిబద్ధత ఉందనేది తెలుస్తుంది. రోజూ యోగా మ్యాట్ నేలపై పరచడమనేది మొక్కకు నీళ్లు పోయడంలాంటిది. ఇది మిమ్మల్ని మరింత బలంగా, ఫ్లెక్సిబుల్గా మార్చుతుంది. కఠినతరమైన పరిస్థితుల్లో కూడా ఒక్కసారి యోగా చేసి గాఢంగా శ్వాస తీసుకుంటే అది మీ పురోగతికి ఉయోగపడుతుంది. నన్ను నమ్మండి.. ఒక్కసారి కమిట్ అయ్యాక దాన్ని వదిలేయకూడదు.. కట్టుబడి ఉండాలి. ప్రాక్టీస్ కొనసాగిస్తూనే ఉండాలి. అప్పుడు వచ్చే సానుకూల మార్పులను మీరే చూస్తారు. నన్ను నమ్మండి.. ఇదే నిజం అని క్యాప్షన్లో రాసుకొచ్చింది. కాగా మాళవిక.. తరచూ తన వర్కవుట్, యోగా వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) చదవండి: ఆ సినిమాలో నేనూ హీరోయిన్నే.. కానీ నన్ను తీసేశారు! -
గల్లీ సౌండుల్లో భీమా
గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం ‘భీమా’. ఎ.హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లు. కేకే రాధామోహన్ నిర్మించిన ‘భీమా’ మార్చి 8న రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘గల్లీ సౌండుల్లో..’ అంటూ సాగే రెండో పాటని విడుదల చేశారు. రవి బస్రూర్, సంతోష్ వెంకీ రాసిన ఈ పాటను సంతోష్ వెంకీ పాడారు. ‘‘గోపీచంద్ పాత్ర గురించి చెప్పే ట్రాక్ ఇది. ఈ పాట మాస్ని అల రించేలా ఉంటుంది’’ అన్నారు మేకర్స్. -
సంక్రాంతి మాకెంతో ప్రత్యేకం
‘సంక్రాంతి పండగ అంటే ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి’ అంటున్నారు పాయల్ రాజ్పుత్. ‘సంక్రాంతికి ఫుల్ ఎనర్జీతో భోగి మంటలు వేస్తుంటాను’ అన్నారు మానసా చౌదరి. ‘సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేయడమంటే చాలా ఇష్టం’ అంటున్నారు మాళవికా శర్మ. ఇలా సంక్రాంతిని తాము ఎలా జరుపుకొంటామో అంటూ ఈ కథానాయికలు సాక్షితో పంచుకున్న విశేషాలు.. ఎన్నో జ్ఞపకాలు ఉన్నాయి – పాయల్ రాజ్పుత్ నన్ను అభిమానించే తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. పంజాబీ ఆడియన్స్ కు హ్యాపీ లోహ్రీ. సంక్రాంతి పండగ అంటే నాకు ఎన్నో జ్ఞపకాలు గుర్తొస్తాయి. ప్రతి ఏడాది సంక్రాంతిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. పూజలు చేస్తాం.. ఇష్టమైన వంటకాలు చేసుకుంటాం. చిన్న తనంలో సంక్రాంతి పండక్కి గాలిపటాలను ఎగరవేసేదాన్ని. కానీ, నా జీవితం ఇప్పుడు చాలా మారిపోయింది. కాబట్టి గాలిపటాలను ఎగరవేసే సమయంలో మనలో కలిగే ఆ ఆనందపు అనుభూతిని కొంతకాలంగా మిస్ అయ్యాను. ఈ సారి ఢిల్లీలో నా స్నేహితులతో కలిసి గాలిపటాలను ఎగర వేయాలని ప్లాన్ చేస్తున్నాను. నా సిబ్బందిలో కొంతమంది హైదరాబాదీలు ఉన్నారు. వారితో పాటు సంక్రాంతిని నేను సెలబ్రేట్ చేసుకున్న అనుభవాలు ఉన్నాయి. నేను భోజన ప్రియురాలిని. ప్యూర్ వెజిటేరియన్ ని. మసాలా కిచిడీ, లడ్డు అంటే చాలా ఇష్టం. ఇలా మా అమ్మగారు పండక్కి చేసిన వంటకాలను ఇష్టంగా తింటాను. ఇక నేను నటించిన తాజా చిత్రం ‘మంగళవారం’ మంచి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు.. నా అభిమానులకు కూడా థ్యాంక్స్. ఓ నటిగా మంచి కథలను ఎంచుకోవాలనుకుంటున్నాను. గాలిపటాలు ఎగరవేయడం చాలా ఇష్టం – మాళవికా శర్మ సంక్రాంతి అంటే ముఖ్యంగా రైతుల పండగ. వారు ఎంతోకష్టపడి పండించిన పంటలు ఈ సంక్రాంతికి వారి చేతికి వస్తాయి. సూర్యభగవానుడికి పూజలు చేయడంతో మా సంక్రాంతి మొదలవుతుంది. మా అమ్మమ్మ మాకు ప్రతి సంక్రాంతికి కొత్త దుస్తులు ఇస్తుంటారు. నువ్వుల లడ్డూలు ఇస్తారు. లక్కీగా మా అమ్మమ్మగారి బర్త్ డే కూడా సంక్రాంతి రోజునే. మేము కూడా స్వీట్స్ను పంచిపెడతాం. మేం చేయగలిగినంతలో పేదలకు సాయం చేస్తుంటాం. సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేయడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరిలానే నాకు గాలిపటాలను ఎగరవేయడం చాలా ఇష్టం. ఆకాశంలో కనిపిస్తున్న రంగు రంగుల గాలిపటాలు.. భూమిపై రైతులు పండిస్తున్న వివిధ రకాల పంటలకు ప్రతీకగా నేను భావిస్తుంటాను. నాపై తెలుగు ప్రేక్షకుల ప్రేమ, అభిమానాలకు చాలా రుణపడి ఉంటాను. ముంబై నా జన్మభూమి అయితే హైదరాబాద్ నా కర్మభూమి. ఎందుకంటే.. నేను ఇక్కడే మూవీస్ చేస్తున్నాను. నేను నటించిన గోపీచంద్గారి ‘భీమా’, సుధీర్బాబుగారి ‘హరోంహర’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాల్లో నా పాత్ర చాలా ఎగై్జటింగ్గా ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చే సినిమాలే చేయాలనుకుంటున్నాను. సంక్రాంతి నాకు చాలా ప్రత్యేకం – మానసా చౌదరి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పుత్తూరు స్వగ్రామం. నాన్న మధుసూదన్ నాయుడు వ్యాపారం నిమిత్తం చెన్నైలో స్థిరపడ్డారు. మేము చెన్నైలో ఉన్నప్పటికీ ప్రతి ఏడాది సంక్రాంతికి కచ్చితంగా ఊరు వెళతాం. అక్కడ నాన్న, అమ్మ సుజాత, నేను, తమ్ముడు చేతన్ కలిసి మా బంధువులతో ఎంతో సంతోషంగా సంక్రాంతి జరుపుకుంటాం. కానీ, ఈ ఏడాది ఊరు వెళ్లలేకపోయాను. మా బంధువులు, కజిన్స్ ఫోన్ చేసి.. ‘ఏంటి? హీరోయిన్ అయిపోయావని ఊరికి రావా?’ అంటున్నారు. అయితే ఆదివారం భోగి పండగని చెన్నైలోనే జరుపుకొన్నాను. మేము ఉన్న వీధిలో ఎక్కువ మంది తెలుగువాళ్లు ఉంటారు.. సెలబ్రేట్ చేసుకుంటాం. ► సంక్రాంతి పండగలో తొలిరోజు వచ్చే భోగి అంటే మరీ ఇష్టం. తొలిరోజు కాబట్టి ఫుల్ ఎనర్జీతో ఉంటా. ఉదయాన్నే లేచి పెద్ద భోగిమంటలు వేసేవాళ్లం. ఆ తర్వాత ఆయిల్ బాత్ చేసి, కుటుంబమంతా కలిసి సరదాగా మాట్లాడుకునేవాళ్లం.. థియేటర్కి వెళ్లి సినిమాలు చూస్తాం. ఆ తర్వాత మకర సంక్రాంతిన పొంగల్ చేయడం ఇష్టం. నేను నాన్ వెజ్ బాగా తింటాను. ప్రత్యేకించి నాటుకోడి కూరతో రాగిసంకటి తినడం చాలా ఇష్టం. అలాగే మటన్ నా ఫేవరేట్. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. ఎవరైనా గాలిపటాలు ఎగర వేస్తుంటే చూస్తుంటాను. కానీ నేను గాలిపటాలు ఎగరవేయలేదు. తెలుగులో ‘బబుల్గమ్’ సినిమాకి ముందే నాకు కొన్ని అవకాశాలు వచ్చాయి.. కానీ, చేయలేదు. ‘బబుల్గమ్’ తర్వాత కథలు వింటున్నాను. అయితే నటనకు మంచి అవకాశం ఉన్న పాత్రలే చేయాలనుకుంటున్నాను. ఈ ఏడాది కెరీర్లో ఫుల్ ఎనర్జీతో దూసుకెళ్లాలనుకుంటున్నాను. -
Malavika Jayaram Engagement: అల వైకుంఠపురములో నటుడు జయరాం కూతురి నిశ్చితార్థం (ఫొటోలు)
-
అల వైకుంఠపురములో నటుడి ఇంట పెళ్లి సందడి.. గ్రాండ్గా ఎంగేజ్మెంట్!
మాలీవుడ్ స్టార్ కపుల్ జయరామ్, పార్వతిల కూతురు మాళవిక నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన ప్రియుడైన నవనీత్ గిరీష్తో మాళవిక ఎంగేజ్మెంట్ చేసుకుంది. కాగా.. ఇటీవలే మాళవిక ఇన్స్టాగ్రామ్ ద్వారా తమ రిలేషన్ గురించి అఫీషియల్గా ప్రకటించారు. ప్రియుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అతన్ని అభిమానలకు పరిచయం చేసింది. కాగా.. ఆమె తల్లిదండ్రలైన జయరాం, పార్వతి ఇద్దరు నటీనటులే. ఆమె తండ్రి జయరాం టాలీవుడ్ మూవీలోనూ నటించారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రంలో జయరాం కీలక పాత్ర పోషించారు. మలయాళంలో స్టార్ అయిన జయరాం ఈ ఏడాది శివరాజ్కుమార్ నటించిన ఘోస్ట్ చిత్రంలో నటించారు. అంతే కాకుండా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-1లోనూ కనిపించారు. అయితే నెల రోజుల క్రితమే జయరాం కుమారుడు కాళిదాస్ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కాళిదాస్ మోడల్, తన ప్రియురాలైన తరిణిని పెళ్లాడనున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా 2021లో మూడో రన్నరప్గా తరిణి నిలిచింది. అయితే కుమారుడు కాళిదాస్ పెళ్లి కంటే ముందే మాళవిక పెళ్లి జరుగుతుందని పార్వతి వెల్లడించింది. View this post on Instagram A post shared by Chakki (@malavika.jayaram) View this post on Instagram A post shared by Kochi Raaj (@kochiraaj) -
కిడ్నాప్ చేయడం ఓ కళ
చైతన్యా రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవికా సతీశన్ ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘పారిజాత పర్వం’. కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్ అనేది ట్యాగ్ లైన్ (కిడ్నాప్ చేయడం అనేది ఓ కళ). సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి. ఒక పోస్టర్లో చైతన్యా రావు, సునీల్, శ్రద్ధా దాస్, శ్రీకాంత్ అయ్యంగార్లు చేతిలో గన్తో, ఇతర పాత్రలు ఆశ్చర్యంగా చూస్తున్నట్లు కనిపించారు. ఇంకో పోస్టర్లో శ్రద్ధా దాస్ చేతిలో గన్తో స్టయిలిష్గా కనిపించారు. -
వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న అలనాటి హీరోయిన్ రీ ఎంట్రీ
సీనియర్ నటి మాళవిక గుర్తుందా? 1990- 2000 దశకం కిడ్స్కు ఈ భామను అంత ఈజీగా మరిచిపోలేరు. తెలుగులో శ్రీకాంత్,వడ్డే నవీన్ సూపర్ హిట్ సినిమా అయిన 'చాలాబాగుంది' చిత్రంతో వెండితెరపై మెరిసింది. తర్వాత చంద్రముఖి,ఆంజినేయులు వంటి చిత్రాల్లో మెరిసింది. తమిళంలో చిత్తిరం పేసుదడి చిత్రంలో వాలమీనుక్కమ్ అనే ప్రత్యేక పాటలో మాళవిక డాన్స్ చాలా పాపులరైంది. ఈమె 1999లో అజిత్కు జంటగా ఉన్నై తేడా చిత్రం ద్వారా కథానాయికిగా కోలీవుడ్లో పరిచయమైంది. ఆ చిత్రం విజయంతో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లోనూ మాళవిక నాయకిగా నటించి పాపులర్ అయ్యింది. తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువ ఛాన్సులు ఆమెకు దక్కాయి. అలా ఐదేళ్లపాటు కథానాయకిగా కొనసాగిన ఈమెకు ఆ తర్వాత ఆశించిన అవకాశాలు రాలేదు. అందుకు కారణం ఆమైపె వివాదాస్పద నటి అని ముద్ర పడడమేననే ప్రచారం జరిగింది. దీంతో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. 2007లో సుమేష్ మీనన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయింది మాళవిక. కాగా ఇటీవల తన ఇన్స్ట్రాగామ్లో గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తూ యాక్టివ్గా ఉంటున్న ఆమె మళ్లీ చిత్రాల్లో నటించడానికి రెడీ అనే సిగ్నల్ ఇచ్చింది. సుమారు 14 ఏళ్ల తర్వాత ఆమె రీ ఎంట్రీకి రెడీ అయింది. అందులో భాగంగా తమిళ్లో సూపర్ అనే కార్యక్రమం ద్వారా బుల్లితెరలోకి ఎంట్రీ ఇచ్చింది. విజయ్ టీవీలో ప్రసారమవుతున్న 'ఊ సొల్రియా ఊ ఊ సొల్రియా' అనే కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొంటోంది. త్వరలోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో రీ ఎంట్రీ అయ్యే అవకాశం లేకపోలేదు. View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) -
గోపీచంద్కు జోడీగా ఇద్దరు హీరోయిన్లు, ఎవరంటే?
గోపీచంద్ టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘భీమా’. కన్నడ దర్శకుడు ఎ. హర్ష తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్ ఫీసర్ భీమ పాత్రలో నటిస్తున్నారు గోపీచంద్. భీమాకు జోడీగా ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మలను ఎంపిక చేసినట్లు గురువారం చిత్రబృందం వెల్లడించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ‘‘కుటుంబ భావోద్వేగాలు మిళితమైన యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘భీమా’ రూపొందుతోంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కేజీఎఫ్ నటి.. ఫోటో వైరల్
కన్నడ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి మాళవిక అవినాష్. శాండల్వుడ్లో సినిమాలతో పాటు సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఈమె కేజీఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమాలో సీనియర్ ఉమెన్ జర్నలిస్ట్ పాత్రలో నటించి పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందింది. ప్రస్తుతం పలు రియాలిటీ షోలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తూ బిజీబిజీగా గడిపేస్తుంది. అయితే తాజాగా మాళవిక అవినాష్ అనారోగ్యం బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఎవరికైనా మైగ్రేన్ సమస్య ఉంటే తేలికగా తీసుకోవద్దు. లేదంటూ నాలాగే ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. పనాడోల్, నెప్రోసిమ్ వంటి సాంప్రదాయ ఔషధం తీసుకోవడంతో పాటు నిర్లక్ష్యం చేయకుండా త్వరగా డాక్టర్ని సంప్రదించండి అంటూ నెటిజన్లను కోరింది. ఈ సందర్భంగా హాస్పిటల్ బెడ్పై ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్గా మారింది. -
అందమైన అల్లికల శారీలో మెస్మరైజ్ చేస్తున్న మాళవిక! చీర ధర?
