Miss India
-
అనార్కలీ డ్రెస్లో మహారాణిలా వెలిగిపోతున్న మాజీ మిస్ ఇండియా (ఫోటోలు)
-
Nikita Porwal: టీవీ యాంకర్ టు మిస్ ఇండియా
మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన నికిత పొర్వాల్ మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది. టీవీ యాంకర్గా, నటిగా కెరీర్ మొదలుపెట్టి ఒక సామాన్య కుటుంబం నుంచి ఆమె ఈ గుర్తింపు పొందింది. ‘మన జీవితానికి ఒక విలువ ఉండాలి. మనం లేకపోతే నష్టాన్ని అనుభూతి చెందాలి’ అంటుంది నికిత పొర్వాల్. అక్టోబర్ 16 (బుధవారం) ముంబైలో జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా 2024’ ఫైనల్స్లో నికిత పొర్వాల్ కిరీటధారిగా నిలిచింది. 27 రాష్ట్రాల నుంచి మొత్తం 30 మంది పోటీ పడితే నికిత మొదటి స్థానంలో నిలిచింది. దాద్రా నాగర్ హవేలీకి చెందిన రేఖాపాండే రెండో స్థానంలో, గుజరాత్కు చెందిన ఆయూషీ ఢోలాకియా మూడో స్థానంలో నిలిచింది. సంగీతా బిజిలానీ, నేహా ధూపియా తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మరో నెల రోజులలో జరగనున్న ‘మిస్ వరల్డ్ 2024’ పోటీల్లో మన దేశం తరఫున నికిత ప్రపంచ దేశాల సుందరీమణులతో పోటీ పడనుంది. మిస్ వరల్డ్ కిరీటం కూడా దక్కించుకోవాలని ఆశిస్తోంది.తండ్రి ్రపోత్సాహంతో ...మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి చెందిన నికిత హైస్కూల్ రోజుల నుంచే మోడలింగ్లోకి రావాలని భావించింది. ఆమె తండ్రి అశోక్ పొర్వాల్ ఇందుకు ప్రోత్సహించాడు. కూతురి ప్రతిభ గమనించి మోడలింగ్ రంగంలోకి చిన్న వయసులోనే ప్రవేశ పెట్టాడు. తల్లి రాజ్కుమారి కూడా వెన్నంటే ఉంటే నికితను నడిపించింది. ‘మోడల్గా పని చేసి మరుసటి రోజు స్కూల్కి వెళితే ఆ ప్రపంచం ఈ ప్రపంచం చాలా వేరేగా ఉండేవి. అడ్జస్ట్ కావడం కష్టమయ్యేది. కాని మా స్కూల్ వాళ్లు నాకు సపోర్ట్ నిలిచారు. కాలేజీలో చదువుకుంటూ ఫ్యాషన్ ప్రదర్శనలకు వెళ్లేదాన్ని. రాత్రుళ్లు మేలుకొని సిలబస్ చదవడం, రికార్డులు పూర్తి చేయడంలో నిమగ్న మయ్యేదాన్ని. ఆ హార్డ్వర్క్ వృథా పోలేదు’ అంటుంది నికిత.లోపలి సౌందర్యం‘అందాల పోటీలో రాణించాలంటే లోపలి సౌందర్యాన్ని బయటకు తేవాలి. ఆ సౌందర్యానికి రూపమే మన దేహం. ముందుగా ఆ సౌందర్యాన్ని నమ్మాలి. అందుకు ధ్యానం చేయడం లాంటి ఎన్నో విధానాలు అవలంబించాను. నా మాటను, నడకను రోజుల తరబడి సాధన చేశాను. ఎదుటివారు మనలో చూసేది నిజాయితీని... మనం మనలా ఉన్నామా లేదా అనే విషయాన్ని. దాన్ని పోగొట్టుకోకూడదు’ అంటుంది నికిత. నాటకాల మీద మక్కువతో థియేటర్లో పని చేసిందామె. ‘కృష్ణలీల’ అనే నాటకాన్ని స్వయంగా రాసింది కూడా!టీవీ యాంకర్గా...కుటుంబానికి మద్దతుగా నిలవడం కోసం టీవ యాంకర్గా కూడా పనిచేసింది నికిత. అలాగే సీరియల్స్లో, సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించింది. తుదకు ‘మిస్ ఇండియా’ అయ్యింది. ‘ఈ గుర్తింపును ఎలా ఉపయోగిస్తారు’ అనంటే ‘యువతను మోటివేట్ చేయడానికి ఉపయోగిస్తాను. మన దేశంలోని యువతకు చాలా స్కిల్స్ ఉన్నాయి. కాని కమ్యూనికేషన్లో వెనుకబడుతున్నారు. మీ మాటే మిమ్మల్ని ముందుకు తీసుకెళుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ధ్యాస పెట్టండి అని చెబుతాను’ అంటోంది నికిత. మిస్ ఇండియా అయ్యాక సంజయ్ లీలా భన్సాలీ వంటి దర్శకుల నుంచి పిలుపు వింటోందామె. త్వరలో వెండి తెర మీద చూడొచ్చు. -
ఫెమినా మిస్ ఇండియా 2024 విజేతగా నికితా పోర్వాల్
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 విజేతగా నికితా పోర్వాల్ నిలిచింది. బుధవారం రాత్రి ముంబైలో జరిగినా ఈ ఫెమినా అందాల పోటీలో నికితా విజయకేతనం ఎగురవేసి కిరీటాన్ని దక్కించుకుంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి చెందిన నికితా మంచి స్టోరీ టెల్లర్. ఆ అభిరుచికి జీవం పోయాలనే ఉద్దేశ్యంతోనే సుమారు 60కి పైగా నాటకాలలో నటించింది. కృష్ణలీల అనే పేరుతో 250 పేజీల నాటకాన్ని కూడా రాసింది. అంతర్జాతీయ ఫెస్టివల్స్లో ప్రదర్శించిన ఫీచర్ ఫిల్మ్లో నికితా కూడా ఒక భాగం, త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. ఆమె మాజీ ప్రపంచ సుందరి బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ అభిమాని. ఆమె గంభీరమైన వ్యవహారశైలి, తెలివితేటలంటే నికితకు అత్యంత ఇష్టమట. ఆధునికతను స్వీకరించటం తోపాటు భారతీయ వారసత్వానికి కూడా ప్రాధాన్యతి ఇచ్చే వైఖరిలో ఐశ్వర్యకు సాటిలేరని అంటోంది నికితా. ప్రకాశవంతమైన స్త్రీకి ఉదాహారణ ఆమె అంటూ ఐశ్వర్వరాయ్పై ప్రశంసలు కురిపించింది. ఇక నికిత జంతు ప్రేమికురాలు కూడా. మన అభివృద్ధి తోపాటు మనపై ఆధారపడిన జీవుల సంరక్షణ బాధ్యత కూడా మనదే అనేది ఆమె నమ్మకం. ఆశయం వద్దకు వస్తే చిత్రనిర్మాత సంజయ్ లీలా బన్సాలీతో కలిసి పనిచేయాలనేది ఆమె కోరిక. అలాగే జీవితంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి గురించి అడిగినప్పుడు..తానేనంటూ సగర్వంగా చెప్పుకుంది. ఎందుకంటే..వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దూరం ఎలా వచ్చానా అని ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది తనకు తన భవిష్యత్తుని అందంగా రూపుదిద్దుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయనే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని చెబుతుంది. (చదవండి: బీచ్ వెడ్డింగ్, అందమైన లవ్స్టోరీ లెహంగా : వధువు ఫోటోలు వైరల్) -
Prakruthi Kambam: ఈ తెలంగాణ మిస్ డ్రీమ్.. 'మిస్ ఇండియా'!
సాక్షి, సిటీబ్యూరో: ఫెమినా మిస్ ఇండియా..! ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో మంది ఫ్యాషన్ ఔత్సాహికుల చిరకాల కోరిక. సౌందర్య రంగంలో అత్యున్నత స్థానమైన ఫెమినా మిస్ ఇండియాగా నిలవాలంటే దేహ సౌందర్యమే కాదు.. ఆత్మ సౌందర్యం, విజ్ఞాన కౌశలం, సేవా తత్పరత అన్నింటికీ మించి ఆత్మస్థైర్యం కూడా ఉండాలంటున్నారు ఫెమినా మిస్ తెలంగాణ ప్రకృతి కంబం. ఈ సారి ఫెమినా మిస్ ఇండియా పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రకృతి కంబం ఎంపికయ్యారు. ఇందులో భాగంగా ముంబై వేదికగా జరిగిన ప్రీ ఫెమినా మిస్ ఇండియా పేజెంట్స్లో తన ప్రత్యేకతను చాటుకుని ఫెమినా మిస్ తెలంగాణ–2024గా నిలిచారు. మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో దేశవ్యాప్తంగా పాల్గొనే 30 మంది అందాల ముద్దుగుమ్మల్లో తానూ ఒకరు. ఈ నేపథ్యంలో తన ప్రయాణంలోని అనుభవాలు, అనుభూతులను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే..ఫైనల్స్లో తెలుగమ్మాయి..ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకోవడం నా చిరకాల స్వప్నం. గతంలో జరిగిన సౌందర్య పోటీల్లో పాల్గొని టాప్ 5 స్థానంలో నిలిచి ఆ కిరీటాన్ని అందుకోలేకపోయాను. కానీ ఈ సారి ఫెమినా మిస్ ఇండియా క్రౌన్ గెలిచి హైదరాబాద్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలని ధృడ నిశ్చయంతో ఉన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు దేశం నుంచి ప్రాతినిథ్యం వహించాలన్నా కూడా ఫెమినా మిస్ ఇండియా కిరీటమే ప్రామాణికం. ఫైనలిస్టుగా ఎంపిక చేయడానికి బెంగళూరులో జరిగిన ఆడిషన్స్లో ప్రతి రాష్ట్రం నుంచి దాదాపు రెండు వందల మంది ష్యాషన్ ఔత్సాహికులు పాల్గొన్నారు. అందులో ఎంపిక చేసిన కొద్ది మందితో ముంబైలో మరో పేజెంట్ నిర్వహించగా.. అందులో ఫెమినా మిస్ తెలంగాణగా నేను నిలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది.జీవితం నేర్పిన పాఠాలు..నా జీవితంలో స్వతహాగా ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు, అడ్డంకులే నన్ను ఈ స్థాయికి చేర్చాయని అనుకుంటాను. ప్రతి సమస్య నుంచీ, ప్రతి సందర్భం నుంచీ జీవిత పాఠాలను నేర్చుకున్నాను. సౌందర్య రంగం అంటే అందంగా ఉంటే సరిపోతుందిని అంతా అనుకుంటారు. కానీ.. అందంతో పాటు ఆలోచనలు, అభిరుచులు, సంపూర్ణమైన వ్యక్తిత్వం, సామాజిక బాధ్యత–అవగాహన ఇలా పలు అంశాలను పరిశీలించాకే, పరీక్షించాకే ఆ గౌరవమైన స్థానానికి ఎంపిక చేస్తారు. మల్టీ క్వీన్...నాకు 5 భాషల్లో ప్రావీణ్యముంది. ఫ్యాషన్తో పాటు థ్రోబాల్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్బాల్, క్యారమ్ వంటి క్రీడల్లో ఛాంపియన్ని. పలు ఈవెంట్లలో ట్రాక్ ఫీల్డ్ అథ్లెట్గా విజేతగా నిలిచాను. డ్యాన్స్–కొరియోగ్రఫీలో మంచి ప్రావీణ్యముంది. బాలీవుడ్, జాజ్, బ్యాలే, ఫోక్, సౌత్ స్టైల్స్ ఇలా అన్ని స్టెప్పుల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించగలను. క్విల్లింగ్, పాట్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, మండాల ఆర్ట్స్ వంటి పలు కళల్లో మంచి పట్టు ఉంది. సమర్థవంతమైన అమ్మాయిగా నిలవడంలో ఈ అంశాలన్నీ దోహదపడ్డాయి. ఫ్యాషన్ రంగానికి సంబంధించి గతంలో మిస్ గ్రాండ్ కర్ణాటక, టైమ్స్ ఫ్రెస్ ఫేస్తో పాటు పలు పేజెంట్లలో విజేతగా నిలిచాను. యాక్టింగ్ పై మక్కువతో టాలీవుడ్ వేదికగా ఒక సినిమాలో నటించాను. మరికొద్ది రోజుల్లో వెండి తెరపైన విడుదల కానుంది. ఇవన్నీ చేయగలడంలో నా టైమ్ మేనేజ్మెంట్ కీలకపాత్ర పోషిస్తుంది.25 ఏళ్ల వయసులో..ఈ పోటీలకు అర్హత వయస్సు 25 ఏళ్లు మాత్రమే.. ఇంత చిన్న వయసులో సామాజికంగా, మానసికంగా, మోడలింగ్లో ఉన్నత భావజాలం ఉండాలంటే జీవితాన్ని అంకితం చేయాలి. నడక, నడవడిక, అందం, ఆలోచనలు, డ్రెస్సింగ్, మోడ్రన్ ట్రెండ్స్ ఇలా ప్రతీ విషయంలో ఉన్నతంగా ఉంటేనే ఈ పోటీల్లో రాణించగలం. అక్క దగ్గర మోడలింగ్, అమ్మా–నాన్నల దగ్గర సామాజిక అంశాల పైన అవగాహన పొందాను. బాక్స్ ఆఫ్ స్మైల్ పేరుతో అమ్మా నాన్నలు పేద విద్యార్థులకు చేసే సేవా కార్యక్రమాలు నాలో సామాజిక స్పృహను పెంచాయి. -
‘వేవ్మెడ్ పిక్సీ’ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ – 2023 ‘ఊర్మిళ చౌహాన్’ బంజారాహిల్స్లోని ‘ది స్కిన్ సెన్స్’లో సందడి చేశారు. దక్షిణాదిలో స్కిన్కేర్ రంగంలోకి మొదటిసారిగా తీసుకొచి్చన వినూత్న ప్లాస్మా టెక్నాలజీ ‘వేవ్మెడ్ పిక్సీ’ని ఊరి్మళ చౌహాన్ ఆవిష్కరించారు. మంగళవారం జరిగిన ఈ ఆవిష్కరణలో ఊర్మిళ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవనానికి స్కిన్ కేర్ అవసరమని, ముఖ్యంగా సౌందర్య సంరక్షణలో పిక్సీ వంటి అధునాతన చికిత్సలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని తెలిపారు. ప్రముఖ డెర్మటాలజిస్టు ‘డాక్టర్ అలెక్యా సింగపూర్’ వేవ్మెడ్ పిక్సీ అధునాతన సేవల గురించి వివరిస్తూ.. పిక్సీ ఇటలీకి చెందిన అధునాతన ప్లాస్మా టెక్నాలజీ. ఇది నాన్–ఇన్వాసివ్ సర్జరీ. భవిష్యత్ సేవలకు ఇది నాంది పలుకుతుందని అన్నారు. నాన్–సర్జికల్ బ్లీఫరోప్లాస్టీ వంటి అధునాతన పద్దతులను ప్రదర్శిస్తుందని, అతి సులభంగా వినిమోగించేలా ప్రత్యేక సాంకేతికతతో రూపొందించారని పేర్కొన్నారు. -
Manushi Chhillar: బ్యూటీ క్వీన్, ఆపరేషన్ వాలెంటైన్ భామ బర్త్డే స్పెషల్ రేర్ ఫోటోలు
-
Sruthi Chakravarthi Photos: హైదరాబాద్కు మిసెస్ ఇండియా ఫస్ట్ రన్నరప్.. శ్రుతి చక్రవర్తికి ఘన స్వాగతం (ఫొటోలు)
-
మిస్ వరల్డ్గా చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా పిజ్కోవా
మిస్ వరల్డ్–2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ సుందర్ క్రిస్టినా పిజ్కోవా గెలుచుకున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం ఫైనల్స్ జరిగాయి. విజేతగా నిలిచిన క్రిస్టినాకు పోలండ్కు చెందిన ప్రస్తుత మిస్ వరల్డ్ కరోలినా కిరీటం ధరింపజేశారు. రన్నరప్గా మిస్ లెబనాన్ యాస్మినా జెటౌన్ ఎంపికయ్యారు. భారత్కు ప్రాతినిథ్యం వహించిన ముంబై వాసి ఫెమినా మిస్ ఇండియా సిని షెట్టి(22) అయిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యమిచ్చింది. -
హ్యాట్రిక్ నేతకు చుక్కలు చూపించిన మిస్ ఇండియా ఫైనలిస్ట్!
ఉత్తరప్రదేశ్ దేశంలో రాజకీయంగా చాలా కీలకమైన రాష్ట్రం. ఇక్కడి లోక్సభ స్థానాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు పోటీ చేస్తున్న సీట్లు ఇక్కడే ఉన్నాయి. గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోటగా భావించే అమేథీ స్థానం నుంచి 2024 ఎన్నికల్లో మరోసారి లోక్సభకు ఎన్నికయ్యేందుకు పోటీలో నిలిచారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani). 2019 ఎన్నికల్లో స్మృతి ఇరానీ తీవ్ర ఎన్నికల పోరులో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు, వరుసగా మూడుసార్లు గెలిచిన రాహుల్ గాంధీని (Rahul Gandhi) ఓడించి సంచలనం సృష్టించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్పై ఇరానీ 55,120 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో వాయనాడ్ నియోజకవర్గంలో కూడా పోటీ చేసిన రాహుల్ గాంధీ అక్కడ నుంచి గెలిచి లోక్సభలోకి అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో రాహుల్ గాంధీ చేతిలో స్మృతి ఇరానీ ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత ఐదేళ్లలో తన పాపులారిటీని పెంచుకున్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించి చారిత్రాత్మక విజయంతో కాంగ్రెస్కు షాక్ ఇచ్చారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మరోసారి అమేథీ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే గత చారిత్రక పోరు మరోసారి పునరావృతం కానుంది. స్మృతి ఇరానీ గురించి.. 1976 మార్చి 23న జన్మించిన స్మృతి ఇరానీ మోడల్గా తన కెరీర్ను ప్రారంభించారు. 1998 మిస్ ఇండియా అందాల పోటీలో ఫైనలిస్టులలో ఒకరైన ఆమె.. ఏక్తా కపూర్ ప్రముఖ డైలీ సీరియల్ ‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ’లో తులసి విరానీ పాత్రతో ప్రత్యేక గుర్తింపు పొందారు. దీంతో మరిన్ని టీవీ షోలలోకూ ఆమె కనిపించారు. టెలివిజన్లో విజయవంతమైన నటనా జీవితం తర్వాత స్మృతి ఇరానీ 2003లో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు. బీజేపీలో చేరిన ఆమె 2004లో పార్టీ మహారాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2004 సాధారణ ఎన్నికల్లో ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కపిల్ సిబల్ చేతిలో ఓడిపోయారు. 2010లో బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. ఏడాది తర్వాత గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అమేథీ లోక్సభ నుండి అప్పటికే రెండుసార్లు గెలిచిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై 2014 ఎన్నికల్లో స్మృతి ఇరానీ బీజేపీ నుంచి పోటీ చేశారు. గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోటగా భావించే ఆ స్థానంలో పోటీ చేసి ఆసక్తి రేకెత్తించగలిగారు. రాహుల్ గాంధీ గెలుపు మార్జిన్ను 1 లక్ష ఓట్లకు తగ్గించారు. ఓటమి పాలైనప్పటికీ ఆమె మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా నరేంద్ర మోదీ మొదటి మంత్రివర్గంలో చేరారు. 38 ఏళ్ల వయసులో ప్రధాని మోదీ తొలి క్యాబినెట్లో ఆమె అత్యంత పిన్న వయస్కురాలు. 2014 నుండి 2019 వరకు స్మృతి ఇరానీ హెచ్ఆర్డీ, టెక్స్టైల్స్, ఇన్ఫర్మేషన్ & బ్రాడ్కాస్టింగ్ పోర్ట్ఫోలియోలను నిర్వహించారు. 2019లో అమేథీ నుంచి రాహుల్ గాంధీని ఓడించి సంచలనం సృష్టించారు. ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ కూటమి అభ్యర్థులను నిలబెట్టకుండా రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చినప్పకీ, స్మృతి ఇరానీ 50,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 2022 జూలై నుండి ఆమె మైనారిటీ వ్యవహారాల శాఖను కూడా నిర్వహిస్తున్నారు. స్మృతి ఇరానీ పార్సీ వ్యాపారవేత్త జుబిన్ ఇరానీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
అమ్మవారిని దర్శించుకున్న 'మాజీ మిస్ ఇండియా'..!
ఆదిలాబాద్: మాజీ మిస్ ఇండియా, తెలంగాణ ఐటీ హబ్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాగూర్ బుధవారం కుటుంబసమేతంగా బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఆమెకు స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందజేసి, అమ్మవారి శేష వస్త్రంతో ఆశీర్వచనాలు అందజేశారు. -
తెల్లగా ఉన్నానని రిజెక్ట్ చేశారు: స్టార్ హీరోయిన్
సాధారణంగా హీరోయిన్ అనగానే తెల్లగా ఉండాలి, లేకపోతే సినిమా అవకాశాలు రావు అనేది ఇండస్ట్రీలో వినిపించే మాట. అందుకు తగ్గట్లే దర్శకనిర్మాతలు స్కిన్ కలర్ చూసే హీరోయిన్లని సెలెక్ట్ చేస్తుంటారు. అయితే ఓ బ్యూటీ మాత్రం తెల్లగా ఉండటమే తప్పయిపోయింది. ఈ కారణం వల్లే ఆమె ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. స్వయంగా ఈ విషయాన్ని ఆ హీరోయినే బయటపెట్టింది. అసలు అప్పట్లో ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది. సెలీనా జైట్లీ.. ఈ పేరు మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. 2001లో ఫెమినా మిస్ ఇండియాగా నిలిచిన ఈ భామ.. అదే ఏడాది జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో రన్నరప్గా కొద్దిలో కిరీటాన్ని మిస్ చేసుకుంది. ఇది జరిగి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ ఓ వీడియోని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దాంతో పాటే ఎవరికీ తెలియని బోలెడన్నీ సంగతల్ని పంచుకుంది. (ఇదీ చదవండి: 'బేబీ' కలెక్షన్స్.. మూడో రోజుకే అన్ని కోట్ల లాభాలతో!) 'మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న 103 మందిలో నేను కాస్త పొట్టిదాన్ని. అయినాసరే రన్నరప్గా నిలిచాను. ఇది నేను గర్వపడే విషయమే. 15 ఏళ్ల వయసులోనే నేను ఫ్యాషన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. చాలా స్ట్రగుల్స్ చూశాను. దానికి తోడు చదువు, పోటీ పరీక్షల ఒత్తిళ్లు ఉండేవి. దీంతో నా టీనేజీ అంతా చాలా కష్టంగా గడిచింది. మొటిమలు, పొత్తి కడుపులో నొప్పి సమస్యలు నన్ను చాలా ఇబ్బంది పెట్టేవి. ప్రతినెలా పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా రక్తం పోయేది' 'నా వయసు వాళ్లందరూ అప్పట్లో వీకెండ్స్ ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం కోల్కతాలో షూటింగ్స్, ర్యాంప్ షోలు చేస్తూ డబ్బులు సంపాదించుకునేదాన్ని. కొన్నిసార్లు నన్ను చాలా కష్టపెట్టేవారు. అనుమతి లేకుండా నా ఫొటోలు వాడేసుకునేవాళ్లు. చివరకు డబ్బులు సరిగా ఇచ్చేవారు కాదు. మరీ తెల్లగా, సన్నగా ఉన్నానని చెప్పి చాలాసార్లు రిజెక్ట్ చేశారు. అదే అందరిలో నన్ను స్పెషల్గా మార్చింది' 'అందం అనేది శక్తివంతమైన ఆయుధం. నా దేశం తరఫున ఓ యాక్టర్, అంబాసిడర్గా పాల్గొన్నందుకు చాలా గర్వపడుతున్నాను' అని నటి, మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ చెప్పుకొచ్చింది. బాలీవుడ్లో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఈమె.. తెలుగులో మంచు విష్ణు 'సూర్యం' మూవీ మాత్రమే చేసింది. ఆ తర్వాత తెలుగులో ఛాన్సులు రాలేదో, వద్దనుకుందో గానీ పూర్తిగా హిందీకే పరిమితమైపోయింది. View this post on Instagram A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) (ఇదీ చదవండి: ఓటీటీలోకి క్రేజీ హారర్ మూవీ.. నెలలోపే స్ట్రీమింగ్కు రెడీ) -
వెక్కిరింతలు తట్టుకుని.. మూర్ఛ నుంచి మిస్ ఇండియా వరకు
From Epilepsy to Pageant Triumph- Strela Thounaojam: రెండు రోజుల క్రితం ‘మిస్ ఇండియా 2023’ ఫైనల్స్ జరిగాయి. రాజస్థాన్ సుందరి నందిని గుప్తా విజేత. ఢిల్లీకి చెందిన శ్రేయా పూజా ఫస్ట్ రన్నరప్. కాని మణిపూర్ అమ్మాయి స్టెర్లా లువాంగ్ సెకండ్ రన్నరప్గా అందరి దృష్టిని ఆకర్షించింది. మణిపూర్ నుంచి మిస్ ఇండియా ఫైనల్స్ వరకూ చేరిన వారు ఇప్పటి దాకా లేరు. అదీగాక టీనేజ్లో మూర్ఛవ్యాధి వల్ల తీవ్రంగా బాధ పడిన స్టెర్లా తన అందాల కల కోసం ఆ వ్యాధితో పోరాడి గెలిచింది. స్ఫూర్తిగా నిలిచింది. టీనేజ్లో మూర్ఛ వ్యాధి ‘అది నా భవిష్యత్తుకు అడ్డంకి అనుకోలేదు. ఒక ఆశీర్వాదం అనుకున్నాను’ అంది టీనేజ్లో మూర్ఛ వ్యాధి బారిన పడ్డ స్టెర్లా. ‘అడ్డంకులు వస్తేనే కదా మనం పోరాడి మరింత శక్తిమంతులం అయ్యేది’ అందామె. అతి చిన్న రాష్ట్రం నుంచి మొదటిసారి ఇప్పుడు స్టెర్లా మణిపూర్లో క్షణం తీరిక లేకుండా జనం అభిమానంతో ఇస్తున్న విందుల్లో పాల్గొంటోంది. సీఎం ఆమెను ఆహ్వానించి ప్రభుత్వ పెద్దలతో కలిసి డిన్నర్ ఇచ్చాడు. కారణం మణిపూర్లాంటి అతి చిన్న రాష్ట్రం నుంచి మొదటిసారి ‘మిస్ ఇండియా’ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో ఒకరుగా ఆమె నిలవడం. ఏప్రిల్ 15న ఇంఫాల్లో జరిగిన ‘మిస్ ఇండియా 2023’ ఫైనల్స్లో 28 రాష్ట్రాలు 2 కేంద్ర ప్రాంతాల నుంచి 30 మంది పోటీ పడితే వారితో తలపడి మూడో స్థానంలో నిలిచింది స్టెర్లా. అయితే ఈ విజయం అంత ఈజీగా రాలేదు. మానసికంగా ఆరోగ్యపరంగా ఆమె చాలా పోరాటం చేయాల్సి వచ్చింది. వెక్కిరింతలు తట్టుకుని 14 ఏళ్ల వయసులో స్టెర్లాకు మిస్ ఇండియా కావాలన్న లక్ష్యం ఏర్పడింది. కాని ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎవరూ అలాంటి కలను కనరు. ఇంకా చెప్పాలంటే ‘నిర్వచనాల ప్రకారం ఉండే ముక్కు, రూపు’ వారికి లేవన్న భావన వారిలో బలంగా ప్రవేశపెట్టి చాలా కాలం అవుతోంది. అందుకే అందరూ ఏడ్పించేవారు స్టెల్లాను. అది వొత్తిడిగా మారి ఆ తర్వాత నరాల జబ్బుగా పరిణమించింది. తరచూ మూర్ఛలు వచ్చేవి. ఒక్కోసారి మంచానికి అతుక్కు పోయేదాన్ని. అలాంటి స్థితిలో కూడా ఇదంతా దాటుతాను... నాకో అందమైన భవిష్యత్తు ఉంటుంది అని గట్టిగా అనుకునేదాన్ని. అదే నిజమైంది. ఇవాళ నా జబ్బును జయించాను. ఆత్మవిశ్వాసం పెంచుకున్నాను’ అంటుందామె. క్యాబిన్ క్రూగా పని చేసి బిజినెస్ స్టడీస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొనసాగిస్తూనే మోడల్గా పని చేస్తోంది స్టెల్లా. కొంతకాలం ఒక ఎయిర్ లైన్స్ సంస్థలో క్యాబిన్ క్రూగా చేసింది. ‘ఇంతకు ముందు అందం నిర్వచనం వేరే ఉండేది. ఇప్పుడు సహజ రూపాలను కూడా అందంగా చూస్తు్తన్నారు. అందుకే నేను టాప్ 3గా నిలిచానని అనుకుంటున్నాను.’ అంది స్టెర్లా. చదవండి: 1994లో తెల్లవెంట్రుకలను నల్లగా చేసే హెర్బల్ మందు కనిపెట్టాం! ఇప్పుడిలా.. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) -
మిస్ ఇండియా పోటీల్లో స్మృతి ఇరానీ ర్యాంప్ వాక్.. పాత వీడియో వైరల్
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటిగా, రాజకీయవేత్తగా, అందరికీ సుపరిచితురాలే. 2014లో మోదీ కేబినెట్లో మంత్రి పదవి చేపట్టిన అత్యంత పిన్న వయస్కురాలిగా స్మృతి ఇరానీ నిలిచారు. తొలుత టెలివిజన్ నటి అయిన స్మృతి అనంతరం రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వీటన్నిటికంటే ముందు స్మృతి మోడల్గా పనిచేశారు. దాదాపు 25 ఏళ్ల కిత్రం అందాల పోటీల్లోనూ పాల్గొంది. ఈ విషయం ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు.బెంగాలీ-పంజాబీ కుటుంబానికి చెందిన స్మృతి.. 2000లో ఆతిష్, హమ్ హై కల్ ఆజ్ ఔర్ కల్ అనే సీరియల్స్ ద్వారా తొలిసారి బుల్లితెరపై కనిపించారు. ఏక్తా కపూర్ షో 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ'లో తులసి విరాణిగా అందరికీ గుర్తుండిపోయారు. ఈ సీరియల్ ఆమెకు భారీ స్టార్డమ్ని సంపాదించిపెట్టింది. ఆమె ఉత్తమ నటిగా వరుసగా ఐదు ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు అందుకున్నారు. అంతేగాక స్మృతి ఇరానీ 25 సంవత్సరాల క్రితం 1998లో మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొన్నారు. ఆమె టాన్జేరిన్ స్లీవ్లెస్ టాప్, మినీ స్కర్ట్లో అద్భుతంగా ర్యాంప్ వాక్ చేస్తూ కనిపించారు. అయితే టాప్ 9కి చేరుకోలేకపోయారు. గురువారం( మార్చి23)న ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ర్యాంప్ వాక్ చేస్తున్న స్మృతి వీడియోను మీరూ చూడండి. View this post on Instagram A post shared by Cryptic Miind (@crypticmiind) కాగా 2003లో ఇరానీ 2003లో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆమె 2004లో మహారాష్ట్ర యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. 2004లో ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ చేతిలో ఓడిపోయారు. అనంతరం 2011లో తొలిసారి 2017లో రాజ్యసభకు రెండోసారి ఎన్నికయ్యారు. 2014లో అమేథీ నుంచి బరిలోకి దిగి రాహుల్ గాంధీ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో అదే అమేథీ గడ్డపై రాహుల్ గాంధీని ఓడించి ఎంపీగా గెలుపొందారు. -
మిస్ ఇండియాతో నాగార్జున రొమాన్స్!