Malavika Sharma- Fashion Brands: ‘నేల టికెట్’ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయింది మాళవిక శర్మ. చేసిన కొద్ది సినిమాల్లోనే వైవిధ్యమైన పాత్రలు పోషించి నటన పట్ల తనకున్న అభిరుచిని చాటుకుంది. ఫ్యాషన్ పట్లా తన టేస్ట్ భిన్నమైనదేనని తెలుస్తోంది ఆమె ఫాలో అవుతున్న ఈ బ్రాండ్స్ను చూస్తుంటే! స్తోత్రం సంప్రదాయ కట్టుకు పాశ్చాత్య సౌందర్యాన్ని తీసుకు రావడంలో ‘స్తోత్రం’ పెట్టింది పేరు. అంతేకాకుండా అల్లికలు, కుందన్ వర్క్స్తో అందమైన డిజైన్స్ రూపొందించడంలోనూ ఈ బ్రాండ్ది ప్రత్యేక ముద్ర. దీని డిజైన్స్కు విదేశాల్లోనూ మంచి డిమాండే ఉంది. అయినా సరసమైన ధరల్లోనే లభిస్తాయి. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్లోనూ కొనుగోలు చేసే వీలుంది. PC: Malavika Sharma Instagram ఫైన్ షైన్ జ్యూయెలరీ చెన్నైకి చెందిన అనిల్ కొఠారి .. తొలుత తన కెరీర్ను ‘బ్రౌన్ ట్రీ – యువర్ హెల్త్ ఫుడ్ స్టోర్ ’ అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా మొదలుపెట్టాడు. కొద్ది నెలల్లోనే అదే కంపెనీకి సీఈఓగా ఎదిగి సక్సెస్ఫుల్ బిజినెస్మన్గా నిలిచాడు. తర్వాత అతని దృష్టి ఫ్యాషన్ రంగం మీదకు మళ్లింది. అప్పుడే ఈ ‘ఫైన్ షైన్ జ్యూయెలరీ’ని ప్రారంభించాడు. అనేక ఫ్యాషన్ ఈవెంట్లకు తన బ్రాండ్ నగలను స్పాన్సర్ చేశాడు. ప్రధాన కస్టమర్లు సెలబ్రిటీలే. అందుకే వీటి ధరలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఆన్లైన్లోనూ లభ్యం. PC: Malavika Sharma Instagram బ్రాండ్ వాల్యూ చీరబ్రాండ్: స్తోత్రం ధర: రూ. 68,500 జ్యూయెలరీ బ్రాండ్: ఫైన్ షైన్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. అందుకే లాయర్ కావాలనుకున్నా.. నల్లరంగు అంటే చాలా ఇష్టం. అందుకే లాయర్ కావాలనుకున్నా.. – మాళవిక శర్మ -దీపిక కొండి చదవండి: Kajol: 48 ఏళ్ల వయసులోనూ ఆకట్టుకునే రూపం.. ఈ మూడు పాటించడం వల్లే అంటున్న కాజోల్ -
‘ఆదిపురుష్ దర్శకుడికి రామాయణం తెలియదా?’ బీజేపీ మహిళా నేత విమర్శలు
ఇటీవల విడుదలైన ప్రభాస్ ఆదిపురుష్ టీజర్కు మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది టీజర్ అద్బుతంగా ఉందంటూ ప్రశసిస్తుండగా మరికొందరు కార్టూన్ సినిమా మాదిరి ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయోధ్య వేదికగా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన టీజర్ నిరాశ పరిచిందంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ డైరెక్టర్ ఓం రౌత్పై బీజేపీ అధికార ప్రతినిధి, నటి మాళవిక అవినాష్ మండిపడ్డారు. ఓం రౌత్ రామాయణం గురించి అధ్యయనం చేయకుండానే సినిమా తీశారంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చదవండి: రిపోర్టర్పై నటి హేమ ఫైర్.. ‘భక్తి కోసం వచ్చా కాంట్రవర్సికి కాదు’ ఆమె ట్వీట్ చేస్తూ.. ‘లంకకు చెందిన రావణుడు శివ భక్త బ్రాహ్మణుడు. 64 కళల్లో ప్రావీణ్యం సంపాదించాడు. వైకుంఠాన్ని కాపాడుతున్న జయ శాపం కారణంగా రావణునిగా అవతరించాడు. కానీ మన చరిత్రను, రామాయణంను బాలీవుడ్ దర్శకులు తప్పుగా చూపిస్తున్నారు. ఇక దీన్ని ఆపండి’ అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. అలాగే ‘‘బహుశా డైరెక్టర్ ఓం రౌత్. వాల్మీకి రామాయణం, తులసీదాసు రామాయణంలో రావణుడి పాత్ర ఎలా ఉంటుందో అధ్యయనం చేయలేదనుకుంటా. కనీసం తెలుగు, తమిళంలో ఇదివరకు తెరకెక్కిన పౌరాణిక సినిమాల్లో రావణుడి పాత్ర ఎలా ఉందో పరిశీలించాల్సింది. ‘భూకైలాస’లో సీనియర్ ఎన్టీఆర్ లేదా సంపూర్ణ రామాయణంలో ఎస్వీ రంగారావు చేసిన రావణుడి పాత్రను చూసి అర్థం చేసుకోవచ్చు. టీజర్లో రావణుడు నీలి కళ్లతో లెదర్ జాకెట్ వేసికున్నట్లు చూపించారు. స్వేచ్ఛా ముసుగులో చరిత్రను వక్రీకరించకూడదు. రామాయణం మన దేశ ప్రజల నాగరికతను కాపాడుతుంది. అలాంటి రామాయణాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కిస్తున్న సినిమాలో రావణుడి పాత్రను వక్రీకరించినందుకు చాలా బాధగా ఉంది’’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. కాగా ఈ టీజర్ రిలీజైన అనంతరం ఇది యానిమేటెడ్ చిత్రంలా ఉందని, వీఎఫ్ఎక్స్ అసలు బాగాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు. Ravana,a Shiva-Bhakta Brahmin from Lanka had mastered the 64 arts!Jaya(Vijay) who was guarding Vaikunta descended as Ravana owing to a curse! This may be a Turkish tyrant but is not Ravana! Bollywood,Stop misrepresenting our Ramayana/History!Ever heard of the legend NTRamaRao? pic.twitter.com/tGaRrsSQJW — Malavika Avinash (@MalavikaBJP) October 3, 2022 -
సోదరుడి లైంగిక వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి
(వరంగల్) మహబూబాబాద్: లైంగిక వేధింపులతో మండలంలోని ల్యాదెళ్ల గ్రామానికి చెందిన మాళవిక(19) ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. ఎస్సై హరిప్రియ, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. మాళవిక ఇంటర్ పూర్తి చేసి ఇంటివద్దే ఉంటోంది. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన సంగాల సాయి, మాళవిక ఒకర్నొకరు ప్రేమించుకున్నారు. మూడు నెలల క్రితం వీరిద్దరూ శారీరకంగా కలుసుకున్నారు. ఏకాంతంగా ఉన్న సమయంలో సాయి ఆమె ఫొటోలు తీసుకున్నాడు. మాళవిక ఆచిత్రాలను తొలగించాలని వేడుకుంది. సాయి తొలిగిస్తానని నమ్మబలికి ఆవీడియోలు, ఫొటోలను తన మిత్రుడైన తాళ్ల ప్రణయ్ అలియాస్ ఢిల్లీకి పంపించాడు. ప్రణయ్ మాళవికకు వరుసకు సోదరుడవుతాడు. ఫొటోలు, వీడియోలను ఆసరాగా చేసుకున్న ప్రణయ్ ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో ప్రణయ్ వేధింపులు భరించలేక మాళవిక గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో గడ్డి మందు తాగింది. అనంతరం వాంతులు చేసుకుంటున్న క్రమంలో బంధువులు గమనించి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. యువతి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. యువతి తల్లి ఇందిర ఫిర్యాదు మేరకు సంగాల సాయి, తాళ్ల ప్రణయ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు, శ్రీకాంత్
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ లో పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... ప్రణయ్, సాయిప్రణీత్, సౌరభ్ వర్మ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు, మాళవిక ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... సైనా నెహ్వాల్, అష్మిత, ఆకర్షి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. శ్రీకాంత్ 18–21, 21–10, 21–16తో లెవెర్డెజ్ (ఫ్రాన్స్)పై నెగ్గాడు. సౌరభ్ వర్మ 20–22, 12–21తో తోమా పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో, సాయిప్రణీత్ 12–21, 13–21తో వాంగ్చరోయిన్ (థాయ్లాండ్) చేతిలో, ప్రణయ్ 17–21, 21–15, 15–21తో డారెన్ లూ (మలేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–19, 18– 21, 21–18తో లారెన్ లామ్ (అమెరికా)పై... మాళవిక 17–21, 21–15, 21–11తో ఉలితినా (ఉక్రెయిన్) పై నెగ్గగా.. సైనా 21–11, 15–21, 17–21తో కిమ్ గా ఉన్ (కొరియా) చేతిలో, ఆకర్షి 13–21, 18–21 తో మిచెల్లి (కెనడా) చేతిలో, అష్మిత 10–21, 15– 21తో రచనోక్ (థాయ్లాండ్) చేతిలో ఓడారు. -
ఏఆర్ రెహమాన్ మెచ్చుకున్న సింగర్.. ఎవరామే?
అక్కడే విని...అప్పుడే మరిచిపోయేట్లు ఉండకూడదు. అది నీడలా మన వెంటపడాలి’ అని అనడమే కాదు నిరూపించింది మాలి ‘కొందరు కళాకారుల అంకితభావం వ్యక్తిత్వంలోనే కాదు వారి సృజనాత్మకప్రక్రియలోనూ బలంగా కనిపిస్తుంది. అది వారిని మరింత పైకి తీసుకెళుతుంది. అలాంటి వారిలో ఒకరు...మాళవిక మనోజ్’ అని ఏఆర్ రెహమాన్ మెచ్చుకోవడం తనకు లభించిన అత్యున్నత పురస్కారం అంటుంది మాళవిక మనోజ్. చెన్నైలోని మలియాళి దంపతులకు జన్మించిన మాళవిక మనోజ్కు సంగీతం అనేది బాల్యనేస్తం. తల్లిదండ్రులు సంగీతకారులు కానప్పటికీ సంగీతప్రేమికులు. పాత, కొత్త, స్వదేశ, పరదేశ...అనే తేడా లేకుండా ఆ ఇంట్లో సంగీతం నిరంతరం ప్రతిధ్వనించేది. అయిదు సంవత్సరాల వయసులో మాళవికను స్విమ్మింగ్ క్లాస్లతో పాటు పియానో, భరతనాట్యం, డ్రాయింగ్ క్లాస్లకు పంపేవారు తల్లిదండ్రులు. కొంతకాలం తరువాత పియానో క్లాస్లకు తప్ప మిగిలిన క్లాసులకు బంక్ కొట్టేది మాళవిక. పదహారు సంవత్సరాల వయసులో పాటలు రాయడం మ్యూజిక్ కంపోజింగ్ చేయడం మొదలు పెట్టింది. పదిహేడు సంవత్సరాల వయసులో గిటార్ వాయించడం నేర్చుకుంది, ఆమె ఫస్ట్ సింగింగ్ పర్ఫామెన్స్ గురించి చెప్పుకోవాలంటే... పన్నెండు సంవత్సరాల వయసులో ఒక విందులో ప్రఖ్యాత అమెరికన్ జాజ్ సింగర్ ఎల్లా ఫిజ్జెరల్డ్ పాట పాడింది. విశేషం ఏమిటంటే ఆ పాటను విందుకు అన్వయించి పాడడం ద్వారా ‘శబ్బాష్’ అనిపించుకుంది మాళవిక. చెన్నైలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బిబిఏ) చేసిన మాళవిక పై చదువుల కోసం ఫ్రాన్స్కు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగివచ్చిన తరువాత ముంబైకి వెళ్లింది. మంచి ఉద్యోగం వెదుక్కోవడానికి కాదు.. మ్యూజిక్లో కెరీర్ వెదుక్కోవడానికి!. బేస్–ఇన్–బ్రిడ్జి అనే మ్యూజిక్ బ్యాండ్లో చేరడం ద్వారా తొలి అడుగువేసింది. తన స్టేజ్ నేమ్ ‘మాలి’ అయింది. డెబ్యూ ఆల్బమ్ ‘డిసెప్టివ్’తో వావ్ అనిపించింది. ఏఆర్ రెహమాన్లాంటి సంగీత దిగ్గజాలతో కలిసి పనిచేసింది. యూరో ఇండీ మ్యూజిక్చార్ట్లో తన పాట ఫస్ట్ ర్యాంకులో నిలిచింది. తనకు పాప్గర్ల్గా గుర్తింపు ఉన్నప్పటికీ సంగీతంలో రకరకాల జానర్స్ వినడం, వాటి నుంచి ఇన్స్పైర్ కావడం అంటే ఇష్టం. ‘అతిగా ఆలోచించడం అనేది నా బలం, నా బలహీనత. ఆ ఆలోచనల్లో నుంచే సంగీతం పుడుతుంది’ అంటున్న 28 సంవత్సరాల మాళవిక మనోజ్, సంగీతంలో మరిన్ని ప్రయోగాలు చేయాలనుకుంటోంది. -
తొలి సినిమా డైరెక్టర్తో రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
Senior Heroine Malavika Re Entry With Director Sundar C Movie: ప్రముఖ డైరెక్టర్, దివగంత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన 'చాలా బాగుంది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ మాళవిక. శ్రీకాంత్, నవీన్ హీరోలుగా నటించిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలతో అలరించిన మాళవిక కొన్నాళ్లకు సినిమాలకు దూరమైంది. 1999లో సుందర్. సి డైరెక్షన్లో అజిత్ హీరోగా 'ఉన్నై తేడి' మూవీతో కోలీవుడ్కు పరిచయమైంది మాళవిక. తర్వాత 2007లో సురేష్ మేనన్ అనే వ్యక్తిని వివాహమాడి వైవాహిక జీవితానికే పరిమితమైంది. ఇప్పుడు తాజాగా ఆమె మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది. చదవండి: 'పేరెంట్స్ కోప్పడ్డారు..ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్నా' కోలీవుడ్కు ఏ డైరెక్టర్తో పరిచయమైందో ఆయన దర్శకత్వంలోనే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుంది మాళవిక. ఈ సినిమాలో ఆమె 'మంగమ్మ' అనే పాత్రలో అలరించనుంది. ఇందులో మాళవికకు జోడిగా దర్శకుడు మనోబాలా కనిపించనున్నారు. హీరోలుగా జై, జీవా, శ్రీకాంత్ నటిస్తున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్, రైజా విల్సన్, ఐశ్వర్య దత్తా హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్లో పాల్గొన్న మాళవిక ఫొటోలను సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. ఇంకా ఈ సినిమాకు టైటిల్ ఖరారు కాలేదు. షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. pic.twitter.com/VoZNpvLkRx — Manobala (@manobalam) April 2, 2022 చదవండి: ఆమె బయోపిక్లో నటించాలనుంది: మాళవిక మోహనన్ -
షూటింగ్లో హీరో శ్రీకాంత్తో నాకు గొడవ అయ్యింది : హీరోయిన్
'చాలా బాగుంది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి మాళవిక. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలతో అలరించిన మాళవిక ఆ తర్వాత కొన్నాళ్లకు సినిమాలకు దూరమైంది. సుమారు12 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న మాళవిక పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. రీసెంట్గానే పుష్ప సినిమా చూశానని, అందులో సమంత చేసినట్లు స్పెషల్ సాంగ్ ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తానని పేర్కొంది. ఇక ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన చాలా బాగుంది సినిమాలో హీరో శ్రీకాంత్కి, గొడవ జరిగిందని తెలిపింది. 'ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చేసేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవడంతో నాకు అంత కంఫర్ట్ లేదని చెప్పాను. దీంతో శ్రీకాంత్ షూటింగ్ మధ్యలోంచి వెళ్లిపోయారు. ఇక ఈ సినిమాలో అత్యాచారం సీన్లో నటించినందుకు ఇప్పటికీ చాలా డిస్ట్రబ్గా అనిపిస్తుంది. హిందీలో కూడా సీయూ ఎట్9 చిత్రంలో ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేయడంతో పేరెంట్స్ కోప్పడ్డారు. ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా' అని మాళవిక చెప్పుకొచ్చింది. -
భర్త సిద్దార్థ్ కలలను నిజం చేస్తున్న కేఫ్ కాఫీ డే మాళవిక హెగ్డే..!
మాళవిక హెగ్డే అనే పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ సతీమణిగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ కూతురిగా మాత్రమే మాళవిక హెగ్డే సుపరిచితం. ఇది అంత గతం. ఇప్పుడు తన గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఇక నుంచి ఆమెను ఎప్పటికీ మరిచిపోరు. ఇంకా చెప్పాలంటే.. ఇక నుంచి ఆమెను అందరూ ఒక ఆదర్శంగా తీసుకుంటారని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ఆమె ఎవరో?.. ఆమె ఎందుకు ప్రత్యేకమో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2019 జులైలో కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆయన మరణం తర్వాత ఆయన భార్య మాళవిక హెగ్డే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. భర్త ఆత్మహత్య! దారి తెన్నూ లేని వ్యాపారాలు, వేల కోట్ల అప్పు.. ఇలాంటి సందర్భంలో మనకు ఏమనిపిస్తోంది? భయంతో ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ! ఈ రెండు కోణాలు మాళవికకు ఎదురయ్యాయి. కేఫ్ కాఫీ డే సీఈఓ మాళవిక హెగ్దే.. ఎన్ని కష్టాలు ఎదురైనా.. తను నిలబడి, ఉద్యోగులకు అండగా ఉంటూ సంస్థనూ ముందుకు నడుపుతున్నారు. కేఫ్ కాఫీ డే సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో అప్పుల్లో ఉన్న కంపెనీని మళ్లీ తిరిగి నిలబెట్టేందుకు, అప్పులను తగ్గించుకునేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు ఆమె చెప్పారు. కేవలం మాటలు మాత్రమే చెప్పలేదు చేసి చూపించారు. కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు అనే దానికి ఈ విషయం ఒక ఉదాహరణ. కేఫ్ కాఫీ డే సీఈవో పదవి చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడంతో కంపెనీ అప్పులను సగానికి(రూ.7,200 కోట్ల నుంచి రూ.3,100 కోట్లుకు) తగ్గించేశారు. అలాగే, తన ఉద్యోగుల్లో విశ్వాసాన్ని నింపారు. పెట్టుబడుదారులకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, తన భర్త సిద్ధార్థ్ విధికి తల వంచితే.. మాళవిక హెగ్డే మాత్రం విధిని ఎదిరించి బలంగా నిలబడ్డారు. భవిష్యత్ వ్యాపార ప్రణాళికల మీద మాళవిక ద ఎకనమిక్ టైమ్స్కు తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. దీన్ని చదివితే ఆమె ఎంత స్పష్టతతో ఉన్నారో.. ఎంత నమ్మకంగా ఉన్నారో.. ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థం అవుతుంది. కష్ట కాలంలో ఉద్యోగులు అండగా ఉన్నారని, బ్యాంకులు ఓపికతో వేచి చూశాయని తెలిపారు. కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని, భర్త కలల సాకారానికి పాటుపడతానని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. (చదవండి: బంపర్ ఆఫర్..! సాఫ్ట్ వేర్ జాబ్కు రిజైన్ చేస్తే రూ.4లక్షలిస్తాం!!) -
వయసులో తన కంటే చిన్నవాడిని పెళ్లాడిన సూపర్ సింగర్!
Super Singer Fame Maalavika Gets Married With Ashwin Kashyap Raghuraman: సూపర్ సింగర్ ఫేమ్ మాళవిక సుందర్ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఎంటర్ప్రెన్యూర్ అశ్విన్ కశ్యప్ రఘురామన్తో ఏడడుగులు నడిచింది. ఇతడు వయసులో మాళవిక కంటే చిన్నవాడు కావడం గమనార్హం. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. మూడు ముళ్లతో కొత్త జీవితం ప్రారంభించిన మాళవికకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా మాళవిక.. తమిళ సూపర్ సింగర్ షోలో ప్లే బ్యాక్ సింగర్గా అలరించింది. ఈ షోలో తనేంటో ప్రూవ్ చేసుకున్న మాళవికు తమిళంతో పాటు తెలుగులోనూ అనేక అవకాశాలు వచ్చాయి. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మాళవిక ఇప్పటివరకు తెలుగులో 200 పైచిలుకు పాటలు పాడింది. తనకంటే వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకోబోతున్నానని ఈ మధ్యే ఫ్యాన్స్కు హింటిచ్చిన గాయని.. పెళ్లికి వయసుతో పని లేదని, ఇద్దరం ఒకరినొకరిని అర్థం చేసుకుని, గౌరవించుకుంటే అంతే చాలని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by priya (@cinitime) View this post on Instagram A post shared by Positive vibes (@positivevibes1201) View this post on Instagram A post shared by Positive vibes (@positivevibes1201) View this post on Instagram A post shared by Maalavika Sundar (@sundarmaalavika) -
మహామహుల చేత శభాష్ అనిపించుకుంటున్నమాళవిక..