టాలీవుడ్ మన్మథుడు ‘కింగ్’ నాగార్జున అక్కినేని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 60 ఏళ్లలో కూడా గ్లామర్, ఎనర్జీతో కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తున్నారు. రీసెంట్గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ మూవీతో అలరించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయం అందుకోలేకపోయింది. ఇప్పుడు ఆయన మరో సినిమాకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం నాగ్ డైరెక్టర్ ప్రసన్న కుమార్తో జతకట్టబోతున్నారు. బెజవాడ ప్రసన్న కుమార్ కథకు ఇంప్రెస్ అయిన నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసల వినిపిస్తున్నాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో నాగార్జున డబుల్ రోల్ చేయబోతున్నట్లు వినికిడి. తండ్రి-కొడుకులుగా ఆయన ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. ఇదిలా ఉంటే ఇప్పుడు యంగ్ నాగార్జున సరసన నటించే హీరోయిన్ హాట్టాపిక్ నిలిచింది. మిస్ ఇండియాతో నాగ్ ఈ చిత్రంలో రొమాన్స్ చేయనున్నాడంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. 2020 మిస్ ఇండియా టైటిల్ గెలిచిన మానస వారణాసిని ఇందులో జూనియర్ నాగ్ సరసన హీరోయిన్గా ఎంపిక చేశారని, ఇప్పుటికే నాగార్జున, మానసల ఫొటోషూట్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. చదవండి: 200 థియేటర్లో రిరిలీజ్కు సిద్ధమైన ఆర్ఆర్ఆర్.. కొత్త ట్రైలర్ చూశారా? ఆ గుడ్న్యూస్ని ముందు తారక్తో పంచుకున్నా: రామ్ చరణ్ -
మిస్ ఇండియా పోటీలకు గ్రామీణ రైతుబిడ్డ గోమతిరెడ్డి
ఓబులవారిపల్లె: గ్రామీణ రైతుబిడ్డ జాతీయ స్థాయి అందాల పోటీలకు ఎంపికైంది. తన అందం, ఆత్మవిశ్వాసం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మిస్ ఆంధ్రాగా నిలిచింది. మరో రెండు వారాల్లో ముంబైలో నిర్వహించనున్న మిస్ ఇండియా పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని ముక్కావారిపల్లె గ్రామానికి చెందిన ముక్కా శ్రీనివాసులరెడ్డి, అరుణకుమారి దంపతుల ఏకైక కుమార్తె ముక్కా గోమతిరెడ్డి మార్చి 5వ తేదీన ముంబైలో నిర్వహించనున్న ఫెమీనా మిస్ ఇండియా పోటీలకు ఎంపికైంది. గోమతిరెడ్డి చిన్ననాటి నుంచి పాఠశాలల్లో బెస్ట్ బేబి తదితర పోటీల్లో రాణిస్తూ వచ్చింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను అందాల పోటీల్లో పాల్గొనేందుకు అన్ని విధాల సహకారం అందించారు. ఈ క్రమంలో డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అందాల పోటీల్లో గెలుపొందింది. అనంతరం బెంగళూరులో నిర్వహించిన సౌత్ ఇండియా మిస్ ఫెమీనా పోటీల్లో పాల్గొని రన్నరప్గా నిలిచింది. అక్కడితో అగిపోకుండా మోడలింగ్ రంగంలోకి కూడా ప్రవేశించింది. ఈ ఏడాది జనవరి, 25వ తేదీన ముంబైలో నిర్వహించిన ఫెమీనా మిస్ అంధ్రా పోటీల్లో పాల్గొని టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో మిస్ ఇండియా పోటీలకు రాష్ట్రం తరఫున ఎంపికైంది. ప్రస్తుతం బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్గా ఉద్యోగం చేస్తున్న గోమతిరెడ్డి... మిస్ వరల్డ్ సాధించడమే తన లక్ష్యమని తెలిపింది. తల్లిదండ్రుల సహకారంతో ఏదైనా సాధించవచ్చనే లక్ష్యంతో ముందుకువెళుతున్నానని, తన గ్రామానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పింది. -
అతను 'గే' అని తెలిసిందో.. ఆ పని చేస్తాను: రకుల్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అతితక్కువ కాలంలోనే పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.కేవలం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలె ఆమె హిందీలో నటించిన డాక్టర్ జీ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఇక నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న రకుల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ఇదిలా ఉండగా తాజాగా రకుల్ ప్రీత్కి సంబంధించన ఓ ఓల్డ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. 2011లో మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొన్న రకుల్కు.. ఒకవేళ మీ కొడుకు గే అని తెలిస్తే ఏం చేస్తారు? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి రకుల్ స్పందిస్తూ.. ఈ విషయం తెలియగానే నేను షాక్ అవుతాను. వెంటనే అతన్ని చెంపదెబ్బ కొడతాను. కానీ తర్వాత ఆలోచిస్తాను. అతని అతని నిర్ణయం అని గౌరవిస్తాను. అదే దారిలో తను వెళ్లాలనుకుంటే నాకు ఎలాంటి సమస్య లేదు. నాకు సంబంధించినంత వరకు నేను చాలా ముక్కుసూటిగా ఉండేందుకు ఇష్టపడతాను అంటూ ఆమె బదులిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. -
సౌత్, నార్త్పై మిస్ ఇండియా సినీ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు..
Miss India Sini Shetty Tollywood Favorite Actor Is Vijay Devarakonda: ఇటీవల ముంబైలోని భారీ ఉత్సవ వేదిక ‘జియో కన్వెన్షన్ సెంటర్’లో జరిగిన ‘మిస్ ఫెమినా ఇండియా వరల్డ్ 2022’ పోటీల్లో సిని శెట్టి విజేతగా నిలిచింది. కర్నాటక మూలాలున్న ఈ ‘చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్’ విద్యార్థిని 31 రాష్ట్రాల అందగత్తెలను ఓడించి అందాల కిరీటాన్ని తన చెంతకు తెచ్చుకుంది. మిస్ ఇండియా 2020 విజేత అయిన మానస వారణాసి సిని శిరస్సు మీద కిరీటం ఉంచగా ఆమె అదృష్టం శాశ్వతంగా మారిపోయింది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది ఈ 'తుళు' భామ. ''టైటిల్ గెలిచాక నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. వాటిని రీచ్ అయేందుకు ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం మిస్ వరల్డ్కు రెడీ అవుతున్నాను. ఆ పోటీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నేను దేశంలోనే వేర్వేరు ప్రాంతాలకు చెందిన అమ్మాయిలతో పోటీపడ్డాను. ప్రతి అమ్మాయికి ఒక ప్రత్యేకత ఉంటుంది. గత రెండేళ్లుగా సౌత్ నుంచి వచ్చిన వారు కిరీటాన్ని గెలుచుకున్నారు. వచ్చే సంవత్సరం ఎవరైనా పొందొచ్చు. సౌత్, నార్త్ అనే బేధం లేకుండా ఎవరైనా మిస్ ఇండియా టైటిల్ను గెలుచుకునే అవకాశం ఉంది. చదవండి: బాలీవుడ్ హీరోలు ఆ విషయంలో భయపడుతున్నారు: అక్షయ్ కుమార్ నా తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి. అకాడమిక్గా కూడా నాకు మంచి రికార్డు ఉంది. నేను చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలకు అభిమానిని. ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రాను చూసి వారిలా అవ్వాలనుకున్నాను. నాకు బాలీవుడ్లో షారుక్ ఖాన్ అంటే ఎంతో అభిమానం. అలాగే తెలుగులో విజయ్ దేవరకొండ అంటే ఇష్టం. నేను మిస్ ఇండియా పోటీలకు వెళ్తానంటే మొదట్లో నా తల్లిదండ్రులు కొంచెం ఆందోళన చెందారు. ప్రతి అమ్మాయి ఎప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. కొత్త విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలి'' అని మిస్ ఇండియా సినీ శెట్టి పేర్కొంది. చదవండి: మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం -
Sriti Shaw : మల్టీ టాలెంట్.. శృతిలయల విజయ దరహాసం
‘రెండు పడవల మీద ప్రయాణం’ కష్టం అంటారు. రెండు పడవలేం ఖర్మ...ఎన్ని పడవలైనా కొందరు సునాయసంగా ప్రయాణించగలరు. శృతి షా ఈ కోవకు చెందిన ప్రతిభావంతురాలు. దుబాయ్లో ఎంటర్ప్రెన్యూర్గా పేరు తెచ్చుకున్న ఇరవై అయిదు సంవత్సరాల షా నటి,మోడల్గా రాణిస్తుంది. ‘టిస్కా మిస్ ఇండియా 2021’ టైటిల్ను గెలుచుకుంది. సంగీతంలో కూడా తన ప్రతిభ చాటుకుంటుంది. రకరకాల మ్యూజిక్ ఆల్బమ్లకు రూపకల్పన చేసింది. శృతి ప్రొడ్యూసర్ కూడా. మరోవైపు సామాజిక సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ‘టైం లేదు అని సాకు వెదుక్కుంటే చిన్న పని కూడా చేయలేం’ అంటున్న శృతి షాకు ఎప్పటికప్పడు కొత్త విద్యలు నేర్చుకోవడం అంటే ఇష్టం. కోల్కతాలో పుట్టిపెరిగిన శృతి చిన్నప్పుడు స్కూల్లో ఒక నాటకంలో వేషం వేసింది. ఎన్నో ప్రశంసలు లభించాయి. నటన మీద తనకు మక్కువ అలా మొదలైంది. అయితే నటప్రస్థానంలో భాగంగా తెలుసుకున్న విషయం ఏమిటంటే...‘మన నటనకు ఎప్పుడూ ప్రశంసలు మాత్రమే రావు. విమర్శలు కూడా వస్తాయి. ప్రశంసల వల్ల ఉత్సాహాన్ని పొందినట్లే, విమర్శల నుంచి గుణపాఠాలు తీసుకోవాలి’ అనే స్పృహ ఆమెలో వచ్చింది. ‘నిన్ను నువ్వు బలంగా నమ్ము’ అనేది శృతి షా విజయసూత్రాలలో ఒకటి. ఎందుకంటే నీ గురించి నీకు తప్ప మరెవరికి తెలియదు. ‘చేసిన తప్పును మళ్లీ చేయకు’ అనేది ఆమె ఎప్పుడూ గుర్తుంచుకునే పాఠం. ‘ప్రతి వ్యక్తి ఒక బడి. అందులో నుంచి మనకు కావాల్సింది నేర్చుకోవచ్చు’ అనేది ఆమె విశ్వాసం. -
మిస్ ఇండియా 2022: తుళు సౌందర్యానికి మరో కిరీటం
ఐశ్వర్యా రాయ్... శిల్పా శెట్టి... శ్రీనిధి శెట్టి... అందాల పోటీల్లో కిరీటాలు సాధించారు. ముగ్గురూ ‘తుళు’ భాషీయులే. కేరళ, కర్నాటక, గోవా ప్రాంతాలలో ఉండే తుళు భాషీయుల నుంచే ఇప్పుడు మరో సౌందర్యరాశి దేశాన్ని పలుకరించింది. 21 ఏళ్ల సిని శెట్టి ఆదివారం జరిగిన ఫైనల్స్లో ‘మిస్ ఇండియా 2022’ కిరీటాన్ని గెలుచుకుంది. చూడబోతే తుళు స్త్రీల శిరస్సులు అందాల కిరీటాల కోసమూ వారి అధరాలు విజయ దరహాసాల కోసమూ పుడుతున్నట్టున్నాయి. ఆదివారం ముంబైలోని భారీ ఉత్సవ వేదిక ‘జియో కన్వెన్షన్ సెంటర్’లో జరిగిన ‘మిస్ ఫెమినా ఇండియా వరల్డ్ 2022’ పోటీల్లో సిని శెట్టి విజేతగా నిలిచింది. కర్నాటక మూలాలున్న ఈ ‘చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్’ విద్యార్థిని 31 రాష్ట్రాల అందగత్తెలను ఓడించి అందాల కిరీటాన్ని తన చెంతకు తెచ్చుకుంది. మిస్ ఇండియా 2020 విజేత అయిన మానస వారణాసి సిని శిరస్సు మీద కిరీటం ఉంచగా ఆమె అదృష్టం శాశ్వతంగా మారిపోయింది. రాజస్థాన్కు చెందిన రుబుల్ షెకావత్ మొదటి రన్నర్ అప్గా నిలువగా, ఉత్తరప్రదేశ్కు చెందిన షినాటా చౌహాన్ సెకండ్ రన్నర్ అప్గా నిలిచింది. భారీ హైబ్రిడ్ ఈవెంట్ నేరుగా జరిగే ఈవెంట్లో ఆన్లైన్ ద్వారా కూడా కొందరు ప్రాతినిధ్యం వహిస్తే అలాంటి ఈవెంట్ని ‘హైబ్రిడ్ ఈవెంట్’ అంటారు. అంటే డైరెక్ట్గా వర్చువల్గా కూడా జరిగే ఈవెంట్ అన్నమాట. ‘మిస్ ఫెమినా ఇండియా 2022’ ఈవెంట్ కూడా ఈ విధంగానే జరిగింది. జూరీలో నేహా దూపియా, డినో మోరియా, మలైకా అరోరా, డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా, కొరియోగ్రాఫర్ షియామక్ దావర్తో పాటు మన మిథాలీ రాజ్ కూడా ఉంది. వీరి పరీక్షలన్నింటిని దాటి సిని విజేతగా నిలిచింది. దీని వల్ల ఆమె ఈ సంవత్సరం జరగనున్న 71వ ‘విస్ వరల్డ్’ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. సిని శెట్టి ఎవరు? కర్నాటకలో మూలాలున్న తుళు కుటుంబం నుంచి వచ్చిన సిని శెట్టి 2000 సంవత్సరంలో ముంబైలోనే పుట్టి అక్కడే పెరిగింది. తల్లి పేరు హైమా శెట్టి. సోదరుడు షికిన్ శెట్టి. 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు ఉండే సిని ముందు నుంచి మోడలింగ్ అంటే ఇష్టపడింది. ప్రియాంకా చోప్రా నుంచి స్ఫూర్తి పొంది ఆమెలాగే ఎదగాలనుకుంది. మంచి భరతనాట్యం డాన్సర్. మోడల్. ఇన్స్టాలో ఆమె అకౌంట్ దాదాపు 60 వేల మంది ఫాలోయెర్లు ఉన్నారు నిన్న మొన్నటి దాకా (ఇప్పుడు లక్షల్లో మారుతుంది). ఇన్స్టాలో సిని చేసే డాన్స్ రీల్స్ బాగా పాపులర్ అయ్యాయి. ‘మాది స్త్రీల విషయంలో సమకాలీన ధోరణి ఉన్న కుటుంబమే అయినా మా సమూహం స్త్రీల విషయంలో సంప్రదాయ విలువల గురించి ప్రాధాన్యం ఇస్తుంది. అయితే ఆ విలువలు స్త్రీల విషయంలోనే పట్టింపుతో ఉండటం నేను గమనించాను. స్త్రీ జీవితం అంటే ఏమిటో నాదైన ఒక విలువను వెతుక్కునే ప్రయత్నం చేశాను. నేను ఉండే (మోడలింగ్) రంగంలో స్త్రీలు సంప్రదాయ–ఆధునిక పోకడల మధ్య నలుగుతూ నిలవడం పెద్ద సవాలు. కాని సవాళ్లను ఎదుర్కొనే తత్త్వం వల్లే నేను ఈనాడు ఇక్కడ నిలుచుని ఉన్నాను’ అని సిని అంది. మరిచిపోలేని జ్ఞాపకం ‘మీ జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం ఏది?’ అని అడిగితే సిని శెట్టి తన భరతనాట్యం అరంగేట్రం గురించి చెప్పింది. ‘నాకు డాన్సంటే చాలా ఇష్టం. అది శరీరాన్ని, ఆత్మను సంలీనం చేస్తుంది. అది ఇచ్చే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. అందువల్ల నేను ఆరంగేట్రం చేసిన రోజును మర్చిపోలేను. అది నా సంస్కృతితో నేను అనుబంధం ఏర్పరుచుకున్న రోజుగా భావిస్తాను. నా భుజాల నుంచి చెమట కారిపోతున్నా, నా కొప్పుముడిలోని పూసలు ఊడి వేళ్లాడుతున్నా డాన్స్ చేస్తున్నందుకు నా లోలోపల ఉబికిన ఉత్సాహం అంతా ఇంతా కాదు. మూడు గంటలు ప్రేక్షకుల ముందు డాన్స్ చేసి చివరన భూదేవికి పెట్టిన నమస్కారంతో ధన్యురాలిని అయ్యాను’ అని చెప్పింది సిని. త్వరలో ఆమె ఏదైనా భారీ సినిమాలో హీరోయిన్గా కనిపిస్తే ఆశ్చర్యం లేదు. -
ఫెమినా మిస్ ఇండియాగా సిని శెట్టి (ఫొటోలు)
-
Femina Miss India 2022: మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం
Karnataka Sini Shetty Crowned Femina Miss India World 2022: మగువల అందాన్ని నిర్వచించలేం. కానీ వారి కురులను కారు మబ్బులుగా, మోమును చంద్రబింబంలా, కళ్లను కలువపూలుగా ఇలా వివిధ రకాలుగా పోల్చగలరు, అభివర్ణించగలరు కవులు. అయితే ఫ్యాషన్ రంగంలో మాత్రం అందాన్ని వివిధ రౌండ్స్ వారీగా అంచనా వేస్తారు. ఈ విభాగాలకు రకరకాల పేర్లు పెట్టి ఒకర్ని మిస్ ఇండియా, మిస్ వరల్డ్గా ఎంపిక చేస్తారు. అలాంటి ఈ ఫ్యాషన్ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించేది 'ఫెమినా మిస్ ఇండియా' పోటీలు. ఈ ఏడాది ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని కర్ణాటకకు చెందిన సినీ శెట్టి కైవసం చేసుకుంది. అన్నీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సినీ శెట్టి అందంలో విజేతగా నిలిచింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలు ఆదివారం (జులై 3) అట్టహాసంగా ముగిసాయి. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే కనులవిందుగా జరిగింది. ఈ వేడుకల్లో బాలీవుడ్ బ్యూటీఫుల్ స్టార్స్ నేహా ధూపియా, మలైకా అరోరా, డినో మోరియా, డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా, కొరియోగ్రాఫర్ శియామక్ దావర్, మాజీ క్రికేటర్ మిథాలీ రాజ్ జ్యూరీ ప్యానెల్గా వ్యవహరించారు. ఈ మిస్ ఇండియా పోటీల్లో సినీ శెట్టి విజేత కాగా, రాజస్థాన్కు చెందిన రూబల్ శెఖావత్ మొదటి రన్నరప్గా, ఉత్తరప్రదేశ్ యువతి షినాటా చౌహాన్ రెండో రన్నరప్గా ఎంపికయ్యారు. విజేతగా ఎంపికైన తర్వాత 21 ఏళ్ల సినీ శెట్టి మాట్లాడుతూ.. 'ఈ జర్నీని నేనేప్పటికీ మర్చిపోలేను. ఇందులో భాగమై నాకు అడుగడుగునా సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' అని తెలిపింది. సినీ శెట్టి కిరీటాన్ని సోంతం చేసుకోవడం పట్ల ఆమె కుటుంబసభ్యులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుభాకాంక్షలతో సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెడుతున్నారు. When dreams turned into reality 👑 . . . . .#SiniShetty #MissIndiaFinale2022 #MissIndia2022 #FeminaMissIndia2022 #MissIndia pic.twitter.com/VmXwWjN7Uz — Sini Shetty (@sini_shetty) July 4, 2022 Danced for Thalapathy's Vaathi Coming during the DANCES OF INDIA segment in the Miss India Competition last night 🔥💥 . . .#SiniShetty #MissIndiaFinale2022 #ThalapathyVijay𓃵 #Varisu #MissIndia2022 #Thalapathy67 #FeminaMissIndia2022 #Thalapathy66 #LokeshKanagaraj #VaathiComing pic.twitter.com/ZYexh43Qtc — Sini Shetty (@sini_shetty) July 4, 2022 Thanks for all your lovely wishes 🥺🙏🏼 I hope I made Karnataka proud. Can't wait to start this new journey and make India proud 🇮🇳🤞🏼 Keep showering all your love and blessings and I love y'all ❤️#SiniShetty #MissIndiaFinale2022 #MissIndia2022 #FeminaMissIndia2022 #MissIndia pic.twitter.com/x3oRvXdBa0 — Sini Shetty (@sini_shetty) July 4, 2022 -
మిస్ ఇండియా పోటీ నుంచి తప్పుకున్న శివానీ, ఎందుకంటే?
ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీల కోసం ఎంతగానో కష్టపడింది శివానీ రాజశేఖర్. ఇటీవలే మిస్ తమిళనాడుగానూ ఎంపికైంది. మరికొన్ని రోజుల్లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాల్సి ఉన్న సమయంలో అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అందుకు కారణం లేకపోలేదు. ఇటీవల శివానీ మలేరియా బారిన పడింది. దాంతో మిస్ ఇండియా పోటీలకు సంబంధించిన ట్రైనింగ్, గ్రూమింగ్ సెషన్స్ మిస్ అయింది. అంతేకాదు, అనారోగ్యంతో తను మరింత సన్నబడినట్లు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో తన మెడికల్ థియరీ పరీక్షలు కూడా మొదలయ్యాయని, మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే రోజు అంటే జూలై 3న తనకు ఎగ్జామ్ ఉందని తెలిపింది. ఈ పరీక్ష మిస్ అవ్వకూడదనే ఫెమినా మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకుంటున్నానని స్పష్టం చేసింది. దీంతో చదువు కోసం అంత పెద్ద త్యాగం చేస్తున్న శివానీని కొందరు అభినందిస్తుంటే, అంత మంచి అవకాశాన్ని చేతులారా చేజార్చుకుంటున్నావని మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా శివానీ.. అద్భుతం, శేఖర్ సినిమాలతో అలరించింది. ప్రస్తుతం తన పరీక్షల మీద పూర్తి దృష్టి పెట్టిన ఆమె ఎగ్జామ్స్ పూర్తవగానే రాజ్ తరుణ్తో కలిసి వెబ్ సిరీస్లో నటించనుంది. View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) చదవండి: శాస్త్రవేత్తపై దోశద్రోహి కేసు.. 50 రోజులు జైల్లో నరకం.. నంబి నారాయణన్ రియల్ స్టోరీ -
విజయవాడలో మిస్ఇండియా 2020 మానస వారణాసి సందడి ( ఫొటోలు )
-
Miss India: మిస్ తమిళనాడుగా శివాని, వివరణ ఇచ్చిన హీరోయిన్
Shivani Rajashekar About Her Miss India Selection: సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్, జీవితల పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటూ హీరోయిన్గా చేస్తూనే మరోవైపు మోడల్గా మిస్ ఇండియా పోటీల్లో రాణిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలో ఆమె పాల్గొన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30న జరిగిన ఈ పోటీలో శివాని మిస్ తమిళనాడుగా ఎంపికైంది. దీంతో ఆమెను విమర్శలు చుట్టుముట్టాయి. తెలుగు అమ్మాయి అయి ఉండి తమిళనాడుకు రిప్రజెంట్ చేయడమేంటని అందరూ ప్రశ్నిస్తున్నారు. చదవండి: ప్రశాంత్ నీల్ మీకు అన్హ్యాపీ డైరెక్టర్స్ డే: వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో ఈ విమర్శలపై తాజాగా స్పందించింది ఆమె. తన తండ్రి రాజశేఖర్ నటించిన ‘శేఖర్’ మూవీ ట్రైలర్ ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శివాని మాట్లాడుతూ.. మిస్ ఇండియా పోటీపై స్పందించింది. ‘తెలంగాణలో ఉంటున్న నేను ఈ రాష్ట్రం నుంచే పోటీ చేయాలనుకున్నాను. అయితే నిర్వాహకులు అప్లికేషన్లో మల్టిపుల్ అప్షన్స్ ఇచ్చారు. దీంతో నేను తమిళనాడును కూడా అప్షన్గా పెట్టా. ఎందుకంటే నేను పుట్టింది చెన్నైలోనే కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడును కూడా అప్షన్లో ఇచ్చాను. చదవండి: జానీ తరచూ కొట్టేవాడంటూ కోర్టులోనే బోరున విలపించిన నటి కానీ, పోటీ నిర్వాహకులు నన్ను తమిళనాడు కేటగిరి నుంచి ఎంపిక చేశారు. అందువల్ల ‘మిస్ తమిళనాడు’గా ఎంపికయ్యా’ అని వివరించింది. అయితే ఓ తెలుగు అమ్మాయిగా ఈ రెండు రాష్ట్రాల నుంచి తనను ఎంపిక చేసి ఉంటే మరింత సంతోషపడే దాన్ని అని, తమిళనాడు కూడా తనకు సొంత రాష్ట్రం వంటిదేనని పేర్కొంది. అన్నింటినీ మించి తాను భారత దేశాన్ని రిప్రజెంట్ చేయడాన్ని గర్వంగా భావిస్తానని శివాని చెప్పుకొచ్చింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1621343214.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ది గ్రూమింగ్ స్కూల్ కలలు నెరవేర్చే డిజిటల్ బడి
సాధారణ పల్లెల నుంచి పెద్దపట్టణాల వరకు ఎంతోమంది అమ్మాయిలకు ‘మిస్ ఇండియా’ మిస్ దివా’ కావాలనే లక్ష్యం ఉండవచ్చు. పక్కవారి నుంచి వెక్కిరింపులు కూడా ఎదురు కావచ్చు. ‘అది మనలాంటి వాళ్ల కోసం కాదు’ అంటూ అతిశయోక్తుల సమాచారం వెల్లువెత్తవచ్చు. ఈ గందరగోళాన్ని పక్కకు నెట్టి, స్పష్టత ఇవ్వడానికి, విజయం వైపు దారి చూపడానికి వచ్చిందే.. ది గ్రూమింగ్ స్కూల్. ‘అందంగా కనిపించాలనే ఆసక్తి మీలో ఉందా? ఆత్మవిశ్వాసం ఉందా? మీలోని శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేసుకోవాలనే ఉత్సాహం ఉందా?...‘అయితే ఈ లైఫ్ ఛేంజింగ్ స్కూల్ మీకోసమే’ అంటోంది మిస్ ఇండియా ఆర్గనైజేషన్(ముంబై). దశాబ్దాలుగా ఎంటర్ టైన్మెంట్, ఫ్యాషన్ ఇండస్ట్రీలో మంచి పేరున్న మిస్ ఇండియా ఆర్గనైజేషన్ (ఎంఐవో) ఎంతోమంది యువతులు అందాల కిరీటాన్ని అందుకోవడంలో సహాయపడింది. ‘డూ–ఇట్–యువర్సెల్ఫ్’ అని నినదిస్తున్న ‘ఎంఐవో’ ఔత్సాహిక యువతుల కోసం ‘ది గ్రూమింగ్ స్కూల్’ ద్వారా వివిధ రంగాల నిపుణులతో వీడియో ట్యుటోరియల్స్ నిర్వహించడానికి శ్రీకారం చుట్టింది. స్కిన్కేర్, హెయిర్కేర్, స్టైలింగ్, మేకప్, వ్యక్తిత్వ వికాసం, ఫ్యాషన్ స్టైలింగ్, సోషల్ మీడియా... మొదలైన వాటిలో నిపుణులు వీడియో తరగతులు నిర్వహిస్తారు. వారిలో కొందరు... అయేషా సేథ్ (మేకప్ ఆర్టిస్ట్), అలేషియా రౌత్(ర్యాంప్ వాకర్), సంజీవ్దత్తా (పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్), భరత్ గుప్తా (ఫ్యాషన్ స్టైలీస్ట్), డా.జార దాదీ (స్కిన్కేర్ కోచ్). యువతులను బ్యూటిఫుల్ అండ్ సక్సెస్ఫుల్గా నిలపడంలో వీరి పాఠాలు ఉపయోగపడతాయి. ఈ జెండర్–న్యూట్రల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకున్నవారికి నేర్చుకున్నంత నైపుణ్యం సొంతం అవుతుంది. ‘కల కనడం ఎంత ముఖ్యమో, ఆ కలను సాకారం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. తమ లక్ష్యాన్ని చేరుకోవాలనుకునేవారి కోసం, నిర్మాణాత్మకమైన పాఠాలతో ఒక బలమైన వేదికను ఏర్పాటు చేశాం’ అంటుంది మిస్ ఇండియా ఆర్గనైజేషన్. కోర్సు పూర్తయిన తరువాత అభ్యర్థులకు సంస్థ నుంచి సర్టిఫికెట్లు అందుతాయి. అంతకంటే ముఖ్యంగా ఆత్మబలం అపారంగా అందుతుంది! -
మిస్ వరల్డ్ పోటీ వాయిదా
ముంబై/సాన్జువాన్: మిస్ వరల్డ్–2021 పోటీని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. మిస్ ఇండి యా మానస వారణాసి (23) సహా పలువురు పోటీదారులు, సిబ్బంది కోవిడ్ బారినపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్యూర్టోరికోలోని సాన్ జువాన్లో డిసెంబర్ 16న ప్రారంభం కావాల్సిన ఈ కార్యక్రమాన్ని రానున్న 90 రోజుల్లో రీషెడ్యూల్ చేస్తామని తెలిపారు. కరోనా బారిన పడిన పోటీదారులు, సిబ్బందిని ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు వెంటనే క్వారంటైన్కు తరలించి, వైద్యపరీక్షలు, అవసరమైన చికిత్సలు చేపట్టినట్లు తెలిపారు. వీరందరూ కోలుకున్న తర్వాత, మరోసారి పరీక్షలు నిర్వహించి నెగెటివ్గా తేలితే వారి వారి దేశాలకు పంపిస్తామని ‘మిస్ వరల్డ్’ సీఈవో జులియా మోర్లే పేర్కొన్నారు. హైదరాబాద్కు చెందిన మానస భారత్ తరఫున మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు ప్యూర్టోరికో వెళ్లారు. -
మిస్ ఇండియా యు.ఎస్.ఏ వైదేహీ డోంగ్రేకథక్
మొన్నటి ఆదివారం ఆమెరికాలో ‘మిస్ ఇండియా యుఎస్ఏ’ పోటీ జరిగింది. సౌందర్యం మాత్రమే కాదు ప్రతిభ కూడా తమ సొంతం అని నిరూపించారు మన అమ్మాయిలు. కిరీటాన్ని గెలుచుకున్న వైదేహీ డోంగ్రేకథక్ డాన్సర్,పెద్ద సంస్థకు బిజినెస్ డెవలపర్ కూడా.ఫస్ట్ రన్నర్ అప్గా నిలిచిన అర్షి లలానిబ్రైన్ ట్యూమర్తో పోరాడుతూఆ టైటిల్ సాధించింది. అంతేకాదు, ఆ టైటిల్కు చేరినమొదటి అమెరికన్ ఇండియన్ ముస్లిం కూడా. ఒకరు మిషిగన్ నుంచి ఒకరు జార్జియా నుంచి ఈ టైటిల్స్ సాధించారు. న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ మొన్నటి వారాంతంలో భారతీయ అమెరికన్ కుటుంబాలతో కళకళలాడింది. అందుకు కారణం అక్కడ ‘మిస్ ఇండియా యు.ఎస్.ఏ’ అందాల పోటీ జరుగుతూ ఉండటమే. దాంతో పాటు ‘మిసెస్ ఇండియా యు.ఎస్.ఏ’, ‘టీన్ ఇండియా యు.ఎస్.ఏ’ పోటీలు కూడా జరిగాయి. గత 40 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా జరుగుతున్న ఈ వేడుకలో 2020–21 సంవత్సరానికిగాను మిషిగన్ రాష్ట్రానికి చెందిన వైదేహి డోంగ్రే విజేతగా నిలిచింది. జార్జియాకు చెందిన అర్షి లలాని ఫస్ట్ రన్నరప్గా నిలిచింది. ఇద్దరూ తమ తమ ప్రత్యేకతలతో ఈ టైటిల్స్ను సాధించారు. ముంబై అమ్మాయి ‘20 ఏళ్ల క్రితం ముంబై నుంచి మా కుటుంబం అమెరికాకు వలస వచ్చింది. ముంబైలో నా బాల్యం గడిచింది. అమెరికాలో నా చదువు. రెండు సంస్కృతుల మధ్య నేను పెరిగాను. రెంటిలోని అందమైన విషయాలను గ్రహించాను’ అంటుంది వైదేహి డోంగ్రే. అమెరికాలోని 30 రాష్ట్రాల నుంచి 61 మంది భారతీయ యువతులు ఈ టైటిల్ కోసం పోటీ పడితే విజయం 25 ఏళ్ల వైదేహి డోంగ్రేను వరించింది. మిషిగన్ యూనివర్సిటీలో చదువుకున్న వైదేహి ప్రస్తుతం ఆర్థిక రంగంలో పని చేస్తోంది. ‘నేను అమెరికాలో ఉన్న భారతీయ సమాజంలో స్త్రీల ఆర్థిక స్వతంత్రం, విద్య గురించి చైతన్యం కలిగించే పని చేయాలుకుంటున్నాను’ అని చెప్పింది. కథక్ డాన్సర్ కావడం వల్ల అద్భుతమైన కథక్ నృత్యం ప్రదర్శించి ‘మిస్ టాలెంటెడ్’ అవార్డు కూడా గెలుచుకుంది. ‘మేము అమెరికా వచ్చినప్పుడు ఇక్కడ కథక్కు అంత ప్రాముఖ్యం లేదు. మా అమ్మ మనిషా కథక్ డాన్సర్, టీచర్. ఇక్కడ కథక్ డాన్స్ స్కూల్ను నిర్వహించడానికి ఆమె చాలా కృషి చేయాల్సి వచ్చింది. ఆమెతో చిన్నప్పుడు ఆ డాన్స్ స్కూల్కు వెళుతూ కథక్ మీద ఆసక్తి పెంచుకున్నాను. డాన్సర్ని అయ్యాను. ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. ఇవాళ మా అమ్మ వల్ల, నా వల్ల అమెరికాలో కథక్ డాన్స్ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి’ అంటుంది వైదేహి. ఈ విద్యలే కాకుండా ఆమెకు పాడటం కూడా తెలుసు. చాలా హిందీ సినిమా పాటలు పాడుతూ సరదాగా వీడియోలు చేస్తుంటుంది. మిస్ యు.ఎస్.ఏ ఇండియా టైటిల్ ఆమె తన తల్లికి అంకితం చేసింది. ‘ఇది నా ఆయీకి’ అని సోషల్ మీడియాలో రాసిందామె. హైదరాబాద్ అమ్మాయి ‘గత సంవత్సరమంతా మా ఇంట్లో ఎవరి ముఖాల్లోనూ నవ్వు లేదు. కారణం మీకు తెలుసు. బయట మహమ్మారి వాతావరణం. ఇవాళ నాకు వచ్చిన ఫస్ట్ రన్నర్ అప్ టైటిల్, అందుతున్న పుష్పగుచ్ఛాలు మా నాన్నను చాలా సంతోషపెట్టాయి’ అంది అర్షి లలాని. ‘మిస్ ఇండియా యు.ఎస్.ఏ’ వేదిక పై అర్షి లలాని తన ప్రెజెన్స్తో అందరి హృదయాలను గెలుచుకుంది. దానికి కారణం ఆమె బ్రైన్ ట్యూమర్తో పోరాడటం వల్ల కూడా. అలాంటి ఆరోగ్య సమస్యతో కూడా ర్యాంప్ మీద ఆమె ఉత్సాహంతో కనిపించి హర్షధ్వానాలు అందుకుంది. అర్షి లలాని తల్లిదండ్రులు అజీజ్, రోజీనాలది హైదరాబాద్. అర్షి హైదరాబాద్లోని ఆగాఖాన్ అకాడెమీలో చదువుకుంది కూడా. జార్జియాలో స్థిరపడిన ఈ కుటుంబం నుంచి అర్షి ఈ టైటిల్ను గెలుచుకుంది. ‘ఇది నా జీవితానికి సంబంధించి టర్నింగ్ పాయింట్ అనుకుంటున్నాను. మన వెనుక ఎందరు ఉన్నా, మద్దతు అందించినా వేదిక మీద మనం ఒక్కళ్లమే నడవాలి. అంటే మనల్ని మనమే గెలిపించుకోవాలి అని అర్థమైంది. నేను నా కుటుంబాన్ని గర్వపడేలా చేశాను. అమెరికాలో స్థిరపడిన ముస్లిం కుటుంబాల నుంచి ఇలాంటి టైటిల్ గెలుచుకునే స్థానానికి వచ్చినందుకు సంతోషిస్తున్నాను’ అందామె.న్యూయార్క్లో స్థిరపడిన భారతీయ వ్యాపారవేత్త ధర్మాత్మ శరణ్ 1980లో ఈ అందాల పోటీని ప్రారంభించారు. అమెరికాలో ఉన్న భారతీయుల కోసం ‘మిస్ ఇండియా యు.ఎస్.ఏ’ ఇతర ప్రపంచ దేశాలలో ఉన్న భారతీయుల కోసం ‘మిస్ ఇండియా వరల్డ్వైడ్’ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు ఈ అక్టోబర్లో ముంబైలో జరగనున్నాయి. -
మిస్ యూనివర్స్ థర్డ్ రన్నరప్.. సవాళ్ల శిఖరం
మహిళలు తమ కలలను నిజం చేసుకోవడానికి వారి జీవితంలో ప్రతిరోజూ అసమానతల సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. అడ్లైన్ కాస్టెలినో సవాళ్లను ఎదుర్కొంటూనే విజయపథం వైపుగా పయనిస్తోంది. కర్ణాటకకు చెందిన ఈ 22 ఏళ్ల మిస్ ఇండియా సోమవారం జరిగిన 69వ మిస్ యూనివర్స్ పోటీలో థర్డ్ రన్నరప్ (నాలుగో స్థానం)గా నిలిచి దేశం గర్వించేలా చేసింది. ఎవరీ అడ్లై్లన్ కాస్టెలినో... కువైట్లో పుట్టి పెరిగిన భారతీయ యువతి అడ్లైన్ కాస్టెలినో. కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని ఉదయరాకు చెందిన ఆల్ఫోన్స్, మీరా కాస్టెలినో దంపతులు ఉద్యోగరీత్యా కువైట్లో ఉండేవారు. అక్కడే అడ్లై్లన్ పుట్టింది. కువైట్లోని ఇండియన్ సెంట్రల్ స్కూల్లో చదువుకుంది. . ‘అమ్మాయిల ఎదుగుదలకు ఎలాంటి దారి లేని దేశం అది. అలాంటి చోట పుట్టి, పెరిగిన నేను మిస్యూనివర్స్గా గెలుపొందిన వారిని విస్మయంగా చూసేదాన్ని. ప్రతిష్టాత్మక వేదిక మీద మిస్యూనివర్స్ కిరీటం అందుకోవాలన్నది నా కల’’ అంటూ తన జీవన ప్రయాణాన్ని వివరిస్తోంది అడ్లైన్ కాస్టెలినో. ఆమె ఆకాంక్షను తెలుసుకున్న తల్లిదండ్రులు 15 ఏళ్ల వయసులో భారతదేశానికి తిరిగి వచ్చారు. అక్కడ నుంచి ముంబై వెళ్లారు. సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో చదువుకున్న అడ్లైన్ ఆ తర్వాత విల్సన్ కాలేజీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో డిగ్రీ పూర్తి చేసింది. మాతృభాష కొంకణితో పాటు ఇంగ్లిష్, హిందీ, కన్నడ భాషలలో నిష్ణాతురాలు. 2020లో జరిగిన లివా మిస్ దివా యూనివర్స్ పోటీలో విజేతగా నిలిచిన అడ్లైన్కు ఇప్పుడు 22 ఏళ్లు. ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీలో భారత ప్రతినిధిగా నిలిచింది. సాధనే ధ్యేయంగా ముందడుగు ‘మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకోవాలన్న ఆకాంక్ష సౌకర్యవంతంగా ఉండే జీవనం నుంచి నన్ను బయటకు తోసేసిందనే చెప్పాలి’ అంటారు అడ్లైన్. ఇప్పుడు ఇండియాలో అడ్లైన్ ఒక టాప్ మోడల్. ప్రముఖ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తోంది. ఫ్యాషన్, లైఫ్సై ్టల్ బ్రాండ్లు, మ్యాగజైన్ కవర్లు, టెలివిజన్, డిజిటల్ ప్రచారాలలో కనిపిస్తోంది. మరిన్ని సృజనాత్మక రంగాలలో అవకాశాలను పొందడానికి కృషి చేస్తోంది. స్మైల్ ట్రెయిన్కు గుడ్విల్ అంబాసిడర్గా ఉంది. మహిళల ఆరోగ్య సంరక్షణకు అందించే స్నేహ అనే ఎన్జీవోతో కలిసి పనిచేస్తోంది. రైతుల హక్కుల కోసం, అణగారిన గ్రామీణ వర్గాలకు చేయూతనందించే సంస్థలతో కలిసి పనిచేస్తోంది. జీవనం గడవడానికి కొన్నాళ్లు షూస్ తయారుచేసి, అమ్మకాలు కొనసాగించింది. టాప్మోడల్గా, స్వచ్ఛంద సేవకురాలిగా ఎదగడానికి ముందు తనలో ఉన్న నత్తి సమస్యను అధిగమించడానికి కొన్నేళ్లపాటు సాధన చేసింది అడ్లైన్. ఇండియా నుంచి మిస్యూనివర్స్ కిరీటానికి పోటీపడి థర్డ్ రన్నరప్గా నిలిచింది.. దేశ మహిళల తరపున.. ‘ఎప్పుడూ సాహసోపేత వ్యక్తిగా ఉండటానికి ఇష్టపడతాను. ఎంతటి కష్టమైనా వెనుకంజ వేయను. వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయత్నించడానికి సిద్ధంగా ఉంటాను’ అంటున్న ఈ నవీన యువతి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే అనిపించకమానదు. ‘నిన్నటి వరకు నన్ను నేను ఒక అమ్మాయిలా భావించాను. కానీ, ఇప్పుడు నేను సమాజానికి మద్దతు ఇచ్చే ఒక మహిళను. ఈ ప్రయాణం నాకు ఎంతో నేర్పించింది. ఈ దేశం ఇచ్చే ప్రేమను నేను ఎప్పటినుంచో పొందుతున్నాను. నాకు మద్దతుగా నిలిచి నేను థర్డ్ రన్నరప్(నాల్గవ స్థానంలో)గా నిలిచేందుకు సాయం చేసిన దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు’ అని తెలిపింది అడ్లైన్ కాస్టెలినో. -
మానస సంచరరే...
ఫెమినా మిస్ ఇండియా పోటీలో గెలిచిన అమ్మాయి అనగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి మనసులలో ఒకటే నామం, ఒకటే రూపం కదలాడుతోంది. మది మదిన సంచరిస్తున్న ఆమే మానస వారణాసి. ఈ భారతీయ సుందరికి డ్రెస్ డిజైన్స్ చేసినవారిలో హైదరాబాదీ డిజైనర్ శ్రవణ్కుమార్ ఉన్నారు. మానస వారణాసి సంప్రదాయ, ఇండోవెస్ట్రన్ స్టైల్ వేషధారణ గురించి ఈ డిజైనర్ చెప్పిన వివరాలు. డ్రెస్ డిజైన్స్. మిస్ ఫ్యాషన్ కూడా... తెలుగు అమ్మాయిల్లో అరుదైన అందం మానసది. తనకు నేను పలు మార్లు డిజైన్స్ అందించాను. తను బాగా ఫ్యాషన్ స్పృహ ఉన్న అమ్మాయి. ఇండియన్, వెస్ట్రన్, అఫిషియల్, ఫార్మల్... ఇలా ఏ డ్రెస్ అయినా బాగా క్యారీ చేయగలదామె. తను తప్పకుండా మిస్ వరల్డ్ అవుతుంది. ఎందుకంటే... ఆమె ఇండియన్ బ్యూటీ, టెక్నికల్ ఇండియన్ బ్యూటీ... ప్యూర్ ఇండియన్ బ్యూటీ... రైట్ బాడీ, రైట్ యాటిట్యూడ్ లతో నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. – శ్రవణ్కుమార్, ఫ్యాషన్ డిజైనర్ టమరీ గాడీగా కాకుండా రెండు రంగులతో చేసిన మ్యాజిక్ వినూత్న అందాన్ని తీసుకువచ్చింది. బంగారు రంగు పెద్ద అంచు ఉన్న వంగపండు లెహంగా అదే రంగు బ్లౌజ్, దుపట్టా, లెహంగాకు సెట్ టాజిల్స్.. ఓ ప్రత్యేక ఆకర్షణ. టవెస్ట్రన్ జంప్సూట్ నుంచి డిజైన్ చేసిన మోడల్ డ్రెస్. మేని రంగును డ్రెస్ రంగు మరింతగా ఎలివేట్ చేస్తుంది. టవెస్ట్రన్ షార్ట్ గౌన్కి ఇండియన్ సంప్రదాయ చీర అంచు మరింత అందాన్ని తీసుకువచ్చింది. -
వాసవీ కాలేజీ లో మిస్ ఇండియా సందడి
-
మిస్ ఇండియా మానస వారణాసి ఫోటోలు..