బర్కత్పురకు చెందిన మాళవిక చిన్నప్పటి నుంచే పాటలంటే ప్రాణంగా పెరిగింది. ఎనిమిదేళ్ల వయస్సు నుంచే శాస్త్రీయ సంగీతాన్ని ఊపిరిగా మార్చుకుంది. ప్రసిద్ధ గాయని ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మీని స్ఫూర్తిగా తీసుకుని తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రీయ సంగీత ప్రదర్శనలు ఇచ్చి.. తన ప్రతిభను ప్రపంచానికి చాటింది. ఇప్పటికే పలు భాషల్లో ఎన్నో పాటలు పాడి శాస్త్రీయ సంగీతంపై తనదైన ముద్ర వేసింది. మహనీయుల చేతుల మీదుగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. మహామహుల చేత శభాష్ అనిపించుకుంటున్న కళామతల్లి ముద్దుబిడ్డ మాళవికపై ప్రత్యేక కథనం.. – కాచిగూడ బాల్యం నుంచే ఆసక్తి.. ఎనిమిదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు టీవీల్లో వచ్చే పాటలు విని అనుకరించేది. సంగీతంపై ఉన్న ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు సుచిత, వివేకానంద్ చిన్నారి మాళవికకు సంగీతంలో శిక్షణ ఇప్పించారు. రేవతి రత్నస్వామి వద్ద ఆ తర్వాత లలిత, హరిప్రియ (హైదరాబాద్ సిస్టర్స్) వద్ద మాళవిక శిక్షణ తీసుకుంది. 2009లో మాళవిక ‘శ్రీహరి సంకీర్తనలు’ పేరిట సీడీని రూపొందించింది. ఇందులో 17 పాటలు పాడింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మరాఠీలోనూ పాడుతూ ఆయా భాషల వారీగా ఆదరాభీమానాలు పొందింది. 2010లో ‘దశరథరామా గోవిందా’³రిట మరో సీడీని విడుదల చేసింది. ఆ తర్వాత పది పాటలతో శ్రీరామదాసు కీర్తనలతో ఓ అల్బమ్ చేశారు. కీరవాణి సంగీతంలో ‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’లో మూడు పాటలు పాడింది. భారతి ఓ భారతి నవ భారతీ.. అడుగడుగున అవమానాలే నీకు హారతీ.. పేరుతో వీడియో అల్బమ్ చేసింది. ప్రస్తుతం ఐబీఎస్ హైదరాబాద్లో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రస్తుతం రేవా టర్మరిక్ డ్రింక్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోంది. 200లకు పైగా కచేరీలు.. మొదటి కచేరీ హిమాయత్నగర్ టీటీడీ దేవస్థానంలో చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన 200లకు పైగా సంగీత కచేరీల్లో పాల్గొన్నారు. 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో శాస్త్రీయ సంగీత కచేరీ చేసే అవకాశం దక్కించుకుంది. 2014లో మైసూర్ ప్యాలెస్లో అత్యంత వైభవంగా జరిగే దసరా వేడుకల్లో భక్తి గీతాలను ఆలపించి అందరిచేత మెప్పుపొందింది. 2019లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో పాటలు పాడింది. ఆల్ ఇండియా రేడియో, తిరుమల బ్రహ్మోత్సవాలు, భద్రాచలంలో శ్రీరాములవారి సన్నిధిలో, బాసర, వేములవాడ ఇలా ప్రసిద్ధి చెందిన ఎన్నో ఆలయాల్లో భక్తీగీతాలు పాడే అవకాశం దక్కడం దేవుడు ఇచి్చన గొప్పవరంగా భావిస్తున్నట్లు మాళవిక తెలిపారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమక్షంలో ప్రార్థనాగీతం ఆలపిస్తూ.. అవార్డులు, ప్రశంసలు.. యూనిక్ వరల్డ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్లలో స్థానం దక్కించుకుంది. యువగాన కోకిల, బాలరత్న, కాపు యువరత్న బిరుదులు, పలు సెలబ్రిటీ అవార్డులు అందుకుంది. బెంగళూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ విద్వాంసులైన బాలమురళీకృష్ణ, బిస్మిల్లాఖాన్, పండిత్ భీమ్సేన్ జోషీ, సుధా రఘునాథ్ల సమక్షంలో తన సుస్వారాలను వినిపించి వారి నుంచి ప్రశంసలు అందుకుంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం ఎన్.కిరణ్కుమార్రెడ్డి, గవర్నర్ నరసింహన్, చిన్నజీయర్ స్వామి తదితర ప్రముఖుల చేతుల మీదుగా సత్కారాలు అందుకుంది. సుబ్బలక్ష్మీలా పేరు సాధించాలి శాస్త్రీయ సంగీతం మనకున్న అతిపెద్ద సంపద. నేటి తరం మరిచి పోతున్న శాస్త్రీయ సంగీతాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్నదే నా లక్ష్యం. శాస్త్రీయ సంగీతంలో ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మీలా మంచి స్థాయికి వెళ్లాలని నా కోరిక. వెస్ట్రన్ మ్యూజిక్ కూడా నేర్చుకుంటా. సింగర్గా మంచి పేరు తెచ్చుకుని ప్రముఖ గాయనీమణుల జాబితాలో నేను కూడా ఉండాలన్నది నా కోరిక. – మాళవిక, క్లాసికల్ సింగర్ -
మాళవిక.. తళుకులు..
-
అవును నిజమే.. అయితే ఏంటి?
న్యూఢిల్లీ: ‘‘అవును నిజమే.. నా శరీరానికి వైకల్యం ఉంది. అయితే దానర్థం నేనేమీ సాధించలేనని కాదు. మిగతా వారికంటే కాస్త భిన్నమైన దారిలో పయనిస్తానని మాత్రమే అర్థం. ‘వైకల్యం’ అనేది నేను చేయాలనుకున్న పనులు చేయకుండా నన్ను అడ్డుకోలేదు. కాబట్టి ఇంటర్నేషనల్ డిజెబిలిటీ డే సెలబ్రేట్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా’’ అంటూ మోటివేషనల్ స్పీకర్ మాళవికా అయ్యర్ దివ్యాంగుల్లో స్ఫూర్తి నింపారు. డిసెంబరు 3న ‘వరల్డ్ డిజెబిలిటీ డే’ సందర్భంగా తన పనులు తానే చేసుకుంటున్న వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. గ్రానైడ్ పేలిన ఘటనలో మాళవిక చిన్నతనంలోనే తన రెండు అరచేతులను కోల్పోయారు. ఇరుగుపొరుగు సూటిపోటి మాటలు తట్టుకుని ధైర్యంగా నిలబడిన ఆమె.. స్క్రైబ్సాయంతో పరీక్షలు రాసి ఉన్నత విద్య పూర్తి చేశారు. అంతర్జాతీయ స్థాయి మోటివేషనల్ స్పీకర్గా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. (చదవండి: అదే అన్నింటికంటే పెద్ద శాపం.. కాబట్టి) ఈ క్రమంలో వివిధ దేశాల్లో ప్రసంగాలు చేసిన మాళవిక.. సమాజ తీరు, మహిళలు, దివ్యాంగులపై వివక్ష వంటి అంశాలపై ఐక్యరాజ్యసమితిలోనూ తన గళాన్ని బలంగా వినిపించారు. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2018లో మహిళా దినోత్సవం సందర్భంగా అత్యున్నత మహిళా పురస్కారం నారీ శక్తి పురస్కార్తో సత్కరించింది. మాళవిక తన మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లాడి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. గత నెల 29న వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్తతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన ఆమె.. ‘‘ పదేళ్ల క్రితం.. ‘ఈ వ్యక్తితోనే మన జీవితం గడపాలని నిర్ణయించుకున్నపుడు.. ఇంక ఆలస్యం చేయకూడదు. వెంటనే దానిని అమలు చేసేయాలి’ అనే సినిమా డైలాగ్తో మా సంభాషణ మొదలైంది. మా బంధానికి కాలంతో పనిలేదు. హ్యాపీ యానివర్సరీ మై లైఫ్’’ అంటూ తన బెస్టాఫ్పై ప్రేమను చాటుకున్నారు. బాల్యం రాజస్తాన్లో మాళవిక అయ్యర్ తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు క్రిష్ణన్- హేమా క్రిష్ణన్. తండ్రి వాటర్ వర్క్స్లో ఇంజనీరుగా పనిచేసిన క్రమంలో మాళవిక బాల్యం రాజస్తాన్లోని బికనీర్లో గడిచింది. అక్కడ ఉన్నపుడే ఓ రోజు తమ గ్యారేజీలో ఆడుకుంటున్న సమయంలో గ్రానైడ్ చేతుల్లో పేలింది. ఆ తర్వాత ఆమెను చెన్నైలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఉన్నత విద్య కోసం ఢిల్లీకి చేరకున్న మాళవిక... ఎకనమిక్స్ హానర్స్ చదివారు. సోషల్ వర్క్లో పీహెచ్డీ చేసి డాక్టరేట్ సంపాదించారు. 2013 నుంచి మోటివేషనల్ స్పీకర్గా మారారు. I have a disability, yes that's true, but all that really means is I may have to take a slightly different path than you. Having a #disability doesn’t stop me from doing anything. ❤️ I'm all ready to celebrate #InternationalDisabilityDay #IDPD2020 #IDPD pic.twitter.com/VEzICaOBEy — Dr. Malvika Iyer (@MalvikaIyer) December 3, 2020 -
బాలుకి కరోనా.. నేను కారణం కాదు: గాయని
చెన్నై: ప్రముఖ సినీగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా మహమ్మారితో పోరాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు కరోనా సోకడానికి గాయని మాళవికనే కారణమంటూ సోషల్మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన గాయని మాళవిక.. బాలసుబ్రహ్మణ్యానికి కరోనా సోకడానికి కారణం తానే అని ప్రచారం చేస్తున్నారని వాపోయారు. దీనిపై ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జూలై నెలాఖరులో ఎస్పీ బాలు హైదరాబాదులో ఓ కార్యక్రమానికి హాజరయ్యారని, ఆ కార్యక్రమానికి మాళవిక కూడా వచ్చిందని, అప్పటికే మాళవికకు కరోనా పాజిటివ్ అని తేలినా నిర్లక్ష్యంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నదంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై మాళవిక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా సోకడానికి తాను ఎంతమాత్రం కారణం కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయం గురించి మాళవిక స్పందిస్తూ ‘ఎస్పీబాలసుబ్రహ్మణ్యంకి సంబంధించిన ఒక పాటల కార్యక్రమం సామజవరగమన అనే కార్యక్రమానికి హాజరయిన నేను వేరే సింగర్స్తో కలిసి షూట్లో పాల్గొన్నాను కానీ ఎస్పీ బాలును కలవలేదు. ఆయనకు ఆగస్టు 5 వ తేదీన కరోనా పాజిటివ్ వస్తే నాకు ఆగస్టు 8వ తేదీన కరోనా పాజిటివ్ అని వచ్చింది. కానీ కొంత మంది నాకు జూలైలోనే కరోనా వస్తే కావాలనే ఆ కార్యక్రమానికి హాజరయ్యానని ప్రచారం చేస్తున్నారు’ అని తన బాధను ఫేస్బుక్ ద్వారా తెలియజేశారు. చదవండి: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలంటూ రజనీ ట్వీట్ -
స్వయంగా రంగంలోకి మాళవిక..
ఇద్దరికీ మొక్కలు నాటడం ఇష్టం. పెళ్లయిన కొత్తలోనే... ఇద్దరూ కలిసి కాఫీ మొక్కను నాటారు. ‘కాఫీ డే’ అని పేరు పెట్టారు. ఆ మొక్క మహా వృక్షమయింది. ఆరు దేశాలకు వేర్లను చాపుకుంది. అకస్మాత్తుగా అతడు.. చెట్టుపై నుంచి ఎగిరిపోయాడు. ఆమె ఒక్కటే మిగిలింది. ఆ వృక్షాన్ని మళ్లీ ఇప్పుడు..మొక్కలా పెంచబోతోంది! భర్తకు వారసత్వంగా వచ్చిన కాఫీ తోటలు ఉన్నాయి. మంగళూరులో సెయింట్ అలోయ్సియస్ కాలేజ్ నుంచి ఇకనమిక్స్లో పొందిన మాస్టర్స్ డిగ్రీ ఉంది. ఆర్థికంగా అంత సంపద, ఆర్థశాస్త్రంలో అంత తెలివి ఉన్న భర్త ఓ రోజు ‘‘కాఫీ షాప్ పెడదాం.. కాఫీ ఇరవై ఐదు రూపాయలకు అమ్మితే లాభాలే లాభాలు..’’ అన్నప్పుడు మాళవిక వెంటనే ‘నాట్ ఎ బ్రైట్ ఐడియా’ అనేశారు! ఆమెకు కూడా కొంచెం చదువుంది. బెంగళూరు యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చేశారు. అయితే భర్త ఆలోచనను కాదన్నది ఆమె ఇంజినీరింగ్ కాదు. ఆమె కామన్ సెన్స్. (కాఫీ కింగ్ అదృశ్యం) 1990ల నాటి రోజులు అవి. కప్పు కాఫీ ఐదు రూపాయలకు దొరుకుతున్నప్పుడు ఎంత మంచి కాఫీ అయినా ఇరవై ఐదు రూపాయలకు ఎవరు కొంటారు అని ఆమె పాయింట్. భార్య అలా అనగానే తన ఆలోచనను కొద్దిగా మార్చారు సిద్ధార్థ. ‘‘పోనీ, ఇంటర్నెట్ సర్ఫింగ్ కమ్ కాఫీ?’’ అన్నారు. మాళవికకు ఆ ఐడియా నచ్చింది. అప్పటికి కొన్నాళ్ల ముందే 1991లో వాళ్ల పెళ్లయింది. 1996లో వాళ్ల ఉమ్మడి ఐడియా ‘కఫే కాఫీ డే’ (సిసిడి) గా కళ్లముందుకు వచ్చింది. మొదట కాఫీ డే బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్లో మొదలైంది. గత ఏడాది జూలై 29న సిద్ధార్థ ఆత్మహత్య చేసుకునే నాటికి ఈ ఇరవై ఎనిమిదేళ్లలో దేశవ్యాప్తంగా 243 పట్టణాలకు 1760 కాఫీ డేలు విస్తరించాయి. ఆస్ట్రియా, ఈజిప్ట్, చెక్ రిపబ్లిక్, మలేషియా, నేపాల్లలో కొన్ని బ్రాంచిలు ఉన్నాయి. అయితే సిద్ధార్థ మరణం తర్వాత ఈ ఏడాది జూన్ నాటికి దేశంలో 280 ‘కాఫీ డే లు’ మూతపడ్డాయి! కొన్ని అప్పులు మిగిలి ఉన్నాయి. 2,693 కోట్ల రూపాయల అప్పన్నది మాళవిక తీర్చలేనిదేమీ కాదు. ఇన్వెస్టర్లు, ఇన్కం టాక్స్ అధికారులు, వడ్డీలు, ఆడిటర్లకు సైతం లెక్కతేలని కొన్ని ఆర్థిక వ్యవహారాల బకాయీలు అవన్నీ. శనివారం మాళవిక తమ ఉద్యోగులకు ఒక లేఖ రాశారు. ‘‘అప్పులన్నీ తీర్చేస్తున్నాం. మునుపటిలా సంస్థను ముందుకు తీసుకెళదాం’’ అని సారాంశం. భర్త మరణం నుంచి తేరుకోడానికి సరిగ్గా ఏడాది పట్టింది మాళవికకు. ప్రస్తుతం ఆమె సిసిడి (కఫే కాఫీ డే)లో నాన్–ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యురాలు. ప్రస్తుతం అనే కాదు, బెంగళూరులోని వారి చిన్న ప్రారంభ దుకాణం ఒక పెద్ద కంపెనీగా అవతరించిన నాటి నుంచీ ఆమె.. జీతం తీసుకోని నాన్ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలే. తమ కాఫీ డే ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ (సిడిఇఎల్) లో కొన్ని నిధులను ఇటు మళ్లించి కంపెనీని పునరుద్ధరించే ఆలోచనలో ఉన్నారు మాళవిక. సిడిఇఎల్ అనుబంధ సంస్థే కఫె కాఫీ డే. (కాఫీ మొఘల్కు ఏమైంది? షేర్లు డీలా) ఆరు దేశాలలో ఏడాదికి వందకోట్ల అరవై లక్షల కాఫీ కప్పులు అమ్మిన కాఫీ డే ఇప్పుడు రోజుకు సగటున పదిహేను వేల కప్పులు తక్కువగా అమ్ముతోంది. ఇది తాత్కాలికమైన క్షీణతేనని ఇప్పటికీ కాఫీ డే లపై కస్టమర్లకు ఉన్న ఆకర్షణే చెబుతోంది. ఇక మాళవికే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు కనుక సమీప భవిష్యత్తులోనే ఆమె తన భర్తకు నివాళిగా సంస్థను మళ్లీ పూర్తిస్థాయి లాభాల్లోకి తీసుకెళ్లే అవకాశాలు నమ్మకంగా ఉన్నాయి. కస్టమర్లు ఎంతసేపైనా గడిపేందుకు అనువైన,ఆహ్లాదకరమైన పరిసరాలు ఉండటంతో పాటు.. శాండ్విచ్, బర్గర్ల వంటి ఫాస్ట్ఫుడ్స్ లభించడం కూడా కాఫీ డే ప్రత్యేకతలు. బెంగళూరులో తొలి కాఫీ డే షాపు నిర్మాణం జరుగుతున్నప్పుడు అక్కడి కిటికీల్లోంచి బయటికి చూస్తూ.. ఎవరెవరు తమ కాఫీ డేకు వస్తారో అంచనా వేయడం తమకొక ఆటగా ఉండేదని మాళవిక ఒక ఇంటర్వూ్యలో చెప్పారు. అంతగా ఈ దంపతులకు కాఫీ డేతో అనుబంధం ఉంది. ఆ బంధాన్ని చెక్కు చెదరన్వికుండా బిజినెస్లో తల్లికి సాయం చేసేందుకు ఇద్దరు కొడుకులు ఇషాన్, అమర్త్యలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఆమె తండ్రి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అండగా ఉన్నారు. సిద్ధార్థ, మాళవికలకు ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకోవడం ఇష్టం. ఇద్దరూ ప్రకృతి ప్రేమికులు. మొక్కలు నాటడం ఇష్టమైన వ్యాపకం. ఇద్దరూ కలిసి మూడు వేల వరకు చెట్ల మొక్కల్ని నాటి ఉంటారు. దగ్గర లేని ఆ జీవిత సహచరుడిS కోసం కాఫీ డే అనే మహా వృక్షాన్ని మళ్లీ ఒక మొక్కలా సంరక్షించబోతున్నారు మాళవిక. కాఫీ డే కి చైర్పర్సన్ అవడం, కాకపోవడంతో నిమిత్తం లేకుండానే. (వ్యాపారవేత్తగా విఫలమయ్యా... ) మాళవిక (గత ఏడాది భర్త అంత్యక్రియల సమయంలో) -
2020 శివది కావాలని కోరుకుంటున్నా