-
ప్రపంచ సుందరే నా టార్గెట్: మానస వారణాసి
సాక్షి, చిక్కడపల్లి: మిస్ వరల్డ్ కిరీటాన్ని సాధించడమే తన లక్ష్యమని మిస్ ఇండియా మానస వారణాసి అన్నారు. బుధవారం సాయంత్రం నగరంలోని అశోక్నగర్ వీధి నంబర్– 2లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆమెకు తల్లిదండ్రులు శైలజ, రవిశంకర్, చెల్లెలు మేఘన, అమ్మమ్మ గరికపాటి అన్నపూర్ణ, స్నేహితులు, అపార్ట్మెంట్వాసులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం మానసను లెజెండ్ అపార్ట్మెంట్ వాసులు ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే.. ♦చాలా రోజుల తర్వాత నగరంలోని సొంతింటికి వచ్చాను. మిస్ ఇండియా పోటీలో నిలిచేందుకు ఎంతోకాలం నిరీక్షించాను. ముంబై వెళ్లి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో ఉంటూ ఎంతో కష్టపడి పోటీలకు సన్నద్ధమయ్యాను. ♦మిస్ ఇండియా ఓ బిగ్ చాలెంజ్. దానిని సొంతం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ ప్లాట్ఫాం వైపు స్నేహితులు ఎంతగానో ప్రోత్సహించారు. మా అమ్మానాన్న సైతం ఆ దిశగా ముందుకు నడిపించారు. ఇప్పుడు వారెంతో సంతోషపడుతున్నారు. ఇండియాను ఇంటర్నేషనల్ ప్లాట్ఫాంపై నిలబెట్టేందుకు కృషి చేస్తా. సినిమా అవకాశాలు ప్రస్తుతానికి వాటి జోలికి వెళ్లను. నా లక్ష్యం మిస్వరల్డ్ మాత్రమే. ♦మిస్ ఇండియా మానసను చూడగానే అశోక్నగర్లోని స్ట్రీట్ నంబర్ వాసులు, లెజెండ్ అపార్ట్మెంట్ వాసులు ఆమెపై పూలవర్షం కురిపించి సత్కరించారు. డప్పు దరువులకనుగణంగా చిన్నారులతో కలిసి ఆమె డ్యాన్స్ చేయడం అందరినీ అలరించింది. స్నేహితులు, బంధువులు పూల బొకేలతో మానసను అభినందించారు. ఆమెతో సెల్ఫీలు దిగారు. స్నేహితులతో కలసి తీన్మార్ డ్యాన్స్ చేస్తున్న మిస్ ఇండియా మానస వారణాసి మాకెంతో గర్వకారణం తమ అపార్ట్మెంట్లో ఉండి ఎంతో స్నేహపూర్వకంగా కలిసిమెలిసి అందరితో వినయంగా మాట్లాడే మానసకు మిస్ ఇండియా రావడం గర్వకారణం. – సందీప్ మిశ్రా, అపార్ట్మెంట్ వాసి మిస్ వరల్డ్ రావాలి.. లెజెండ్ అపార్ట్మెంట్లో మానసను తొమ్మిదేళ్లుగా చూ స్తున్నాం. ఆమెకు మిస్ ఇండి యా రావడం ఎంతో సంతో షంగా ఉంది. మిస్ వరల్డ్ కూడా రావాలని ఆశిస్తున్నాం. – పద్మాకర్ జాదవ్, అపార్ట్మెంట్ వాసి విమానాశ్రయంలో ఘనస్వాగతం శంషాబాద్: మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తర్వాత తొలిసారిగా మానస వారణాసి బుధవారం హైదరాబాద్కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, అభిమానులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మానస వారణాసి మీడియాతో మాట్లాడుతూ.. మిస్ ఇండియా పోటీల్లో వివిధ రాష్ట్రాల అమ్మాయిలతో కలిసి ఉన్నానని, మంచి వాతావరణంలో పోటీలు జరిగాయన్నారు. వలంటీర్గా తాను పనిచేసిన అనుభవం కూడా తన విజయానికి దోహదపడిందన్నారు. చదవండి: (మా కూతురికే.. ప్రపంచ సుందరి కిరీటం!) (సాఫ్ట్వేర్ ఇంజనీర్ని.. గ్లామర్ రంగానికి కొత్త) -
‘మిస్ ఇండియా ఐనా.. ముద్దుల మనవరాలే’
ఆమె మిస్ ఇండియా అయినా నాకు ముద్దుల మనవరాలే. నా వయసు 80 ఏళ్లు. మానస వారణాసి అంటే మాటల్లో వర్ణించలేనంత ఆప్యాయత, అనురాగం. ఏం అమ్మాయి.. పెళ్లీడుకొచ్చావు. నీకు ఈ కాలేజీలు, స్టేజ్ షోలు ఎందుకు? మంచి సంబంధం చూసి వివాహం చేస్తామని వెంటపడేదాన్ని. ఈ విషయంలో మా ఇద్దరి మధ్య ప్రతిరోజూ సరదా కబుర్లు సాగుతుండేవి. ఓ వైపు మనవరాలు మానసను చీవాట్లు పెడుతూనే మరోవైపు ఆమె అమితంగా ఇష్టపడే పెసరట్టు, పులిహోర, ఫ్రైడ్రైస్, వైట్రైస్ వండిపెట్టేదాన్ని. మానస మిస్ ఇండియా కిరీటాన్ని గెలిచిన తరుణంలో నా ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. వెంటనే ఆమెకు వీడియో కాల్ చేసి విష్ చేశాను. – గరికపాటి అన్నపూర్ణ, మిస్ ఇండియా మానస వారణాసి అమ్మమ్మ చిన్నప్పుడు భరతనాట్యంలో ప్రావీణ్యం..స్విమ్మింగ్లో ప్రతిభ.. స్కూల్, కాలేజీలో యాంకరింగ్..ఇలా డ్యాన్సర్గా, స్విమ్మర్గా, సింగర్గా, ఆర్టిస్ట్గా, బుక్ రీడర్గా నా కూతురు ఎప్పుడూ ముందుండేది. తను ఏదైనా అనుకుంటే ఆ పని చేసే వరకు నిద్రపోయేది కాదు. మలేషియాలో చదివినప్పటికీ..మనదేశ సంస్కృతి, సంప్రదాయాలను ఫాలో అవుతూ..నేడు మిస్ ఇండియాగా నిలవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు మిస్ ఇండియా మానస వారణాసి తల్లిదండ్రులు శైలజ, రవిశంకర్. వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో మిస్ ఇండియా కిరీటాన్ని సాధించి నగరానికి వస్తున్న సందర్భంగా ‘సాక్షి’ ఆమె కుటుంబ సభ్యులను పలకరించింది. కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన శైలజ, రవిశంకర్ దంపతులు 1992లో నగరంలో స్థిరపడ్డారు. ఆ తర్వాత రవిశంకర్ మలేషియాలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా చేసేవారు. అదే సమయంలో కూతురు స్కూల్ విద్య అంతా మలేషియాలో జరిగింది. 11,12 తరగతులు ఫిడ్జ్లో చదివింది. ఇంజనీరింగ్ ఇబ్రహింపట్నంలోని వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో చదివింది. మరిన్ని విశేషాలు వారి మాటల్లో... తనే స్టైలిస్ట్..తనే డిజైనర్ వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా పోటీలు చాలా వరకు వర్చువల్ వేదికగా జరిగాయి. ఉదయం 5.30 గంటలకే మానస నిద్రలేచేది. ఉదయం లేచి ఆరోజంతా ఏం చేయాలనే అంశాలపై డైరీ రాసుకునేది. వర్చువల్గా పోటీలు మొదలయ్యే వరకు తనే డ్రస్ డిజైన్ చేసుకునేది. సొంతంగా మేకప్ వేసుకునేది. ఇంట్లో ఒక్కరి సాయం కూడా అడిగేది కాదు. ఇలా ఈ పోటీల్లో తనే ఒక స్టైలిస్ట్గా, హెయిర్ డిజైనర్గా, ఫ్యాషన్ డిజైనర్గా ఉన్న పట్టుదల మాకెంతో నచ్చింది. ముషీరాబాద్, కోఠీలోని పిల్లలకు విద్యాభ్యాసం వీలు కుదిరినప్పుడల్లా ముషీరాబాద్ గర్ల్స్ స్కూల్, కోఠిలోని షెల్టర్హోంలో ఉన్న పిల్లలకు ఉదయం వెళ్లి మ్యాథ్స్ ఇంగ్లిష్ నేర్పించేది. నేనే స్వయాన తనని బైక్ మీద డ్రాప్ చేసి వచ్చేదాన్ని తల్లి శైలజ వివరించారు. ఇలా ఓ ఎన్జీఓలో మూడేళ్ల పాటు ఫ్రీగా పిల్లలకు సర్వీస్ చేసింది. ఇంట్లో తన పని తను చేసుకుంటూ ఉంటుంది. తన చెల్లి, ఫ్రెండ్స్తో కలసి సరదాగా గడుపుతుంటుంది. డిసెంబర్లో జరిగే ప్రపంచ పోటీల్లో నా కూతురు ప్రపంచ కిరీటం గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు తల్లి శైలజ. ఖాళీ దొరికితే నవలలు చదివేది చిన్నప్పటి నుంచి బుక్స్ చదవడం అంటే మానసకు చాలా ఇష్టం. ఖాళీ దొరికితే బుక్స్ చదివేది. అలా కాలేజీ డేస్ నుంచి సెలవుల సమయంలో నవలలు చదివేది. వద్దన్నా వినేది కాదు. ఖాళీ టైంలో అక్కతో కలసి యూట్యూబ్లో వంటలు చూస్తూ చేసి అమ్మనాన్నలకు వండిపెట్టేవాళ్లమని వివరించింది మానస చెల్లి మేఘన. ఇలా చైనీస్, థాయ్లాండ్ వంటకాలన్నీ ఇష్టపడేది మానస. అక్క, నేను గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకునేవాళ్లం ఇద్దరం చిన్న చిన్న విషయాల్లో గొడవ పడేవాళ్లం. అయినా.. అక్కంటే నాకు, నేనంటే అక్కకి ప్రాణం. ఇద్దరం ఫేస్టివల్స్ అప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకునేవాళ్లం. ది బెస్ట్ సిస్టర్ ఫర్ ఎవర్ అంటూ నేను మంచి మెసేజెస్ పంపితే తను ఫిదా అయ్యేది. – మేఘన వారణాసి (మానస సోదరి) ఏమున్నా మాతోనే షేర్ చేసుకుంటుంది మానస ఏమున్నా మాతోనే షేర్ చేసుకునేది. కలసి మూవీస్కి వెళ్తుంటాం. ఎక్కువగా తనకి ఇంగ్లీష్ సినిమాలంటే ఇష్టం. అందాల పోటీలకోసం మా ఫ్రెండ్ పడిన కష్టం మాకు బాగా తెలుసు. ఇప్పుడు మిస్ ఇండియా టైటిల్ గెలవడం చాలా ఆనందంగా ఉంది. – నిహారిక, మనస్విని, (మానస ఫ్రెండ్స్) -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ని.. గ్లామర్ రంగానికి కొత్త
‘హైదరాబాద్ నగరం నన్ను తీర్చిదిద్దింది. ఫుడ్ నుంచి ఫ్రెండ్స్ దాకా ఎన్నో ఇచ్చింది. నేను ఈ నగరంతో మమేకమైపోయా’’ అంటోంది నగరవాసి, తాజాగా ముంబయిలో జరిగిన పోటీల్లో మిస్ ఇండియా టైటిల్ గెల్చుకున్న మానస వారణాసి (23). గ్లామర్ రంగంతో ఏ మాత్రం సంబంధం లేకుండా నేరుగా బ్యూటీ కాంటెస్ట్లోకి అడుగుపెట్టిన సాఫ్ట్వేర్ ఇంజినీర్.. ఎంబ్రాయిడరీ నుంచి ట్రెక్కింగ్ దాకా భిన్న రకాల అభిరుచులు, చిన్న వయసులోనే పరిపక్వ ఆలోచనలతో అబ్బురపరిచే మానస ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే... సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న నేను గ్లామర్ రంగానికి చాలా కొత్త. కాలేజ్ డేస్లో మిస్ ఫ్రెషర్గా గెలవడం తప్ప.. గతంలో గ్లామర్ రంగంలో ఎప్పుడూ ఫుల్టైమ్ పనిచేసింది లేదు. అనుకోకుండా ఈ పోటీకి ఎంపికై, టైటిల్ గెలుచుకోవడం చాలా ఆనందాన్నిస్తోంది. పోటీ ఇప్పటికే.. సిస్టర్స్గా ఎప్పటికీ... మిస్ ఇండియా పోటీలో 31 మంది ఫైనలిస్ట్లు పలు రాష్ట్రాల నుంచి, కేంద్ర పాలిత ప్రాంతం నుంచి కూడా ప్రాతినిధ్యం వహించారు. కోవిడ్ కారణంగా ఈ పోటీ చాలా వరకూ వర్చువల్గానే సాగింది. వీరిలో 15 మంది ముంబయిలో జరిగిన ఫైనల్స్కు ఎంపికై హాజరయ్యారు. ఈ పోటీల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నా. అంతేకాదు స్టైలింగ్ నుంచి ఎక్సర్సైజ్ దాకా ఎన్నో మెళకువలు కూడా నేర్చుకున్నా. ఈ అనుభవం మర్చిపోలేనిది. పోటీ కేవలం ఇక్కడి వరకే. తర్వాత స్వంత సిస్టర్స్లా లైఫ్ లాంగ్ టచ్లో ఉంటాం. కుటుంబమే కీర్తి... మనుషులే స్ఫూర్తి... అమ్మమ్మ, తల్లిదండ్రులు, సోదరి ఇదే నా కుటుంబం. వాసవిలో ఇంజినీరింగ్ చదివా. సాధారణ జీవితం, అత్యున్నత ఆలోచనలు, విద్యకు ప్రాధాన్యం ఇచ్చే కుటుంబం మాది. అది నేర్పిన విలువలే నన్ను నిర్వచిస్తాయి. తమను తాము ఎప్పటికప్పుడు పునర్నిర్వచించుకుని, పునరావిష్కరించుకునే మనుషులే నాకు స్ఫూర్తి. జీవితాంతం వ్యక్తిగా పరిణతి సాధించుతూనే సాగుతాను. ఏ విషయంలోనైనా అంతిమంగా పశ్చాత్తాపం చెందాల్సిన అవసరం లేని సంపూర్ణ జీవితమే నాకు ప్రధానం. సినిమా... రమ్మంటే? భవిష్యత్తు మనకేమి ఇస్తుందో ఎవరికి తెలుసు? ఒక కొత్త ఆశలు..అవకాశాల ప్రపంచాన్ని సృష్టించుకోవడానికి నేను మిస్ ఇండియా పోటీలకు వచ్చాను. ఈ టైటిల్ నన్నెక్కడికి తీసుకెళుతుందో చూడాలని నేను ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నా. సినిమా రంగ ప్రవేశం అనే ప్రశ్నకు కాలం మాత్రమే సమాధానం చెబుతుంది. నా వరకూ నాకు ఎదురయ్యే ప్రతి అవకాశానికి తలుపులు తెరచి ఉంచాలనేది ఇప్పటిదాకా సాగిన నా ప్రయాణం నాకు నేర్పింది. అద్భుత యోగం.. అందం మానసికం.. శరీరంతో పాటు మనసు ఆత్మల మేలు కలయికే ఫిట్నెస్. అది అందించేదిగా నేను ఎంచుకున్న యోగా నా జీవితంలో అద్భుతాలు చేసింది. ఇతరుల్ని మెప్పించడానికి చేసే ప్రయత్నం కాక నిన్ను నువ్వు మెప్పించుకోవడమే ముఖ్యమనేది ఫ్యాషన్లో పాటించే సూచించే సూత్రం. నువ్వేమిటి అనే విషయంలో ఆత్మవిశ్వాసంతో ఉంటే నీకు నువ్వెప్పుడూ అందంగానే ఉంటావు. నీ గురించి నువ్వు సంతృప్తిగా భావించకపోతే అందంగా ఉండడం అనేదానిలో అర్ధం లేదు. అందాల భామ.. అభిరుచుల చిరునామా.. నగరానికి చెందిన మానస వారణాసి ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ ఎనలిస్ట్గా ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. మానస తండ్రి అనుమణి వారణాసి, తల్లి శైలజ వారణాసి. ఇన్స్ట్రా గ్రామ్ ద్వారా పెట్స్పై ప్రేమ నుంచి తన ఎంబ్రాయిడరీ స్కిల్స్ దాకా ఎన్నో ఆమె పంచుకుంటుంటారు. ట్రెక్కింగ్, స్కై గేజింగ్ తదితర సాహసాలు చేయడాన్ని ఇష్టపడే మానస సైన్ లాంగ్వేజ్ లో కూడా శిక్షణ పొందారు. ఒక సాధారణ యువతిగా నగరానికి చెందిన ఎన్జీవో ‘మేక్ ఎ డిఫరెన్స్’తో కలిసి పనిచేయడం నన్ను చాలా మార్చింది. నా అంతర్ముఖ వ్యక్తిత్వాన్ని అధిగమించడానికి, విద్యాపరమైన సమానత్వాన్ని అర్ధం చేసుకోవడానికి కూడా ఉపకరించింది. ఆ అనుభవాన్ని ఉపయోగించుకుని ఇక మిస్ ఇండియాగా సమాజానికి నా వంతు బాధ్యత స్వచ్ఛంగా, స్వచ్ఛందంగా నిర్వర్తిస్తాను. -
మిస్ ఇండియా రన్నరప్పై శిఖర్ ధావన్ ప్రశంసలు
మిస్ ఇండియా 2020 రన్నరప్గా నిలిచిన ఓ ఆటో వాలా కూతురు మాన్యా ఓంప్రకాశ్ సింగ్. ఉత్తర ప్రదేశ్లోని కుషీనగర్లో జన్మించిన 19 ఏళ్ల ఈ అమ్మాయి కడుపేదరికాన్ని అనుభవించింది. తిండి, నిద్రలేని ఎన్నో రాత్రులను గడిపింది. చిన్నతనంనుంచే పనిచేస్తూ చదువుకుంది. మాన్యా డిగ్రీ చదవుల కోసం వాళ్లమ్మ నగల్ని కుదువ పెట్టాల్సి వచ్చింది. ఈ కష్టాలన్నీ ఆమెలో కసిని పెంచాయి. పట్టుదలతో శ్రమించి మిస్ ఇండియా 2020 రన్నరస్గా నిలిచింది. కొన్ని లక్షల మంది తన లాంటి కలలుకనే పేదవారికి స్ఫూర్తిగా నిలిచింది. ( ఇప్పుడేమంటారు: అశ్విన్ భార్య ) మాన్యా స్ఫూర్తిదాయక కథ చాలా మందిని ఆకర్షించింది. వారిలో భారత క్రికెట్ ఆటగాడు శిఖర్ ధావన్ కూడా ఒకరు. ఆదివారం ఆయన ట్విటర్ వేదికగా దీనిపై స్పందిస్తూ.. ‘‘ మాన్యా సింగ్.. కలలు నిజమవుతాయనడానికి నువ్వే ఓ నిదర్శనం! ఇదో స్ఫూర్తిదాయక కథ. మీ లక్ష్యాలపై నమ్మకం ఉంచండి.. వాటిని సాధించటానికి కష్టాలను అధిగమించండి’’ అని పేర్కొన్నారు. ( మిస్ ఇండియా రన్నరప్గా ఆటో డ్రైవర్ కూతురు ) Manya Singh.. what an inspirational story! You’re proof that dreams do come true. Believe in your goals and you will rise above the odds to achieve them! 👏 pic.twitter.com/jYKJGONzMf — Shikhar Dhawan (@SDhawan25) February 14, 2021 -
మిస్ ఇండియా రన్నరప్గా ఆటో డ్రైవర్ కూతురు
లక్నో: అందాల పోటీలు..ఈ పేరు వినగానే అందరూ డబ్బున్న వారే పాల్గొంటారని అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక రిక్షా డ్రైవర్ తన కూతురు ఈ అందాల కిరీటం గెలవాలని కలలు కన్నాడు. దానికోసం ఎంతో కష్టపడ్డాడు. చివరికి ఒక అడుగు దూరంలో తన కూతురికి ఆ అవకాశం చేజారిపోయింది. అయితే, వీఎల్సీసీ మిస్ ఇండియా పోటీలో రన్నరప్గా తన కూతురుని ప్రపంచం ముందు నిలబెట్టడంలో మాత్రం ఆయన విజయం సాధించాడు. ఈ పోటీల్లో మన హైదరాబాదీ అమ్మాయి మానసా వారణాసి విన్నర్గా నిలవగా.. ఉత్తర్ప్రదేశ్కి చెందిన మాన్యా సింగ్ రన్నరప్గా నిలిచింది. ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ అందరి మన్ననలను పొందుతున్న మాన్యా విజయగాథను ఇప్పుడు తెలుసుకుందాం. అందాల పోటీలలో నిలవాలంటే అందంగా ఉండాలి. చక్కని ముఖవర్చస్సు కలిగి, అందమైన శరీరాకృతి కోసం ఎన్నో చేయాలి. ఇదంతా ఖర్చుతో కూడుకున్న విషయమని చాలా మందికి ఆసక్తి ఉన్నా ఆర్థిక పరిస్థితులు సహకరించక పోవడం వలన తమ ఆశను మనస్సులోనే చంపుకొంటారు. అయితే, ఉత్తరప్రదేశ్ కు చెందిన మాన్యా సింగ్ అందరిలా ఆలోచించలేదు. ఈమె తండ్రి ఒక ఆటోవాలా. తల్లి ఇంటిలో పనులు చేసుకొంటూ తన ఇద్దరు పిల్లలను చూసుకొనేది. పేదరికం కారణంగా మాన్య కొద్దివరకే చదువుకొని ఉద్యోగంలో చేరాల్సిన పరిస్థితి ఎదురైంది. మాన్య డిగ్రి ఫీజు కోసం తల్లి దగ్గర ఉన్న కొద్దిపాటి బంగారాన్నికూడా కుదువపెట్టాల్సి వచ్చింది. తన ఖర్చుల కోసం ఇంట్లో వారు పడుతున్న కష్టాన్ని చూడలేని మాన్య పద్నాలుగు ఏళ్లప్పుడే ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. రాత్రిపూట కాల్సెంటర్లో ఉద్యోగం చేసుకుంటూ, ఉదయంపూట చదువుకునేదాన్ని అని చెప్పింది. మిస్ఇండియా పోటీల్లో గెలవాలని నిర్ణయించుకొని దీనికోసం ఎన్నో తిండి, నిద్రలేని రాత్రులు గడిపానని తెలిపింది. ఉద్యోగం చేస్తున్నప్పుడు నడిచి వెళ్తు రిక్షా డబ్బులు కూడా దాచుకునే దాన్నని మాన్యా గుర్తు చేసుకుంది. ఈ రోజు మానాన్న, అమ్మా, అన్నయ్య నాకోసం పడ్డ కష్టం, వారు నాకు అందించిన సహకారం వలనే ఈ స్థానంలో నిలిచాను’ అని ఆమె వివరించింది. చదవండి: ‘మిస్ ఇండియా’ కిరీటం.. విన్నర్గా తెలుగమ్మాయి -
‘మిస్ ఇండియా’ కిరీటం.. విన్నర్గా తెలుగమ్మాయి
సాక్షి, హైదరాబాద్: ‘పుట్టుకతో వచ్చినది కాదు మనల్ని మనం సరికొత్తగా ఆవిష్కరించుకోవడంలో అందం ప్రతిఫలిస్తుంది’ అని నిరూపిస్తోంది మానస వారణాసి. హైదరాబాద్లో పుట్టి పెరిగిన మానస విఎల్సిసి ఫెమినా మిస్ ఇండియా 2020 పోటీలో గెలిచి తన సత్తా చాటింది. ఇప్పుడీ తెలుగు అమ్మాయి పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ముంబయ్ హయ్యత్ రిజెన్సీలో బుధవారం జరిగిన విఎల్సిసి ఫెమినా మిస్ ఇండియా 2020 వేడుకలో తెలంగాణ అమ్మాయి మానస వారణాసి మొదటి స్థానం లో నిలిచి అందాల కిరీటం గెలుచుకోగా, ఉత్తరప్రదేశ్కు చెందిన మాన్యా సింగ్ రన్నరప్గా, హర్యానాకు చెందిన మనికా షియోకండ్ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా కిరీటం దక్కించుకున్నారు. 23 ఏళ్ల మానస హైదరాబాద్లోని గ్లోబల్ ఇండియన్ లో స్కూల్ చదువు, వాసవి ఇంజినీరింగ్ కాలేజీ నుంచి కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేసింది. ఇంజనీరింగ్ చేసిన మానస ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ అనలిస్ట్గా పనిచేస్తోంది. నిత్య సాధనం... నిత్య వినూత్నం సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుకుగా ఉండే మానస తన ప్రాక్టీస్ను నిత్యం కొనసాగిస్తూ, ఆ అనుభవాలను పంచుకుంటూనే ఉంటుంది. ‘సాధన చేస్తూ ఉంటే జీవితం ఏం ఇస్తుందో ఎవరూ చెప్పరు. రాయడం, చిత్రలేఖనం, పరిగెత్తడం, పాడటం వంటివి మాత్రమే కాదు స్నేహితులను ఎలా సంపాదించుకోవాలో కూడా సాధన చేయాలి. మంచి ఫ్రెండ్గా, మంచి తోబుట్టువుగా, మంచి వ్యక్తిగా ఎలా ఉండాలో కూడా సాధన చేయాలి. ప్రజలు దానిని గుర్తించేంత వరకు సాధన ఆపకూడదు. అవసరమైన చోట కోపం చూపడం, అవసరమైన వారికి దయను ఎలా అందించాలో కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ మనల్ని శక్తింతులను చేసేవే, ఇవే మరిన్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయని నేను గ్రహించాను’ అని చెప్పారామె. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) కళల కసరత్తు ఇంజినీరింగ్ చదువు పూర్తి కాగానే మానస ఎఫ్బిబి–ఇండియా ఫ్యాషన్ హబ్ కలర్స్ టివి ఫెమినా మిస్ ఇండియా 2019 తెలంగాణ ఫైనలిస్ట్గా ఎంపికయ్యారు. ఫెమినా మిస్ ఇండియా పోటీలో గెలుపొందిన ఈ అందాల రాశి కసరత్తులు చేయడంతో పాటు రాయడం, చదవడం, సంగీతం, యోగా, భరతనాట్యంలోనూ రాణిస్తోంది. కొత్తవాటిని తెలుసుకోవాలనే ఉత్సుకత ఎన్నింటినో నేర్పుతుంది. మనల్ని బలవంతుల్ని చేస్తుంది అని నమ్ముతుంది. ఎప్పుడూ ఓ కొత్త కళను సాధన చేయడంలో బిజీగా ఉండే మానస ‘నా చిన్నతనంలో చాలా సిగ్గుగా, నలుగురిలోకి వెళ్లాలన్నా భయంగా ఉండేదాన్ని. టీనేజ్లో ఏదో తెలియని ఒక ఆరాటం, ఎప్పుడూ నాకు సౌకర్యంగా అనిపించిన ప్లేస్లోనే ఉండిపోవడానికి ప్రయత్నించేదాన్ని. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) కాస్త పెద్దయ్యాక ప్రతిరోజూ నన్ను నేను ప్రశ్నించుకుంటూ, మెరుగుపరుచుకోవడం మొదలయ్యింది. ఇప్పటికీ ఈ అలవాటును కొనసాగిస్తూనే ఉన్నాను. దీనివల్ల ప్రతియేటా నన్ను మరింత శక్తిమంతురాలిగా ఈ లోకం ముందు నిలబెడుతుంది’ అంటూ తన ఆలోచనలు పంచుకుంటారు ఆమె. ఈ అందాల రాశి ఒక స్వచ్ఛంద సంస్థలో చేరి, పిల్లలకు విద్యాబోధన కూడా చేసింది. పిల్లలతో ఉండడం వల్ల, వారి చిరునవ్వుల నుంచి ఎంతో నేర్చుకోవచ్చని, ఎంతో సంతోషాన్ని పంచుకోవచ్చని అంటుంది మానస. కళలపై ఉన్న అభిరుచి, సాధన ఈ రోజు ఆమెకు కిరీటాన్ని తెచ్చిపెట్టాయి. మానస వారణాసి మరిన్ని విజయశిఖరాలను అధిరోహించాలని తెలుగువారి అభిలాష, అకాంక్ష. -
హీరోయిన్ ఇషా గుప్తా గ్లామర్ ఫోటోలు
-
‘మిస్’ అయింది!