‘‘ఒక చిన్న సినిమా విడుదలకి ముందే అన్ని పాటలు శ్రోతలను ఆకట్టుకోవడం నిజంగా అదృష్టం. శివ పరిచయం కాబోతున్న సినిమా అంటే మా అందరికీ సెలబ్రేషన్ మూమెంట్’’ అన్నారు దర్శక–నిర్మాత మధుర శ్రీధర్. ‘పెళ్లి చూపులు, మెంటల్ మదిలో’ చిత్రాలను నిర్మించిన రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘చూసీ చూడంగానే’. శేష సింధు దర్శకత్వంలో రాజ్ కందుకూరి నిర్మించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, మాళవిక కథానాయికలు. సురేశ్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. విడుదలైన పాటలకు 25 మిలియన్ల వ్యూస్ రావడంతో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ నిర్వహించింది చిత్రబృందం. రాజ్ కందుకూరి మాట్లాడుతూ – ‘‘టీజర్, ట్రైలర్స్కి మంచి స్పందన వచ్చింది. పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సంగీత దర్శకుడు, రచయితలందరికీ ధన్యవాదాలు. సినిమా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘ఈ సినిమా పెద్ద హిట్ అయి 2020 మా శివదే కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్. ‘‘సినిమా మొదలయినప్పటి నుంచి అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. నా సినిమాలో పాటలన్నీ బావుండాలని పెద్ద రచయితలతోనే రాయించుకున్నాం. శివ బాగా యాక్ట్ చేశాడు’’ అన్నారు శేష సింధు. ‘‘మంచి స్క్రిప్ట్తో నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న మా నాన్నగారికి, మా డైరెక్టర్ సింధుగారికి ధన్యవాదాలు’’ అన్నారు శివ కందుకూరి. ‘‘సున్నితమైన భావోద్వేగాలతో శేష సింధుగారు బాగా చిత్రీకరించారు. సినిమాకు మంచి సంగీతం కుదిరింది’’ అన్నారు రచయిత అనంత శ్రీరామ్. -
సహజత్వానికి దగ్గరగా చూసీ చూడంగానే
ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా నటించిన తొలి చిత్రం ‘చూసీ చూడంగానే’. వర్ష, మాళవిక కథానాయికలుగా నటించారు. శేష సింధు రావు ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాజ్ కందుకూరి మాట్లాడుతూ – ‘‘ప్రతిభావంతులైన యువకులతో సినిమాలు చేయడానికే నేను ఎక్కువగా ఇష్టపడుతుంటాను. ఈ సినిమా కథకు మా అబ్బాయి శివ హీరో అయితే బాగుంటుందని దర్శకురాలు శేష చెప్పడంతో శివను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నాను. ఈ చిత్రం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకు మరో ఆకర్షణ. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా విడుదల అవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘‘నాపై నమ్మకం ఉంచి నన్ను హీరోను చేసిన మా నాన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. కథ బాగా నచ్చింది. నా కోసం మంచి స్క్రిప్ట్ రాసిన శేషగారికి థ్యాంక్స్. యంగ్ టీమ్ అందరూ కలిసి చేసిన ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మా సినిమాను విడుదల చేస్తోన్న నిర్మాత డి.సురేష్బాబుగారికి థ్యాంక్స్’’ అన్నారు శివ. ‘‘శివ బాగా నటించడానికి ఆస్కారం ఉన్న పాత్ర ఇది. హీరోయిన్ వర్ష బాగా నటించింది. షూటింగ్ పూర్తయ్యేలోపు వర్ష తెలుగు నేర్చుకుంది. మంచి డైలాగ్స్ రాసిన పద్మతో పాటు సహకరించిన నటీనటులు, చిత్రబందానికి ప్రత్యేక ధన్యవాదాలు’’ అన్నారు శేష. ‘‘చిన్న సినిమాలను రాజ్ కందుకూరిగారు ఎక్కువగా ప్రోత్సహిస్తుంటారు. ఆయన నిర్మించిన ఈ సినిమా పెద్ద హిట్ సాధించాలి. హీరోగా పరిచయం అవుతున్న శివకు ఇది సరైన సబ్జెక్ట్’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్. ‘‘ఇది నా తొలి తెలుగు సినిమా. శివ అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు వర్ష. ‘‘ఈ మూవీ నా కెరీర్కు మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు మాళవిక. -
రక్తపు మడుగులో మునిగినా ఏడ్వలేదు.. కానీ
మానసిక వైకల్యమే అన్నింటి కంటే పెద్ద శాపం. ఒక విషయం పట్ల ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు. కొంతమంది తీవ్ర ఉద్వేగాలకు లోనవుతారు. అయితే తాము మానసికంగా దృఢంగా లేమన్న విషయాన్ని గుర్తించరు. తమను పిచ్చివాళ్లుగా ముద్ర వేస్తారన్న భయంతో... అందుకు చికిత్స కూడా తీసుకోరు అంటారు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ మాళవిక అయ్యర్. భారతదేశ మహిళా అత్యున్నత నారీశక్తి పురస్కార గ్రహీత ఆమె. తమిళనాడుకు చెందిన మాళవిక పదమూడేళ్ల వయస్సులోనే అర చేతులు కోల్పోయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగి మోటివేషనల్ స్పీకర్గా ఎదిగారు. సామాజిక శాస్త్రంలో డాక్టరేట్ పొంది దివ్యాంగులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. డిసెంబరు 3న ‘వరల్డ్ డిసబిలిటీ డే’ సందర్భంగా శారీరక వైకల్యం ఉన్న వారి పట్ల సమాజం అనుసరించాల్సిన తీరును సోషల్ మీడియాలో ప్రస్తావించారు. నిజంగా శాపగ్రస్తురాలే..! ‘ఇది పదిహేడేళ్ల క్రితం నాటి మాట. నా రెండు చేతులు రక్తపు మడుగులో మునిగిపోయినపుడు నేను అంతగా ఏడ్వలేదు. డాక్టర్లు నా చేతుల్లో ఇనుప రాడ్లు వేసినపుడు కూడా ఎక్కువ బాధ పడలేదు. కానీ ఆస్పత్రి బెడ్ మీద ఉన్నపుడు నా పక్కనున్న ఆడవాళ్లు మాట్లాడిన మాటలు విని వెక్కివెక్కి ఏడ్చాను. జనరల్ వార్డులో కొత్త అమ్మాయి చేరిందట. తను నిజంగా శాపగ్రస్తురాలే. ఇక తన జీవితం ముగిసిపోయినట్లే అంటూ నా గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. అప్పుడే మొదటిసారిగా నా కళ్ల నుంచి ధారాపాతంగా కన్నీళ్లు కారాయి. బాంబు పేలుడులో అర చేతులు కోల్పోయిన నాకు భవిష్యత్తే లేదన్నట్లుగా వారు మాట్లాడారు. ఆ మాటలను అంగీకరించడానికి నా హృదయం అప్పుడు సిద్ధంగానే ఉంది. అయితే నా కుటుంబం, స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహం నాలో కొత్త ఉత్సాహం నింపింది. వారి చొరవతోనే నేనింత వరకు రాగలిగాను. నిజానికి దివ్యాంగుల పట్ల సమాజం స్పందించే తీరు సరిగా లేదు. ప్రతి ఒక్కరికీ అటిట్యూడ్ ప్రాబ్లం ఉంటుందని’ మాళవిక చెప్పుకొచ్చారు. అదే పెద్ద శాపం.. ‘నిజానికి మానసిక వైకల్యమే అన్నింటి కంటే పెద్ద శాపం. ఎదుటివారిని ప్రోత్సహించకపోయినా ఫర్వాలేదు కానీ నిరాశ చెందేలా మాట్లాడకూడదు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు 26.8 మంది దివ్యాంగులు ఉన్నారు. మొత్తం జనాభాలో వీరిది 2.21 శాతం. ఆర్థికాభివృద్ధి, సామాజికాభివృద్ధి వంటి పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడే ముందు ప్రతీ ఒక్కరు దివ్యాంగుల పట్ల తాము ప్రవర్తిస్తున్న తీరు గురించి ఆలోచించుకోవాలి. వారిని సమాజంలో మమేకం చేసి.. ఉద్యోగ భద్రత కల్పించి తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలి. శారీరక వైకల్యం ఉంటే ఇక జీవితం ముగిసినట్లే అనే మాటలు మానుకోవాలి. దివ్యాంగులనంతా ఒక్కచోట చేర్చడం కాదు.. వారికి ఏమేం అవసరమో గుర్తించి... వాటిని సమకూర్చాలి. అలా చేసినపుడే సమాజంతో వారు కలిసిపోగలుగుతారు. లేదంటే ఆత్మన్యూనతా భావంతో కుంగిపోతారు. అందుకే బాల్యం నుంచే ప్రతీ ఒక్కరు వివక్ష లేకుండా పెరిగే వాతావరణం కల్పించాలి. విద్యా విధానంలోనూ మార్పులు రావాలి. శారీరక వైకల్యం ఉన్న వారిని చారిటీ వస్తువులుగా చూపకుండా... దివ్యాంగులైనప్పటికీ సమాజంలో ఉన్నత స్థితికి చేరిన వారి గురించి పాఠ్యాంశంలో బోధించాలి. ఒకరిపై ఆధారపడకుండా.. సొంతంగా తమ పనులు తాము చేసుకునేలా తీర్చిదిద్దాలి. సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రోత్సాహం అందించాలి. సానుకూల దృక్పథం నెలకొనేలా సినిమాలు నిర్మించాలి. చేతులు, కాళ్లు లేకుంటే పెళ్లి కాదు. ఇక జీవితమే ఉండదు అనే పిచ్చి నమ్మకాలను తొలగించాలి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న దివ్యాంగులకు సమాజం పట్ల, తమ సమస్యల పట్ల ఒక అవగాహన ఏర్పడింది. తమ హక్కులకే గళాన్ని గట్టిగా వినిపించగలుగుతున్నారు. అయితే వారికి ప్రజాప్రతినిధుల, రాజకీయ నాయకుల అవసరం ఎంతగానో ఉంది. దివ్యాంగులను సమాజం నిండు మనస్సుతో ఆలింగనం చేసుకోవాలనేదే నా కల. ఆ దిశగా వడివడిగా అడుగులు పడాలి’ అని మాళవిక ఆకాంక్షించారు. గ్రానైడ్ పేలడంతో... మాళవిక అయ్యర్ తమిళనాడులోని కుంభకోణంలో క్రిష్ణన్- హేమా క్రిష్ణన్ దంపతులకు జన్మించారు. తండ్రి వాటర్ వర్క్స్లో ఇంజనీరుగా పనిచేసిన క్రమంలో ఆమె బాల్యం రాజస్తాన్లోని బికనీర్లో గడిచింది. అక్కడ ఉన్నపుడే ఓ రోజు తమ గ్యారేజీలో ఆడుకుంటున్న సమయంలో గ్రానైడ్ చేతుల్లో పేలి రెండు అరచేతులు పోయాయి. ఆ తర్వాత ఆమెను చెన్నైలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. స్క్రైబ్ సహాయంతో పరీక్షలు రాస్తూ మాళవిక తన విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు(ప్రైవేటు పరీక్ష) సంపాదించి ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రశంసలు పొందారు. అనంతరం ఉన్నత విద్య కోసం ఢిల్లీకి చేరకున్న మాళవిక... ఎకనమిక్స్ హానర్స్ చదివారు. అదే విధంగా సోషల్ వర్క్లో పీహెచ్డీ చేసి డాక్టరేట్ సంపాదించారు. 2013 నుంచి మోటివేషనల్ స్పీకర్గా మారి ఎంతోమందిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. వివిధ దేశాల్లో ప్రసంగాలు చేసిన మాళవిక.. సమాజ తీరు, మహిళలు, దివ్యాంగులపై వివక్ష వంటి అంశాలపై ఐక్యరాజ్యసమితిలోనూ తన గళాన్ని వినిపించారు. ఈ క్రమంలో ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2018లో మహిళా దినోత్సవం సందర్భంగా అత్యున్నత మహిళా పురస్కారం నారీ శక్తి పురస్కార్తో సత్కరించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. ఇదే కాదు మరెన్నో పురస్కారాలను మాళవిక అందుకున్నారు. 17 years ago, when I was lying on the hospital bed, I heard a bunch of women whisper, “Did you see that new girl in the general ward? What a shame! She must be cursed as now her life has now come to an end.”#WorldDisabilityDay #InternationalDisabilityDay #IDPD2019 #Disability pic.twitter.com/P9ZhWDslIK — Dr. Malvika Iyer (@MalvikaIyer) December 3, 2019 -
సిద్ధార్థ ఆ సమయంలో ఎవరితో మాట్లాడారు?
కర్ణాటక ,బొమ్మనహళ్లి : కాఫీ కింగ్, కేఫ్ కాఫీడే అధినేత, మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటికే పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దేశ విదేశాల్లో సైతం వ్యాపారం చేస్తున్న సిద్ధార్థ తన వ్యాపారం కోసం పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో అప్పలు తీర్చడం కోసం అనేక ఇబ్బందులు పడ్డారని, అప్పులు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నారా అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఓ అధికారి సిద్ధార్థను తీవ్రంగా వేధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన వేధింపులు తాళలేకనే సిద్ధార్థ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృదు స్వభావిగా పేరున్న సిద్ధార్థ షేర్ మార్కెట్లో రోజు రోజుకు తన కంపెనీ షేర్లు పడిపోవడంతో ఆయన కొంతమేర ఆందోళన పడ్డారని, అప్పులు పెరిగిపోవడం, మరొవైపు వేధింపులు ఆయనను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయని సిబ్బంది భావిస్తున్నారు. గత సోమవారం ఉదయం బెంగళూరు నుంచి మంగళూరు వైపు వెళ్లిన సిద్ధార్థ ఆ సమయంలో ఎవరితో మాట్లాడారు, ఆ మొబైల్ నెంబర్ల ఆధారంగా విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సిద్ధార్థ పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత అది హత్య, లేక ఆత్మహత్య అనే విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. చేతనహళ్లిలో కమ్ముకున్న విషాద ఛాయలు కాఫీ కింగ్ వీజీ సిద్ధార్థ మరణించి మూడు రోజులు గడచినా కూడా ఆయన స్వగ్రామం అయిన చేతనహళ్లిలో స్థానికులు ఆయనను మరిచిపోలేకున్నారు. సిద్ధార్థ తిథి కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ భార్య మాళవిక, కుమారులు అమర్థ్య, ఇషాన్ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మరో పక్క సిద్ధార్థకు చెందిన ఎస్టేట్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, కార్మికులు సైతం తిథి కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ యజమానిని తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు. -
నా గురించి అందరికీ తెలియాలనుకోను
‘‘నాకు నేను చాలా గొప్పవాడ్ని కావచ్చు కానీ నా గురించి అందరికీ తెలియాలి అనే ఆశ నాకు లేదు. కానీ కొన్నిసార్లు మనల్ని అభిమానించే వారి కోసం కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి. అటువంటి ప్రయత్నమే ‘విశ్వదర్శనం’. ఈ ఆలోచనకు నీరు పెట్టింది, నారు పోసింది అంతా జనార్థన మహర్షి అనటంలో అతిశయోక్తి లేదు. నా పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’’ అన్నారు కళాతపస్వి కె.విశ్వనాథ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై కె.విశ్వనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వదర్శనం’. టి.జి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ప్రముఖ రచయిత జనార్ధనమహర్షి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు విశ్వనాథ్ జన్మదినం సందర్భంగా సోమవారం ‘విశ్వదర్శనం’ టీజర్ను విడుదల చేశారు. ప్రముఖ నటుడు తనికెళ్లభరణి, గాయని మాళవిక తదితులు పాల్గొన్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ– ‘‘అందరి దర్శకులకు అభిమానులు ఉంటారు. విశ్వనాథ్గారికి మాత్రం భక్తులు ఉంటారు. అటువంటి ఎంతో మంది భక్తుల్లో జనార్థన మహర్షి ఒకరు. ఈ సినిమాకు డబ్బులు ఎంత వస్తాయో చెప్పలేను కానీ కీర్తి మాత్రం పుష్కలంగా వస్తుంది’’ అన్నారు. జనార్థన మహర్షి మాట్లాడుతూ– ‘‘మా అమ్మ విశ్వనాథ్గారి భక్తురాలు. ఆయన తీసిన సినిమాల్లోని కథలను అమ్మ చెబుతుంటే వింటూ పెరిగాను. నాకు చిన్నప్పటినుండి విశ్వనాథ్గారు డైరెక్టర్ కాదు, హీరో. నాకు గురువు, దైవం అయిన తనికెళ్ల భరణి గారి దగ్గర మూడేళ్లు అసిస్టెంట్గా పని చేసి తర్వాత 100 సినిమాలకు పైగా మాటల రచయితగా పనిచేశాను. 2011లో నా సొంత బ్యానర్పై తీసిన ‘దేవస్థానం’లో విశ్వనాథ్గారిని డైరెక్ట్ చేసే భాగ్యం నాకు దక్కింది. మళ్లీ 2019లో ఆయనతో పనిచేసే అవకాశం ఈ ‘విశ్వదర్శనం’ సినిమా ద్వారా వచ్చింది. ఈ చిత్రంలో మేం ఆయన బయోగ్రఫీ చూపించటంలేదు. ఇండియాలో ఓ మహాదర్శకుని సినిమాలవల్ల సొసైటీలో ఎలాంటి ప్రభావం ఆ రోజుల్లో పడింది అనేది మా సినిమాలో చూపించబోతున్నాం’’ అన్నారు. ‘‘విశ్వనాథ్ గారి పక్కన కూర్చుని మాట్లాడటమే అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు వివేక్ కూచిభొట్ల. ‘‘విశ్వనాథ్గారి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన కథను నా గొంతుతో డబ్బింగ్ చెప్పటం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు మాళవిక. -