చిత్రం: ‘మిస్ ఇండియా’; తారాగణం: కీర్తీసురేశ్, జగపతిబాబు, నవీన్ చంద్ర, రాజేంద్రప్రసాద్, నరేశ్, నదియా, కమల్ కామరాజు; కెమేరా: సుజిత్ వాసుదేవ్; ఎడిటింగ్: తమ్మిరాజు; సంగీతం: తమన్; నిర్మాత: మహేశ్ కోనేరు; దర్శకత్వం: నరేంద్రనాథ్; రిలీజ్ తేదీ: నవంబర్ 4; ఓ.టి.టి. వేదిక: నెట్ ఫ్లిక్స్. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు ఎప్పుడూ కత్తి మీద సామే. జనానికి నచ్చితే బ్రహ్మరథం పడతారు. లేదంటే, ఇంతే సంగతులు. ఈ సంగతి తెలిసీ, హీరోయిన్ కీర్తీ సురేశ్, దర్శక, నిర్మాతలు చేసిన సాహసం – ‘మిస్ ఇండియా’. ఆడవాళ్ళు ఆఖరికి వ్యాపార రంగంతో సహా దేనిలోనూ మగవాళ్ళకు తీసిపోరనే విషయాన్ని నిరూపించడానికి, అమెరికా నేపథ్యంలో, ఇండియన్ టీ తయారీ కథతో వండిన వెండితెర వంటకం ఇది. కథేమిటంటే... విశాఖ దగ్గరి లంబసింగి గ్రామంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో ముగ్గురు తోబుట్టువుల్లో ఒకరిగా పుట్టిన అమ్మాయి మానసా సంయుక్త (కీర్తీ సురేశ్). ‘‘అమ్మాయి బిజినెస్ చేయడమనేది మాటల్లోనే కాదు... మనసులో నుంచి కూడా తీసేయ’’మనే అన్నయ్య (కమల్ కామరాజు), తల్లితండ్రుల (నరేశ్, నదియా) మధ్య పెరుగుతుంది హీరోయిన్. అయితే, సకల రోగ నివారిణిగా రకరకాల మూలికలతో టీ ఇచ్చే ఆయుర్వేద వైద్యుడైన తాతయ్య విశ్వనాథ శాస్త్రి (రాజేంద్రప్రసాద్) నుంచి ఆ విద్య నేర్చుకుంటుంది. ఎం.బి.ఎ చదివాక, వ్యాపారవేత్తగా మారి, తాత పేరు నిలబెట్టాలనుకుంటుంది. అనుకోకుండా ఆ కుటుంబం అమెరికాకు మారాల్సి వస్తుంది. అక్కడ జరిగే రకరకాల సంఘటనల మధ్య హీరోయిన్ కుటుంబం నుంచి బయటకు వస్తుంది. అక్కడికి సినిమా సగం అవుతుంది. ‘మిస్ ఇండియా’ అనే బ్రాండ్ ఇండియన్ టీ తయారీతో వ్యాపారంలో తన జెండా ఎగరేయాలని హీరోయిన్ ఆలోచన. కానీ, అక్కడి బడా బిజినెస్ మ్యాన్, ప్రసిద్ధ కాఫీ తయారీ సంస్థ యజమాని కైలాశ్ శివకుమార్ (జగపతిబాబు)తో ఆమెకు ప్రతిఘటన ఎదురవుతుంది. ‘‘ఆ కాఫీ కన్నా పదిరెట్లు బాగుండే టీ’’ చేసే హీరోయిన్కూ, ‘‘బిజినెస్ ఈజ్ ఎ వార్’’ అని భావించే ఆ విలన్కూ మధ్య పోరాటంలో హీరోయిన్ ఎలా తుది విజయం సాధించిందనేది చాలా ఓపికగా చూడాల్సిన మిగతా సినిమాటిక్ స్టోరీ. ఎలా చేశారంటే... ‘మహానటి’ తరువాత కీర్తీ సురేశ్ ఒప్పుకున్న ఫస్ట్ డైరెక్ట్ తెలుగు సినిమా ‘మిస్ ఇండియా’. ఈ సినిమాకు ప్రధాన బలం కూడా ఆమే. ఈ కథ, ఇందులోని పాత్ర కోసం ఆమె కాస్తంత అతిగానే సన్నబడ్డారు. ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు శతవిధాల ప్రయత్నించారు. జగపతిబాబు స్టైలిష్గా విలన్ పాత్రలో బాగున్నారు. కానీ, చిత్ర రూపకర్తలు ఈ కీలక పాత్రల స్వరూపాల మీద పెట్టినంత శ్రద్ధ వాటి స్వభావ చిత్రణ, వివిధ పరిస్థితుల్లో వాటి ప్రవర్తన మీద పెట్టినట్టు లేరు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కావడం, చెడ్డవాళ్ళు మంచివాళ్ళు కావడం లాంటివి సినిమాటిక్గా జరిగిపోతుంటాయి. ఎలా తీశారంటే... ఈ సినిమాకు మరో ప్రధాన బలం కొన్నిసార్లు సీన్నూ, పాత్రలనూ కూడా కమ్మేసిన డైలాగు మెరుపులు (రచన – నరేంద్రనాథ్, తరుణ్ కుమార్). ‘‘గొప్పతనం అనేది ఒక లక్షణం. అది ఒకరు గుర్తించడం వల్ల రాదు. ఒకరు గుర్తించకపోవడం వల్ల పోదు’’, ‘‘జీవితంలో మనం చేసే ఏ పనిలోనైనా ఎంత కష్టపడ్డామన్నది ముఖ్యం కాదు. ఎంత ఆనందంగా ఉన్నామన్నది ముఖ్యం’’, ‘‘డబ్బు ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. కానీ, నచ్చినపని అనుభూతిని ఇస్తుంది’’, ‘‘ఇఫ్ యు ఓన్ట్ బిల్డ్ యువర్ డ్రీమ్స్, సమ్వన్ విల్ హైర్ యు టు బిల్డ్ దెయిర్ డ్రీమ్స్’’ లాంటి మరపురాని డైలాగులు చాలానే ఉన్నాయి. తమన్ సంగీతంలో ఈ సినిమాలో పదే పదే వచ్చే థీమ్ మ్యూజిక్, ‘నా చిన్ని లోకమే చేజారిపోయెనే..’ అనే బిట్ సాంగ్ (రచన – నీరజ కోన) కొన్నాళ్ళ పాటు చెవుల్లో రింగుమంటాయి. అమెరికా నేపథ్యం, నిర్మాణ విలువలు బాగున్నా... కథనంలోని లోపాలు ఈ సినిమాకు శాపాలు. అసలు పోరాటం ఆరంభం కాకపోవడంతో, సినిమా ఫస్టాఫ్ నిదానంగా సాగుతుంది. అసలు కథ మొత్తం సెకండాఫ్లో చెప్పాల్సి వచ్చేసరికి తొలి చిత్ర దర్శకుడు తడబడ్డారు. తాత పేరును అందరికీ తెలిసేలా చేస్తాననే హీరోయిన్, అసలు పోరాటంలో ఆ ఊసే ఎత్తకపోవడం లాంటి లోపాలూ ఉన్నాయి. వెరసి, ఏ రంగమైనా పురుషుల గుత్తసొత్తు కాదు, ఆధునిక ప్రపంచంలో అమ్మాయిలు అన్నింటిలోనూ ముందుంటారనే మంచి పాయింట్ను తీసుకున్నా, దాన్ని సరైన స్క్రిప్టుగా తీర్చిదిద్దలేకపోయారు. కథన లోపాలతో, కథ తడబడితే ఎలా ఉంటుందో చూడడానికి ‘మిస్ ఇండియా’ మరో ఉదాహరణ. అతి సినిమాటిక్ లిబర్టీలు, పాత్రల మీద ప్రేక్షకులకు సహానుభూతి కలగనివ్వని ఫేక్ ఎమోషన్లు ఇందులో పుష్కలం. అందుకే, బలమైన పాయింట్, పేరున్న పెర్ఫార్మర్లు ఉన్నా... ‘మిస్ ఇండియా’ వెండితెరపై వెలవెలపోయింది. కొసమెరుపు: టార్గెట్ ‘మిస్’ అయింది! బలాలు: కీర్తీసురేశ్, జగపతిబాబు లాంటి నటులు ∙తళుక్కున మెరిసే మంచి డైలాగులు ∙థీమ్ మ్యూజిక్, ‘నా చిన్నిలోకమే..’ బిట్ సాంగ్ ∙అమెరికా నేపథ్యం, నిర్మాణ విలువలు బలహీనతలు: ∙కథనంలో, క్యారెక్టరైజేషన్లో లోపాలు ∙స్లోగా సాగే ఫస్టాఫ్. కీలకమైన సెకండాఫ్లో తడబాట్లు ∙అతి సినిమాటిక్ లిబర్టీలు, ఫేక్ ఎమోషన్లు ∙అందాల పోటీ గురించి అని పొరబడేలా చేసే టైటిల్ ∙తేలిపోయిన క్లైమాక్స్ – రెంటాల జయదేవ -
మిస్ ఇండియా మూవీ రివ్యూ
టైటిల్ : మిస్ ఇండియా నటీనటులు : కీర్తి సురేశ్, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, నరేశ్, నదియా, నవీన్ చంద్ర, సుమంత్ శైలేంద్ర, పూజిత పొన్నాడ తదితరులు నిర్మాణ సంస్థ: ఈస్ట్కోస్ట్ ప్రొడక్షన్స్ నిర్మాత: మహేష్ కోనేరు దర్శకత్వం: నరేంద్రనాథ్ సంగీతం: ఎస్.ఎస్. థమన్ సినిమాటోగ్రఫీ: డానీ సంచేజ్ లోపేజ్, సుజిత్ వాసుదేవ్ ఎడిటర్ : తమ్మిరాజు విడుదల తేది : నవంబరు 4, 2020 ( నెట్ఫ్లిక్స్) థియేటర్లు మూతబడి 8 నెలలు కావస్తోంది. కరోనా కారణంగా పెద్ద పెద్ద సినిమాలేవీ వెండితెరపై ప్రదర్శించే అవకాశం లేకపోయినప్పటికీ.. మహానటి కీర్తి సురేష్ అభిమానులకు మాత్రం ఓటీటీ.. ఆ వెలితి లేకుండా చేసింది. చాలా వరకు ఆమె చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ దశలో ఉండగానే లాక్డౌన్ మొదలైన సంగతి తెలిసిందే. ఓటీటీ ప్లాట్ఫాంలో సినిమాలు రిలీజ్ చేయడమే తప్ప వేరొక మార్గం లేదని తెలిసినప్పటికీ బడా నిర్మాతలు ఎవరూ ఆ సాహసం చేయలేదు. కానీ కీర్తి అభినయం, నటనా కౌశలంపై ఉన్న నమ్మకంతో ఆమె నటించిన ‘పెంగ్విన్’ను అమెజాన్ ప్రైమ్లో విడుదల చేశారు మూవీ మేకర్స్. దాని ఫలితం ఎలా ఉన్నా ఇప్పుడు కీర్తి సురేష్ ‘‘మిస్ ఇండియా’’ అనే మరో సినిమాతో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మిస్ ఇండియా అంటే ఒక బ్రాండ్ అంటూ ట్రైలర్తో మ్యాజిక్ చేసిన ఈ సినిమా, ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుందో తెలుసుకుందాం. కథ: మధ్య తరగతి కుటుంబంలో పుట్టినప్పటికీ పెద్ద వ్యాపారవేత్త కావాలని కలలు కంటుంది మానస సంయుక్త( కీర్తి సురేశ్). ఎప్పటికైనా తన సొంత బ్రాండ్ను స్థాపించి ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగి తనేంటో ప్రపంచానికి తెలియజేయాలనే పట్టుదలతో ఉంటుంది. ప్రకృతి అందాల నడుమ లంబసింగిలో తన తాతయ్య (రాజేంద్రప్రసాద్) బాల్యంలో రుచి చూపించిన హెర్బల్ టీపై మక్కువ పెంచుకున్న మానస.. దానినే తన బిజినెస్గా మలచుకోవాలనే ఆలోచనతో ఉంటుంది. అకడమిక్స్లో మార్కులు సాధించడం కంటే కూడా ఓ లక్ష్యంతో ముందుకు సాగడంలోనే అసలైన మజా ఉంటుందని తన తండ్రి చెప్పిన మాటలు కూడా చిన్నతనంలోనే ఆమెపై ప్రభావం చూపిస్తాయి. ఈ క్రమంలో అనుకోని కారణాల వల్ల అమెరికాకు చేరుకున్న మానస.. అక్కడ తన ఆలోచనలను ఎలా అమలు చేసింది? ఈ క్రమంలో ఆమెకు ఎదురైన అనుభవాలేమిటి? ఒక మహిళగా, యువ ఎంటర్ప్రెన్యూర్గా సాగిన మానస ప్రయాణంలో కైలాశ్ శివకుమార్( జగపతి బాబు) సృష్టించిన అడ్డుంకులేమిటి? ఆశయం కోసం ప్రేమను కూడా పక్కనపెట్టిన మానస తన లక్ష్యాన్ని చేరుకుందా లేదా? ఇంతకీ మిస్ ఇండియా బ్రాండ్లో ఉన్న గొప్పదనం ఏమిటి? అన్నదే మిగతా కథ. విశ్లేషణ: నువ్వెంత గొప్పవాడివో ఈ ప్రపంచానికి చాటి చెబుతా అంటూ మానస తన తాతయ్యతో చెప్పిన మాటలకు కొనసాగింపుగా సాగిన ఈ కథలో మొదట.. హీరోయిన్ కుటుంబ పరిస్థితులు, వెనువెంటనే వాళ్లు అమెరికాకు చేరుకోవడం వంటి సీన్లు సగటు మధ్య తరగతి కుటుంబంలో జరిగే సంఘటలకు కాస్త భిన్నంగా సాగుతాయి. ఇక సెకండ్ హాఫ్లో అసలైన కథ మొదలవుతుంది. కాఫీ వ్యాపారంలో నంబర్ వన్గా కైలాశ్ శివకుమార్( జగపతి బాబు) కారణంగా మానసకు ఎదురైన తొలి ఓటమితో కథలో వేగం పుంజుకుంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా మన ఇండియన్ ఛాయ్కు తిరుగులేదని ప్రతీ సీన్ గుర్తు చేస్తూ ఉంటుంది. అమ్మాయే కదా వ్యాపారం ఎలా చేస్తుంది, విజయం ఎలా సాధిస్తుంది అనుకునే వారికి ఈ సినిమా మంచి సమాధానం. అంతర్లీనంగా మహిళా సాధికారికతకు పెద్దపీట వేసినా, కథను వినోదాత్మకంగా సాగించడంలోనూ దర్శకుడు నరేంద్రనాథ్ కొంతమేర సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. చిన్నతనం నుంచే కలలు కనడం, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడడం అనే కాన్సెప్ట్ కూడా రొటీన్గా ఉన్నా.. కీర్తి సురేష్ వంటి నటిని ఈ కథకు ఎంపిక చేసుకోవడం ద్వారా హైప్ క్రియేట్ చేయగలిగాడు. అయితే సినిమా ఆసాంతం దానిని కొనసాగించలేకపోయాడు. ఎవరెలా నటించారు? మహానటి సినిమాతో తనకు తిరుగులేదని నిరూపించుకున్న కీర్తి ఈ సినిమాలోనూ తన మార్కు నటనతో మంచి మార్కులే కొట్టేశారు. ఇక తానే టాప్లో ఉండాలనే స్వార్థం, ఓ మహిళ తనకు పోటీరావడాన్ని ఏమాత్రం సహించని విలన్ పాత్రలో ఎప్పటిలాగే స్టైలిష్గా కనిపిస్తూనే కైలాశ్ శివకుమార్గా జగపతిబాబు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రాజేంద్ర ప్రసాద్, నరేశ్, నదియా వంటి సీనియర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక నవీన్ చంద్ర, సుమంత్ శైలేంద్ర, పూజిత పొన్నాడ తమ పరిధి మేర ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. అల్టిమేట్గా ఛాయ్కు, కాఫీకు జరిగే యుద్ధంలో ఛాయ్ గెలుస్తుందని చూపించడంలో సీన్లు కొంచెం లాగ్ అయ్యాయని చెప్పవచ్చు. రొటీన్గా ఉన్న కథను.. ఆసక్తికరంగా మలచడంలో డైరెక్టర్ కాస్త తడబడ్డాడు. థమన్ సంగీతం కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఓవరాల్గా మంచి సందేశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ఆశించినంత మేర వినోదం అందించలేదనే అనిపిస్తుంది. ‘‘మిస్ ఇండియా’’ బ్రాండ్ ఛాయ్ ఘుమఘుమలు అనుకున్న స్థాయిలో సువాసనలు వెదజల్లలేదనే చెప్పవచ్చు! కాకపోతే ఒక్కసారి మాత్రం ‘ఛాయ్’ను కళ్లతోనే టేస్ట్ చేసి ఆనందించవచ్చు!! -
బిజినెస్ అంటే ఆడపిల్లల ఆట కాదు..
సాక్షి, హైదరాబాదు : మహానటి సినిమాతో జాతీయ అవార్డు కొట్టేసిన కీర్తి సురేష్ మరో అదిరిపోయే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కీర్తి నటించిన మిస్ ఇండియా ట్రైలర్ శనివారం రిలీజ్ అయ్యింది. చదువు, చిన్న ఉద్యోగం, కుటుంబం, వీటన్నింటికీ భిన్నంగా ఒక మధ్యతరగతి యువతి చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలనే ఆలోచనతో పెరగడం, ఇండియన్ చాయ్ బిజినెస్ ద్వారా ఉన్నతంగా ఎదిగిన తీరును ఈ ట్రైలర్ లో అద్భుతంగా చూపించారు. మిస్ ఇండియా అంటే ఒక బ్రాండ్ అంటూ మరో లేడీ ఓరియంటెడ్ పాత్రతో ఎప్పటిలాగానే కీర్తి సురేష్ నటన, బిజినెస్ అనేది ఆడపిల్లల ఆట కాదంటున్న జగపతి బాబు విలనిజం, థమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నరేంద్ర నాథ్ దర్శకత్వంలో మహేష్ కోనేరు నిర్మించిన ఈ సినిమాలో నవీన్ చంద్ర,రాజేంద్ర ప్రసాద్, నదియా, కమల్ కామరాజు, నరేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 4న ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. మొదటినుంచీ భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం తాజా ట్రైలర్ తో మరిన్ని అంచనాలను పెంచేస్తోంది. ఈ మధ్యకాలంలో ఓటీటీలో రిలీజ్ అయిన పెంగ్విన్ సినిమాతో ప్రశంసలందుకుంది కీర్తి. అటు వరుస హిట్ లను అందిస్తున్న ఓటీటీ ప్లాట్ ఫాంలో మరో సాలిడ్ హిట్ ఖాయమంటున్నారు. -
అతనితో స్నేహం చేస్తా: నమ్రతా శిరోద్కర్
ముంబై: సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ మిస్ ఇండియా పోటీ చేసిన నాటి ఓ వీడియోను ఆమె సోదరి, నటి శిల్పా శిరోద్కర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 1993లో నమ్రతా మిస్ ఇండియా కిరీటం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పోటీలో నమ్రత తన సమాధానంతో షో జడ్జీలను మెప్పించారని శిల్పా తన పోస్టులో పేర్కొన్నారు. ఈ వీడియోను బుధవారం శిల్పా తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఇందులో మాజీ మిస్ ఇండియా సంగీత బిజ్లానీ కూడా కనిపించారు. ఈ రౌండ్లో ఏ ముగ్గురు తర్వాత రౌండ్కు వెళతారని సంగీతను అడగ్గా.. కచ్చితంగా నమ్రత విజయం సాధిస్తుందన్నారు. అంతేగాక తనకు ఇష్టమైన కంటెస్టెంట్ కూడా నమ్రత అని ఆమె పేర్కొన్నారు. (చదవండి: అతడు నా అభిమాన హీరో) ఆ తర్వాత నమ్రతను.. ‘మీరు ఓ ఉదయం లేచేసరికి కౌంట్ డ్రాక్యులా(కల్పిత పాత్ర) మీ మంచంపై నిద్రిస్తున్నట్టు కనిపిస్తే ఏం చేస్తారు అని అడగ్గా’.. దానికి నమ్రత.. నేను నిజంగా భయపడాతాను కానీ అప్పుడు అతనితో స్నేహం చేస్తాను’ అంటూ సమాధానం ఇచ్చారు. నమ్రతా హిందీలో ‘కచ్చే ధాగే’, ‘పుకార్’, ‘అస్తిత్వ’, ‘అల్బెలా’, ‘దిల్ విల్ ప్యార్ వయార్’ వంటి హిందీ చిత్రాలలో తన నటనకు నమ్రతా శిరోద్కర్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె కన్నడ, తెలుగు, మలయాళ చిత్రాలలో కూడా నటించారు. 2000 సంవత్సరంలో వచ్చిన ‘వంశీ’ సినిమా సమయంలో మహేష్ బాబుతో ప్రేమలో పడ్డారు. అనంతరం వీరిద్దరూ 2005లో కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. (చదవండి: ఆవిడంటే నాకు చాలా ఇష్టం: నమ్రత) View this post on Instagram @namratashirodkar I Love you😘😘😘 #feminamissindia #1993 A post shared by Shilpa Shirodkar (@shilpashirodkar73) on Jul 28, 2020 at 11:38pm PDT -
అప్పుడు నేను ఏం ధరించాను? : ప్రియాంక
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గతాన్ని గుర్తుచేసుకుంటున్నారు. వినోద రంగంలోకి తాను అడుగుపెట్టి 20 ఏళ్లు పూరైన తరుణంలో.. ఇది వేడుక జరుపుకోవాల్సిన సమయని ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. తన ప్రయాణంలోని జ్ఞాపకాలను అభిమానులతో పంచుకోనున్నట్టు తెలిపారు. ఈ జర్నీలో తన పక్షాన నిలవడం, మద్దతు అందించడం ఎంతో విలువైనదని కూడా చెప్పారు. అందులో భాగంగా 18 ఏళ్ల వయసులో మిస్ ఇండియా 2000 విజేతగా నిలిచిన అద్భుతమైన క్షణాల్ని ప్రియాంక గుర్తుచేసుకున్నారు. (పవర్ స్టార్పై అంచనాలు పెంచుతున్న ఆర్జీవీ) ఆ సమయంలో తన డ్రెస్సింగ్, హెయిర్, స్టేజ్పై తాను చెప్పిన సమాధానాలు.. ఇలా పలు అంశాల గురించి వివరించారు. మిస్ ఇండియా పోటీలకు సంబంధించిన చిన్నపాటి వీడియోను కూడా షేర్ చేశారు. ‘నేను మిస్ ఇండియా 2000 పోటీలో నా వీడియోను చూస్తున్నాను. ఇదంతా జరగడాని అదే మూలం. ఒకవేళ మీరు ఇంతకు ముందు ఈ వీడియో చూసి ఉండకపోతే.. ఇది మీకు కొంత ట్రీట్ లాంటింది’ అని పేర్కొన్నారు. ప్రియాంక మిస్ ఇండియా వేదికపై ఏ దుస్తులు ధరించానో గెస్ చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు తనకు చాలా హెయిర్ ఉండేదని అన్నారు. కానీ అది ఎప్పుడూ కోల్పోయానో తెలియదని అన్నారు. మిస్ ఇండియా స్టేజిపై ఎదురైన ప్రశ్నకు చాలా బాగా సమాధానం చెప్పానని.. తన తెలివిపై తానే ప్రశంసలు కురిపించుకున్నారు. తనను విజేతగా ప్రకటించిన క్షణాలను చూసుకుని మురిసిపోయారు. అలాగే తనకు 16 ఏళ్ల వయసులో దిగిన ఫొటోలను కూడా షేర్ చేశారు. ఈ అడుగే.. నన్ను హాలీవుడ్ వరకు తీసుకెళ్లిందని చెప్పారు. (కంగనకు సమన్లు జారీ చేసిన ముంబై పోలీసులు) ‘ఇది చాలా క్రేజీ. నేను గెలుస్తానని ఎప్పుడూ ఊహించలేదు. దీంతో ఇది అయినా వెంటనే తిరిగి వెళ్లి బోర్డు ఎగ్జామ్స్ రాయడానికి.. ట్రైన్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాను. కానీ నన్ను ఆ కిరీటం వరించింది. ఇది చాలా క్రేజీ. 20 ఏళ్లు గడిచిపోయాయి... ఇప్పటివరకు నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు’ అని ప్రియాంక ఆ వీడియోలో పేర్కొన్నారు. View this post on Instagram Alright guys, we’re doing this! I’m watching footage from my Miss India pageant in 2000! This is where it all began... If you’ve never seen these before, you are in for quite a treat. 😅 #20in2020 @missindiaorg A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Jul 23, 2020 at 2:07pm PDT -
మిస్ ఇండియాగా నేను: ఎవరో గుర్తుపట్టారా?!
లాక్డౌన్ కాలంలో సోషల్ మీడియాలో ‘థ్రోబ్యాక్ ఫొటో’ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో సీనియర్ నటి నఫీసా అలీ తన పాత ఫొటోను షేర్ చేశారు. ‘‘1976లో మిస్ ఇండియా టైటిల్ గెలిచిన తర్వాత... జపాన్లోని టోక్యోలో మిస్ ఇంటర్నేషనల్ సెకండ్ రన్నరప్గా నిలిచాను. 19 ఏళ్ల వయస్సులో నేను పొందిన హాస్యపూరిత అనుభవం! నా కాళ్లు బాగున్నాయన్నారు!’’అంటూ ఆనాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. అదే విధంగా స్విమ్మింగ్ పట్ల తనకున్న ఆసక్తిని తెలిపే మరో ఫొటోను కూడా ఇన్స్టాలో షేర్ చేశారు. తన తోబుట్టువులు అనీసా, సలీమా, నియాజ్ కలిసి తరచూ పూరీ(ఒడిశా)కి వెళ్లే వాళ్లమని.. అక్కడ సముద్రంలో ఈతకొడుతూ సేదతీరే వాళ్లమని రాసుకొచ్చారు. బలంగా తాకే అలలు తనను స్విమ్మింగ్ చాంపియన్గా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు.(నొప్పి కూడా ఎక్కువ ఉండదు.. దయచేసి..) ఇక ప్రస్తుతం లాక్డౌన్ అమల్లో ఉన్న తరుణంలో తన పిల్లలు అజిత్, పియా, అర్మానాలను మిస్ అవుతున్నానంటూ ఆమె మరో పోస్టు పెట్టారు. కాగా బెంగాల్లో జన్మించిన నఫీసా ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు. మిస్ ఇండియా టైటిల్ను సొంతం చేసుకున్న ఆమె.. జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ చాంపియన్గా పలు పతకాలు అందుకున్నారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే నఫీసా.. ఆ తర్వాత రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. కాన్సర్ బారిన కోలుకున్న 63 ఏళ్ల నఫీసా సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.(నాన్న మాట ఎందుకు విన్నానో!) -
ఉప్మా తినేసింది.. హీరోయిన్ అయ్యింది..
ఎన్ని కష్టాలు పడితేగానీ సినిమా ఇండస్ట్రీలో అవకాశం రాదు.. అలాంటిది ఆమెకు మాత్రం ఈజీగా వచ్చింది. పుట్టింది వైజాగ్లో.. చదివింది ఢిల్లీ–చెన్నైలో.. బీటెక్ పూర్తయిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసింది హైదరాబాద్లో.. తన పని తాను చేసుకుంటుండగా ఓ షార్ట్ఫిలింలో అవకాశం వచ్చింది. కాదనకుండా నటించాల్సి వచ్చింది. అది కాస్తా సినిమా ఆఫర్లను తెచ్చిపెట్టింది. అందం.. అభినయం తోడవడంతో సినిమాల్లో హీరోయిన్గా బిజీగా మారిపోయింది. నటనా ప్రతిభతో తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తోంది మన తెలుగమ్మాయి పూజిత పొన్నాడ. ఈ సందర్భంగా ఆమె తనఅనుభవాలను ‘సాక్షి’తో పంచుకుంది. పెద్ద సినిమాల్లో అవకాశాలు.. నాన్న బిజినెస్మెన్.. అమ్మ గృహిణి.. పుట్టింది వైజాగ్.. కానీ చదివింది ఢిల్లీ– చెన్నైలో.. చెన్నైలో ఇంజినీరింగ్ చేశాను. తర్వాత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేశా.. ‘ఉప్మా తినేసింది’ అనే షార్ట్ఫిలింతో పరిచయమయ్యా. నా మొదటి సినిమా సుకుమార్ రైటింగ్స్లో వచ్చిన ‘దర్శకుడు’. అనంతరం రామ్చరణ్ రంగస్థలం, బ్రాండ్ బాబు, కల్కిలాంటి చిత్రాల్లో నటించాను. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిస్ ఇండియా’ చిత్రంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాను. తెలుగులో ఆది, తరుణ్ హీరోగా నటిస్తున్న ‘కథ కంచికి.. మనం ఇంటికి’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నాను. మూడు చిత్రాలు విడుదలకు సిద్ధం తమిళంలో మంచి అవకాశాలు వచ్చాయి. చెన్నైలో చదువుకోవడం వల్ల తమిళం బాగా మాట్లాడతా.. ఈ సంవత్సరంలో మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘బాయ్స్’ మూవీలో హీరోగా నటించిన హీరో భరత్తో పాటు హీరోలు విమల్, అరిల చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తున్నాను. మూడు చిత్రాలు మూడు విభిన్న కోణాల్లో రూపుదిద్దుకుంటున్నాయి. తెలుగు ఆహా వెబ్ యాప్లో వెబ్సిరీస్ను హీరో నవదీప్తో కలిసి చేశాను. వెబ్ సిరీస్లలో అవకాశాలు చాలా వస్తున్నాయి. హిందీలో ప్రైవేట్ ఆల్బమ్స్ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. నిజమేంటో.. సినీ పరిశ్రమకు తెలుసు.. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలో చేయాలని ఉంది. అంతేగాకుండా దర్శకుడు సుకుమార్తో మరోసారి కలిసి పనిచేయాలని ఉంది. తెలుగులో కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో మెప్పించేందుకు నా వంతు కృషిచేసి అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాను. నాపై పలు రూమర్స్ కూడా వచ్చాయి.. వాటిని నేను పట్టించుకోను. నిజం ఏంటో సినీ పరిశ్రమకు తెలుసు. పరిశ్రమలో కష్టపడితే తప్పకుండా ఫలితం లభిస్తుంది. సాధించాలనే తపన, నిజాయితీ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. -
‘మిస్ ఇండియా’ విడుదల ఎప్పుడంటే
‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించి స్టార్ హీరోయిన్గా ఎదిగారు కీర్తి సురేష్. ఈ మలయాళీ భామ నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్ ఇండియా’. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. ఏప్రిల్ 17న సినిమా విడుదల చేయాలని నిర్ణయించినట్లు చిత్ర యూనిట్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమా ద్వారా నరేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. (కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా పాట విన్నారా) ‘‘మేము ఎక్కడ ఉంటే అక్కడ ఎప్పుడూ మ్యాజిక్ ఉంటుంది. మా టీం అందరి తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.’’ అంటూ కీర్తి ఆదివారం ట్వీట్ చేశారు. ఇక కీర్తి సురేష్ సినిమా చేయక దాదాపు సంవత్సరం దాటింది. గతేడాది టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు-2లో కనిపించినప్పటికీ.. అందులో అతిథిగానే కనిపించారు. అయితే ‘మిస్ ఇండియా’ సినిమాలో మల్టిపుల్ పాత్రల్లో కీర్తి కనిపించనున్నట్లు సమాచారం. అలాగే.. ఈ సినిమా కోసం కీర్తి బరువు తగ్గారు. కాగా ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, భాను శ్రీ మెహ్రా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. Where there is us, there is always magic! Wish you all a Happy Women’s Day on behalf of team #MissIndia#DreamBig #ChaseYourDream @smkoneru @NARENcloseup @THARUNdirects @MusicThaman @EastCoastPrdns @gopiprasannaa pic.twitter.com/lBg4mj2eAB — Keerthy Suresh (@KeerthyOfficial) March 8, 2020 -
కొత్తగా..కొత్తగా అంటున్న కీర్తి సురేష్
నేను శైలజా చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు కీర్తి సురేష్. మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించి స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఏ సినిమా చేసిన తన సహజమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే కీర్తి ప్రస్తుతం మిస్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. మహిళా ప్రాధాన్యత కలిగిన ఈ మూవీలో నవీన్ చంద్ర, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ద్వారా నరేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. (కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’!) ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా శుక్రవారం మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ‘కొత్తగా కొత్తగా కొత్తగా రంగులే నింగిలో పొంగే సారంగమై’ అంటూ సాగే ఈ పాటను మెలోడి క్వీన్ శ్రేయా ఘోషల్ పాడారు. కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ రాయగా.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను మార్చి 6న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. (తల్లి నటించిన చిత్రం సీక్వెల్లో కీర్తీ సురేశ్) -
బ్యూటిఫుల్ ఇండియా
నల్ల సౌందర్యానికి మళ్లీ కితాబు దక్కింది. శ్వేతవర్ణం వెనక్కు తగ్గింది. ‘మిస్ యూనివర్స్ 2019’ కిరీటం నల్లజాతి వనితకు దక్కిన కొద్ది రోజుల్లోనే ‘మిస్ వరల్డ్ 2019’ కిరీటం కూడా మరో నల్లవజ్రానికే దక్కింది. జమైకాకు చెందిన టోని ఆన్సింగ్ శనివారం లండన్లోని ఎక్సెల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన భారీ వేడుకలో మిస్ వరల్డ్ కిరీటాన్ని శిరస్సుపై ధరించి ఈ ఘనతను సాధించింది. 23 ఏళ్ల టోని ఆన్సింగ్ తండ్రి ఇండియన్ కరేబియన్. తల్లి ఆఫ్రికన్ కరేబియన్. కనుక ఆమె సౌందర్యంలో భారతీయ మూలాలు ఉన్నందుకు భారతీయ సౌందర్యప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో టాప్ 3లో నిలిచి సెకండ్ రన్నరప్గా మిస్ ఇండియా సుమన్ రావు స్థానం పొందడం కూడా భారతీయులకు సంతోషం కలిగిస్తోంది. 111 దేశాలు ఈ కిరీటం కోసం పోటీ పడగా టోని ఆన్సింగ్ మొదటి స్థానంలో, సుమన్ రావు మూడో స్థానంలో నిలిచి భారతీయ సౌందర్య కేతనాన్ని రెపరెపలాడించారు. నవంబర్ 20 నుంచి మొదలైన ఈ పోటీలు దాదాపు నాలుగు వారాలపాటు కొనసాగాయి. 70 దేశాల పార్టిసిపెంట్స్ రకరకాల దశల్లో వెనుకకు మరలగా టాప్ 40లో నిలిచిన అందగత్తెలు కిరీటం కోసం హోరాహోరి తలపడ్డారు. జమైకా బాలిక ‘ఈ విజయం ఆ జమైకా బాలికకు అంకితం’ అని కిరీటం దక్కించుకున్నాక టోని ఆన్సింగ్ వ్యాఖ్యానించింది. ఆ బాలిక ఎవరో కాదు తనే. ఈ విజయం తనూ తనలాంటి నల్లజాతి బాలికలకు సొంతమని టోని పేర్కొంది. ‘స్త్రీల సమానత్వం కోసం నేను చేయదగ్గ పనంతా చేస్తాను’ అని కూడా ఆమె అంది. టోని కుటుంబం ఆమెకు తొమ్మిదేళ్ల వయసు ఉండగా అమెరికాకు వలస వచ్చింది. ఫ్లోరిడా యూనివర్సిటీలోనే టోని విమెన్స్ స్టడీలో గ్రాడ్యుయేషన్ చేసింది. సెకండ్ రన్నరప్ సుమన్రావు రాజస్థాన్ అమ్మాయి రాజస్థాన్కు చెందిన సుమన్ రావు ‘మిస్ వరల్డ్ 2019’కు హాజరయ్యే ముందు ‘మిస్ రాజస్థాన్’, ‘మిస్ ఇండియా ఫెమినా’ టైటిల్స్ గెలుచుకుంది. ప్రస్తుతం ఆమె కుటుంబం నవీ ముంబైలో ఉంటోంది. చార్టర్డ్ అకౌంటెన్సీ పూర్తి చేసే పనిలో ఉన్న సుమన్ రావు ఇప్పటికే మోడలింగ్లో బిజీగా ఉంది. సినిమాలలో అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటోంది. కథక్ నృత్యకారిణి కావడం వల్ల మిస్ వరల్డ్ పోటీలలో ఆనవాయితీగా జరిగే డాన్స్ కాంపిటీషన్లో ‘పద్మావత్’ సినిమాలోని ‘ఝమర్’ పాటకు నృత్యం చేసి ఆహూతులను ఉర్రూతలూగించింది. ‘భారతదేశంలో స్త్రీలకు కట్టుబాట్లు ఎక్కువ. నా తల్లి అటువంటి కట్టుబాట్లు చాలా ఎదుర్కొంది. అయినప్పటికీ నన్ను నా కలల వెంట వెళ్లేలా చేసింది’ అని సుమన్ రావు చెప్పింది. మిస్ వరల్డ్ పోటీలో సుమన్ రావు మూడో స్థానంలో నిలిచిందని తెలియగానే ఆమె స్వగృహంలో వేడుకలు మొదలయిపోయాయి. ‘నా కూతురు అనుకున్నది సాధించింది’ అని తండ్రి రతన్ సింగ్ రావు పొంగిపోతూ చెప్పాడు. మొత్తం మీద ఈ శీతాకాలం భారతీయ సౌందర్యానికి మంచి సంతోషాన్ని తెచ్చిందని చెప్పుకోవాలి. ‘పద్మావత్’ సినిమాలోని పాటకు నృత్యం చేస్తున్న సుమన్ రావు -
మిస్ ఇండియా.. ఓ సర్‘ప్రైజ్’
ఆమె తాజా భారతీయ సౌందర్యం. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో పుట్టి ముంబయిలో పెరిగిన ఈ బ్యూటీ 2019కి గాను మిస్ ఇండియా కిరీటాన్ని స్వంతం చేసుకుంది. ఈ నేపధ్యంలో నగరానికి వచ్చిన సుమన్రావ్...సెంట్రోమాల్లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే... సాక్షి, సిటీబ్యూరో:‘‘ఒక కాలేజీ విద్యార్ధిని (20)గా సుమన్ లండన్లో జరగబోతున్న మిస్ వరల్డ్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించబోతోంది’’అనేది ఇప్పటికీ నాకు ఆనందాశ్చర్యాలు కలిగిస్తూనే ఉంది. తొలుత మిస్ నవీ ముంబయి బ్యూటీ కాంటెస్ట్ సరదాగా, మిస్ రాజస్థాన్ గెలుపు కాస్త సీరియస్గా... మిస్ ఇండియా దగ్గరకు వచ్చేసరికి పూర్తి అంకిత భావంతో ఒక్కో అడుగు వేశాను. వీటన్నింటికి మించి ఇప్పుడు మిస్ వరల్డ్ వైపు ప్రయాణం చేస్తున్నాను. మహిళల స్థాయి పెరగాలి... మహిళల స్థితిగతులు మారాలి అనే సదుద్ధేశ్యంతో ఫ్యాషన్ రంగంలోకి వచ్చా. మహిళలు మరింత స్వతంత్రంగా మారాలని ఆర్ధిక స్వావలంబన సాధించి సమాజంలో సమాన స్థాయి రావాలని నేను పుట్టిన రాజస్థాన్లోని ఉదయ్పూర్లోని దుంగార్పూర్ జిల్లాలో ఒక ట్రైబల్ ప్రాంతాల్లో ప్రగతి అనే ప్రాజెక్ట్ చేస్తున్నాను. దీనికి స్ఫూర్తి ‘బ్యూటీ విత్ పర్పస్ అనే కాన్సెప్ట్’ దీనిని ు మిస్ వరల్డ్ నిర్వాహకులు చైర్ పర్సన్ జులియా మోర్లె ప్రారంభించారు. ప్రతి అందాల రాణి ఒక సముచిత సామాజిక బాధ్యతతో ఉండాలని ఆమె ఉద్దేశ్యం. పుట్టిన ప్రాంతం నుంచే మార్పు తేవాలనుకుంటున్నాను. తర్వాత దేశం, తర్వాత ప్రపంచం... అలా. సినిమా కష్టమే... కానీ ఇష్టమే సినిమా అవకాశాల విషయంలో చాలా మంది అమ్మాయిలు సమస్యలు ఎదుర్కుంటున్నట్టు గమనిస్తున్నాను. అయినప్పటికీ నేనునటించడానికి సిద్ధమే. ఈ భూమ్మీద అతి కష్టమైన పని ఏదైనా ఉందంటే అది గ్లామర్ వరల్డ్లో ముఖ్యంగా సినీ పరిశ్రమలో రాణించడమే. ఎందుకంటే దీనికి చాలాటాలెంట్ కావాలి. ఒకవేళ అలాంటి అవకాశమే గనుక వస్తే దాన్ని అన్ని విధాలుగాశ్రమించి సద్వినియోగం చేసుకుంటాను. లైట్గా తింటే..బ్రైట్గా ఉంటాం... నేను జంక్ ఫుడ్ తినను. వీలైనంత వరకూ హోమ్ ఫుడ్ మాత్రమే తింటాను. ఇటీవలే జిమ్కి వెళుతున్నా. పిలాటెస్ చేస్తున్నా. వీలైనంతగా నీళ్లు తాగడం, మంచి నిద్ర కూడా ఫిట్నెస్కు మేలు చేస్తుంది. మన శరీరానికి నప్పే ఆహారాన్ని పరిశీలించి ఎంచుకోవాలి. అలాగే అమితాహారం వద్దు. మనకు పొట్ట ఫుల్ అనిపించగానే తినడం ఆపాలి. కలలు సాకారం చేసిన కథక్... చిన్నప్పటి నుంచీ నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సంప్రదాయ నృత్యం సాధన చేస్తున్నా. గత నాలుగేళ్లుగా కథక్ నేర్చుకుంటున్నా. దీని వల్ల కామ్నెస్, మరింత క్రమశిక్షణ వస్తాయి. సానుకూల దృక్పధం కూడా అలవడింది. మిస్ ఇండియా పోటీల్లో ఈ తత్వం నాకు చాలా ఉపకరించింది. ప్రపంచస్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి కూడా నా డ్యాన్స్ తోడ్పడుతుందనుకుంటున్నా. మిస్ వరల్డ్ పోటీల్లో డ్యాన్స్ రౌండ్ కూడా ఉంది. హైదరాబాద్మళ్లీ మళ్లీ వస్తా... ఈ సిటీ గురించి చాలా విన్నాను. మరిన్ని సార్లు వచ్చి సిటీ మొత్తం తిరగాలని చూస్తా. పుట్టిన ఉదయ్పూర్, పెరిగిన ముంబయి రెండూ నాకు ఇష్టమే. అలాగే నేను మిస్ ఇండియాగా తిరిగే ప్రతి నగరం నా జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. నవతరం అమ్మాయిలకు చెప్పేది ఒకటే... ఒక లక్ష్యం కోసం మనం మనసా వాచా సిద్ధమైతే, శరీరంలోని ప్రతి నరం, కణం అదే దిశగా ప్రయాణం చేస్తుంది. -
అది నాకు తెలుసు!
సినిమా: మహానటిలో సావిత్రిగా జీవించిన నటి కీర్తీసురేశ్. అలాంటి మరో చిత్రం ఆమె కెరీర్లో వస్తుందని చెప్పలేం. ఆ చిత్రం తమిళంలోనూ నడిగైయార్ తిలగం పేరుతో విడుదలై సక్సెస్ అయ్యింది. అంతకు ముందు కూడా ఇక్కడ స్టార్ హీరోలతో వరుసగా చిత్రాలు చేసింది. అంతే కాదు గత ఏడాది ఈ బ్యూటీ చేసిన 8 చిత్రాలు తెరపైకి వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఒక్క చిత్రం కూడా తెరపైకి రాలేదు. ఇటీవల కీర్తీసురేశ్ ఎక్కడా వార్తల్లో కనిపించడం లేదు. అందుకు కారణం ప్రస్తుతం కోలీవుడ్లో ఒక్క చిత్రం కూడా చేయకపోవడమే. త్వరలో దర్శకుడు కార్తీక్సుబ్బరాజ్ నిర్మించనున్న చిత్రంలో నటించనుంది. కాగా మాతృభాష మలయాళంలో మరక్కయార్ అనే చిత్రం, తెలుగులో మిస్ ఇండియా, హిందీలో మెయ్టన్ ఇలా మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగానే ఉంది. మెయ్టన్ చిత్రం ద్వారా బాలీవుడ్కు ఎంటర్ అవుతోంది. అందుకోసం చాలా కసరత్తులు చేసి స్లిమ్గా తయారైంది. ఇక తెలుగులో నటిస్తున్న మిస్ ఇండియా హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంగా ఉంటుంది. త్వరలో నటించనున్న తమిళ చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రమే. చాలా గ్యాప్ తరువాత నటి కీర్తీసురేశ్ మీడియా ముందుకొచ్చింది. ఇటీవల ఒక మీడియాతో తన భావాలను పంచుకుంది. అవేంటో చూద్దామా.. తెలియని విషయాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి తనకు ఉంటుంది. అలాగని అనవసరంగా మనకు తెలిసినవన్నీ బయటకు చెప్పాలనుకోవడం నాకు నచ్చదు. ఇక పనిలేకుండా ఖాళీగా కూర్చోవడం కూడా నాకు ఇష్టం ఉండదు. సినిమా రంగంలో అవకాశాలు వరించడం గొప్ప విషయమే. అందుకే విరామం లేకుండా ఏదో ఒక పనిచేస్తుండాలి. అలాగని వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకోవడం నాకిష్టం ఉండదు. సినిమా రంగంలోనే పుట్టి పెరిగిన అమ్మాయిని. మా అమ్మానాన్నల ఒడిలో కూర్చుని సినిమాలు చూస్తూ ఎదిగాను. నటన విషయంలోనూ, కథలను ఎంపిక చేసుకునే విషయంలోనూ పరిపక్వత కలిగిన నటిని. అయితే నాకంతా తెలుసన్న గర్వం మాత్రం లేదు. ఎక్కడ ఎలా నడుచుకోవాలో అక్కడ అలా నడుచుకుంటాను. సినిమా విషయంలో తుది నిర్ణయం దర్శకుడిదే. వారి భావాలకనుగుణంగా మేము పయనిస్తే చాలు అంతా బాగానే జరుగుతుంది అని కీర్తీసురేశ్ పేర్కొంది. -
కీర్తీ... మిస్ ఇండియా
హెడ్డింగ్ చదవగానే కీర్తీ సురేశ్ ‘మిస్ ఇండియా’ పోటీల్లో పాల్గొన్నారేమో అనుకుంటున్నారా? అదేం లేదు. అసలు సంగతి ఏంటంటే... కీర్తీ సురేశ్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రానికి ‘మిస్ ఇండియా’ అనే టైటిల్ని ఖరారు చేశారు. నరేంద్ర దర్శకత్వంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మహేశ్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రనిర్మాత మహేశ్ కోనేరు మాట్లాడుతూ– ‘‘మా చిత్రంలో కథానాయిక ఎదుర్కొన్న సంఘటనను ప్రతి అమ్మాయి తన జీవితంలో ఎక్కడో ఒక చోట ఎదుర్కొనే ఉంటుంది. మహిళలు సహా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే చిత్రమిది. ఇటీవల యూరప్లో భారీ షెడ్యూల్ పూర్తి చేశాం. మిగిలిన చిత్రీకరణను త్వరగా పూర్తి చేసి, అక్టోబర్ లేదా నవంబర్లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. కీర్తి నుంచి ప్రేక్షకులు ఎలాంటి సినిమా రావాలని కోరుకుంటారో అలాంటి సినిమానే ‘మిస్ ఇండియా’’ అన్నారు. ‘‘అన్ని భావోద్వేగాలు కలగలిపిన చిత్రమిది. ఈ కథకు కీర్తీ సురేశ్గారు మాత్రమే న్యాయం చేయగలరని నేను, మహేశ్గారు భావించి ఆమెను కలిశాం. కథ చాలా బాగా నచ్చి ఆమె ఒప్పుకున్నారు. కీర్తి సహకారంతో సినిమాను అనుకున్న ప్లానింగ్లో పూర్తి చేస్తున్నాం’’ అన్నారు నరేంద్ర. -
కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’!