క్వార్టర్స్లో భారత్ ఓటమి
మర్ఖమ్ (కెనడా): యువ షట్లర్ లక్ష్య సేన్ చెలరేగినా ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. మిక్స్డ్ టీమ్ క్వార్టర్ ఫైనల్లో భారత్ 1–3తో దక్షిణ కొరియా చేతిలో పరాజయం పాలైంది. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్లో తనీషా–ధ్రువ్ జంట 22–20, 14–21, 12–21తో నా యున్ జియాంగ్–చాన్ వాంగ్ జోడీ చేతిలో ఓడింది. బాలుర సింగిల్స్లో ప్రపంచ మూడో ర్యాంకర్ లక్ష్యసేన్ 16–21, 21–18, 21–12తో జీ హూన్ చోయ్ పై నెగ్గి ఆధిక్యాన్ని 1–1తో సమం చేశాడు. అనంతరం బాలుర డబుల్స్లో కృష్ణ ప్రసాద్–ధ్రువ్ కపిల జోడీ 21–19, 19–21, 11–21తో యాగ్ షిన్–చాన్ వాంగ్ చేతిలో ఓడింది. బాలికల సింగిల్స్లో మాళవిక 17–21, 12–21తో గా యున్ పార్క్ చేతిలో ఓడటంతో భారత్ పరాజయం ఖాయమైంది. క్వార్టర్ ఫైనల్లో ఓటమి అనంతరం 5 నుంచి 8 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో భారత్ 3–1తో డెన్మార్క్పై గెలిచి నేడు మలేసియాతో పోరుకు సిద్ధమైంది. -
స్క్రీన్ టెస్ట్
‘స్టార్స్ లైఫ్’ ఎప్పుడూ ఆసక్తిగా ఉంటుంది. అసలు వాళ్లు స్టార్స్ కాకముందు ఏం చేసేవారో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా చాలా ఉంటుంది. కొందరు స్టార్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. నేను హీరో కాకముందు చేపల చెరువుల వ్యాపారం చేసేవాణ్ణి. ప్రతి సంవత్సరం నష్టాలే తప్ప ఒక్కసారి కూడా లాభం రాలేదు. ఆ తర్వాత హీరో అయ్యాను అని చెప్పే ప్రముఖ హీరో ఎవరో తెలుసా? ఎ) ్రçపభాస్ బి) కృష్ణంరాజు సి) చిరంజీవి డి) గోపీచంద్ 2. హీరో కాకముందు ఆయన వైజాగ్లో షూమార్ట్ నడిపేవారు. ఆ బిజినెస్ నష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేయాలో తోచక ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించారు. తర్వాత హీరో అయ్యారు. ఎవరా హీరో? ఎ) జె.డి. చక్రవర్తి బి) జగపతిబాబు సి) వెంకటేశ్ డి) శ్రీకాంత్ 3. ఇప్పుడామె ప్రపంచమంతటికీ హీరోయిన్గా తెలుసు. కానీ ఒకప్పుడు కెమెరా అసిస్టెంట్. ఎవరా హీరోయిన్? ఎ) స్నేహ బి) విజయశాంతి సి) రాధిక డి) సుహాసిని 4 జర్నలిస్ట్ అవుదామని జర్నలిజమ్ చదువుకుంది. అయితే తన ఐడియాలను జర్నలిజమ్ ద్వారా చెప్పలేనని పుణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో సినిమాటోగ్రఫీ చేద్దామని వెళ్లినప్పుడు ఓ డైరెక్టర్ పరిచయం అయ్యి, నువ్వు యాక్ట్ చే స్తే బావుంటుంది అనటంతో మనసు మార్చుకుని హీరోయిన్ అయ్యింది. ఎవరా హీరోయిన్ తెలుసా? ఎ) రాధికా ఆప్టే బి) నిత్యా మీనన్ సి) మాళవికా అయ్యర్ డి) మాళవికా నాయర్ 5. నాని హీరో కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారని అందరికీ తెలుసు. కానీ అంతకుముందు మరో శాఖలో కూడా పని చేశారు. ఆయన గతంలో ఏ శాఖలో పని చేశారో తెలుసా? ఎ) సినిమాటోగ్రఫీ బి) డబ్బింగ్ సి) రేడియో జాకీ డి) సింగర్ 6. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘భద్ర’ చిత్రానికి కథారచయితగా చేసిన అతను ఇప్పుడు తెలుగు చిత్రసీమలో ప్రామిసింగ్ డైరెక్టర్. ఆ టాలీవుడ్ ప్రామిసింగ్ డైరెక్టర్ ఎవరబ్బా? ఎ) వంశీ పైడిపల్లి బి) కొరటాల శివ సి) వక్కంతం వంశీ డి) కల్యాణ్కృష్ణ 7. ఒక ఆడియోగ్రాఫర్గా సినీ పరిశ్రమలో జీవితం ప్రారంభించారు ఈయన. భారత దేశంలోని గొప్ప దర్శకుల్లో ఒకరుగా పేరు సంపాందించారు. ఎవరా దర్శకులు? ఎ) కె.విశ్వనాథ్ బి) బాలచందర్ సి) మణిరత్నం డి) కె. రాఘవేంద్ర రావు 8 . మణిరత్నం దగ్గర దర్శకత్వ శాఖలో శిష్యరికం చేశారీయన . శంకర్ సినిమా ద్వారా నటునిగా పరిచయమయ్యారు. ఎవరా హీరో? ఎ) సిద్ధార్థ్ బి) కార్తీ సి) మాధవన్ డి) అజిత్ 9. అతనో సింగర్. సినిమాల్లో పాటలు పాడక ముందు అనేక ఉద్యోగాలు చేశారు. ప్రస్తుతం ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ నోవార్టిస్లో ప్రాజెక్ట్ హెడ్గా పనిచేస్తున్న సింగర్ ఎవరో కనుక్కోండి? ఎ) శ్రీకృష్ణ బి) కారుణ్య సి) సింహా డి) హేమచంద్ర 10. యస్.యస్ తమన్ సంగీత దర్శకునిగా స్థిరపడక ముందు ఓ సినిమాలో లీడ్ క్యారెక్టర్లో నటించి, నటునిగా మంచి మార్కులే సంపాదించాడు. అతను నటునిగా చేసిన చిత్రానికి దర్శకుడెవరో తెలుసా? ఎ) శంకర్ బి) యన్.శంకర్ సి) జయ శంకర్ డి) హరీశ్ శంకర్ 11. కోటగిరి వెంకటేశ్వరావు చిత్ర పరిశ్రమలో చాలా పేరున్న ఎడిటర్. ఆయన దగ్గర ఎడిటింగ్ శాఖలో శిక్షణ పొందిన దర్శకుడెవరో తెలుసా? ఎ) వీవీ వినాయక్ బి) చంద్రశేఖర్ యేలేటి సి) శ్రీను వైట్ల డి) యస్.యస్. రాజమౌళి 12. నిర్మాతగా సినీరంగంలోకి అడుగుపెట్టారు ఈయన. తర్వాత కాలంలో రచయితగా బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకున్నారు. ఎవరాయన? ఎ) గోపీమోహన్ బి) కోన వెంకట్ సి) అబ్బూరి రవి డి) సతీశ్ వేగేశ్న 13. హీరో అర్జున్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన ప్రముఖ హీరో ఎవరో తెలుసా? ఎ) విజయ్ బి) విశాల్ సి) ధనుశ్ డి) శివకార్తికేయన్ 14 హీరో అవ్వకముందు ఆయన రోజూ 80 కిలోమీటర్లు బైక్పై వెళ్లి 1800 రూపాయల జీతానికి బట్టలు తయారుచేసే కంపెనీలో పని చేసిన హీరో ఎవరో తెలుసా? ఎ) అల్లు అర్జున్ బి) విక్రమ్ సి) సూర్య డి) శింబు 15. భక్తవత్సలం నాయుడు సిల్వర్ స్క్రీన్ కోసం మోహన్బాబుగా మారక ముందు ఏం చేసేవారో తెలుసా? ఎ) డ్రిల్ మాస్టర్ బి) మ్యాథ్స్ టీచర్ సి) లెక్చరర్ డి) ఆర్టీసీ కండక్టర్ 16. ప్రస్తుతం క్యారెక్టర్ నటుడుగా బిజీగా ఉన్న కాశీ విశ్వనాథ్ గతంలో దర్శకుడు. ఆయన ఏ సంస్థ ద్వారా దర్శకునిగా పరిచయమయ్యారు? ఎ) సురేశ్ ప్రొడక్షన్స్ బి) వైజయంతి మూవీస్ సి) గీతా ఆర్ట్స్ డి) అన్నపూర్ణ పిక్చర్స్ 17. దాసరి నారాయణరావు దర్శకులు కాకముందు రైటర్గా పనిచేశారు. అంతకంటే ముందు ఆయన ఏం పనిచేసేవారో తెలుసా? ఎ) బ్యాంక్ ఉద్యోగి బి) నాటక రచయిత సి) పోస్ట్ మాస్టర్ డి) రైల్వే ఎంప్లాయి 18. నటుడు కాకముందు ఫైర్ మ్యాన్గా పనిచేసిన ఆ నటుడెవరు? ఎ) యస్వీ రంగారావు బి) గుమ్మడి సి) రాజనాల డి) కాంతారావు 19 . గౌతమ్ మీనన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన ఇప్పటి హీరో ఎవరో తెలుసా? ఎ) ఆది పినిశెట్టి బి) సందీప్ కిషన్ సి) తనీష్æ డి) ప్రిన్స్ 20. హీరో కాకముందు బ్యాడ్మింటన్ క్రీడలో పుల్లెల గోపీచంద్తో కలిసి భారతదేశం తరఫున ఎన్నో టోర్నమెంట్స్లో పాల్గొన్న ఆ నటుడెవరో కనుక్కోండి? ఎ) సుధీర్బాబు బి) నవీన్చంద్ర సి) రాహుల్ రవీంద్రన్ డి) అఖిల్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) బి 3) డి 4) బి 5) సి 6) బి 7) ఎ 8) ఎ 9) సి 10) ఎ 11) డి 12) బి 13) బి 14) సి 1 5) ఎ 16) ఎ 17) బి 18) ఎ 19) బి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
‘నేల టిక్కెట్టు’ బ్యూటీతో వన్స్మోర్
సీనియర్ హీరో రవితేజ కెరీర్ పెద్దగా ఆశాజనకంగా లేదు. వరుసగా టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు సినిమాలు నిరాశపరచటంతో తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు మాస్ మహరాజ్. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటిస్తున్న రవితేజ, తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాలతో ఆకట్టుకున్న విఐ ఆనంద్ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించాడు. ఈ సినిమాలో రవితేజ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో మాళవిక శర్మను హీరోయిన్గా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ఈ భామ రవితేజ సరసన నటించిన నేల టిక్కెట్టు నిరాశపరిచినా మరోసారి మాళవికకు ఛాన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు రవితేజ. -
మానవతా విలువలను గుర్తుచేశా !
సందడి చేసిన మాళవిక : నేలటిక్కెట్ సినిమా విజయోత్సవాల్లో భాగంగా ఆ చిత్ర బృందం గురువారం నగరంలో సందడి చేసింది. చిత్ర దర్శకుడు కల్యాణ్కృష్ణ, హీరోయిన్ మాళవిక శర్మ తదితరులు సాగరతీరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. హీరోయిన్ మాళవిక శర్మ డ్యాన్సులతో అభిమానులను ఉర్రూతలూగించారు. బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): నేటి తరం బిజీ లైఫ్లో పడి మరిచిపోతున్న మానవతా విలువలను గుర్తుచేసేందుకే ‘నేలటిక్కెట్టు’ సినిమా తీశానని చిత్ర డైరెక్టర్ కళ్యాణ్కృష్ణ అన్నారు. రవితేజ నటించిన ఈ సినిమాకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో సాగరతీరంలో వీరు మామ వీటీం ఆధ్వర్యంలో చిత్ర విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ సమాజంలో ప్రతీ ఒక్కరూ మానవత ధృక్పదంతో నడుచుకోవాలని చిత్రంలో చూపించామన్నారు. ఎంత డబ్బు ఉన్నా పది మంది మనుషులు మనచుట్టూ ఉంటేనే గొప్ప అనేది చెప్పామన్నారు. ‘నేలటిక్కెట్టు’ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తాను వైజాగ్కు చెందిన వాడినని అందుకే సిటీ అంటే ఇష్టమన్నారు. తాను చిన్నప్పుడు చూసిన ప్రాంతాల్లో సినిమా షూటింగ్ చేయడానికి ఇష్టపడతానని, అందుకే ప్రతీ సినిమా విశాఖలో షూటింగ్ చేస్తున్నానని తెలిపారు. హీరోయిన్ మాళవికశర్మ మాట్లాడుతూ ఈ చిత్రం తనకు మంచి గుర్తింపు ఇచ్చిందన్నారు. మొదటి చిత్రం కావడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాను తొలిసారిగా విశాఖ వచ్చానన్నారు. విశాఖ ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉందన్నారు. నేలటిక్కెట్టు సినిమాను ప్రతీ ఒక్కరూ చూడదగ్గ చిత్రమన్నారు. చిత్రంలో మత్స్యకారుడి పాత్ర పోషించిన డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగంలో జాతీయ అవార్డులు పొందినప్పుడు రాని ఆనందం సినిమాల్లో నటించినప్పుడు వచ్చిన గుర్తింపుతో పొందుతున్నానన్నారు. కళ్యాణ్ కృష్ణ నాలోని నటుడిని గుర్తించి రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంలో అవకాశం ఇచ్చారన్నారు. అప్పటి నుంచి చాలా మంచి క్యారెక్టర్లు వస్తున్నాయన్నారు. ఇటీవల కాలంలో కొంతమంది సినిమాలను చూడకుండా రివ్యూలను రాసి ప్రేక్షకులను తప్పు దోవ పట్టిస్తున్నారన్నారు. వాటికితోడు కొన్ని రాజకీయలు తోడై ‘నేలటిక్కెట్టు’ చిత్రాన్ని ఆడకుండా చేయాలని అనుకున్నారని, అయితే ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించారన్నారు. వేడుకల్లో భాగంగా హీరోయిన్ మాళవిక చేసిన డ్యాన్స్ ప్రేక్షకుల్లో జోష్ నింపించింది. ఈ సందర్భంగా పదో తరగతిలో ప్రతిభ చూపిన 25 మంది విద్యార్థులకు రూ. 2 వేల చొప్పున చెక్కులు అందజేశారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వీరు మామ వ్యవహరించారు. -
ఆ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్నా..
సాక్షి, మైసూరు: రానున్న విధాన సభ ఎన్నికల్లో మైసూరులోని కే.ఆర్ నియోజక వర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నట్టు ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత మాళవిక అవినాశ్ తెలిపారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కే.ఆర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి టికెట్ ఇవ్వాలని పార్టీ నేతలను కోరామన్నారు. ఈ అంశంపై బీజేపీ అధిష్టానం, రాష్ట్ర నేతలు సానుకూలంగా స్పందిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, మాళవిక 2013 లో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో చురకుగా పనిచేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మాళవిక పోటీ చేస్తుందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ వచ్చినా ఆమె స్పందించలేదు. అయితే తొలిసారి తాను పార్టీ టికెట్ ఆశిస్తున్నట్టు మాళవిక ప్రకటించారు. -
రవికి విజయం ఖాయం!
– దర్శకుడు కె. రాఘవేంద్రరావు ‘‘నా వందో చిత్రంలో హీరో బన్నీ అని ఎప్పుడో డిసైడ్ అయ్యా. అప్పుడు బన్నీ సింగిల్ ఏ.. ఇప్పుడు డబుల్ ఏ.. బన్నీని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది’’ అన్నారు దర్శకుడు కె. రాఘవేంద్రరావు. మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి, మాళవిక జంటగా జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో కె. అశోక్కుమార్ నిర్మించిన ‘జయదేవ్’ ఈ నెల 30న విడుదల కానుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ను విశాఖలో నిర్వహించారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘‘మనకు మంచి జరగాలని గుళ్లోకి వెళ్లినప్పుడు గంట కొడతాం. గంటా శ్రీనివాసరావుకి అన్నింట్లో జయమే. అలా గంటా రవికి కూడా జయమే. టైటిల్లో, డైరెక్టర్ పేరులోనూ జయం ఉంది. ఇంతకన్నా ఈ సినిమాకి కావాల్సింది ఏముంది? యూనిట్కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘గంటా శ్రీనివాసరావుతో మాది పర్సనల్గా, పొలిటికల్గా లాంగ్ జర్నీ. చిరంజీవిగారిపై ఆయనకు ఉండే ఇష్టం నన్ను గంటాను ఎక్కువ ఇష్టపడేలా చేసింది. మా నాన్న (అల్లు అరవింద్) గారికి మంచి ఫ్రెండ్ ఆయన. ‘జయదేవ్’ రవికి మంచి బ్రేక్ ఇచ్చి, గొప్ప భవిష్యత్ అవ్వాలని కోరుకుంటున్నా. సభాముఖంగా జయంత్గారు అని పిలుస్తున్నాను. కానీ పార్టీలో, పబ్బుల్లో మేమిద్దరం వేరేలా పిలుచుకుంటాం. మేం అంత క్లోజ్ ఫ్రెండ్స్’’ అన్నారు. ‘‘నన్ను నమ్మి, వారి అబ్బాయిని నా చేతుల్లో పెట్టినందుకు గంటా శ్రీనివాసరావు, శారదలకు కృతజ్ఞతలు. రవి, మాళవికలకు మనస్ఫూర్తిగా ప్రేక్షకుల ఆశీర్వాదాలు కావాలి’’ అన్నారు జయంత్ సి. పరాన్జీ.‘‘మ్యూజిక్ సూపర్హిట్ అయింది. ప్రతి ఒక్కరూ ‘జయదేవ్’ గురించి మాట్లాడుతున్నారు. నాకు, జయంత్కి ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుంది’’ అన్నారు అశోక్కుమార్. గంటా రవి మాట్లాడుతూ – ‘‘ఈరోజు నేనీ స్టేజిపై నిలబడ్డానంటే కారణం నా తల్లిదండ్రులే. నన్ను నమ్మి నాకు ఈ అవకాశమిచ్చిన జయంత్గారు, అశోక్కుమార్గారికి ధన్యవాదాలు’’ అన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు దంపతులు, కథానాయిక మాళవిక, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు, కెమెరామేన్ జవహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొంచెం గ్యాప్ తర్వాత!
ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా, ప్రేమంటే ఇదే రా వంటి హిట్ చిత్రాలు తీసిన జయంత్ సి. పరాన్జీ కొంత గ్యాప్ తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ‘జయదేవ్’. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కె. అశోక్కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాళవిక కథానాయిక. నిర్మాత మాట్లాడుతూ – ‘‘80 శాతం షూటింగ్ పూర్తయింది. ఒక ఐటమ్ సాంగ్ని హైదరాబాద్లో, మిగిలిన ఒకటిన్నర పాటను ఈ నెల 22 నుంచి 29 వరకు స్విట్జర్లాండ్లో చిత్రీకరిస్తాం. దీంతో షూటింగ్ పూర్తవుతుంది’’ అన్నారు. ‘‘కర్తవ్య నిర్వహణ కోసం కుటుంబాన్ని, జీవితాన్ని త్యాగం చేసే పోలీసాఫీసర్ల స్ఫూర్తితో జయదేవ్ పాత్ర రూపొందించాం. పది యాక్షన్ సీన్స్ కథలో లింక్ అయి ఉంటాయి’’ అన్నారు జయంత్ సి.పరాన్జీ. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. -
‘మిట్’మెచ్చిన మాళవిక
బడికెళ్లి చదివింది ఏడో తరగతే.. అమ్మ పాఠాలతోనే అందలం పైసా ఫీజు లేకుండానే ప్రఖ్యాత యూనివర్సిటీలో ప్రవేశం మేధస్సుతో మన్ననలు అందుకుంటున్న మాళవిక చిట్టి తల్లి బడికెళ్లి చదివింది ఏడో తరగతి వరకే! ఆ తర్వాత ఇల్లే పాఠశాల అయింది!!ఎందుకంటే.. అమ్మ తన పిల్లలకు బడి చదువుల ఒత్తిడి వద్దనుకుంది.. ఇంటి దగ్గరే ఇష్టమైనప్పుడే, నచ్చిందే చదువుకోవాలని భావించింది.పిల్లల కోసం.. చేస్తున్న కొలువు సైతం వదిలి తనే టీచర్గా మారింది..ఆ అమ్మ కృషి వృథా కాలేదు. మాళవిక తనకు ఇష్టమైన ఇన్ఫర్మేటిక్స్లో దూసుకెళ్లింది. ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ ఒలింపియాడ్స్లో వరుసగా మూడేళ్లు పతకాలు సాధించింది. ఆమె మేధస్సును ప్రపంచ ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్) మెచ్చింది. నాలుగేళ్ల వ్యవధి గల బీఎస్ ప్రోగ్రామ్లో చేరమంటూ ఆఫర్ లెటర్ అందించింది. పైసా ఫీజు కట్టకుండా పూర్తిగా స్కాలర్షిప్తో చదువుకోవాలంటూ ఆహ్వానించింది. మిట్ను మెప్పించిన ముంబైకి చెందిన మాళవిక జోషి సక్సెస్ స్టోరీ ఆమె మాటల్లోనే.. అందరూ మిట్ అని పిలిచే ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో చదువుకునే అవకాశం రావడం చాలా సంతోషం కలిగించింది. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్లో వరుసగా మూడేళ్లు పతకాలు సాధించడం వల్ల మిట్ వాళ్లే నేరుగా సంప్రదించి బీఎస్ కోర్సులో పూర్తి స్కాలర్షిప్తో సీటు ఆఫర్ చేశారు. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. వాస్తవానికి నేను ఎలాంటి సర్టిఫికెట్లు, కోర్సులు పూర్తిచేయకుండానే.. ఎంఐటీకి ఎంపిక కావడం వెనుక అమ్మ సుప్రియ జోషి కృషి ఎంతో ఉంది. పిల్లలను మూస ధోరణి, ఒత్తిడితో కూడుకున్న బడి చదువులకు బదులు వారికి ఇష్టమైన రీతిలో చదివించాలని అమ్మ తీసుకున్న నిర్ణయమే నా విజయానికి కారణం. ఇష్టమైన రంగంవైపే అడుగులు వేయాలి మనకు నచ్చిన రంగం వైపు అడుగులు వేస్తే.. అందులో ప్రతిభా పాటవాలు చూపడం ఎంతో సులభం. తద్వారా ఏదో ఒకరోజు తమదైన ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చే అవకాశం లభిస్తుంది. ఈ విషయంలో అమ్మానాన్న ముఖ్యంగా అమ్మ సుప్రియ నాకు, నా చెల్లెలు రాధకు ఇచ్చిన తోడ్పాటు మరువలేనిది. ఎంతమంది విమర్శించినా.. చివరకు నాన్న సైతం ఆందోళన చెందినా.. తాను మాత్రం బెదరకుండా మమ్మల్ని పాఠశాల మాన్పించి ఇంట్లోనే మాకు ఇష్టమైన కోర్సులు చదివేలా చేసింది. అందుకు తగ్గ ప్రతిఫలం లభించింది. చెల్లెలు రాధ కూడా ముంబైలోని ప్రతిష్టాత్మక గ్జేవియర్ కాలేజ్లో ప్రవేశం సొంతం చేసుకుంది. ఒత్తిడి వద్దనే అమ్మ సుప్రియ జోషి, ఒక స్వచ్ఛంద సంస్థలో ఉద్యోగం చేసేది. నాన్న రాజ్ జోషి ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలోనే సొంత వ్యాపారం చేస్తున్నారు. అమ్మ తాను పనిచేసే స్వచ్ఛంద సంస్థలో ఎనిమిది, తొమ్మిది తరగతులు చదువుతున్న పిల్లలు ఎదుర్కొంటున్న బడి పాఠాల ఒత్తిడిని, దానివల్ల వారికి ఎదురవుతున్న సమస్యలను ప్రత్యక్షంగా చూసింది. తన పిల్లల(నేను, చెల్లెలు రాధ) కు ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదని భావించింది. అంతే మమ్మల్ని బడి మాన్పించి ఇంట్లోనే పాఠాలు చెప్పడం ప్రారంభించింది. అందుకోసం అమ్మ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసింది. ఇల్లే పాఠశాల నేను దాదర్ పార్శీ యూత్ అసెంబ్లీ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నప్పుడు మమ్మల్ని బడి మాన్పించేయాలని అమ్మ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి మాకు ఇల్లే పాఠశాల అయింది. చాషక్ గురుకుల్ పేరుతో ఇంట్లోనే ప్రత్యేకంగా హోం స్కూలింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసింది. మా ఆసక్తికి అనుగుణంగా చదువుల్లో రాణించడం కోసం పలు పుస్తకాలు శోధించి ప్రత్యేకంగా సొంత కరిక్యులం రూపొందించింది. ఇలా.. అడుగడుగునా మాకిష్టమైన విధంగా చదివే ఏర్పాట్లు చేసింది అమ్మ. అయితే అమ్మ నిర్ణయాన్ని చాలా మంది విమర్శించారు. సరైన నిర్ణయం కాదనన్నారు. అయినా అమ్మ బెదరలేదు. మాకు మరింత ధైర్యాన్ని ఇచ్చింది. మీకు ఇష్టమైన చదువు చదవండి.. నేనున్నాను అంటూ భరోసా ఇచ్చింది. ఆ భరోసానే ఇప్పుడు నన్ను మిట్లో అడుగుపెట్టేలా చేసింది. శిక్షణకు సైతం అంగీకరించని ఇన్స్టిట్యూట్లు స్కూల్ మానేసిన వెంటనే నాకు ఇష్టమైన ఇన్ఫర్మేటిక్స్, కంప్యూటర్ సైన్స్, విండ్ సర్ఫింగ్ విభాగాల్లో రాణించాలని భావించాను. అందుకోసం నిర్వహించే పలు జాతీయ, అంతర్జాతీయ ఒలింపియాడ్స్కు హాజరవ్వాలి. అందుకు అవసరమైన శిక్షణ తీసుకోవాలని భావిస్తే.. ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా నాకు అనుమతి ఇవ్వలేదు. ఇందుకు వాళ్లు చెప్పిన కారణం ఒకటే.. చేతిలో కనీసం పదో తరగతి సర్టిఫికెట్ కూడా లేదు, నిబంధనలు అంగీకరించవు. సీఎంఐలో శిక్షణ ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా కనీసం శిక్షణనివ్వడానికి సైతం అంగీకరించని పరిస్థితిలో చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ (సీఎంఐ) నాకు వరంలా మారింది. అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఫర్ ఇన్ఫర్మేటిక్స్ భారత కో-ఆర్డినేటర్ సీఎంఐ ప్రొఫెసర్ మాధవన్ ముకుంద్ సహకారం మరువలేనిది. ఆయన్ను సంప్రదించగా నా ప్రతిభను పరీక్షించి శిక్షణకు అంగీకరించారు. సీఎంఐలో శిక్షణకు చేరిన తొలి ఏడాదిలోనే అంటే 2013లోనే ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఫర్ ఇన్ఫర్మేటిక్స్ నేషనల్ ట్రైనింగ్ క్యాంప్నకు ఎంపికయ్యాను. దాంతో ప్రొఫెసర్ మాధవన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అల్గారిథమ్స్, మ్యాథమెటిక్స్ మెళకువలు నేర్పించారు. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్కు సర్వం సన్నద్ధం అయ్యేలా శిక్షణనిచ్చారు. ఎంఐటీ నుంచి పిలుపు సీఎంఐలో శిక్షణతో 2014 నుంచి ఇన్ఫర్మేటిక్స్లో ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్కు హాజరవుతున్నాను. తొలి రెండు సంవత్సరాలు (2014, 2015)లలో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ ఒలింపియాడ్స్లో రజత పతకం; మూడో సంవత్సరం (2016)లో కాంస్య పతకం సొంతమైంది. అల్గారిథమ్స్ వినియోగించి కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్ రూపకల్పనలో చూపిన ప్రతిభకు ఈ పతకాలు లభించాయి. దీంతో అమెరికాలోని మిట్ సహా పలు యూనివర్సిటీలు బీఎస్ కోర్సులో డెరైక్ట్ అడ్మిషన్ ఇస్తామంటూ ముందుకొచ్చాయి. ఎంఐటీ నిబంధనల ప్రకారం- వరుసగా మూడు ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్లో టాప్లో నిలిచిన వారికి నేరుగా బీఎస్ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. నాకు ఎంఐటీ నుంచి 2015లోనే ఆహ్వానం వచ్చింది. మూడో ఒలింపియాడ్లో విజయం సాధిస్తే మేం సీటు ఇవ్వడానికి సిద్ధమంటూ పేర్కొన్నారు. దానికి తగ్గట్లుగానే 2016 ఒలింపియాడ్లోనూ విజయం సాధించడంతో మిట్లో సీటు ఖాయం అయింది. బీఎస్లో ఫ్రీ ఎడ్యుకేషన్ నాలుగేళ్ల బీఎస్ కంప్యూటర్ సైన్స్లో డెరైక్ట్ అడ్మిషన్తోపాటు ఎంఐటీ కల్పించిన మరో సదుపాయం.. ఆ నాలుగేళ్ల కోర్సును ఉచితంగా ఎలాంటి ఫీజు చెల్లించే అవసరం లేకుండా పూర్తిగా స్కాలర్షిప్ మంజూరు చేయడం. మా కుటుంబ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఎంఐటీ ఈ నిర్ణయం తీసుకుంది. పదిహేను రోజుల క్రితమే ఎంఐటీలో అడుగుపెట్టాను. ‘తల్లిదండ్రులు తమ పిల్లల ఇష్టానికి, ఆసక్తికి అనుగుణంగా వ్యవహరించి తోడ్పాటునందిస్తే అందలాలు అందుకుంటారనడానికి ప్రత్యక్ష తార్కాణం.. మాళవిక జోషి. బోర్డ్ పరీక్షలు సైతం పూర్తి చేయకున్నా.. సర్టిఫికెట్లు లేకున్నా.. ఇన్ఫర్మేటిక్స్లో వ్యక్తిగత ఆసక్తితో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి ఎంఐటీలో అడుగుపెట్టింది. తల్లిదండ్రులు తమ పిల్లల్లోని నిజమైన ఆసక్తిని గ్రహించాలి. బడి చదువులతోనే జ్ఞానం వస్తుందనే భావన సరికాదు. కానీ, మన వ్యవస్థలో పదో తరగతి, 12వ తరగతి సర్టిఫికెట్లు లేకుంటే కనీసం దరఖాస్తుకు కూడా అనుమతించని పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయంలో కొంత మార్పు తేవాలి.’ - సుప్రియ జోషి, (మాళవిక జోషి తల్లి) -
కళ్యాణవైభోగమేలో కోడి కూడా హీరోయినే!
‘అలా మొదలైంది’తో డెరైక్టర్ నందినీరెడ్డి పరిచయం చేసిన మలయాళీ నిత్యామీనన్ తెలుగులో ఫుల్ బిజీ. ఇప్పుడు మరో మలయాళీ మాళవికతో శ్రీరంజిత్ మూవీస్ వారికి ‘కళ్యాణవైభోగమే’ తీశారు నందిని. మా మాళవికలో శోభనని చూసుకుంటూ తీశానని నందిని, మా డెరైక్టర్ లవబుల్ ఫిల్మ్ తీశారని మాళవిక అంటున్నారు. వాళ్లిద్దరితో స్పెషల్ చాట్ నందినీరెడ్డిగారూ! ‘కళ్యాణ వైభోగమే’ కథానాయిక కోసం వందలకొద్ది ఫొటోలు చూశారట. అందులో మాళవిక ఫొటోని కూడా చూసి తిరస్కరించారట? నందినీరెడ్డి: మాళవికా నాయర్ ఫొటోని చూశానా లేదా అనేది నాకు డౌటేనండీ. నాయిక పాత్ర కోసం 400 మంది అమ్మాయిల ఫొటోలు చూసింది నిజమే. ఎవరూ నచ్చలేదు. చివరికి ‘ఎవడే సుబ్రమణ్యం’ ఆడియో ఫంక్షన్లో మాళవిక ఎక్స్ప్రెషన్స్, ఫేస్లో అమాయకత్వం చూసి, ఎంచుకున్నా. మాళవికా! ఇదంతా మీరు నమ్ముతారా? మాళవిక: హాహాహా... దర్శకురాలు చెబుతున్నప్పుడు నమ్మాలి కదండీ. తనకి నేను నచ్చినా నేను ఈ సినిమా చేయకూడదనుకున్నా. ట్వల్త్ చదువు తున్నా, ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి వద్దనుకున్నా. కానీ నందిని కథ చెప్పాక నో చెప్పాలనిపించలేదు. నందినీగారూ! అందరూ మాళవికని చూసి నిత్యామీనన్లా ఉన్నారని చెబుతున్నారు? నందినీరెడ్డి: నిత్యకీ, మాళవికకీ మధ్య నాకైతే పోలికలేమీ కనిపించవు. మాళవికను చూసినప్పుడు నాకు శోభన గారు గుర్తుకొస్తారు. అయినా నిత్యలా ఉండాలనో, శోభనలా ఉందనో నేను మాళవికని ఎంపిక చేసుకోలేదండీ. ఒక యాక్టర్కి ముఖ్యమైనవి కళ్లు. తర్వాత నవ్వు చూస్తా. మాళవికలో ఆ రెండూ నచ్చాయి. అందుకే ఎంచుకున్నా. మాళవికగారూ! శోభనలాగా ఉన్నానని మీకెప్పుడైనా అనిపించిందా? మాళవిక: నన్నడిగితే నేనేం చెబుతానండీ(నవ్వుతూ). నేనైతే మా అమ్మానాన్నల పోలికలతో ఉంటాననుకుంటా. నందినీగారూ! ‘అలా మొదలైంది’ కీ,‘కళ్యాణ వైభోగమే’ కీ మధ్య పోలికలేమైనా? ఆ మేజిక్ మరోసారి రిపీటవుతుందా? నందినీరెడ్డి: స్టైల్ ఆఫ్ మేకింగ్ దగ్గరగానే ఉంటుంది. ‘కళ్యాణ వైభోగమే’లో అదనంగా ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా తోడవుతాయి. నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి సీన్ మన ఇంట్లో జరుగుతున్న ఫీల్ కలిగిస్తుంటుంది. మాళవికా! మీరు ‘అలా మొదలైంది’ చూశారా? మాళవిక: ‘ఎవడే సుబ్రమణ్యం’ చేస్తున్నప్పుడే నాని చూడమని తన సినిమాలన్నీ ఇచ్చాడు. ‘అలా మొదలైంది’ అందులో ఉంది. మంచి సినిమా. కానీ ఆ సినిమా చూసినప్పుడైతే నేను నందినితో కలిసి పనిచేస్తానని అనుకోలేదు. నందినీగారూ! ‘జబర్దస్త్’ లాంటి ప్లాప్ తర్వాత తదుపరి మళ్లీ ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందనుకున్నారు? నందినీరెడ్డి: కొన్నాళ్లపాటు మైండ్ పనిచేయలేదు. బన్నీ ఒకరోజు ఫోన్ చేశాడు. ‘ఒకసారొచ్చి కలువు’ అన్నాడు. వెళ్లాక ‘ఏం చేస్తున్నావు’ అని అడిగాడు. ‘ఆర్నెల్లుగా ఇంట్లోనే ఉన్నా’ అన్నా. అప్పుడు క్లాస్ పీకాడు. అప్పుడే ‘జబర్ దస్త్’ ప్లేస్లో చేయాలనుకున్న కథ ఇదని ‘కళ్యాణ వైభోగమే’ కథ చెప్పా. బాగుందని ప్రోత్సహించాడు. స్వప్నాదత్కి కథ చెప్పా. నిర్మిస్తానంది. నిర్మాత కె.ఎల్. దామోదర్ప్రసాద్ గారు శ్రీరంజిత్ మూవీస్ బ్యానర్లో చేద్దామన్నారు. మాళవికా! మీరు ‘కళ్యాణ వైభోగమే’ సినిమా చూశారా? మాళవిక: చూశా. సినిమా చూస్తున్నప్పుడు కథ చెప్పినప్పటికంటే టెన్ టైమ్స్ ఎక్కువగా ఎక్జైట్ అయ్యా. బోలెడంత ప్రేమ, బోలెడంత ఫన్ కనిపిస్తుంది. ఇదివరకు నా కథలన్నీ మా నాన్నగారే వినేవారు, ఆయనే నిర్ణయం తీసుకునేవారు. కానీ ఇది నేను సెలక్ట్ చేసుకున్న తొలి కథ. ఇలాంటిది సెలెక్ట్ చేసుకున్నందుకు గర్విస్తున్నా. సినిమా షూటింగ్లోని సందడికి సంబంధించిన విషయాలేమైనా చెబుతారా? మాళవిక: షూటింగ్ కూడా వైభోగంగానే జరిగింది. సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అంతమంది ఒకచోట కలిసేసరికి పెద్ద ఫ్యామిలీలాగా అయిపోయాం. పెళ్లి పాట సమయంలో బాగా ఎంజాయ్ చేశాం. ట్రైలర్లో నాగశౌర్య కోడికాళ్లు చూసి సెక్సీ లెగ్స్ అంటున్నాడు. ఏంటా కథ? మాళవిక: అది మీరు సినిమాలో చూస్తేనే తెలుస్తుంది. నందిని: మా సినిమాలో హీరోయిన్ మాళవిక మాత్రమే కాదండీ. కామాక్షి కూడా ఉంది. కామాక్షి ఓ కోడి పేరు. కామాక్షి, మాళవిక, నాగశౌర్యల మధ్య సాగే ట్రయాంగిల్ లవ్స్టోరీ అన్నమాట. అప్పటిదాకా వెజిటేరియన్ అయిన మాళవిక, కామాక్షిని చూసి ఏం చేసిందనేది సినిమాలోనే చూడాలి. -
తెలుగు తీరంలో మలబార్ అందాలు!
‘పొరుగింటి పుల్లకూర రుచి’ అని పెద్దలు ఊరకే అనలేదు. మన ఇంట్లో ఉన్న కూర అంటే చిన్న చూపు... పొరుగింటి కూర అంటే వల్లమాలిన వలపు. సినిమా పరిశ్రమలో కథానాయికలకు ఇది బ్రహ్మాండంగా వర్తిస్తుంది. ముఖ్యంగా తెలుగులో తెలుగమ్మాయిల కన్నా పరభాషల తారల హవానే ఎక్కువ. పది, పదిహేనేళ్ల క్రితం ఉత్తరాది భామల సందడి ఎక్కువగా ఉంటే, ఇటీవలి కాలంలో మునుపెన్నడూ లేనంతగా మలయాళ తారల తాకిడి ఎక్కువైందనే చెప్పాలి. ఈ ఏడాది విడుదల కానున్న ముఖ్యమైన తెలుగు చిత్రాల్లో మొదటి నాయికగానో, రెండో నాయికగానో... ఏవరో ఒక మలయాళ తార ఉండడం విశేషం. ఆ కేరళ కుట్టీల గురించి తెలుసుకుందాం.. ఫామ్లో నయనతార, నిత్యామీనన్ ఇప్పటి వరకూ తెలుగు తెరపై తమ సత్తా చాటుకున్న మలయాళ భామలు చాలామందే ఉన్నారు. ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’తో అసిన్, ‘అమ్మాయి బాగుంది’తో మీరా జాస్మిన్, ‘శేషు’తో కల్యాణి, ‘నా ఆటోగ్రాఫ్... స్వీట్ మెమొరీస్’తో గోపిక... ఇలా పన్నెండేళ్ల క్రితం కథానాయికలుగా పరిచయమైన మలయాళ సుందరీమణులు ఇక్కడ బాగానే రాణించారు. వీళ్ల తర్వాత ‘యమదొంగ’తో మమతా మోహన్దాస్, ‘చంద్రముఖి’తో నయనతార తెలుగు తెరపైకి దూసుకొచ్చారు. ఓ ఆరేడేళ్లు మమత ఇక్కడ బిజీగానే సినిమాలు చేశారు. టాప్ స్టార్స్తోనూ, యువ హీరోలతోనూ నటిస్తూ, నయనతార ఇంకా మంచి ఫామ్లోనే ఉన్నారు. ఆ ఇద్దరి తర్వాత తెలుగు తెరను కనువిందు చేసిన మరో బ్యూటీ నిత్యామీనన్. ‘అలా మొదలైంది’తో కథానాయికగా తెలుగు కెరీర్ మొదలుపెట్టి, పాటలు పాడడం, తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం ద్వారా ‘మల్టీ టాలెంటెడ్’ అని నిరూపించుకున్నారు. ప్రస్తుతం వెంకటేశ్ సరసన నయనతార ఓ చిత్రంలో (‘బాబు... బంగారం’) నటిస్తుండగా, ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న ‘జనతా గ్యారేజ్’లో నిత్యామీనన్ ఓ నాయికగా నటిస్తున్నారు. ఇక, గడచిన ఏడాది కాలంలో మలయాళం నుంచి మన తెలుగు తీరానికి వచ్చిన యువతారల గురించి చెప్పాలంటే... మాంచి జోరు మీద మాళవిక ఆల్చిప్పల్లాంటి కళ్లు, ఆకట్టుకునే హావభావాలతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకోగలుగుతారు మాళవికా నాయర్. మొదటి సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’తోనే అభినయ పరంగా కూడా భేష్ అనిపించుకున్నారు. టాలెంట్ ఉన్న తారలను పరిశ్రమ వదిలిపెట్టదన్నట్లుగా నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్, దర్శకురాలు నందినీరెడ్డి దృష్టి మాళవికపై పడింది. అంతే.. ‘కళ్యాణ వైభోగమే’లో కథానాయికగా తీసుకున్నారు. ఈ నెలాఖరులో ఈ చిత్రం విడుదల కానుంది. మలి సినిమాలో కూడా మాళవిక భేష్ అనిపించుకుంటే ఇక కొన్నాళ్లు ఆమె ఇక్కడే బిజీ అయిపోయే అవకాశం ఉంది. తొలి చిత్రంతోనే బోల్డంత కీర్తి తెలుగు తెరపై రాణిస్తున్న తారల్లో పాతికేళ్లు, ఆ పైన వయసున్నవారి సంఖ్య ఎక్కువే. ‘ఫ్రెష్ ఫేస్’లకు సెపరేట్ క్రేజ్ ఉంటుంది కాబట్టి, పాతికేళ్ల లోపు తారలకు క్రేజ్ ఎక్కువే. అందంతో పాటు మంచి అభినయం కూడా కనబరచగలిగితే ఇక తిరుగుండదు. ఏడాది మొదటి రోజున విడుదలైన ‘నేను... శైలజ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కీర్తీ సురేశ్ ఈ కోవకే వస్తారు. మన పక్కింటి అమ్మాయిలా ఉండే కీర్తికి తొలి చిత్రంతోనే బోల్డంత కీర్తి వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఈ బ్యూటీకి బాగానే అవకాశాలు వస్తున్నాయని టాక్. ఓ యువ స్టార్ హీరోతో జతకట్టనున్నారని భోగట్టా. అది కన్ఫర్మ్ అయితే తెలుగు పరిశ్రమ కీర్తికి రెడ్ కార్పెట్ పరిచినట్లే! అన్నట్లు... కీర్తి ఎవరో కాదు... సీనియర్ నటి మేనక కూతురు. అనుపమ... అదరహో! గత ఏడాది మలయాళంలో విడుదలైన ప్రేమకథా చిత్రాల్లో ‘ప్రేమమ్’ది ఓ ప్రత్యేకమైన స్థానం. ఆ చిత్రంలో కీలకమైన పాత్ర చేసిన అనుపమా పరమేశ్వరన్కు బోల్డంత పేరొచ్చింది. చక్కటి నటన కనబరిచిన ఈ అమ్మాయి దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్న ‘అ.. ఆ..’లో నితిన్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. అలాగే, మలయాళ ‘ప్రేమమ్’లో చేసిన పాత్రనే తెలుగు రీమేక్ (‘మజ్ను’)లో అనుపమ చేస్తున్నారు. నాగచైతన్య హీరోగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే రెండో సినిమాలోనూ నటించడం, ఆల్రెడీ మలయాళ ప్రేక్షకులతో భేష్ అనిపించుకున్న నటి కావడంతో అనుపమపై అంచనాలు చాలానే ఉన్నాయి. మంజిమా మోహన్ మాయ బాలనటిగా పలు మలయాళ చిత్రాల్లో నటించి, ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ అనే పాపులర్ మలయాళ చిత్రం ద్వారా కథానాయికగా మారారు మంజిమా మోహన్. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు ఫీల్ గుడ్ మూవీ చిత్రాల దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అవకాశం కొట్టేశారు మంజిమ. నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ రూపొందిస్తున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’లో మంజిమా మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. విశేషం ఏమిటంటే.. ఇదే చిత్రాన్ని తమిళంలో ‘అచ్చమ్ ఎన్బదు మడమయడా’ పేరుతో శింబు హీరోగా తమిళంలో తీస్తున్న చిత్రంలోనూ మంజిమనే కథానాయికగా తీసుకున్నారు గౌతమ్. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ఏ మాయ చేశావె’ ద్వారా సమంత మాయ చేసినట్లుగానే ఇప్పుడు మంజిమా మోహన్ కూడా మాయ చేస్తారేమో చూడాలి. ఒక్క కథానాయికలు మాత్రమే కాదు.. క్యారెక్టర్ నటీనటులుగా కూడా మలయాళ నటీనటులు ఇక్కడ బాగానే రాణిస్తున్నారు. స్టైలిస్ట్ అమ్మ, అత్త అంటే నదియా బాగుంటారని ‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు నిరూపించాయి. ప్రస్తుతం ‘అ...ఆ’లో నదియా నటిస్తున్నారు. ఇక, మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ ‘జనతా గ్యారేజ్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఏకంగా తెలుగు నేర్చేసుకుంటున్నారు. సీనియర్ నటుడు దేవన్ కూడా అప్పుడప్పుడూ తెలుగు చిత్రాల్లో తళుక్కుమంటూ ఉంటారు. మొత్తం మీద కళకు భాషతో సంబంధం లేదనట్లుగా.. మన తెలుగు పరిశ్రమ టాలెంట్ని బాగానే వాడుకుంటోందని చెప్పొచ్చు. అఫ్కోర్స్.. తెలుగమ్మాయిలు నాయికలుగా ఇక్కడ నిలదొక్కుకోవడం కష్టంగానే అనిపిస్తోంది. బిందు మాధవి, శ్రీదివ్య వంటి తెలుగమ్మాయిలు తమిళంలో మంచి జోరు మీద ఉన్నారు. వాళ్లకు పొరుగిల్లే బాగుంది. అందుకే ‘పొరుగింటి పిల్లే ముద్దు’ అనాలేమో! -
చంద్రబాబు నుంచి నా భర్తకు ప్రాణహాని
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని, ఎన్కౌంటర్ పేరుతో మట్టుపెట్టేందుకు కుట్ర జరుగుతోందని కొల్లం గంగిరెడ్డి సతీమణి కొల్లం మాళవిక ఆరోపించారు. తన భర్తను కడప జైలు నుంచి హైదరాబాద్ లేదా తెలంగాణలోని ఏ జైలుకైనా తరలించేలా ఏపీ పోలీసులను ఆదేశించాలని కోరారు. ఈ మేరకు ఆమె తాజాగా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. జైల్లో ఉన్న తన భర్తకు తగిన రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని, చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాజ్యంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల ఎస్పీలు, కడప సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్లను ప్రతివాదులుగా చేర్చారు. అలాగే సీఐడీ అదనపు డీజీ ద్వారకా తిరుమలరావు, ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. చంద్రబాబు కక్ష పెంచుకున్నారు వ్యాపారవేత్త అయిన తన భర్త కొల్లం గంగిరెడ్డిని రాజకీయ కారణాలతో అన్యాయంగా కేసుల్లో ఇరికించారని మాళవిక తన పిటిషన్లో పేర్కొన్నారు. చంద్రబాబుపై అలిపిరి వద్ద జరిగిన హత్యాయత్నం కేసులో తన భర్తను ఇరికించారని, అయితే కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో తన భర్తపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని, అందులో భాగంగానే గతేడాది మేలో గవర్నర్ను కలిసి వినతిపత్రం సమర్పించారని తెలిపారు. మా కుటుంబ సభ్యులనూ తప్పుడు కేసుల్లో ఇరికించారు ‘‘చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత నా భర్తను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. నా భర్తపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. వాస్తవానికి ఆ కేసులు జరిగే సమయానికి ఆయన విదేశాల్లో ఉన్నారు. ఈ విషయం తెలిసి కూడా తప్పుడు కేసులు బనాయించారు. నా భర్తను మాత్రమే కాకుండా మా కుటుంబ సభ్యులను కూడా తప్పుడు కేసుల్లో ఇరికించారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రత్యక్షంగా నా భర్తపై కేసులు పెట్టేందుకు ఆధారాలు లేకపోవడంతో సహ నిందితులు ఇచ్చే వాంగ్మూలాల ఆధారంగా కేసులు పెడుతున్నారు. ఎన్కౌంటర్ పేరుతో ఆయనను అంతమొందించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. జైల్లో గానీ, కోర్టులకు తీసుకొచ్చే దారిలోగానీ హతమార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై ఈ నెల 20న గవర్నర్కు సైతం ఫిర్యాదు చేశాను. పోలీసులు నా భర్తను ఎర్ర చందనం స్మగ్లర్గా చిత్రీకరిస్తూ, ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆయనపై 28 కేసులున్నట్లు ఈ నెల 15న మీడియా సమావేశంలోప్రకటించారు. తన ప్రాణాలను కాపాడాలని నా భర్త కోరారు. కాబట్టి ఆయనను ప్రస్తుతం ఉన్న కడప జైలు నుంచి హైదరాబాద్ లేదా తెలంగాణలోని ఏ జైలుకైనా తరలించేలా ఆదేశాలు ఇవ్వాలి. తనకు ఎలాంటి ప్రాణహాని లేదని పోలీసులు నా భర్త చేత బలవంతంగా చెప్పించారు. ఈ విషయాన్ని ఆయనే నాకు చెప్పారు. నా భర్తను మారిషస్ నుంచి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రధానమంత్రి కార్యాలయ జోక్యాన్ని కూడా కోరారు. డీజీపీ, సీఐడీ అదనపు డీజీలు ముఖ్యమంత్రి చెప్పినట్లు నడుచుకుంటున్నారు. అందులో భాగంగా మీడియా పరేడ్ నిర్వహించారు. ఇది సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడమేనని తెలిసినా చేస్తున్నారు. కాబట్టి ఈ వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి’’ అని కొల్లం మాళవిక తన పిటిషన్లో విన్నవించారు. -
పిస్టల్ చూపించి బెదిరించారు
* అందుకే నా భర్త ప్రాణహాని లేదని చెప్పారు * లేదంటే భార్యాపిల్లలను మళ్లీ చూడలేవన్నారు * గంగిరెడ్డి భార్య మాళవిక ఆరోపణ * కక్షసాధింపుతోనే తప్పుడు కేసులు పెట్టారు * ఆయనపై ఉన్నవి రెండు కేసులే.. * ఇపుడు ఏకంగా చంపాలని చూస్తున్నారు * ఏం జరిగినా చంద్రబాబు సర్కారుదే బాధ్యత సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలపై పోలీసుల అదుపులో ఉన్న గంగిరెడ్డికి టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఆయన భార్య మాళవిక ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తను ఎన్కౌంటర్ చేస్తారని భయంగా ఉందన్నారు. మారిషస్ నుంచి తరలిస్తుండగా గంగిరెడ్డిని పోలీసులు పిస్టల్తో బెదిరించి భయపెట్టటంతో ప్రాణహాని లేదని మీడియాకు చెప్పారని తెలిపారు. తన భర్త ప్రాణాలను కాపాడాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. తన భర్తకు ఏదైనా అయితే అందుకు చంద్రబాబు ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. శనివారం ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ కక్షసాధింపుతోనే తన భర్తపై తప్పుడు కేసులు పెట్టారని పేర్కొన్నారు. వివరాలు ఆమె మాటల్లోనే.. బెదిరించి చెప్పించారు 'నా భర్తను మారిషస్ నుంచి తీసుకొచ్చే మార్గంలో పిస్టల్తో బెదిరించారు. వారు చెప్పినట్లు చెప్పకపోతే భార్య, పిల్లలను కూడా చూసుకోలేవంటూ భయపెట్టారు. అందుకనే మొన్న మీడియాతో మాట్లాడుతూ తనకు ఎలాంటి ప్రాణహానీ లేదని చెప్పారు. కానీ నేను జైలుకు వెళ్లి ఆయన్ను కలిస్తే తాను ఎందుకలా చెప్పాల్సి వచ్చిందో వివరించారు. పిస్టల్తో బెదిరించారు. మిమ్మల్ని మళ్లీ చూస్తానో లేదోనన్న భయంతో అలా చెప్పాల్సి వచ్చిందని తెలిపారు. ఇటీవల బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది అమాయకులను తీసుకువచ్చి అడవిలో ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ఆయన్ను కూడా అలా చేస్తారని భయంగా ఉంది. పారిపోతున్నారు.. పారిపోతున్నారు అని పదేపదే చెబుతున్నారు. కానీ మా ఆయన పారిపోవడం లేదు. కోర్టు ఎలాంటి శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మాకు అనుమానాలున్నాయి. అందుకే మీడియా ద్వారా గవర్నర్గారికి విజ్ఞప్తి చేసుకునేదేమిటంటే... మేం మీ దగ్గరకు వచ్చి లేఖ ఇచ్చేంత శక్తి కలిగిన వాళ్లం కాదు సార్.. నా మాటలను మీరు పరిగణనలోకి తీసుకుని నా భర్తకు ఎలాంటి హానీ లేకుండా సురక్షితంగా ఉండేటట్లు చూడాలని కోరుతున్నాను... జైలులో ఆయనను ఏమన్నా చేస్తారన్న అనుమానాలు ఉండబట్టే నేను ఇలా మీడియా ముందుకు రావలసి వచ్చింది. జైలులో గానీ, కోర్టుకు తీసుకెళ్లే సమయంలో గానీ, ఆహారం ద్వారా గానీ దేనిద్వారా అయినా ఆయనకు హాని జరిగితే అందుకు పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వమే వహించాలి.. నాడు చంద్రబాబే తెలియదని చెప్పలేదా? అలిపిరి ఘటనలో 2003లో మా ఆయన్ను ఇంటరాగేషన్ పేరుతో తీసుకెళ్లి చాలా హింసించారు. మానసికంగానే కాదు శారీరకంగానూ హింసించారు. ఇప్పుడు కూడా కస్టడీకి తీసుకునేటపుడు గానీ, వాయిదాలకు తీసుకెళ్లే మార్గమధ్యంలో గానీ ఎన్కౌంటర్ చేస్తారని భయంగా ఉంది. అలిపిరి ఘటనలో నా భర్త ప్రమేయమున్నదన్న వార్తలు అవాస్తవం. ఆనాటి చానళ్ల వార్తలు గానీ, పేపర్ల వార్తలు గానీ చూడండి. ఎక్కడా నా భర్త పేరు లేనేలేదు. మా ఆయన అంతటివాడు కాదు. కేవలం కక్ష సాధించడానికే ఈ కేసులు పెట్టారు. ఆనాడు చంద్రబాబు స్వయంగా కోర్టుకు వెళ్లి ఈయనెవరో తనకు తెలియదని చెప్పారు కూడా. రెండే కేసులు.. మిగిలినవన్నీ కక్షపూరితం.. డీజీపీ రాముడుగారు గంగిరెడ్డిపై 28 కేసులున్నాయని చెబుతున్నారు. వాస్తవానికి ఆయనపై రెండే కేసులున్నాయి. వాటిలో ఒక కేసులో శిక్ష అనుభవించారు. కానీ ఆయనను మారిషస్ నుంచి తీసుకురావడం కోసం రద్దయిపోయిన కేసులో ప్రత్యేకంగా జీవో జారీ చేసి అక్కడి నుంచి తీసుకువచ్చారు. ఇవన్నీ కక్షపూరిత చర్యలు కావా.. అందుకనే మాకు అనుమానాలున్నాయి. ఆయన బెరైటిస్ ఎక్స్పోర్ట్ పర్మిషన్ల కోసం దుబాయి వెళ్లారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నర్కు లేఖ ఇచ్చారు. ఆ తర్వాత లుక్ అవుట్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దానివల్ల భయపడి ఆయన అక్కడ ఉండి ఉండవచ్చు కానీ పారిపోయే ఉద్దేశం ఆయనకు లేదు. ఆయనపై మోపిన కేసులకు ఆయనకు సంబంధం లేదు. అందుకు అనేక ఉదాహరణలు చెప్పగలను. ఆయన దుబాయిలో ఉన్నారని అన్ని మీడియాలలో వచ్చింది. కానీ ఆయన కోడూరు తాలూకా ఓబుళవారిపల్లిలో దగ్గరుండి ఎర్రచందనం మోయిస్తున్నారని కేసులు పెట్టారు. చంద్రబాబునాయుడి మెప్పు పొందడం కోసమే పోలీసులు ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారు. రాజకీయంగా కక్షసాధించేందుకే.. మొదటి నుంచి మేం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. 1992 నుంచి మాపై కక్షసాధిస్తున్నారు. 2003లోనూ, 2014లోనూ ఎన్నికల ముందు ఆయనపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. మా తాతగారైన పెంచలరెడ్డిగారు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1981 వరకు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1982లో మా బావగారైన బ్రహ్మానందరెడ్డిగారు పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన మండలాధ్యక్షుడిగా, డీసీసీ బ్యాంకు చైర్మన్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కోడూరు తాలూకా పార్టీ ఇన్చార్జిగా ఉన్నారు. మా తండ్రిగారైన బాబుల్రెడ్డి పుల్లంపేట ప్రెసిడెంట్ కాగా, మా అమ్మగారు అనాసంద్రం ప్రెసిడెంట్. మాది పూర్తిగా రాజకీయ కుటుంబం. అందుకే టీడీపీవారు కక్షసాధిస్తున్నారు. మాకు వేల కోట్ల ఆస్తులా..? నాటుసారా కాసి ఈ స్థితికి ఎదిగామని ఆరోపిస్తున్నారు. కానీ అది సరికాదు. మాకు వేల కోట్ల ఆస్తులున్నాయన్నది కూడా వట్టిమాట. వ్యవసాయ కుటుంబం మాది. 2000 సంవత్సరం నుంచి సాయిబాలాజీ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ ఉంది. మా ఆస్తి మూడునాలుగు కోట్లుంటుంది. అది కూడా కన్స్ట్రక్షన్స్ కంపెనీలో వర్క్లు చేశాం. హెచ్ఆర్ పల్వరైజింగ్ మిల్లు ఉంది. లీజుకు తీసుకున్న పెట్రోల్ బంక్ ఉంది. అంతేకానీ నాటుసారా కాసేంత దుస్థితిలో మేం లేం.'అని మాళవిక వివరించారు. -
గంగిరెడ్డికి ఏం జరిగినా వారిదే బాధ్యత
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన గంగిరెడ్డికి ప్రాణహాని ఉందని అతని భార్య మాళవిక ఆందోళన వ్యక్తం చేసారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తప్పుడు కేసులు బనాయించి జైల్లోనే అంతం చేయ్యాలని కుట్ర జరుగుతుందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడుపై అలిపిరి దాడి కేసుతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనే కోర్టు నిర్ధారించిందని మాళవిక ఈ సందర్భంగా గుర్తు చేశారు. గంగిరెడ్డి విదేశాలకు పారిపోయాడనటంలో నిజంలేదని రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయటంతో స్వదేశానికి తిరిగిరాలేదని తెలిపారు. మారిషస్ నుంచి గంగిరెడ్డిని హైదరాబాద్ తరలిస్తున్న సమయంలో అధికారులు రివాల్వర్తో బెదిరించారని అన్నారు. తన భర్తకు ఏం జరిగినా ఏపీ పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం అతడు.. కడప సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నాడు. -
పెళ్లి ప్రకటనే పెట్టుబడి
వరుడు కావాలని ప్రొఫైల్ క్రియేట్ చేసిన వివాహిత ఎన్ఆర్ఐనని నమ్మించి రూ.35 లక్షలు కాజేత సీీసీఎస్ ఎదుట ఆత్మహత్యకు యత్నించిన నిందితురాలు సిటీబ్యూరో: ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో మోసానికి పాల్పడింది. సీసీఎస్ డీసీపీ పాలరాజు కథనం మేరకు..బేగంపేటకు చెందిన మాలవిక (32)కు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి కోసం వరుడు కావాలని మ్యాట్రిమోని డాట్ కామ్ వెబ్సైట్లో త న తప్పుడు ప్రొఫైల్ను పెట్టింది. చిన్న పిల్లల వైద్యురాలినని.. ప్రొఫైల్లో ‘తాను అమెరికాలో పుట్టాను. ఇండియాలో అమ్మమ్మ చనిపోవడంతో తాతయ్య ఆరోగ్యం చూసుకునేందుకు వచ్చాను. తాను చిన్న పిల్లల నిపుణుల డాక్టర్ని, నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తాను. ఇంకా పెళ్లి చేసుకోలేదు. వరుడు కావలెను. నాకు చాలా చోట్ల ఆస్తులు ఉన్నాయని’ పేర్కొంది. ట్రాప్లో పడ్డ ఎన్ఆర్ఐ ఆమె ప్రొఫైల్ను చదివి అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయుడు జి.ప్రశాంత్ ఆమెను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. ప్రేమలో పడ్డ అతగాడు ప్రతిరోజు సెల్ఫోన్, ఇంటర్నెట్లో వీడియో చాట్ చేసేవాడు. తన అవసరాల నిమిత్తం కొంత డబ్బు కావాలని కోరడంతో ఆమె అకౌంట్లోకి విడతల వారీగా మొత్తం రూ.35 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. ఇక పెళ్లి చేసుకునేందుకు గత నవంబర్లో ప్రశాంత్ ఇండియాకు రావడంతో ఆమె గుట్టు రట్టు అయ్యింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై చీటింగ్ కేసు నమోదైంది. అయితే ఆమె మకాం మార్చడంతో పోలీసులకు దొరకలేదు. దర్యాప్తులో భాగంగా ఆమె ఆచూకీని ఎట్టకేలకు పోలీసులు కనుగొన్నారు. విచారణ నిమిత్తం సీసీఎస్కు రావాలని పోలీసులు కోరారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆమె సీసీఎస్ కార్యాలయం వద్దకు వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే పోలీసులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆమె బ్యాగ్లో సూసైడ్ నోట్ లభించింది. అందులో..తన పరువు పోయిందని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసింది. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటుంది. -
'విచారణకు ముందే మాళవిక విషం తాగింది'
హైదరాబాద్ : సీసీఎస్ కార్యాలయంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాంతో ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే ఎన్ఆర్ఐని మోసం చేసిన కేసులో మాళవిక అనే మహిళను నిన్న పోలీసులు విచారిస్తున్నారు. అయితే పోలీసులు విచారిస్తుండగానే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు మాళవికను హుటాహుటీన చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. ఆమె విషం తాగినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా వెబ్సైట్లో వరుడు కావాలని ప్రకటనలు ఇస్తూ మాళవిక మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఓ ఎన్ఆర్ఐని ఆమె మోసం చేయటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంపై సీసీఎస్ డీసీపీ పాలరాజు మాట్లాడుతూ విచారణకు ముందే మాళవిక విషం తాగి సీసీఎస్కు వచ్చినట్లు తెలిపారు. ఆమో వద్ద సూసైడ్ నోట్ లభించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా ఓ ఎన్ఆర్ఐని మోసం చేసినట్లు ఫిర్యాదు అందిన నేపథ్యంలో మాళవికను విచారణకు పిలిచినట్లు డీసీపీ చెప్పారు. -
ఆ రాత్రి ఏం జరిగింది?