అలనాటి మహానటి సావిత్రి పాత్రలో తనదైన నటనతో మెప్పించి అందరితో శభాష్ అనిపించుకోవడమే కాదు.. జాతీయ ఉత్తమనటి అవార్డును కీర్తి సురేష్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రానికి ‘మిస్ ఇండియా’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నరేంద్ర దర్శకత్వంలో మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్ నటిస్తున్న తెలుగు చిత్రమిదే. ఈ చిత్రం యూరప్లో భారీ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా టైటిల్ను అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ను కూడా విడుదల చేశారు. ఈ సందర్బంగా నిర్మాత మహేష్ కోనేరు మాట్లాడుతూ.. ‘‘మహానటి’ చిత్రంతో కీర్తిసురేష్ తెలుగువారి హృదయాల్లో ఎంతటి స్థానం సంపాదించుకుందో తెలిసిందే. అలాగే ఉత్తమనటిగా జాతీయ అవార్డుని దక్కించుకుని మనకు గర్వకారణమయ్యారు. ఆమె జాతీయ అవార్డు గెలుచుకున్న తర్వాత నటిస్తున్న తొలి చిత్రం మా బ్యానర్లోనే కావడం మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ చిత్రానికి ‘మిస్ ఇండియా’ అనే టైటిల్ను ఖరారు చేశాం. దాని లుక్ను విడుదల చేశాం. ఆమె నుంచి ఇప్పుడు ప్రేక్షకులు ఎలాంటి సినిమా రావాలని కోరుకుంటారో అలాంటి సినిమానే ‘మిస్ ఇండియా’. ప్రతి అమ్మాయి తన జీవితంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి సిచ్యువేషన్ను ఎదుర్కొనే ఉంటుంది. మహిళలు సహా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. సినిమా షూటింగ్ మేజర్ పార్ట్ పూర్తయ్యింది. మిగిలిన చిత్రీకరణను కూడా ప్లానింగ్ ప్రకారం పూర్తి చేసి సినిమాను అక్టోబర్ లేదా నవంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ’ని అన్నారు. దర్శకుడు నరేంద్ర మాట్లాడుతూ.. ‘అన్ని ఎమోషన్స్ కలగలిపిన సినిమాయే ‘మిస్ ఇండియా’. కథ రాసుకున్న తర్వాత.. ఈ కథకు కీర్తిసురేష్గారు మాత్రమే న్యాయం చేయగలరని నేను, మా నిర్మాత మహేశ్గారు భావించి ఆమెను కలిసి కథను వినిపించాం. ఆమెకు చాలా బాగా నచ్చి ఒప్పుకున్నారు. ఆమె సహకారంతో సినిమాను అనుకున్న ప్లానింగ్లో పూర్తి చేస్తున్నాం. రీసెంట్గా ఈ సినిమా యూరప్లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక కొన్నిరోజుల షూటింగ్ మాత్రమే జరగాల్సి ఉంది. కుటుంబ కథా ప్రేక్షకులు సహా అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇద’ని అన్నారు. -
మిసెస్ ఇండియా రన్నరప్గా ఆదిలాబాద్ వాసి
ఎదులాపురం(ఆదిలాబాద్): మిసెస్ ఇండియా అందాల పోటీల్లో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వర్షశర్మ రన్నరప్గా నిలిచి తన ప్రతిభను చాటుకుంది. ఈ నెల 2న ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ పనాషే ముంబాయిలో మిసెస్ ఇండియా పోటీ నిర్వహించగా వర్షశర్మ 35 మందితో పోటీపడి మొదటి రన్నరప్గా నిలిచింది. ఇదిలా ఉండగా ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే జోగురామన్న శనివారం వర్షశర్మను శాలువాతో సన్మానించి సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ పట్టణానికి చెందిన వర్షశర్మ అందాల పోటీల్లో మొదటి రన్నరప్గా నిలవడం జిల్లాకే గర్వకారణమన్నారు. భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని జిల్లాకు ఖ్యాతి పెంచాలని ఆకాంక్షించారు. అనంతరం వర్షశర్మ మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకూడదన్నారు. ప్రయత్నిస్తే మహిళలు రాణించలేని రంగమంటూ లేదన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, నాయకులు సాయిని రవి, దేవన్న, ఖయ్యుం తదితరులు పాల్గొన్నారు. -
అందాల పోటీలకు ఆంధ్రా అమ్మాయిలు
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): మిస్ ఇండియా 2019 ఆడిషన్స్లో దక్షిణ ప్రాంత క్రౌనింగ్ వేడుకలకు ఎంపికయ్యారు ముగ్గురు యువతులు. నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం నిర్వహించిన ఎఫ్బీబీ కలర్స్ ఫెమినా మిస్ ఇండియా–2019 ఆడిషన్స్లో ప్రతిభను కనబరిచి టాప్ 3గా ఎంపికయ్యారు సిమ్మాన్ పారిక్, సుష్మిత రాజ్, నిఖిత తన్యా. ఎఫ్బీబీ (ఇండియాస్ ఫ్యాషన్ హబ్) ఆధ్వర్యంలో సెఫోరా, రజనీగంధ పెరల్స్ సహకారంతో నిర్వహించిన ఈ ఆడిషన్స్కు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి సుమారు 100 మందికి పైగా అమ్మాయిలు హాజరు కాగా అందం, సమయస్ఫూర్తి, ఆత్మవిశ్వాసం, నడక, నడవడిక, సేవా కార్యక్రమాలు.. ఇలా విభిన్న అంశాల సమాహారంగా పలు విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో రాణించి ఈ ముగ్గురూ ఎంపికయ్యారు. 24న దక్షిణ ప్రాంత క్రౌనింగ్ వేడుక ఎంపికైన ఈ ముగ్గురు యువతులు ఫిబ్రవరి 24న బెంగుళూరులో నిర్వహించనున్న దక్షిణ ప్రాంత క్రౌనింగ్ వేడుకలకు హాజరవుతారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. వేడుక అనంతరం వారి మెంటార్ దియా మీర్జాను కలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అత్యంత అర్హత గల అభ్యర్థులు జూన్ నెలలో ముంబైలో నిర్వహించే గ్రాండ్ ఫినాలేలో తమతమ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలియజేశారు. గ్రాండ్ ఫినాలేకు వెళ్లడానికి ముందు ఎంపికైన అభ్యర్థులకు నిపుణులు శిక్షణ ఇస్తారని తెలిపారు. నగరంలో నిర్వహించిన ఆడిషన్స్కు 2018 మిస్ఇండియా 2వ రన్నరప్ శ్రేయరావు కామవరపు, కార్రేసర్ శైలేష్ బొలిశెట్టి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. -
ఈ ప్రముఖ నటి ఎవరో గుర్తుపట్టగలరా?
ఆదివారం సందడిగా ఉన్న ముంబై ఎయిర్పోర్టులో ఉన్నట్టుండి ఫ్లాష్బల్బులు అన్ని ఒక్కసారిగా మరింత ప్రకాశవంతంగా వెలిగాయి. అక్కడ ఉన్నట్టుండి ఒక తార కనిపించింది. బ్లూ టాప్, బ్లాక్ జెగ్గింగ్ ధరించిన ఓ అందమైన యువతి అలా నడుచుకుంటూ వస్తోంది. కెమరా కన్ను కూడా ముందు ఆమెను గుర్తుపట్ట లేదు. ఓ నిమిషం తర్వాత అరె..! ఈమె తనా.. రెండేళ్లలో ఎంత మార్పు అంటూ ఆశ్చర్యపోయింది. ఇంతకు ఎవరామె అని ఆలోచిస్తున్నారా. ఆమె 2005లో ‘ఆషిఖ్ బనయా ఆప్నే’తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన నటి. ఇప్పటికైనా గుర్తుకోచ్చారా.. అవును ఆమె తనుశ్రీ దత్తా. రెండేళ్ల తర్వాత అమెరికా నుంచి ముంబై వచ్చారు తనుశ్రీ దత్తా. ఈ సందర్భంగా ఎయిర్పోర్టులో విక్టరి సింబల్ను చూసిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. 2003లో ‘మిస్ ఇండియా’గా నిలిచిన తనుశ్రీ ‘ఆషిఖ్ బనయా ఆప్నే’తో బాలీవుడ్లో ప్రవేశించి, ఆపై వరుసగా ‘చాకోలేట్’, ‘రఖీబ్’, ‘ధోల్’, ‘రిస్క్’, ‘గుడ్ బాయ్, బ్యాడ్ బాయ్’ వంటి హింది చిత్రాలోనే కాక తెలుగులో ‘వీరభద్ర’ సినిమాలో బాలయ్యతో జత కట్టారు. 2010లో వచ్చిన ‘అపార్ట్మెంట్’ తనుశ్రీకి హిందీలో చివరి సినిమా. రెండేళ్ల క్రితం ఈ నటి అమెరికా వెళ్లిపోయారు. అమెరికా నుంచి ముంబై వస్తుండగా విమానంలో తీసిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేస్తూ ‘రెండేళ్ల తర్వాత ముంబై వస్తున్నాను. చాలా సంతోషంగా, మరికాస్తా ఆందోళనగా ఉందంటూ’ పోస్టు చేశారు. తనుశ్రీ ముంబై వచ్చిందని తెలిసిన ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మళ్లీ ఆమెను సినిమాల్లో నటించమని కోరుతున్నారు. ‘మీరు నటించిన ఆషిఖ్ బనయా ఆప్నే సీక్వెల్లో నటిస్తే చూడాలని ఉంటంటూ’ ఓ అభిమాని కోరాడు. తనుశ్రీ దత్తా (పాత చిత్రం) -
మిస్ ఇండియా అనుకృతి
ముంబై: ఈ ఏడాది మిస్ ఇండియాగా తమిళనాడుకు చెందిన కాలేజీ విద్యార్థిని అనుకృతి వాస్(19) ఎంపికైంది. మొదటి రన్నరప్గా హరియాణా యువతి మీనాక్షి చౌదరి(21), రెండో రన్నరప్గా ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రేయారావు(23) నిలిచారు.మంగళవారం రాత్రి ముంబైలో జరిగిన అందాల పోటీలో క్రికెటర్లు కేఎల్ రాహుల్, ఇర్ఫాన్ పఠాన్, నటులు బాబీ డియోల్, మలైకా అరోరా, కునాల్ కపూర్, గతేడాది విజేత మానుషి ఛిల్లార్లతో కూడిన న్యాయ నిర్ణేతల బృందం ఈ మేరకు ఎంపిక చేసింది. అనుకృతికి మానుషి ఛిల్లార్ కిరీటం తొడిగింది. అనువాదకురాలు కావాలనుకుంటున్న అనుకృతి చెన్నైలోని లయోలా కళాశాలలో బీఏ(ఫ్రెంచి) చదువుతోంది. ఆమెకు నాలుగేళ్ల వయసున్నప్పుడు తన తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆమె తల్లి సంరక్షణలోనే పెరిగింది. టాప్–3లో నిలిచిన అనుకృతి, మీనాక్షి, శ్రేయారావులకు సినీతారలు రకుల్ ప్రీత్సింగ్, పూజా హెగ్డే, పూజా చోప్రా, నేహా ధూపియా శిక్షణ ఇచ్చారు. ఇక, ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో జరగబోయే అందాల పోటీ(మిస్ వరల్డ్)లో భారత్కు అనుకృతి ప్రాతినిధ్యం వహించనుంది. -
స్త్రీలోక సంచారం
::: ముంబైలో జరిగిన మిస్ ఇండియా వరల్డ్–2018 పోటీలలో చెన్నైలో బి.ఎ. చదువుతున్న అనుకీర్తీవాస్, హర్యానా యువతి మీనాక్షీ చౌదరి (ఫస్ట్ రన్నర్ అప్), హైదరాబాద్ అమ్మాయి శ్రేయారావ్ కామవరపు (సెకండ్ రన్నర్ అప్) విజేతలుగా నిలిచారు. డిసెంబర్ 8న చైనాలోని సేన్యాలో జరిగే మిస్ వరల్డ్ పోటీలకు అనుకీర్తీవాస్, అంతకన్నా ముందు అక్టోబర్ 25న బర్మాలోని మయన్మార్లో జరిగే ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ పోటీలకు మీనాక్షీ చౌదరి, సెప్టెంబరులో జరిగే అవకాశం ఉన్న ‘మిస్ యునైటెడ్ కాంటినెంట్స్’ పోటీలకు శ్రేయారావ్ కామవరపు భారతదేశం నుంచి తలపడతారు ::: బలప్రయాగంతో రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించలేమని అంటూ జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేశారు. రంజాన్ మాసపు కాల్పుల విరమణ గడుపు ముగిసినప్పటికీ, శాంతిభద్రతల రీత్యా దానిని పొడిగించాలని మెహబూబా కోరడంతో కేంద్ర నిరాకరించడమే కాకుండా, సంకీర్ణ ప్రభుత్వం నుండి బీజేపీ వైదొలగడతో ఆమె రాజీనామా చేయవలసి వచ్చింది ::: ఇజ్రాయెల్పై ఐక్యరాజ్యసమితి పక్షపాత వైఖరి అవలంబిస్తోందని ఆరోపిస్తూ ‘సమితి హక్కుల మండలి’ నుంచి యు.ఎస్. ఏ క్షణమైనా వైదొలగే అకాశాలున్నాయని ఐరాసాలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ప్రకటించారు. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఐరాస ‘తీవ్రమైన, నిర్హేతుకమైన’ దుష్పచారం చేస్తోంది కనుక తాము ‘హక్కుల మండలి’ నుంచి తప్పుకోవడం అనివార్యం కావచ్చుననే సంకేతాలను గత ఏడాది మండలి ప్రసంగంలోనే నిక్కీ హేలీ బహిర్గతం చేశారు ::: ఫ్రాన్స్ పార్లమెంటు సభ్యురాలు (దిగువ సభ), ‘నేషనల్ ర్యాలీ’ పార్టీ అధ్యక్షురాలు మెరీన్ లీపెన్ పార్లమెంటు నిధుల నుంచి అక్రమంగా వాడుకున్న మూడు లక్షలకుపైగా యూరో డాలర్లను తిరిగి పార్లమెంటుకు జమ చేయాలని కోర్టు తీర్పు చెప్పింది. పార్టీలోని ఇద్దరు సహాయకుల కోసం (పార్లమెంటు అసిస్టెంట్లు) లీపెన్ పార్లమెంటు నిధులను దుర్వినియోగం చేసినట్లు రుజువు కావడంతో వెంటనే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది ::: హెచ్.బి.వో. చానల్లో ఎనిమిదేళ్లుగా ప్రసారం అవుతున్న అమెరికన్ ఫాంటసీ డ్రామా టెలివిజన్ సీరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కి నటి ఎమీలియా క్లార్క్ గుడ్బై చెప్పారు. ఎనిమిదో సీజన్తో (ఇప్పటికి ఏడు సీజన్లు అయ్యాయి) 2019లో ముగియనున్న ఈ సిరీస్లో మొదటి నుంచీ నటిస్తున్న ఎమీలియా.. చివరి సీజన్లో కూడా తను ఉన్న సన్నివేశాలను ముందే పూర్తి చేసుకుని, వదల్లేక వదల్లేక వెళ్లిపోతున్నట్లు ఇన్స్టాగ్రామ్లో ఒక ఉద్వేగభరితమైన పోస్టు పెట్టారు ::: అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితాదేవ్ లైంగిక అంశాలపై తన మహిళా కార్యకర్తలకు అవగాహన కల్పించడం కోసం జూన్ 21 నుంచి 23 వరకు గుజరాత్లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇందుకోసం ఎంపికైన 50 మంది మహిళలకు చక్కటి తర్ఫీదు ఇప్పించి భవిష్యత్తులో వివిధ రాజకీయ వేదికలపై మాట్లాడిస్తారు ::: నాలుగు నెలలుగా విధుల్లోకి రాని ఐఏఎస్ ఆఫీసర్లు జీతాలు తీసుకోడానికి ఎలా వస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత విమర్శించడంపై ఐఏఎస్ ఆఫీసర్లు ఆగ్రహంగా ఉన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో ఇటీవల ధర్నా చేస్తున్న కేజ్రీవాల్ను కలిసేందుకు వచ్చినప్పుడు ఆమెను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్న సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ సునీత ఈ విమర్శ చేశారు ::: కారులో వెళుతూ చెత్తను వీధిలో పారేస్తున్న వ్యక్తిని తన కారులోంచి చూసి అనుష్క తిట్టడాన్ని, ఆమె తిడుతున్నప్పుడు వీడియో తీసి దానిని అనుష్క భర్త కోహ్లీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడాన్ని దియా మీర్జా సమర్థించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచడం, ఉంచేలా చేయడం మనలో ప్రతి ఒక్కరి బాధ్యత అని పర్యావరణ పరిరక్షణకు యు.ఎన్. గుడ్విల్ అంబాసిడర్గా ఉన్న మీర్జా అన్నారు ::: -
తమిళ పొన్నుకే మిస్ ఇండియా కిరీటం
చెన్నై, తమిళనాడు : ‘మిస్ ఇండియా పోటీ’...దీనికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ పోటీల్లో ఈ ఏడాది కిరీటం ‘తమిళ పొన్ను’ అనుకృతి వాస్ను వరించింది. నిన్న రాత్రి ముంబై డోమ్లోని ‘ఎన్ఎస్సీఐ ఎస్వీపీ’ స్టేడియంలో జరిగిన ‘మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే’లో 30 మంది ఫైనలిస్ట్లు పాల్గొనగా...తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల అనుకృతి వాస్ ఈ ఏడాది ‘మిస్ ఇండియా’గా ఎన్నికైంది. గతేడాది ‘మిస్ వరల్డ్’గా ఎన్నికైన మానుషి చిల్లర్, అనుకృతికి కిరీటం ధరింపచేసింది. ఈ ప్రతిష్టాత్మక పోటీకి క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, కేఎల్ రాహుల్, ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా, బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా, నటులు బాబీ డియోల్, కునాల్ కపూర్ వంటి ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ‘మాజీ మిస్ వరల్డ్’ స్టెఫానియే డెల్ వాలి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్, గాయకుడు ఆయుష్మాన్ ఖురానా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. కాగా ‘మిస్ ఇండియా - 2018’ పోటీలో మొదటి రన్నరప్గా ‘మిస్ ఇండియా హరియానా’కు చెందిన మీనాక్షి చౌదరీ నిలవగా...రెండో రన్నరప్గా ‘మిస్ ఇండియా’ ఆంధ్రపదేశ్కు చెందిన శ్రేయా రావ్ కామవరపు నిలిచింది. ప్రస్తుతం అనుకృతి వాస్ ‘మిస్ వరల్డ్ - 2018’ కోసం సిద్ధమవుతుంది. -
కోలీవుడ్కు ఆస్ట్రేలియా అందగత్తె
తమిళసినిమా: ఇండియాలోని ఉత్తరాది, దక్షిణాది భాషలకు చెందిన నటీమణులే కాకుండా కెనడా లాంటి ఇతర దేశాలకు చెందిన వారు కూడా కోలీవుడ్పై కన్నేస్తున్నారు. అయితే ఆ ట్రెండ్ ఇటీవల తగ్గిందనుకుంటే కాదు ఇది నిరంతర ప్రక్రియే అన్నట్టుగా మరో దేశానికి చెందిన బ్యూటీ కోలీవుడ్కు ఎంట్రీ ఇస్తోంది. అవును ఆస్ట్రేలియాకు చెందిన అందాలసుందరి ఆషిమా నెర్వాస్ తమిళ చిత్రంలో కథానాయకిగా పరిచయం అవుతోంది. అస్ట్రేలియాలో పుట్టి, పెరిగిన ఈ బ్యూటీ అక్కడ జరిగిన మిస్ ఇండియా, మిస్ ఆస్ట్రేలియా అందాల పోటీల్లో కిరీటాలను గెలుచుకుంది. ఆ తరువాత మోడలింగ్ రంగాన్ని ఎంచుకున్న ఆషియా నెర్వాస్ ఇప్పుడు కోలీవుడ్లో విజయ్ఆంథోనికి జంటగా కొలైక్కారన్ చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రంలో నటుడు అర్జున్ విలన్గా నటిస్తున్నారు. నటి ఆషిమా నెర్వాస్ కుటుంబం సహా చెన్నైకి వచ్చి కొలైక్కారన్చిత్ర షూటింగ్లో పాల్గొంటోందట. నవ దర్శకుడు ఆండ్రూ లూయిస్ ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. ఆయన ఈ చిత్రంలో ఆస్ట్రేలియా బ్యూటీని హీరోయిన్గా ఎంపిక చేయడం గురించి చెబుతూ ఆమెలో తమిళ అమ్మాయి ఛాయలు కనిపించడంతో తమ చిత్రంలో నాయకి పాత్రకు బాగుంటుందని ఎంపిక చేశామని చెప్పారు. కొలైక్కారన్ చిత్రం విడుదలనంతరం ఆషియా నెర్వాస్ కోలీవుడ్లో ఒక రౌండ్ చుట్టేస్తుందని అన్నారు. ఈ బ్యూటీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. అక్కడ ఒక చిత్రం చేస్తోందట. చూడాలి మరి ఈ రెండు భాషల్లో ఎక్కడి అభిమానులను అలరించి పాగా వేస్తుందో! -
మిస్ ఇండియా కిరీటం సాధిస్తా
సాక్షి, తిరుమల: జూన్లో జరిగే ఫైనల్ పోటీల్లో మిస్ ఇండియా సాధించాలని శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నానని, తాను మిస్ ఇండియా కిరీటం సాధిస్తాననే నమ్మకం ఉందని శ్రేయారావు అన్నారు. శుక్రవారం ఆమె సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. మిస్ ఇండియా పోటీలకు 30 రాష్ట్రాల నుంచి 30 మంది ఎంపికయ్యారని, తాను ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నానని తెలిపారు. మే నెల నుంచి నెల రోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు. జూన్ 23వ తేదీన ఫైనల్ పోటీలు ఉంటాయని పేర్కొ న్నారు. తిరుమల దర్శనం ఎంతో ప్రశాంత తను ఇచ్చిందన్నారు. -
మురిపించిన మిస్సమ్మలు
బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): మెరుపు తీగల్లా మురిపించారు.. భువి నుంచి దిగివచ్చిన దేవతల్లా మైమరిపించారు. అందమైన శరీరాకృతి, ఆకర్షణీయమైన వస్త్రధారణతో ర్యాంప్ వాక్ చేసి ఆంధ్ర భామలు హోరెత్తించారు. నగరంలో శుక్రవారం మిస్ ఇండియా ఆడిషన్స్ నిర్వహించారు. ఈ ఆడిషన్స్కు రాష్ట్రం నలుమూలల నుంచి యువతులు తరలి వచ్చారు. వీరిలో శ్రేయరావు, హర్షిత, కిరణ్మయి మిస్ ఇండియా పోటీలకు ఎంపికయ్యారు. వీరికి ఈ నెల 24వ తేదీన బెంగళూరులో స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ఫైనల్స్ను ముంబైలో జూన్ నెలలో నిర్వహించనున్నారు. ఈ ఆడిషన్స్కు యంగ్ హీరో ప్రిన్స్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఆయన ఎంపికైన ముగ్గురు భామలతో ర్యాంప్ వాక్ చేసి కేక పుట్టించారు. మురిపించిన మిస్సమ్మలు హంస నడకలు.. అందాల హొయలు.. కలగలిసి ర్యాంప్ వాక్ చేశాయి.. ఆహూతులను కట్టిపడేశాయి. నగరంలో శుక్రవారం జరిగిన మిస్ ఇండియా ఆడిషన్స్లో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అందాల బామలు తమ అందచందాలు, ప్రతిభా పాటవాలతో ఆకట్టుకున్నారు. వీరిలో శ్రేయారావు, హర్షిత, కిరణ్మయిలు బెంగళూరులో జరిగే తర్వాతి దశ మిస్ ఇండియా పోటీలకు ఎంపికయ్యారు. -
యానిమల్ వాకింగ్
ఇషా గుప్తా అందానికేం తక్కువ లేదు. మిస్ ఇండియా ఇంటర్నేషనల్. ఇషా గుప్తా సినిమాలకేం తక్కువ లేవు. ఈ ఇయర్ ఒకటి రిలీజ్ అయింది. రెండు షూటింగ్లో ఉన్నాయి. ఇషా గుప్తా ఫిట్నెస్కేం తక్కువ లేదు. ముప్పై రెండేళ్ల వయసులోనూ ట్వంటీ ప్లస్లా ఉన్నారు. ఇంకేం కావాలి ఈ అమ్మాయికి. ఇంకా ఇంకా ఫిట్నెస్ కావాలట! మంకీకి ఉండే ఫిట్నెస్, పీతకు ఉండే ఫిట్నెస్, తొండకు, బాతుకు, గుర్రానికీ... ఇలా జంతువులకు ఉండే ఫిట్నెస్ అంతా కావాలట! అందుకే కొన్ని నెలలుగా బికాస్ బారువా అనే ట్రైనర్ దగ్గర ‘యానిమల్ వాకింగ్’ అనే ఎక్సర్సైజ్ చేస్తోంది. ఒక్కోరకం జంతువు ఒక్కోలా నడుస్తుంది. నడుస్తున్నప్పుడు వాటి బాడీ మూవ్మెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీతలా నడిస్తే భుజాలు గట్టి పడతాయి. నడుము సన్నబడుతుంది. తొండలా నడిస్తే ట్రైసెప్స్ పెరుగుతాయి. అలా ఇషా గుప్తా అన్ని జంతువుల్నీ ఫాలో అయి, తన బాడీలోని ఒక్కోపార్ట్నీ ఫిట్గా ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది. తన న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏమిటో ఇంకా బయట పెట్టలేదు ఇషా. చెప్పలేం, ఈ ఏడాది ఆమె ఒక ‘యానిమల్ వాకింగ్’ సెంటర్ని ప్రారంభించినా ఆశ్చర్యం లేదు. హ్యాపీ ఫిట్నెస్ ఇయర్ ఇషా! -
మిస్ ఇండియా– యూఎస్ఏ’గా శ్రీసైని
వాషింగ్టన్: ‘మిస్ ఇండియా యూఎస్ఏ–2017’ కిరీటం వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన శ్రీసైని (21) అనే విద్యార్థినిని వరించింది. ఈ పోటీలో మొదటి రన్నరప్గా కనెక్టికట్కు చెందిన వైద్య విద్యార్థిని ప్రాచీ సింగ్ (22), రెండో రన్నరప్గా నార్త్ కరోలినాకు చెందిన ఫరీనా నిలిచారు. న్యూజెర్సీలోని రాయల్ అల్బర్ట్స్ ప్యాలెస్లో ఆదివారం మూడు విభాగాల్లో నిర్వహించిన మిస్ ఇండియా యూఎస్ఏ పోటీల్లో 24కు పైగా రాష్ట్రాలకు చెందిన దాదాపు 50 మంది పాల్గొన్నారు. కాగా మిసెస్ ఇండియా యూఎస్ఏగా ఫ్లోరిడాకు చెందిన క్యాన్సర్ వైద్య నిపుణురాలు కవితా మల్హోత్రా పట్టాని ఎంపికయ్యారు. మొదటి రన్నరప్ టైటిల్ను ప్రేరణ, రెండో రన్నరప్ టైటిల్ను ఐశ్వర్య సాధించారు. మిస్ టీన్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని న్యూజెర్సీకి చెందిన స్వప్న మన్నం(17) గెలుచుకున్నారు. -
మిస్ ఇండియా–17 మనకే !
► దక్షిణాది అమ్మయిలకే ► అందాల కిరీటం ► మిస్ దివా రోష్మిత జోస్యం యశ్వంతపుర: మిస్ ఇండియా–2017 కిరీటాన్ని తమ దక్షిణాది రాష్ట్రాల అమ్మాయిలే కైవసం చేసుకుంటారని ‘2016 మిస్ దివా’ రోష్మిత హరిమూర్తి ధీమా వ్యక్తం చేళశారు. కలర్స్, ఫెమినామిస్ ఇండియా –2017 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన ఆమె మీడియాతో మాట్లాడారు. మార్చి నెల 5 వ తేదీన సౌత్జో¯ŒS క్రోనంగ్ కార్యక్రమాన్ని బెంగళూరులోని క్రౌన్ ప్లాజాలో నిర్వహిస్తున్నాట్లు తెలిపారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎంపిౖకెన వారిలో ఐదుగురిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ముంబైలో జూన్ లో జరిగే గ్రాండ్ ఫైనల్స్లో వారు పాల్గొంటారని చెప్పారు. ఈ ఏడాది పోటీల్లో మన అమ్మాయిలలో ఒకరు అందాల కిరీటం సొంతం చేసుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
మిస్ ఇండియా ఎవరు?
‘‘ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి మిస్ ఇండియా అవ్వాలనుకుంటుంది. అందుకు తను ఎటువంటి సాహసం చేసింది? చివరికి మిస్ ఇండియా అయిందా? లేదా? అనే కథాంశంతో మా చిత్రం ఉంటుంది’’ అని దర్శక–నిర్మాత తాడి మనోహర్ కుమార్ అన్నారు. రవితేజ, వీరంరెడ్డి, శిరీష, తాడి మనోహర్ ముఖ్యపాత్రల్లో షిరిడీసాయి క్రియేషన్స్ పతాకంపై మనోహర్ నిర్మిస్తున్న చిత్రం ‘మిస్ ఇండియా’ తాడి మనోహర్ మాట్లాడుతూ– ‘‘ఒక మనిషికి డబ్బు అవసరమైతే ఏ పని చేసేందుకైనా సిద్ధపడతాడని మా చిత్రంలో ప్రధానంగా చూపిస్తున్నాం. ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలుంటాయి. తెలుగమ్మాయి శిరీషకు ఈ చిత్రం ద్వారా హీరోయిన్ అవకాశం కల్పించా’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రంలో ఓ మధ్య తరగతి మహిళగా నటిస్తున్నా. చాలా రోజుల తర్వాత ఒక మంచి పాత్ర చేసే అవకాశం నాకు వచ్చింది’’ అని సీనియర్ నటి కవిత అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వై.వి. నవీన్, సంగీతం: సునీల్ కశ్యప్, సమర్పణ: సహస్ర ప్రియ. -
మిస్ హిట్లర్!
సమ్థింగ్ స్పెషల్ ‘మిస్ ఇండియా’, ‘మిస్ అమెరికా’ల పేర్లతో అందాల పోటీలు జరగడం అందరికీ తెలిసిన విషయమే. మరి మధ్యలో ఇదేమిటి? అదేనండీ... మిస్ హిట్లర్! దేశాల పేర్లతోనే కాదు... వ్యక్తి పేరుతో కూడా ‘మిస్’పోటీలు జరుగుతాయని చెప్పడానికి ‘మిస్ హిట్లర్’ పోటీ నిదర్శనం. బ్రిటన్లోని ‘నేషనల్ యాక్షన్’ అనే ఫాసిస్ట్ గ్రూప్ నిర్వహించిన ఈ పోటీలో ఒక స్కాటిష్ యువతి (పేరు గోప్యంగా ఉంచారు) ‘మిస్ హిట్లర్’ కిరీటాన్ని దక్కించుకుంది. ‘మిస్’ కిరీటం అంటే అందచందాలు, ఆరోగ్యం గుర్తుకు వస్తాయి. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. జాత్యహంకార భావాలను ఎక్కువగా ఎవరు ప్రదర్శిస్తారో... వారే ఈ కిరీటానికి అర్హులు. -
తెలంగాణ తొలి మిస్ ఇండియాగా గర్వంగా ఉంది
వరంగల్ చౌరస్తా : తెలంగాణ రాష్ట్రంలో తొలి మిస్ ఇండి యా టైటిల్ను సొంతం చేసుకోవడం గర్వంగా ఉందని మిస్ ఇండియా రష్మీ ఠాకూర్ ఆనందం వ్యక్తం చేశారు. సోమవా రం వరంగల్ స్టేషన్ రోడ్డులోని గ్రాండ్ గాయిత్రి హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముంబై, ఢిల్లీ నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలుగు అమ్మాయిలు అందం గా, కావాల్సిన అన్ని అర్హతలతో సిద్ధంగా ఉన్నారని తెలిపా రు. మోడలింగ్పై అనేక రకాలైన అపోహలున్నాయన్నారు. అన్ని రంగాల్లో ఉన్నట్లుగా మోడలింగ్లో ఉన్నాయని, గ్లామ ర్ ఫీల్డ్ కావడంతో ఎక్కువ చర్చజరుగుతుందన్నారు. అభిరుచులకు తల్లిదండ్రులు పాధాన్యం కల్పిస్తూ, ప్రోత్సహించాల ని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆర్థికంగా సాయంచేస్తే మోడలింగ్పై శిక్షణ ఇస్తానని పేర్కొన్నారు. హైదరాబాద్లో మోడలింగ్ సంస్థలు ఉన్నందున కరీంనగర్ లేదా వరంగల్లో నెల కొల్పుతానన్నారు. సినిమాల్లో హీరోయిన్గా అవకాశలు వస్తున్నాయన్నారు. త్వరలో వివరాలను వెల్లడిస్తానని పేర్కొన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ గృహిణిగా తన ప్రస్తానం మొదలు పెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ మహిళలకు అదర్శంగా నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో కూనూరు శేఖర్ గౌడ్, సదానందం పాల్గొన్నారు. -
వరంగల్ అంటే ఇష్టం
త్వరలో మోడలింగ్ శిక్షణ సంస్థ మిస్ ఇండియా రష్మీ ఠాకూర్ పోచమ్మమైదాన్ : వరంగల్ అంటే చాలా ఇష్టమని, చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టమని, ముంబై-ఢిల్లీ తరహాలో తెలంగాణలో త్వరలో మోడలింగ్పై శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తానని, ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరం అని మిస్ ఇండియా రష్మి ఠాకూర్ అన్నారు. రిష్మీ ఠాకూర్ వరంగల్కు ఆదివారం రాత్రి ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. ఆమె మాటలల్లోనే.. వరంగల్ నాకు నచ్చిన ప్లేస్.. వరంగల్ నాకు చాలా న చ్చిన ప్లేస్. మా సొంత ఊరు కరీంనగర్. ఇప్పుడు హైదారాబాద్లో ఉంటున్నాను. వరంగల్ హిస్టరీని అంతా విక్లిపీడియూలో చదివాను. వరంగల్ను నా సొంత ఊరులా భావిస్తాను. ఖిలావరంగల్, భద్రకాళి అమ్మవారు, వేయిస్థంబాల ఆలయూలను చూశాను. త్వరలో రామప్ప, లక్నవరంను చుస్తాను. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. ఇంటర్ పూర్తి కాగానే ఫ్యాషన్ డిజైనింగ్ను నేర్చుకున్నాను. మొదట్లో ఇంట్లో వాళ్లు వద్దని చెప్పారు. అయినప్పటి కీ వారిని ఒప్పించి అందాల పోటీల్లో పాల్గొన్నాను. హైదారాబాద్లో జరిగిన మిస సౌత్ ఇండియా పోటీల్లో గెలుపొందాను. తరువాత కొచ్చిన్ జరిగిన పోటీలలో పాల్గొన్నాను. అక్కడ మిస్ ఏపీ గా గెలిచాను. అలా ముందుకు సాగుతూ మిస్ ఇండియా టైటిల్ను సైతం గెలుచుకున్నాను. తెలంగాణలో మోడలింగ్పై శిక్షణ సంస్థ మోడలింగ్ను నేర్చుకోవాలని కోరిక ఉన్న వారు అందరూ ముంబై, డిల్లీ తదితర ప్రాంతాలకు వె ళ్తున్నారు. మన తెలంగాణలో సైతం త్వరలో మోడలింగ్ పై శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తాను. దీనికి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే మరింత ముందుకు వెళ్తాను. అందరు బీటెక్, మెడిసిన్ లాంటి వాటిని నేర్చుకుంటూ మోడలింగ్పై శ్రద్ధ పెట్టాలి. బికినీల సంప్రదాయం మనది కాదు అందాల పోటీల్లో చివరకు బికినీలు ధరించాలని ఉంటుంది. దీంతో మన మహిళ సంఘాలు అందాల పోటీలను వ్యతిరేకిస్తున్నారు. బికినీలు ధరించడం సౌత్ ఇండియా సాంప్రదాయం కాదు కాబట్టి పోటీల్లో పాల్గొనే వారు 80శాతం వరకు వెనకడుగు వేస్తున్నారు. తెలంగాణ నుంచి నేను ఒక్కదాన్నే మన దేశంలో జరిగిన అందాల పోటీలలో పాల్గొని ముందుకు సాగుతున్నా. ప్రతి పేరెంట్ అందాల పోటీల్లో వద్దని చెబుతారు. సినిమా ఆఫర్లు వస్తున్నాయి మిస్ ఇండియా పర్ఫెక్ట్ 2014, మిస్ ఇండియా బ్యూటిఫుల్ ఐస్ 2014 అయ్యాక సినిమా ఆఫర్లు వస్తున్నాయి. మంచి బ్యానర్, ఒక మేసేజ్ ఓరింయటెడ్ సినిమాలో నటిస్తాను. హీరోలల్లో కమల్హాసన్, హిరోహియిన్లలో కత్రిన కైఫ్ అంటే చాలా ఇష్టం. వరంగల్ బ్యాక్ గ్రౌండ్లో రూపొందిన చిత్రం రుద్రమాదేవి చిత్రం చూడాలని బాగా ఆతృతతో ఉన్నాను. మన ప్రాంత సినిమాను మనం అందరం ఆదరించి తెలంగాణ సంస్కృతిని కాపాడుదాం. సినిమా మంచి హిట్ కావాలని కోరుకునే వ్యక్తుల్లో నేను మొదటి వ్యక్తిని. గుణశేఖర్కు బెస్ట్ ఆఫ్ లక్. -
గతాన్ని గుర్తు చేసుకోవద్దు
గత జీవితాన్ని గుర్తు చేసుకోవడం శ్రేయస్కరం కాదు అంటున్నారు అందాలరాశి ఐశ్వర్యారాయ్. మిస్ ఇండియా కిరీటాన్ని పొందిన తరువాత ఈ బ్యూటీ నటిగా చిత్ర రంగప్రవేశం చేసి చాలా మంది హీరోలతో కలిసి నటించారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే ఇతర నటీమణుల మాదిరిగానే ఐశ్యర్యారాయ్పైనా వదంతులు చాలానే ప్రచారం అయ్యాయన్నది గుర్తు చేయనక్కర్లేదు. కోలీవుడ్లోనూ ఇరువర్, జీన్స్, కండుకొండేన్ కండుకొండేన్, రావణన్,ఎందిరన్ చిత్రాలలో నటించిన ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ను వివాహం చేసుకున్న తరువాత చిత్రాల్లో నటించడం తగ్గించుకున్నారు. వీరికి నాలుగేళ్ల కూతురుంది. కొంత గ్యాప్ తరువాత మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. ఈ రెండవ ఇన్నింగ్ను తన తొలి చిత్ర దర్శకుడైన మణిరత్నం చిత్రంతో ప్రారంభించాలని ఐష్ భావించారు. ఆయన చిత్రం ఆలస్యం కావడంతో ఇప్పుడు హిందీలో జాస్పా అనే చిత్రంలో నటిస్తున్నారు. సమీప కాలంలో మంబయిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్యారాయ్ ఈ వయసులోనూ చాలా అందంగా కనిపిస్తున్నారు. మీ సౌందర్య రహస్యమేమిటన్న విలేకరి ప్రశ్నకు బదులిస్తూ గత జీవితాన్ని తిరిగి చూడకుండడమే తన సౌందర్య రహస్యం అన్నారు. తన జీవితంలో చాలా విషయాలు జరిగాయని అన్నారు. అవన్నీ మరచి కొత్త జీవితాన్ని గడుపుతున్నాన్నారు.అయినా తానిప్పుడు వివాహితను. తన కుటుంబ గౌరవ మర్యాదలను కాపాడుకోవలసిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. ఎవరయినా ప్రేమలో పడుండవచ్చు. కళాశాలలో చదివేటప్పుడు ప్రేమలో పడడం అన్నది సహజం అన్నారు. అయితే దాని నుంచి బయట పడ్డ తరువాత మళ్లీ దాన్ని గుర్తు చేసుకోవడం మంచిది కాదని ఐశ్వర్యారాయ్ అన్నారు. -
మన మిస్సమ్మలు
యాభై ఏళ్ల వయసున్న నవయవ్వని మిస్ ఇండియా. ప్రపంచానికి భారతీయ సౌందర్యపు వెలుగులు చూపించిన అందాల పోటీ ప్రారంభమై అర్ధ శతాబ్దం పూర్తయింది. అయితే ఇప్పటికీ ఆ పోటీలో గెలుపొందిన తెలుగమ్మాయి ఒక్కరంటే ఒక్కరే. ఆరేళ్లుగా క్రమం తప్పకుండా జరుగుతున్న మిస్ హైదరాబాద్ పుణ్యమా అని.. గతం ఎలా ఉన్నా భవిష్యత్తు ఊరిస్తోంది. త్వరలో జరగనున్న‘కుమారి భారతదేశం’ ఎంపిక కోసం నగరం పెద్ద సంఖ్యలోనే పోటీదారులను అందిస్తోంది. ఈనేపథ్యంలోనే ఈ ‘ మిస్ హైదరాబాద్ టు మిస్ ఇండియా’... ..:: ఎస్.సత్యబాబు యాభై ఏళ్ల మిస్ ఇండియా హిస్టరీలో ఎన్నడూ లేని విధంగా ఈ అందాల రేసులో సిటీ అమ్మాయిలు పోటీపడుతున్నారు. సిటీలో జరిగిన ఆడిషన్స్కు హాజరైన వారిని అటుంచితే.. నేరుగా ముంబై ఇంటర్వ్యూకి సెలక్టయినవారి సంఖ్యా తక్కువేం లేదు. అసలిలా ప్రాంతీయ పోటీలకు హాజరు కానవసరం లేకుండా నేరుగా ముంబై ఇంటర్వ్యూలకు ఎంపిక అవడం అనేది కూడా సిటీ అమ్మాయిలకు కొత్తే. మరి మనం పంపుతున్న మిస్ ఇండియా కంటెస్టెంట్స్ ఎవరు? వీరి గత విజయాలేమిటంటే... ‘సిటీబ్యూటీ’లకు రెడ్ కార్పెట్... నగరం నుంచి నేరుగా ముంబై సెలక్షన్స్కి పిలుపు అందుకున్న వారిలో అత్యధికులు మిస్ హైదరాబాద్ కిరీటధారులే. అందులో మొదట చెప్పుకోవాల్సింది... తొలి మిస్ సిటీ బ్యూటీగా నిలిచిన నిఖితా నారాయణ్. ఈ సుందరి 2009లో తొలిసారి మిస్ హైదరాబాద్ విజేత గా నిలిచింది. ప్రస్తుతం సినీ హీరోయిన్గానూ రాణిస్తోంది. ఈమె డెరైక్ట్గా ముంబై ఆడిషన్స్కు హాజరుకానుంది. అదే క్రమంలో ప్రస్తుతం సినీనటిగా ఉన్న, 2010 రన్నరప్ రీతూవర్మ కూడా ప్రాంతీయ సెలక్షన్స్తో పనిలేకుండా ముంబై ఫ్లయిట్ ఎక్కనుంది. ఇక 2011 టైటిల్ విజేత అనుష్కా షా కూడా అవకాశం దక్కించుకుంది. ఈమె సిటీ అమ్మాయే అయినా ప్రస్తుతం ముంబైలో ఉంటూ ‘లా’ చదువుతోంది. అడపాదడపా మోడలింగ్ చే స్తోంది. తద్వారా మిస్ ఇండియా పోటీల్లో ముంబై ఆడిషన్స్కు డెరైక్ట్గా హాజరయ్యే అవకాశం ఆమెను సులభంగానే వరించింది. ఆమెతో సిటీ టైటిల్ కోసం పోటీపడి రన్నరప్ స్థానంతో సరిపుచ్చుకున్న అషిశా మిశ్రా కూడా ఈ విషయంలో సక్సెస్ అయింది. ఇంకా ఈ జాబితాలో 2012 టైటిల్ విన్నర్ పంచమీరావ్ నాగరాజ్ కూడా ఉంది. ప్రస్తుతం నిఫ్ట్లో డిజైనింగ్ కోర్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఈ అమ్మాయి సరిపడా అర్హతలతో సిటీ ఆడిషన్స్కు హాజరయ్యే అవసరాన్ని సక్సెస్ఫుల్గా తప్పించుకుంది. మేమూ రెడీ... ఈసారి హైదరాబాద్ నుంచి చెప్పుకోదగిన స్థాయిలోనే మిస్ హైదరాబాద్ పోటీలకు సై అన్నారు. 2012లో జరిగిన మిస్ హైదరాబాద్ పోటీల్లో టాప్ 5లో నిలిచిన అలిస్.. సిటీలో ఆదివారం జరిగిన ఆడిషన్స్కు పిలుపందుకున్నారు. ప్రస్తుతం సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో ఫైనలియర్ చదువుతున్న ఈ అమ్మాయి.. అప్లికేషన్స్ వగైరా ఏమీ లేకుండా తన గత విజయాల ఆధారంగానే ఈ చాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం విల్లా మేరీ కాలే జ్ విద్యార్థిని, గతేడాది మిస్ హైదరాబాద్ పోటీల్లో టాప్ 5లో స్థానం దక్కించుకున్న కృతికా సింగ్ రాథోర్ కూడా డెరైక్ట్ ఎంట్రీ సాధించింది. ఇంజనీరింగ్ చదువుతూ, గతేడాది టాప్ 10లో నిలిచిన జయావిశ్వనాథన్ సైతం కుమారి భారతదేశం పోటీల ప్రత్యక్ష ఆడిషన్స్కు సెలక్టయింది. సిటీకి ఇంపార్టెన్స్ పెరిగింది.. మిస్ ఇండియా చరిత్ర చూస్తే తక్కువ సంఖ్యలోనే హైదరాబాద్ అమ్మాయిలు కాంటెస్ట్లో పాల్గొన్నారు. వారిలో నలుగురైదుగురు మాత్రమే టాప్ 10లో నిలిస్తే.. ఒకరిద్దరే టైటిల్స్ గెలుచుకోగలిగారు. కొన్నేళ్లుగా మనం కంటిన్యూగా సిటీ స్థాయిలో కాంటెస్ట్లు నిర్వహిస్తుండడంతో పరిస్థితి మారింది. అందుకు నిదర్శనమే సిటీ అమ్మాయిలకి డెరైక్ట్ ముంబైఆడిషన్స్ ఎంట్రీ అవకాశాలు. అంతేకాకుండా ఈ సారి నగరానికి చెందిన వారిని కూడా మిస్ ఇండియా పోటీల నిర్వహణలో భాగస్వాములుగా కలుపుకోవడం కూడా సిటీ కి పెరిగిన ఇంపార్టెన్స్కు ఉదాహరణ. - శ్రీనివాస్, పేజ్ త్రీ ఈవెంట్స్ (మిస్ హైదరాబాద్ పోటీ నిర్వాహకులు) -
బ్యూటీ ట్రెండ్జ్
గోల్కొండ హోటల్లో శనివారం మిస్ ఇండియా ఎర్త్ తన్వీ వ్యాస్, టాలీవుడ్ భామ రిచాతనై తళుక్కుమన్నారు. హెల్త్, బ్యూటీ, ఫ్యాషన్ కాన్సెప్ట్తో వస్తున్న డైలీ ట్రెండ్జ్ వెబ్సైట్, మేగజైన్ను లాంచింగ్లో వీరు పాల్గొన్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో అప్డేట్ అవుతున్న నయా ట్రెండ్స్ను ఎప్పటికప్పుడూ వెబ్సైట్ ద్వారా అందిస్తామంటున్నారు నిర్వాహకులు. హెల్దీ టిప్స్తో పాటు బ్యూటీ కాన్షియస్నెస్ కల్పిస్తామని చెబుతున్నారు. -
అందం అదిరింది.. అవార్డు వరించింది!
-
ఘనంగా మిసెస్ ఇండియా పోటీలు
-
సాహిల్ సంగాతో దియా మీర్జా నిశ్చితార్థం
ఎంతోకాలంగా వార్తల్లో ఉన్న బాలీవుడ్ నటి దియా మీర్జా నిశ్చితార్థం చేసేసుకుంది. సుదీర్ఘంగా తన వ్యాపార భాగస్వామిగా ఉన్న సాహిల్ సంగాతోనే న్యూయార్క్ నగరంలో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని దియా మీర్జా అధికారికంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. సికింద్రాబాద్ ఆలుగడ్డ బావి ప్రాంతానికి చెందిన దియా మీర్జా.. ఇక్కడి స్టాన్లీ కాలేజిలో చదివింది. మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుని, తర్వాత బాలీవుడ్కు వెళ్లిన ఆమె, కొన్నాళ్ల క్రితం వరకు కునాల్ కపూర్తో కూడా తిరిగినట్లు వదంతులు వచ్చాయి. చివరకు సంగాతోనే ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఫొటోతో సహా ఆమె ట్విట్టర్ ఖాతాలో పెట్టగానే అభిమానులు, స్నేహితుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. వీళ్లిద్దరూ అమెరికాలో జరుగుతున్న ఐఐఎఫ్ఏ అవార్డుల కార్యక్రమం కోసం అక్కడకు వెళ్లారు. అక్కడే నిశ్చితార్థం చేసేసుకున్నారు. దియామీర్జా, సాహిల్ సంగా కలిసి బోర్న్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను 2011లో ఏర్పాటుచేశారు. 'లవ్ బ్రేకప్స్ జిందగీ' అనే సినిమాతో నిర్మాణం మొదలుపెట్టి, విద్యాబాలన్తో 'బాబీ జాసూస్' చిత్రం కూడా నిర్మించారు. -
మిస్ ఇండియా
-
మిస్ వరల్డ్ తర్వాతే బాలీవుడ్..
ముంబై: ‘నాకేం కావాలో నాకు బాగా తెలుసు.. నా తదుపరి టార్గెట్ మిస్ వరల్డ్ టైటిల్ను గెలుచుకోవడం.. ఈ మధ్యలో బాలీవుడ్ నుంచి మంచి అవకాశాలు వచ్చినా వాటిపై దృష్టిపెట్టను..’ అని స్పష్టం చేసింది ఫెమినా మిస్ ఇండియా -2014 టైటిల్ గెలుచుకున్న జైపూర్ అందాలభామ కోయల్ రాణా. ‘నేను ప్రపంచంలోనే అత్యున్నతస్థానంలో ఉన్నానని భావిస్తున్నా. నాకు జీవితంలో ఏం కావాలనేది స్పష్టమైన అవగాహన ఉంది.. మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న తర్వాత ఇప్పుడు నా దృష్టి మొత్తం మిస్ వరల్డ్ టైటిల్ను సొంతం చేసుకోవడంపైనే కేంద్రీకరించా..’ అని ఆమె పేర్కొన్నారు. గత శనివారం జరిగిన 51వ ఎడిషన్ ఫెమినా మిస్ ఇండియా-2014 అందాల పోటీల్లో ఈ జైపూర్ భామ కిరీటాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, తనకు మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ఆదర్శమని రాణా తెలిపింది. ‘మెదడును ఉపయోగించే అందాల సుందరీమణిగా సుస్మితా సేన్ను చెప్పవచ్చు. ఆమె మిస్ ఇండియా, మిస్ యూనివర్స్గా కీర్తి గడించినా అంతకన్న ఎక్కువ సమాజ సేవ చేయడంలో ముందుంది. ఆమె జీవితాన్ని నేను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా..’ అని కోయల్ రాణా వివరించింది. ‘నా జీవితంలో ఇంకా సుదీర్ఘ ప్రయాణం ఉంది.. చాలా విజయాలను సొంతం చేసుకోవడానికి ఇంకా కష్టపడాల్సి ఉంది..’ అని ఆమె అంది. సినిమాల్లో నటించడం గురించి ప్రశ్నిస్తే ‘ప్రస్తుతం నా దృష్టి మొత్తం మిస్ వరల్డ్ టైటిల్ పైనే ఉంది.. భవిష్యత్తులో బాలీవుడ్లో మంచి అవకాశాలు వస్తే నటిస్తానేమో.. ఇప్పుడే ఆ విషయాలు చెప్పేంత వయస్సు, అనుభవం నాకు లేవు..’ అని ముద్దుగా చెప్పింది. జైపూర్లో పుట్టా.. ఢిల్లీలో పెరిగానని, మిస్ ఇండియా కన్నా తనకు చదువు ఎక్కువ ఇష్టమని కోయల్ వివరించింది. మున్ముందు తాను ఇంకా చదువుకుంటానని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో డిగ్రీ చదువుతున్నానని చెప్పింది. -
ముంబైలో ఆకట్టుకున్న ఫ్యాషన్ షో
-
రీటైల్ జ్యూయెలర్స్ ఫ్యాషన్ షో
-
మిస్ ఇండియా పోటీలకు ఎన్టీపీసీ యువతి
గోదావరిఖని(కరీంనగర్) : మణప్పురం గోల్డ్లోన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిస్ ఇండియా పోటీల్లో గోదావరిఖని ఎన్టీపీసీకి చెందిన రశ్మీ పాల్గొని దక్షిణ భారతదేశం నుంచి నాల్గోదశ వరకు చేరింది. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌ న్షిప్లో వ్యాపారం నిర్వహించే భగత్సింగ్, ప్రసన్నలక్ష్మి దంపతుల పెద్దకుమార్తె రశ్మీ హైదరాబాద్లో ఫ్యాషన్ డిజైనింగ్లో డిప్లొమా పూర్తిచేశారు. ప్రస్తుతం కోయంబత్తూర్లో ఈ నెల 18న దక్షిణ భారతస్థాయిలో పోటీలు జరుగుతుండగా.. ఇందులో విజేతలైన మొదటి ముగ్గురిని మిస్ ఇండియా పోటీల్లో నేరుగా పాల్గొనే అవకాశం కల్పిస్తారు. పారిశ్రామిక ప్రాంతానికి చెందిన రశ్మీ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనడం ఈ ప్రాంతానికి గర్వ కారణమని శాప్ మాజీ చైర్మన్ రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్, ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. స్థానిక ప్రెస్క్లబ్లో బుధవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 18న కోయంబత్తూర్లో నిర్వహించనున్న ఫైనల్ సెలెక్షన్స్లో రశ్మీ పాల్గొననుందని తెలిపారు. ఎంపికలో నిర్వహిస్తున్న అంశాలతో పాటు ఓటింగ్ విధానం కూడా పోటీలో ఉందని, ఇందుకోసం www. uniquetimes.org ద్వారా రశ్మీకి ఓటు వేసి ప్రజలు అండగా నిలవాలని కోరారు. విద్యార్థులు, యువకులు మొబైల్, ఇంటర్నెట్ ద్వారా ఓటింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 17 వరకు ఓటింగ్ చేసే అవకాశముందని తెలిపారు. సమావేశంలో నాయకులు కుమార్, రవి, శ్రీని వాస్, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.