ఒక రాత్రిలో ఇద్దరమ్మాయిల జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? అనే అంశంతో చైల్డ్ ట్రాఫికింగ్ నేపథ్యంలో రూపొందిన ఓ తమిళ చిత్రం ‘ఒక రాత్రిలో ఇద్దరమ్మాయిలు’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. బాలాజి.కె.కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్తాఫ్ విడుదల చేస్తున్నారు. పూజా రామచంద్రన్, మాళవిక, వినోద్, కృష్ణ ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్లో విడుదల చేశారు. అల్తాఫ్ మాట్లాడుతూ -‘‘ఓ సాయంత్రం ప్రారంభమై, మర్నాడు తెల్లవారుజాము ముగిసే కథతో ఈ చిత్రం ఉంటుంది. త్వరలోనే రిలీజ్’’ అని చెప్పారు. -
ఆ సమయంలో చంపేసినా నేరంకాదు:నటి మాళవిక
బళ్లారి (కర్ణాటక) : లైంగిక వేధింపులు, అత్యాచార సమయాల్లో మగాళ్లను చంపినా నేరం కాదని ప్రముఖ నటి మాళవిక అవినాష్ అన్నారు. బళ్లారిలోని గాంధీభవన్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘సబల శక్తి విద్యార్థిని' సదస్సులో ఆమె ప్రసంగించారు. మహిళలు, యువతులే కాకుండా చిన్నారులకూ భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారాలు, వేధింపులకు పాల్పడే వారిపై 1886లో ఇంగ్లండ్ కోర్టు జారీ చేసిన సెక్షన్ 376 కింద శిక్ష అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆత్మరక్షణ కోసం ప్రతి విద్యార్థిని ఓ చిన్న కత్తిని ఉంచుకోవాలని సూచించారు. ఇరుగుపొరుగు ఇళ్లలో మహిళలపై వేధింపులు ఉంటే వెంటనే బాధితురాలి పక్షాన నిలిచి ఆదుకోవాలన్నారు. దేశంలో 40 లక్షల మంది మహిళలు అంతర్జాతీయ సెక్స్ మాఫియాలో బందీలయ్యారని మాళవిక ఆవేదన వ్యక్తం చేశారు. -
నా తొలి పాటే బాలూ గారితోపాడాను!
శ్రావ్యమైన గానం, శుద్ధమైన గాత్రం.. వెరసి మాళవిక. యుగళగీతం, విరహగీతం, భక్తిగీతం, ఫాస్ట్ బీట్.. ఇలా ఏ తరహా గీతానికయినా సరే... తన గానంతో ప్రాణం పోయగల దిట్ట తను. పదకొండేళ్ల సినీ సంగీత ప్రయాణంలో ఎన్నో మంచి పాటలు పాడి, తెలుగు శ్రోతల మనసుల్ని గెలిచిన ఈ యువగాయనితో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ... ఈ సంగీత ప్రయాణం ఎలా ఉంది? చాలా బావుందండీ... నాకే కాదు, నా తోటి సింగర్స్కు కూడా తగిన ప్రోత్సాహం లభిస్తోంది. గతంతో పోలిస్తే... మీ తరానికి కాస్త పోటీ ఎక్కువే కదా! అవును. అప్పట్లో తక్కువ మంది సింగర్లు ఉండేవారు. అందుకే వారికి ఎక్కువ పాటలు పాడే అవకాశం దక్కింది. మాకు ఆ పరిస్థితి లేదు. అయితే... అందరికీ పాడే అవకాశాలు లభించడం మాత్రం ఆనందంగా ఉంది. ఏ రంగంలోనైనా కొంత మంచి, కొంత చెడు సహజమే కదా! మీ తోటి సింగర్లలో మీకు నచ్చిన వాళ్లెవరు? అందరూ మంచి సింగర్లే. ఎవరికుండే ప్రత్యేకతలు వారివే. సరే.. గాయనిగా మీకు ప్రేరణ? ఎస్.జానకిగారు. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ప్రభావం కూడా నాపై ఉంటుంది. క్లాసికల్ నేర్చుకున్నారా? ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. డీవీ మోహనకృష్ణగారు నా గురువు. ఇప్పటికే బి.ఏ మ్యూజిక్ చేశాను. ఇక వెస్ట్రన్ మ్యూజిక్ విషయానికొస్తే... ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్లో 6వ గ్రేడ్ చేశాను. నాకు తొలి గురువు మా అమ్మే. మా అమ్మ మ్యూజిక్ టీచర్. చాలామంది మా ఇంట్లోనే సంగీతం నేర్చుకుంటూ ఉండేవారు. అలా చిన్నప్పట్నుంచీ సంగీతం నా జీవితంలో భాగమైపోయింది. అమ్మ దగ్గరే బేసిక్స్ నేర్చుకున్నా. మీ స్వస్థలం ఎక్కడ? విశాఖపట్నం.. అక్కడే పెరిగాను. నాన్న రిటైర్డ్ సివిల్ ఇంజినీర్. 6వ తరగతి చదువుతున్నప్పుడే... ‘పాడుతా తీయగా’ చిల్డ్రన్స్ సిరీస్లో పాల్గొని విన్నర్గా నిలిచాను. మరి సినీగాయనిగా ఎలా మారారు? సంగీత దర్శకుడు ఆశీర్వాద్గారు ‘రాక్ఫోర్డ్’ అనే ఆంగ్ల చిత్రానికి నాతో ఓ ఇంగ్లిష్ పాట పాడించారు. తర్వాత ఆయనే... ‘బాలీవుడ్ కాలింగ్’ అనే హిందీ చిత్రానికి హిందీ పాట పాడించారు. శంకర్మహదేవన్ గారితో కలిసి ఆ పాట పాడాను. ఆ రెండు ఆల్బమ్స్నీ కీరవాణిగారు విన్నారు. ఆయనకు నచ్చి నాకు ‘గంగోత్రి’ (2003) సినిమాకు పాడే అవకాశం ఇచ్చారు. ‘నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం’ నేను పాడిన తొలి తెలుగు సినిమా పాట. తొలిపాటకే గొప్ప స్పందన లభించింది. ఇక ఆ తర్వాత మీకు తెలిసిందే. పన్నెండేళ్ల ప్రాయంలో ‘పాడుతా తీయగా’ విజేత అయినప్పుడు బాలూగారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. అలాంటి మీరు.. తొలి పాటే బాలూగారితో పాడటం ఎలా అనిపించింది? అది డ్యూయెట్ అని తెలుసుకానీ... నాతో పాడేది బాలు గారని తెలీదు. పైగా ఇదివరకులా కలిసి పాడనవసరం లేదు కదా. ఎవరి ట్రాక్ వారు పాడేసుకోవడమే. పాటంతా విన్నాక కానీ నాకు తెలీలేదు... మేల్ సింగర్ బాలూగారని. బాలూగారు కూడా నన్నెంతో మెచ్చుకున్నారు. ఇప్పటికి ఎన్ని అవార్డులు అందుకున్నారు? ప్రైవేటు అవార్డులు చాలా వచ్చాయి. నంది అవార్డులు మాత్రం రెండు అందుకున్నాను. ఒకటి టీవీ రంగం నుంచి వస్తే, రెండోది సినీరంగం నుంచి వచ్చింది. ‘మేలుకొలుపు’ అనే బుల్లితెర కార్యక్రమానికి మాధవపెద్ది సురేశ్గారి స్వర రచనలో ఓ పాట పాడాను. దానికి నంది రాగా, రెండో నంది... ‘రాజన్న’ సినిమాకు గాను నేను పాడిన ‘అమ్మా అవనీ..’ పాటకు లభించింది. మీకు బాగా పేరు తెచ్చిన పాటలు? ‘గంగోత్రి’లో ‘నువ్వు నేను...’, ‘బిల్లా’లో ‘బొమ్మాలీ...’, ‘ఏక్నిరంజన్’లో ‘ఎవరూ లేరని అనకు’, ‘ప్రేమకథాచిత్రమ్’లో ‘వెన్నెలైనా చీకటైనా’, ‘వరుడు’లో ‘అయిదు రోజుల పెళ్లి’... ఇలా చాలా ఉన్నాయి. మీరు బాగా కష్టపడి పాడిన పాట? ‘అమ్మా అవనీ...’. ఆ పాట సందర్భం సినిమాకు చాలా కీలకం. ఎంతో ఫీలై పాడాల్సిన పాట. అందుకే జాగ్రత్తలు తీసుకొని పాడా. సంగీత దర్శకత్వం చేసే ఆలోచన ఉందా? లేదండీ... సంగీత దర్శకులందరి స్వరరచనలో పాడాలని ఉంది. వారి ప్రోత్సాహం వల్లే ఈ రోజు ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి రాగలిగాను. నిజంగా వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ఎన్నేళ్లు గడిచినా గుర్తుండిపోయే పాటలు పాడాలని ఉంది. నా లక్ష్యం అదే. -
ఆందోళనలతో దద్ధరిల్లిన ఉద్యాన నగరి
అత్యాచార ఘటనలపై ప్రజాసంఘాలు ఆందోళన సాక్షి ప్రతినిధి, బెంగళూరు : స్థానిక ఫ్రేజర్ టౌన్లో పీజీ విద్యార్థినిపై, మారతహళ్లిలోని విబ్గ్యార్ స్కూలులో చిన్నారిపై జరిగిన అత్యాచారాలకు నిరసనగా నగరం గురువారం ఆందోళనలతో హోరెత్తింది. వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు లైంగిక దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఇక్కడి రేస్ కోర్సు రోడ్డులోని హోం మంత్రి కేజే. జార్జ్ నివాసాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. అత్యాచారాలకు పాల్పడిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ, వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి, సాయంత్రం విడుదల చేశారు. బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు పులకేశి న గర్ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పీజీ విద్యార్థినిపై లైంగిక దాడికి సంబంధించిన కేసు తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నించిన ఇన్స్పెక్టర్ మహమ్మద్ రఫిక్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మైసూరు బ్యాంకు సర్కిల్లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఫ్రేజర్ టౌన్ సంఘనటకు సంబంధించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. సినీ నటి మాళవిక, ఎమ్మెల్సీలు విమలా గౌడ, తార, ఎమ్మెల్యే శశికళ జొల్లె ప్రభృతులు ఆందోళనలో పాల్గొన్నారు. జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు ఆనందరావు సర్కిల్లో ధర్నా నిర్వహించారు. లైంగిక దాడులకు పాల్పడిన వారిని గుర్తించడంలో విఫలమైనందుకు హోం మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రేమించాలంటూ వెంటబడ్డారు!
తనను ప్రేమించాలంటూ ఎంతో మంది వెంటబడ్డారని నటి మాళవిక వేల్స్ తెలిపారు. కేరళ త్రిచూర్ నుంచి కోలీవుడ్కు కొత్తగా వచ్చిన ఈమె ఇంకా చాలా చెప్పారు. ‘‘నాకు భరతనాట్యం, కూచిపూడి, మోహినీయాట్టం తెలుసు. 2009లో మిస్ కేరళ పోటీలో ‘బ్యూటిఫుల్ ఐస్’ అవార్డు అందుకున్నాను. ఆ కార్యక్రమంలో నన్ను చూసిన వినీత్ శ్రీనివాసన్ ‘మలర్వాడి ఆర్ట్స్ క్లబ్’ అనే చిత్రంలో నన్ను పరిచయం చేశారు. ఆ తర్వాత కన్నడ చిత్ర అవకాశం వచ్చింది. ఆ తర్వాత తమిళంలో ‘అళగు మగన్’ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నాను. తర్వాత ‘ఎన్న సత్తం ఇంద నేరం’ చిత్రంలో అవకాశం లభించింది. ఒకే ప్రసవంలో జన్మించిన అక్షితి, ఆప్తి, ఆకృతి, అతిథి అనే నలుగురు చిన్నారులతో నటించే అవకాశం లభించింది. చిత్రం ఈ నలుగురిపైనే కేంద్రీకృతమైంది. దర్శకుడు జయం రాజా, కాదల్మన్నన్ మా ను, నితిన్ సత్యాతో కలిసి నటించాను’’ అన్నారు మాళవిక వేల్స్. ఎంతో మంది మాళవికలు ఉన్నారుగా? తెలుసు. వాళమీను మాళవిక, అణ్ణి మాళవిక, మాళవికా నాయర్, మాళవికా మేనన్ అంటూ కొందరున్నారు. నాకిది తల్లిదండ్రులు పెట్టిన పేరు. అందుచేత దీనిని మార్చేది లేదు. ఒక్కొక్కరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నాకు మాళవిక వేల్స్ అని ఉందిగా! గ్లామర్గా నటిస్తారా? కచ్చితంగా లేదు. త్రిచూర్లో భావన ఇంటి పక్కనే వుంది మా ఇల్లు. ఆమె నేను ఫ్రెండ్స్. ఇంతవరకు ఆమె గ్లామర్గా నటించలేదు. నాకు అదే ఉద్దేశం ఉంది. ఫ్యామిలీ ఇమేజ్ మాత్రమే కావాలి. ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చే విధంగా నటించాలని ఆశపడుతున్నాను. డ్రీమ్ రోల్? పది చిత్రాల్లో నటించాను. ఈలోపున డ్రీమ్ రోల్ గురించి ఎలా చెప్పగలను. అలా దేనికీ ఫిక్స్ అవకూడదు. ఏ రోల్లో ప్రతిభను నిరూపించుకోగలమనే విశ్వాసం ఉందో, అందులో వంద శాతం నటన ప్రదర్శిస్తా. డ్యాన్స్కు అధిక ప్రాధాన్యత ఇస్తాను. కేరళలో జరిగే ఉత్సవాల్లో నా భరతనాట్య ప్రదర్శనకు స్థానం ఉంటుంది. లవ్ చేశారా? ప్లస్ టూలో కొందరు వెంటబడ్డారు. వారిని అమ్మా, నాన్నల వద్దకు తీసుకువెళ్లి నిలబెట్టాను. తల్లిదండ్రులు వారికి ‘ఈ వయసులో ప్రేమేంటి? బుద్ధిగా చదువుకుని ముందుకు సాగండి!’ అంటూ సూచించారు. ఆ తర్వాత వారు నన్ను డిస్టర్బ్ చేయలేదు. మలయాళం, తమిళ్, తెలుగులో అవకాశాలు వస్తున్నాయి.